breaking news
Alluri Sitarama Raju District Latest News
-
137 కిలోల గంజాయి స్వాధీనం
● విలువ రూ.13 లక్షలు ● ముగ్గురి అరెస్టు, ఇద్దరు పరారీ చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న రూ.13 లక్షల విలువైన 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ వినోద్బాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం ఎస్ఐ వీరబాబు, సిబ్బందితో లోతుగెడ్డ వంతెన వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 137 కిలోల మూడు గంజాయి మూటలను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల నుంచి కారు, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. చింతపల్లికి చెందిన ఇద్దరు, గూడెంకొత్తవీధికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారని, వీరు చింతపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. గంజాయిని నర్సీపట్నం తరలిస్తున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. -
‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’
ముంచంగిపుట్టు: ప్రతి రోజు మెనూ అమలు కావడం లేదు.. పెడుతున్న భోజనాలు సరిగ్గా ఉడకడం లేదు..ఎక్కువగా బంగాళదుంప కూరనే వండుతున్నారు.. మెనూపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవహిస్తున్నారు.. తినలేక కొన్ని సందర్భాల్లో ఆకలితో ఉంటున్నామని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం ఆల్పాహారం సరిగ్గా ఉడకకపోవడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1 విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. మా సమస్యలు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు, గిరిజన సంఘం నేతలకు తెలియజేసి వారి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సక్రమంగా మెనూ అమలు చేయడం లేదని ఆరోపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలే వార్డెన్ కావడంతో గత్యంతరం లేక పెట్టిందే తినాలి, ఉడకకపోయినా, రుచిగా లేకపోయినా సర్ధుకుపోతూ వస్తున్నామని వాపోయారు. ఈ విషయాన్ని ఏటీడీబ్ల్యూవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. పాఠశాలలో 371 విద్యార్థినులకు 21 మరుగుదొడ్లు ఉండగా, వీటిలో 12 పూర్తిగా పాడైపోగా, ఉన్న మరుగుదొడ్లకు సక్రమంగా తలుపులు లేవని చెప్పారు. జ్వరాలు వస్తే పట్టించుకునే వారే లేరని, సమస్యలతో చదువుకుంటున్నామన్నారు. తక్షణమే తమకు మెనూ అమలు చేసి, సమస్యలు తీర్చాలని విద్యార్థినులు వాపోయారు. పర్యవేక్షణ శూన్యం ముంచంగిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1పై డిడి, ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షణ పూర్తి కొరవడిందని, మెనూ అమలు కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాంగి కార్తీక్, శ్రీను, వైస్ ఎంపీపీ సత్యనారాయణ చెప్పారు. ఉడకని అన్నం, కూరలు, సక్రమంగా అమలు కాని మెనూతో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ ఆశ్రమ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం విద్యార్థుల కోసం వండిన ఆల్పాహారం తీని నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఫోన్లో ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో జగత్రాయ్కు తెలియజేశారు. దీంతో హూటహూటిన పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు తీరుపై తెలుసుకున్నారు. మెనూ తీరుపై హెచ్ఎం, వార్డెన్ అయిన లక్ష్మీని మందలించారు. సక్రమంగా మెనూ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, గిరిజన సంఘం నేతలు గాసిరాం దొర, శ్రీను,నారాయణ, గిరిజన మహిళ సంఘం మండల కార్యదర్శి ఈశ్వరి, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మెనూ అమలు కావడం లేదు..భోజనాలు ఉడకడం లేదు ముంచంగిపుట్టు పాఠశాల ఆవరణలో గిరిజన విద్యార్థుల ఆందోళన ఉదయం అల్పాహారం బాగోలేక నిరసనకు దిగిన వైనం కానరాని మౌలిక సదుపాయాలు.. తప్పని అవస్థలు -
ఉత్పత్తి మెండుగా..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాలకు మేలు చేశాయి. నిండుకుండను తలపిస్తున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. గత రెండేళ్లలో నాలుగు జలవిద్యుత్కేంద్రాలు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పాదన సాధించాయి.ప్రాజెక్టులు నిండుగా..లక్ష్యానికి చేరువైన నాలుగు జలవిద్యుత్ కేంద్రాలుఆంధ్రా–ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంమోతుగూడెం: లోయర్ సీలేరు ప్రాజెక్ట్ పరిధిలోని జలాశయాల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. దీంతో జలవిద్యుత్తోపాటు గోదావరి డెల్టా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఏపీ జెన్కో అధికారవర్గాలు పేర్కొన్నాయి. ● ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్లైన జోలాపుట్టు, బలిమెల జలాశయాల్లో ఆంధ్రా వాటాగా 64 టీఎంసీలు ఉన్నట్టు ఇరు రాష్ట్రాల అధికారులు లెక్క తేల్చారు. మొత్తంమీద డొంకరాయి, గుంటవాడ జలాశయాలతో కలుపుకుని 78 టీఎంసీలు ఉన్నట్టుగా జెన్కో అధికారులు నిర్థారించారు. రబీలో గతేడాది గోదావరి డెల్టాకు 60 టీఎంసీలు విడుదల చేశారు. ● కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి, పోర్బే జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిలో 120 టీఎంసీలు నిల్వ ఉండగా రోజుకు 15,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటికే జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. బలిమెల జలాశయం మరో పది అడుగులకు చేరువలో ఉంది. మరో ఐదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. డొంకరాయి ప్రాజెక్ట్కు వరద తాకిడి నెలకొంది. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరద నీటిని జలాశయం గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి వివరాలు ● మాచ్ఖండ్: 23–24 లక్ష్యం 626 మిలియన్ యూనిట్లు కాగా 535.576 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి. 24–25 లక్ష్యం 630 మిలియన్ యూనిట్లు కాగా 554.698 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. ● అప్పర్ సీలేరు 23–24 లక్ష్యం 470 మిలియన్ యూనిట్లు కాగా 480 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 477 మిలియన్ యూనిట్లకు 495.7 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. ● డొంకరాయి 23–24 లక్ష్యం 99 మిలియన్ యూనిట్లు కాగా 105.732 మిలియన్ యూనిట్లు సాధించింది. 24–25లో 95 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 105.224 మిలియన్ యూనిట్లు సాధించింది. ● పొల్లూరు 23–24 లక్ష్యం 1084 మిలియన్ యూనిట్లు కాగా 1090 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. 24–25 లక్ష్యం 1095 మిలియన్ యూనిట్లు కాగా 1120.65 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. లోయర్ సీలేరు ప్రాజెక్ట్ జలాశయాలకు వరద తాకిడి పూర్తిస్థాయికి నీటిమట్టాలు 15,685 క్యూసెక్కుల ఇన్ఫ్లో జలవిద్యుత్ ఉత్పాదనకు, గోదావరి డెల్టాకు సమృద్ధిగా నిల్వలు ఏపీ జెన్కో అధికారవర్గాల వెల్లడి ఉత్పాదనకు ఢోకా లేదు జోలాపుట్టు, బలిమెల రిజర్వాయర్లతోపాటు డొంకరాయి, గుంటవాడ జలాశయాలు కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువలో ఉన్నాయి. దీనివల్ల ఈ ఏడాది జలవిద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదు. గోదావరి డెల్టాకు పుష్కలంగా నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. – సీహెచ్ రాజారావు, చీఫ్ ఇంజనీరు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్పోర్బే పూర్తిస్థాయి : 930 అడుగులు ప్రస్తుత నీటిమట్టం: 921 అడుగులు నీటి నిల్వలు: 0.1410 టీఎంసీలు ఇన్ఫ్లో: 3750 క్యూసెక్కులు -
మాజీ ఎమ్మెల్యే దేముడుకు ఘన నివాళి
● వెలగలపాలెంలోని స్మ ృతి వనం వద్ద వర్థంతి ● నిర్వహించిన కుటుంబ సభ్యులు ● ప్రజలకు ఎనలేని సేవలు: అరకు మాజీ ఎంపీ మాధవి కొయ్యూరు: మాజీ ఎమ్మెల్యే దివంగత గొడ్డేటి దేముడు ప్రజలకు ఎనలేని సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అరకు మాజీ ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలోని ఆయన స్మ ృతి వనం వద్ద పదో వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. అనేక భూ పోరాటాలను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు. అల్లూరి,అనకాపల్లి జిల్లా సీపీఐ కార్యర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దేముడు విగ్రహానికి ఎంపీతోపాటు ఆమె సోదరుడు మహేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇరువాడ దేముడు, రావణాపల్లి ఎంపీటీసీ ఐ.సత్యవేణి, గురుబాబు, మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు, నీలాపు సూరిబాబు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన
అరకులోయటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో తీవ్రనష్టమని జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి అన్నారు. మండలంలోని మారుమూల ఇరగాయి పంచాయతీ ఉరుములు గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా జెడ్పీటీసీ సభ్యురాలు రోషిణి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య కళాశాలలు నిర్మాణం చేడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటుపరం చేయడంతో పేదలకు వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందన్నారు. రాష్ట్రంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని జెడ్పీటీసీ రోషిణి డిమాండ్ చేశారు. ఇరగాయి సర్పంచ్ మాదల బుటికి, ఎంపీటీసీ జన్ని చెల్లమ్మ, ఉమ్మడి విశాఖజిల్లా ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, సీనియర్ నాయకులు నాగేష్, బొంజుబాబు, గిరిజనులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామన్నారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు, ఎంపీటీసీలు కూడా పాపారావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కె హరి, గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు మఠం శకంర్, లీలారాణీ, హెచ్.బి.రామునాయుడు, మాజీ ఎంపీటీసీ మహాదేవ్, నాయకులు సింహాచలం, మోహన్రావు, నరసింగరావు, గురునాయుడు, సుమన్, నామమూర్తి, ప్రసాద్, గంగాధర్, సుందర్రావు పాల్గొన్నారు. జి.మాడుగుల: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్భ పంచాయతీ రోలంగిపుట్టు,చేపల్లి,పొర్లు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు చిట్టిబాబు, మసాడి గంగరాజు, పెదలువ్వాసింగి పంచాయతీ వంచేబు గ్రామంలో మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో ఆదివారం కోటి సంతకాలు కార్యక్రమం జరిగింది. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల వివరాలతో కూడిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుందని, ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వారు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలోనే నడవాలని, ప్రజానిధులతో నిర్మించిన భవనాల ఆస్పత్రుల పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. నాయకుడు చంటిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. గూడెంకొత్తవీఽధి: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతరేకంగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రింతాడ పంచాయతీ అసరాడలో ఆదివారం చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు పలాసి చిన్నారావు,దేశగిరి వీరన్నపడాల్, చినతల్లి, మురళీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన మత్స్యకారుడు క్షేమం
● ఆదుకున్న ఉప్పాడ జాలర్లు మహారాణిపేట: పెదజాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామోలు ఎల్లాజీ ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఎల్లాజీ క్షేమంగా ఉన్నట్టు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఎల్లాజీ చేపల వేటకు వెళ్లగా.. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే 25న కాకినాడ జిల్లా, తొండంగి మండలం, హూకుంపేట సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఎల్లాజీ ఆచూకీ లభించినట్టు జాయింట్ డైరెక్టర్ వివరించారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఎల్లాజీని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు గమనించి, ఒడ్డుకు తీసుకువచ్చి ఆదరించారు. పెదజాలరిపేటకు చెందిన పెద్దలు తెడ్డు రాజు, పర్సన్న ఆదివారం ఉప్పాడ వెళ్లి.. ఎల్లాజీని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎల్లాజీ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. -
ధారకొండను మండల కేంద్రంగా ప్రకటించాలి
సీలేరు: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంటూ విద్య, వైద్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నేటికీ అందకుండా అంధకారంలో బతుకుతున్న మా గ్రామాలను ధారకొండ మండల కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి పథంలో గిరిజన గ్రామాలను నడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఐదు పంచాయతీ గిరిజన ప్రజలు కోరుతున్నారు. ఆదివారం దారకొండ వారపు సంతలో వేలాది మంది గిరిజనులు వివిధ పార్టీ నాయకులతో కలిసి దారకొండ మండల కేంద్రంగా ప్రభుత్వం తక్షణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. దాదాపుగా 50 ఏళ్లుగా మండల కేంద్రానికి దూరంగా ఉంటూ మా గ్రామాలు అభివృద్ధి చెందటం లేదని ఏ చిన్న అవసరమైన మూడు గంటల ఘాట్ రోడ్లు నరక ప్రయాణం చేసి మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని తీరా వెళ్లాక పనులు జరగక వెనుతిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. మా ఐదు పంచాయతీలు కొండ ప్రాంతంలో ఉండడంతో ప్రజాప్రతినిధులు గాని జిల్లా. మండల అధికారులు రాకపోవడంతో అభివృద్ధి చెందడం లేదని మా దారకొండ పంచాయతీలో మండల కేంద్రం ప్రకటిస్తే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దయచేసి ఈ ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నాయకులు విష్ణుమూర్తి. జగన్, విశ్వేరరావు, శ్రీనివాస్. ఎంపీటీసీ రామన్న తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ ● పాడేరు చేరుకున్న బస్సు యాత్ర ● స్థానిక వైద్య కళాశాల వద్ద ఆందోళన పాడేరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేంది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ఆదివారం పాడేరు చేరుకుంది. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించింది. ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టమన్నారు. రాష్ట్రంలో గిరిజన, పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. ఆశ్రమాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు రూ.6400 కోట్లు బకాయి విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతంలోని ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా దగా చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని నీరుగార్చేందుకు తమ స్వలాభం కోసం ప్రైవేటుపరం చేయడం మానుకోవాలన్నారు. ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఫణీంద్ర, కుళస్వామి, నాగభూషణం, మస్తాన్, కృష్ణ, తనీష్, జగదీష్, శ్రీనివాసరెడ్డి, అబ్బులు పాల్గొన్నారు. -
చింతూరులోరికార్డు స్థాయి ప్రసవాలు
● ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ కోటిరెడ్డి చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈనెలలో రికార్డు స్థాయిలో వంద ప్రసవాలు జరిగినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో గైనకాలజిస్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 64, ఫిబ్రవరిలో 48, మార్చిలో 50, ఏప్రిల్లో 68, మేలో 48, జూన్లో 54, జూలైలో 50, ఆగస్టులో 92, సెప్టెంబర్లో 95, అక్టోబర్లో 100 కాన్పులు నిర్వహించినట్లు కోటిరెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగావున్న వైద్యనిపుణుల పోస్టులు భర్తీచేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో కాన్పులు నిర్వహించిన ఆస్పత్రి వైద్యులను ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య అభినందించారు. -
గిరిజన గంగపుత్రుల జల దీక్ష
● కామునిగెడ్డ మినీ రిజర్వాయర్ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించాలని వినతిరావికమతం: కామునిగెడ్డ మినీ రిజర్వాయర్ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి కల్పించాలని కోరుతూ గిరిజన మత్స్యకారులు ఆదివారం జలదీక్ష చేట్టారు. ధర్మవరం పంచాయతీలో కామునిగెడ్డ మినీ రిజర్వాయర్ పరిధిలో పాత ధర్మవరం, ధర్మవరం గ్రామాల్లో గధప (పీవీటీజీ) తెగకు చెందిన గిరిజనులు మినీ జలాశయంలో చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరు 2022లో శ్రీపోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘంగా ఏర్పడ్డారు. సంఘానికి మత్స్యశాఖ అధికారులు మొదటిలో చేపలు పంపిణీ చేసేవారని, తరువాత నిలిపివేశారని, దీని వలన ఉపాధి కోల్పోయి తమ జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గోరా చిరంజీవి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ ఇరిగేషన్ ట్యాంక్ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా నమోదు చేయాలని ఆగస్టు 11వ తేదీన జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామని, దానిపై ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి 315.62 ఎకరాల విస్తీర్ణం ఉందని రిపోర్టు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్వోసీ ఇచ్చినా నర్సీపట్నం మత్స్యకార శాఖ ఏడీ అధికారులు స్పందించలేదని, తక్షణమే అధికారులు స్పందించి మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తిస్తే మత్స్యకార సంఘానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందుతాయని, దీనిపై నర్సీపట్నం ఫిషరీస్ ఏడీ, సంబంధిత అధికారులు తక్షణమే మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా గుర్తించి న్యాయం చేయాలని కోరారు. -
గిరి రైతుల్లో గుబులు
● వెంటాడుతున్న తుపాను భయం ● దిగుబడి దశలో వరి, రాగుల పంటల ● ఆందోళనలో రైతాంగం సాక్షి,పాడేరు: బంగళాఖాతంలో ఏర్పడునున్న మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికి గిరిజన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్లో గిరిజన రైతులు 56వేల హెక్టార్లలో వరి, 17వేల హెక్టార్లలో రాగులు, చిరుధాన్యాల పంటలను సాగు చేశారు. ఈ పంటలన్నీ ప్రస్తుతం దిగుబడి దశలో కళకళాడుతున్నాయి. నవంబర్ నెల నుంచి పంట కోతలకు గిరిజన రైతులు సిద్దమవుతున్న తరుణంలో అల్పపీడన భయం నెలకొంది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ ప్రకటనలతో గిరిజన రైతుల్లో కలవరం ఏర్పడింది. లోతట్టు వ్యవసాయ భూముల్లో పంటలపై రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. గతంలోను అనేక తుపానులలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితిని గుర్తిచేసుకుంటున్న రైతులు భారీ వర్షాలు కురవకూడదని భావిస్తున్నాన్నారు. తిండి గింజల కోసమే వరి, రాగులు, ఇతర చిరుధాన్యాల పంటలను గిరిజన రైతులు సాగు చేస్తుంటారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులలో లోతట్టు పంట భూముల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువాలు తవ్వుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.భారీ వర్షాలు కురిస్తే నష్టమే భారీ వర్షాలు కురిస్తే పంటలకు నష్టం ఏర్పడుతుంది.లోతట్టు భూముల్లో వరిపంటను సాగు చేస్తున్నాను.దిగుబడి దశలో పంట ఉంది.ఈ పరిస్థితులలో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో భయంగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురవుతాయి. రాగుల పంట నేలవాలే ప్రమాదం ఉంది. – వంతాల మోహనరావు, గిరిజన రైతు, రంగిలిసింగి పంచాయతి, డుంబ్రిగుడ మండలం -
జి.మాడుగుల యూబీఐలో మంటలు
జి.మాడుగుల: స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. బ్యాంక్ సెలవు కావడంతో సెక్యూరిటీ గార్డు ఒక్కరే కాపలాగా ఉన్నారు. బ్యాంక్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అతను వెంటనే బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బందికి ఫోన్ద్వారా సమాచారం అందించారు. బ్యాంక్ తాళాలు తీయడంతో స్థానిక యువకుడు కొర్రా క్రాంతి కుమార్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్నుంచి సరఫరా నిలిపివేశాడు. బ్యాంక్లో ఉన్న అగ్నిమాపక సిలిండర్లతో మంటలను అదుపుచేశాడు. అప్పటికే బ్యాంక్ క్యాబిన్లో కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్, ఏసీ, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. బ్యాంక్ ఇన్చార్జి మేనేజర్ జీవన్, ఎస్ఐ షణ్ముఖరావు సంఘటన స్థలానికి వచ్చి అగ్నిప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బ్యాంక్లో పరికరాలు దగ్ధం -
చికిత్స పొందుతూ శిశువు మృతి
రంపచోడవరం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రస వ సమయంలో గర్భిణి మృతి చెందిన ఘటన లో శిశువుకు కూ డా చనిపోయింది. నరసాపురం గ్రామానికి చెంది కోట బాపనమ్మ ప్రసవం కోసం 12 రోజులు ముందే స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. ఆమెకు 19వ తేదీన ప్రసవం చేయడంతో శిశువుకు జన్మనిచ్చింది. తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. అయితే ప్రసవం జరిగిన రోజే శిశువును మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. శిశువు మూడు రోజులు చికిత్స తరువాత గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నేడు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిషేధం
● పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ పాడేరు : మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం పాడేరు డివిజన్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, ఇతరాత్ర ఆందోళన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేదని పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే పోలీసులనుంచి ముందస్తు అనుమతి పొంది 100 మందికి మించకుండా నిర్వహించాలన్నారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువ మందితో ఆందోళన కార్యక్రమాలు చేసి శాంతిభద్రతలు, ప్రజా భద్రతలకు, ప్రజా రవాణాకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సిగనాపల్లి క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు
● ముగ్గురి అరెస్టు ● పెదవలస రేంజ్ అధికారి ప్రశాంతి కుమారి వెల్లడి చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పెదవలస ఇన్చార్జ్ రేంజ్ అధికారి కె.ప్రశాంతికుమారి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాల నిరోధానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సిబ్బందితో బేస్ క్యాంపులు,స్ట్రైకింగ్ ఫోర్సుతో గస్తీ చేపట్టామన్నారు. క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉందన్నారు. తాజాగా ఈ క్వారీలో తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని మూసివేశామన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తపాలెం గ్రామానికి చెందిన గెమ్మిలి చిట్టిబాబు, ధారకొండకు చెందిన భీమవరపు గణేష్, బూదరాళ్లకు చెందిన ఉప్పల బాలాజీరావు తవ్వకాలు జరుపుతుండగా తమ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. సెక్షన్ అదికారి నూకరాజు, ఎఫ్బీవో గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
నిలిపివేశారు. బంద్ అనంతరం పునరుద్ధరిస్తామని వారు పేర్కొన్నారు. చింతూరు: సబ్ డివిజన్ పోలీసులు గురువారం ఎస్ఐ పేరూరి రమేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల పూర్తి వివరాలు సేకరించి పంపించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ముందస్తుగా చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం జంక్షన్ మీదుగా, భద్రాచలం వైపు నుంచి చింతూరు వైపు వచ్చే వాహనాలను నెల్లిపాక మీదుగా దారి మళ్లించారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన యంత్రాలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ రామకృష్ణ వాహన తనిఖీలు చేపట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, డుడుమ మార్గాల్లో వచ్చే వాహనదారుల బ్యాగులు,లాగేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. వాహనాలకు రికార్డులు, లైసెన్సులు లేకపోవడంతో ఫైన్ విధించారు.సీఆర్పీఎఫ్ బలగాలు మండల కేంద్రంలో ప్రత్యేక గస్తీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, మారుమూల పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాత్రి పూట పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తామని, ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన కోరారు. జి.మాడుగుల: పాడేరు–జి.మాడుగుల రోడ్డు మార్గంలో పోలీస్స్టేషన్కు సమీపంలో వాహనాలను గురువారం సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలి పెట్టారు. రికార్డుల లేని వాహనాలుపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే తక్షణమే పోలీసులు సమాచారం అందించాలని వారు కోరారు. కొయ్యూరు:స్టేషన్ సమీపంలో సీఐ శ్రీనివాస్ ఆద్వర్యంలో కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్ వర్మ, శంకర రావు వాహన తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు. అడ్డతీగల: మండలంలోని వేటమామిడి జంక్షన్లో సీఐ బి.నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేశారు.ప్రధాన కూడళ్లలో నిఘా ఏర్పాటు చేశారు. మోతుగూడెం: స్థానిక ఎస్ఐ సాధిక్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది చెక్పోస్టు వద్ద వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. -
ప్రజా సమస్యలపై శాంతియుత ఉద్యమాలు
పాడేరు : వైఎస్సార్సీపీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు చేస్తోందని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజాధనంతో నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉన్నత వైద్యానికి, వైద్య విద్యకు దూరంగా ఉన్న ఆదివాసీలకు ఓ వరంలా గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రూ.500కోట్లతో వైద్య కళాశాల తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో పది చోట్ల వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గత 16 నెలలుగా తమ పార్టీ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతోందన్నారు. వీటిని రాష్ట్ర గవర్నర్కు అందజేసి ప్రజల ఆకాంక్షను వివరిస్తామని చెప్పారు. దేవాలయాలాంటి వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఎన్ని ఉద్యమాలు చేపట్టి అయినా అడ్డుకుని తీరుతామన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు కిముడు శివరత్నం, శెట్టి రోషిణి, వైఎస్సార్సీపీ మహిళ విభాగం జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, పాంగి పరశురాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి రాంబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా సుబ్రమణ్యం, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, ఎస్టీ సెల్ జిల్లా మాజీ అద్యక్షుడు కమ్మిడి అశోక్, యువజన విభాగం నాయకులు రేగం చాణక్య, సర్పంచ్లు వంతాల రాంబాబు, వనుగు బసవన్నదొర, గొల్లోరి నీలకంఠం, ఎంపీటీసీ దూసూరి సన్యాసిరావు, మాజీ సర్పంచ్లు పాంగి నాగరాజు, మినుముల కన్నాపాత్రుడు, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గల్లెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై 28న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రజల తరఫున నిలబడేది వైఎస్సార్సీపీ మాత్రమే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ -
యువకుడి ఆత్మహత్య
● తల్లి మృతితో మనస్తాపానికి గురై ఉరివేసుకున్న వైనం ● ధారకొండలో విషాదఛాయలు సీలేరు: గూడెంకొత్తవీధి మండలం ధారకొండ గ్రామానికి చెందిన కాలం కున్నత్ సునీల్ కుమారుడు నిఖిల్ (17) విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ తన భార్య, కుమారుడితో కలిసి కంచరపాలెంలో నివాసముంటున్నాడు. సునీల్ నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తుండగా, అతని భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు. వీరి కుమారుడు నిఖిల్ మధురవాడలోని పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సునీల్ భార్య మే నెలలో గుండెపోటుతో మృతి చెందడంతో నాటి నుంచి కుమారుడు నిఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. అందరితో ముభావంగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. నిఖిల్ దాచుకున్న సొమ్ముతో తన తల్లి బతికున్నప్పుడు ఓ చీరను గిఫ్ట్గా ఇచ్చాడు. తల్లి మృతితో నిఖిల్ మనస్తాపం చెంది గురువారం తండ్రి లేని సమయంలో తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చిన చీరతో, చేతిలో తల్లి ఫొటోతో కప్బోర్డు డోర్కు ఉరివేసుకొని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. నిఖిల్ మరణవార్తతో ధారకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఊళ్లకు నీళ్లేవి?
గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరుఅందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలజీవన్ మిషన్ పనుల ఆశయానికి కూటమి ప్రభుత్వం గండి కొడుతోంది. జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.జలజీవన్ మిషన్కు ‘కూటమి’ గ్రహణంసాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి జల్జీవన్ మిషన్ తాగునీటి పథకాల పనులకు గండం ఏర్పడింది. ఈ పథకానికి సంబంధించి టెండర్ల ద్వారా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా పనులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో గిరిజనులకు తాగునీటి వెతలు తప్పడం లేదు. గడచిన వేసవిలోను తాగునీటి పథకాల పనులు పూర్తికాక గిరిజనులంతా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● జిల్లావ్యాప్తంగా 421 తాగునీటి పథకాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జల్జీవన్ మిషన్లో కాంట్రాక్టర్లంతా ఈ పనులను రెండేళ్ల నుంచి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు చెల్లించకపోవడంతో పనులన్నింటిని కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, బోరుబావి పనులు పూర్తిగా జరగకపోవడంతో జల్జీవన్ మిషన్ పనులన్నీ అలంకారప్రాయంగా మారాయి. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 421 తాగునీటి పథకాల పనులకు సంబంధించి రూ.21,06, 80,307లు వారికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ● జల్జీవన్ మిషన్ పథకంలో చేపట్టిన పనులకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్లర్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన కాంట్రాక్టర్లంతా కూటమి ప్రభుత్వ మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాలన్న డిమాండ్తో విజయవాడలో ధర్నా చేస్తున్నారు.తాగునీటికి ఇబ్బందులుపడుతున్నాం పాతపాడేరులో జల్జీవన్ మిషన్ పనులు సగం వరకు మాత్రమే జరిగాయి. బిల్లులు ఇవ్వలేదని చెబుతూ పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేసినా తాగునీటి సరఫరా వ్యవస్థ పనులు జరగక నిరుపయోగంగా మారాయి. దీనివల్ల తాగునీటి సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నాం. – సల్లా భీమలింగం, పాత పాడేరు గ్రామాల్లో నిలిచిన నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం 421 పనులకు రూ.21 కోట్లు పెండింగ్ పథకాల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిన వైనం అలంకారప్రాయంగా కుళాయిలు -
విద్యా ప్రమాణాలు మరింత మెరుగుకు కృషి
గంగవరం : విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యాప్రమాణాలు మరింత మెరుగుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. శుక్రవారం ఆయన ఉదయం 8.45 నిమిషాలకు స్థానిక ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అసెంబ్లీలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయు హాజరును ఆయన పరిశీలించారు. అనంతరం టీఏఆర్ఎల్ అమలుపై ఆరా తీశారు. ఎఫ్ఏ 2 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన పుస్తకాలను తనిఖీ చేశారు. 1, 2, 3 , 4 తరగతుల విద్యార్థుల వర్క్ బుక్లను పరిశీలించారు. అక్టోబర్ నెలకు సంబంధించి ఖాళీలు ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాఠశాల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సెలవులో ఉన్న హెచ్ఎంను ఫోన్లో ఆదేశించారు. ఇన్చార్జి ఉపాధ్యాయుడు కె. కృష్ణ, సహోపాధ్యాయులు కె. బాపనమ్మ, కె. లావణ్య, సీఆర్పీ భాస్కర్, ఎంఐఎస్ కోర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు -
హుండీ ఆదాయం లెక్కింపు
సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ ధారాలమ్మ ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఎండోమెంట్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, స్థానికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, నగదు రూ.7,40,192 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రత్యేక అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దులోఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఎటపాక: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్ఐ అప్పలరాజు బుధవారం రాత్రి పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి ట్రాక్టర్లలో సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.విదేశీయుల సందడి ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీయలు సందడి చేశారు. ఆస్ట్రేలియా, దక్షణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన 40మంది మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి,నిర్వహణను తెలుసుకున్నారు. వించ్ హౌస్లో ప్రయాణించి, వింత అనుభూతి పొందారు. ఒనకఢిల్లీ వారపు సంతకు బోండా, గదబ గిరిజనుల వేషధారణ, సంస్కృతి,సంప్రదాయ వివరాలను తెలుసుకున్నారు. వారు అమ్మే పూసలు,రింగులు కొనుగోలు చేయడమే కాకుండా వారితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు. -
జెడ్పీటీసీ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
● రిమాండ్కు తరలింపు ● మిగిలిన నిందితుల గురించి విచారణ ● విలేకరుల సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి రోలుగుంట : కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలివి. కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గల చటర్జీపురంలో 139 సర్వే నెనంబర్లో 10.83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తుప్పలు తొలగించి, సదరు భూమిని పరిశీలించడానికి కూలీలతో కలసి ఈ నెల 20వ తేదీన జెడ్పీటీసీ అక్కడకు వెళ్లారు. ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కొన్ని కుటుంబాలతో జెడ్పీటీసీ నూకరాజుకు చిరకాల వైరం ఉంది. నూకరాజు వస్తున్న సమాచారం తెలుసుకొని, అతనితో విరోధం ఉన్న కేదారి రాజబాబు, అతని బంధువులు కాచుకొని ఉన్నారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు పథకం ప్రకారం కత్తులు, కర్రలతో నూకరాజు, అతని అనుచరులపై దాడి చేశారు. మిగిలిన వారు భయభ్రాంతులకు గురై పారిపోగా, నూకరాజును చుట్టుముట్టి కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జెడ్పీటీసీ నూకరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఇతనితో ఉన్న మాస లోవరాజుపైనా ప్రత్యర్థులు దాడి చేయగా అతని చేతికి గాయమైంది. సమాచారం తెలుసుకున్న వెంటనే కొత్తకోట సీఐ కోటేశ్వరరావు రోలుగుంట పోలీసులతో నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించిన నిందితులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను ఈ నెల 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొత్తకోట సీఐ కోటేశ్వర్రావు, రోలుగుంట ఎస్ఐ సిబ్బందితో వెళ్లి -
జెండాలు పాతిన పొలాలు రైతులకు అప్పగింత
ఎటపాక: గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిన సాగు భూములను గిరిజనేతర రైతులకు అధికారులు గురువారం అప్పగించారు. నందిగామ, మూరుమూరు గ్రామాల పరిధిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునుకు గురవుతున్న సాగు భూములకు గిరిజనేతర రైతులు నష్ట పరిహారం పొందారు. అయితే సదరు రైతులు స్థానికంగా నివాసం లేకుండా అట్టి భూములు కౌలుకు ఇస్తున్నారని ఆ భూములు గిరిజనులకే చెందాలంటూ ఇటీవల గిరిజనులు జెండాలు పాతడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా గుర్తించి పూర్తి పరిహారం ఇచ్చి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించేవరకు తమ ముంపు భూములు తామే సాగుచేసుకుంటామని గిరిజనేతర రైతులు కలెక్టర్కు విన్నవించారు. దీంతో గిరిజనేతర రైతులు వారి భూములకు వారే హక్కుదారులని సబ్కలెక్టర్ ఆదేశాలు కూడా జారీచేశారు. ఈక్రమంలో గురువారం రైతులు వారి భూముల్లో దుక్కులు చేసుకుంటుండగా జెండాలు పాతిన గిరిజనులు అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఈసమాచారం తెలుసుకున్న తహసీల్దార్ కారం సుబ్బారావు,సీఐ కన్నపరాజు మురుమూరు,నందిగామ గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ముంపు భూముల్లో జెండాలు ఏర్పాటు చేయడం సరికాదని అట్టి భూములు హక్కుదారులే సాగుచేసుకుంటారని చెప్పారు. కాగా పరిహారం పొందిన భూముల్లో సదరు రైతులే సాగు చేసుకోవాలని, ఎవరికై నా కౌలుకు ఇస్తే రైతులపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేస్తామని గిరిజనేతర రైతులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించి ముంపు భూములను రైతులకు అప్పగించామని తహసీల్దార్ తెలిపారు. -
18 గ్రామాల్లో జనగణన ప్రీ టెస్టింగ్
డీఆర్వో పద్మలతసాక్షి,పాడేరు: 2027లో నిర్వహించనున్న జనగణనకు సంబంధించి జిల్లాలో జి.కె.వీధి మండలంలో 6 పంచాయతీల్లోని 18 గ్రామాల్లో ప్రీ టెస్టింగ్ నిర్వహిస్తున్నామని డీఆర్వో కె.పద్మలత తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా శిక్షణ ఇచ్చారు. జనాభా లెక్కల విభాగం సమన్వయకర్త ప్రసన్నకుమార్, మరో ముగ్గురు అధికారులు కలిసి సమగ్ర శిక్షణ అమలుజేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ రెండు దశల్లో జనగణన జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా తొలుత సేకరించిన సమాచారాన్ని సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టంలో పొందుపరుస్తామన్నారు. ప్రతి 250 నుంచి 800 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ద్వారా జనగణన జరుగుతుందన్నారు. మండల రెవెన్యూ అధికారి చార్జి అధికారిగా కీలకపాత్ర వహిస్తారన్నారు. ప్రిన్సిపల్ సెన్సెస్ అఽధికారి నోడల్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జనగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్, జి.కె.వీధి, పాడేరు రెవెన్యూ అధికారు లు, సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వీడియో సమావేశం నిర్వహిస్తున్నడీఆర్వో పద్మలత, ఇతర అధికారులు -
సుగంధ ద్రవ్య పంటలతో అధిక ఆదాయం
చింతపల్లి: సుగంధ ద్రవ్య పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని స్థానిక ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. గురువారం స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానంలో జాతీయ సుగంధ ద్రవ్య పంటల బోర్డు సౌజన్యంతో రైతులకు పసుపు, అల్లం, పిప్పలు, మిరియం, చింతపండు పంట ఉత్పత్తుల నాణ్యతపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఏడీఆర్ పసుపుసాగులో మెలకువలు, సస్యరక్షణ, పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులు వివరించారు. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, అనువైన రకాల ఎంపిక, సస్యరక్షణ, కలుపు నివారణ అంశాలను ఉద్యానవన శాస్త్రవేత్త శెట్టి బిందు వివరించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి సేంద్రియ ధ్రువపత్రం పొందే విధానం, రాయితీపై స్పైసెస్ బోర్డు అందించే ప్రోత్సాహకాల వివరాలను రైతులకు తెలియజేశారు. -
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
అడ్డతీగల: ప్రాచీన సంస్కృత భాషను నేటి తరాలకు అందించవలసి ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు.అడ్డతీగల మండలం వెదురునగరంలోని విశ్వహిందూ పరిషత్ ఒరియెంటల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంస్కృత భాష ప్రదర్శనను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమయ్యే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. భాష ప్రదర్శనకు కృషిచేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ తిరుపతి, గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, ఎంఈవోలు పాల్గొన్నారు. -
మలేరియా ప్రబలకుండా పటిష్ట చర్యలు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా మలేరియా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక జిల్లా మలేరియా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి తులసితో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీల్లో నమోదైన మలేరియా కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అధికంగా పాడేరు డివిజన్లో మూడు పీహెచ్సీల్లో, రంపచోడవరం డివిజన్ పరిధిలోని పీహెచ్సీల్లో తొమ్మిది, చింతూరు డివిజన్ పరిధిలో ఆరు పీహెచ్సీలో పరిధిలో మలేరియా తీవ్రత ఉందన్నారు. ఆయా పీహెచ్సీల పరిధిలోని గ్రామాల్లో మలేరియా రోగులకు అందించిన చికిత్సలు, ప్రబలకుండా తీసుకున్న జాగ్రత్తలను ఆయన తెలుసుకున్నారు. మలేరియా సిబ్బందితో పాటు ఫీల్డ్ విజిట్కు వెళ్తున్న వైద్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో మలేరియాపై పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో మలేరియా సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు డుంబ్రిగుడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుఖ ప్రసవాలు ఎక్కువగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహరంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రసవ నిరీక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన గర్భిణులతో మాట్లాడారు. అనంతరం సిబ్బంది నుంచి మలేరియా కేసుల వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్లో మందులు, వ్యాక్సిన్లు పరిశీలించారు. పీహెచ్సీ పరిశుభ్రంగా ఉన్నందున సిబ్బందిని అభినందించారు.డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్ -
ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడాలి
● పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ● బంగారుమెట్ట ఆశ్రమ పాఠశాల, కించాయిపుట్టు అంగన్వాడీ కేంద్రం తనిఖీ ముంచంగిపుట్టు : ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, మెరుగుపడాలని బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. ముంచంగిపుట్టు మండలంలో గురువారం ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన చేశారు. కించాయిపుట్టు పంచాయతీ కేంద్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కేంద్రం మూసి ఉండడంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ ఇంటిలో కేంద్రం నిర్వహణ చేస్తూ ఉండడం, అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉండడంతో గ్రామంలో నిరుపయోగంలో పాఠశాల భవనానికి మరమ్మతులు చేసి అంగన్వాడీ నిర్వహణ జరపాలని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలకు నిర్వహించిన పరీక్ష పేపర్లను ఆమె పరిశీలించారు. పేపర్లు సరిగా ఉపాధ్యాయులు దిద్దక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీవో సూచించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. పెదబయలు : వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయపాలన పాటించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. గురువారం పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వను పరిశీలించి, ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని, వైద్య సిబ్బంది అకింతభావంతో పని చేయాలని, రోగులు ఉండే వార్డులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం అరడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల రికార్డులు పరిశీలించారు. -
గిరిజనులకు మెరుగైన వైద్యం దూరం
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదని వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన కోటం బాపనమ్మ వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. గురువారం ఆమె నరసాపురం గ్రామంలో గురువారం మృతురాలు భర్త, వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటం రాజన్నదొర ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవలు పొందుతున్న బిడ్డ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్ఎంపీపీ పండా కుమారి, సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, నేతలు పండా నాగన్నదొర, బొబ్బా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి కోటం బాపనమ్మ మృతి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన బాధిత కుటుంబానికి పరామర్శ -
ఏవోబీలో పోలీసుల అప్రమత్తం
● నేడు మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు ● గాలింపు చర్యల్లో బలగాలు సాక్షి,పాడేరు: వరుస ఎన్కౌంటర్లు, పోలీసు నిర్బంధానికి నిరసనగా మావోయిస్టు పార్టీ ఈనెల 24వ తేదీ శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో వారి నుంచి ఒక్కసారిగా బంద్ ప్రకటించడంతో తనిఖీలు ముమ్మరం చేశాయి. ● ఏవోబీతోపాటు సరిహద్దులోని ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ,జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు. ప్రధాన రోడ్లతో పాటు మారుమూల ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని వాహనాలను పోలీసు బలగాలు తనిఖీ చేశాయి.అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగులను సోదా చేయడంతో పాటు వారి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. ● మావోయిస్టులు తలపెట్టిన భారత్ బంద్ను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏవోబీ వ్యాప్తంగా పోలీసు బలగాలు గాలింపు చేపడుతుండగా, అటువైపు నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టేషన్లు, కొత్తవలస–కిరండూల్ లైన్లోని అన్ని రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్లతో నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాత్రి పూట అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేత సీలేరు: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఎస్ఐ యాసిన్ ఏరియా డామినేషన్, వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఎటువంటి సాయం చేయవద్దని ఎస్ఐ సూచించారు. బంద్ ప్రకటన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ధారాలమ్మ తల్లి ఘాట్ రోడ్, సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే రాత్రిపూట బస్సు సర్వీసులను ముందు రోజు నుంచి అధికారులు నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి సీలేరు నైట్ హాల్ట్ బస్సు, విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నైట్ సర్వీసు, రాజమండ్రి నుంచి సీలేరు వచ్చే నైట్ బస్సును ఆర్టీసీ అధికారులు మావోయిస్టుల భారత్బంద్తో జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రత ఏర్పాటుచేశామని ఎస్పీ అమిత్బర్దర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రవేశద్వారాలు, ముఖ్యమైన చోట వాహనాల తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.మావోయిస్టుల బంద్తో ప్రజలు భయపడవద్దని, రోజువారి పనులు సాధారణంగా చేసుకోవాలన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆధార్కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. తనిఖీల సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అలాగే పోలీసులకు ప్రజలు తోడుగా ఉండి, శాంతిని కాపాడాలని, అత్యవసర పరిస్థితుల్లో112కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.గట్టి భద్రత: ఎస్పీ అమిత్ బర్దర్ -
సింహగిరిపై విశేషంగాశ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం విశేషంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. అర్చకుడు చక్రపాణి ప్రధాన కలశాన్ని శిరసుపై పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఆ జలాలను స్వామికి సమర్పించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఏయూకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
సీతంపేట: ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి, సమృద్ధి, ఆర్ధిక పరిపుష్టి కల్పించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ముగ్గురు వీసీలు రాసిన ‘ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతి నిర్దేశకులు’పుస్తకావిష్కరణ సభ సిడార్ ఆధ్వర్యంలో బుల్లయ్య కళాశాలలో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఏయూ వందేళ్ల చరిత్రను తెలుగు, ఇంగ్లిష్లో రాయడం అభినందనీయమన్నారు. 1958లో ఏయూ విద్యార్థిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన ఆచార్య వి.బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏయూలో వీసీల నియామకం ప్రారంభం, ఎంతమంది వీసీలుగా పనిచేశారో వివరించారు. మిగిలిన రచయితలు ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్, ఎస్.రామకృష్ణారావులు మాట్లాడుతూ ఏయూ చరిత్ర కలకాలం నిలిచిపోయేలా పుస్తకాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఏయూ పూర్వ వీసీ జీఎస్ఎన్ రాజు, మాజీ వీసీలు కేసీ రెడ్డి, జేవీ ప్రభాకర్, జ్ఞానమణి, ఎన్.వెంకట్రావు, ఏవీ ప్రసాదరావు, సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావు, హరినారాయణ, నిరూపారాణి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి, బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ పాల్గొన్నారు. -
మరో 1200 మంది తొలగింపునకు చర్యలు?
స్టీల్ప్లాంట్లోని వివిధ విభాగాల్లో 13,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసేవారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ముందుకు రావడంతో దఫదఫాలుగా తొలగిస్తున్నారు. ఉక్కులో మొదటిసారి 1,503 మందిని తొలగించిన యాజమాన్యం రెండోసారి 1,600 మందిని తొలగించింది. అప్పుడప్పుడు పది మంది.. ఇరవై మంది చొప్పున సుమారు 550 మందిని ఇంటికి పంపించేసింది. తాజాగా దీపావళి రోజు మరో 500 మందిని తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మరో 1,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తారని తెలుస్తోంది. వీరుగాక టెండర్లు పూర్తవడంతో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు పనికోల్పోయారు. టెండరు పూర్తయిన కాంట్రాక్టర్కు రీ టెండర్ ఇవ్వకపోవడంతో వారి వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. -
పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో సంతకాల సేకరణ ● గిరిజనుల విశేష స్పందన అరకులోయటౌన్: కూటమి ప్రభుత్వం పేద గిరిజన ప్రజలపై చేస్తున్న కుట్రలను ఆపాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో వైఎస్సార్సీపీ రచ్చబండ ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. పేద గిరిజన ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో పేద ప్రజలకు సంపూర్ణ విద్య, వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి, నిర్మాణా పనులు చేపడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో వాటిని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రయివేటు పరం చేసి, కార్పోరేట్ కంపెనీలకు అప్పగించడం సరికాదని, ఈ విధంగా చేయడంతో పేదలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు గిరిజనులంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. భీముడువలస పాఠశాలలో తనిఖీ మండలంలోని పద్మాపురం పంచాయతీ భీముడువలస పాఠశాలను అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. దీనిపై గైర్హాజరైన ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని ఈ మేరకు ఒక రోజు జీతం నిలిపివేసి, మెమో జారీ చేయాలని ఎంఈఓ త్రినాథరావుకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సూచించారు. పాంగి సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే మండలంలోని స్పోర్ట్స్ స్యూల్లో 9వ తరగతి చుదువుతున్న విద్యార్థి పాంగి సుశాంత్ (14)పై అగంతకుడు బ్లేడుతో గొంతు కొసి పరారైన సంఘటనలో అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. శాంతిభద్రతలను కూటమి ప్రభుత్వం కాపాడాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, సర్పంచ్ పెట్టెలి సుశ్మిత, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, పార్టీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్లాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్చక్షుడు కమిడి అశోక్, మండల కార్యదర్శి కొర్రా అర్జున్, నాయకులు పెట్టెలి సుక్రయ్య, జన్ని అర్జున్, మాదల రామకృష్ణ, కిల్లో బాలరాజు, జన్ని సన్యాశి, వెంకటరావు, రఘునాథ్, పాంగి నాగేశ్వరరావు, కామేష్, స్వాభి రామూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ పనసపుట్టు, అరమ పంచాయతీ ముసిరి గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలప్రై వేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాంగి పశురామ్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు. వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్రావు, అరమ ఎంపీటీసీ సభ్యురాలు డి.పద్మ, పోతంగి సర్పంచ్ వెంకటరావు, మాజీ జడ్పీటీసీ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ రాందాసు, మండల కార్యదర్శి మఠం శంకర్, నాయకులు తూమ్నాఽథ్, దశమి, బాబిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగుల: మండలంలో పెద్దలువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం సర్పంచ్ కొండపల్లి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకుడు బెదరా బంగార్రాజు, మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలతో కూడిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసుల విచారణ వేగవంతం చేయాలి
పాడేరు రూరల్: నకిలీ కులధ్రువీకరణ పత్రాల జారీ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర డిమాండ్ చేశారు. మండలంలో తామరపల్లిలో మజ్జి కృష్ణారావు, ఆయన కుటుంబ సభ్యులు నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందారన్న ఫిర్యాదుపై బుధవారం ఆర్ఐ జోగరావు, వీఆర్వో నూకరత్నం విచారణ జరిపారు. ఆ నేపథ్యంలో రామారావు దొర ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆదివాసీల రిజర్వేషన్ల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. గతంలో మజ్జి కృష్ణారావు కుమార్తె మజ్జి మేఘమాల తామరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చచ్చేడి కులం (ఎస్సీ)గా రికార్డులో నమోదు అయిందన్నారు. ఇదే కుటుంబం 2019–2021లో ఎస్టీ కొండదొర కులం పేరుతో ధ్రువీకరణ పత్రాలు పొందారని చెప్పారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలతోనే నకిలీకుల ధ్రువీకరణ పత్రాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అదే గ్రామంలో నివాసముంటున్న బయ్యావరపు శ్రీనివాసరావు నాయీబ్రాహ్మణుడు(బీసీ)అయినా నకిలీ ఎస్టీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ నకిలీ ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేయాలని, పత్రాలు జారీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్యూ నాయకులు మాధవరావు, కిషోర్, పీసా కార్యదర్శి ప్రకాష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర -
నిర్వాసితులకు తీరని వేదన
స్టీల్ప్లాంట్లో చోటుచేసుకున్న ప్రస్తుత పరిస్థితులు నిర్వాసితులకు తీరని వేదనను మిగిల్చాయి. ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు ఇచ్చినవారిని ఇప్పుడు నిర్వాసితులు కాదనే కొత్తవాదనను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు తెచ్చారు. కేవలం ఆర్ కార్డు ఉన్నవారు మాత్రమే నిర్వాసితులని, వారి వారసులు నిర్వాసితులు కాదని పేర్కొనడంతో నిర్వాసితులను పని నుంచి తొలగించడం సులువైపోయిందని కంపెనీవర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం ఎంప్లాయిమెంట్ ద్వారా విధుల్లో చేరిన 250 మందిని మాత్రమే నిర్వాసితులుగా పరిగణించి మిగిలిన వారిని విధుల నుంచి తొలగించారని కార్మికులు చెబుతున్నారు. -
కూటమివి ‘గ్యాస్’ కబుర్లే
మహారాణిపేట(విశాఖ): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల’పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మూడో విడత చెల్లింపుల్లో లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. సిలిండర్ డెలివరీ తీసుకుని రోజులు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ కాకపోవడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ కోసం ఎదురుచూపు విశాఖ జిల్లా గణాంకాలే ఈ పథకం అమలులో ని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నా యి. మూడో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,46,110 మంది లబ్ధిదారులు సిలిండర్లను డెలివరీ తీసుకున్నారు. అయితే, వీరిలో కేవలం 87 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు రాయితీ సొమ్ము రూ.8.35 కోట్లు వారి ఖాతాలకు జమ అయ్యింది. అంటే సుమారు 2.59 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆగస్టులో ప్రారంభమైన మూడో విడత బుకింగ్లు నవంబర్ 30తో ముగియనున్నాయి. అక్టోబర్ చివరి వారం నడుస్తున్నా.. ఇంత భారీ సంఖ్యలో చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు సివిల్ సప్లైస్ డీఎస్వో, ఏఎస్వో కార్యాలయాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ (1800– 2333–555) కూడా ఏమాత్రం ఉపయోగపడటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీపై నీళ్లు చల్లిన నిబంధనలు ఎన్నికల ముందు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మెలికలు పెడుతోందని మహిళలు ధ్వజమెత్తుతున్నారు. తెలుపు రేషన్ కార్డు (రైస్ కార్డు) పనిచేస్తేనే ఉచిత గ్యాస్ అని నిబంధన పెట్టడం వల్ల మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈకేవైసీ, ఆధార్–బ్యాంకు ఖాతా అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో చాలా మందికి రాయితీ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. ఎన్ని కల ముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం మోసమేనని వారు మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన ఏది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుందని డీఎస్వో వి.భాస్కర్ చెబుతున్నారు. కానీ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సిలిండర్లు తీసుకున్నవారికి కూడా అక్టోబర్ చివరి నాటికి డబ్బులు పడలేదు. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. -
ఉక్కిరిబిక్కిరి
ఉక్కులో కాంట్రాక్టు కార్మికులతాజాగా 500 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు మొత్తంగా ఉపాధి కోల్పోయిన 5 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని ఉక్కు యాజమాన్యం కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం గాజువాక : విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ఉక్కు యాజమాన్యం ఇంటికి పంపించేస్తోంది. తాజాగా తొలగించిన 500 మందితో సహా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. మరో 1200 మంది కాంట్రాక్టు కార్మికుల మెడలో కత్తి వేలాడుతూనే ఉంది. ఈ విషయంలో నిర్వాసితులకు మరింత అన్యాయం జరుగుతోంది. ఇంతమంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇక్కడ కార్మికులు అవసరానికి మించి ఉన్నారంటూ సాక్ష్యాత్తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేస్తుండటంతో యాజమాన్య చర్యలకు అడ్డులేకుండా పోయింది. నిర్వాసిత కార్మికులను తొలగించవద్దంటూ స్వయానా కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్టీల్ప్లాంట్ యాజమాన్యాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని యాజమాన్యం కనీసం పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. కార్మికుల కొరత కార్మికులను ఎడాపెడా తొలగించడంతో చాలా విభాగాల్లో కార్మికుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్ఎంహెచ్పీ విభాగం పై భాగంలో గల కన్వేయర్ల నుంచి మెటీరియల్ కింద పడిపోతోంది. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే జామ్ అయిపోతుంది. అక్కడ కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో ఇటీవల జామ్ అయిన సంఘటనలు తలెత్తాయి. దీంతో వీఆర్ఎస్ పెట్టిన పర్మినెంట్ కార్మికులకు అక్కడ డ్యూటీ వేశారు. ఇదిలా ఉండగా, ప్లాంట్లో అత్యవసర విభాగాలు కొన్ని ఉన్నాయి. అక్కడ విధులకు కాంట్రాక్టు కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే గేటు పాసులు మూడు, ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇప్పుడు వైట్పాసులు ఇస్తున్నారు. వాటిని ఐదు రోజులు, పది రోజుల వ్యాలిడిటీ పొడిగిస్తున్నారు. దీంతో వారిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు పేర్కొంటున్నారు. భారీగా తగ్గిన పర్మినెంట్ ఉద్యోగులు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చాక పర్మినెంట్ ఉద్యోగులు కూడా భారీగా తగ్గిపోయారు. ప్లాంట్లో 12 వేల మందికి పైగా గల ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 9,800 మందికి పడిపోయింది. మొదటిసారి వీఆర్ఎస్ కింద 1,126 మందిని, తాజాగా అమలు చేసిన వీఆర్ఎస్ కింద మరో 464 మందిని పంపించేసింది. ఇదికాక గత ఏడాది కాలంలో 2,300 మంది పదవీ విరమణ పొందారు. రానున్న ఏడాది మరో 1,000 మంది పదవీ విరమణ పొందనున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన యువ కార్మికుల్లో సుమారు 300 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కార్మికులు చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, ప్రజాప్రతినిధులు గాని కనీసం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 500 మంది చిరు కార్మికులు స్టీల్ప్లాంట్ యాజమాన్య చర్యలతో ప్లాంట్లో పని చేస్తున్న చిన్నా, చితకా కలిపి మరో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్టీల్ప్లాంట్లోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్యాంటీన్లను యాజమాన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా క్యాంటీన్లలో పనిచేస్తున్న కార్మికులు పని కోల్పోయారు. -
గిరిజనేతరుల భూముల్లోజెండాలు పాతిన ఆదివాసీలు
కూనవరం : పోలవరం నిర్వాసితులైన గిరిజనేతరుల భూముల్లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం జెండాలు పాతారు. పరిహారం పొందిన తరువాత కూడా గిరిజనేతరులు ఆ భూముల్లో వ్యవసాయం చేయడం చట్టవిరుద్ధమని గిరిజన సంఘం నాయకులు తెలిపారు. 1/70 చట్టం ప్రకారం ఆ భూములను గిరిజనులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈవిషయంపై స్థానిక తహసీల్దార్, ఐటీడీఏ పీవో, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అధికారుల నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో జెండా లు పాతినట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు పాయం సీతారామయ్య, పెదార్కూరు ఎంపీటీసీ ధర్ముల అమ్మాజీ, సర్పంచ్ మడకం నాగమణి, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు తెల్లం తమ్మయ్య, బాబు బొర్రయ్య, ఆదివాసీ రైతులు కుంజా వెంకటరావు, కట్టి మారయ్య, కట్టి తమ్మయ్య, కుంజా శ్రీను, కట్టి శ్రీను పాల్గొన్నారు. -
మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తం
ఎస్పీ అమిత్ బర్దర్జి.మాడుగుల: మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. స్థానిక సర్కిల్ పోలీస్స్టేషన్ను బుధవారం రాత్రి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరు సమీక్షించారు. జనరల్ డైరీ, వివిధ కేసులకు సంబంధించిన డైరీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 24న మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఏరియా డామినేషన్, సమాచార సేకరణ, వ్యూహాత్మకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. -
బ్లేడుతో పీక కోసుకున్నమతిస్థిమితం లేని వ్యక్తి
వై.రామవరం: మండలకేంద్రం వై.రామవరం శివారులోని కొండవాగు పక్కన గుట్టపై ఉన్న శివాలయం వద్ద బుధవారం కాళ్ళ దాసు (45) అనే వ్యక్తి బ్లేడుతో పీక కోసుకున్నాడు. ఆ మార్గంలో నడచి వెళుతున్న కొంతమంది రక్తపు మడుగులో పడిఉన్న అతనిని గమనించి స్థానిక సీహెచ్సీకి 108లో తరలించారు. సూపరింటెండెంట్ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి మండల సరిహద్దు ప్రాంతమైన కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ కంపమామిడి గ్రామస్తుడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా కనిపించకపోవడంతో గాలిస్తున్నట్టు చెప్పారు. ఈవిషయాన్ని స్థానికులు తమకు తెలియజేయడంతో ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని సూపరింటెండెంట్ చైతన్యకుమార్ తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
పాడేరు: గిరిజన విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రిన్సిపాళ్లు, ప్రధాన్యోపాధ్యాయులు, ఏటీడబ్ల్యువోలు, ఎంఈవోలతో బుధవా రం అత్యవసర సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పాఠశాలల నిర్వాహకుల ప్రాథమిక బాధ్య తన్నారు. ఉన్నతాధికారుల నుంచి మందలింపులు వస్తాయని భయపడి విద్యార్థుల అనారోగ్య సమస్యలు గోప్యంగా ఉంచవద్దన్నారు. పోషకాహారం లోపం కారణంగా విద్యార్థులకు అనారోగ్య సమస్య లు వస్తాయని చెప్పారు. సిక్బోర్డు రిపోర్టును నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రుల నుంచి డిశార్జి అయిన విద్యార్థులను నేరుగా ఇంటికి పంపించకుండా ఉపాధ్యాయులు, వసతిగృహం నిర్వాహకుల పర్యవేక్షణలో పాఠశాలకే తిరిగి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను కేజీహెచ్ తదిత ర ఆస్పత్రులకు పంపినప్పుడు వారి తల్లిదండ్రులు భయపడే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులు పిల్లలకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలన్నారు. దసరా సెలవుల తర్వాత పాఠశాలల్లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల వివరాలు, హెల్త్ కార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి హెల్త్ బుక్ (రికార్డు) నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత తప్పని సరిగా ఉండాలన్నారు. విద్యార్థుల గదులతో పాటు వంటశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ కె.సాహిత్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ తదితరులు పాల్గొన్నారు.పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
ఎకో టూరిజం అభివృద్ధికి సహకరించాలి
సాక్షి,పాడేరు: పర్యావరణహిత పర్యాటకాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ కోరారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో మాడగడ, వంజంగి ప్రాంత ప్రజాప్రతినిధులు, గిరిజనులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వంజంగి మేఘాల కొండ, మాడగడ వ్యూపాయింట్లో పర్యాటక అభివృద్ధిపై సమీక్షించి,గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనసంరక్షణ సమితుల ఆధ్వర్యంలో వంజంగి, మాడగడలో ఎకో టూరిజం అభివృద్ధికి స్థానిక గిరిజనులు అటవీ, రెవెన్యూశాఖలకు సహకరించాలన్నారు.జిల్లా యంత్రాంగం గ్రామసభలు పెట్టి స్థానిక గిరిజనుల సలహాలు,సూచనలతో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధిపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఐటీడీఏ, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉమ్మడి సహకారంతో ముందుకు వెళతామన్నారు. వంజంగి, మాడగడ పర్యాటక ప్రాంతాలు రిజర్వ్ పారెస్ట్ పరిధిలో ఉన్నందున ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చి పర్యావరణానికి హాని లేకుండా పర్యాటకాభివృద్ధి చేస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆయా గ్రామాల గిరిజనుల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి దోహద పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎఫ్వో సందీప్రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, వంజంగి, లగిశపల్లి, కాడెలి, మాడగడ పంచాయతీల సర్పంచ్లు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన వ్యాన్
● మహిళ మృతి ● ఇద్దరికి తీవ్ర, తొమ్మిది మందికి స్వల్పగాయాలు గూడెంకొత్తవీఽధి: మండలంలోని రింతాడ మాలి సెంటర్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో తొమ్మిది మందికి స్వల్పగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సంకాడ పంచాయతీ చిత్తమామిడికి చెందిన గ్రామస్తులు చింతపల్లి సంతకు ఆటోలో కూరగాయలు తీసుకెళ్తున్నారు. ఆటోలో మొత్తం 12మంది ప్రయాణిస్తున్నారు. రింతాడ మాలి సెంటర్లో కూరగాయలు దించేందుకు ఆటోను ఆపారు. ఆగి ఉన్న ఆటోను ఆర్వీ నగర్ శాంతిసాధన పాఠశాలకు చెందిన బొలెరో వాహనం ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న తులసి(60) అక్కడే మృతిచెందగా, గణపతి, మోహన్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయవడంతో చింతపల్లి ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గోవర్ధన్, ముకుంద్,బుజ్జిబాబు తదితర తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గూడెంకొత్తవీధి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన వారిని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబు, రింతాడ సర్పంచ్ భర్త వెంటరావు,ఎస్టీసెల్ అధ్యక్షుడు నారాయణ, పాతూను లక్ష్మణ్, ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ ఆస్పత్రిలో పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. -
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి
● డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్ పాడేరు రూరల్: ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి అందరూ కృషి చేయాలని డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. ఎంఎల్హెచ్పీ కమ్యూనిటీ హెల్త్ అధికారులు, వైద్య సిబ్బందికి బుధవారం పాడేరులో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 297 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో 12 ప్యాకేజీల సర్వీసులు అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలపై డిసెంబర్ రెండో వారం వరకు టీముల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న గర్భధారణ, నవజాత శిశువు, బాల్యం, యవ్వన దశల్లో ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ,గర్భ నిరోధక సేవలు, అంటు వ్యాధుల నివారణ, తదితర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
అక్రమార్కులు
సరిహద్దు మీరుతున్నఎటపాక: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇసుక అక్రమ తరలింపునకు తెర లేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల పేరుతో ఉచితంగా ఇసుక పొంది ట్రాక్టర్లు, టిప్పర్లతో పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. ఇసుక అక్రమ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దీనికి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మన రాష్ట్రంలోని గుండాల ఇసుక స్టాక్ పాయింట్ అడ్డాగా మారింది. ఆంధ్రా నుంచి తెలంగాణ సరిహద్దు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాత్రీపగలు అన్న తేడాలేకుండా అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుకను తరలించేస్తున్నారు. ఇంతకు ముందు రాత్రి సమయంలో గోదావరి నుంచి ఇసుకను తోడి తెలంగాణకు తరలించేవారు. అయితే నదిలో నీరు ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో వారి దృష్టి గుండాల స్టాక్పాయింట్పై పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జాతీయరహదారి పక్కన ఈ స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేశారు. ఆంధ్రా పరిధిలో ఉన్న గృహనిర్మాణాల కోసం లబ్ధిదారులకు వారి ఆధార్కార్డు ఆధారంగా ఇసుకను అందజేస్తున్నారు. కొన్నిరోజులు స్టాక్ నిర్వహణ సజావుగా సాగింది. తరువాత గాడి తప్పిందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కాసులు కురిపిస్తున్న స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్ నుంచి గృహ నిర్మాణాల కోసమని చెబుతూ మన రాష్ట్రంలో నివసిస్తున్న వారి ఆదార్ కార్డు ద్వారా ఇసుక పొంది, వేరే ప్రాంతాల్లో డంప్చేసి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తెలంగణ రాష్ట్రంలోని భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇసుకకు అధిక డిమాండ్ ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా స్టాక్పాయింట్ నుంచి నేరుగా తెలంగాణకు తరలించేస్తున్నారు. స్టాక్ పాయింట్లో టన్ను లోడింగ్కి రూ.183 వసూలు చేస్తారు. ట్రాక్టర్లో నాలుగు టన్నుల ఇసుక పడుతుంది. ట్రాక్టర్ ఇసుకను రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ విక్రయిస్తున్నారు. టిప్పర్లో 25 టన్నుల ఇసుక పడుతుంది. దీనిని రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ విక్రయిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. మరో పక్క ఆంధ్రాలోని చింతలగూడెం,కన్నాయిగూడెం శివారు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను నిల్వచేస్తున్నారు. దొంగ వేబిల్లులతో... తెలంగాణ లోని చర్ల ర్యాంపు నుంచి కొనుగోలు చేసినట్టు దొంగ వేబిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి గుండాల స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ కు తరలిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్టాక్ పాయింట్పై పర్యవేక్షణ, సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. సొంత అవసరాలకు అని చెప్పి స్టాక్పాయింట్లో ఇసుకను పొంది, ట్రాక్టర్లు, లారీల్లో తెలంగాణ రాష్ట్రానికి తరలించి దర్జాగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక తరలింపు బరితెగిస్తున్న మాఫియా కాసులు కురిపిస్తున్న గుండాల స్టాక్ పాయింట్ -
కొత్త విద్యుత్ కనెక్షన్కు ఫిక్స్డ్ చార్జీలు
● ఏపీఈపీడీసీఎల్లో నూతన విధానం ● ఇకపై అన్ని సర్కిళ్లలోనూ ఒకే రకమైన చార్జీలు సాక్షి, విశాఖపట్నం: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ఇకపై ‘వన్ స్టేట్, వన్ చార్జ్’అమలు చేసేందుకు పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కనెక్షన్ల జారీలో ఏపీఈఆర్సీ నియమావళికి అనుగుణంగా నూతన విధానం అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. కొత్త కనెక్షన్ పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయడంతో పాటు, కనెక్షన్ ప్రక్రియను సులభతరం చేయడం, చార్జీల అమలులో పారదర్శకతను తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రూల్స్–2020కి అనుగుణంగా ఏపీఈఆర్సీ ఈ సవరణలను సూచించింది. ఇకపై ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఒకే విధమైన, పారదర్శక చార్జీలను అమలు చేయనుంది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు, ఎస్టిమేట్ తయారీ అవసరం లేకుండా వేగవంతమైన సేవలు అందించడం వల్ల..వినియోగదారులు ముందుగానే కనెక్షన్ చార్జీలపై స్పష్టమైన అవగాహన పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానంలో భాగంగా 150 కిలోవాట్ల వరకు ఉన్న కనెక్షన్లకు స్థిర కనెక్షన్ చార్జీలు నిర్ణయించారు. అలాగే ఒక కిలోమీటర్ పరిధిలో ఇప్పటికే విద్యుదీకరణ జరిగిన ప్రాంతాల్లో, 150 కిలోవాట్ల వరకు లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ కనెక్షన్ అడిగే వినియోగదారులు ఈ స్థిర చార్జీలకు అర్హులని స్పష్టం చేసింది. ఒక కిలోమీటర్ దూరానికి మించి ఉన్న ప్రాంతాలకు, కొత్త లేఅవుట్ల విద్యుదీకరణకు, వ్యవసాయ, అనుబంధ కనెక్షన్లకు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవసరమయ్యే సందర్భాల్లో ఈ చార్జీలు వర్తించవు. అయితే అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి ఇతర రుసుములు మాత్రం ప్రస్తుత నియమావళి ప్రకారం కొనసాగుతాయి. వేగవంతంగా విద్యుత్ కనెక్షన్లు గతంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత సైట్ ఇన్స్పెక్షన్, ఎస్టిమేట్ తయారీ వంటి ప్రక్రియల ఆధారంగా కనెక్షన్ చార్జీలు నిర్ణయించేవారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలనేది స్పష్టంగా తెలిసేది కాదు. ఎస్టిమేట్పై ఆధారపడి సర్వీస్ లైన్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేసేవారు. ఈ విధానంలో ప్రాంతం, దూరం, లోడ్ వంటి అంశాలపై చార్జీలు మారుతూ ఉండేవి. కొత్తగా అమలులోకి వచ్చిన విధానంలో 150 కిలోవాట్ల వరకు ఉన్న అన్ని కొత్త కనెక్షన్లకు, అదనపు లోడ్లకు కేటగిరీ ఆధారంగా స్థిర చార్జీలు నిర్ణయించారు. 20 కిలోవాట్ల వరకు (ఒక కిమీ పరిధిలో) ఉన్న కనెక్షన్లకు, గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్కు రూ.1,500, వాణిజ్య వి నియోగదారులకు (మొదటి కిలోవాట్కు) రూ.1,800 చొప్పున, తర్వాత ప్రతి అదనపు కిలోవాట్కు రూ.2 వేలు చొప్పున ధరలు నిర్ణయించారు. 20 నుంచి 150 కిలోవాట్ల వరకూ ప్రతి కిలోవాట్కు రూ.12,600 చొప్పున ధర ఉండనుంది. సగటు కనెక్షన్ ఖర్చు ఆధారంగా ఈ చార్జీలు నిర్ణయించామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఇకపై సైట్ ఇన్స్పెక్షన్, ఎస్టిమేట్ అవసరం లేకుండా, దరఖాస్తు చేసుకున్న సమయంలోనే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఫలితంగా, విద్యుత్ కనెక్షన్ జారీ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలతో కలిపి స్థిరంగా నిర్ణయించడం వల్ల ఎలాంటి అదనపు చార్జీల భారం వినియోగదారుడిపై పడదని సీఎండీ వివరించారు. -
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
సాక్షి,పాడేరు: విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని మంగళవారం తలారిసింగి మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పోలీసు అధికారులు అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్లను కలెక్టర్, ఎస్పీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత్–చైనా సరిహద్దులో హిమాలయాల్లో గీస్తీ నిర్వహిస్తున్న డీఎస్పీ కరణ్సింగ్, సీఆర్పీఎఫ్ జవానులపై శత్రువులు దాడి చేశారని, సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకొంటున్నామన్నారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివి చింతూరు: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దివాకర్ అన్నారు. చింతూరు పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం చింతూరులో ర్యా లీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ దేశరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడేక్రమంలో ఎందరో పోలీసులు బలవుతున్నారని, అలాంటి పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, సీఆర్పీ ఎఫ్ జవాన్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
పరిహారమిస్తే.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఓకే
● జెన్కో అధికారులకు తేల్చిచెప్పిన నిర్వాసితులు ● డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత సీలేరు: తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తే సీలేరులో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అంగీకరిస్తామని నిర్వాసిత గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. నిర్వాసిత గ్రామాలైన పార్వతీనగర్, బూసుకొండ, సాండ్ కోరీ గ్రామస్తులు, సీలేరు అఖిల పక్ష నాయకులతో మంగళవారం సీలేరులోని ఏపీ జెన్కో గెస్ట్ హౌస్లో జెన్కో అధికారులు సమావేశమయ్యారు. నిర్వాసితుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. నష్టపోతున్న ఇంటికి బదులుగా భూమి, ఇంటికొక ఉద్యోగం, 50 పడకల ఆస్పత్రి, స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు, పక్కా ఇల్లు నిర్మించుకునేలా సాయం, తాగునీరు, విద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తే ప్రాజెక్ట్ నిర్మించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు జెన్కో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జెన్కో చీఫ్ ఇంజినీర్ రాజారావు మాట్లాడుతూ నిర్వాసిత ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఏ గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్ హైడల్ రత్నకుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా భూగర్భంలో జరుగుతుందని, సీలేరు గ్రామాన్ని తరలించాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్కో అధికారులు చంద్రశేఖర్రెడ్డి, బాలకృష్ణ, అప్పలనాయుడు, జైపాల్, సురేష్ పాల్గొన్నారు. -
నరకాసుర హైడ్రో పవర్భూతం దహనం
● ఈనెల 24న చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి ● గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా మండలంలోని పెదలబుడు పంచాయతీ తాంగులగుడ, ఒల్దీపనస గ్రామాల్లో నరకాసుర హైడ్రోపవర్ భూతం దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ, అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన జీవో నంబర్ 2, 13, 51 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి ప్రతులను దీపావళి పండగ సందర్భంగా దహనం చేసినట్టు చెప్పారు. గ్రామ సభ తీర్మానం, పీసా కమిటీ తీర్మానం లేకుండా అటవీ, పర్యావరణ అనుమతులను ఏకపక్షంగా ఆగమేఘాల ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివాసీలను మాయమాటలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర ప్రణాళిక కమిటీ పేరుతో జిల్లా యంత్రాంగం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆదివాసీల భూములు, అటవీ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటామన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని ఈనెల 24న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలదేవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో జగన్నాథం, కొర్రా మగ్గన్న, తాంగుల హరి, బురిడి నర్సింగరావు, రవి కుమార్, రాజు, మహిళలు పాల్గొన్నారు. -
జైలు నుంచి విడుదలైన వ్యక్తి ఆత్మహత్య
ఆరిలోవ : రెండు రోజుల కిందట సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతానికి చెందిన కె.దామోదరం (35) మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ డైరీఫారం నుంచి జాతీయ రహదారి జూపార్కు దగ్గరలోని విశాఖ వ్యాలీ జంక్షన్ సమీపంలో ఉరి వేసుకున్నాడు. జాతీయ రహదారి పక్కన కావడంతో అందరూ ఆందోళన చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించామని, మృతికి గల కారణాలు సేకరిస్తున్నామని ఆరిలోవ పోలీసులు తెలిపారు. విశాఖ డీఆర్వో, ఆర్డీవోల బదిలీఇన్చార్జి డీఆర్వోగా జేసీ మయూర్ అశోక్ ఇన్చార్జి ఆర్డీవోగా డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ మహారాణిపేట : విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) బి.హెచ్.భవానీశంకర్, విశాఖ డివిజనల్ రెవెన్యూ అధికారి(ఆర్డీవో) పి.శ్రీలేఖకు బదిలీ అయింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. బాధ్యతల స్వీకరణ ఇన్చార్జి డీఆర్వోగా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇన్చార్జి విశాఖ ఆర్డీవోగా హెచ్పీసీఎల్ భూసేకరణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలకలం సృష్టించిన శ్రీలేఖ రెవెన్యూ శాఖలో వ్యవహారాలపై విశాఖ ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. జిల్లా రెవెన్యూ అధికారిపై పలు అవినీతి ఆరోపణలు చేయడం రెవెన్యూ శాఖను కుదిపేసింది. తహసీల్దార్ల నుంచి నెలవారి మామూళ్లు, సరకులు తీసుకుంటున్నట్టు ఆమె నేరుగా డీఆర్వోపై కలెక్టర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విషయంపై వాడిగా వేడిగా చర్చ సాగింది. ఇద్దరిపై బదిలీ వేటు పడడంతో ఈ వ్యవహారం ఇక్కడే సద్దుమణిగింది. -
మూగబోయిన ఆత్మీయ పలకరింపు
ఆయన సీపీఐని వీడి వైఎస్సార్ సీపీలో చేరా రు. 2021లో వైఎస్సార్సీపీ నుంచి మూడో సారి జెడ్పీటీసీగా గెలుపొందారు. ప్రస్తు తం ఆయన జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తూ హత్యకు గురయ్యారు. ప్రముఖల నివాళి చిట్టింపాడులో నూకరాజు పార్థివ దేహంపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ గొడ్డేడి మాధవి, ఎంపీపీ బడుగు రమే ష్, చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఇతర నేతలు పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నూకరాజును చివరిసారిగా చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నూకరాజు భార్య గంగమ్మ, పెద్ద కూతురు లక్ష్మి, రెండో కూతురు శివలక్ష్మి,కొడుకు కన్నబాబును నాయకులు ఓదార్చారు. అనంతరం నూకరాజు పార్థివ దేహానికి ఆయన పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. నూకరాజు సేవలు చిరస్మరణీయం : జెడ్పీ సీఈవో నారాయణమూర్తి మహారాణిపేట: కొయ్యూరు మండలం జెడ్పీటీసీ వారా నూకరాజు అత్యంత సౌమ్యుడు, నిగర్వి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణాధికారి(సీఈవో) పి.నారాయణమూర్తి కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారా నూకరాజు సంతాప సభ నిర్వహించారు. తొలుత నూకరాజు చిత్రపటానికి సీఈవో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూకరాజు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ మాట్లాడుతూ నూకరాజు మరణం జిల్లా ప్రజా పరిషత్కు తీరని లోటు అన్నారు. నూకరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కూటమిలోనే గూగుల్ వార్
ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు గూగుల్ డేటా సెంటర్పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయని మీడియా సమావేశంలోనే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేమని తేల్చి చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటులో అదాని కూడా భాగస్వామి అని చెప్పుకొచ్చారు. ఈ సెంటర్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుందని, విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుందని అంగీకరించారు. గాలి, భూ కాలుష్యాన్ని అధిగమించాల్సి ఉంటుందన్నారు. అతడితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కూడా గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలపై అసలు వాస్తవాలను వెల్లగక్కారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, దీని ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పారు. వీరి వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడింది. ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న ప్రచారాలను బీజేపీ పెద్దలే తిప్పికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ చీఫ్, ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు కౌంటర్ చేయలేకపోతున్నారు. కూటమి పార్టీల నేతలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. విశాఖ సిటీ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు రావా? జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయా? ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయా? భవిష్యత్తులో విద్యుత్, నీటి సమస్య ఉత్పన్నమవుతుందా? ఇప్పటి వరకు ఐటీ, పర్యావరణ నిపుణులు సందేహాలు లెవనెత్తగా.. తాజాగా ఏపీ బీజేపీ పెద్దలు సైతం వీరితో గొంతు కలపడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీంతో కూటమిలో ‘గూగుల్’ వార్ మొదలైంది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ను టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ దానికి చెక్పెట్టే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్ ఘనతను కొట్టేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు చూస్తుంటే.. బీజేపీ ముఖ్య నేతలు తండ్రీ, కొడుకుల గాలి తీసేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఊదరగొడుతుంటే.. ఏపీ బీజేపీ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి బండారాన్ని బట్టబయలు చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు గూగుల్పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శిస్తూనే.. మరోవైపు చంద్రబాబు, లోకేష్ చెప్పినవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేసేలా మాట్లాడడం ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అన్నీ అవాస్తవాలే.. : విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై వాస్తవాలను దాచి.. 1.8 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని కల్లబొల్లి మాటలు చెబుతోందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఐటీ నిపుణులు సైతం కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కోసం మూడు ప్రాంతాల్లో 480 ఎకరాలను కేటాయించనుంది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 200 ఎకరాలు, అడవివరం ప్రాంతంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాల కేటాయింపులకు భూములను సిద్ధం చేస్తోంది. అలాగే రూ.22 వేల కోట్ల రాయితీలను ప్రకటించేయడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంద. అయితే నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖతో పాటు రాష్ట్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్సార్ సీపీ నేతలు సైతం గూగుల్ డేటా సెంటర్ ద్వారా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఆ దిశగా సదరు కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సందేహాలకు, వైఎస్సార్ సీపీ నేతల సూచనలపై ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు. టీడీపీ, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు డేటా సెంటర్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయని అంగీకారం పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్య అని వెల్లడి 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు బీజేపీ నేతల వ్యాఖ్యలతో ఇరకాటంలో ప్రభుత్వం -
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత
రహదారిపై నినాదాలు చేస్తున్న అఖిలపక్ష నాయకులు, ప్రజలు రహదారికి అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఆందోళన చేస్తున్న ప్రజలుఎటపాక: ఇసుక రవాణా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీలోని నాలుగు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు, అఖిలపక్షం నాయకులు సుమారు 16 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి గోదావరి నదిలో ఇసుకను నిత్యం వందలాది లారీల్లో తెలంగాణాకు తరలిస్తున్నారు. మండల కేంద్రం ఎటపాక నుంచి కన్నాయిగూడెం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రాలోని ఎటపాక మండల పరిధిలోకి వస్తుంది. ఇసుక లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రహదారి ధ్వంసమైంది. అడుగడుగునా గోతులు ఏర్పడడంతో వాహనచోదకులు నరకయాతన పడుతున్నారు. ఇసుక లారీల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించేందుకు భయాందోళనలు చెందుతున్నారు. పర్ణశాలను సందర్శించేందుకు వెళ్లే యాత్రికులు కూడా నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈక్రమంలో విసిగిపోయిన కన్నాయిగూడెం పంచాయతీ ప్రజలు ఆదివారం రాత్రి రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ సాగింది. దీంతో 16 గంటల పాటు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఇసుక లారీలను నియంత్రించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ సుబ్బారావు, సీఐ కన్నపరాజు ఆందోళనకారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్తో నిరసనకారులతో ఫోన్లో మాట్లాడించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. రహదారికి మరమ్మతులు చేపట్టి, తరువాత రోడ్డు నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు. తెలంగాణ కు ఇసుక రవాణాను అడ్డుకున్న అఖిలపక్ష నేతలు ఇసుక లారీలతో ఆంధ్రా రోడ్డు శిథిలమైందని ఆందోళన జాతీయ రహదారిపై బైఠాయింపు దిగొచ్చిన అధికారులు రోడ్డు అభివృద్ధికి హామీతో ఆందోళన విరమణ -
టీఎఫ్ఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
పాడేరు రూరల్: జిల్లా కేంద్రం గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం ట్రెబల్ రైట్స్ ఫోరం(టీఎఫ్ఆర్) అల్లూరి జిల్లా కార్యవర్గం ఎన్నిక నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫోరం వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్.ఎస్.వరహాలదొర ఆధ్వర్యంలో జరిగింది. ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పి.సతీష్కుమార్, ప్రధాన కార్యదర్శిగా జర్సింగి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పి.అప్పలస్వామి, జి.నాని, సహాయ కార్యదర్శులుగా బోనంగి వెంకట్పడాల్, పి.చలపతి, కోశాధికారిగా జాగరపు చలపతి, లీగల్ అడ్వైజర్ పొయిభ నీలకంఠం, కగ్రీవంగా ఎన్నిక కాగా.. మరో ఐదుగురు బోర్డు సభ్యులుగా నియామకమయ్యారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రధాన సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పూర్ణారావు, నరసింహదొర, భానుచందర్, పాల్గొన్నారు. -
ఆటో బోల్తా పడి యువకుడి మృతి
కొయ్యూరు: వంట చెరకు సేకరణను వెళ్లిన ఆటో తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన ఆర్.కల్యాణ్ చక్రవర్తి అలియాస్ చిన్న(33) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న కొయ్యూరు ఎస్ఐ కిషోర్వర్మ వెంటనే ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాదేవిపేటకు చెందిన ఎం.అప్పారావు, వి.బుచ్చియ్య, ఎం.కొండబాబు, చిన్న కలిసి మంగళవారం ఆటోలో కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరు–ఎర్రబంద రహదారిలో ఏనుగురాయి వద్దకు వెళ్లి వంట చెరకు సేకరించారు. తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా పడింది. చిన్న తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. గాయపడిన వారిలో అప్పారావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వై ద్యం కోసం నర్సీపట్నం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరూ కృష్ణాదేవిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మెరుగైన వైద్య సేవలుఅందించాలి
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ చింతూరు: క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు 12 రకాల ఆరోగ్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్యసిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, ఎయిమ్స్–ఐసీఎంఆర్ రీసెర్చ్ కన్సల్టెంట్ శాంతిరాజ్యం పాల్గొన్నారు. -
కన్నబిడ్డను కనులారా చూడకుండానే..
రంపచోడవరం: నవమాసాలు మోసి, బిడ్డను కని...అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లికన్ను మూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించిందని బంధువులు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన కోటం బాపనమ్మ (33 ) ప్రసవ కోసం 12 రోజుల ముందుగానే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చేరింది. 19వ తేదీన పురిటినొప్పులు రావడంతో ఆమెను ఉదయం ఆరు గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు. 8 గంటల వరకు ఆపరేషన్ థియేటర్లో ఉంచి ప్రసవం చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బిడ్డ కొంత భాగం బయటకు వచ్చి ఆగిపోయిందని, ఆ సమయంలో డాక్టర్లు హడావుడిగా ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రక్తం పోవడంతో ఆమె పూర్తిగా నల్లగా మారిపోయి, చలనం లేకుండా ఉందని చెప్పారు. ఉమ్మునీరు తాగాడని పుట్టిన మగ బిడ్డను కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. తల్లిని ఆదివారం రాత్రి వరకు ఏరియా ఆస్పత్రిలో ఉంచి, రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు తల్లిని కాపాడేందుకు విఫల ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. బాపనమ్మ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.ప్రసవం కోసం ముందుగానే వచ్చినా...రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల హంగులు ఉన్నా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రవసం కోసం వచ్చిన నలుగురు గర్భిణులు మృతి చెందారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గైనిక్ నిపుణులు ఉన్నా గర్భిణులకు ప్రాణ గండం తప్పడం లేదు. కోటం బాపనమ్మ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని బంధువులు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయ కులు ఆరోపిస్తున్నారు. ప్రసవం కోసం గర్భిణి 12 రోజులు ముందుగానే వచ్చి బర్త్ వెయింటింగ్ హాల్లో చేరినా వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలికోటం బాపనమ్మ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వరుస మరణాలు సంభవిస్తున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో జరిగిన మరణాలపై కలెక్టర్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యేవి కావన్నారు. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువుకు మంచి వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మూగబోయిన ఆత్మీయ పలకరింపు
కొయ్యూరు: అమ్మా...అయ్యా అంటూ అందర్నీ ఆత్మీయంగా పలకరించే ఆ గొంతు మరి వినిపించదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే ఆ నాయకుడు అందరికీ దూరమయ్యాడు. 25 సంవత్సరాలుగా రాజకీయల్లో ఉన్న జెడ్పీటీసీ వారా నూకరాజు(59) భూ వివాదంలో దారుణ హత్యకు గురయ్యారు. అతని పార్థివదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామం చిట్టింపాడు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభయం ఇచ్చే నాయకుడిని కోల్పోయామంటూ భోరున విలపించారు. వద్దని వారించినా.... వివాదంలో ఉన్న చటర్జీపురం భూమి వద్దకు వెళ్తానని సోమవారం నూకరాజు చెప్పగానే వద్దని కుటుంబ సభ్యులు వారించారు. ఆయన వెళ్లకుండా కారు తాళం కూడా దాచేశారని స్థానికుల ద్వారా తెలిసింది. అయితే నూకరాజు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తాళం ఇవ్వకుంటే ఆటోలోనైనా వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. దీంతో కారు తాళాలు ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన గంటలోపే మరణించారు. మూడుసార్లు జెడ్పీటీసీగా.. నూకరాజు మూడు సార్లు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఇలా మూడుసార్లు జెడ్పీటీసీగాఎన్నికై న వారు మన్యంలో ఇంకెవరూ లేరు. 2001లో జెడ్పీటీసీగా సీపీఐ నుంచి మొదటి సారి గెలుపొందారు. కాంగ్రెస్,టీడీపీకి సమానంగా జెడ్పీటీసీ స్థానాలు రావడంతో సీపీఐ నుంచి గెలుపొందిన నూకరాజు పార్టీ అనుమతితో కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. దీంతో వంజంగి కాంతమ్మ చైర్మన్గా ఎంపిక కాగా, నూక రాజు వైస్ చైర్మన్గా ఎంపికయ్యారు. రెండోసారి ఆయన 2008లో జెడ్పీటీసీగా గెలుపొందారు. 2015లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అభయం ఇచ్చే నేతను కోల్పోయామని ఆవేదన జెడ్పీటీసీ నూకరాజు మృతదేహానికి నేతల నివాళి కన్నీటి పర్యంతమైన ప్రజలు -
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ముందు బైఠాయింపు
నర్సీపట్నం: కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నర్సీపట్నం ఏరియా ఆస్ప త్రికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఏరియా ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. జెడ్పీటీసీ కుటుంబానికి న్యాయం చేయా లని, బాధితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్యకు పోలీసులు బాధ్యత వహించాలని, జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, న్యాయం జరిగేంతవరకు ఇక్కడ నుండి కదలబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని గతంలో అనేకసార్లు జెడ్పీటీసీ నూకరాజు ఫిర్యాదు చేసినా పోలీసులు ప ట్టించుకోకపోవడమే హత్యకు దారి తీసిందన్నా రు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు గాడి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు -
పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూశాఖకు సంబంధించిన పలు ఆంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పెండింగ్లో ఉన్న భూముల రీసర్వే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి,వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అన్నదాత సుఖీభవ పథకంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల మ్యూటేషన్లను పూర్తి చేయాలన్నారు. ప్రజా పరిష్కార వేదిక ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జీవో నంబర్ 30 దరఖాస్తుల అనుమతుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని,జీవో నంబర్ 23 ద్వారా అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాలు అందించేందుకు గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం పరిహారం అందించే వరకు చట్టప్రకారం రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని, పౌరసరఫరాల సేవలను ఆన్లైన్లో పొందు పరచాలని ఆదేశించారు. ఓడీఎఫ్ జిల్లాగా మార్చాలి బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా మార్చేందుకు అధికారులు శ్రమించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు,ఆర్డబ్ల్యూఎస్,ఆరోగ్యశాఖ,గృహనిర్మాణం తదితర ఽశాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సిబ్బంది ఇంటింటా తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్లపై పరిశీలన జరపాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక స్థలాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని,హైరిస్క్ గర్భిణులను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యసేవలు కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి సబ్కలెక్టర్ లోకేశ్వరరావు,డీఆర్వో పద్మలత,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూటమి పాలన వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువజన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మన రాజకీయ భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన మార్గం కూడా ఇదే అవుతుందని, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), అల్లు అవినాష్(విజయనగరం), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జగుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్ రావు, సత్యం నాయుడు, శివాజీ చక్రవతి, వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద వాళులర్పిస్తున్న ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ్డ అదీప్రాజ్, చిత్రంలో జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చందు మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్, చిత్రంలో జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చందు -
రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాను మృతి
● ఆరుగురికి తీవ్రగాయాలు ● విధుల్లో చేరేందుకు వస్తుండగా ఘటన చింతూరు: సెలవుపై వెళ్లి ఒకరోజు ముందువరకు ఆత్మీయులతో సంతోషంగా గడిపిన ఆ జవాన్లు సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లోకి చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చింతూరు మండలం గొర్లగూడెం వద్ద జాతీయ రహదారి–30పై మంగళవారం తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన గౌరవ్కుమార్ పాండే(43) అనే బీఎస్ఎఫ్ జవాను మృతిచెందాడు. ఒడిశాలోని బలిమెలలో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ 142 బెటాలియన్కు చెందిన ఆరుగురు జవాన్లు సెలవులపై స్వగ్రామం వెళ్లారు. సెలవులు ముగియడంతో వీరంతా రైలులో సోమవారం రాత్రి ఖమ్మం చేరుకుని అక్కడినుంచి కారులో ఒడిశాలోని బలిమెలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారుఝామున చింతూరు మండలం గొర్లగూడెం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి కల్వర్టును ఢీ కొంది. కారు ముందుభాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గౌరవ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, కానిస్టేబుళ్లు అభితాబ్సింగ్, దేవ్కుమార్, జమీల్, గుర్జీత్సింగ్, వాసవభవత్తో పాటు వాహన డ్రైవర్ అజిత్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికి చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
కాఫీ
విరగ్గాసినసాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీతోటలు ఈఏడాది కూడా విరగ్గాసాయి. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో కాఫీ తోటలు కళకళలాడుతున్నాయి. దీంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే అధికంగా వర్షాలు కురవడంతో కాఫీతోటలకు మేలు చేసింది. ముందస్తు పూతతో పాటు కాయ దశ ఏర్పడడంతో అధిక దిగుబడులు వస్తాయని కాఫీ రైతులు ఆశిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల పరిధిలో 2.20 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సాగు చేస్తుండగా, 1.50 లక్షల ఎకరాల తోటలు ఫలాసాయం ఇస్తున్నాయి.ఈ ఏడాది మరో 1000 ఎకరాల్లోని మొక్కలు కొత్తగా ఫలసాయం ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో గత ఏడాది కన్న దిగుబడులు పెరుగుతాయని కేంద్ర కాఫీబోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు తెలిపారు. గత ఏడాది ఇలా... 11 మండలాల పరిధిలో గత ఏడాది 15వేల టన్నుల క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు మార్కెటింగ్ చేశారు.ఐటీడీఏ ఆధీనంలోని మాక్స్ సంస్థ, గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, జీసీసీ, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా బెంగళూరు మార్కెట్లో భారీగా కాఫీ గింజల వ్యాపారం జరిగింది. గత ఏడాది సీజన్ చివరిలో కిలో పాచ్మెంట్ కాఫీ గింజలకు రూ.500 వరకూ ధర పలికింది. మొదట్లో విక్రయించిన రైతులకు లాభాలు తగ్గగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో విక్రయించిన రైతులు మాత్రం మంచి లాభాలు పొందారు. ఎకరం కాఫీ తోటకు 150 కిలోల వరకు దిగుబడి రావడంతో రైతులు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పొందారు. నాణ్యమైన కాఫీ గింజలు కావడంతో మన్యం కాఫీకి గిరాకీ ఏర్పడింది. ఈ ఏడాది కాపు అధికం ఈఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కాపు ఆశాజనకంగా ఉంది. పూత,గింజ దశ త్వరగా రావడంతో కాపు అధికంగా ఉంది. ప్రస్తుతం కాఫీ పంట పండ్ల దశలో కళకళాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు కూడా కాఫీ పంటకు ఎంతో మేలు చేశాయి. నవంబర్ మొదటి వారం నుంచి గిరిజన రైతులు కాఫీ ఫలసాయం సేకరణకు సిద్ధమవుతున్నారు. పండ్ల దశలోనే కొనుగోలుకు ఐటీడీఏ మాక్స్, నాంది, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సిద్ధమవుతుండగా, పార్చ్మెంట్ గింజలు, చెర్రీ రకాన్ని కొనుగోలు చేసేందుకు జీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. మరో వారం రోజుల్లో పండ్లు, గింజల ధరలను ప్రకటించనున్నాయి. ఈఏడాది కూడా సుమారు 16వేల టన్నుల కాఫీగింజల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. కిలో రూ.500కుకొనుగోలు చేయాలి కాఫీతోటలకు కాపు అధికంగానే ఉంది. గత ఏడాది వలే అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వం జీసీసీ ద్వారా కిలో రూ.500 ధరతో పాచ్మెంట్ కాఫీ గింజలను కొనుగోలు చేయాలి. ఐటీడీఏ కూడా కాఫీ పండ్ల కు కిలోకు రూ.100 ధర చెల్లిస్తే కాఫీ రైతులకు మేలు జరుగుతుంది. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం నేత, గుర్రగరువు, పాడేరు గిట్టుబాటు ధర కల్పిస్తాం కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంగా అధికారులను సమాయత్తపరుస్తున్నాం. గత ఏడాది గిరిజన రైతులు మంచి లాభాలు పొందారు. జీసీసీ కూడా గిట్టుబాటు ధరతోనే కొనుగోలు చేసింది. ఈ సారి కూడా కాఫీ అమ్మకాల ద్వారా అధిక ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకుంటాం. – ఎ.ఎస్.దినేష్కుమార్, కలెక్టర్ పండ్ల దశలో కాఫీతోటలు అఽధిక దిగుబడులపై రైతుల ఆశలు గత ఏడాది 15వేల టన్నుల కాఫీ గింజల దిగుబడి ఈఏడాది మరింత పెరిగే అవకాశం -
యారాడ బీచ్లో ఇద్దరు యువకుల గల్లంతు
పెదగంట్యాడ: యారాడ తీరంలో సరదాగా గడుపుతున్న ఇద్దరు యువకులు సముద్రపు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు మూడు ద్విచక్ర వాహనాలపై ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో యారాడ తీరానికి చేరుకున్నారు. వీరంతా సముద్రం వద్ద ఇసుకలో ఆటలాడుతుండగా, వారిలో ఇద్దరు.. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న జీవీఎంసీ 76వ వార్డుకు చెందిన బొత్స పవన్కుమార్ (26), డిగ్రీ చదువుతున్న గాజువాక కై లాస్నగర్కు చెందిన పగడాల గణేష్ (17) సముద్ర స్నానానికి దిగారు. ఈ సమయంలో సముద్రపు కెరటాల ఉధృతి పెరగడంతో వారు లోపలికి కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి గాలించినప్పటికీ యువకుల ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘డ్యూడ్’కి అద్భుత రెస్పాన్స్
డాబాగార్డెన్స్: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’.. దీపావళి కానుకగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తి శ్వరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మమితా బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్బస్టర్ సక్సెస్ను అందుకుని, హౌస్ఫుల్ కలెక్షన్లతో విజయవంతమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ ’దివాళీ టూర్ను చేపట్టారు. తమ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖ విచ్చేసిన హీరో ప్రదీప్ రంగనాథన్.. నగరంలోని రామా టాకీస్, సంగం శరత్ థియేటర్లలో ప్రేక్షకులతో ‘డ్యూడ్ దివాళీ బ్లాస్ట్’ పేరుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమిళనాడులోనూ గత చిత్రాల కంటే ‘డ్యూడ్’కు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ‘నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్లు ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన దర్శకుడికి, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సమస్యలతో సతమతం
కొయ్యూరు: మండల కేంద్రం రాజేంద్రపాలెం ప్రధాన రహదారికి డ్రైనేజీ లేకపోవడంతో వర్షం కురిస్తే నీరు రోజుల తరబడి నిల్వ ఉండిపోతుంది. గోతుల్లో చేరడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం కురిస్తే రాజేంద్రపాలెం ఆస్పత్రికి వెళ్లే దారి, వినాయకుని ఆలయం సమీపంలో నీరు రోజుల తరబడి నిల్వ ఉంటుంది. మురుగునీరు రోడ్లపై పారుతోంది. తీవ్ర దుర్గంధంతో సతమతమవుతున్నాని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ కాగితాలకే పరిమితం కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు నాలుగు కిలోమీటర్ల మేరకు రహదారిని మూడున్నర మీటర్ల నుంచి ఏడు మీటర్లకు విస్తరించే అవకాశం ఉంది. రోడ్డు విస్తరణ జరిగిన తర్వాతనే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం మంచిదని భావిస్తున్నారు. కాని రహదారి విస్తరణ విషయం ఏళ్లతరబడి కాగితాలకు పరిమితమైందని పలువురు చెబుతున్నారు. ప్రతీ మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేయాలనే నిబంధన ఉన్నా ఇక్కడ అమలు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణ చేయకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేస్తే రోడ్డు విస్తరణ పనుల తర్వాత వాటిని తొలగించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. చీడిపాలెం పంచాయతీ సింగవరం నుంచి రాజేంద్రపాలెం శివారు సూరేంద్రపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేరకు డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ఒక వైపు కొంత దూరం వరకు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించాలని వారు కోరుతున్నారు. పాడేరు రూరల్: మండలంలో కుజ్జేలి పంచాయతీ ది.గుమోదపుట్టు నుంచి వై.మోదపుట్టు మీదుగా హుకుంపేట మండలం అండిబ, భీమవరం, బాకురు, పాడేరు మండలం డల్లాపల్లి, సలుగు పంచాయతీ కేంద్రం వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. గతేడాది ప్రారంభమైన వంతెన పనులు అర్ధంతరంగా నిలిచాయి. ఈ రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఈ మార్గమే ప్రధానం. గోతులు, కోతకు గురైన రహదారితో ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అత్యవసర సేవలు సకాలంలో అందక పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై పాడేరు ఎంపీడీవో తేజరతన్ మాట్లాడుతూ రహదారి మరమ్మతుకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.అధికారులు స్పందించాలి వర్షం కురిస్తే అనేకచోట్ల నీరు నిల్వ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. డ్రైనేజీలు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణంపై దృష్టి సారించాలి. – రాజుబాబు, రాజేంద్రపాలెం అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన దారులతో ఇక్కట్లు వర్షం కురిస్తే నిలిచిపోతున్న నీరు రహదారి విస్తరణ జరగక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు -
ట్రంప్ వాణిజ్య యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
డాబాగార్డెన్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నిటిపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి లోకనాథం ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జగదాంబ జంక్షన్ సమీపాన కార్మిక భవనంలో ఎండీ ఆనంద్బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ట్రంప్ విధించిన టారీఫ్ సుంకాల వల్ల మన దేశంలోని వ్యవసాయ రంగం ధ్వంసమై, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోందన్నారు. సేవా రంగం గందరగోళంలో పడి మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్, పట్టు వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దీని ఫలితంగా ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం రోడ్డున పడి ఇంటా బయటా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, విద్యార్థులు, యువత భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆయన పేర్కొన్నారు. మన దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందిపుచ్చుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ట్రంప్ అడుగులకు మడుగులొత్తే లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తోందని లోకనాథం విమర్శించారు. భారత్ నుంచి దిగుమతయ్యే టెక్స్టైల్, దుస్తులు, రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, లెదర్, వజ్రాభరణాలు వంటి అన్నింటిపైనా ట్రంప్ ప్రభుత్వం సుంకాలు పెంచిందన్నారు. గతంలో 2.5 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచడం వల్ల దాదాపు 7 లక్షల కోట్లకు పైగా భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేశారు. మన ఉత్పత్తులకు మార్కెట్ తగ్గడంతో పరిశ్రమలు, సేవారంగం దెబ్బతిని, ఉద్యోగులు, కార్మికులు వీధిన పడతారని ఆయన వివరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఉపాధ్యక్షులు తిరుకోటి చిరంజీవి, బొమ్మల రఘురామ్, కె. రంగమ్మ, కె. క్రాంతిబాబు, ఎ. తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపల్లి లోకనాథం -
క్రికెట్ పోటీల విజేత విశాఖ రెవెన్యూ జట్టు
విశాఖ స్పోర్ట్స్: జోన్–1 రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ టైటిల్ పోరులో విశాఖ రెవెన్యూ జట్టు ఏడు వికెట్ల తేడాతో అనకాపల్లి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. రైల్వే స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో జోన్ పరిధిలోని ఆరు జట్లు పోటీ పడగా ఆదివారం ఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనకాపల్లి జట్టు 16 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. విశాఖ కెప్టెన్ రాజేంద్ర నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ బెస్ట్గా నిలిచాడు. ప్రసన్న కుమార్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా విశాఖ జట్టు 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. భవానీశంకర్ 36 పరుగులతో రాణించాడు. -
ముస్తాబవుతున్న శివాలయాలు
మహారాణిపేట: ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శివనామ స్మరణలు, దీపాల సందళ్లతో నెల రోజుల పాటు ఆలయాలు కళకళలాడనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచే ఆలయాల్లో ఆకాశ దీపం వెలిగిస్తారు. శివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కోసం జిల్లాలోని శివాలయాలను దేవాదాయ శాఖ ముస్తాబు చేస్తోంది. మంగళవారం నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయి. ఏర్పాట్లపై దృష్టి : దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ ఇన్చార్జ్ ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, పందిళ్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దీపాలు పెట్టే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏసీ ప్రసాదరావు సూచించారు. కార్తీక మాసంలో విధులు నిర్వహించడానికి సుమారు 100 మంది ప్రత్యేక సిబ్బందిని వివిధ దేవాలయాల్లో నియమించారు. జిల్లా పరిధిలో భక్తులు అధికంగా వచ్చే 9 ప్రధాన శివాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించామని, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఏసీ ప్రసాదరావు తెలిపారు. కార్తీక సోమవారాల ఏర్పాట్లను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్తీక సోమవారాలు ఈనెల 27 (మొదటి), నవంబర్ 3 (రెండో), నవంబర్ 10 (మూడో), నవంబర్ 17 (నాలుగు). కార్తీక పౌర్ణమి/జ్వాలా తోరణం: నవంబర్ 5 పోలి స్వర్గం: నవంబర్ 21 -
హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు
ముంచంగిపుట్టు: జీవో నెంబర్–3ను ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని సీపీఎం నేతలు నారాయణ, జీనబంధు, సీతారాంలు కోరారు. మండలంలోని కరిముఖిపుట్టు పంచాయతీ నందిమెట్ట గ్రామంలో సీపీఎం నేతలు ఆదివారం పర్యటించారు. జీవో నెంబర్–3 రద్దుతో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల కలగనున్న నష్టాలను గ్రామస్తులకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంతో పాటు జల వనరులు కాలుష్యమవుతాయన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
పాడేరు : జీఎస్టీ తగ్గింపుతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి పెరిగిందని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆకాశ దీపాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ శ్రీపూజ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడంతో పండగలను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్నుదొర, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య శాఖ ఉప కమిషనర్ పద్మజ, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు రమేష్కుమార్, నూకరాజు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలుపాడేరు రూరల్: జీఎస్టీ సంస్కరణలతో అన్నివర్గ ప్రజలకు మేలు జరుగుతుందని వాణిజ్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.రమేష్కుమార్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన పోస్టర్ను పాడేరు వాణిజ్యశాఖ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ అజీజ్, జీఎస్టీ అధికారులు శేషగిరి నాయుడు, రజినీకాంత్, ప్రసాధ్, ఎగ్జిక్యూటివ్ ట్యాక్స్ అసిస్టెంట్ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నత్త నడకన ఈ–క్రాప్
మహారాణిపేట: పంట నష్టపరిహారం, పంటల బీమా, రుణాలు, సున్నా వడ్డీ, కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ రాయితీలు పొందాలంటే తప్పనిసరి అయిన ఇ–క్రాప్ నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలుత సెప్టెంబర్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో దీన్ని అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ–క్రాప్ బుకింగ్లో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా నెట్వర్క్ సమస్యలు, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వ యం లోపం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత ఆలస్యానికి కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా భూమి రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇ–క్రాప్ బుకింగ్లో జిల్లాలో ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయింది. జిల్లాలో 11,599 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 75 శాతం అంటే 8,247 ఎకరాల్లో ఇ–క్రాప్ నమోదు పూర్తయ్యింది. నెలాఖరునాటికి పూర్తి : జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి మాట్లాడుతూ... ఈ–క్రాప్ ద్వారా ఏ రైతు ఏ సర్వే నంబర్లో ఏ రకం పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం ఇ–క్రాప్ నమోదు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు సులభంగా అందేందుకు రైతులు అధికారులకు సహకారం అందించాలని ఆయన కోరారు. -
100.5 కిలోల గంజాయి స్వాధీనం
● ఏడుగురు నిందితుల అరెస్టు ● వివరాలను వెల్లడించినఏఎస్పీ నవజ్యోతి మిశ్రా చింతపల్లి: జిల్లా నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 97 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.ఆదివారం చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చింతపల్లి సర్కిల్ పరిధి లోని అన్నవరం పోలీసులు బెన్నవరం పంచాయతీ గొడ్డుగుర్రాలుమెట్ట గ్రామం వద్ద ఆదివారం ఉదయం వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. అదే సమయంలో ముందుగా పైలెట్గా రెండు ద్విచక్ర వాహనాలు,అనంతరం కారు, వ్యాన్ రావడంతో తనిఖీ చేసినట్టు తెలిపారు. కారులో ఐరన్ షీట్ల కింద గంజాయి ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి 97 కిలోల గంజాయితో పాటు 1.07 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, వ్యాన్ను స్వాధీ నం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో తొమ్మిది మందికి సంబంధం ఉందని, వారిలో నలుగురు తెలంగాణా,ఇద్దరు ఒడిశా, ముగ్గురు చింతపల్లి మండలానికి చెందిన వారున్నారు.వీరిలో ఏడుగురి ని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్బాబు,అన్నవరం ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. గంజాయితో ముగ్గురి అరెస్టు జి.మాడుగుల: నుర్మతి వెళ్లే రోడ్డులో బైక్పై తరలిస్తున్న 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. మండలంలో నుర్మతి రోడ్డులో తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి గంజాయి, ఒక బైక్,మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.17,500 ఉంటుందని ఎస్ఐ చెప్పారు. -
గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి
జి.మాడుగుల: మండలంలో కుంబిడిసింగి–పెదలోచలి పంచాయతీల మధ్యలో ప్రకృతి అందాలతో కొండల నడుమ ప్రవహిస్తున్న గుర్రాయి జలపాతాన్ని ఆదివారం ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు సందర్శించారు. జలపాత ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జలపాతం పరిసరాలు చాపరాయి కంటే అందంగా ఉన్నాయని, పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందన్నారు. జి.మాడుగుల మండల కేంద్రానికి 3 కిలోమీటర్లు దూరంలో గల ఈ జలపాత ప్రాంతాన్ని అబివృద్ధి దిశగా ముందుకు తీసుకుకెళ్తామని ఆయన తెలిపారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. గుర్రాయి జలపాతం అభివృద్ధి అంశాన్ని కలెక్టర్, ఐటిడిఏ పీవో దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గంగవరం : ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మండలంలో కొమరవరం, కుసుమరా యి గ్రామాల్లో ఆదివారం చైతన్య సదస్సులు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల హక్కులు, చట్టాల పై అవగాహన కల్పించారు. 1/70 చట్టం ఆదివాసీలకు రక్షణ కవచంగా ఉందన్నారు. ఏజెన్సీలో సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, దీంతో అత్యవసర సమయాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురికావా ల్సి వస్తోందని చెప్పారు. ఆదివాసీ గూడెల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతి నిధులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చోడి ప్రదీప్ కుమార్ దొర, పిటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండల రావు దొర, కలముల ప్రసాద్, హనుమంత్ రెడ్డి, శ్రీను, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
చింతపల్లి: దీపావళి సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా మండలస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఆయన మండలపరిషత్, రెవెన్యూ, వైద్య శాఖ ల మండలస్థాయి అధికారులు, బాణసంచా దుకాణదారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ దీపావళి సందర్భంగా మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. చింతపల్లిలో నాలుగు బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. దుకాణదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివ రించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఆనందరావు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఎన్.టి.రామారావు, సీఐ వినోద్బాబు,ఎస్ఐ వెంకటేశ్వర్లు,వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
అరకులోయటౌన్/డుంబ్రిగుడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సామాన్య, పేద విద్యార్థు లకు వైద్య విద్యకు దూరమవుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు.అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు, కొర్రాయి పంచాయతీల్లో, అరకులోయ మండలంలోని మాద ల, బొండాం, సుంకరమెట్ట పంచాయతీ కేంద్రాల్లో ఆదివారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. డుంబ్రిగుడ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలిసంతకాన్ని కొర్రాయి ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ లలిత చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించగా, కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తుండడం దారుణమన్నారు. బినామీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన, కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలు అందజేస్తే, కూటమి ప్రభుత్వంలో చంద్రబా బు రివర్స్ పాలన సాగిస్తున్నారన్నారు. డుంబ్రిగుడ మండల పర్యటనలో భాగంగా జామంగు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణమైన భోజనం అందించాలని అక్కడి డిప్యూటీ వార్డెన్కు సూచించారు. అనంతరం కొర్రాయి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కొల్లాపుట్టు, కొర్రాయి పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్రావు, పి.లలిత, సర్పంచ్లు హరి, గుమ్మ నాగేశ్వరరావు, రామ్మూర్తి, మండల నాయకులు బాకా సింహాచలం, కృష్ణారావు, సోషల్ మీడియా ప్రతినిధి నరసింగరావు, మాజీ మండల అధ్యక్షుడు మల్లేష్, మండల కార్యదర్శి మఠం శంకర్, రామనాయుడు, గురునాయుడు, మాదల, బొండాం, సుంకరమెట్ట పంచాయతీల్లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, అరకులోయ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్కుమార్, ప్రకాష్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, కొర్రా సుమాంజలి, సర్పంచ్ దురి యా భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్కుమార్, శత్రుఘ్న, రామచందర్, మాజీ మండల అధ్యక్షుడు కొర్రా గాసి, పార్టీ మండల కార్యదర్శులు కొర్రా అర్జున్రావు, కామేష్, మాజీ సర్పంచ్లు మోష్యా, ప్రసాద్, సన్యాసిరావు, నాయకులు నరసింహమూర్తి, సుక్రయ్య, అర్జున్ పాల్గొన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
పండగ బిజినెస్ తుస్
● వర్షం ఎఫెక్ట్ ● బాణసంచా విక్రయాలకు వాన దెబ్బ ● ఆందోళన చెందుతున్న వ్యాపారులు సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి: వెలుగు ల పండగ దీపావళి అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. కుటుంబమంతా బాణ సంచా కాలుస్తూ ఆనందిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. అయితే ఈ ఏడాది వ్యాపారుల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. జిల్లాలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తుండడంతో పండగ కళతప్పింది. దీపావళి పండగను పురస్కరించుకుని పాడేరు జూనియర్ కళాశాల మైదానంలో 18 బాణసంచా దుకాణాలకు కలెక్టర్, ఇతర అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రాకర్స్ అమ్మకాలు జరుపుదామని దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. బాణసంచాను భద్రపరిచేందుకు ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్లు కప్పి ఉంచినప్పటికీ తేమశాతం అధికంగా ఉండడంతో వారంతా భయపడుతున్నారు.18 దుకాణాలకు సంబంధించి సుమారు రూ.60 లక్షల విలువైన బాణసంచాను వ్యాపారులు సిద్ధం చేశారు. ఏటా రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంది.ఈఏడాది భారీ వర్షాలు కురవడంతో బాణసంచా వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు ప్రమిదలు, మిఠాయిలను విక్రయించేందుకు వ్యాపారులకు ఏర్పాట్లు చేశారు. జోరువానతో దుకాణాల వద్ద వ్యాపారం జరగలేదు. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.పూజాసామగ్రి అమ్మకాలు జరగకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. కొయ్యూరు సంతలో ముగ్గురు వ్యాపారులు లైసెన్సులు తీసుకుని రూ.లక్షల విలువైన బాణసంచాను విక్రయానికి సిద్ధం చేశారు. భారీగా వర్షం కురవడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శనివారం రాత్రి నుంచి కొయ్యూరులో వర్షం కురుస్తూనే ఉంది.ఆదివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో సంత కూడా సరిగా జరగలేదు. రాజవొమ్మంగి మండలంలో నాలుగు బాణసంచా దుకాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీగా వర్షం కురవడంతో వ్యాపారం జరగలేదు. -
జలపాతం వద్ద ఐఏఎస్ అధికారుల సందడి
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి జలపాతాన్ని పలువురు ఐఏఎస్ అధికారులు ఆదివారం సందర్శించారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి, జైపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సస్యరెడ్డి, జైపూర్ సబ్ కలెక్టర్ తదితరులు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన వ్యూపాయింట్ నుంచి జలపాతం సోయగాలు, ప్రకృతి అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కొండవాలు ప్రాంతం గుండా కింద జలపాతానికి కాలినడకన చేరుకుని కొద్ది సేపు సరదాగా గడిపారు.ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సెల్ఫీలతో ఉల్లాసంగా గడిపారు. కొత్తపల్లి జలపాతం సూపర్ వైజర్ వంతాల అభి,రాజు నిర్వాహకులు వారి వెంట ఉన్నారు. -
అడవి దాటే దారేది ?
రంపచోడవరం: అటవీశాఖ అభ్యంతరాలతో రోడ్ల నిర్మాణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో రంపచోడవరం డివిజన్లో సుమారు 30 రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్వంలో నిర్మిస్తున్న 11, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 15 రోడ్ల నిర్మాణాలున్నాయి. రంపచోడవరం, వై రామవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో పలు రోడ్ల నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో 200 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ● కూనవరం మండలంలో చినార్కూరు నుంచి బోదునూరు వరకూ 4.5 కిలోమీటర్ల రోడ్డును రూ.1.75 కోట్ల వ్యయంతో మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపన చేశారు. రెండు కిలోమీటర్ల రోడ్డుకు అభ్యంతరం లేకపోయినా మిగతా 2.5కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వరదల సమయంలో 15 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కోతులగుట్టలోని పునరావాస కేంద్రానికి రావాలన్నా, పంద్రాజుపల్లి–కోతులగుట్ట రోడ్డు నీట మునిగిన సమయంలో మండ ల కేంద్రం కూనవరం చేరుకోవాలన్నా ఈరోడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ● రాజవొమ్మంగి మండలంలో లోదొడ్డి నుంచి కిండంగి గ్రామానికి గ్రావెల్ రోడ్డు మంజూరు చేశా రు. సుమారు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరయ్యాయి.అనుమతులు లేకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.కిండంగి నుంచి లోదొడ్డి రావాలంటే కాలినడకే శరణ్యం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కోదు సామాజిక వర్గానికి చెందిన దాదాపు వంద కుంటుంబాల వారికి రవాణా సౌకర్యం కలుగుతుంది. ● మారేడుమిల్లి మండలంలో పలు రోడ్లు అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. తాడేపల్లి నుంచి వేటుకూరు వరకూ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన తరువాత మధ్యలో నిలిపివేశారు. సుమారు 15 ఏళ్ల నుంచి రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. ఈ మండలంలో పంచాయతీ రాజ్శాఖ చేపట్టిన సుమారు పది రోడ్ల నిర్మాణాలు అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అటవీశాఖ నుంచి అనుమతులు పొంది రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరుతున్నారు. లోదొడ్డి నుంచి కిండంగి వెళ్లే కాలిబాట అనుమతుల కోసం చర్యలు అటవీశాఖ అభ్యంతరాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అటవీ అధికారులు నేషనల్ పార్క్, భూమి కేటాయింపు వంటి అనేక కారణాలు చెబుతున్నారు. దీంతో రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – చైతన్య, గిరిజన సంక్షేమశాఖ డీఈ -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు చింతపల్లి: గిరిజన రైతులు జీవనియంత్రణ పద్ధతులపై అవగాహనతో పసుపు, మిరియా లు పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. ఉద్యాన పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు అంబాజిపేట ఏఐిసీఆర్ిపీ బయో కంట్రోల్ ఆధ్వర్యంలో జీవనియంత్రణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసుపు,అల్లం మిరియాలు వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించాలన్నారు. టాటా ట్రస్టు సాంకేతిక నిపుణుడు అప్పలరాజు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జి.మాడుగుల: మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.పూర్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయ్కుమార్, సీడీపీవో బాలదేవి, ఏపీవో కొండబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి: స్వఛ్చాంధ్ర సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయబారతి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు కళాశాల పరిసరాలను శుభ్రపరిచి మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు కెజియా రాణి, జగదీష్, రమణ,రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. గంగవరం: స్థానిక గ్రామ సచివాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ గంగాదేవి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, కలుముల అక్కమ్మ మొక్కలు నాటారు. ఎంపీడీవో లక్ష్మణరావు మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నియంత్రిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులకు అవగాహనా కల్పించారు. సత్యనారాయణమ్మ , బుల్లియమ్మ సత్యవేణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.చింతపల్లి డిగ్రీ కళాశాలలో పరిసరాలను శుభ్రం చేస్తున్న విద్యార్థులుబంధవీధిలో స్థానికులకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో పూర్ణయ్య -
మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఐటీడీఏ డీడీ పరిమళ కిల్లోగుడ ఆశ్రమ పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్న డీడీ పరిమళడుంబ్రిగుడ: పాఠశాలల్లో మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ హెచ్చరించారు. మండలంలోని కిల్లోగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా వసతి గదులతో పాటు పరిసరాలు, పాఠశాల రికార్డులు, భోజనం మెనూ చార్ట్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు భోజ నం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యా యు లు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏటీ డబ్ల్యూవో రమణ, ప్రధానోపాధ్యాయుడు ఎల్.వెంకటరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణమూర్తి నాయక్ ● ఇద్దరు పర్యవేక్షక సిబ్బంది, స్టాఫ్ నర్స్కు షోకాజ్ నోటీసులు పాడేరు రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో కొద్దిసేపు మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పర్యవేక్షక సిబ్బందితో పాటు స్టాఫ్ నర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేకపోతే ఉపేక్షించేది లేదన్నారు. మలేరియా నిర్ధారణ రక్తపూతల నమోదు సక్రమంగా నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్కు సూచించారు. డయేరియా, మలేరియా మందులు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యంపై సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం
పాడేరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ బొడ్డపుట్టులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారన్నారు.దానిలో భాగంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల కోసం కళాశాలను మంజూరు చేస్తే ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడు దానిని ప్రైవేట్ పరం చేయాలని యత్నిస్తున్నారని చెప్పారు. ఆ కళాశాలను ప్రైవేటు పరంకాకుండా కాపాడుకునేందుకు కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీందెరి రాంబాబు, సర్పంచ్ గుల్లెలి ఆశ్విజ, ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, కాడెలి, కించూరు, గబ్బంగి సర్పంచులు వనుగు, బసవన్నదొర, వంతల రాంబాబు, గొల్లూరి నీలకంఠం, మండల యువజన అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ సర్పంచ్ నాగరాజు, నాయకులు సుబ్రహ్మణ్యం,బాబుల్ నాయుడు, అర్జున్, నడిపన్న, శ్రీను నాగేశ్వరరావు పాల్గొన్నారు.పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
బాలికల విద్యాభివృద్ధికి కృషి
రంపచోడవరం/గంగవరం : బాలికల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా బాలికా శిశు సంరక్షణ అధికారి ఎం.కవిత అన్నారు. శుక్ర,శనివారాలు రెండు రోజుల పాటు ఆమె రంపచోడవరం డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. గంగవరం మండలంలో గంగవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని రంపచోడవరంలో ఇర్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఆయా పాఠశాలల, విద్యాలయాల్లో వృత్తి విద్యాకోర్సులపై ఆమె ఆరా తీశారు. హెచ్ఎం వరలక్ష్మి, వృత్తి విద్యా ట్రైనర్స్ సుష్మా, భాగ్యలక్ష్మి, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
బంతి...ధరల కాంతి
● దీపావళి సందర్భంగా పెరిగిన ధర ● బుట్టడు పూలు రూ.150 ● కొనుగోలుకు పోటీపడిన వర్తకులు ● గిరి రైతుల ఆనందంసాక్షి, పాడేరు: జిల్లాలో బంతి పూలకు భలే డిమాండ్ ఏర్పడింది. దీపావళి పండగ నేపథ్యంలో మన్యంలోని బంతిపూలకు గిరాకీ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఈఏడాది తొలిసారిగా ఒడిశాలోపలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా పూలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పాడేరు పాతబస్టాండ్లో శనివారంమార్కెట్కు గిరిజనులు భారీగాబంతిపూలను తీసుకువచ్చారు. బుట్టడు బంతి పూలను రూ.150లకు వర్తకులు కొనుగోలు చేశారు. హుకుంపేట, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల మండలాల పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు ఉదయం నుంచే పూల అమ్మకాలను చేపట్టారు. మధ్యాహ్నం వరకు సీతమ్మకాటుక (చిన్నబంతి) రకం పూల వ్యాపారం పోటాపోటీగా జరిగింది. ముద్దబంతి పూలను బుట్ట రూ.100లకువ్యాపారులు కొనుగోలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ పూలను కొనుగోలు చేసి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. ఒడిశా వ్యాపారులు తమ రాష్ట్రానికి వ్యాన్ల ద్వారా పూలను రవాణా చేశారు. పండగవేళ ఆదాయం దీపావళి పండగ సందర్భంగా బంతిపూల అమ్మకాలు పెరగడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించింది. శుక్రవారం నుంచి బంతిపూల ధరలు పెరగడంతో బుట్ట పూలకు రూ.150 వరకూ ధర లభించింది.ప్రతి గిరిజన రైతు పాడేరు మార్కెట్లో రోజుకు ఐదు నుంచి పది బుట్టల వరకు బంతిపూలను విక్రయిస్తున్నారు.కార్తీకమాసం ప్రారంభం కానుండడంతో బంతిపూల ధర మరింత పెరగనుంది.ఒడిశా పూల వ్యాపారులు నేరుగా వాహనాలతో పాడేరు మార్కెట్కు వచ్చి బుట్ట పూలను రూ.150 ధరతో కొనుగోలు చేస్తుండడంతో పోటీ ఏర్పడింది. స్థానిక వ్యాపారులు కూడా అదే ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులకు కలిసి వచ్చింది. గిరిజన రైతులు పూలసేకరణ,అమ్మకాలతో బిజీగా ఉన్నారు. ధర పెరిగింది బంతి పూలకు గిరాకీ ఏర్పడింది. గత వారం బుట్ట ధర రూ.30 నుంచి రూ. 50 వరకు ఉంటే ఈవారం రూ.150 నుంచి రూ.200 పైబడి ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. –బి.చిట్టిబాబు, డి.చింతలవీధి, హుకుంపేట మండలం గిట్టుబాటు ధర లభించింది ఈవారం బంతి పూలకు మంచి ధర లభించింది. ఈవారం నుంచి అయ్యప్ప స్వాముల సంఖ్య పెరగడంతో పూలకు గిరాకీ ఏర్పడింది. దీంతో మాకు గిట్టుబాటు ధర లభిస్తోంది. –కిముడు శాంతికుమారి, రైతు,కుమరిపుట్టు, పాడేరు మండలం. -
అనధికార మద్యం, డ్రగ్స్పై పటిష్ట నిఘా
మహారాణిపేట: జిల్లాలో అనధికార మద్యం అమ్మకాలు జరగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం అందించడానికి గ్రామ/వార్డు కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, శానిటేషన్ సిబ్బంది ఎకై ్సజ్ శాఖకు సహకరించాలన్నారు. గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలను కూడా పసిగట్టి నిరోధించాలని ఆదేశించారు. స్థానికంగా మద్యం తయారీ లేదా కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, లేబుల్ లేని బాటిల్స్ అమ్మకూడదని స్పష్టం చేశారు. తక్కువ రేటుకు వస్తోందని నాసిరకం మద్యం తాగవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం బ్రాండెడ్ మద్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుందని వివరించారు. అనుమతి లేని దుకాణాలు, లైసెన్సు రద్దయిన బార్లు, దాబాలు, అలాగే పాత భవనాలు, చీకటి ప్రదేశాలు, శ్మశాన వాటికల వద్ద మద్యపానం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వయంశక్తి సంఘాల మహిళలకు అక్రమ మద్యం నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం గుర్తించడానికి ప్రభుత్వం ‘ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్’ను తీసుకొచ్చిందని, దీని ద్వారా ప్రతి బాటిల్ను స్కాన్ చేసి అమ్మకాలు చేయాలని సూచించారు. బెల్ట్ షాపుల సమాచారంపై ఎకై ్సజ్ సిబ్బంది చర్య తీసుకోకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. -
అనంతునికి పవిత్రాల సమర్పణ
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవస్వామి ఆలయంలో అనంతుని పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం పవిత్రాలు సమర్పించారు. ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలు, రుక్ష్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవిలకు గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పించారు. ముందుగా కుంతీ మాధవస్వామి, ఆనంత పద్మనాభ స్వాములకు అష్టకలశ స్నపనం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాలను సమర్పించారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి
అడ్డతీగల/గంగవరం/రాజవొమ్మంగి: రంపచోడవరం డివిజన్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అభివృద్ధి చేసేందుకుచర్యలు చేపట్టనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు.పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు శనివారం రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం, బీరంపల్లి,రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి, సింగంపల్లి, గంగవరం మండలంలోని పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి, అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే గిరిజన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాజవొమ్మంగి మండలంలోజాతీయ రహదారి 516ఇకి ఇరువైపులా గల ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఎన్హెచ్కు ఇరువైపుల విశ్రాంతి భవనాలు, సులభ కాంప్లెక్సులు, తాగునీటి సౌకర్యం కల్పన తదితర ఏర్పాట్ల పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పీవో తెలిపారు. వేటమామిడిలో సమస్యల పరిష్కారానికి కృషి అడ్డతీగల మండలం వేటమామిడిలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో తెలిపారు. ఈ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు ప్రాజెక్ట్ అధికారిని కోరారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తహసీల్దార్లు బాలాజీ, దొరకయ్య, సత్యనారాయణ, అడ్డతీగల మండల పరిషత్ అధ్యక్షుడు రాఘవ,గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఐ. శ్రీనివాసరావు, మండల సర్వేయర్ లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
అమలుకు నోచుకోని ఆదివాసీ చట్టాలు
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను గంగవరం: ఆదివాసీల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయన్నారు. ఆదివాసీ చట్టాల అమలు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం కృషి చేయని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ఆదివాసీలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ నాయకులు పీటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, కలుముల ప్రసాద్, చోడి ఏడుకొండల దొర, వేట్ల హనుమంత రెడ్డి, పరద సత్యనారాయణ, కలుముల జోగి రాజు, కారం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి ఊరట
పాడేరు: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తోందని జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అన్నారు.ఽ వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపడుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ ఆర్.పద్మజ, ఇన్చార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు
ఏడీఎంహెచ్వో సరిత ఇర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ఏడీహెచ్ఎంవో సరితరంపచోడవరం: పీహెచ్సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు అడిషనల్ వైద్యఆరోగ్యశాధికారి డాక్టర్ సరిత తెలిపారు. రంపచోడవరం సమీపంలోని ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పిల్లలు అనారోగ్యం బారిన పడితే తక్షణమే ఆస్పత్రికి తరలించాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం స్థానిక హెల్త్వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఆశ్రమ పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధితో సేవలందిస్తున్న అధికారుల బదిలీ తగదు
చింతపల్లి: చింతపల్లి తహసీల్దారును మూడు నెలలకే అకారణంగా బదిలీ చేయడం దారుణమని స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్లు అన్నారు.మండల కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చింతపల్లికి పూర్తిస్థాయి తహసీల్దారును నియమించారన్నారు. దీంతో ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు వేగవంతంగా పరిష్కారమవుతాయని అనుకున్నామన్నారు. చిత్తశుద్ధితో ప్రజా సేవలందిస్తున్న తహసీల్దార్ను విధుల్లో చేరిన మూడు నెలల్లోనే డిప్యూటేషన్ పేరుతో అనకాపల్లి జిల్లాకు బదిలీ చేయడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతానికి వచ్చి సేవలందిస్తున్న అధికారులను బదిలీ చేయడం,ఈ ప్రాంతానికి అవసరమైన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లను మైదాన ప్రాంతానికి తరలించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దారు బదిలీని నిలుపుదల చేయకపోతే మండలంలో గల అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోలార్ పవర్కు సూపర్ బూస్ట్.. జీఎస్టీ 2.0 సాక్షి, విశాఖపట్నం: జీఎస్టీ 2.0 అమలు ద్వారా సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదనకు సూపర్ బూస్ట్ ఇచ్చినట్లని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ప్రచారంలో భాగంగా ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్తో పాటు ఈపీడీసీఎల్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్, ఎస్ఈ జి.శ్యాంబాబు మొక్కలు నాటా రు. అనంతరం పీఎం సూర్యఘర్ రూఫ్టాప్ సోలార్ ప్లేట్స్ ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. అనంతరంఆయన మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపు ద్వారా పునరుత్పాదక శక్తి పరికరాలపై 12 నుంచి 5 శాతనికి తగ్గించడం పెద్ద ప్రోత్సాహకమన్నారు. జీఎస్టీ 2.0 కారణంగా వినియోదారులకు రూ.10 వేలు ఆదా అవుతుందని తెలిపారు. బయో గ్యాస్ యూనిట్ ధరలో రూ.10,000, 5 హెచ్పీ సోలార్పంప్ సెట్ ధరలో కూడా రూ.29 వేల వరకూ ఆదా అవుతుందని వివరించారు. డైరెక్టర్ సూర్యప్రకాష్, ఎస్ఈ శ్యాంబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్క గృహ వినియోగదారులు జీఎస్టీ 2.0, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని, రూఫ్ టాప్పై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాలుష్యం నివారించవచ్చని సూచించారు. కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాసరావు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు. అంతకు ముందు సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులతో కలిసి ఎస్ఈ శ్యాంబాబు జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ విప్లవంలో స్టార్టప్ల కోసం హ్యాకథాన్ సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరా, వినియోగంలో సరికొత్త ఆధునిక విప్లవాన్ని సృష్టిస్తూ.. డిస్కమ్లకు, వినియోగదారులకు ఉపయుక్తమయ్యే స్టార్టప్ల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే నెలలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ), కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. హ్యాకథాన్లో ఎంపికై న స్టార్టప్లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించే అవకాశంతో పాటు విజేతలకు పైలెట్ ప్రాజెక్టులు, 3 డిస్కమ్ల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ హ్యాకథాన్ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ నెల 22వ తేదీ రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సూర్యప్రకాష్, వనజ, డి.చంద్రం, సీజీఎం సుమన్ కళ్యాణి పాల్గొన్నారు. -
70 కిలోల గంజాయి పట్టివేత
డుంబ్రిగుడ: మండలకేంద్రం డుంబ్రిగుడలో శనివారం 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ కె.పాపినాయుడు తెలిపారు. స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒడిశా నుంచి ఆటోలో మైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టుబడినట్టు చెప్పారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి ఆటోతో పాటు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగి లొబ్బొతో పాటు ముంచంగిపుట్టు మండలానికి చెందిన దురియ విజయ్, కొర్రా నీలకంఠంపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో సర్పంచ్ వెంకటరావు ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద శనివారం 45 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఒడిశా వైపు వచ్చిన రెండు బైకులతో వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో చాకచాక్యంగా వ్యవహరించి, నలుగురిని పట్టుకున్నట్టు చెప్పారు. వారి వద్ద ఉన్న రెండు బస్తాలను తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 45కిలోల470 గ్రాముల ఉందని,దీని విలువ రూ. 1.35 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పంపార్లమెట్ల పంచాయతీ నువడోలింబా గ్రామానికి చెందిన కంటెరి జలంధర్, డామా హంతల్, చింతలారి గ్రామానికి చెందిన పటి ఖారా, కొర్రాపుట్టు జిల్లా గంజైపాదర్ గ్రామానికి చెందిన గెన్ను హంతల్లుగా గుర్తించినట్టు తెలిపారు. వారిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి, రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.ఏడుగురు అరెస్టు -
పర్యాటకులకు రక్షణ కల్పించాలి
పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ కొత్తపల్లి జలపాతాన్ని సందర్శిస్తున్న పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. జలపాతాన్ని శనివారం ఆయన సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలు, వసతిపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యూపాయింట్,జలపాత ప్రాంతాలను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ షణ్ముఖరావు, జలపాతం సూపర్వైజర్ వంతాల అభి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
సరిహద్దు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం
ముంచంగిపుట్టు: ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ సరిహద్దులోనిర్మించే జోలాపుట్టు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం పట్టింది.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 10 సంవత్సరాలుగా వంతెన పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేయాలని పలుమార్లు సరిహద్దు గ్రామాల గిరిజనులు అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినా హామీలతో సరి పెట్టారు.చివరికి వంతెన నిర్మాణ వ్యయం పెరగడంతోకాంట్రాక్టర్ పనులు నిలుపుదల చేశారు. 2014 సంవత్సరంలోఅప్పటి కాంగ్రెస్ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి,శిలాఫలకం ఆవిష్కరించారు. రూ. 5 కోట్ల ఎంపీ నిధులతో వంతెన నిర్మాణం ప్రారంభించారు.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. కానీ అప్పటి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనులు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రచారం జరుగుతోందని,కానీ ఈ విషయమై ఒడిశా ప్రభుత్వం ఎక్కడా ప్రకటనలు చేయలేదు. తాత్కాలిక వంతెనపై రాకపోకలు 2006 సంవత్సరంలో వరద నీటి ఉధృతికి సరిహద్దును కలుపుతూ ఉన్న ఐరెన్ వంతెన కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. జోలాపుట్టులో గల జలాశయాలపై ఉన్న వంతెనలపై రాకపోకలు చేసేవారు. అయితే ఈ మార్గంలో రాకపోకల వల్ల జలాశయానికి గండి పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ వాహనాల రాకపోకలనుజలాశయ అధికారులు నిలుపుదల చేశారు. ద్విచక్రవాహనాలు, పాదచారుల కోసం ఆ పక్కనే జలాశయ అధికారులు తాత్కాలిక ఐరెన్ వంతెనను ఏర్పాటు చేశారు. దీనిపై నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే జలాశయం నుంచి నీరు విడుదల చేసినప్పుడు, వర్షాలు కురిసే సమయంలో ఈ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు మూడు కిలో మీటర్లు ప్రయాణం చేసి,జలాశయంపై నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది.సరిహద్దు ప్రజల రవాణా కష్టాలను తీర్చేవిధంగా చొరవ తీసుకోవాలని,వెంటనే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సరిహద్దు వంతెనపై దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసి తమ కష్టాలు తీర్చాలని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గిరిజనులు కోరుతున్నారు.పునాది స్థాయిలో నిలిచిపోయిన వంతెననిధులు మంజూరు చేయాలి వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఇబ్బందులు తొలగుతాయని అనుకొన్నాం. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాం. ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి,నిధులు మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలి. – శేఖర్, జోలాపుట్టు గ్రామస్తుడు. ముంచంగిపుట్టు మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జోలాపుట్టు వంతెన నిధులు ఎప్పుడో వెనక్కి వెళ్లిపోయాయి. టెండర్ కూడా రద్దయింది. స్థానికులు పలుమార్లు వంతెన సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మేం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కోసం వేచి చూస్తున్నాం. – రాయుడు, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ, ముంచంగిపుట్టు మండలం 10 ఏళ్లగా రాకపోకలకు ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ప్రజల అవస్థలు నిధులు వెనక్కి వెళ్లిపోవడంతో నిలిచిన పనులు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్న సరిహద్దు ప్రజలు -
భగ్గుమన్న పాత్రికేయులు
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసన ● లోపాలు ఎత్తి చూపితే అంత కక్ష ఎందుకు?పాడేరు: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ కూటమి ప్రభుత్వ అక్రమాలపై సాక్షిలో వార్తలు రాస్తే యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్తో పాటు వార్తలు రాస్తున్న విలేకరులపై పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేయడం సరియైన పద్ధతి కాదంటూ నినాదాలు చేశారు. సాక్షి పత్రిక కార్యాలయాలతో పాటు విలేకరుల ఇళ్లలో అకారణంగా సోదాలు నిర్వహించడం విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. అక్కడనుంచి పాడేరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. డీఎస్పీ షహబాజ్ అహ్మద్కు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పీడీ చక్రవర్తి, తాంగుల మహేష్, టమికే సునీల్, భాస్కర్, ప్రేమ్కుమార్, జవ్వాది శ్రీను, కంభం మహేష్, పారిజాతం, భీమ్రాజు, రాంబాబు, శోభన్రాజు, శ్రీను, బేరా నానీ, విలేకరులు ఎన్ఎం కొండబాబు, కొంటా దుర్గారావు, శెట్టి కోటేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో.. డాబాగార్డెన్స్ (విశాఖ): ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్టులు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్కి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఎంఆర్ఎన్ వర్మ, ఏపీడబ్ల్యూజే నాయకుడు, పి.నారాయణ్, జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కష్టాల కాలనీలు
రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయి పోలవరం నిర్వాసితుల బతుకులు. సకల సౌకర్యాలు కల్పిస్తామని పదేళ్ల క్రితం ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. సర్వం త్యాగం చేసి ఊరొదిలి వచ్చిన వారు నాలుగేళ్లుగా నరకయాతన అనుభవిస్తూ కాలనీల్లో కాలం వెళ్లదీస్తున్నారు.అసౌకర్యాల నీడలో పోలవరం నిర్వాసితులుఎటపాక: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా వీఆర్పురం మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జీడిగుప్ప, శ్రీరామగిరి గ్రామపంచాయతీల పరిధిలోని ములకపల్లి , కల్తునూరు, ఇప్పూరు, భీమవరం గ్రామాలకు చెందిన కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. అయితే వీరికోసం ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీలో ఆర్అండ్ఆర్ కాలనీలో 329 ఇళ్లను 39.17 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈకాలనీలో బడి, గుడి, పార్కు. బస్టాండ్, అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్, ఆస్పత్రి తదితర భవనాలతో పాటు సీసీ రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలతో కాలనీ నిర్మిస్తామని నిర్వాసితులకు ఆశ చూపారు. కానీ గడిచిన పదేళ్లుగా నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. వారి సొంత గ్రామాల్లో భూములు కోల్పోయిన 80 మంది కొండరెడ్ల రెతులకు 120 ఎకరాల వ్యవసాయ భూమిని కన్నాయిగూడెం పంచాయతీలో ఇచ్చారు. ఈ కాలనీలో ప్రస్తుతం ములకపల్లి, కల్తునూరు, ఇప్పూరు గ్రామాలకు చెందిన 166 నిర్వాసిత కుటుంబాలు ఉంటున్నాయి. వీరిలో కొన్ని కుటుంబాలు గత నాలుగేళ్ల నుంచి దయనీయస్థితిలో కాలం గడుపుతున్నాయి. సౌకర్యాల్లేక.. ● సీసీ రోడ్లు లేక రహదారులన్ని పొదలు, పిచ్చి మొక్కలతో భయానకంగా ఉన్నాయి. ● డ్రైనేజీలు లేకపోవడంతో మురికి నీరంతా ఇళ్లముందు నిలిచిపోతోంది. రహదారులకు అడ్డంగా కాలువలు తీయడంతో మురుగు నీటితో నిండి ఉన్నాయి. ● ఈ కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఆధార్ కార్డు అడ్రస్లు మార్పు చేయకపోవడంతో ఉపాధి హామీ పథకం దూరమైంది. రైతులకు యూరియా, దాణా ఇవ్వడం లేదు. ఇక్కడ వారికి ఇచ్చిన భూముల పట్టాలు ఆన్లైన్లో ఎక్కించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకానికి దూరమవుతున్నారు. ● ఈ కాలనీలో కన్నాయిగూడెం పంచాయతీగా గుర్తించకపోవడంతో వీధి దీపాలు కూడా వేయడం లేదు. ఆధార్ కార్డు మార్పునకు పంచాయతీ కార్యదర్శి రూ.100 డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ● ఇక్కడ ఉండేవారికి రోగమొస్తే చూసేందుకు వైద్య సిబ్బంది ఎవరూ రారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం కూడా లేకపోవడంతో పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు. అటు ఇటు కాని బతుకులు కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు రహదారులు, వీధి దీపాలు లేక ఇబ్బందులు కలగానే ఆధార్ అడ్రస్ మార్పు రేషన్ బియ్యం కోసం వ్యయ ప్రయాస ముంపులోనే భూములు -
కూలి పనులు దొరకడం లేదు
ఇక్కడ వ్యవసాయ కూలి పనులు దొరకడం లేదు. ఆధార్ కార్డు ఇక్కడ అడ్రస్కు మార్చక పోవడంతో మాకు ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించడం లేదు.సొంతూరు వదిలి వచ్చిన మమ్మల్ని ఐటీడీఏ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సర్వం కోల్పోయిన తమ పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదు. – నూతి రమేష్, ములకపల్లిముంపు భూములిచ్చారు భూమికి భూమిగా కన్నాయిగూడెం పంచాయతీలో ఐదు ఎకరాలు ఇచ్చారు. అయితే ఈఏడాది వచ్చిన గోదావరి వరదలకు మూడుసార్లు ముంపునకు గురైంది. పత్తిపంట నాశనమైంది. ఎరువులు, పశువుల దాణా కూడా ఇవ్వడం లేదు. అధార్ అడ్రస్ మార్చకపోవడంతో ఇక్కడ పంచాయతీకి చెందిన వారు కాదంటున్నారు. – కెచ్చల సుబ్బారెడ్డి, కల్తునూరు రేషన్కు రూ.300 ఖర్చు కాలనీకి వచ్చి రెండేళ్లుగా నివాసం ఉంటున్నా. ఇప్పటి వరకు మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇక్కడికి మార్చలేదు. ప్రతి నెలా కల్తునూరు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు రూ.300 రవాణా ఖర్చులు బరాయించాల్సి వస్తోంది. రేషన్ తెచ్చుకోకపోతే కార్డు అక్కడ ఇక్కడ లేకుండా పోతుందని భయపడుతున్నాం. – రమణమ్మ, కల్తునూరు పనికిరాని భూమిచ్చారు పది సంవత్సరాల క్రితం ఇక్కడ నాలుగు ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఆభూమిలో ఉన్న జామాయిల్ చెట్లు కూడా నేటికి తొలగించకపోవడంతో ఆ భూమిలో ఏ పంట వేయాలన్నా ఇబ్బందిగా మారింది. అధికారులు ముందు చెప్పిన మాటలు నేటికి నెరవేర్చకుండా మోసం చేయడం ఏమాత్రం సరికాదు. – కెచ్చల వెంకటేశ్వరరెడ్డి, కల్తునూరు -
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● మాతాశిశు ఆరోగ్యసేవలపై ప్రత్యేక దృష్టి ● డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ సాక్షి, పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందంచడమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు, మాతాశిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్ తెలిపారు. డీఎంహెచ్వోగా ని యమితులైన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానన్నారు. డోలీమోతలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూ పొందిస్తామన్నారు. పీహెచ్సీల వైద్యులు,ఇతర సిబ్బంది, 108, బైక్ అంబులెన్స్ల సిబ్బంది స మన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటా నని తెలిపారు.అన్ని గ్రామాల్లో మాతాశిశు మరణాల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసూతి తేదీకి వారం రోజుల ముందుగానే గర్భిణులను దగ్గరలో ఉన్న ప్రసూతి కేంద్రాలకు తరలించాలని వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని పీహెచ్సీల్లో అత్యవసర మందులు,వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. -
రైతులకు న్యాయం చేసిన తర్వాతే హైవే పనులు చేపట్టాలి
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ● బాధిత గిరిజన రైతులతో కలిసి ఐటీడీఏ వరకు ర్యాలీపాడేరు: పాడేరు నియోజకవర్గం మీదుగా నిర్మిస్తున్న ఎన్హెచ్516–ఇ రహదారి కారణంగా గిరిజన రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వారికి న్యాయం చేసిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గిరిజన రైతులతో కలిసి స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకే వీధి మండలం పెదవలస, రంపుల, చాపరాతిపాలెం, జి.మాడుగుల మండలం వంజరి, ములక్కాయపుట్టు, గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామాల్లో సుమారు 150 కుటుంబాల గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా కాఫీ, మిరియాలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ఈ గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. తాము జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ బాధిత గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఎంతోకొంత ముట్టజెప్పి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదని చెప్పారు. బాధిత గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు హైవే పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ఆయన హెచ్చరించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చింతూరు: మండలంలోని తులసిపాక సమీపంలో సోకలేరువాగు ఒడ్డున శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టేందుకు వీలులేకుండా ఉండడంతో మృతి చెంది సుమారు 15 రోజులకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని కుక్కలు లేదా అడవి జంతువులు పీక్కుతినడంతో ఎడమకాలు లేని స్థితిలో ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, మోతుగూడెం ఎస్.చరణ్నాయక్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా మృతదేహం లభ్యమైన స్థలం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్కు సమీపంలో ఉండడంతో పర్యటనకు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రాజయ్యపేట
మూడో రోజూ నిఘా నీడలో నక్కపల్లి: రాజయ్యపేటలో వరుసగా మూడో రోజు కూడా భారీ పోలీసు బందోబస్తు కొనసాగింది. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన ఉద్యమం ఎప్పుడు ఏ విధంగా మారుతుందోనన్న ముందుజాగ్రత్తతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. మత్స్యకారుల వ్యూహాన్ని పోలీసు సిబ్బంది ముందుగా పసిగట్టలేకపోవడం వల్లే గ్రామంలోకి వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం, ఆమె కాన్వాయ్కు అడ్డంగా తాటి, కొబ్బరి చెట్లు పడేసి ఘెరావ్ చేయడం, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయరహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు ధర్నా చేసి ట్రాఫిక్ను స్తంభింపజేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా షాక్కు గురయింది. గ్రామంలోకి వచ్చి చర్చలు జరుపుతానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా మత్స్యకారులు శాంతించారు. అనివార్య కారణాల వల్ల కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. మత్స్యకారులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి సుమారు వెయ్యిమందికి పైగా పోలీసులను రంగంలోకి దింపారు. ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు నర్సీపట్నం, అనకాపల్లి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రావణిల ఆధ్వర్యంలో పోలీసులు రాజయ్యపేట పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగించారు. వీరు కాకుండా స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ సిబ్బంది కూడా రాజయ్యపేట పరిసరాల్లో ఉన్నారు. మఫ్టీలో కొంతమంది సిబ్బంది గ్రామంలో ఉంటూ మత్స్యకారుల కదలికలపై నిఘా పెట్టారు. గ్రామస్తుల సంభాషణలపై కూడా ఆరా తీస్తున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్దితిని సమీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులంతా నక్కపల్లి, ఉపమాక, బోయపాడు, దొండవాక, హెటెరో కంపెనీ, తదితర ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజయ్యపేట వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల నంబర్లను సయితం నమోదు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పక్క గ్రామాల నుంచి ఎవరినీ రానీయకపోవడంతో రాజయ్యపేట మత్స్యకారులు మాత్రమే దీక్ష కొనసాగిస్తున్నారు. గ్రామంలోను, బల్క్ డ్రగ్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద మినహా మరెక్కడా గుంపులుగా ఉండడాన్ని అనుమతించడం లేదు. కలెక్టర్ వచ్చి వెళ్లిన తర్వాతే దీక్ష కొనసాగించడమా వద్దా అనేది ఇరు వర్గాలు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22న ‘చలో రాజయ్యపేట’ నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నెల 22న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహించనున్నట్టు వీసం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ ఆమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబు, మాజీ ఎంపీ సత్యవతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరవుతారన్నారు. నిలిచిపోయిన బల్క్ డ్రగ్ పనులు బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమం నేపథ్యంలో 15 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లేబర్ వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం తేలే వరకు ఎక్కడా పనులు చేయడానికి వీల్లేదని మత్స్యకారులు డిమాండ్ చేసిన నేపథ్యంలో వారిలో ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. -
ఇంటి పన్నుల వసూళ్లలో జాప్యం చేస్తే చర్యలు
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించి ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పంచాయతీ అధికారులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇంటిపన్ను వసూళ్లలో జాప్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మతో కలిసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, ఎంపీడీవో ప్రేమ్సాగర్, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన
రంపచోడవరం: దేశంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ ద్వారా భారీగా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ఏడు మండలాల సంబంధించిన మహిళా సంఘాల సభ్యులతో వర్తక సంఘాలతో, అంగన్వాడీ తదితర శాఖల అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో స్మరణ్రాజ్ మాట్లాడుతూ రోజు నిత్యావసరాల వస్తువులపై ఐదు శాతం వరకు పన్నులు చాలా వరకు తగ్గినట్టు చెప్పారు. మండలాల పరిధిలో గల సచివాలయాల్లో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కళాకారులతో కళాజాత నిర్వహించారు. ఏపీవో రమణ, ఏడీఏ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరం
గంగవరం: ప్రజలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ చెప్పారు. జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాల మేరకు మండలంలోని జగ్గంపాలెం గ్రామంలో శుక్రవారం జనమైత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, నకిలీ లోన్ యాప్స్, ఓటీపీ వల, మోసపూరిత లింకులు, ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాపై సమాచారం తెలిస్తే 1972 టోలిఫ్రీ నంబర్ సమాచారం ఇవ్వాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అపరిచితులతో ఆన్న్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు వచ్చినప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో త్వరలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు సంబంధించి గిరిజన యువతకు శారీరక ,ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ వివరించారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, గంగవరం ఎస్ఐ బి.వెంకటేష్ , జగ్గంపాలెం సర్పంచ్ లీలావతి, , పద్మావతి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధార్ధదొర, శ్రీనివాసు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుకు వినతి
పాడేరు రూరల్: హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాల జీవోలను రద్దు చేయాలని కోరుతు పాడేరు ఐటిడిఏ పీవో తిరుమణిశ్రీపూజకు ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామల గిరిజనులు కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అరాచకపాలన చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా కొత్త సమస్యలతో ప్రజలకు భయబ్రాంతులు గురి చేస్తుందన్నారు.హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సమగ్ర కమిటి పేరుతో సర్వే నిర్వహిస్తే గిరిజనులతో అడ్డుకుంటమన్నారు. జిల్లాలో అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాత్కలిక పనులు నిలిపివేస్తున్నట్టు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర గిరిజన సలహా మండలి, ఐటిడిఏ పాలక వర్గం, వివిద ప్రభుత్వ చట్టబద్ద వేదికల్లో చర్చించకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు తాత్కలిక పనులు నిలుపుదల చేసామని ప్రకటించడం ఆదివాసీలకు మోసం చేయాడమేనన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేనిపక్షంలో ఈనెల 24న చలో కలెక్టరేట్ పాడేరు కార్యక్రమం పిలుపునిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, గంగరాజు, బాలదేవ్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా లోకేశ్వరరావు
సాక్షి, పాడేరు: పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పాడేరు సబ్కలెక్టర్గా పనిచేసిన సౌర్యమన్ పటేల్ మైదాన ప్రాంతానికి బదిలీ అయిన నాటి నుంచి పాడేరు సబ్కలెక్టర్గా ఎవరినీ నియమించలేదు. పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా ఎస్డీసీ లోకేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న సూరిబాబు, తదితరులుపాడేరు రూరల్: ఉత్సాహపూరిత వాతావరణంలో డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వీటిని శుక్రవారం ఎస్జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 22 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పీఈటీలు కొండబాబు, భవాని, సత్యవతి, రాజులమ్మ, అప్పలరాజు, ప్రసాధ్ పాల్గొన్నారు.బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు రాజవొమ్మంగి: మండలంలోని అమ్మిరేఖల గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న చిన్నబ్బాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివకుమార్ శుక్రవారం తెలిపారు. షాపు నిర్వాహకుడి నుంచి పది– 180 ఎంఎల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. -
డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని డిమాండ్
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ప్రదర్శనమంగళగిరి టౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట శుక్రవారం బ్యానర్తో ప్రదర్శన చేశారు. 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల కేంద్రంగా చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని, ఆ హామీని నేటికీ అమలు చేయలేదని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా అన్ని విధాల నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు. -
సిమెంట్ కాంక్రీట్తో రంగురాళ్ల క్వారీల పూడ్చివేత
డీఎఫ్వో నర్సింహారావు చింతపల్లి: రంగురాళ్ల క్వారీలను సిమెంట్ కాంక్రీట్తో మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డివిజన్ అటవీశాఖ అధికారి వై.నర్సింహారావు తెలిపారు. మండలంలోని సత్యవరం క్వారీని శుక్రవారం సిమెంట్ కాంక్రీట్తో ు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెం కొత్తవీధి మండలంలో సిగనాపల్లి, గుర్రాలగొంది, చింతపల్లి మండలంలో మేడూరు, సత్యవరం, గురుగూడెం, పోతురాజుగున్నలు తదితర గ్రామాల్లో గుర్తించిన అన్ని క్వారీల్లో సొరంగాలను పూర్తిగా సిమెంట్ కాంక్రీట్తో పూడ్చివేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సిగనాపల్లి క్వారీని మూసివేసినట్టు చెప్పారు. డివిజన్లో ఎక్కడా రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రంగురాళ్ల తవ్వకాలను పోత్సహించి, వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్టు చెప్పారు.ఇప్పటికే కొంతమంది వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. -
క్రీడాకారులకు అభినందనలు
సీలేరు: ఏపీ జెన్కో లో ఇటీవల జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చిన సీలేరు కాంప్లెక్సు క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో జెన్కో కాంప్లెక్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 47 సంవత్సరాల తరువాత రాష్ట్రానికి కబడ్డీ పోటీల్లో ఏపీ విద్యుత్ జట్టుకు స్థానం దక్కిందని, ఆ జట్టులో సీలేరుకు చెందిన డీఈఈ శ్రీనివాసులు కెప్టెన్గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ జట్టు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఏపీ జట్టుకు సీలేరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడంతో పాటు, సీలేరుకు చెందిన కొండల శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్చి బెస్ట్ డిఫెండర్గా ఎంపికై నట్టు చెప్పారు. జట్టుకు మేనేజర్గా వ్యవహరించిన సీహెచ్.సురేష్తో పాటు జట్టు కెప్టెన్ శ్రీనివాసులు, శ్యాంసన్, ప్రసాద్ ఎస్ఈ, డీఈఈ రాజేంద్రప్రసాద్, అకౌంట్స్ అధికారి ఈవీవీ సత్యనారాయణ చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు ప్రత్యేక ట్రోఫీలు, మెడల్స్ను అందజేశారు.అదే విధంగా పోటీలో సహకరించిన యువతకు బహుమతులిచ్చారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
పాడేరు రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని పాడేరు, సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసులను బట్టి పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరంలో విద్యుత్ శాఖ డీఈ వేణుగోపాల్కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు, కార్మికులు ఈశ్వరరావు, రాజు,చైతన్య, ప్రసాద్, విజయ్, బుల్లిబాబు తదితరులున్నారు. సీలేరు: ఏపీ జెన్కో కార్యాలయం వద్ద శుక్రవారం జెన్కో కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నేతలు లక్ష్మణరావు, విష్ణుకుమార్రాజు పాల్గొన్నారు. మోతుగూడెం: మోతుగూడెం ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెన్కో సీఈకి అందజేశారు. ప్రేమ్సన్, శ్రీను, దేవుడు, సన్యాసిరావు, రాజేష్, గంగయ్య మహేష్ పాల్గొన్నారు. -
బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ రంపచోడవరం/చింతూరు: రాబోయే దీపావళి పండగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించే బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని రంపచోడవరం సబ్ కలెక్టర్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్ఐలు, ఫైర్ ఆఫీసర్లతో శుక్రవారం చింతూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రశాంతంగా బాణసంచా విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విక్రయాలు జరిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని, వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. దుకాణాలను పాఠశాలలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులకు దూరంగా అధికారులు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దుకాణాల వద్ద ఇసుక బకెట్లు, నీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, పండగ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం దుకాణాలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. -
పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమదానం
ముంచంగిపుట్టు: మండలంలోని కిలగాడ పంచాయతీ కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం శ్రమదానం చేశారు. పాఠశాల ఆవరణలో పరిసరాలు శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. రాళ్లు, సిమెంట్ను సొంత నిధులతో సమకూర్చి పిల్లలు ఆడుకునే విధంగా ప్లాట్ ఫారం నిర్మించారు. తమ పిల్లలు చదువుకునే పాఠశాలలో తమ వంతంలో సహయంగా ప్లాట్ ఫారం నిర్మించామని, శ్రమదానం చేసి పరిసరాలు శుభ్రం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు చెప్పారు. ప్రసుత్తం పాఠశాల చుట్టూ నిర్మించిన ప్రహారీకి ప్లాస్టింగ్ లేదని, ప్రభుత్వం అధికారులు స్పందించి ప్లాస్టింగ్కు నిధులు కేటాయించి, పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎంసీ చైర్మన్ కె.నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు రాంప్రసాద్, కృష్ణమూర్తి, రమేష్పడాల్, నరసింహమూర్తి, రాంబాబు, రమేష్లు తదితరులు పాల్గొన్నారు. వారికి పాఠశాల హెచ్ఎం కె.బంగారయ్య, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, బాబూరావు, సింహాచలం తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైజాగ్ హాఫ్ మారథాన్కు భారీ స్పందన
ఏయూ క్యాంపస్ (విశాఖ): వైజాగ్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్.. వైజాగ్ హాఫ్ మారథాన్ 2025 బీచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 వేల మందికి పైగా పాల్గొన్నారు. మారథాన్లో హాఫ్ మారథాన్ (21.1 కి.మీ), 10 కి.మీ పరుగు, 5 కి.మీ ఫన్ రన్ ఉన్నాయి. ఆర్కే బీచ్ నుంచి రుషికొండ మీదుగా ఈ మారథాన్ను నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రన్లో పాల్గొన్న వారిని అభినందించారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో పాడేరులో 100 కిలోమీటర్లు రన్ కూడా పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు www.vtra.run వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
స్నేహితుడిని పరామర్శించి వస్తూ మృత్యువాత
● లారీ ఢీకొని యువకుడి దుర్మరణం గోపాలపట్నం: చేతికి అందివచ్చి.. ఇంటికి అండగా ఉంటున్న కొడుకు మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆరు నెలల కిందట చెల్లెలి పెళ్లి చేసి మురిసిన అన్నయ్య.. ఈ రోజు కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయాడు. స్నేహితుడిని పరామర్శించి వస్తున్న ఆ యువకుడిని మృత్యువు రోడ్డు రూపంలో కబళించింది. పోలీసులు తెలిపిన వివరాలివి. వేపగుంటలో ఉంటున్న స్నేహితుడికి తేలు కుట్టిందని తెలిసి పరామర్శించేందుకు బుధవారం రాత్రి వెళ్లిన బొడ్డేడ వంశీ (24) తిరిగి ఇంటికి వస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలో నివాసముంటున్న వంశీ స్వస్థలం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చేమలాపల్లి. ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన ద్విచక్రవాహనంపై వేపగుంట నుంచి వస్తుండగా.. ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలో వెనుకనే అతివేగంగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ధాటికి అదుపుతప్పిన వంశీ లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. లారీ అతన్ని సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో వంశీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి రామకృష్ణ లారస్ సంస్థలో హౌస్ కీపర్గా పనిచేస్తున్నారు. బుద్ధిమంతుడైన కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక వారు పడుతున్న వేదన అక్కడివారిని సైతం కంటతడి పెట్టించింది. ఆరు నెలల కిందటే వంశీ తన చెల్లెలు కావ్యకు అన్నీ తానై వివాహం జరిపించాడు. ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మరువకముందే.. అన్న మరణవార్త విన్న కావ్య కన్నీటి పర్యంతమైంది. తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
● కోటి సంతకాల సేకరణ కరపత్రాల ఆవిష్కరణ ● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డుంబ్రిగుడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పుడు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలని కమిటీల నిర్వహణలో అలసత్వ వద్దన్నారు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యతనివ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ మధ్యం ఏరులై పారుతోందని ఆయన ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటివద్దనే అందజేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు రివర్స్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు, కితలంగి, పోతంగి, గుంటసీమల సర్పంచ్లు సుబ్బారావు, గుమ్మ నాగేశ్వరరావు, వంతాల వెంకటరావు, నాయకులు సింహాచలం, నరేష్, అప్పలరాజు, రామ్దాసు, బబిత, నిర్మల, మండల కార్యదర్శి రామ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ గార్డుతోరక్త పరీక్షలా?
● లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ఆవేదన ● మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజం ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్సీలో సెక్యూరిటీ గార్డుతో రక్త నమూనాల సేకరించి, పరీక్షలు చేస్తే ఎలా అని లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ధ్వజమెత్తారు. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని చూపిస్తూ గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఆయన వైద్యసిబ్బంది, ఎంపీడీవో ధర్మారావును ప్రశ్నించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు, కలెక్టర్, ఐటీడీఏ పీవో కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. సీహెచ్సీలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో అంబులెన్సు పాడైందని, కనీసం 108 సేవలు కూడా అందుబాటులో లేవన్నారు. దీనిపై సీహెచ్సీని తనిఖీ చేసి వైద్యసేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ధర్మారావు పేర్కొన్నారు. -
ఏయూ పరువు పాయే..!
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ మరో వివాదం రాజుకుంటోంది. ఏయూలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం అగ్గి రాజేస్తోంది. ఏయూ వీసీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక స్టాళ్ల అనుమతులకు ఉన్నత విద్యా శాఖ లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. ఇది వైస్ చాన్సలర్ పరువు తీయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం విశ్వవిద్యాలయ అధికార, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కల్పించుకోవడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏయూ నుంచి అనుమతులు రాకముందే స్టాళ్ల ఏర్పాటు పనులు చేపట్టడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో అధికార వర్గాల్లో ప్రకంపనలు రేగాయి. దీనిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయినట్లు సమాచారం. ఉన్నత విద్యా శాఖ జోక్యంపై చర్చ సాధారణంగా ఏయూలో కార్యక్రమాల నిర్వహణకు ఏయూ సమావేశ మందిరాలు, మైదానాలు లీజుకు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. ఎవరైనా కార్యక్రమం నిర్వహణకు దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుము చెల్లిస్తే.. ఏయూ వీసీ అనుమతులు ఇస్తుంటారు. గతంలో ప్రైవేటు కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చేవారు. అయితే ఏయూ రాజకీయ వేదికగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు కార్యక్రమానికి ఏయూ, దానికి సంబంధించిన మైదానాల్లో అనుమతులు మంజూరు చేసే అవకాశం లేదు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్లో స్టాళ్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. దీనిపై ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ గ్రౌండ్ను లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ స్వయంగా ఏయూ వీసికి లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ నిర్ణయం తీసుకోకముందే పనులు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ అనుమతుల విషయంలో నేరుగా ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం ఇపుడు వర్సటీలో చర్చకు దారితీసింది. ఏయూ వీసీ నిర్ణయం తీసుకోవాల్సిన్న సర్వసాధారణ విషయంలో రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఏయూ వీసీని అవమానించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21వ తేదీ వరకు అనుమతులు కలెక్టర్ హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్ హెలీప్యాడ్ గ్రౌండ్ లేదా దాని ఎదురుగా ఉన్న పార్కింగ్ మైదానాన్ని తాత్కాలిక స్టాళ్ల ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ వచ్చింది. ఈ నెల 15న ఈ లేఖ రాగా వెంటనే ఏయూ వీసీ కూడా అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కానీ 14వ తేదీ నుంచి అనుమతులు కోరినట్లు ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆయన అనుమతులకు ముందే ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ పార్కింగ్ మైదానంలో మళ్లీ పనులు ప్రారంభించేయడం విషయం. ప్రస్తుతం అనుమతులు ఉండడంతో పనులు జరుగుతున్నాయి. ‘కూటమి’ జోక్యంతో వివాదం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ మైదానంలో స్టాళ్ల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇవ్వకముందే గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీనిపై సాక్షి ‘ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ఫైర్’ అంటూ కథనం ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఏ శాఖ నుంచి అనుమతులు రాకముందే, ఏయూ వీసీ గ్రౌండ్ను లీజుకు ఇవ్వకముందే పనులు చేపట్టడంపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కూటమి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. జిల్లా అధికారులతో పాటు ఏయూ వీసీతో కూడా మాట్లాడి అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులే ఈ మందుగుండు స్టాళ్ల పేరుతో దందాకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో స్టాల్ను రూ.1.5 లక్షలకు బేరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏయూ గ్రౌండ్లో దుకాణాలను ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధి గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. -
గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయం
జి.మాడుగుల: అల్లూరి జిల్లా వ్యాప్తంగా పోలీస్శాఖ నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ తెలిపారు. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువు గ్రామంలో గురువారం జరిగిన వారపు సంతలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ కేర్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాలమేరకు గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు దృష్ట్యా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు వైద్య సదుపాయాలు కల్పించినట్టు ఆయన చెప్పారు. వైద్య శిబిరంలో 700 మందికి డాక్టర్ మురళీధర్, డాక్టర్ సతీష్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ సౌజన్య, ఎంజీసీహెచ్ డాక్టర్ హారిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ లంబోరి అప్పలరాజు, ఎస్ఐ షణ్ముఖరావు, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీ షహబాజ్ అహ్మద్ -
ఆపదలో పల్లె వైద్యం
సాక్షి,పాడేరు: జిల్లాలో పీహెచ్సీ వైద్యుల సమ్మె ప్రభావం రోగుల ఆరోగ్య సేవలపై చూపుతోంది. సమస్యలు పరిష్కారం కోరుతూ గత నెల 29 నుంచి విధులకు దూరమయ్యారు. వీరంతా విజయవాడలో ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా సమ్మెలో ఉండగా 14 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వీసు పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతుల కల్పన, గిరిజన ప్రాంతాల్లో విధులు, 104 సంచార చికిత్స అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీంతో గ్రామీణ వైద్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉన్నందున చాలాచోట్ల రౌండ్ క్లాక్ సేవలు అందుబాటులో ఉండేవి. పీహెచ్సీ వైద్యుల సమ్మె ప్రభావం గ్రామీణ వైద్యసేవలపై లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ● వైద్యసిబ్బంది అందించే సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని రోగులు ముంచంగిపుట్టు, చింతూరు, చింతపల్లి, కూనవరం, అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, పాడేరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓపీ, రక్తపరీక్షల విభాగాల వద్ద బారులు తీరుతున్నారు. ● జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆయుష్ విభాగం నుంచి 30 మంది వైద్యులను కొన్ని ఆస్పత్రులకు తాత్కాలికంగా కేటాయించామని అధికారవర్గాలు చెబుతున్నా అందుకుతగ్గట్టుగా సేవలు అందించలేకపోతున్నారని రోగులు వాపోతున్నారు. ● పీహెచ్సీ వైద్యులు లేకపోవడంతో ఆ భారమంతా వైద్యసిబ్బందిపై పడుతోంది. పీహెచ్సీలకు వస్తున్న నెలలు నిండిన గర్భిణులకు నర్సింగ్ సిబ్బంది ప్రసవం చేస్తున్నారు. కాన్పు కష్టం అనుకుంటే వారిని రిఫరల్ ఆస్పత్రుతలకు తరలిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో గర్భిణులకు నరకంగా మారింది. తల్లీబిడ్డలకు ఆరోగ్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో 18 రోజులుగా రోగుల ఇక్కట్లు వారి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం వైద్యసేవలు పొందేందుకు నానా అవస్థలు పడుతున్న ప్రజలు -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇద్దరు ఎంపిక
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిను లు పి. శ్రావణి సంధ్య, పి. మౌనిక యోగాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా.పి వసుధ తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధి రాజమహేంద్రవరంలో ఈనెల 15న జరిగిన ఎంపికల్లో వీరిద్దరు ప్రతిభ కనబరిచారన్నారు. ఎస్వీవైఏఎస్ఏ యూనివర్సిటీ బెంగళూరులో వచ్చే 24 నుంచి 28 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని వీరి పాల్గొంటారని తెలిపారు. ఇద్దరు విద్యార్థినులను గురువారం వైస్ ప్రిన్సిపాల్ డి.రవికుమార్, పీడీ ప్రభాకరరావు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
అధ్వానంగా డీఆర్ డిపో భవనం
పాడేరు రూరల్: మండలంలో చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ఉన్న డీఆర్ డిపో భవనం అధ్వానంగా మారింది. భవనం ప్రాంగణం పిచ్చిమొక్కలు, తుప్పలతో నిండి ఉంది. విషసర్పాలు, కీటకాలతో ప్రమాదభరితంగా మారిందని స్థానికులు చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పొందేందుకు కార్డుదారులు నానా అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
ఆదివాసీల భూములను ప్రాజెక్ట్లకు ఎలా కేటాయిస్తారు?
● గిరిజన ఆదివాసీ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజం ● ఎర్రవరంలో ఆందోళన చింతపల్లి: గిరిజన ప్రాంతంలోని 5వ షెడ్యూల్లో ఆదివాసీల భూములను హైడ్రోపవర్, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల పేరిట జీవోల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎవరిచ్చారని గిరిజన ఆదివాసీ సంఘ గౌరవ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజమెత్తారు. గురువారం మండలంలోని ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి, కళ్లకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీవోలను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు భూములు, చట్టాలపై పెత్తనం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినిప్పటికీ రాష్ర ప్రభుత్వం ఆ తీర్పులను అమలు చేయడం లేదన్నారు ఏజెన్సీలో ఆదీవాసీ భూములను దోచుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆరోపించారు. ఈ జీవోల వల్ల మన్యం ప్రాంతంలో 250 గ్రామాలు నిర్వాసితులు కావడంతో పాటు 50 వేలమంది గిరిజనులు ఆదివాసీ ప్రాంతానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల జీవోలు రద్దుకు అన్ని ప్రాంతాలు గిరిజనులతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్లు గూడెపు రాజు,వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు తప్పేట్టు లేవు
ఇళ్లకు సంబంధించిన పరిహారం, ఆర్అండ్ఆర్ పరిహారం వచ్చేందుకు ఏపీజీవీబీ ఖాతాను ప్రభుత్వా నికి ఇచ్చాం. ప్రస్తుతం బ్యాంకు ఖాతా నంబర్లు మారుతాయని అధికారులు చెప్పడంతో ఇబ్బందులు తప్పేట్టు లేవు. – పయ్యాల నాగేశ్వరరావు, పోలవరం నిర్వాసితుడు, చింతూరు సమస్యను పరిష్కరించాలి ఏపీజీవీబీ బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నట్టుండి మార్చడం సరికాదు. దీని ప్రభావం నిర్వాసితుల పరిహారానికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలి. – మొహమ్మద్ ఎజాజ్ అహ్మద్, చింతూరు ఉన్నతాధికారుల దృష్టికి సమస్య ఖాతా నంబర్ల మార్పు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. ఇప్పటికే ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్తో మాట్లాడా. సమస్యను పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వివరించాం. – శుభం నొఖ్వాల్, ఐటీడీఏ పీవో, చింతూరు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఏపీజీబీలో విలీనం వల్ల ఖాతా నంబర్లు మారనున్నాయి. ఇప్పటికే ఐఎఫ్ఎస్సీ కోడ్ మారగా ఈ ఏడాది డిసెంబరు అనంతరం ఖాతా నంబర్లు కూడా మారతాయి. అప్పటివరకు పాత నంబర్లలో లావాదేవీలు కొనసాగించవచ్చు. – శ్రీనివాసరావు, ఏపీజీబీ మేనేజర్, చింతూరు బ్రాంచ్ -
పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు?
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఏపీజీవీబీ)ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)లో సాంకేతికంగా విలీనం చేయడం వల్ల పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరిలో అధికశాతం మందికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారానికి సంబంధించి ఇవే ఖాతా నంబర్లు ఇచ్చారు. వీటిని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ నేపథ్యంలో జరిగిన విలీనం వల్ల ఏపీజీవీబీ ఖాతాదారుల నంబర్లు మారుతాయని సంబంధిత అధికారవర్గాలు చెబుతుందటం నిర్వాసితుల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఏపీజీబీలో ఏపీజీవీబీ విలీనంతో సమస్య చింతూరు: పోలవరం ముంపులో భాగంగా చింతూరు డివిజన్లో ప్రాధాన్యత క్రమంలో చేర్చిన 32 గ్రామాల నిర్వాసితుల గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహారం త్వరలోనే అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరంతా గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహార నిమిత్తం గతంలోని ఏపీజీవీబీ ఖాతా నంబర్లను అధికారులకు ఇచ్చారు. దీంతో పరిహారం వారి ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇంతలోనే ఖాతా నంబర్ల మార్పుతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు తమ ఖాతాల్లో పరిహారం జమ అయితే ఫర్వాలేదని, లేకుంటే మారిన ఖాతా నంబర్లను తిరిగి పోలవరం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఐఎఫ్సీ కోడ్ మారితే పెద్ద ఇబ్బంది లేకున్నా నిర్వాసితుల ఖాతా నంబర్లు మారితే మాత్రం వాటిని తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే చాలా సమయం పడుతుందని ఆర్అండ్ఆర్ సిబ్బంది అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున గ్రామీణ బ్యాంకు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్బ్యాంకు (ఏపీజీవీబీ)గా మారింది. ప్రస్తు తం విలీనంలో భాగంగా అదికాస్తా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(ఏపీజీబీ)గా రూపాంతరం చెందింది. చింతూరు డివిజన్లో కూనవరం, వీఆర్పురం, సీతాపురం, నెల్లిపాక, చింతూరులో ఏపీజీబీ బ్యాంకులున్నాయి. ఐదు బ్యాంకుల పరిధిలో సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు ఖాతాదారులుండగా వీరిలో సుమారు 2 వేల మంది పోలవరం నిర్వాసితులు ఉన్నారు. గతంలో నాలుగు మండలాల్లో ప్రధాన బ్యాంకులు లేకపోవడంతో నాగార్జున గ్రామీణ బ్యాంకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో అందరూ ఈ బ్యాంకు ద్వారానే తమ లావాదేవీలు కొనసాగించేవారు. కాలక్రమేణా ప్రధాన బ్యాంకులు అందుబాటులోకి వచ్చినా చాలామంది ఖాతాదారులు ఈ బ్యాంకులోనే తమ ఖాతాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు. వీరిలో వ్యాపారులు, రైతులతో పాటు స్వయం సహాయక గ్రూపుల మహిళలు అధికసంఖ్యలో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రతి మండలంలో ఈ బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు చెందిన లావాదేవీలు అధికంగా జరుగుతుంటాయి. ఇప్పటివరకు ఏపీజీవీబీగా ఉన్న ఈ బ్యాంకు ఈనెల 13 నుంచి ఏపీజీబీగా రూపాంతరం చెందింది. దీనికోసం కొన్ని రోజులపాటు ఆన్లైన్ సేవలను నిలిపివేసి మార్పులు చేపట్టారు. ఈ నేపధ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంతో పాటు ఖాతాదారుల నంబర్లు, యాప్ కూడా మారాయి. అయితే ఖాతా నంబర్ల మార్పుతో ఇప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు., ఈ ఏడాది డిసెంబర్ వరకు పాత ఖాతా నంబర్లతోనే లావాదేవీలు కొనసాగించవచ్చని, తరువాత ఖాతా నంబర్లు మార్చుకోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. -
వైద్య కళాశాలలోఎనస్తీషియా దినోత్సవం
● ఘనంగా ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవం సాక్షి,పాడేరు: ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు, ప్రిన్సిపల్ డాక్టర్ డి.హేమలతాదేవి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు.అత్యవసర వైద్యంలో మత్తు వైద్య నిపుణుల పాత్రను ఆమె వైద్య విద్యార్ధులకు వివరించారు. కోవిడ్ సమయంలో మత్తు వైద్యవిభాగం బాధితులకు విశేష సేవలు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్యనిపుణులు, వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఆందోళనకు టీడీపీ దూరం.. ఊరి సమస్యలోనూ రాజకీయమే!
రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ప్రారంభంలో గ్రామస్తుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది టీడీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నప్పటీకి హోంమంత్రిని అడ్డుకున్న తర్వాత టీడీపీ నాయకులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. మిగిలిన మత్స్యకారులు మాత్రమే ఆందోళన కొనసాగిస్తున్నారు. మత్స్యకారులంతా గ్రామం కోసం, ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు ముఖం చాటేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు, వారి ఫొటోలు, బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు టీవీల్లో, పత్రికల్లో రావడంతో.. మన ప్రభుత్వమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే మీరెలా నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటారని పార్టీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. -
జేసీ అభిషేక్ గౌడకు వీడ్కోలు
ఘనంగా సత్కరించినజిల్లా అధికార యంత్రాంగం సాక్షి,పాడేరు: ఏలూరు జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళుతున్న జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడను జిల్లా అధికార యంత్రాంగం గురువారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికింది. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎఫ్వో సందీప్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మెహిత్, డీఆర్వో పద్మలత అభిషేక్గౌడను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఏడాదిపాటు జేసీ, ఏడు నెలలు ఇన్చార్జి పీవోగా ఆయన గిరిజనుల సంక్షేమానికి ఉత్తమ సేవలు అందించారని కలెక్టర్ దినేష్కుమార్ కొనియాడారు. సన్మాన గ్రహీత అభిషేక్గౌడ మాట్లాడుతూ అందరి సహకారంతో గిరిజన ప్రాంతంలో సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. -
చిరుధాన్యాల సాగుతో లాభాలు
జి.మాడుగుల: చిరుధాన్యాల సాగుతో లాభాలు పొందవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్), ఐఐఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సంగప్ప, డాక్టర్ రఫి చెప్పారు. మండలంలోని సొలభం పంచాయతీలో భీమలోయి గ్రామంలో చిరుధాన్యాల పంటలను వారు బుధవారం పరిశీలించారు. మత్స్యదేవత ఎఫ్పీవో ఆధ్వర్యంలో భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్) అందించిన విత్తనాలతో సాగుచేస్తున్నట్టు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాస్త్రవేత్తలు చిరుధాన్యాల పంటల సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. శ్రీ మత్స్యదేవత ఎఫ్పీవో సీఈవో ఐసరం హనుమంతరావు, అకౌంటెంట్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి గ్రామాల సమస్యలు
కొయ్యూరు: బురుదగెడ్డపై వంతెన నిర్మించాలని కోరుతూ యూ.చీడిపాలెం సర్పంచ్ దడాల రమేష్, గొట్లుపాడు,కంపుమామిడితో పాటు పలు గ్రామస్తులు కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్కు బుధవారం వీరవరంలో వినతిపత్రం ఇచ్చారు. అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీ చాకిరేవులలో కలెక్టర్ దినేష్కుమార్ పల్లెనిద్ర చేశారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బురుదగెడ్డ, ఈదులబంద కాలువలపై వంతెనల కోసం వివరించారు.దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు గ్రామస్తులు తెలిపారు. వి.ఆర్.పురం: మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం చింతూరులో చేపట్టిన గ్రీవెన్స్కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యురాలు బందం విజయలక్ష్మి, సర్పంచ్ పిట్లా రామారావు, జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నవరం బ్రిడ్జి కూలడంతో సుమారు 40 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు గ్రామాలకు అత్యవసర సేవలైన 108 104 సౌకర్యలు లేవన్నారు. త్వరగా బిడ్జి నిర్మించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్ట్రక్చర్ వాల్యుషన్ పరిహారం సంబంఽధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లు పూర్తి చేయాలన్నారు. నాయకులు పోడియం గోపాలరావు, కోటం జయరాజు, బంధం రాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. కూనవరం: చినార్కూరు పంచాయతీలో వర్షాభావ పరిస్థితుల మూలంగా 550 ఎకరాలలో గిరిజన రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదని, 15 స్తంభాలు వేస్తే అయా పొలాల్లోకి విద్యుత్ లైన్ వస్తుందని, విద్యుత్ మోటార్ల సౌకర్యం కల్పిస్తే వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు తొలిగుతాయని ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ సున్నం అబిరామ్లు చింతూరు ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్కు బుధవారం వినతి పత్రం ఇచ్చారు. వరదల కారణంగా కొండ్రాజుపేట, టేకులబోరు రోడ్డు కోతకు గురవుతుందని, మరమ్మతు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ పాయం రంగమ్మ తెలిపారు. గ్రామస్తులు కుంజా లక్ష్మణ్రావు, సోడె వెంకటేష్ పాల్గొన్నారు. -
సమావేశాల్లో వెల్లువెత్తిన సమస్యలు
రాజవొమ్మంగి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్నగిరిజన సంక్షేమశాఖ డీఈ గౌతమి రంపచోడవరంలోని సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ బంధం శ్రీదేవి, వేదికపై జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి తదితరులురంపచోడవరం: రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వచ్చిన రోగులకు సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఏరియా ఆస్పత్రికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణిని కోరినట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఆదికర్మయోగి సర్వే మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఎంతగానో ఉపయోగడపడుతుందన్నారు. రంపచోడవరం మండలంలో అన్ని గ్రామ సచివాలయాలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందాలన్నారు. గృహా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వై.రాజబాబు, పి.జయంతి, వైస్ ఎంపీపీలు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పండా కుమారి, ఎంపీటీసీ సభ్యులు వంశీ, షేక్వలీ, సర్పంచ్లు తదతరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ సమావేశపు హాలులో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన వాడీవేడిగా జరిగింది. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వం, అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీపీ వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, గడుఓకుర్తి సర్పంచ్ చంద్రుడు చెప్పారు. గిరిజన సంక్షేమ డీఈ గౌతమి మండలంలో నూతనంగా చేపట్టనున్న పలు అభివద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సభ్యులు అడ్డుతగిలారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో మంజూరైన అప్పలరాజుపేట తదితర గ్రామాలకు చెందిన రహదారి పనులు నేటికి అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని ముందు పూర్తి చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. పలు గ్రామాల్లో రహదారుల సమస్యలను సర్పంచ్లు మురళీకృష్ణ, చంద్రుడు ప్రస్తావించారు. ఆయా రహదారుల పనులకు ప్రతిపాదనలు పంపినట్టు డీఈ గౌతమి వివరణ ఇచ్చారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పంటకాలువ పూడికతీత పనులకు , జడ్డంగి వద్ద మడేరు అనకట్ట కుడి ఎడమ కాలువ పనులకు నిధులు మంజూరైనా నేటి పనులు ఎందుకు పూర్తికాలేదని పలువురు సభ్యులు నిలదీశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు పలు పనులు ప్రారంభిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు చేపడుతున్న పనులకు ప్రతిపాదనలు, నిధుల మంజూరు వంటి వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు కోరారు. ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, ఎంపీపీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ చంద్రరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ గౌతమి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రి కిటకిట
సాక్షి,పాడేరు: స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రి రోగులతో రద్దీగా మారింది.బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఆస్పత్రికి అనేక ప్రాంతాల నుంచి రోగులు వైద్యసేవలకు భారీగా తరలివచ్చారు.ఓపీతో పాటు వైద్యుల గదులు, రక్తపరీక్షలు, మందుల విభాగాలు రోగులతో కిటకిటలాడాయి. పీహెచ్సీల్లో వైద్యులంతా సమ్మెలో ఉండడంతో వైద్యుల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పీహెచ్సీల నుంచి కూడా రిఫరల్ కేసులు సంఖ్య భారీగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిలో జ్వరాలతో బాధపడే వారే అధికంగా ఉన్నారు. వీరంతా రక్తపరీక్షలకు గంటల తరబడి క్యూలెన్లో నిల్చోవాల్సి వచ్చింది.సాయంత్రం వరకు 700 మంది రోగులకు వైద్యసేవలు కల్పించగా, 330 మంది ఇన్పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. -
ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్(ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మనోజ్ ఝా డీఎస్ఎస్సీ (వెల్లింగ్టన్), యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో విద్యనభ్యసించారు. 1995 జనవరి 1న నౌకాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గోవాలోని నావల్ అకాడమీ, ఇండియన్ నావల్ వార్ కాలేజ్ (గోవా)లో విధులు నిర్వర్తించారు. గన్నరీ నిపుణుడైన మనోజ్ ఝా.. ఐఎన్ఎస్ చైన్నె యుద్ధ నౌకకు కమాండ్ ఆఫ్ డిస్ట్రాయర్గా విధులు నిర్వహించారు. ఏఎస్డబ్ల్యూ కర్వెట్ ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకకు మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్గా, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నేవల్ హెడ్క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు రావడం గర్వంగా ఉందని మనోజ్ ఝా ఈ సందర్భంగా తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
రంపచోడవరం: సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తి స్ధాయిలో అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో వీటి మోసాలపై చైతన్యం కలిగించాలని రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ అన్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, సైబర్ సెక్యూరిటి , ఉమెన్ సెఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల్లో భాగంగా లోన్ యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్. ఓటీపీ ఫ్రాడ్, ఆన్నౌన్ లింక్లు, ఏఐ ఆధారిత సైబర్ మోసాలు గురించి వివరించారు. మహిళలు అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ , వీడియో కాల్స్ వంటివి చేయవద్దని సూచించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకటరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ, పీఎస్ఐ రాజ్కోటి పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దు
అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దని పాడేరు డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ అన్నారు. మండలంలోని బస్కీ పంచాయతీ కేంద్రంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో కలిసి పంచాయతీ ప్రజలతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆయా గ్రామ గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారన్నారు. తప్పిపోయిన విద్యార్థుల అప్పగింత పెదబయలు, పాడేరు, హుకుంపేట మండల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పి.అరవిందు, బి.సాయితేజ, ఎం.అశోక్లు మంగళవారం పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులను డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన విద్యార్ధుల కోసం పాఠశాల ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు వాకాబు చేశారని, వారి ఆచూకీ లభించకపోవడంతో 15వ తేది పెదబయలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పాడేరు ఎస్పీ అమిత్బర్దర్కు వచ్చిన సమాచారం మేరకు పాడేరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో విషయం పొందుపరిచామన్నారు. దీంతో అరకు సంత బయలుకు చెందిన కె.సుబ్రహ్మాణ్యం అనే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలను చేసి వారిని గుర్తించి అరకులోయ సీఐ హిమగిరికి సమాచారం ఇచ్చారన్నారు. దీంతో సీఐ హుటాహటిన అక్కడకు చేరుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారు పాఠశాల నుంచి పరారీ కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా చదువుకోలేక ఒత్తిడికి గురవుతున్నామని, అందుకు పాఠశాల నుంచి బయటకు వచ్చినట్లు వారు వివరించినట్టు తెలిపారు. అనంతరం ఆయా విద్యార్థులను పాఠశాల యాజమన్యం, వారి తల్లిదండ్రులకు అప్పగించిచామన్నారు. సమాచారం ఇచ్చిన సుబ్రహ్మాణ్యంకు నగదు రివార్డు అందించామన్నారు. సీఐ ఎల్.హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మీయ సన్మానం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం పర్యటించిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకు రామకృష్ణను ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు మోదకొండమ్మతల్లిని రామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీతో పాటు స్థానిక వాసవీ క్లబ్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు.అన్నదాన కమిటీకి బియ్యం, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవీక్లబ్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ విగ్రహాలను రామకృష్ణతో పాటు వాసవీ క్లబ్ జిల్లా అధ్యక్షురాలు కొల్లూరి పార్వతి, పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబాలు ఘనంగా ఆవిష్కరించారు. వాసవీ క్లబ్ ప్రతినిధులు శ్రీనాథ శ్రీను, ఉడా త్రినాథరావు, సత్యవరపు సోమరాజు, పుట్టా నానాజీ, శ్రీనాథ శీరిషా, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, వైదేహి తదితరులు పాల్గొన్నారు. -
బధిరులకు సంకేత భాషతో నైపుణ్యం
పాడేరు : విభిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు, వినికిడి లోపం ఉన్న వారిని నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దటం అత్యంత అవసరమని ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ అన్నారు. బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్లో జాతీయ సంకేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బధిరుల కోసం ప్రత్యేకమైన సంకేత భాష (సైన్ లాంగ్వేజ్) ఉంటుందని, దీనిద్వారా పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సంకేత భాష నాట్యం లాంటిందన్నారు. పూర్వకాలంలో భరతనాట్యంలో మాటలు లేకుండా కేవలం ముఖ కవళికలు, చేతుల సంజ్ఞల ద్వారానే మహాభారతం, రామాయణం వంటి కథాంశాలు చెప్పేవారన్నారు. సైన్ లాంగ్వేజ్కు యూనిఫాం లాంగ్వేజ్ ఉందని ఇదోక ఆర్టిస్టిక్ టాలెంట్ అని అన్నారు. ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చన్నారు. ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఆసక్తి గలవారికి కాంటాక్ట్లు ఏర్పాటు చేయడానికి తాము బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇంట్లో ఉన్న బధిరులకు సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తే వారి భావాలను వ్యక్తపరచడానికి వీలవుతుందన్నారు. సంకేత భాష వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ
● కలెక్టర్ దినేష్కుమార్ ● చాకిరేవులలో పల్లె నిద్ర అడ్డతీగల: ప్రభుత్వ పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన చాకిరేవులలో మంగళవారం రాత్రి కలెక్టర్ , రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ తదితర అధికారులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి తాము కనీస వసతులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు పూర్తిస్థాయిలో అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం నుంచి వీరవరం మీదుగా వెదురునగరం వరకూ రహదారి నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వీరవరం నుంచి కొయ్యూరు మధ్యలో కాలువపై వంతెన నిర్మించాలన్నారు. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోనికి తీసుకురావాలని విన్నవించారు. కన్నేరు,ఏలేరు వాగులపై జలాశయం నిర్మిస్తే వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంబందిత అధికారులతో చర్చించి గ్రామ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దొరకయ్య, ఎంపీడీవో ఏవీవీ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రమాద స్థాయికి తాండవ నీటిమట్టం
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం నాటికి 377.4 అడుగులకు చేరింది. మరో అడుగు నీటిమట్టం పెరిగితే ప్రమాద నివారణ చర్యలో భాగంగా గేట్లు ద్వారా నదిలోకి నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఆయకట్టకు నీటిని ఆగస్టు 10న విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో 363.0 అడుగులు మాత్రమే ఉండేది. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం నీటిమట్టం 377.4 అడుగులు ఉంది. రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటిమట్టం 380 కాగా, డెడ్ స్టోరేజీ 345 అడుగులుగా పరిగణిస్తారు. ఇంకా ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువల ద్వారా రోజుకు 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. నీటి మట్టం 378.0 అడుగులకు వచ్చేసరికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. -
గృహ నిర్మాణాలు వేగవంతం
● హౌసింగ్ పీడీ బాబునాయక్ కొయ్యూరు: పీఎం జన్మన్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ బాబు నాయక్ సూచించారు. ఆయన బుధవారం డౌనూరు పంచాయతీ బచింతలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పూర్తయిన గృహాలకు వేగంగా బిల్లుల చెల్లింపునకు కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం చేయవద్దన్నారు.బూదరాళ్ల పంచాయతీలో నిర్మాణాలు కొన్నిచోట్ల వేగంగా జరిగితే మరి కొన్ని చోట్ల జరగడం లేదన్నారు. ఆయన వెంట ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు, వర్క్ ఇనస్పెక్టర్ గిరీష్ పాల్గొన్నారు. -
క్రీడారంగ బలోపేతానికి సమష్టి కృషి
● డీఈవో బ్రహ్మాజీరావు పాడేరు రూరల్: క్రీడా రంగం బలోపేతానికి అంతరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17, 18, 21, 22 తేదీల్లో నిర్వహించే డివిజన్ స్థాయి ఆర్చరీ అండర్ 14,17,19 పోటీలు విజయవంత చేయాలన్నారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. విద్యార్ధులకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహించాలని సూచించారు. ఎస్జీఎఫ్ క్రీడా కార్యదర్శులు పాంగి సూరిబాబు, భవాని తదితరులు పాల్గొన్నారు. -
32 గ్రామాలకు త్వరలోనే పరిహారం: కలెక్టర్ దినేష్కుమార్
గ్రామసభలు పూర్తయిన 32 గ్రామాలకు త్వరలోనే డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ ప్రక్రియ పూర్తిచేసి పరిహారం అందిస్తామని తెలిపారు. పోలవరం పరిహారం జాబితాలో లేని గ్రామాలను రీసర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. గృహాల పరిహారంలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో భాగంగా కాలనీల నిర్మాణాలు తొందరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని, త్వరలోనే పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్ -
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక వ్యూహం
ఎస్పీ అమిత్ బర్దర్పాడేరు : జిల్లాలో గంజాయి సాగు, రవాణా, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తామని ఎస్పీ అమిత్బర్దర్ అన్నారు.బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నిర్వహించిన నెలవారీ సమీక్షలో పోలీసు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. గంజాయితో సంబంధం ఉన్నా, అక్రమ కార్యకలాపాలపైన జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు వారియొక్క పూర్వ చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలన్నారు. ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా ఆశ్రయం పొంది గంజాయి కేసుల్లో పట్టుబడితే ఆశ్రయం ఇచ్చిన వారిపైనా కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా అనుమానస్పదంగా సంచరించినా, అనుమానస్పద కార్యకలపాలకు పాల్పడినా వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గంజాయి సాగు, రవాణ, సరఫరాను అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాను మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేయడం తమ ఏకై క లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. -
వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలి
● లేకుంటే పిల్లలను ఇంటికి తీసుకుపోతాం ● లబ్బూరు ఏకలవ్య పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల హెచ్చరిక ముంచంగిపుట్టు: వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలని లేకుంటే తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోతామని లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. బుధవారం వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్తో సమావేశం అయ్యారు. పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి స్నానం చేసేందుకు సైతం నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పడుతున్న బాధలు చెప్పు కుంటే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. సమస్యల మధ్య తమ పిల్లల చదవులు ఎలా సాగుతాయని ప్రిన్సిపాల్ను వారు ప్రశ్నించారు. వారం రోజుల వరకు అవకాశం ఇస్తామన్నారు. అప్పటికీ పరిష్కరించకుంటే నీటి సమస్య తీరిన రోజే పాఠశాలకు పంపిస్తామని వారు స్పష్టం చేశారు.దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించాలని వారు కోరారు. -
460 టు 690
ఆరు నెలల్లో..పెరగనున్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్ర ఉత్పత్తి సామర్థ్యంరాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పాదనలో ప్రత్యేకత సంతరించుకున్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం మరో మైలురాయిని అధిగమించనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.530 కోట్లతో చేపట్టిన 5,6 యూనిట్లు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ జెన్కో అధికారులు పనిచేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో జరుగుతున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులుటెర్మినల్ యాంకర్ నుంచి వాల్వ్ హౌస్ వరకు పూర్తయిన పెన్స్టాక్ పైపులైన్మెగా వాట్లుమోతుగూడెం: పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పెన్ స్టాక్ పనులు 60 శాతం, సివిల్ పనుల్లో ఫ్లోర్ శ్లాబ్కు సంబంధించి 80శాతం మేర పూర్తయినట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ● ఐదవ యూనిట్కు సంబంధించి కీలకమైన స్పారల్ కేసింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతోపాటు వికెట్ గేటు ద్వారా నీటిని విడుదల చేసే రన్నర్ మీద స్పారల్ కేసింగ్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. వాల్వుహౌస్ నుంచి టెర్మినల్ యాంకర్ వరకు పూర్తిస్థాయిలో పెన్స్టాక్ పైపులైను నిర్మాణం పూర్తయింది. ● ఆరో యూనిట్కు సంబంధించి జనరేటర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యూనిట్లకు సంబంధించి కీలకమైన విడిభాగాలు సకాలంలో బీహెచ్ఎల్ , ఇతర కంపెనీ నుంచి పవర్ హౌస్కు వచ్చేలా జెన్కో అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఎస్సీ పీఈసీ కంపెనీ ప్రతినిధుల అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను బీహెచ్ఎల్, ప్రాజెక్ట్ అధికారుల బృందం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ● ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్లు ఉత్పాదన జరుగుతోంది. 5,6 యూనిట్లు అందుబాటులోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 690 మెగావాట్లకు పెరుగుతుందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు పేర్కొన్నాయి. అండర్ గ్రౌండ్లో పెన్స్టాక్ పైపునకు వెల్డింగ్ చేస్తున్న కార్మికులు వేగవంతం చేశాం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ఐదు, అరు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగవంతం చేశాం. ఇవి పూర్తయితే 460 నుంచి 690 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. – బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో లక్ష్యం మేరకు పూర్తిచేస్తాం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదనపు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. ఇందుకు జెన్కో యాజమాన్యం, డైరక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాం. నిర్మాణ పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి, సూచనలు ఇస్తున్నాం. – సీహెచ్వీ రాజారావు, చీఫ్ ఇంజినీరు, పొల్లూరు చురుగ్గా ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు రూ.530 కోట్లతో చేపట్టిన గత ప్రభుత్వం సివిల్ పనులు 80 శాతం, పెన్స్టాక్ పనులు 60 శాతం పూర్తి ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్న జెన్కో అధికారులు -
కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్
చింతూరు: పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పది గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితులు బుధవారం చింతూరు ఐటీడీఏను ముట్టడించారు. మండుటెండలో ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన వారు ప్రధానగేటుతో పాటు పోలీసులను తోసుకుని ఐటీడీఏలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంటన్నరసేపు మండుటెండలో.. స్థానిక ఐటీడీఏలో కలెక్టర్ దినేష్కుమార్ బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ క్రమంలో వీఆర్పురం మండలం రామవరం, చొప్పల్లి, రామవరంపాడు, సోములగూడెం, శబరిరాయిగూడెం, కొప్పల్లి, అడవివెంకన్నగూడెం, నూతిగూడెం, గుర్రంపేట, చింతూరు మండలం మల్లెతోటకు చెందిన పోలవరం నిర్వాసితులు భారీసంఖ్యలో ఐటీడీఏ వద్దకు వచ్చారు. ప్రధానగేటు ఎదుట బైఠాయించారు. వరుస వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమకు పరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించాలంటూ వారు నినాదాలు చేశారు. వారు సుమారు గంటన్నర పాటు మండుటెండలో ఆందోళన చేశారు, మిన్నంటిన నినాదాలు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన నిర్వాసితులు ప్రధాన గేటుతో పాటు అక్కడ కాపలాగా వున్న పోలీసులను తోసుకుంటూ ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కార్యాలయంలోకి వెళ్లే గేటును మూసేశారు. నిర్వాసితులు అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ రావాలని, తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వారు నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అక్కడికి చేరుకుని నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం అవస్థలు వరదల సమయంలో నెలల తరబడి రహదారులు ముంపులో ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. – మాడి ముత్యాలరావు, రామవరం, వీఆర్పురం మండలంనిత్యావసరాలకు కష్టాలు వరదల సమయంలో నీరు గ్రామాలచుట్టూ చేరడంతో మేము బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఇళ్లలో నిత్యావసరాలు నిండుకుంటున్నాయి. వరద తగ్గిన తరువాత అధికారులు ఇస్తున్నారు. – ఆసు లక్ష్మణరావు, సోములగూడెం, వీఆర్పురం మండలంరూ.పది లక్షలివ్వాలి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పోలవరం పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలి. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి. – పూసం సత్తిబాబు, చొప్పల్లి, వీఆర్పురం మండలంపథకాలివ్వడం లేదు పోలవరం ముంపు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదు. ఎరువులు ఇవ్వకపోవడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింప చేయలేదు. – కారం సుందరయ్య,అడవి వెంకన్నగూడెం, వీఆర్పురం మండలం -
జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు
● కలెక్టర్ దినేష్కుమార్ చింతూరు: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని, దీనివల్ల ఎన్నోరకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై బుధవారం స్థానిక ఏకలవ్య విద్యార్థుల ప్రదర్శనను ఆయనతోపాటు పీవో శుభం నొఖ్వాల్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూనిత్యావసర సరకుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గినా ఇంకా అదనపు ధరలకు సరకులు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


