breaking news
Alluri Sitarama Raju District Latest News
-
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్రంపచోడవరం/ మారేడుమిల్లి : ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలం కోడూరు బొడ్లంక గ్రామాలు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని ధారగడ్డ గుర్తేడు తదిత గ్రామాల్లో పీవో గురువారం పర్యటించారు. మారేడుమిల్లి మండలం కోడూరు గ్రామంలో పీఎం జన్మన్ పథకం ద్వారా మంజూరైన గృహాలను, నీటి కుంటలను పీవో పరిశీలించారు. బొడ్లంక గ్రామంలో పసుపు ప్రోసింగ్ చేసే పరికరం మరమ్మతులు చేయించాలని మహిళా సంఘాలు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పీఓ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గుర్తేడు, ధారగడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు మెనూ అమలు చేసి విద్యార్థులకు ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహార పదార్థాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తంగేడు కోట నుండి రోడ్డు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు తయారుచేసి నివేదికల సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ అధికారి వెంట ఎంపీడీవో ఎం.బాపన్న దొర, డిప్యూటీ ఇంజనీర్ చైతన్య, దుర్గాప్రసాద్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేయాలి
జి.మాడుగుల: పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని పాడేరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి(డిఎస్పీ)షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. మండల కేంద్రంలో గల పోలీస స్టేషన్, సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని, వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో వివిధ విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో నమోదైన వివిధ కేసులను దర్యాప్తు పురోగతిపై ఆయన ఆరా తీసి పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తు పూర్తి చేయాలని తెలిపారు. స్టేషన్లలో రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.స్టేషన్ ఇన్చార్జీ, పోలీస్ సిబ్బందితో విస్తృతంగా చర్చించి ప్రజలకు వెంటనే న్యాయం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చడానికి అవసరమైన మార్గదర్శకాలను తెలియజేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు, స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గుఏయూ దూర విద్యకుచేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యకు చెదలు పట్టింది. ఈ విభాగం అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వీరి నిర్లక్ష్యంతో వందేళ్ల వర్సిటీ పరువు మంటగలుస్తోంది. దూర విద్య పరీక్షల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏటా వేలాది మందికి నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలకు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలు ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు అన్నట్లు ప్రైవేటు స్కూళ్లు కూడా ఇవ్వని విధంగా చేతి రాతతో ప్రశ్నా పత్రాన్ని తయారు చేసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లకు పంపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిల్కు వచ్చిన క్వశ్చన్ పేపర్ను స్టడీ సెంటర్ల నిర్వాహకులు ప్రింట్లు తీసుకుని విద్యార్థులకు పంపిణీ చేస్తుండడం గమనార్హం. చేతి రాతతో హిందీ ప్రశ్నా పత్రం ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నా పత్రాలను చూసిన విద్యార్థులు షాక్కు గురయ్యారు. హిందీ ప్రశ్నా పత్రాన్ని చూసిన వారంతా ఇది ఒరిజినల్ పేపరా? కాదా? అన్న సందేహ స్థితిలో ఉండిపోయారు. చిన్న చిన్న వీధి బడుల్లో కూడా లేని విధంగా చేతి రాతతో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడంపై స్టడీ సెంటర్ల నిర్వాహకులే కాకుండా విద్యార్థులు సైతం కంగుతిన్నారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రతిష్టాత్మక ఏయూ పరీక్షల నిర్వహణ మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా? అని నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఇతర యూనివర్సిటీలు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలను పరీక్షలకు ముందు రోజే స్టడీ సెంటర్లకు, కాలేజీలకు పంపిస్తుంటాయి. కానీ ఏయూ దూరవిద్య అధికారులు మాత్రం చేతితో క్వశ్చన్ పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లు, కాలేజీలకు మెయిల్లో పంపిస్తుండడం విశేషం. ఆ పేపర్ను నిర్వాహకులు జెరాక్సులు తీసి పరీక్షలకు వచ్చే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఏయూ పరువు తీసిన అధికారులు ఏయూ డిస్టెన్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గుర్తింపు లేని స్టడీ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ రోజుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో కూడా చేతి రాత ప్రశ్నా పత్రాలు ఇవ్వడం లేదు. కానీ ఏయూ డిస్టెన్స్ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఏయూకు ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లు ఆదాయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తోంది. అయినప్పటికీ.. పరీక్షా ప్రశ్నా పత్రాలను టైప్ చేసి సెంటర్లకు పంపించకుండా చేతి రాతతో రాసి మెయిల్ చేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
16న సింహగిరిపై నెలగంట
ఆయా పర్వదినాల్లో దర్శనాల వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు నిలుపుదలసింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన టికెట్లు, ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు సహస్రనామార్చన టికెట్లు రద్దు చేసినట్టు తెలిపారు. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమవుతాయని, ఆరోజు మధ్యాహ్నం 1.01 గంటకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. తొలి పాశుర విన్నప పారాయణాన్ని నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆరోజు ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభించవు. 20 నుంచి పగల్పత్తు ఉత్సవాలు : ఈనెల 20 నుంచి 29 తేదీ వరకు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. 30 నుంచి రాపత్తు ఉత్సవాలు ఈనెల 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో తిరువీధి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో రాత్రి 7 గంటల తర్వాత దర్శనాలు లభించవు. జనవరి 11న కూడారై ఉత్సవం జనవరి 11న ఆలయంలో కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దర్శనాలు లభించవు. 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం జనవరి 14న భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు నిత్యకల్యాణం ఉదయం లేకపోవడంతో సాయంత్రం ఉభయదాతలకు అవకాశం కల్పిస్తారు. -
జాతీయ మారథాన్ పోటీలకు గిరిజనుడు ఎంపిక
ముంచంగిపుట్టు: మారథాన్ రన్ జాతీయస్థాయి పోటీలకు మండలంలోని పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్తాడి ప్రసాద్ ఎంపికయ్యారు. విశాఖలోని కొమ్మదిలో ఈనెల 10న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో పీసా రాష్ట్రస్థాయి పోటీల్లో 10 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు.ఈ పోటీల్లో పాల్గొన్న ప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు విశాఖలో జరిగే జాతీయ స్థాయి మారథాన్ రన్ పోటీలకు ప్రసాద్ ఎంపికై య్యారు. గిరిజనుడు ప్రసాద్ అనకాపల్లి జిల్లా నర్సింగరావుపేట లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, జర్రిపడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం. విశేషంగా పూజలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తులు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, భారీ ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు. ఎమ్మెల్యే హవా.. ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులతో పాటు విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వన్టౌన్ సీఐనే అడగండి.. ఆలయ ఈవో పాత్ర నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపించాయి. అమ్మవారి దర్శన ఏర్పాట్ల గురించి ఎవరైనా ఈవో కె.శోభారాణిని ఫోన్లో సంప్రదిస్తే.. ‘నాకు సంబంధం లేదు, అంతా వన్టౌన్ సీఐనే అడగండి’అని బదులివ్వడం చర్చనీయాంశమైంది. ఆలయ నిర్వహణలో ఈవోకు ప్రాధాన్యత తగ్గిందా? లేక పోలీసుల పెత్తనం పెరిగిందా? అన్న అనుమానాలకు ఈ ఘటన తావిచ్చింది. ట్రాఫిక్ అవస్థలు భక్తులకు దేవస్థానం తరపున వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు సీతారామస్వామి ఆలయం వైపు నుంచి దర్శనం కల్పించారు. నగరం నుంచి పాతపోస్టాఫీస్ వైపు వెళ్లే వాహనాలను టౌన్ కొత్తరోడ్డు జంక్షన్ వద్ద మళ్లించారు. సీబీఎం హైస్కూల్, పద్మానగర్ మీదుగా వన్టౌన్ రాణిబొమ్మ వైపు ట్రాఫిక్ మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఘనంగా మార్గశిర మూడో గురువారం పూజలు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆలయంలో ఎమ్మెల్యే అనుచరుల హడావుడి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
గంగవరం : మండలంలోని పాతరామవరం గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై ధాన్యం ఆరబోయడంతో బైక్ అదుపు తప్పి కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన అప్పారావు బైక్పై కొత్తపల్లి వైపు వెళ్తుడంగా రోడ్డుపై వేసిన ధాన్యం కారణంగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైయ్యాడు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడాన్ని నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ధాన్యం రాసులు వేసే రైతులకు ఎస్ఐ వెంకటేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఉత్తమ మహిళా రైతుగా అడపా లక్ష్మి
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు అడపా లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా అగ్రికల్చర్ టుడే మేగజైన్ జాతీయ వ్యవసాయ పత్రిక 2025 ఏడాదికి సంబంధించి ఉత్తమ మహిళా రైతుగా ఎంపిక చేస్తూ అవార్డుకు ఎంపిక చేసింది. అడపా లక్ష్మి ఎం.ఏ బీఈడీ చేశారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈమె కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నారు. కాఫీతోపాటు అంతర పంటలుగా మిరియాలు కమలా, అరటి తోటలు, కాయగూరలు వంటివి పండిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి వ్యవసాయంలో రాణిస్తున్న ఈమెను జాతీయ వ్యవసాయ పత్రిక గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
అరకులోయటౌన్: మండలంలోని గురుకులం బాలికల కళాశాల, బాలికల పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం సాయంత్రం అకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులం బాలికల పాఠశాలలోని తరగతి గదులు, స్టాక్రూమ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం విద్యార్థినులతో మాట్లాడారు. ప్రతీ రోజు మెనూ ప్రకారంగా భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనాలు వండి వడ్డించాలని, కాచిచల్లార్చిన నీటిని అందించాలని వసతి గృహాం నిర్వహాకులకు సూచించారు. విద్యార్ధులకు వండి వడ్డిస్తున్న భోజనాలను రుచి చూసారు. గురుకులం పాఠశాల ప్రహారి శిధిలమైన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు, సిబ్బంది తీసుకురావడంతో పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజతో ఫోన్లో మాట్లాడి బాలికల వసతి గృహంలో ప్రహరీ లేక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలియజేయగా, త్వరలోనే ప్రహరీ నిర్మిస్తామని హామి ఇచ్చారన్నారు. కళాశాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం -
అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
తప్పుడు ఆరోపణలు తగవు
గంగవరం: మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, రంపచోడవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు విలేకరులతో మాట్లాడారు. పిడతమామిడి గ్రామంలో బుధవారం జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు పక్క దారి పట్టించే విధంగా ఎమ్మెల్యే శిరిషా దేవి మాట్లాడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ, నాయకులపై ఎమ్మెల్యే గాని, టీడీపీ నాయకులు గాని ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, కో–ఆప్షన్ సభ్యుడు కె.ఎస్.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, కొత్తాడ, పిడతమామిడి, మొల్లేరు సర్పంచ్లు కామరాజుదొర, నేషం మరిడమ్మ, కుంజం లక్ష్మి, నెల్లిపూడి సొసైటీ మాజీ అధ్యక్షులు సంకుమళ్ల ఏసు, దాసరి వెంకటేశ్వరరావు, యూత్ కమిటీ సభ్యులు సతీష్, రామకృష్ణ, మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు -
విహార యాత్రలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19)కి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవారు. అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అతని తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టిన కారు గీతం ఇంజినీరింగ్ విద్యార్థి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు పొగమంచు వల్లే మార్గం కనిపించక ప్రమాదం వెల్లడించిన పోలీసులు -
ప్రమాదాలకు నిలయంగా హైవే
● మలుపుల్లో ఏర్పాటు చేయని హెచ్చరిక బోర్డులు ● ముందు జాగ్రత్తలు చేపట్టని జాతీయ రహదారి నిర్మాణ అధికారులు ● వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆవేదన పాడేరు రూరల్: ఏజెన్సీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ విజయనగరం నుంచి అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, పాడేరు మీదుగా రాజమహేంద్రవరం వరకు జరుగుతున్న హైవే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ మార్గంలో పాడేరు–హుకుంపేట మధ్యలో ఏడాది వ్యవధిలో సుమారు 50కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. వీటిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదాలు జరగకుండా హైవే అధికారులు మందు జాగ్రత్తలు చేపట్టకపోవడమే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారిని ఆనుకుని మందుబాబుల ఆగడాలు పెరిగినప్పటికీ పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. పాడేరు నుంచి జిమాడుగుల, చింతపల్లి మీదుగా హైవే నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయన్నారు. దుమ్ము, ధూళితో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారన్నారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలేయడం ప్రమాదాలకు ఆస్కారమిస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, హైవే పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు
● బాధ్యతల స్వీకరణ ● బ్రహ్మాజీరావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ సాక్షి,పాడేరు: జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం డైట్ కళాశాలలలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ డీఈవోగా నియమించింది. అలాగే ఇక్కడ డీఈవోగా పనిచేస్తున్న పి.బ్రహ్మజీరావును పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును పాడేరు ఎంఈవో సరస్వతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, పలు మండలాల ఎంఈవోలు,హెచ్ఎంలు,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. -
మన్యంలో చలి తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతలగాలులు విజృంభించడంతో గిరిజనులు తాళలేకపోయారు. ఇంటి నుంచి బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో మంచు గడ్డకట్టి కశ్మీరు వాతావరణాన్ని తలపిం
సాక్షి,పాడేరు: మన్యం వాసులు చలితీవ్రతకు వణికిపోతున్నారు. గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జి.మాడుగుల, డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పాడేరు, పెదబయలు, వై.రామవరం, మారేడుమిల్లి ప్రాంతాల ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీలోని గ్రామాలతోపాటు, పాడేరు మండలం సంగోడి ప్రాంతంలో మంచు గడ్డ కట్టి కశ్మీరు వాతావరణాన్ని తలపించింది. పొలాల్లో కప్పిన టార్పాలిన్లపై మంచు బిందువులు గడ్డకట్టాయి. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతేడాది పాడేరు పరిసర ప్రాంతాల్లో వరి గడ్డి, కార్ల అద్దాలపై పలుచగా గడ్డ కట్టిందని, ఈ ఏడాది మంచు ఐసు గడ్డలను తలపించిందని స్థానికులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మంచు దట్టంగా కురుస్తోంది. చలికి తాళలేక మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రతకు ఇబ్బందులు చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా వీటి ప్రభావం కనిపించింది. జి.మాడుగులలో 3.2, డుంబ్రిగుడలో 3.6, అరకులోయలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, వై.రామవరంలో 8.7, మారేడుమిల్లిలో 9.4 డిగ్రీల కనిష్టఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలో గురువారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంలో చలితీవ్రతకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు చలి వణికించిందని వారు తెలిపారు. స్వెర్టర్లు, మంకీ క్యాప్లు ధరించి, రగ్గులు కప్పుకున్నా చలికి తాళలేకపోయామని వారు పేర్కొన్నారు. దీంతో ఇళ్ల వద్దనే కట్టెలతో మంటలు వేసుకుని, చలి నుంచి కొంతమేర ఉపశమనం పొందామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో 3.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం కాలేదు. మంచు గడ్డల సొలభం సొలభం పంచాయతీలోని సొలభం, ఎస్.కొత్తూరు, భీమలోయ, తాసరిబయలు, వనభరంగిపాడు, వంజంగిపాడు తదితర గ్రామాల్లో మంచు వర్షం కురిసింది. మంచు బిందువులో గడ్డకట్టాయి. వరి కుప్పలపై కప్పిన పాలిథిన్ కవర్లపై మంచు గడ్డ రూపంలో పేరుకుపోయింది. మంచు దట్టంగా కురవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. వాహనాల హెడ్ లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. -
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
చింతూరు: సూపర్ సిక్స్ హామీలంటూ అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం చింతూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సూపర్ సిక్స్ హమీల్లో ప్రధానమైన నిరుద్యోగభృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 1,500 హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముంపు మండలాల్లో వరదలు సంభవిస్తే ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదల సమయంలో బాధితులను పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి సరైన సాయం అందేలా చూడలేదని ఆమె విమర్శించారు. 2022 వరదలను దృష్టిలో వుంచుకుని అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చింతూరుతో సహా 32 గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో చేర్చి పరిహారం అందేలా చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. అప్పటి తమ ప్రభుత్వం కృషి ఫలితంగా ప్రస్తుతం నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ములు జమవుతుంటే అదేదో తామే చేసినట్లుగా కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆమె కోరారు. ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పాటు పడాలని ఆమె సూచించారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు యడమ అర్జున్, మేడేపల్లి సుధాకర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
సీలేరు ఎస్ఈలుగాబాధ్యతల స్వీకరణ
జాకీర్ హుస్సేన్ను సత్కరిస్తున్న అధికారులుహనుమను కలిసిన జెన్కో అధికారులుసీలేరు: ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ ఎస్ఈ (సివిల్)గా షేక్ జాకీర్ హుస్సేన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ కేంద్రం లో పనిచేస్తున్న ఈయనకు ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు నియమించారు. సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్ఈగా హనుమ బాధ్యతలు స్వీకరించారు. ఈయన పోలవరం ప్రాజెక్టులో ఈఈ విధులు నిర్వహిస్తున్న ఈయనను పదోన్నతిపై నియమించారు. వీరిని జెన్ఈ ఈఈలు జైపాల్, భాస్కరరావు, ఏడీ అప్పలనాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
కొత్త పంచాయతీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
● ఇంటి పన్నుల వసూలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం ● జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ కొయ్యూరు: పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను సంబంధిత ప్రాంతాల నుంచి స్వీకరిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం ఆయన కొయ్యూరులో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రామాలు, జనాభా, విస్తీర్ణం ఆధారంగా కొత్త పంచాయతీలకు అవకాశం ఉంటుందన్నారు. తమకు అందిన వినతులను కలెక్టర్ ద్వారా పంచాయతీ రాజ్ కమిషనర్కు పంపిస్తామని తెలిపారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామాల్లో సేవా పన్ను వసూలు చేస్తున్నామన్నారు. ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం రూ.13.56 కోట్లు వసూలు కావలసి ఉండగా రూ.3.71 కోట్లు (27.2శాతం) వసూలు చేసినట్టు చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలను చెత్త తరలింపునకు సంబంధించి సమాచారం ఇస్తున్నారన్నారు. చెల్లింపులు డిజిటల్ కావడంతో అంతా పారదర్శకంగా ఉందన్నారు. పర్యావరణ హితంగా పంచాయతీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటికి కలెక్టర్ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అదనపు నిధులు ఇస్తారన్నారు. చెత్త తరలించేందుకు వీలుగా జిల్లాకు 400 వాహనాలు త్వరలో వస్తాయన్నారు. పంచాయతీల్లో వనరులను గుర్తించి ఆదాయం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ వెయ్యి గృహాలకు ఒక గ్రీన్ అంబాసిడార్గా ఉన్న మహిళలు చెత్తను తరలిస్తారని తెలిపారు. -
ఇల్లు లేని వారితో దరఖాస్తు చేయించండి
అరకులోయ టౌన్: ఇల్లు లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలని హౌసింగ్ పీడీ బాబునాయక్ను స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. గురువారం ఆయన ఎమ్మెల్యేన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మంజూరైన గృహాలు పరిస్థితిని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గానికి పీఎంఏవై పథకంలో సుమారు 33వేల ఇళ్లు మంజూరైనట్లు పీడీ వివరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈఈ రాజుబాబు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అరకుఅసెంబ్లీ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జిల్లా, మండల, పంచాయతీ స్థాయి నేతలు, పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో 53వేల సంతకాల సేకరించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నారు.హౌసింగ్ పీడీకి ఎమ్మెల్యే మత్స్యలింగం ఆదేశం -
ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు
ఎటపాక: గోదావరి నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు స్పందించారు. రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిశీది వేళ నిర్భయంగా అనే కథనం బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసరావు ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సందీప్, వీఆర్వో రామ్మూర్తి ఎటపాక వద్ద గోదావరి తీరం ఇసుక అక్రమ రవాణాకు ఏర్పాటు చేసిన ర్యాంపులను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ట్రాక్టర్లు వెళ్లకుండా పొక్లెయన్లు, ఇతర వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా కందకాలు తవ్వించారు. రెవెన్యూ అధికారుల స్పందనపై వైఎస్సార్సీపీ నాయకులు కురినాల వెంకట్, విజయ్కుమార్ ,నరేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
జాతీయ స్థాయి పోటీలకు గిరిజన క్రీడాకారులు
పాడేరు రూరల్: జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీలకు అరకు, పాడేరుకు చెందిన విద్యార్థులు ఎంపిక అవడం అభినందనీయమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహన్రావు బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ఆయా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబర్చి జాతీయ పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు. ఇందులో భాగంగా మారథాన్ విభాగంలో అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పి.శివాజీ, పాడేరు డిగ్రీ కళాశాల నుంచి డి.ఆనందరాజు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాల నుంచి పి.నీలవేణి, ఎస్.మంజుల, ఎల్.జ్యోతి, బాలుర కబడ్డీ టీమ్కు ఎం.కార్తిక్, జి.లోకనాథ్, పి.హేజెకియా, యు.అనీల్, కె.గణేష్, కె.చంద్రుబాబు, పి.మల్లికార్జున్, బాలికల కబడ్డీ టీమ్కు పాడేరు, అరకులోయ మహిళ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎస్.మంజుల, కె.అనిత, పి.నీలవేణి, పి.జ్యోతి, కె.ఝాన్సీ ఎంపికయ్యారు. ఆయా క్రీడాకారులను బుధవారం పలువురు అభినందించారు. విశాఖలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పీసా క్రీడా పోటీల్లో వారు పాల్గొననున్నారు. -
నూతన పద్ధతుల సాగుపై అవగాహన
రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన రైతులతో మాట్లాడారు. కెవీకె ద్వారా రైతులకు అనేక రకాలైన సేవలు అందుతున్నాయని, ఎటువంటి సమస్యలు, సాగు విధానాలపై శాస్త్రవేత్తలను కలిసి అవగాహన పెంచుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా రైతులు ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 50 మంది గిరిజన రైతులకు ఉచితంగా బరకాలు, కొబ్బరి మొక్కలను అందజేశారు. కెవీకె కోఆర్డినేటర్ డా. రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, పుష్ఫవతి, ప్రవీణ్బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్మా సాగు విస్తీర్ణాన్ని పెంచాలి గూడెంకొత్తవీధి: గిరిజన ప్రాంతానికే ప్రత్యేకమైన రాజ్మా పంట విస్తీర్ణాన్ని రైతులు పెంచాలని గూడెంకొత్తవీధి మండల వ్యవసాయాధికారి గిరిబాబు అన్నారు. జాతీయ ఆహారభద్రతా పథకంలో భాగంగా బుధవారం మండలంలోని అసరాడ గ్రామంలో రాజ్మా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రైతులు సాగు విస్తీర్ణం పెంపుతోపాటు ఆచరించాల్సిన విధానాలను వివరించారు. 90 శాతం రాయితీపై వేపనూనెను రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్ లక్ష్మి, మార్కెట్కమిటీ డైరెక్టర్ శరభన్నపడాల్ నాయకులు రంగారావు, వీఏఏ సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బీమాతో ఆర్థిక భరోసా
ముంచంగిపుట్టు: తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ వచ్చే పోస్టల్ బీమాలు చేసుకొని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని అరకు సబ్ డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ అన్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల పోస్టల్ బీపీఎంలు, ఏబీపీఎంలతో బుధవారం ఐపీవో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే పోస్టల్ జీవిత బీమాలపై గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పోస్టల్ ఉద్యోగులకు సూచించారు. ఐపీపీబీ గ్యాగ్ పాలసీలు చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురుకు సర్టిఫికెట్లు అందించి, అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఐపీవో లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ పోస్టల్ బీమాల ప్రయోజనాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆర్పీఎల్ఐ, పీఎల్ఐలపై తెలియజేసి, అధిక బీమాలు తెరిచి, అరకు సబ్ డివిజన్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఎంవో శ్రీను, ఎస్పీఎం రాజు, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలోయువకుడు మృతి
ఎస్.రాయవరం : పెనుగొల్లు సమీపంలో గుర్తు తెలియని వాహ నం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మేరకు ఎస్ఐ విభీషణరావు బుధవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన ఏడిద దిలీప్కుమార్ స్నేహితులు నలమాటి జగన్, ఎస్.రాయవరానికి చెందిన జితేంద్ర మగళవారం అర్ధరాత్రి పెనుగొల్లు సమీపంలో భోజనం చేసేందుకు హోటల్కి వెళ్లారు. అర్థరాత్రి కావడం హోటల్ మూసి వేయడంతో పెనుగొల్లు జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం సహాయం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్కుమార్(20) మృతి చెందాడు. గాయపడ్డ జగన్, జితేంద్రలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తరలించినట్టు చెప్పారు. -
కట్టమంచి దార్శనికతతోనే ఏయూకు బహుముఖ ప్రగతి
మద్దిలపాలెం (విశాఖ): రాష్ట్ర విద్యావ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరచుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరుపుకోవడం ముదావహమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఏయూలో ఘనంగా నిర్వహించారు. వీసీ రాజశేఖర్ ప్రధాన పరిపాలన భవనం, స్నాతకోత్సవ మందిరం, టి.ఎల్.ఎన్ సభా హాల్ వద్దనున్న కట్టమంచి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శతాబ్దం కిందటే దార్శనికతతో ఇటువంటి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీని స్థాపించి, అభివృద్ధి చేసిన కట్టమంచి కృషి నిరుపమానమని కొనియాడారు. ఏయూను స్థాపించిన తొలినాళ్లలోనే ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు. కట్టమంచి ఆశయ సాధనకు అనుగుణంగా విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింతగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీసీ పిలుపునిచ్చారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రోలుగుంట : కె.నాయుడుపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తహసీల్దార్ సిహెచ్.నాగమ్మ సిబ్బందితో కలసి బుధవారం దాడి చేశారు. కె.నాయుడుపాలెం వైఎస్సార్ విగ్రహం కూడలిలో రేషన్ బియ్యంతో నింపి ఉన్న పది బస్తాలలో 500 కిలోల బియ్యం తరలించడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ దాడి సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడం, కొంత సేపు వేచి ఉన్నా ఎవరూ రాకపోవడంతో తహసీల్దార్ బస్తాలలో ఉన్న బియ్యం పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి వాటిని పౌర సరఫరా సరకులు గోదాములకు ఆర్ఐ రామ్మూర్తితో చేరవేసి తాను తన కార్యాలయానికి తహసీల్దార్ వెనుదిరిగారు. సాయంత్రం ఇదే మండలం రత్నంపేట గ్రామానికి చెందిన పెనుగొండ జగన్నాథం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బియ్యం తనవేనని, ఇప్పించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ అతనిని విచారించి సరైన సమాధానం లేకపొవడంతో ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. -
భూగర్భ జలవనరుల పరిరక్షణ అందరి బాధ్యత
పాడేరు : పూర్వీకులు ఆచరించిన ఆధ్మాత్మిక ధోరణిలో ప్రకృతిని పూజించి భూగర్భ జల వనరును పెంపొందించి పరిరక్షించడం అందరి బాధ్యత అని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ప్రభుత్వ కేంద్రీయ భూగర్భ జలమండలి దక్షిణ క్షేత్రం(హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యాలయం(విశాఖపట్నం) సంయుక్తంగా రైతులు, ప్రజలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదు, భూగర్భ జలాలను వినియోగించడంలో వెనుకబడుతున్నామన్నారు. దీనిని అధిగమించి జిల్లాలోని గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందేంచే విధంగా జిల్లా భూగర్భ జల వనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా శాఖల సమన్వయంతో పని చేస్తోందన్నారు. తూర్పు కనుమల ద్వారా ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో 22 మండలాల్లో వర్షపాతంలో లోటు లేకున్నా భవిష్యత్లో నీటి నిల్వ, నీటి నాణ్యతలను ఎలా కాపాడుకోవాలనే దానిపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. జిల్లాలోని భూగర్భంలో నైట్రేట్, ఫ్లోరైడ్ నియంత్రణలోనే ఉందన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా నీటి నిల్వల కోసం 254 చెక్డ్యాంలను నిర్మించడం జరిగిందన్నారు. ఇవే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు, పంట కుంటలు, నీటి ఊటలు తవ్వించడం జరిగిందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ సభల తీర్మానాల ద్వారా నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎం. జ్యోతికుమార్, అమెరికా ప్రతినిధి గోపాల్, సీజీడబ్ల్యూబీ శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ దామోదర్, ఎస్ఎంఐ డీఈఈ ఆర్ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కొయ్యూరు: పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వంతెన వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కంపరేగులకు చెందిన పనసలరాజు, సత్తిబాబు, రామరాజుపాలెనికి చెందిన లోతా రాజుబాబు బైక్పై నడింపాలెం వెళ్తున్నారు. ఆ సమయంలో రామరాజుపాలెం వంతెన వద్ద వాహనం అదుపుతప్పడంతో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు కు బలమైన గాయాలయ్యా యి. అతడిని కొయ్యూరు ఎస్ ఐ కిశోర్వర్మ 108లో కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్తిబాబు, రాజుబాబుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని కృష్ణాదేవిపేట ఆస్పత్రి లో వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కిశోర్వర్మ తెలిపారు. -
హైవే పనుల్లో నిర్లక్ష్యం.. బాలికకు గాయాలు
జి.మాడుగుల: జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టురుల నిర్లక్ష్యం వలన పనులు అసంపూర్తిగా వదిలిపెట్టడంతో అనేక మంది గిరిజన ప్రజలు గాయపడుతున్నారు. రోడ్డు మార్గంలో నిర్మాణాల పేరుతో రోడ్డు తవ్వటం వదిలి పెట్టటం, డ్రైనేజీ పనులు నిమిత్తం పెద్దపెద్ద గోతులు తవ్వటం పూర్తి చేయకపోవటం, సిమెంట్ డ్రైనేజీలపై పైకప్పులు వేయకపోవటం వంటి కారణాల వలన అనేక మంది గాయాలపాలవుతున్నారు. మండలంలో గాంధీనగరం గ్రామంలో హైవే కాంట్రాక్టర్ డ్రైనేజీపై పైకప్పు వేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక గోతిలో పడిపోయి కుడికాలుకు తీవ్రగాయమైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల బందవీధి గ్రామంలో గిరిజన యువకుడు కాలువలో పడడంతో కాలు విరిగిపోయిందని వారు తెలిపారు. హైవే అధికారుల పర్యవేక్షణ లోపం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే పనులు పూర్తి చేయాలని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు డిమాండ్ చేశారు. హైవే పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాలకు కారమణమవుతున్న అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లుపై కేసులు పెడతామని హెచ్చరించారు. -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
● వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు లేకుండా సమష్టిగా చర్యలు ● నిర్ణయించిన ఇరు రాష్ట్రాల అధికారులు సీలేరు : ఆంధ్రా ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని చిత్రకొండలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2025– 26 నీటి సంవత్సరంలో 2025 జూలై నుంచి నవంబరు 30 వరకు ఇరు రాష్ట్రాల వినియోగించుకున్న నీటిపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఆంధ్రా ఇప్పటి వరకు 20,3513 టీఎంసీలు, ఒడిశా 48.8470 టీఎంసీలు వాడుకున్నట్టుగా వారు వెల్లడించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 78.4000 టీఎంసీలు, జోలాపుట్టులో 28.5451 టీఎంసీలు కలిసి మొత్తంగా 106,9451 టీఎంసీల నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ఈ నెలఖరు నాటికి పరివాహక ప్రాంతాల నుంచి బలిమెల జలాశయానికి 3.5000 టీఎంసీలు, జోలాపుట్టుకు 25000 టీఎంసీలు అదనపు నీరు చేరే అవకాశం ఉన్నందున రెండింటిలో మొత్తం112.9451 టీఎంసీలు నిల్వలు ఉండనున్నట్టు అంచనాతో లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రాకు 69.0803, ఒడిశాకు 43.8648 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రాకు రెండు వేల క్యూసెక్కులు, ఒడిశా మూడు వేల క్యూసెక్కులు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికార్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున పోట్టేరు ఇరిగేషన్ చీఫ్ కనస్ట్రక్చన్ ఇంజనీర్ కృష్ణకుమారి పాత్రో, చిత్రకొండ ఎర్త్ డ్యాం డివిజన్ ఎస్ఈ రమాకాంత్, పొట్టేరు కెనాల్ డివిజన్ ఎస్ఈ సనోజ్, బలిమెల ఓహెచ్సీ మేనేజర్ బిమల టర్కీ, డిప్యూటీ మేనేజర్ క్లుణిష చంద్రబెహరా, అసిస్టెంట్ మేనేజర్ సుదీప్, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సివిల్ ఎస్ఈ చిన్న కామేశ్వరరావు, ఈఈ ఎస్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: కోటి సంతకాల సేకరణ ప్రతులను ఈనెల 15న జిల్లా కేంద్రం నుంచి విజయవాడ తరలించే సందర్భంగా నిర్వహించే ర్యాలీకి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు హాజరు కావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం అరకులోయ నుంచి కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రమైన పాడేరు తరలింపును ఆయన ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా 60 వేల మందితో సంతకాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనివార్య కారణాల వల్ల 53 వేల సంతకాలు సేకరించామన్నారు. వీటిని ఈ రోజు జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పేదకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతానికి చెందిన వారు అనారోగ్యానికి గురైతే విశాఖ కేజీహెచ్కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందేవారని గుర్తుచేశారు. పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త 17 వైద్య కళాశాలను నిర్మించారన్నారు.వీటిలో ఏడు వైద్య కళాశాలలతోపాటు 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్ పరం చేసిందన్నారు. గడిచిన ఎన్నికల్లో టీడీసీ అభ్యర్థులకు నిధులు సమకూర్చిన వారికి ప్రజా ధనంతో నిర్మించిన వైద్య కళాశాలలను అప్పజెప్పారన్నారు. టీడీపీ నేతల మాయమాటలు నమ్మి మైదాన ప్రాంత ప్రజలు వారికి ఓటేస్తే, గిరిజన బిడ్డలు జగనన్నకు నమ్ముకొని ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, దేశమంతా అరకు వైపు చూసేలా మరింత అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలన్న సంకల్పంతోనే కోటి సంతకాల సేకరణ బాధ్యతను జగనన్న అప్పగించారన్నారు. నియోజకవర్గంలో మిగిలిన 7వేల సంతకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ చేసిన పత్రాలను పాడేరు జిల్లా కేంద్రానికి తరలించే వాహనాన్ని బొడ్డేటి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు.అక్కడి నుంచి పాడేరు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు, జెడ్పీటీసీ శెట్టి రోషిణి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఎంపీపీ శెట్టి నీలవేణి, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, రామచందర్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు రామూర్తి, పరశురాం అనిల్, సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్కుమార్,ప్రకాష్, సర్పంచ్లు నాగేశ్వరరావు, రమేష్, సుశ్మిత, రాధిక, కిముడు హరి, నాయకులు సింహాచలం, కృష్ణారావు, చందు పాల్గొన్నారు. -
మాచ్ఖండ్లో శతశాతం ఉత్పాదన
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన శాతశాతం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో రెండు రోజులు మాత్రమే శాతశాతం విద్యుత్ ఉత్పాదన జరిగిన అనంతరం రెండో నంబరు జనరేటర్ మరమ్మతులకు గురవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండవ నంబరుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. తరచూ జనరేటర్లు మరమ్మతులు గురవుతూ వస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు శ్రమిస్తున్నా అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం కావడంతో మరమ్మతులు చేపట్టి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తున్నాయి. సమస్యను జెన్కో ఉన్నతాధికారుల దృష్టికి ప్రాజెక్టు అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన జెన్కో అధికారులు రూ.40 లక్షలు కేటాయించారు.దీంతో ప్రాజెక్టు అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ నెల 8వ తేదీన 2వ నెంబరు జనరేటర్కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు జనరేటర్ల సాయంతో రోజుకు 2.8 మిలియన్ యూనిట్ల ఉత్పాదన జరుగుతోంది. శతశాతం విద్యుత్ ఉత్పత్తికి కృషి చేసిన ప్రాజెక్టు ఎస్ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఇంజినీర్లు, సిబ్బందికి బుధవారం ఏపీజెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్కుమార్ ఫోన్లో అభినందించారు. -
ఒక్కో సంస్థ ఒక్కో ధర.. రైతుకు టోకరా
సాక్షి,పాడేరు: మన్యంలో కాఫీ పండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎంతో కష్టపడి పండించిన రైతులకు మార్కెట్ పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. సంస్థలు కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తాము నష్టపోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఎకరాకు కనీనం 1000 కిలోల వరకు ఫలసాయం వస్తుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా సంస్థలు నిర్ణయించిన కొనుగోలు ధరలు వారిని నిరాశ పరుస్తున్నాయి. ● పాడేరు ఐటీడీఏ ఆధీనంలోని చింతపల్లి మాక్స్ సంస్థ కాఫీ పండ్లు గ్రేడ్–1ను కిలో రూ.70, గ్రేడ్–2 కిలో రూ.65 ధరకు కొనుగోలు చేస్తోంది. ఐటీడీఏ కాఫీ విభాగ అధికార యంత్రాంగమంతా గ్రామాలకు నేరుగా గిరిజనుల కాఫీ తోటల వద్దకు వెళ్లి ఫలసాయం కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థకే కాఫీ పండ్లు విక్రయించాలని అధికారుల నుంచి ఒత్తిడి తేవడం రైతులకు ఇబ్బందిగా మారింది. కాఫీ మార్కెటింగ్ తరువాత లాభాలను బోనస్ రూపంలో పంపిణీ చేస్తామని కాఫీ విభాగం అధికారులు గిరిజనులకు హమీ ఇస్తున్నారు. తక్కువ ధరకు చింతపల్లి మాక్స్ కొనుగోలు చేయడంతో కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు. రికార్డు ధరకు నాంధి కొనుగోలు అరకులోయ కేంద్రంగా పనిచేస్తున్న నాంధి స్వచ్ఛం సంస్థ కాఫీ పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తోంది. పూర్తిగా పండిన పండ్లు కిలో రూ.100, నాణ్యత తక్కువగా ఉంటే కిలో రూ.80నుంచి రూ.90కు కొనుగోలు చేస్తోంది. అయితే నాంధి సంస్థ అధిక ధరతో పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నప్పటికీ రైతులు పూర్తిస్థాయిలో అమ్ముకోలేకపోతున్నారు. చింతపల్లి మాక్స్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నందున కిలోకు రూ.30 చొప్పున నష్టపోవాల్సి వస్తుందని కాఫీ రైతులు వాపోతున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా కిలో కాఫీ పండ్లను రూ.70 ధరకు కొనుగోలు చేస్తున్నాయి.కలెక్టర్, ఐటీడీఏ స్పందించాలి లాభాలు, బోనస్ను పక్కనబెట్టి పాడేరు ఐటీడీఏ కిలో కాఫీ పండ్లకు 100 చెల్లించాలి. నాంధి సంస్థ మాదిరిగా కొనుగోలు చేయకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కలెక్టర్, ఐటీడీఏ అఽధికారులు స్పందించి మాక్స్ సంస్థ ధర పెంచేలా చర్యలు తీసుకోవాలి. – రేగం చిట్టన్న, కాఫీ రైతు, వనుగుపల్లి పంచాయతీ కాఫీ కొనుగోళ్లలో ఇష్టానుసారం ప్రభుత్వ రంగ మాక్స్ కిలో రూ.70కు కొనుగోలు ఈ సంస్థకే అమ్మాలని కాఫీ విభాగం అధికారుల ఒత్తిడి ప్రైవేట్ సంస్థ నాంథి రూ.100 చెల్లింపు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రూ.70కు సేకరణ ధరల వ్యత్యాసంతో నష్టపోతున్న కాఫీ రైతులు -
నిరసన సంతకం
గంగవరంలో కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీని ప్రారంభిస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతున్న పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యే మత్స్యలింగం, చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావుకోటి సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకోటి సంతకాల ప్రతులు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, తదితరులుర్యాలీకి తరలిరావాలిపాడేరు : రాష్ట్రంలో ప్రజల సొత్తు అయిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీపరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. ప్రైవేటీకరణపై ప్రజా తిరుగుబాటు తప్పదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సేకరించిన సంతకాలను బుధవారం పాడేరులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 15ఏళ్ల సీఎం చరిత్రలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మకంగా ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు, వాటిని ప్రైవేట్పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిపై ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సేకరించిన సంతకాల ప్రతులతో ఈనెల 15న జిల్లా కేంద్రమైన పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి విజయవాడ తరలించి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో కలిసి ఈనెల 17న రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం: బొడ్డేడ ప్రసాద్ హెచ్చరిక కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉవ్వెత్తున ముందుకు వచ్చి సంతకాలు చేసి మద్దతు తెలిపారని వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ప్రజలకు నష్టం జరిగితే తమ పార్టీ తరఫున చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైఎస్సార్సీపీ నిత్యం పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసమే పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను నెలకొల్పి ఉన్నత వైద్యాన్ని ప్రజల ముంగిటకు తెచ్చిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని పూర్తిగా నీరు గార్చిందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షలు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ● అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సేకరించిన 53వేల సంతకాల ప్రతులను జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుకు బుధవారం సాయంత్రం పాడేరు పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అందజేశారు. పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి(పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప పరిశీలకులు) ఏడువాక సత్యారావు సమక్షంలో ఆయన స్వీకరించారు. విజయవంతంగా ప్రజా ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గంగవరం : ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం విజయవంతంగా సాగిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను బుధవారం కాకినాడ జిల్లా కేంద్రానికి తరలించే సందర్భంగా నిర్వహించిన కార్లు, బైక్ ర్యాలీని గంగవరం సెంటర్లో ఆమె ప్రారంభించారు. వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎప్పుటికప్పుడు ఎండగడుతుందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో తాను, ఎమ్మెల్సీ అనంతబాబు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేశారన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాలకు చెందిన ఎంపీపీలు పల్లాల కృష్ణారెడ్డి, రాఘవ, బంధం శ్రీదేవి, మురళి, జెడ్పీటీసీలు బేబిరత్నం, పండా వెంకటలక్ష్మి, జి. వెంకటలక్ష్మి, సత్యవేణి, మద్దాలవీర్రాజు, వైస్ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, గారపాటి మురళి, కొమ్మిశెట్టి బాలకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు యెజ్జు వెంకటేశ్వరరావు, రామన్నదొర, రామకృష్ణ, మురళీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, బూత్కమిటీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రఘునాథ్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలు ‘అరకు’ ప్రతులను పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేసిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సేకరించిన సంతకాల ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శన ప్రజల సొత్తు ప్రైవేట్ పరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు స్పష్టీకరణ ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరికకోటి సంతకాల సేకరణ ప్రతులతో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు -
విభిన్న ప్రతిభావంతులపై చిన్నచూపు తగదు
పాడేరు : విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్నచూపు తగదని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు నిర్ధేశించిన ఉద్యోగాలను అన్ని శాఖల నుంచి వెరిఫికేషన్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వారీగా నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ తీసుకుంటున్న వారి సమాచారంతో పాటు జిల్లాలో మొత్తం దివ్యాంగుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. కవిత, రెడ్క్రాస్ ప్రతినిధులు జయ, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ఆర్టీసీ బస్సు ఢీకొనిచుక్కల జింక మృతి
ఆరిలోవ (విశాఖ) : జాతీ య రహదారిపై బుధవా రం జరిగిన రో డ్డు ప్రమాదంలో ఓ చుక్కల జింక మృతి చెందింది. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాలివి. కంబాలకొండ అభయారణ్యం నుంచి ఓ చుక్కల జింక జూపార్క్ దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో నగరం నుంచి మధురవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ జింకను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దహనం చేశారు. -
అరకులో చలి పంజా
● 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ● డుంబ్రిగుడలో తగ్గుముఖం ● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి వెల్లడి చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా మరింత దిగజారుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అరకువ్యాలీలో 4.4 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 4.8, ముంచంగిపుట్టులో 5.0, పాడేరులో 5.2,హ హుకుంపేటలో 9.6, చింతపల్లిలో 6.2, పెదబయలులో 6.7, కొయ్యూరులో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.4, మారేడుమిల్లిలో 9.9, రాజవొమ్మంగిలో 11.7 ,అడ్డతీగలలో 13.0, రంపచోడవరంలో 13.6,గంగవరంలో 16.7, చింతూరు డివిజన్ చింతూరులో 13.3, ఎటపాకలో 13.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. చలిని ఉపశమనం పొందేందుకు మన్యం వాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. సాక్షి,పాడేరు: జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉన్ని దుస్తుల వినియోగం పెరిగింది. పర్యాటకులకు ప్రాణసంకటంగా.. ఎటపాక: పాపికొండలు సందర్శకులకు పొగమంచు, చలి ప్రాణసంకటంగా మారింది. వీఆర్ పురం మండలంలోని పోచవరం లాంచీల రేవుకు భద్రాచలం నుంచి వచ్చే వారు ఎటపాక మండలం మీదుగా కూనవరం నుంచి వీఆర్పురం మండలంలోని పోచవరం రేవుకు వాహనాల్లో వెళ్తుంటారు. వీరంతా భద్రాచలంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో బయలుదేరుతారు. ఒక పక్క చలి, మరోపక్క మంచు తెరలు కమ్ముకోవడంతో రేవుకు వెళ్లేవారు సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. -
కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ సాగు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదేళ్లలో కొత్తగా లక్ష ఎకరాల్లో రూ.222 కోట్ల వ్యయంతో కాఫీ తోటల విస్తరణకు భారీ ప్రణాళిక అమలు చేయనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎం.ఎం.నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా తాజంగిలో నిర్మాణ దశలో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోథుల మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. బిర్సాముండా జయంతి నాటికే మ్యూజియం పనులు పూర్తిచేయాలని భావించామన్నారు. వివిధ కారణాల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందన్నారు. జనవరి 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చింతపల్లి వచ్చిన ఆయన ఐటీడీఏ ఆధ్వర్యంలో మాక్స్ నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్ను పరిశీలించారు. ఈఏడాది 1,600 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం పూర్తిచేయాలని భావిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వివరించారు.ఈ ఏడాది కిలో కాఫీ పండ్ల ధర మేలు రకం కిలో రూ.70 రెండో రకం రూ.60గా ఐటీడీఏ పెంచినట్టు పీవో తెలిపారు.ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన జి.మాడుగుల, గూడెంకొత్తవీధి పల్పింగ్కేంద్రాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమెను నాయక్ ఆదేశించారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ వసంత, టీసీఆర్, టీఎం ఈడీ మందరాణి, గిరిజన సంక్షేమశాఖ ఏపీఓ వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ బొంజుబాబు, ఈఈ డేవిడ్రాజు, డీఈఈ రఘునంథనరావునాయుడు, జేఈ యాదకిశోర్ మ్యాక్స్ అధ్యక్షుడు సింహాచలం, కోశాధికారి గోవిందు, ఏఈవో ధర్మారాయ్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ గ్రంథాలయాలకు ప్రతిపాదనలు
● ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్రాజు డుంబ్రిగుడ గ్రంథాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కార్యదర్శి కుమార్రాజు డుంబ్రిగుడ: స్థానిక శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్రాజు సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్తిస్థాయిలో భవనాలు ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు అందించామన్నారు. గిరిజన యువత గ్రంథాలయాలను సద్వినియోగంజ చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. గ్రంథాలయ అసోసియేషన్ యూనియన్ ప్రతినిధులు ఆనందరావు, రమణ, గ్రంథాలయాధికారి సునీత, సిబ్బంది కె. సుబ్బారావు పాల్గొన్నారు. -
ఎకో ఆదాయం.. ఇష్టారాజ్యం
రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి ఏజెన్సీలో పర్యాటకంగా అటవీశాఖకు భారీగా ఆదాయం సమకూరుతున్నా తమ గ్రామాలకు ఎటువంటి మేలు జరగడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పర్యాటకుల నుంచి వచ్చిన ఆదాయంలో నిబంధనల ప్రకారం కొంత గిరిజన గ్రామాల అభివృద్ధికి ఖర్చుచేస్తామని అటవీశాఖ చెప్పినప్పటికీ అందులో వాస్తవం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ కాకిలెక్కలు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రంపచోడవరం: అటవీశాఖ మారేడుమిల్లి కేంద్రంగా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం (సీబీఈటీ) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మారేడుమిల్లి, వాలమూరులో కాటేజీలు నిర్వహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను సీబీఈటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ●గుడిసె టూరిజంను అటవీశాఖ నిర్వహిస్తోంది. ఆకుమామిడి కోట వద్ద పుల్లంగి రోడ్డులో చెక్పోస్టు ఏర్పాటుచేసి గుడిసెకు వెళ్లే పర్యాటకుల వాహనాల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తోంది. ఈ మొత్తంలో కొంత భాగం గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులు పథకం ప్రకారం అటవీశాఖ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ●అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడిసె పర్యాటకాన్ని మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని పాములమామిడి, గుడిసె, చెలకవీధి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు పీసా గ్రామసభలో ఎంపీటీసీ సభ్యురాలు బున్నమ్మ, అందాల మంగిరెడ్డి, సాదల సోమిరెడ్డి, మాజీ సర్పంచ్లు పీసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు రవీంద్రరెడ్డి, లింగారెడ్డి,రత్నారెడ్డి, సాదల కొమ్మిరెడ్డి, సీబీటీ సభ్యుడు కోండ్ల చిన్నారెడ్డి, గిరిజనులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుడిసె పర్యాటక ప్రాంతం పేరు చెప్పి రూ.లక్షలు అటవీశాఖ దండుకుంటోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అధికారుల ఒప్పందం ప్రకారం వాటర్ ట్యాంకు, రోడ్లు, గ్రామాల అభివృద్ధి పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఐటీడీఏ కూడా గ్రామంలో పాఠశాల భవనం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. ●అటవీశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ఏర్పాటు చేసి సుమారు 17 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సీబీఈటీకి వచ్చిన ఆదాయానికి సంబంధించి ఎటువంటి అడిట్ నిర్వహించలేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏటా అడిట్ నిర్వహించి వచ్చిన ఆదాయంలో సీబీఈటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం, జలతరంగణి, అమృతధార, కాటేజీల నిర్వహణకు ఖర్చు చేసిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఏళ్ల తరబడి ఆడిట్ జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ●గుడిసె పర్యాటక ప్రాంతానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకుల వస్తున్నారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ద్వారా ఒకరికి రూ.100, ద్విచక్ర వాహనానికి రూ. 100, నాలుగు చక్రాల వాహనానికి రూ. 300 వసూలు చేస్తున్నారు. ఈ మాదిరిగానే జలతరంగని, అమృతధార సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అలాగే కాటేజీల ద్వారా ఆదాయం వస్తోంది. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు అడిట్ నిర్వహించక పోవడం, వచ్చిన ఆదాయంతో కొంత భాగాన్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
14న నేవీ మారథాన్
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్, చిత్రంలో నేవీ అధికారులు మహారాణిపేట: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారథాన్లో 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు భాగస్వామ్యం కానున్నారని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వాలంటీర్లు సేవల్లో నిమగ్నమవుతారన్నారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా, నేవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో కెప్టెన్లు టీఆర్ఎస్ కుమార్, వినోత్ తివారీ, కమాండర్ కిశోర్, లెఫ్టినెంట్ కమాండర్లు పి.మెహంత్ నాయుడు, నరేశ్, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఖర్చు చెప్పడం లేదు
పర్యాటకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని నిబంధనల ప్రకారం పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. వచ్చిన ఆదాయానికి జవాబుదారీతనం లేదు. అటవీ అధికారులు ఇష్టరాజ్యంగా వాటిని ఖర్చు చేస్తున్నారు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వచ్చిన ఆదాయంపై అడిట్ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వేదికపైనగాని, సమావేశాల్లోగాని, ప్రజాప్రతినిధులకు గాని వచ్చిన ఆదాయం, ఖర్చు చెప్పకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. – గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ, మారేడుమిల్లి ఆరోపణలు అవాస్తవం గుడిసె పర్యాటకంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. గుడిసె,గుంపెన గండి గ్రామాలకు ఇప్పటికే టెంట్ సామాన్ల కిట్లు పంపిణీ చేశాం. ఆయా గ్రామాలకు చెందిన పది మంది గిరిజన యువకులకు కమ్యూనిటి బేస్డ్ ఎకో టూరిజంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నూతనంగా పాములేరు సమీపన పార్క్ను ఏర్పాటు చేస్తున్నాం. ఏటా అడిట్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారులు వద్ద తీసుకోవాలి. –అజాద్, అటవీ శాఖ రేంజ్ అధికారి, మారేడుమిల్లి -
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి రంపచోడవరం: మండలంలోని వివిధ ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రంపచోడవరంలోని కస్తూరిభాగాంధీ విద్యాలయం, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, బందపల్లి బాలుర పాఠశాలను ఆయన మంగళవారం పరిశీలించారు. దీనిలో భాగంగా బాలిక వసతి గృహంలో మరుగుదొడ్లు పరిశుభ్రత, నీటి సమస్యను గమనించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చేపట్టేలా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్కు సూచనలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సహస్రనామార్చన నిర్వహిస్తున్న అర్చకుడు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం సహస్రనామార్చన జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలను పఠిస్తూ స్వామికి తులసితో అర్చన చేశారు. విశేష హారతులు అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
మెరుగైన సేవలు అందించాలి
రంపచోడవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు సత్వర వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు అందజేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ ఆదేశించారు. మారేడుమిల్లి మండలం బోదులూరు పీహెచ్సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో వైద్యులు ,సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి పంపించాలన్నారు. బోదులూరు పీహెచ్సీలో పరిధిలో గర్భిణులు, బాలింతల వివరాలు తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం మద్దులూరు గ్రామంలోని వెదురు ప్లాంటేషన్ను పీవో పరిశీలించారు. ప్లాంటేషన్కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జి.మాడుగుల: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. అటెండెన్స్, మూమెంట్ రిజస్టర్లను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న గర్భిణులను వారం రోజుల ముందుగా స్థానిక బర్త్ వెయిటింట్ హోమ్కు తరిలించి సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఇళ్ల వద్ద కాన్పులు జరిగితే సంబంధిత క్షేత్రస్థాయి, పర్యవేక్షిక సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులు, ప్రసూతి గదిని ఆయన పరిశీలించారు. శీతాకాలంలో న్యుమోనియా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెంచే అవకాశం ఉందన్నారు. అందువల్ల పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున వారిలో వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. గ్రామాలు, పాఠశాలల్లో జ్వరాలు, వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు అదుపునకు వైద్యాధికారులు,సిబ్బంది కలసి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. -
ప్రపంచ శాంతి కోరుతూ సాధువు యాత్ర
నిలువు దండాలతో యాత్ర చేస్తున్న సాధువు ఉపేంద్రదాస్ చింతూరు: ప్రపంచ శాంతిని కోరుతూ ఓ సాధువు గంగోత్రి నుంచి రామేశ్వరానికి చేపట్టిన నిలువు దండాల యాత్ర మంగళవారం మండలంలోని చట్టికి చేరుకుంది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర చేపట్టినట్లు సాధువు ఉపేంద్రదాస్ తెలిపారు. గత 29 రోజుల క్రితం యాత్ర చేపట్టానని, రామేశ్వరం చేరుకుని పరమశివుని దర్శనంతో తనయాత్ర ముగించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో కరువు కష్టాలు రాకుండా ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి పౌరుడు దేశభక్తి చాటాలని కోరుతూ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఉపేంద్రదాస్ తెలిపారు. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
అవగాహన కల్పిస్తున్న అధికారులు పాడేరు రూరల్: ప్రతిఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ జిల్లా అధికారి ఎంవీ రామకృష్ణంరాజు సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించాలని సూచించారు. పౌరసమాచార అధికారి సంతోష్, వివిధ శాఖల అధికారులు మరిడయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ
● పోలీసులకు రైతుల ఫిర్యాదుఎటపాక: రైతుల వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు చోరీకి గురయ్యాయి. సోమవారం రాత్రి గౌరిదేవిపేట నుంచి తోటపల్లి వరకు గోదావరి పరీవాహకంలోని పది హెచ్పీ వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి పట్టుకుపోయారు. రాత్రి సమయంలో గోదావరి నది తీరం వెంబడి ఉన్న మోటార్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం నెల్లిపాక వద్ద ఏడు, చోడవరం వద్ద 3 వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ వైరు చోరీకి గురవడంతో బాదిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, తాజాగా గౌరిదేవిపేట,గన్నవరం గ్రామాల మధ్య గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న సుమారు 20 విద్యుత్ మోటార్ల కాపర్ వైర్లను దొంగలించారు. దీంతో రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. త్రీకోర్ వైరు మీటరు ధర రూ. 150 ఉంది. దీనిని కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తమ మోటార్లను కూడా పట్టుకుపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
నిర్వాసితుల డేటా తయారు చేయండి
కూనవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం గ్రామంలో పునరావాసం కోరుకున్న నిర్వాసితుల డేటాను తయారు చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలో ఆయన మాట్లాడారు. కూనవరంలో 798 మంది నిర్వాసితులు తాడ్వాయిలో పునరావాసం కోరుకున్నారని తెలిపారు. వీరికి స్థలసేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేనందున వారి నుంచి గృహ నిర్మాణానికి సంబంధించిన డేటా సిద్ధం చేయాలని తహసీల్దార్ ధర్మేంద్రను ఆదేశించారు. ఆప్షన్లు వారీగా నిర్వాసితుల జాబితా తయారు చేయాలని సూచించారు. టేకులబోరు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు తాడ్వాయిలో స్థలం లేదు వేరోచోట కావాలని కోరడంతో వారికి 5,6 నంబర్లతో ఎల్లో బ్లాక్లో స్థలసేకరణ జరిగిందన్నారు. అయినా మరోమారు ఆస్థలం చూసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఆస్థలంపై అభిప్రాయం తెలియజేయాలన్నారు. తాడ్వాయిలో స్థలాల ఎంపిక, వాటికి సంబంధించిన డేటా ప్రక్రియ అంతా పూర్తి చేసిన తరువాత మిగిలిన నిర్వాసితుల విషయంపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీఎస్ఎస్ జగన్నాథరావు, ఎస్ఐ లతశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
గర్భిణులకు అవగాహన కల్పిస్తున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి చింతపల్లి: గర్భిణులు ప్రసవ సమయం వరకు వేచి చూడకుండా ముందుగానే ఆసుపత్రుల్లో చేరాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి సూచించారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణులకు పీఎం ఎస్ఎస్ఏ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
డౌన్హిల్ స్కేటింగ్లో తమిళనాడు సత్తా
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా మంగళవారం తొట్లకొండలో జరిగిన డౌన్హిల్ స్కేటింగ్ పోటీల్లో తమిళనాడు జట్టు సత్తా చాటింది. మెన్లో కిషోర్కృష్ణ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా హర్షిత్ ద్వితీయ స్థానంతో (వీరిద్దరూ తమిళనాడు) రజతాన్ని అందుకున్నాడు. సాయంత్(కేరళ) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్నందుకున్నాడు. వుమెన్లో వర్షిణి విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా అమిజిధాని(వీరిద్దరూ తమిళనాడు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకుంది. ఆర్.వి.రమ్యశ్రీ(ఆంధ్రప్రదేశ్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో గురుహర్షన్(తమిళనాడు), వష్ణావ్ లీమిన్(కేరళ), ఆరవ్ శ్రీజిత్(తమిళనాడు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. బాలిక విభాగంలో శృతి(తమిళనాడు), అక్షర(తమిళనాడు), ఎం.ఐశ్వర్య(ఆంధ్రప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. లాంఛనంగా స్కేటింగ్ పోటీలు ప్రారంభం జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ను మంగళవారం వీఎంఆర్డీఏ పార్క్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హారేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్కేటింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్కుమార్ను సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. -
ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ
అరకులోయ టౌన్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యలయంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యం పేద విద్యార్థులకు వైద్య విధ్య అందించాలన్న సంకల్పంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారన్నారు. గడిచిన నెల రోజులపాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రచ్చబండ నిర్వహించి కోటి సంతకాల సేకరణను దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. వీటిని ఈనెల 10వ తేదీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రానికి తరలించి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత కారణాల వల్ల పేదలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలు పూర్తయి, తరగతులు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు అండ్కో కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు. జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, స్వాభి రామచందర్, కూడ పాపారావు, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరశింహా మూర్తి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిముడు హరి, సర్పంచ్లు పెట్టెలి సుస్మిత, మాదల బుటికి, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి అనిల్, ఉపాద్యాక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, ప్రకాష్రావు, బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్కుమార్, వార్డు సభ్యుడు శివ, పార్టీ నాయకులు కొర్రా అర్జున్, కిరణ్కుమార్, నాగేశ్వరరావు, శంకర్, మోహన్, ప్రసాద్ పాల్గొన్నారు. -
13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాల యం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం(వేవ్స్ 2025) ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి రావు తెలిపారు. మంగళవారం ఏయూ అలుమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత థీంతో వేవ్స్ 2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని, అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జీఎంఆర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్తో కలిసి వేవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. -
రీసర్వే, మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : రీ సర్వే, మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్నుంచి ఆర్డీవోలు, అన్ని మండలాల సర్వే అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. డీ పట్టా భూమి, ఆర్వోఎఫ్ఆర్ , జిరాయితి భూమిలో సాగు చేసే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చూడాలని ఆదేశించారు. రీ సర్వే సమయంలో ప్రభుత్వ, డి పట్టా భూములను పూర్తిగా పరిశీలించాలన్నారు. వెబ్ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలని వాటిపై తిరిగి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఒకటి రెండు సార్లు పరిశీలించిన తరువాత మాత్రమే పట్టాలు జారీ చేయాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను త్వరితిగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఉత్తరు్ువ్ల ఈఆఫీస్ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేసి ఆప్లికేషన్లను క్లియర్ చేయాలన్నారు. నాలా పన్నులు వసూలు (వాటర్ టాక్స్) ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్లు పనుల వసూళ్లను వెంటనే ప్రారంభించాలన్నారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ కానీ నియోజకవర్గాల్లో బీఎల్వోలు, సూపర్వైజర్లు త్వరగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే అందుకు తగిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు స్మరణ్రాజ్, శుభం నొఖ్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జీ డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
నిశీధి వేళ..నిర్భయంగా..
గోదావరి నదిలోకి ఎటపాక సమీపంలో ఏర్పాటుచేసిన రహదారి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎటపాక: గోదావరి నదిలో అర్ధరాత్రి వేళ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎటపాక ప్రాంతం నుంచి భారీగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసుశాఖలు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఎటపాక, చింతలగూడెం, గుండాల, గోగుబాక గ్రామాల సమీపంలోని గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు మార్గాలు ఏర్పాటుచేశారు. చీకటిపడిన వెంటనే తవ్వకాలు మొదలు పెడుతున్నారు. ఈ తతంగం తెల్లవార్లు జరుగుతోంది. గోదావరిలో నీరు తగ్గడంతో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని తెలంగాణకు చెందిన భద్రాచలం పట్టణంలో ఇసుక కొరత అక్రమార్కులు కాసులు కురిపిస్తోంది. గోదావరి నుంచి తీసుకువెళ్తున్న ఇసుకను సరిహద్దులో నిల్వచేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాచలం తరలిస్తున్నారు. లోడు రూ.4 వేలకు అమ్ముతున్నారు. చింతలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, పురుషోత్తపట్నం, గుండాల, గోగుబాక గ్రామాల్లోని కొన్ని ట్రాక్టర్లను ఇందుకు వినియోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా గోదావరి నది ఇసుక తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. చలి కారణంగా రాత్రివేళల్లో అక్కడికి వెళ్లలేకపోతున్నారన్నారు. తవ్వకాలపై పరిశీలించిన తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు. -
పచ్చ నేతల కన్ను
గలగల పారే సెలయేటి సవ్వడులతో చల్లని ఆహ్లాదకరమైన నదీ పరీవాహక ప్రాంత గ్రామం అది. ఒకపక్క పచ్చని పొలాలతో కళకళలాడుతూ.. మరోపక్క సుద్ద కొండ ఒడిలో ఒదిగి ఉన్న అందమైన గ్రామం. పెద్దలంతా వ్యవసాయం చేస్తూ చెరకు, వరి, ఇతర ఆహారధాన్యాలు పండిస్తూ ప్రజలకు తిండిగింజలు అందిస్తుంటే.. ఇక్కడ యువత దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో ఉద్యోగం చేస్తూ దేశరక్షణలో సైనికులుగా పనిచేస్తున్నారు. అలాంటి పచ్చని బెన్నవోలు గ్రామంపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఈ గ్రామాన్ని ఆనుకొని విలువైన సుద్దకొండ ఉండడమే ఇందుకు కారణం. పచ్చని పల్లైపెబెన్నవోలు సుద్దకొండకాలుష్యం కబళిస్తోంది సుద్ద కొండను క్వారీ చేసి తవ్వుకొని పోయేందుకు ప్రభుత్వం లీజు ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీని వల్ల గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. తవ్విన కొండమట్టి అంతా మా ఊరుపైకి, పొలాల్లోకి వచ్చి మేటలు వేస్తుంది. పంటలు నాశనమై కరువు నెలకొంటుంది. – కంచిపాటి రమేష్, రైతు, బెన్నవోలు చోడవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదులు, కొండలు, ఇసుక, రాయి, చెట్టు చేమ ఏదీ వదలకుండా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. తాజాగా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి ఆనుకొని ఉన్న సుద్దకొండపై గ్రానైట్ మాఫియా కన్ను పడింది. దీనికి స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరామిక్స్ తయారీ (ఫ్లోరింగ్ టైల్స్)లో ప్రధాన ముడిసరుకుగా వాడే సుద్ద గనుల కొండ ఇక్కడ ఉంది. ఇక్కడి సుద్దకొండను తవ్వేసుకొని లక్షలాది టన్నులు తరలించుకుపోయేందుకు స్కెచ్ వేశారు. ఈ సుద్దను తవ్వుకొని, అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే వారి ఆలోచన బెన్నవోలు గ్రామానికి ముప్పు తెచ్చేలా మారింది. వ్యవసాయంతో పచ్చని పొలాల మధ్య పెద్దేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు కొండమట్టి, బుగ్గిలో కాలుష్యం కోరల్లో మగ్గిపోయేలా ఉంది. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు ఈ సుద్దకొండలో బండను చేత్తో తవ్వుకొని దానిని ముగ్గుపిండిగా తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా ఇదే వారికి జీవనాధారం. ఇప్పుడు ఈ సుద్దకొండను గ్రానైట్ మాఫియా యంత్రాలతో తవ్వుకుపోతే ఈ కుటుంబాలకు పూర్తిగా జీవనాధారం పోయి వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రామమంతా ఇప్పుడు ఈ సుద్ద తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు బెన్నవోలు సుద్దకొండను ప్రస్తుతానికి 17 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీనర్సింహ మెటల్స్, శాండ్ ఇండస్ట్రీ ప్రైవేటు లిమిటెడ్ అనే గ్రానైట్ సంస్థకు ఈ సుద్ద కొండను తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సుద్దకొండ పై భాగాన ఉన్న గ్రావెల్ మట్టిని 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు తొలగించి, దాని కింద ఉన్న తెల్ల సుద్దను 3 లక్షల 60 లక్షల మెట్రిక్ తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైన తవ్విన గ్రావెల్ మట్టిని ఊరికి ఆనుకొని ఉన్న అదే కొండ భాగాన వేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా తవ్వకాలు చేస్తే గ్రావెల్ మట్టి భారీ వర్షాలకు కొట్టుకు వచ్చి ఊరిలో ఇళ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిషనరీతో తొలగించిన తెల్లసుద్ద వేస్ట్ అంతా కొండ గెడ్డల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మేటలు వేస్తే పూర్తిగా పంటభూములు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల పచ్చని వాతావరణంతో ఉన్న ఈ గ్రామమంతా దుమ్ము ధూళితో కాలుష్యమైపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. గ్రామానికి ఆనుకొని ఈ కొండ ఉండటం వల్ల గాలి, నీరు కూడా కలుషితమైపోతుందంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అయినా సుద్దకొండ తవ్వకాలు జరిపేందుకు మాత్రం చాపకింద నీరులా అధికారిక పనులన్నీ జరిగిపోతున్నట్టు తెలిసింది. అధికార పార్టీ పెద్ద నాయకుల అండదండలతో టెండరు దక్కించుకున్న క్వారీ సంస్థ రాజకీయ బలంతో ఈ సుద్దకొండను తవ్వి పట్టుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుపోతోంది. ఇదే గాని జరిగితే బెన్నవోలు గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. అందమైన కొండను తవ్వేసి ...ప్రజల నెత్తిన బుగ్గి పోసే యత్నం బెన్నవోలు సుద్దకొండకు తూట్లు పొడిచేందుకు పన్నాగం అధికార పార్టీ నాయకుల అండతో తవ్వకాలకు టెండర్ తమ బతుకులు బుగ్గిపాలు చేయవద్దంటున్న బెన్నవోలు గ్రామస్తులు ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి గ్రీన్సిగ్నల్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం -
టీబీ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: టీబీ రోగులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి జిల్లా కుష్టు, ఎయిడ్స్,టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్ ఆదేశించారు. స్థానిక సీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. టీబీ ల్యాబ్ రికార్డులను, కఫం పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. అనంతరం లబ్బూరు పీహెచ్సీని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నమోదవుతున్న కేసులు,అందిస్తున్న వైద్యం వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి ప్రసాద్తో మాట్లాడి మందుల వివరాలు, ప్రసవాల గురించి తెలుసుకున్నారు. టీబీ రోగులను మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామస్థాయిలో టీబీ రోగులను గుర్తించడం, వైద్య అందించడం, మందుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో టీబీ రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సంజీవ్పాత్రుడు,హెల్త్ విజిటర్ కాసులమ్మ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు రామచందర్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక యాజమాన్య పద్ధతులతో మేలైన దిగుబడులు
సబ్బవరం: రైతులు ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించినంత దిగుబడులను సాధించవచ్చని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అఽధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమృతపురం గ్రామంలో మంగళవారం పంట పొలాలను సందర్శించి, రైతులతో చర్చించారు. ఈ రబీ సీజన్లో అవసరమయ్యే విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతు నుంచి ధాన్యం సేకరిస్తామన్నారు. సంబంధిత రైతులకు రావాల్సిన సొమ్మును 24 గంటల్లో చెల్లించనున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సంబంధించిన ఫిర్యాదులుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, గ్రామ పెద్దలు బైలపూడి రామారావు, ఏఈవో బాలరాజు, వీహెచ్ఏ భావన, వీఏఏలు రేణుక, అలేఖ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
అరకులోయటౌన్: మండలంలోని చినలబుడు పంచాయతీ గొందివలస గ్రామంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం ద్వారా అర్థసూత్ర సంబాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంది ఫౌండేషన్ ప్రతినిధి ఆర్.వెంకటరావు మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఆర్థిక సాధికారతకు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బ్యాంకింగ్ సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల గ్రామాల్లో ఆర్ధిక చేరువను పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక మోసాలపై అవగాహన పెంచి, డబ్బు నిర్వహణలో మంచి పద్ధతుల గురించి ప్రజలకు మార్గనిర్ధేశం చేస్తున్నామన్నారు. డిప్యూటి తహసీల్దార్ పంచాడి గోవింద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన లేకపోవడంతో మోసాలబారిన పడే అవకాశాలుంటాయన్నారు. పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఉపేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ రంపచోడవరం: ఏజెన్సీలో విద్యార్థులు బాగా చదువుకునే విధంగా సీఆర్పీలు ఎప్పటికప్పుడు మండలాల వారీగా పాఠశాలలను పరిశీలించి పర్యవేక్షించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ అన్నారు. రంపచోడవరం పీఎంఆర్సీలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు పీవో మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా వంద రోజులు ప్రోగ్రాం అమలు చేయాలన్నారు. బేస్లైన్ టెస్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. చదువులో బాగా వెనుకబడి విద్యార్థులను ఏ గ్రేడ్కు వచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. సీఆర్పీలు పాఠశాలలను పరిశీలించి ఎప్పకప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతీ మండలంలోని గ్రామాల్లో బడిబయట పిల్లలను గుర్తించి దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ఏజెన్సీలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో బాలలకు ఆటపాటలతో చదువుపై దృష్టి పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలో శిశువుల గురించి నివేదికలు సమర్పించాలన్నారు. ఎంఈవో వి.ముత్యాలరావు, త్రిమూర్తులు, శంభుడు, శాంతి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీవోకు వినతి
రంపచోడవరం: సమగ్ర శిక్ష అభియాన్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, మెంబరు గొర్లె సునీతలు ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ను కలిసి కోరారు. ఎస్టీ కమీషన్ చైర్మన్ మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే విధంగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎస్ఎస్ఏను అమలు చేసిందన్నారు. 2001సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్ఎస్ఏ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 18న సిల్వర్ జూబ్లీ కార్యక్రమం రంపచోడవరంలో ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.డీఎన్ మూర్తి, మళ్లీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫణింద్రలు పాల్గొన్నారు. ఎస్టీ కమీషన్ చైర్మన్ వివిధ సమస్యలు పరిష్కరించాలని పీవోకు తెలిపారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీలకు ముగ్గురు బాలికల ఎంపిక
కొయ్యూరు: పెదమాకవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. అనపర్తిలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కోచ్లు బోయిని నాగేశ్వరరావు,మర్రి శ్రీను పర్యవేక్షణలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెదమాకవరం పాఠశాలకు చెందిన సోమెల కీర్తి, లోచెల రాజ్యలక్ష్మి వెండి పతకాలు, దేవరాజు దుర్గాలక్ష్మి కాంస్య పతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ ముగ్గురిని సోమవారం పాఠశాల హెచ్ఎం సంధ్య, ఉపాఽధ్యాయులు అభినందించారు. -
విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు నిధులు
చింతపల్లి: చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనోత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా ప్రారంభిస్తున్నట్టు వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మన్య ప్రాంతంలో గిరిజనులకు మరింత నాణ్యమైన విత్తనాలను అందుబాటులోనికి తెచ్చే విధంగా అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తనోత్పత్తి కేంద్రానికి రూ.80 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆ నిధులతో రూ.35 లక్షలతో యంత్రాలు, రూ.20లక్షలతో భవనాలు, మరో రూ.25 లక్షలతో వలశెలు విత్తన హబ్నకు కేటాయించినట్టు తెలపారు. ఈ నెలాఖరు నాటికి టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ విత్తనోత్పత్తి కేంద్రం అందుబాటులోనికి రానుందన్నారు. ఈ విత్తనోత్పత్తి కేంద్రం అందుబాటులోనికి వస్తే గిరిజన రైతాంగానికి మరింత నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి మంచి దిగుబడులు సాధించడానికి ప్రోత్సహించవచ్చునన్నారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి ద్వారా విత్తన శుద్ధితో పాటు సర్టిఫికేషన్ చేయవచ్చునన్నారు. గిరిజన రైతాంగం ఇప్పటి వరకూ మైదాన ప్రాంతాల నుంచి విత్తనాలను తీసుకువచ్చి సాగు చేపడుతున్నారన్నారు. ఇప్పటి నుంచి ఈప్రాంత రైతాంగానికి అవసరమైన వరి, వలిశెలు, రాజ్మాతో పాటు చిరుధాన్యాలు పంటలకు సంబంధించిన విత్తనాలను ఈ విత్తనోత్పత్తి కేంద్రం ద్వారానే పొందే అవకాశం ఉంటుందన్నారు. -
● వైభవంగా నిత్యకల్యాణం ● శాస్త్రోక్తంగా గరుడసేవ
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. శాస్త్రోక్తంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. గరుడవాహనం చుట్టూ భక్తులచే ప్రదక్షిణ చేయించారు. -
స్క్రబ్ టైఫస్ కలకలం
చింతూరు: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపింది. తొలి పాజిటివ్ కేసు చింతూరు మండలంలో నమోదు కావడంతో మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గ అవయవాలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య అనే గిరిజనుడు ఈనెల నాల్గో తేదీన వ్యాధి లక్షణాలతో చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి రాగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి బ్యాక్టీరియా సోకినట్లు నిర్థారించారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతని నుంచి రక్తం సేక రించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి సోమ వారం తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. జిల్లాలో కొండలపై, అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం వ్యాధిసోకిన లక్ష్మయ్య గ్రామం కొత్తపల్లి కూడా అటవీ ప్రాంతంలోనే ఉంది. వరికోతలు జరుగుతుండడంతో ఈ సమయంలోనే లక్ష్మయ్యకు నల్లికుట్టి వ్యాధిసోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు ● స్క్రబ్ టైఫస్ అనే నల్లి(మైట్) కుట్టినప్పుడు బ్యాక్టీరియా సోకుతుంది. ● నల్లి కరిచిన ప్రాంతంలో నల్లటిమచ్చ ఏర్పడి నొప్పిలేకుండా ఉంటుంది. ● స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్ర జ్వరంతో పాటు తలనొప్పి, చలితో మొదలవుతుంది. ● కండరాల నొప్పులు, లింపు గ్రంథలు వాపు ఉంటాయి. ● కొందరికి కళ్లు ఎర్రబడతాయి. ● దగ్గు కూడా ఉంటుంది. ● కొంతమంది శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి ● రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, వృద్ధులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కవగా కనిపిస్తాయి. ● స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లో రక్తపరీక్షలు చేయిచుకోవాలి ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాలేయంపై ప్రభావం చూపుతుంది. ● తర్వాత కిడ్నీ దెబ్బతిని డయాలసిస్కు దారితీయోచ్చు ● సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుంది. సత్వర వైద్యం అవసరం స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి నల్లికాటు వల్ల వస్తుంది. తీవ్రజ్వరం, నొప్పులు, శ్యాశ తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వస్తే నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ వ్యాధికి సత్వర వైద్యం ఎంతో అవసరం. ఇది అంటువ్యాధి కానందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు వ్యాధికి సంబంధించిన నిర్థారణ కిట్లు, మందులు అస్పత్రిలో అందుబాటులో ఉంచాం. డివిజన్లో ఎవరికై నా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానంగా ఉంటే వెంటనే చింతూరు సీహెచ్సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ కోటిరెడ్డి, సూపరింటెండెంట్, సీహెచ్సీ, చింతూరు -
ఇంకా పరాయి పంచనే!
ఇందుకూరుపేట మండలకేంద్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లవుతోంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల సమస్య వేధిస్తోంది. నేటికీ అద్దె భవనాలు, వేరే శాఖల కార్యాలయాల్లో కొనసాగుతున్న దుస్థితి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంగా కారణంగా మండల కేంద్రం దేవీపట్నం ముంపునకు గురికావడంతో ఇందుకూరుపేటలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకూ సొంత భవనాలను నిర్మించకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. రంపచోడవరం/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం ముంపునకు గురికావడంతో ఇందుకూరుపేటకు మండల కేంద్రాన్ని తరలించి, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందుకూరుపేటకు సమీపంలోనే పోలవరం ముంపులో ఖాళీ చేసిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు. వారి కోసం ఏడు కాలనీలు నిర్మించా రు. మండల కేంద్రాన్ని ఇందుకూరుపేటకు మార్చి తొమ్మిదేళ్లు గడస్తున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించలేదు. అరకొరగా ఉన్న అద్దె భవనాలు, పునరావాస కాలనీల్లో అసౌర్యాల మధ్య కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఇందుకూరుపేటను మండల కేంద్రంగా మార్చిన తరువాత దేవీపట్నం నుంచి అక్కడికి ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. అయితే సొంత భవనాలను ఇంతవరకూ నిర్మించలేదు. ఖాళీగా ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇరుకుగా ఉన్న గదుల్లో సిబ్బంది విధులు నిర్వహించవలసి వస్తోంది. వివిధ పనులపై వెళ్లిన ప్రజలు కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ● పరగసానిపాడు ఆర్అండ్ఆర్ కాలనీలో చిన్న అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ను నిర్వహిస్తున్నారు. సిబ్బంది, వివిధ పనులపై ఇక్కడకు వచ్చే మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల ఎస్పీ అమిత్ బర్దర్ దేవీపట్నం పోలీస్స్టేషన్ను సందర్శించి కొత్త భవనం నిర్మాణం కోసం ఫజుల్లాబాద్లో స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇంకా కేటాయించలేదు. ● ఎంపీడీవో కార్యాలయాన్ని గతంలో అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించే వారు. తరువాత సచివాలయ భవనంలోకి మార్చారు. ● మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని స్థానికంగా ఉన్న ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇందుకూరుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు.దీంతో కళాశాల, పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ● ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని వెలుగు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని గతంలో అద్దె భవనంలో నిర్వహించగా ప్రస్తుతం రైతు భరోసా కేంద్రంలో నడుపుతున్నారు. రంపచోడవరంలోనూ... నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంలో కొన్ని కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. ట్రెజరీ కార్యాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఐటీడీఏ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. దీనికి సొంత భవనం నిర్మించేందుకు పదేళ్ల కిందట స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. అయితే ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు.ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ను ఐటీడీఏ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. సెంట్రల్ స్కిల్ బోర్డు కార్యాలయాన్ని పందిరిమామిడిలో అద్దె భవనంలో నడుపుతున్నారు. కార్మికశాఖకు కూ సొంత భవనం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. -
పాఠశాలలో తనిఖీలు
అడ్డతీగల: అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్ సోమవారం సందర్శించారు. 420 మంది విద్యార్థినులున్న పాఠశాలలో స్టాక్ రిజిష్టర్ పరిశీలించగా 6,185 కిలోల బియ్యం నిల్వ ఉన్నాయన్నారు. స్టాక్ రిజిష్టర్ ప్రకారం కందిపప్పు 32 కిలోల 500 గ్రాములు ఉండాలన్నారు.కానీ 30 కిలోల 180 గ్రాములు ఉందన్నారు. ఆయిల్ 40 ప్యాకెట్లకుగాను 36 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయన్నారు.చింతపండు, బెల్లం నిల్వలు లేవన్నారు. పాలుకు సంబంధించి ఈనెల 1 నుంచి సోమవారం వరకూ నమోదు చేయలేదన్నారు.46 మరుగుదొడ్లు ఉండగా కేవలం 10 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.స్నానాల గదులు 34 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడుగురు వర్క ర్లకు ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు.పరిశీలనలో గమనించిన అంశాలను నివేధిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించామన్నారు. -
సక్రమంగా జీతాలందక అవస్థలు పడుతున్న టీచర్లు
చింతపల్లి: సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యు.వి.గిరి తెలిపారు. స్థానిక విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు నెలల నుంచి ఆశ్రమ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు జమ కావడం లేదని చెప్పారు. దీంతో సకాలంలో బకాయిలు చెల్లించ లేక, వడ్డీలు కట్టలేక పలువురు అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. బ్యాంకులకు బకాయిలు చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోయి మళ్లీ రుణాలుపొందే అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కె.దేముళ్లు, ఏపీజీపీఈఏ అసోసియేట్ ప్రెసిడెంట్ జి.పద్మనాభం,గిరిజన ఉద్యోగులు సంఘం నాయకులు గంగరాజు, మోహనరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువతకు క్రికెటర్ కరుణకుమారి ఆదర్శం
పాడేరు రూరల్: ఆదివాసీ యువతీ, యువకులకు మహిళ అంథుల టి20 క్రికెటర్ పాంగి కరుణకుమారి ఆదర్శమని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం క్రికెటర్ పాంగి కరుణకుమారి స్వగ్రామం వంట్లమామిడిలో సందర్శించారు. అనంతరం క్రికెటర్ కరుణకుమారిని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినంధించారు, ఆనంతరం ఆమె మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక్క ఆంధురాలుగా టి20 క్రికెట్లో ఘన విజయం సాధించడం ఆదివాసీలకు ఎంతో గర్హకారణమన్నారు. ఆమెకు శిక్షణ అందించిన కోచ్ అజయ్కుమార్రెడ్డిని అభినందించారు. త్వరలోనే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిపిస్తామన్నారు. సర్పంచ్ రాంబాబు, సుహసిని, మాజీ ఎంపీటీసీ గోపి, మాజీ వైస్ ఎంపీపీ మీనా, నాయకులు పద్మ, నూకరాజు, చిట్టిబాబు, బాబూరావు, పాస్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి -
వసతి గృహ విద్యార్థినులపై కోతుల దాడి
రావికమతం: స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు రక్షణ కొరవడింది. ఆదివారం రాత్రి హాస్టల్లోకి కోతులు ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులను గాయపరిచాయి. రావికమతం మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో 96 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరిలో పాల్లికలిక స్నేహ, సేదరి మంగలపై కోతులు దాడి చేయడంతో స్పల్పంగా గాయపడ్డారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, వారిద్దరికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి నర్సీపట్నం తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అనంతరం బాలికలను వారి తల్లిదండ్రులు సోమవారం ఇళ్లకు తీసుకెళ్లారు. అక్టోబర్లో బీసీ హాస్టల్లోకి కుక్కలు ప్రవేశించి రాత్రి సమయంలో 12 మంది బాలికలపై దాడి చేశాయి. ఈ హాస్టల్కు రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బాలకలకు రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు గెమిల వాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సూరిబాబు, డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎత్తుల రాజు డిమాండ్ చేశారు. కోతుల దాడి విషయమై మేట్రిన్ లలితను వివరణ కోరగా, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కోతుల దాడిలో గాయపడిన విద్యార్థినులు స్నేహ, మంగ -
సమస్యలపై వెల్లువెత్తిన అర్జీలు
రంపచోడవరం: వై.రామవరం మండలం చవిటిదిబ్బల గ్రామంలో గురుకుల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన భూమిని గ్రామానికి చెందిన గొర్లె రాజేష్బాబు వితరణ చేస్తారని ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి, వెదుళ్ల లచ్చిరెడ్డి, సర్పంచ్ బచ్చల చిన్నఅమ్ములు ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ను కోరారు. 30 గ్రామాల వారు పదో తరగతి విద్యార్థులున్నారని తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 136 అర్జీలు అందాయి.రాజవొమ్మంగిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, 50 ఎకరాల భూమిని గుర్తించి పరిశ్రమల కోసం కేటాయించాలని వంతు బాలకృష్ణ అర్జీ అందజేశారు. వై.రామవరం ఎగువ ప్రాంతంలో పది గ్రామాల గిరిజనులకు పూర్తిస్ధాయిలో తాగునీరు అందించే విధంగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సారంకోట అబ్బాయిరెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టు, ముసురుమిల్లి ప్రాజెక్టుల ఆర్అండ్ఆర్ కాలనీల్లో 86 కుటుంబాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు ట్యాంకులు ఏర్పాటు చేయాలని, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని పీసా ఉపాధ్యక్షుడు మిర్తివాడ వీరబాబు , సిరిసం కృష్ణలు అర్జీ అందజేశారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కాఫీకి స్థిరమైన గిట్టుబాటు ధరలు
పాడేరు: అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కాఫీ పంటకు స్థిరమైన ధర లభించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీవోలు, ఎన్జీవోలతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన, చర్చా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో కాఫీ ట్రేడర్లు... ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే దానికి చట్టబద్ధత కల్పించి, ఆ అసోసియేషన్ ద్వారానే వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కాఫీకి స్థిరమైన ధరలు కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. రైతులు తమ పంటను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కాఫీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ రైతులు ముందుకు వస్తే యూనిట్ వ్యయంలో 30 రాయితీతో యంత్ర పరికరాలను అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క ట్రేడర్ తప్పనిసరిగా కాఫీ ట్రేడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన పార్చ్మెంట్ అందించాలని సూచించారు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లో బెర్రీబోరర్ సోకిన పంట సేకరణలో, పల్పింగ్, డ్రైయింగ్ విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లో నిర్మిస్తున్న రెండు ఎకో పల్పింగ్ యూనిట్ల పనులను త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాదికి అందుబాటులో తేవాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు సూచించారు. చింతపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ఎఫ్పీవోలు, ఆసక్తి గల ఎంటర్ప్రైజేస్లు లబ్ధి పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణ శ్రీపూజ, జిల్లా ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు, కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, రైతులు, కాఫీ ట్రేడర్లు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి తగ్గింపు
సీలేరు: విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడంతో గ్రిడ్ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్టు జలవిద్యుత్ కేంద్రం జెన్కో ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. సాధారణంగా రోజూ 3 నుంచి 6 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. శీతాకాలం కావడంతో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు ఒక మిలియన్ యూనిట్ల విద్యుత్ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు ఈఈ తెలిపారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో రెండు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సీలేరు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి జలవిద్యుత్ కేంద్రంలోని 60 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్ల అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు కూడా ఈ ఏడాది పుష్కలంగా ఉందని ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు.ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ -
కనువిందుగా కొండగుడి పండగ
డాబాగార్డెన్స్ : పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని రాస్హిల్స్ కొండపై వెలసిన అమలోద్బవి అమ్మవారిని దర్శించుకోవడానికి సోమవారం అశేష భక్తజనం తరలివచ్చింది. భక్తి పారవశ్యంతో మాతను స్మతిస్తూ.. ఆరాధకుల గీతాలాపనలు.. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం అగ్ర పీఠాధిపతుల బోధనలు.. ఇలా అక్కడ అణువణువునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి అమ్మ కరుణ కోసం తరలివచ్చిన ఆరాధకులతో విశాఖ జనపురిగా మారిపోయింది. కుల, మతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకోవడంతో పరమత సహనం పరిఢవిల్లింది. భక్తిశ్రద్ధలతో దివ్యపూజా బలి కొండగుడిలో వెలసిన అమలోద్బవి మాత(విశాఖ పురి మేరీమాత) ఉత్సవాలు గత నెల 29న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8 సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం దివ్య పూజ జరిపారు. పూజలో ఎక్కువ మంది కన్యసీ్త్రలు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరై ప్రార్థనలు చేశారు. ఉదయం 7.30 గంటలకు గుహవద్ద విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలి పూజ ప్రసంగమిచ్చారు. 350 మంది వలంటీర్లు, 50 మంది గురువులే గాక నగరంలోని వివిధ చర్చిలకు చెందిన ఫాదర్లు, బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వెల్లువలా ఊరేగింపు మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలెయిసిస్ పాఠశాల నుంచి ఆరాధకులు ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. ఆరాధకుల సందర్శనార్ధం ఆలయం బయట అమలోద్బవి స్వరూపాన్ని ఉంచారు. ఆరాధకులు అమ్మవారికి తమ శక్తి మేరకు బంగారం, వెండి కానుకలు సమర్పించుకున్నారు. కొంత మంది తలనీలాలు సమర్పించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు. లూర్ధుమాత గుహ వద్ద దివ్యపూజ బలితో మహోత్సవం ముగిసింది. జోరుగా వ్యాపారం పాతపోస్టాఫీసు, కోటవీధి, ఫెర్రీరోడ్డు, అంబుసరంగ్ వీధి, కన్వేయర బెల్ట్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ల మేర దుకాణాలు వెలిశాయి. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, కొండగుడి చరిత్ర, ఏసుక్రీస్తు, మేరిమాత బొమ్మలు కొలువుదీరాయి. వీటితో పాటు మిఠాయిలు, శనగలు, కర్జూరం వ్యాపారం జోరుగా సాగింది. కొవ్వొత్తుల వ్యాపారం ఎక్కువగా సాగింది. -
నేటి నుంచి యథావిధిగా అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు
సీలేరు: మావోయిస్టుల పీఎల్జీవో వారోత్సవాల సందర్భంగా నిలిపివేసిన అంతర్రాష్ట్ర బస్ సర్వీసులను మంగళవారం నుంచి యథావిధిగా నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు వారం రోజులుగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారంతో మావోయిస్టుల వారోత్సవాలు ముగియడంతో ఆ బస్సు సర్వీసులను యథావిధిగా నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
వణికిస్తున్న చలి
హు..హు..హు... అహా..హ..హ చింతపల్లి: జిల్లాలో చలి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తీవ్రంగా కురుస్తూ.. శీతలగాలులు వీస్తుండడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. చలి మంటలు కాగుతున్నా ఉపశమనం కలగడం లేదు. పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. చిరు వ్యాపారులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.కాగా పర్యాటకులు క్యాంప్ ఫైర్లు వేసుకుని చలి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా సింగిల్ డిజిట్కు పడిపోయాయి. సోమవారం అరకులోయలో 3.6 డిగ్రీలు, జి.మాడుగుల, డుంబ్రిగుడలలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ హుకుంపేటలో 4.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 4.8, పాడేరులో 4.8, పెదబయలులో 6.1, చింతపల్లిలో 10.5, కొయ్యూరులో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6 డిగ్రీలు, మారేడుమిల్లిలో 13.2, రాజవొమ్మంగిలో 13.2, అడ్డతీగలలో 15.0, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు నమోదు కాగా, చింతూరు డివిజన్ చింతూరులో 14.5, ఎటపాకలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు చలి మంటలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకూ పొగమంచు తీవ్రంగా కురుస్తోంది. మంచు ముసుగులో రహదారులు పూర్తిగా కనిపించక వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. జి.మాడుగుల: మండల కేంద్రం జి.మాడుగులలో ఆదివారం రాత్రి నుంచి చలి విజృంభించింది. సోమవారం ఉదయం 9గంటల వరకూ సూర్యోదయం కాలేదు. పొగ మంచు విపరీతంగా కురవడంతో రహదారులు పూర్తిగా కనిపించక వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముంచంగిపుట్టు: మండలంలో సోమవారం చలి తీవ్రత అధికమైంది. పనులకు వెళ్లే కూలీలు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు,పెదబయలు వైపు వెళ్లే వాహనాదరులు హెడ్లైట్ వేసుకుని మంచులో అతికష్టం మీద రాకపోకలు సాగించారు. -
పనిచేస్తారు?
మీరెక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నమూనా సాక్షి, విశాఖపట్నం : దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం గెజిట్ ఇవ్వకుండానే సర్దుబాట్లు, దిద్దుబాట్లతో నడిపిస్తోంది. కొత్త జోన్ పరిధిలోని డివిజన్లు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్లో ఎక్కడ పనిచేయాలని కోరుకుంటున్నారో తెలపాలని ఉద్యోగులకు ఈనెల 2వ తేదీన ఆప్షన్లు ఇస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జోన్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) ఆమోదం సమయంలో చెప్పిన విధంగానే, ప్రస్తుతం ఉన్న నాన్–గెజిటెడ్ పోస్టులను సర్దుబాటు చేస్తూ బోర్డు ఈనెల 4న మరో సర్క్యులర్ విడుదల చేసింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ను రైల్వేబోర్డు ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. అయితే రైల్వే బోర్డు కొత్త పోస్టుల నియామకాలు, నిధుల విషయంలో ఆంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రకటనలు, వరుస ఉత్తర్వులు జారీ చేస్తోంది. గెజిట్ విడుదల కాకపోవడంతో తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీఎంఆర్డీఏ డెక్లో తాత్కాలిక జీఎం కార్యాలయం పనులు పూర్తయినా.. గెజిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఉద్యోగులూ.. ఆప్షన్లు ఎంచుకోండి కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్తో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలంటూ రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేజోన్లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖ డివిజన్గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్లో చేర్చుతూ డీపీఆర్ తయారు చేశారు. కొత్త జోన్ హెడ్క్వార్టర్స్లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు పోస్టింగ్లపై ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. జోన్ హెడ్క్వార్టర్ కోసం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్కోస్ట్ రైల్వే హెడ్క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యమిస్తుండగా.. రెండో ప్రాధాన్యం కింద మిగిలిన డివిజన్లకు సంబంధించిన వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయగడ డివిజన్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. రెండో ప్రాధాన్యత కింద ఈస్ట్కోస్ట్ జోన్, తర్వాత ఇతర జోన్లు ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి 4 వారాల సమయం ఇస్తున్నట్లు రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఆదేశించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల విభజన షురూ విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగుల విభజనను కేడర్ ప్రకారం కేటాయింపులు చేస్తూ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ కోస్తా జోన్ హెడ్క్వార్టర్స్ కోసం 1,100 నాన్గెజిటెడ్ పోస్టుల బదిలీ జరగాలని డీపీఆర్లో స్పష్టం చేశారు. దానికనుగుణంగా కేడర్ల వారీగా బదిలీలకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి 959, వాల్తేరు డివిజన్ నుంచి 129 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ నుంచి 12 పోస్టులు బదిలీ చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్ విభాగంలో 298, ఇంజినీరింగ్ 104, కమర్షియల్ విభాగం నుంచి 101 పోస్టులు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా రాయగడ డివిజన్ కోసం డీపీఆర్లో 600 నాన్ గెజిటెడ్ పోస్టులు కేటాయించారు. ఈ డివిజన్ కోసం వాల్తేరు డివిజన్ హెడ్క్వార్టర్స్ నుంచి 381 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ హెడ్ క్వార్టర్స్ నుంచి 219 పోస్టులు కేటాయించారు. పర్సనల్ విభాగంలో 110, ఆపరేటింగ్ నుంచి 72, ఎలక్ట్రికల్ విభాగం 66 పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల నిర్వహణ బోర్డు ఆమోదించిన ప్రామాణిక హోదాల్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. -
ఉత్సాహంగా 5కే మారథాన్
● డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహణ ● వంజంగి మేఘాల కొండపై ప్రారంభించిన ఎస్పీ అమిత్బర్దర్ ● పాల్గొన్న గిరి యువత పాడేరు : నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు గిరిజన యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన స్వేచ్ఛా జీవితం గడపాలని ఎస్పీ అమిత్బర్దర్ సూచించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం వంజంగి మేఘాల కొండ దిగువ ప్రాంతం నుంచి కొండపైకి సుమారు ఐదు కిలోమీటర్ల మేర 5కే రన్ నిర్వహించారు. ఎస్పీ అమిత్బర్దర్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది గిరిజన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన యువత, విద్యార్థులు ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ప్రాథమిక విద్య దశ నుంచి మంచి క్రమ శిక్షణ అలవరచుకోవాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పటికి మాట వినకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్, సీఐ దీనబంధు, పోలీసు సిబ్బంది, గిరిజన యువత పాల్గొన్నారు. -
పిల్లలను చూడనీయడం లేదు...
గొలుగొండ: గొలుగొండ కస్తూర్భా బాలికల వసతిగృహం వద్ద ఆదివారం సాయత్రం తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఆదివారం కావడంతో తమ పిల్లలను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు తమ పిల్లలను చూపించకుండా ఉండడంపై మండిపడ్డారు. ప్రతి ఆదివారం తమ పిల్లలను చూడడానికి వస్తున్న సమయంలో ఇక్కడ సిబ్బంది దుర్భాషలాడి అవమానిస్తున్నారని ఆరోపించారు. పిల్లల అవసరాలు ఉంటాయని వాటిని తెలుసుకొని తీసుకురావడం కోసం వస్తే ఇక్కడ పట్టించుకోలేదన్నారు. దీనిపై గేటు వద్ద అరగంటపాటు బాలికల తల్లిదండ్రులు గొడవకు దిగారు. సిబ్బంది పనితీరు బాగోలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతీసారి ఇదే జరుగుతుందని, పిల్లలను కలవనీయకుండా గేటు తాళం తీయడం లేదని ఆరోపించారు. వసతిగృహం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వారం రోజులు క్రితం రాత్రి 11 గంటలకు భోజనం పెట్టడం జరిగిందని ఆరోపించారు. పిల్లలకు ఇక్కడి కష్టాలు తమకు చెపుతుంటే చెప్పిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఫిర్యాదులు చేస్తామని తెలిపారు.కస్తూర్బా హాస్టల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన -
వైకల్యాన్ని అధిగమిస్తే అద్భుత ఫలితాలు
● డీఈవో అప్పారావునాయుడు ● ఉత్సాహంగా దివ్యాంగ బాలల ఆటల పోటీలు అనకాపల్లి టౌన్: వైకల్యాన్ని అధిగమించి ఆత్మస్దైర్యాన్ని పెంపొందించుకోవాలని, దివ్యాంగ బాలబాలికల అభిరుచులకు తగిన విధంగా తర్ఫీదునివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక ఏఎంఏఎల్ కళాశాల క్రీడా మైదానంలో సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం, పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆంఽధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించిన పారా పోటీలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ దివ్యాంగ బాలబాలికలను ఆదరించి వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. దివ్యాంగులు వివిధ రంగాల్లో ముఖ్యంగా క్రీడా రంగాల్లో గెలుపొందిన వారి విజయగాధలను తెలిపి తల్లిదండ్రుల్లో, దివ్యాంగ విద్యార్థులలో స్పూర్తిని నింపారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పి అప్పారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిరంజన్, పారాస్పోర్స్ కోచ్లు రాజేష్, అప్పారావు, వివిధ పాఠశాలల ఫిజికల్ డైరక్టర్లు, ఉపాద్యాయులు బి.ఎ. రాజు, మహాలక్ష్మి నాయుడు, దేముడు నాయుడు, జగన్నాథం నాయుడు, పోలిరాజు పాల్గొన్నారు. -
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో మన్యం గజగజలాడుతోంది. ఆదివారం జి.మాడుగులలో 5.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి డుంబ్రిగుడలో 8.2, అరకువ్యాలీలో 8.9 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు, హుకుంపేటలో 9.6 డిగ్రీలు, పెదబయలులో 10.2 డిగ్రీలు పాడేరులో 10.9 డిగ్రీలు కొయ్యూరులో 13.1 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు. ● రంపచోడవరం డివిజన్న్ వై.రామవరంలో 11.5 డిగ్రీలు, మారేడుమిల్లిలో 13.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.1 డిగ్రీలు, అడ్డతీగల, రంపచోడవరంలో 16.2 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 15.0 డిగ్రీలు, ఎటపాకలో 15.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు.జి.మాడుగులలో 5.3, ముంచంగిపుట్టులో 7.7 కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు -
ఫైనాన్స్ కంపెనీలను నిషేధించాలి
చింతూరు: ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజనేతర ఫైనాన్స్ కంపెనీలను నిషేధించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోడె రాఘవయ్య డిమాండ్ చేశారు. ఆదివారం చింతూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లోని పోలవరం నిర్వాసితులను ఫైనాన్స్ కంపెనీలు మభ్యపెడుతున్నాయన్నారు. ట్రాక్టర్లు, కార్లు, బైక్లు ఫైనాన్స్ చేస్తామంటూ పోలవరం పరిహారం కాజేసేందుకు యత్నిస్తున్నారని, దీనివవల్ల నిర్వాసితులు ఆర్థికంగా నష్టపోయే అవకాశముందని ఆయన సూచించారు. అధికారులు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల ఉపాధి కోసం సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తాటిబెల్లం, తాటినీరా, స్వీట్ల తయారీ వంటి పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రవ్వ ప్రసాద్, మిడియం కొండయ్య, పాయం రవి, భవానీ, లక్ష్మి, పావని పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోడె రాఘవయ్య డిమాండ్ -
థింసా నృత్యంతోపర్యాటకులకు వినోదం
● భీమనాపల్లిలో ప్రదర్శన వేదిక ఏర్పాటు ● స్వయం ఉపాధి పొందుతున్నఆదివాసీ మహిళలు చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో ఆదివాసీలు థింసా నృత్యంతో పర్యాటకులకు పంచుతున్నారు. మరోవైపు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆదివారం ఐటీడీఏ, పంచాయతీ సహకారంతో ఆదివాసీ గిరిజన థింసా కమిటీ ఆధ్వర్యంలో చెరువులవేనం ముఖధ్వారం భీమనాపల్లిలో ప్రదర్శన వేదిక ఏర్పాటుచేశారు. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నృత్యాన్ని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు ప్రదర్శిస్తారని కమిటీ తెలిపింది. ఈ ప్రదర్శన వీక్షించేందుకు పర్యాటకుల నుంచి నిర్వాహక కమిటీ రూ.30 వసూలు చేస్తోంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆదివాసీ మహిళలతో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహక కమిటీ చైర్మన్ బొబ్బిలి కామేశ్వరరావు, వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్, కొర్ర శాంతి, మాజీ సర్పంచ్ రఘునాథ్, వీఆర్వో సధానందరావు, పీసీ కమిటీ ఉపాధ్యక్షుడు బలరామ్ పాల్గొన్నారు. -
మహిళలపై దాడులను నియంత్రించాలి
చింతూరు: మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులు, అత్యాచారాల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మడివి శ్రీదేవి డిమాండ్ చేశారు. మహిళా హింస అనే అంశంపై ఆదివారం చింతూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు హింసకు గురవుతున్నారని, వీటికి ప్రధాన కారణమైన మద్యం షాపులను ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకున్నాయేని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బార్లకు లైసెన్సులు ఇవ్వడంతో పాటు బెల్ట్షాపుల ద్వారా ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ఆమె ఆరోపించారు. మాదకద్రవ్యాల కారణంగా యువత తప్పుదారిలో నడుస్తుందని, ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యం కారణంగా సమాజంలో మహిళలపై అనేక ఘోరాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు ముర్రం రంగమ్మ, బట్ట రాములమ్మ, మల్లం సుబ్బమ్మ, జయలక్ష్మి పాల్గొన్నారు. -
‘శంబాల’ ఏ ఒక్కర్నీ నిరాశ పరచదు
హీరో ఆది సాయికుమార్డాబాగార్డెన్స్: సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ యూనిట్ ఆదివారం నగరంలో సందడి చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, సావసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 25న విడుదల కాబోతున్న శంబాల చిత్రం ట్రైలర్ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ట్రైలర్కు అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ తమ టీజర్ను రిలీజ్ చేసిన దుల్కర్కు, సహకారమందిస్తున్న థమన్, స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ విడుదల చేసిన డార్లింగ్ ప్రభాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషనల్ కంటెంట్కు అన్ని చోట్లా పాజిటివ్ స్పందన వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. టీజర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తమకు సహకరించిన వంశీ, ప్రమోద్, ప్రసాద్కు కృతజ్ఞతలు చెబుతూ, ట్రైలర్ చూసిన కిరణ్ అబ్బవరం, రానా కూడా మెచ్చుకున్నారని తెలిపారు. ఈ మూవీకి తన వంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారన్నారు. హిందీ రిలీజ్ గురించి అందరూ అడుగుతున్నారని, నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ మూవీని నిర్మించారన్నారు. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారని, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ శంబాల వంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. -
విహారంలో విషాదం
పాడేరు : సెలవు కావడంతో స్నేహితులతో విహారానికి బయలుదేరిన విద్యార్థిని మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబళించింది. చింతలవీధి సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నా యి. చింతపల్లి మండలం తా జంగి గ్రామా నికి చెందిన రామ్ బలభద్ర పాడేరు మండలం కందమామిడిలోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక బీవీకే పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో వంజంగి మేఘాల కొండకు బైక్పై స్నేహితులను ఎక్కించుకొని బయలుదేరాడు. చింతలవీధి జంక్షన్ వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో విద్యార్థి రామ్బలభద్ర మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతితో తాజంగి, కందమామిడి ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వంజంగి కొండకు బయలుదేరిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి మరో ఇద్దరికి గాయాలు బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఘటన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు -
ఆకట్టుకున్న ‘సిరి గంధం’ నాటిక
మునగపాక: మునగపాక నందీశ్వర కళాప్రాంగణం, తులసీ కళావేదికపై ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ‘సిరి గంధం’ నాటిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దివంగత రంగస్థల దర్శకుడు మొతికా సాంబశివరావు మాస్టారు 10వ సంస్మరణలో భాగంగా ఈ నాటిక ప్రదర్శించారు. మునగపాకకు చెందిన మిత్ర కళా యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నాటికకు శ్రీ స్నిగ్ద రచన అందించగా దాడి ముసిలినాయుడు దర్శకత్వం వహించారు. నాటికలోని నటీ నటులు అద్బుతంగా నటించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సాంబశివరావు మాస్టారు చిత్రపటం వద్ద వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ నివాళులర్పించి మాట్లాడారు. ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత సాంబశివరావుకే దక్కుతుందన్నారు. వారి ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దిమ్మల అప్పారావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, పెద్దలు టెక్కలి పరశురామ్, మొల్లేటి సత్యనారాయణ, కాండ్రేగుల జగ్గారావు, డాక్టర్ బద్దెం సూర్యనారాయణ, బొడ్డేడ రాజు, టెక్కల సూరప్పారావుతో పాటు సాంబశివరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రికి ఓఎన్జీసీ వితరణ
● ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లుఅందజేత పాడేరు : సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓఎన్జీసీ సంస్థ (రాజమహేంద్రవరం) సీఎస్సార్ నిధుల నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి 40 ఆక్సిజన్ సిలిండర్లు, 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీటిని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతకు ఓఎన్జీసీ సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్ అందజేశారు. వీటిని ఆపరేషన్ థియేటర్లు, ఎన్ఎన్సీయూ. క్యాజువాలల్టీ విభాగాలతో పాటు అత్యవసర అంబులెన్స్ విభాగాల్లో వినియోగించాలని ఆస్పత్రి నిర్వాహకులను ఆయన కోరారు. -
కొండ చీపురు
పాడేరు డివిజన్లో వాణిజ్యపరంగా కొండచీపుళ్ల సాగు చేపట్టిన గిరిజన రైతులు గిట్టుబాటు ధరలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో ధర పతనంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండేళ్ల క్రితం కట్ట రూ.60 నుంచి రూ.70కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు. దీంతో కట్ట ధర రూ.30కు ఒక్కసారిగా పడిపోవడంతో కూలిడబ్బులు కూడా దక్కడం లేదని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో ధర లేక గిరి రైతుల ఉసూరు ● గతంలో కట్ట రూ.60 నుంచి రూ.70 ● నేడు రూ.30 ● కనీసం మోత కూలి రాని వైనం ● దయనీయంగా పరిస్థితి సాక్షి,పాడేరు: ఏజెన్సీలో కొండచీపుళ్ల సాగుతో ఒకప్పుడు మంచి ఆదాయం పొందిన గిరిజన రైతులు ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు కలిసిరాక నష్టాల పాలవుతున్నారు. గిట్టుబాటు ధరల్లేక ఉసూరుమంటున్నారు. ● పూర్వం చీపురు మొక్కలు సేకరించేందుకు గిరిజనులు దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు. కొండచీపుళ్లకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కాలక్రమేణా గిరిజనులే స్వయంగా సాగు చేస్తున్నారు. డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు, అనంతగిరి మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో కొండపోడు, మెట్టభూముల్లో గిరిజనులు పండిస్తున్నారు. అడవులకు వెళ్లడం మానుకున్న గిరిజనులు తమ గ్రామాలకు దగ్గరలోనే సాగు చేపట్టి మంచి ఆదాయం పొందేవారు. ప్రస్తుతం చీపురుపుల్లల సేకరణలో గిరిజనులు నిమగ్నమయ్యారు. బాగా ఎండలో ఆరబెట్టి కట్టలుగా తయారుచేస్తున్నారు. ఎకరా సాగుపై గతంలో కనీసం రూ.5 వేల వరకు ఆదాయం వచ్చేది. ధర పతనం కావడంతో సాగు చేపట్టిన గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ● గత రెండేళ్లుగా ధరల్లేక ఆర్థికంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు తెలిపారు. ఒకప్పుడు వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి పోటాపోటీగా కొండచీపురు కట్ట రూ.60 నుంచి రూ.70కు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో వారపు సంతలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లకు మోసుకువెళ్లి అమ్మాల్సి వస్తోందని వారు వాపోయారు. కట్ట ధర రూ.30 లోపే.. కొండచీపుళ్ల ధర రెండేళ్లుగా పతనమైంది. ఇప్పుడు తమ వద్ద కట్ట రూ.30 ధరకు మించి కొనడం లేదని గిరిజన రైతులు తెలిపారు. శనివారం హుకుంపేట వారపుసంతలో కొనుగోలు చేసే వారే కరవయ్యారు. పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల నుంచి కొండచీపుళ్లను భారీగా తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు గిట్టుబాటు ధర కోసం గిరిజన రైతులు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో తిరిగి గ్రామాలకు మోసుకుని వెళ్లలేక తక్కువ ధరకు అమ్ముకుని వెనుదిరిగారు. వ్యాపారుల సిండికేట్ ప్రభావం కూడా మార్కెటింగ్పై చూపుతుందని వారు వాపోతున్నారు. విశాఖపట్నం, గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలుకు జీసీసీ దూరం గిరిజన సహకార సంస్థ గత పదేళ్ల నుంచి కొండచీపుళ్ల కొనుగోలుకు దూరంగా ఉంది.ఈ పంటను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జీసీసీపై ఉంది. నష్టం వస్తుందన్న సాకుతో చాన్నాళ్ల నుంచి కొనుగోలు చేయడం లేదు.రెండేళ్లలో ధరలు తగ్గడం దారుణం కొండచీపుళ్ల కట్టలకు ఈ రెండేళ్లలో ధరలు భారీగా తగ్గడం దారుణం. తమ వద్దకు వ్యాపారుల వచ్చి కొనుగోలు చేసే వారు. గతంలో చీపురు కట్ట రూ.60కు అమ్మేవాళ్లం. ఈఏడాది ధర దారుణంగా తగ్గించేశారు. కట్ట రూ.25నుంచి రూ.30కు కొంటున్నారు. జీసీసీ, వెలుగు సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కొండచీపుళ్లకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి సారించాలి. – పొడువ బొంజుబాబు, గిరిజన రైతు,గంగరాజుపుట్టు, హుకుంపేట మండలం -
ఆదివాసీలతోనే ఉద్యోగాల నియామకం
● ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు డిమాండ్ ● పాడేరులో రాష్ట్ర మహాసభ నిర్వహణ పాడేరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలతోనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదివాసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని కాఫీ బోర్డు అతిథి గృహంలో ఆదివారం జరిగిన ఆదివాసీ ఉపాధ్యాయ(ఉద్యోగుల)సంఘ రాష్ట్ర మహసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు చట్టాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో అన్నిరంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియమాకాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతంలో సర్వం హక్కులు ఆదివాసీలకు ఉన్నప్పటికీ ఉద్యోగ నియామకాల్లోయ మాత్రం తీవ్ర ఆన్యాయం చేస్తున్నారన్నారు. హక్కులు, చట్టాలను కాపాడాల్సిన పాలకులే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీచట్టాలు సక్రమంగా అమలు జరగటం లేదన్నారు. తెలంగాణ ఆదివాసీ ఉపాధ్యాయ(ఉద్యోగుల) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు మాట్లాడుతూ మన హక్కులు చట్టాలపై ఆదివాసీ ఉద్యోగ, ప్రజా,విద్యార్థి సంఘాలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన విధానాలతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారన్నారు, ఇటీవల కాలంలో ఏపీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను రాత్రి బస చేసి విద్యార్థుల ఆరోగ్య, ఇతర ఆంశాలతో ముడిపెట్టి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నరన్నారు. నూతన విధానాలతో కూడిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుల సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా సరియం అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా కణివి రామకృష్ణ, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, జిల్లాల నుంచి ఉపాధ్యాయ సంఘాల (ఆదివాసీ జేఏసీ నేతలు శేషాద్రి, రామారావుదొర, రాంబాబు, కేశవరావు, సూర్యనారాయణపడాల్, సిద్ధేశ్వరావు, భాస్క రరావు పాల్గొన్నారు -
విశాఖ
క్షిపణి ప్రయోగ కేంద్రంగా సాక్షి, విశాఖపట్నం : భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. అణ్వాయుధ పరీక్షల్లోనూ తనదైన ముద్ర వేస్తూ విశాఖ తీరంలో.. అత్యంత కీలకమైన ప్రయోగాలకు వేదికగా మారుతోంది. గతేడాది కే4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన తొలి నగరంగా రక్షణ శిఖరాలెక్కిన విశాఖ.. మరో మిసైల్ టెస్టింగ్కు సిద్ధమవుతోంది. ఈ నెల 11న విశాఖ సముద్ర జలాల్లో క్షిపణి ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 1,190 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వార్ బేస్ నుంచి హిందూ మహా సముద్రం కలిసే ప్రాంతం వరకూ డేంజర్ జోన్గా ప్రకటించింది. ఇప్పటికే అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ కేంద్రం ‘త్రినేత్ర’ విశాఖలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వరుస ప్రయోగాలకు కేంద్రంగా విశాఖ మారనుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 11న జరగనుందని స్పష్టమవుతోంది. ఇందుకోసం మొత్తం 1,190 ప్రాంతం వరకూ డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. రెండు వారాల క్రితం విశాఖ తీరంలో డిసెంబర్ 1 నుంచి 4 మధ్యలో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3,485 కిమీ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. దాన్ని రద్దు చేస్తూ తాజాగా కొత్త నో ఫ్లైజోన్ని ప్రకటించారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతని ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాము ల్ని అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంతవరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారిమళ్లించనున్నారు. భారత కాలమానం ప్రకారం 11వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో ఈ మిసైల్ టెస్టింగ్ ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. త్రినేత్ర రాకతో మరింత కీలకంగా.. వ్యూహాత్మక నేవల్ బేస్ ఐఎన్ఎస్ కళింగ.. అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారింది. నావల్ వెపన్ సిస్టమ్స్ను పరీక్షించడానికి సుమారు రూ.5 కోట్లతో అత్యాధునిక నేవల్ ఆర్మెమెంట్ ఇన్స్పెక్టొరేట్ కేంద్రం ‘త్రినేత్ర’ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నౌకాదళ ఆయుధ సంపత్తి నాణ్యత పరిశీలన, లైఫ్టైమ్ చెకింగ్ మొదలైన అంశాల కోసం... ఇప్పటి వరకూ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)లపైనే భారత నౌకాదళం ఆధారపడేది. ఇకపై భీమిలి కేంద్రంగా ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు చేసిన త్రినేత్ర ద్వారా ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించనున్నారు. క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల సామర్థ్యమెలా ఉంది.? ఇంకా వాటి జీవిత కాలం ఎన్ని రోజులు ఉంటుంది.? మొదలైన పరిశీలనల్ని చేసే అత్యాధునిక సాంకేతికత త్రినేత్రలో ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడి పరికరాల్ని తయారు చేసినట్లు తూర్పు నౌకాదళవర్గాలు చెబుతున్నాయి. స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ సెంటర్లో క్షిపణులు, రాకెట్లు, సంబంధిత వ్యవస్థల కీలక పనితీరు వివరాల్ని నమోదు చేయడంతో పాటు.. రికార్డ్ కూడా చేసేలా రూపొందించారు. దీని ద్వారా.. నావల్ ఆర్మమెంట్ సిస్టమ్స్ పనితీరుకు సంబంధించి సమగ్రంగా అంచనా వెయ్యొచ్చు. ఆయుధ పరీక్ష మౌలిక సదుపాయాల కల్పనలో త్రినేత్ర ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. విశాఖ తీరానికి కొత్తేంకాదు..! విశాఖ తీరానికి క్షిపణి ప్రయోగాలు కొత్తేంకాదు. ఇప్పటికే అత్యంత కీలకమైన మిసైల్ టెస్టింగ్ నిర్వహించి.. చరిత్ర సృష్టించింది. గతేడాది నవంబర్లో అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్ను భారత నౌకాదళం విశాఖ తీరంలో విజయవంతంగా నిర్వహించింది. విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన న్యూక్లియర్ సబ్మైరెన్ ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ మిసైల్ని పరీక్షించగా.. 3500 కిలోమీటర్ల రేంజ్ను అత్యంత వేగవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం గణనీయంగా పెరిగి.. అగ్రదేశాలకు విశాఖ నుంచి సవాల్ విసిరింది. ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ సబ్మైరెన్ల నుంచి మిసైల్ దాడి చేయగల సామర్థ్యం ఆసియా దేశాల్లో కేవలం చైనాకు మాత్రమే ఉండేది. కే–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత సబ్మైరెన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియా దేశాల్లో రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామి భారత్ అమ్ముల పొదిలోకి రానుంది. ఇది వస్తే.. 5000 కిమీ రేంజ్ ఉన్న కే5 మిసైల్స్ని కూడా ప్రయోగించే సామర్థ్యం భారత్ సొంతం కానుంది. ఇప్పుడు ఏ క్షిపణి ప్రయోగం చేస్తారన్న అంశాన్ని రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
రసవత్తరంగా రోలర్ హాకీ
విశాఖస్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా ఆదివారం వీఎంఆర్డీఏ పార్కులోని రింక్–1, రింక్–2లలో టైనీటాట్స్, కాడెట్, సబ్ జూనియర్ విభాగాల రోలర్ హాకీ పోటీలను నిర్వహించారు. చిన్నారులు తమ స్కేటింగ్ విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల జట్లను రెండు పూల్స్గా విభజించి పోటీలు నిర్వహించారు. టైనీటాట్స్ బాలుర తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్తో కేరళ జట్టు, రెండో మ్యాచ్లో కర్నాటక జట్టు ఏ పూల్లో తలపడ్డాయి. కాడెట్ బాలురలో ఆంధ్రప్రదేశ్తో కర్నాటక జట్టు ఏ పూల్లో తలపడగా, కాడెట్ బాలికల్లో ఆంధ్రప్రదేశ్తో కేరళ బీ పూల్లో పోటీపడింది. సబ్ జూనియర్ బాలుర విభాగం బీ పూల్లో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ, బాలికల విభాగం ఏ పూల్లో ఏపీతో కర్నాటక పోటీపడ్డాయి. సబ్జూనియర్ మిక్స్డ్ కేటగిరీ బీ పూల్లో ఆంధ్రప్రదేశ్తో తమిళనాడు, మరో మ్యాచ్లో ఏపీతో కేరళ తలపడ్డాయి. మరోవైపు డైనమిక్ స్కేట్బోర్డ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆదివారం ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. సోమవారం నుంచి వీఎంఆర్డీఏ పార్క్లోని స్కేట్బోర్డ్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ విభాగంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి స్కేట్బోర్డ్ పోటీలు -
జీతాలకూ ఎదురుచూపులే..
మహారాణిపేట: అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారిని నెలల తరబడి పస్తులు ఉంచుతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రధానంగా వైద్య రంగంలో కీలకమైన కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 39 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరు ఈ ఏడాది మే నుంచి విధుల్లో ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, ఇల్లు గడవని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనుమతులున్నా.. అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చినా, ఆ ఫైల్ ముందుకు కదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కలెక్టర్ అనుమతి ఇచ్చిన ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారి ద్వారా ఏపీ అవుట్సోర్సింగ్ శాఖకు పంపి ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, ఆ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెడుతున్నట్లు సమాచారం. పర్యవేక్షణ లోపం : కేజీహెచ్, ఏఎంసీలలో అడుగడుగునా పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పరిపాలన లోపాలు, ఆధిపత్య పోరు వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్ పేరుకే ఉన్నారు గానీ.. పలు కార్యకలాపాల్లో అధికారుల అతిజోక్యం వల్ల పనులు సకాలంలో జరగడం లేదు. అనేక పాలనాపరమైన అంశాలు కుంటుపడుతున్నాయి. కలెక్టర్ చొరవ చూపాలి గత ఏడు నెలలుగా జీతాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఉద్యోగ భద్రతపై భయంతో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న 39 కుటుంబాలను ఆదుకునేందుకు కలెక్టర్ తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జీతాలకూ లంచాలా? పెండింగ్లో ఉన్న జీతాల ఫైలును కదిలించడానికి కేజీహెచ్లోని కొందరు అధికారులు బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. వైరాలజీ ల్యాబ్, ఇతర వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవాలా? లేక అధికారులకు ముడుపులు ఇవ్వాలా? అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒకమారు కలిసిన అందం
ఏయూక్యాంపస్: విశాఖ యువతకు ఒక మధురానుభూతిని పంచుతూ గాయకుడు కార్తీక్ లైవ్ షో ఆదివారం సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్లో ఉత్సాహంగా జరిగింది. ‘చిలిపిగ చూస్తా ని న్నే’ వంటి గీతా లను ఆలపిస్తూ కార్తీక్ ప్రేక్షకులను అలరించారు. ‘మహా గణపతి మనసా స్మరామి’ అనే శాసీ్త్రయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, అనంతరం ‘ఒకమారు కలిసిన అందం’ వంటి పాటలతో యువతలో జోష్ నింపింది. సుమారు రెండు గంటలకు పైగా సాగిన మ్యూజిక్ కన్సర్ట్కు నగర యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక్తో గొంతు కలిపారు. తన పాటలతో కార్తీక్ సండే సాయంత్రాన్ని సంగీత సాగరంగా మార్చగా, యువత ఉత్సాహంగా స్టెప్పులేశారు. ‘ఏముందిరా వైజాగ్’ అంటూ కార్తీక్ అన్న మాటలకు యువత కేరింతలు కొట్టింది. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో పోలీసులకు కొంత ఇబ్బంది తప్పలేదు.ఉత్సాహంగా కార్తీక్ మ్యూజిక్ షో -
పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి
● ఆదివారం రికార్డుస్థాయిలో రాక ● వంజంగి హిల్స్ సందర్శన పోటెత్తిన వైనం ● అటవీశాఖకు రూ.1,88,590 ఆదాయం పాడేరు : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం సెలవు కావడంతో మైదాన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి సందడి చేశారు. వంజంగి మేఘాల కొండకు పోటెత్తారు. శనివారం రాత్రి పాడేరు పట్టణంతో పాటు వంజంగి కొండ దిగువున రిసార్ట్స్, హోటళ్లు, క్యాంపెయిన్ టెంట్లలో పర్యాటకులు బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు వంజంగి కొండపైకి బయలుదేరారు. వేకువజామున మేఘాలను చీల్చుకుంటూ వస్తున్న ఉదయభానుడితోపాటు మంచు అందాలు, పాల సమూద్రాన్ని తలపించేలా ఉన్న మేఘాల దృశ్యాలను చూసి పరవశించిపోయారు. ప్రకృతి అందాలను కనులారా వీక్షించి తనివితీరా ఆస్వాదించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఆదివారం వంజంగి మేఘాల కొండకు 3500 మంది పర్యాటకులు సందర్శించారని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు ద్వారా రూ.1,88,590 ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది పర్యాటక సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఈ ఆదివారమే రికార్డు స్థాయిలో పర్యాటకులు వచ్చారని అటవీశాఖ అధికారులు, చిరు వ్యాపారులు తెలిపారు. లంబసింగికి పోటెత్తిన పర్యాటకులు చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు.ఆదివారం వీకెండ్ కావడంతో మైదాన ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్, చెరువులవేనంలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద 11 గంటల వరకు పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను సెల్ఫోన్లలో బంధించేందుకు పోటీపడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటు షికారుపై ఆసక్తిచూపారు. స్ట్రాబెర్రీ తోటల్లో తాజా పండ్లను కొనుగోలు చేశారు. అలాగే యర్రవరం జలపాతానికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యతో తరలి వచ్చారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి. చాపరాయిలో సందడి డుంబ్రిగుడ: మండలంలలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సందడి నెలకొంది. దూర ప్రాంత పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గిరిజన వస్త్రధారణలో థింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.అరకు పైనరీలో సందడి నెలకొంది. -
కొండగుడికి పండగొచ్చింది..!
డాబాగార్డెన్స్: పాత పోస్టాఫీస్ వద్ద గల కొండగుడి(రాస్హిల్స్)పై కొలువుదీరి కులమతాలతో సంబంధం లేకుండా భక్తులంతా కొలిచే తల్లి అమలోద్బవి (విశాఖపురి మేరిమాత). మేరీ మాత పుణ్యక్షేత్రం విశాఖపురికి ప్రత్యేక ఆభరణం. దీనినే ‘కొండగుడి’గా భక్తులు పిలుచుకుంటారు. సోమవారం జరిగే కొండగుడి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు మేరిమాత ఉత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ ఆవరణలో ప్రదర్శిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సెయింట్ ఎలాసిస్ పాఠశాలలో వసతి సౌకర్యం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. రాస్ హిల్స్ దిగువన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పండగకు సుమారు లక్ష మందికి పైగా వచ్చే అవకాశాలు ఉన్నందున పోలీసులు భక్తులకు పలు సూచనలు చేశారు. పాత పోస్టాఫీస్కు ఆర్టీసీ బస్సులతో పాటు వచ్చే అన్ని వాహనాలు పూర్ణామార్కెట్, టౌన్కొత్తరోడ్డు, రీడింగ్రూమ్, కురుపాం మార్కెట్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాణిబొమ్మ వరకు అనుమతిస్తారు. బీచ్రోడ్డు, కోటవీధి వైపు నుంచి వచ్చే వాహనాలను బీచ్రోడ్డులోని సెయింట్ అలోసిస్ స్కూల్ వరకు మాత్రమే అనుమతిస్తారు. సీహార్స్ జంక్షన్ నుంచి రాస్హిల్స్కు వచ్చే ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలకు పోర్టు ప్రధాన గేట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ రోడ్డులో సీహార్స్ జంక్షన్, రైల్ క్రాసింగ్ జంక్షన్ నుంచి రోజ్ హిల్స్ కొండ డౌన్ వరకు ఎలాంటి వాహనాలు అనుమతించరు. పోర్టు ఏరియాలోని వేంకటేశ్వర గుడి నుంచి రాస్హిల్స్ వైపు కూడా వాహనాలు అనుమతించరు. ద్విచక్ర వాహన చోదకులు తమ వాహనాలను కృష్ణథియేటర్, పాత రైల్వేస్టేషన్ స్థలం వద్ద పార్కింగ్ చేసుకోవాలి. కార్లను హార్బర్, ఓల్డ్ పోలీస్స్టేషన్ వెనుక అదానీ రోడ్డులో, పోర్టు వేంకటేశ్వర గుడి వద్ద పార్కింగ్ చేసుకోవాలి. యాత్రికులు తీసుకు వచ్చిన బస్సులు కాన్వెంట్ జంక్షన్ సమీపంలోనే పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. -
కాఫీ రైతులకు పూర్తి సహకారం
● పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ● చింతపల్లిలో పల్పింగ్ యూనిట్ సందర్శన చింతపల్లి: కాఫీ రైతులకు ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. శనివారం ఆమె స్థానిక కాఫీ పల్పింగ్ యూనిట్ను సందర్శించారు. రైతుల నుంచి సేకరించిన కాపీ పండ్లు, పార్చిమెంట్, డ్రయింగ్ యార్డ్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన పండ్లను కూడా గ్రేడ్లు విభజించి పార్చమెంట్ చేసి ఆరబెట్టాలని ఆదేశించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతమైన ప్రాధాన్యం ఉన్నందున అందుకు తగ్గట్టుగా రైతుల పంటను సేకరించి మంచి ఆదాయం ఆర్జించాలన్నారు. రైతులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్ ధరలకు అనుగుణంగా కాఫీ పండ్లకు గిట్టుబాటు ధర ప్రకటించినట్టు పీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కాఫీ ఏడీ జి.అప్పలనాయుడు, మాక్స్ అధ్యక్షుడు సింహాచలం, ఉపాధ్యక్షుడు నారాయణ, కోశాధికారి గోవిందు, ఏవీవో ధర్మారాయ్, బోర్డు సభ్యులు, కాఫీ సిబ్బంది, లైజన్వర్కర్లు పాల్గొన్నారు. -
పోలీసుల తనిఖీలతో నిలిచిన ట్రాఫిక్
రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయి అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు కార్యాలయాలకు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లే సమయం కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడికి సమీపంలోని పందిరిమామిడి వద్ద, మారేడుమిల్లి రోడ్డులో భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పందిరిమామిడి సెంటర్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు వరకు, భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద 9 గంటల నుంచి సుమారు రెండు గంటలు పాటు తనిఖీలు నిర్వహించారు. మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను శుక్రవారం చింతూరు పోలీసులు అడ్డగించి స్టేషన్లోనే ఉంచారు. సాయంత్రం వారిని తిరిగి వెనక్కి పంపించారు. అయితే ఢిల్లీ నుంచి కొంత మంది విద్యార్ధులు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకే పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టుగా స్థానికంగా ప్రచారం జరిగింది. ఒక వాహనంలో గంజాయి తరలిపోతుందని,అందుకే వాహనాలు తనిఖీ చేసినట్టు మరోకోణంలో కూడా వినిపించింది. అయితే పోలీసుల తనిఖీల్లో ఎటువంటివి పట్టుబడలేదు. సాధారణంగానే తనిఖీలు నిర్వహించినట్టు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.ఇబ్బందులు పడిన వాహన చోదకులు -
జైస్వాల్ జోరు..
రో–కో హుషారు..విశాఖ అంటేనే టీమిండియాకు ‘అచ్చొచ్చిన కోట’అని మరోసారి రుజువైంది. సముద్ర ఘోషను మించిన అభిమానుల హర్షధ్వానాలు.. స్టేడియం నలువైపులా మార్మోగిన ‘రో–కో’నినాదాల నడుమ భారత జట్టు కదంతొక్కింది. సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్లో సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో.. ప్రతికూల పరిస్థితుల్లో బౌలర్లు మ్యాచ్ను మలుపు తిప్పగా, యశస్వి జైస్వాల్ తన తొలి శతకంతో వీరవిహారం చేశాడు. కిక్కిరిసిన స్టేడియంలో కోహ్లీ తనదైన క్లాసిక్ ఫినిషింగ్ ఇవ్వడంతో.. సిరీస్ భారత్ వశమైంది. కోహ్లీ, రోహిత్లపై అభిమానం చాటుతూ ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బౌలర్ల సమయస్ఫూర్తి, బ్యాటర్ల దూకుడుతో విశాఖ వాసులకు పసందైన క్రికెట్ విందు లభించింది. – విశాఖ స్పోర్ట్స్ కుల్దీప్ను అభినందిస్తున్న కోహ్లీ, రాహుల్ -
మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో గిరిజన మత్స్యకారులు ప్రమాదకర పరిస్థితుల్లో చేపలవేట సాగిస్తున్నారు. దెబ్బతిన్ననాటు పడవలను వినియోగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఏటా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నా ఫ
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల, సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు, వనుగుమ్మ, మాకవరం, దొడిపుట్టు, పనసపుట్టు, రంగబయలు పంచాయతీల్లోని 84 గ్రామాల మీదుగా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 258 కుటుంబాలు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరు 183 నాటు పడవలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ మరమ్మతులకు గురి కావడంతో భయంభయంగా వేట సాగిస్తున్నారు. వీటిలో అధికశాతం నాటు పడవల దిగువ భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వీటిని మూసి వేసి వినియోగిస్తున్నారు. చేపలు వేటాడే సమయంలో రంధ్రాల ద్వారా పడవలోకి వస్తున్న నీటిని ఒకరు తోడుతుంటే.. మరొకరు చేపలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాటు పడవలు మునిగి ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. వీరు వినియోగిస్తున్న నాటు పడవల్లో 68 మరమ్మతుకు గురయ్యాయి. పడవకు రూ.40 వేలు.. వలకు రూ.20 వేలు.. మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో గిరిజన మత్స్యకారులు నాటు పడవలు, వలలు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు.చెక్కలు, దుంగలు కొనుగోలు, పడవ తయారీకి రూ.30 వేల నుంచి రూ.40 కేటాయించాల్సి వస్తోందని వారు తెలిపారు. వల సైజును బట్టి పదివేల నుంచి 20వేల వరకు అవుతోందని, వీటిని ఒడిశాలోని చిత్రకొండ, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొనుగోలు చేస్తున్నామని గిరిజన మత్స్యకారులు పేర్కొన్నారు. -
సైడ్ లైట్స్
●వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం టీమిండియాకు మరోసారి కలిసొచ్చింది. విశాఖ వేదికగా భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం. ●ఎట్టకేలకు 20 వన్డేల తర్వాత భారత్ టాస్ నెగ్గింది. టీమ్ అనలిస్ట్ హరి సూచన మేరకు తాను ఎడమ చేత్తో కాయిన్ ఎగరేసి టాస్ గెలిచినట్లు కెప్టెన్ కె.ఎల్ రాహుల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ●ఛేజింగ్లో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తన కెరీర్లో తొలి వన్డే సెంచరీని విశాఖలో నమోదు చేసి, జట్టు విజయానికి బాటలు వేశాడు. ●రోహిత్ మెరుపు ఆరంభం ఇవ్వగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో అర్ధ సెంచరీ పూర్తి చేసి, విన్నింగ్ షాట్తో మ్యాచ్ను, సిరీస్ను భారత్ వశం చేశాడు. ●డికాక్ (106) సెంచరీతో దక్షిణాఫ్రికా 168/2తో పటిష్టంగా ఉన్నా.. భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ కృష్ణ (4 వికెట్లు), కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో సఫారీలను 270 పరుగులకే కట్టడి చేశారు. ●టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పుట్టిన రోజు సందర్భంగా మైదానంలోనే జట్టు సభ్యులు సంబరాలు జరిపారు. ●రోహిత్, కోహ్లీపై అభిమానంతో ఫ్యాన్స్ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘రో–కో’ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. ●మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకులంతా తమ సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి స్టేడియంలో సరికొత్త కాంతులు నింపారు. ●స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ‘ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్’ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ●ఉదయం 9 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్దకు పోటెత్తారు. టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించేలా పోలీసులు పటిష్టమైన బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. – విశాఖస్పోర్ట్స్/ పీఎంపాలెం -
విశాఖ నుంచి హైదరాబాద్కు ప్రతి రోజూ 100 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ శనివారం ఒక్క విమాన సర్వీస్ కూడా హైదరాబాద్కు లేకపోవడం విమానయాన సంక్షోభానికి అద్దం పడుతోంది. శుక్రవారం 15 విమాన సర్వీసులు రద్దు కాగా శనివారం 9 సర్వీసులకు ఇండి
హైదరాబాద్కు విమానాల్లేవు! సాక్షి, విశాఖపట్నం : అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. సర్వీసులు ఈరోజే ప్రారంభమవుతాయని సర్ది చెబుతున్న ఇండిగో.. చివరి నిమిషంలో సర్వీసులు రద్దు చేసేస్తున్నామంటూ ప్రకటిస్తోంది. దీంతో అత్యవసర ప్రయాణాల కోసం విమానాలపై ఆధారపడిన వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ.. ఇతర సంస్థలు భారీగా టికెట్ ధరల్ని పెంచేస్తూ దోచుకుంటున్నాయి. తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణికులు ఊసురోమంటూ జేబులు ఖాళీ చేసుకుంటు మరీ వెళ్లాల్సి వస్తోంది. గత నాలుగు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు విశాఖ నుంచి రద్దవుతున్నాయి. తొలి రెండు రోజుల్లో 5 నుంచి 8 సర్వీసులు, శుక్రవారం 15 సర్వీసులు, శనివారం 9 సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు 5 వేల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ చేస్తున్నారు. భారీగా పెరిగిన టికెట్ ధరలు వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చైన్నె, ఢిల్లీ, తిరుపతి దేశీయ సర్వీసులతో పాటు అబుదాబీ అంతర్జాతీయ సర్వీసులున్నాయి. ఆయా నగరాలకు వెళ్లే 15 సర్వీసులను ఇండిగో శుక్రవారం రద్దు చేసింది. అంతేకాకుండా మిగిలిన సర్వీసుల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునేలా మిగిలిన విమానయాన సంస్థలు టికెట్ రేట్లను గణనీయంగా పెంచేశాయి. ఉదాహరణకు విశాఖ నుంచి ముంబైకి సాధారణ రోజుల్లో 6,612 నుంచి రూ.7,132 వరకూ ఉంటుంది. ఆదివారం (7వ తేదీన) విశాఖ నుంచి ముంబైకి వెళ్లే బదులు విశాఖ నుంచి సింగపూర్ రెండు సార్లు వెళ్లి రావొచ్చు అనేంతలా టికెట్ ధరలు పెంచేశారు. 7వ తేదీన సింగపూర్కు టికెట్ ధర రూ.17,309 ఉంటే.. ముంబైకి ఏకంగా రూ.56,798కి పెంచేశారు. విశాఖ నుంచి అహ్మదాబాద్కు రూ.7,500 నుంచి రూ.8,500 వరకూ టికెట్ ధర ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.50,000 దాటింది. వైజాగ్ నుంచి హైదరాబాద్కు రూ.3,500 నుంచి రూ.4,500 వరకూ టికెట్ ధర ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.25,000గా మారిపోయింది. రూల్స్ పట్టించుకోని ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ ధరలు మోతమోగిపోతుండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. విమానయాన సంక్షోభం సందర్భంగా ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచడంపై విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దూరం బట్టి నిర్దేశించిన టికెట్ ధరల్నే వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 500 కి.మీ వరకూ అయితే అన్ని పన్నులతో కలిపి రూ.7,500 గరిష్ట చార్జీ వసూలు చేయాలని, 500–1000 కి.మీ వరకూ రూ.12 వేలు, 1000–1500 కి.మీ వరకూ రూ.15 వేలు, 1500 కి.మీ పైన అయితే రూ.18,000 టికెట్ ధరలుగా నిర్ణయించింది. అయినా.. విమానయాన సంస్థలు తమకు నచ్చినట్లుగానే టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారి.. ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థలో సంక్షోభం సమసిపోయేంత వరకూ విమాన ప్రయాణాలు మానుకోవడమే బెటర్ అన్నట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. రద్దయిన విమానాలు శనివారం 9 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విశాఖ–చైన్నె (845), విశాఖ–ముంబై(6,585), విశాఖ–హైదరాబాద్(6645), విశాఖ–హైదరాబాద్(783), విశాఖ–బెంగళూరు(2772), విశాఖ–కోల్కత్తా (617), విశాఖ–హైదరాబాద్ (883), విశాఖ–హైదరాబాద్(6286), విశాఖ–ఢిల్లీ(6680) విమానాలు రద్దయ్యాయి. -
పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగమని, అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 667 మంది హోం గార్డులు ఉండగా, వారిలో 93 మంది మహిళలున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో హోంగార్డులకు 25శాతం రిజర్వేషన్ ఉందని చెప్పారు. అనంతరం రెండు జిల్లాల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు సర్టిఫికెట్లను ఆయన అందజేసి, గౌరవవందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య,సీఐలు పాల్గొన్నారు. -
వణికిస్తున్న శీతల గాలులు
● దట్టంగా కురుస్తున్న మంచు ● అరకువ్యాలీలో 8.1, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లోతుగెడ్డ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కురుస్తున్న మంచులంబసింగిలో మంటలు కాగుతున్న గిరిజనులుచింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన వారం రోజులుగా మంచు దట్టంగా కురుస్తోంది. శీతలగాలుల వల్ల చలి తీవ్రత నెలకొంది. శనివారం అరకువ్యాలీలో 8.1 డిగ్రీలు, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 99.9 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 10.1 డిగ్రీలు, హుకుంపేటలో 10.8 డిగ్రీలు, పెదబయలులో 11.4 డిగ్రీలు, పాడేరులో 12.9 డిగ్రీలు, చింతపల్లిలో 14.5 డిగ్రీలు ,కొయ్యూరులో 14.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 13.1 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.9 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 115.6 డిగ్రీలు, అడ్డతీగలలో 17.0 డిగ్రీలు, రంపచోడవరంలో 17.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 16.9 డిగ్రీలు, ఎటపాకలో 17.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు. ● సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత ఉంటోంది. దీంతో మన్యంవాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మంచు తెరలు ఉదయం 9 గంటల వరకు వీడకపోవడంతో హెడ్లైట్ల వెలుగులో వాహన రాకపోకలు సాగిస్తున్నారు. రాజవొమ్మంగి: తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి పరిసరాల్లో శనివారం చలి తీవ్రత పెరగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున మంటలను ఆశ్రయిస్తున్నారు. -
సమాన హక్కులు కల్పించిన మహనీయుడు
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ● అంబేడ్కర్కు ఘన నివాళి అరకు, పాడేరులో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్య్సరాస విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులుపాడేరు: అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని సమాజం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఆయన వర్ధంతిని శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు, పాంగి గుణబాబు, పార్టీ నాయకులు రామ్మూర్తి, పెట్ల గాంధీ పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. శనివారం తన క్యాంప్ కార్యలయంలో ఆయన వర్థంతి నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడుచుకోవాలన్నారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణిక్య, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, సర్పంచ్లు పెట్టెలి సుశ్మిత, కొర్రా రాధిక, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాడి రమేష్, కిముడు హరి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, మండల పార్టీ కార్యదర్శులు సొనియ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సందీప్నాయక్, జోగారావు, టీచింగ్ అసోసియేట్ బాపూజీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
రంపచోడవరంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు
రంపచోడవరం: ఏజెన్సీలో ఆధార్ నమోదుకు ఇబ్బందులు లేకుండా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐటీ సొల్యూషన్ ద్వారా ఈ ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలో 72 ఆధార్ కిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ అప్డేట్, బయోమెట్రిక్, కొత్త ఆధార్ కార్డులు ఈ సెంటర్లో చేస్తారని తెలిపారు. ఆధార్లో జిల్లాల మార్పు, పేర్లలో తప్పులను సవరిస్తారన్నారు. ఆధార్ కేంద్రాల వివరాలకు 9573029869 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీవో కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్వీ రమణ, పీఎంయూ అధికారి మోహన్, ప్రదీప్కుమార్, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రారంభించిన ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ -
80 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు
● ప్రసవం చేసిన 108 సిబ్బంది ● అనంతరం తల్లీబిడ్డను రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలింపుపట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు జి.మాడుగుల: మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 80 కిలోల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ షణ్ముఖరావు శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఈదులబయలు జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 80 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. మైదాన ప్రాంతానికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో పెందుర్తికి చెందిన ఇద్దరు, జి.మాడుగులకు చెందిన మరో ఇద్దరు ఉన్నారన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. గర్భిణికి ఇంటివద్దే పురుడు కొయ్యూరు: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 సిబ్బంది ఇంటివద్దనే పురుడు పోశారు. మండలంలోని ఎం.మాకవరం పంచాయతీ పిట్టాచలంకు చెందిన పాడి వెంకటలక్ష్మికి శనివారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలట్ హరిప్రసాద్, ఆశా వర్కర్ ఆమెకు పురుడు పోశారు. అనంతరం తల్లీబిడ్డను 108 వాహనంలో రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలించారు. -
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
దేవీపట్నం: మండలంలోని పోశమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరదలు లేనప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్వే గేట్లు మూసివేసి కొద్దిపాటి నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యాక్ వాటర్ కారణంగా పోశమ్మగండి వద్ద నీటిమట్టం మూడురోజులుగా సుమారు పది అడుగుల మేర పెరిగింది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం ఇటీవల వరద నీటినుంచి బయటపడినప్పటికీ ప్రస్తుత ముంపు కారణంగా ఆలయం నీటమునిగింది. పూడిపల్లి, చినరమణయ్యపేట పంచాయతీలకు సంబంధించిన ప్రాజెక్టు ముంపు భూముల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పైరు దాదాపు 100 ఎకరాల్లో పంట నీటమునిగింది. దండంగి నుంచి పోశఽమ్మగండికి వెళ్లే రహదారి పైకి గోదావరి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దండంగి మార్గంలో నిలిచిన రాకపోకలు -
డిప్యూటీ డీఎంహెచ్వోపై విచారణ
చింతూరు: స్థానిక డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్యపై డివిజన్లోని పలు పీహెచ్సీలకు చెందిన వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆయనపై స్థానిక వైద్యశాఖ కార్యాలయంలో రహస్య విచారణ సాగుతోంది. తీవ్రమైన వేధింపులు, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో వివిధ పీహెచ్సీలకు చెందిన ఆరుగురు వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ డీఎంహెచ్వోతో పాటు ఆయనపై ఆరోపణలు చేసిన వైద్యులను నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్నాయక్ విచారిస్తున్నారు. దీనిలోభాగంగా గురువారం 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వైద్యులకు అందచేసి వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. కాగా విచారణ అధికారి శుక్రవారం డివిజన్లోని రేఖపల్లి, కూనవరం, కూటూరు, నెల్లిపాక పీహెచ్సీలను సందర్శించారు. ఆరోపణలు చేసిన సంబంధిత వైద్యుల నుంచి ప్రశ్నావళికి సంబంధించిన సమాధానాలు, ఆధారాలు స్వీకరించారు. తదుపరి విచారణను వీడియో కాన్ఫరెన్సు ద్వారా త్వరలోనే నిర్వహిస్తామని విచారణ అధికారి తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాలతో సాగిన ఈ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు విచారణలో పాల్గొన్న వైద్యులు శ్రీనివాస్దొర, రాజీవ్, రోజారమణి, సూర్యప్రకాష్, అనిల్కుమార్, నిఖిల్ తెలిపారు. -
పునరావాసానికి మూడు అవకాశాలు
చింతూరు పీవో శుభం నొఖ్వాల్చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితులవుతున్న చింతూరుకు చెందిన గిరిజనేతర కుటుంబాలకు పునరావాసం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం మూడు ఆప్షన్లు కల్పిస్తున్నట్లు స్థానిక ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి శుభం నొఖ్వాల్ తెలిపారు. గిరిజనేతర నిర్వాసితుల నుంచి అభిప్రాయాలు సేకరించే నిమిత్తం శుక్రవారం చింతూరులో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరుకు చెందిన 1,778 మంది గిరిజనేతర నిర్వాసితులకోసం ఏలూరు జిల్లా తాడ్వాయిలో స్థల సేకరణ జరిపామన్నారు. వీరికి అక్కడ పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. మొదటి ఆప్షన్గా ప్రభుత్వం ఐదుసెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తుందని, రెండో ఆప్షన్గా ఐదుసెంట్ల స్థలం తీసుకుని ఇల్లు వద్దనుకుంటే రూ 2.85 లక్షలు ఇస్తుందని, మూడో ఆప్షన్గా స్థలం, ఇల్లు వద్దనుకుంటే స్థలానికి రూ. లక్ష, ఇంటికి రూ 2.85 లక్షలు మొత్తం రూ 3.85 లక్షలు ఒన్టైం సెటిల్మెంట్గా చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఆర్అండ్ఆర్ పరిహారం రూ 6.36 లక్షలతో కలిపి ఈ సొమ్ములను కూడా నిర్వాసితుల ఖాతాల్లో జమచేయబడతాయని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకుని సమ్మతి తెలుపుతూ పత్రాలు అందచేయాలని ఆయన సూచించారు. అర్హత ఉండి ప్రస్తుత ఆర్అండ్ఆర్ జాబితాలో పేర్లులేని నిర్వాసితులను రెండో విడత జాబితా లో చేర్చి పరిహారం, పునరావాసం కల్పిస్తామని పీవో తెలిపారు. అధికశాతం మంది తాడువాయి -
స్వయం సహాయకసంఘాలకు చెక్కుల పంపిణీ
పాడేరు : గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో చింతపల్లి మండలానికి చెందిన గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ద్వారా రూ.3కోట్ల 35లక్షల రుణాల చెక్కులను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జీ ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు. -
త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం ● పీజీఆర్ఎస్కు 95 వినతుల స్వీకరణ పాడేరు : అర్జీదారుల నుంచి స్వీకరించిన వినతులను నిశితంగా పరిశీలించి త్వరితిగతిన పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దినేష్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 95 వినతులు స్వీకరించారు. అర్జీదారులు తమ సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయిందో తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్ ఫోన్ చేయాలని వారు సూచించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు -
11,12 తేదీల్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు
● సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిపొట్టిక సత్యనారాయణ పాడేరు రూరల్: పాడేరు కేంద్రంగా ఈనెల 11,12 తేదీల్లో రెండు రోజులపాటు సీపీఐ జిల్లా కౌన్సిల్ సమవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలు, ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణతో పాటు భవిషత్తు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు. పార్టీ శ్రేణులు,ఆదివాసీ ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని వియజవంతం చేయాలని ఆయన కోరారు. -
రాజకీయ పడగ
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల బృహత్ సమావేశాలు (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్) విమర్శలకు తావిచ్చాయి. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యం, సౌకర్యాలపై చర్చ జరిగేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాలు చాలాచోట్ల లక్ష్యానికి విరుద్ధంగా జరిగాయి. పాఠశాల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా టీడీపీ నేతలకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. దీంతో సభలు టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని తలపించాయి. కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొన్నారు. టీడీపీ నేతల ఊకదంపుడు ప్రసంగాలు విసుగు కలిగించాయి.డుంబ్రిగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎండలో కూర్చున్న విద్యార్థులు డుంబ్రిగుడ కేజీబీవీలో నేలపై కూర్చున్న విద్యార్థినులు సర్కారు బడులపైపాడేరు : జిల్లాలో చాలా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ మొక్కుబడిగా నిర్వహించడంతో తమను ఎందుకు పాఠశాలలకు రప్పించారో తెలియక కొంతమంది తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. సకాలంలో ప్రారంభం కానందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పెట్టిన భోజనాలు రుచికరంగా లేకపోవడంతో ప్రతిరోజు మా పిల్లలకు ఇలాంటి భోజనాలు పెడుతున్నారని వారు సందేహం వ్యక్తం చేశారు. ● పాడేరు మండలం లగిసపల్లి కేజీబీవీలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి సుమారు మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ దినేష్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. దీంతో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గిడ్డి ఈశ్వరి రాకకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మూడు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. వీరికి స్వాగతం పలికేందుకు విద్యార్థులు మండుటెండలో నిరీక్షించాల్సి వచ్చింది. విద్యార్థులకు విజ్ఞానం పెంచేందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ప్రదర్శించకుండా హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శించడంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ● మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ సందర్భంగా కొన్ని పనులను పాఠశాల విద్యార్థులతో చేయించడం అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పాడేరు మండలం శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో ప్రమాదకర పరిస్థితుల మధ్య చెట్లు ఎక్కించి కొమ్మలు సేకరించారు. పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్నందున అదృష్టవశాత్తూ విద్యార్థులు క్షేమంగా కిందికి దిగిపోయారు. ఇదే పాఠశాలలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడుగంటల వరకు సాగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. గింజర్తిలో బహిష్కరణ కొయ్యూరు: చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం బహిష్కరించారు. పాఠశాల గేటు బయట ఉండి దానిని మూసివేశారు. ఎక్కువ భవనాలు, ఖాళీ స్థలం ఉన్నప్పటికీ గింజర్తిని ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయకుండా తక్కువ సౌకర్యాలున్న చింతలపూడి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ఏర్పాటు చేశారు. దీంతో పక్కనున్న గింజర్తిలో చదువుతున్న 3,5 తరగతుల పిల్లలు చింతలపూడి వెళ్లాల్సి వస్తోంది. దీనిని నిరసిస్తూ తల్లిదండ్రులు సమావేశం జరిపేందుకు అభ్యంతరం తెలిపారు. అసలు సమావేశం వద్దని స్పష్టం చేశారు. చింతలపూడికి బదులుగా గింజర్తిని ఆదర్శ పాఠశాలగా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశం నిర్వహించలేదని విద్యాకమిటీ చైర్మన్ అప్పారావు తెలిపారు. అసౌకర్యాల మధ్య.. డుంబ్రిగుడ: మండంలంలోని మెగా పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశాలు అసౌకర్యాల మధ్య నిర్వహించడంతో ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో టెంట్లు ఏర్పాటుచేయకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారు. స్థానిక కేజీబీవీ నిర్వహించిన సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కూటమి నేతల హవా కనిపించింది. ప్రజలనుంచి ఎన్నుకోబడిన వారు ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు. డుంబ్రిగుడలో బాలుర గిరిజన సంక్షేమ, బాలికల గిరిజన సంక్షేమ, ప్రభుత్వ ఉన్నత, కేజీబీవీలో నిర్వహించిన సమావేశాలకు విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు సక్రమంగా భోజనాలు అందకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొన్నారు. భోజనం బాగోలేదని ఆరోపణ రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పెట్టిన భోజనం ఏమాత్రం రుచికరంగా లేదని మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కు హాజరైన కొంత మంది తల్లిదండ్రులు ఆరోపించారు. కనీసం మీటింగ్ రోజునైనా మంచి భోజనం పెట్టవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో టీడీపీ నేతలకు ప్రాధాన్యం పాఠశాల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల విస్మరణ అధికారపార్టీ ప్రచార కార్యక్రమంలా సమావేశాలు రంపచోడవరంలో తల్లిదండ్రులకు ఉడికీ ఉడకని భోజనం తినకుండా వెనుదిరిగిన వైనం విద్యాశాఖ తీరుపై గింజర్తిలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన డుంబ్రిగుడలో విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన నిర్వాహకులు చంద్రబాబు ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదని విమర్శ -
పాడేరు వైద్య కళాశాలకు పూర్తి సహకారం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల భవిష్యత్తులో నంబర్ వన్గా నిలుస్తుందని, ఆంధ్ర వైద్య కళాశాల మెంటరింగ్ సంస్థగా పూర్తి సహకారం అందిస్తుందని ఆ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థుల ప్రెసర్స్డేను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆమె మాట్లాడారు. వైద్య విద్య పొందుతున్న విద్యార్థులంతా బాధ్యతగా చదువుకోవాలని సూచించారు. వైద్య విద్యకు సమాజంలో ఉన్నత స్థానం ఉందని, అందుకు తగ్గట్టుగా మంచి సంకల్పాన్ని వైద్య విద్యార్థులు నిర్మించుకోవాలన్నారు. దేశంలో అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా వైద్య విద్యలో ప్రవేశాలు పొందారని, తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగానే క్రమశిక్షణతో కూడిన విద్య పొందాలని పిలుపునిచ్చారు. పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి మాట్లాడుతూ వైద్య విద్యార్థులంతా చదువుతో పాటు మానవత్వం, నైతిక విలువలు, సేవాభావం, కరుణ అలవర్చుకోవాలన్నారు. ర్యాగింగ్కు తావులేని వాతావరణం ఉండాలన్నారు. అనంతరం వైద్య విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పాపారత్నం,పా డేరు జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ తమర్భ నరసింగరావు, పలు విభాగాల వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో నంబర్ వన్ స్థాయికి.. ఏంఎసీ ప్రిన్సిపాల్ కేవీఎస్ఎం సంధ్యాదేవి ఘనంగా ఫ్రెషర్స్ డే ఆటపాటలతో సందడి చేసిన వైద్య విద్యార్థులు -
ప్రతిరోజు ఇలాంటిభోజనమేనా?
మీటింగ్కు వచ్చిన తల్లిదండ్రులకు సరైన భోజన పెట్టలేదు. కూర రుచికరంగా లేదు. పిల్లలకు మంచి రుచికరమైన భోజనం పెడితేనే కదా వారు తిని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాగా చదువుకుంటారు. మాకు ఎదురైన అనుభవాన్ని బట్టి ప్రతీ రోజు ఇలాంటి భోజనమే పెడతారని భావించాల్సి వస్తోంది. – నూతన, రంపచోడవరంకనీస ఏర్పాట్లు లేవు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మోగా పేరేంట్స్ మీటింగ్ కోసం కనీస ఏర్పాట్లు చేయలేదు. తరగతి గదిలో మీటింగ్ పెడితే ఎంత మంది తల్లిదండ్రులు కూర్చోవడానికి వీలుంటుంది. పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. దీనిని బట్టి పాఠశాల వారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాల ఆవరణలో కనీసం టెంట్ కూడా వేయించలేదు. విద్యా కమిటీ చైర్మన్గా ఏర్పాట్లు బాగోలేవని మీటింగ్కు హాజరు కాలేదు. భోజన ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయి. ఉడికీ ఉడకని అన్నం పెట్టారు. అందువల్లే అక్కడ భోజనం చేయలేదు. – సుందర్సింగ్, విద్యా కమిటీ చైర్మన్, రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల -
వణుకుతున్న మన్యం
● దట్టంగా పొగమంచు, పెరుగుతున్న చలి తీవ్రత ● అరకువ్యాలీలో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడచిన వారం రోజులుగా మంచు దట్టంగా కురుస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం అరకువ్యాలీలో 11.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 12.1డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.6 డిగ్రీలు, హుకుంపేటలో 13.7, జి.మాడుగులలో 13.6 డిగ్రీలు, పాడేరులో 15.5 డిగ్రీలు, చింతపల్లిలో 15.8 డిగ్రీలు, కొయ్యూరులో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 15.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 16.4 డిగ్రీలు, అడ్డతీగలలో 17.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 17.4 డిగ్రీలు, రంపచోడవరంలో 17.1 డిగ్రీలు, గంగవరంలో 22.3 డిగ్రీలు నమోదుకాగా చింతూరు డివిజన్ చింతూరులో 17.8 డిగ్రీలు, ఎటపాకలో 18.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. ముంచంగిపుట్టు: మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతోంది. మంచు దట్టంగా కురుస్తుండడంతో రోజువారి పనులకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు,పెదబయలు మార్గాల్లో మంచు దట్టంగా కురుస్తుండటంతో హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు.. డుంబ్రిగుడ: మండలంలోని మంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రత పెరిగడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. -
గిరిజన విద్యార్థినిమృతదేహానికి పోస్టుమార్టం
రంపచోడవరం: మండలంలోని తామరపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్)లో మృతి చెందిన కుంజం జానుశ్రీ మృతదేహానికి శుక్రవారం ఏరియా ఆసుపత్రిలోపోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న ఈమె గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ పాఠశాలలోనే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోవడం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని తల్లిదండ్రులు కుంజం సోమన్నదొర, బాపనమ్మ, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు కోరారు. కేసు నమోదు చేయడంతో పోస్టుమార్టం తప్పనిసరి అని ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితిపై వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు అభ్యర్థన మేరకు పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహానికి వారికి అందజేయాలన్నారు.అయితే నిబంధనలు మేరకు పోస్టుమార్టం చేయాలని, కేసు నమోదు కావడమే ఇందుకు కారణమని వారు స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బాలిక కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి చూసి వారికి తోడుగా నిలిచారు. -
ప్రజాప్రతినిధులనుఆహ్వానించకపోవడం దారుణం
● మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుందరి రామకృష్ణ గూడెంకొత్తవీధి: ఏ ప్రభు త్వం అధికారంలో ఉన్నా అధికారిక కార్యక్రమాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల్సి ఉంటుందని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుందరి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అట్టహాసంగా శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించిందన్నారు. ఈకార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామని అయితే ఏ పాఠశాలలో కూడా స్థానికంగా ఎన్నికై న తమ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘనే అని అన్నారు. విద్యార్థులు, పాఠశాలల విషయంలోనూ కూటమి ప్రభుత్వం నేతలు రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. సంక్షేమ ఆశ్రమాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వాటిని పర్యవేక్షించే వారే కరవయ్యారన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థుల అకాల మరణాలు, అస్వస్థత గురవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికై నా విద్యార్థులు, విద్యావ్యవస్థ విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి అధికారులు పారదర్శకంగా వ్వవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయండి
అనంతగిరి (అరకులోయ టౌన్): విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల 1,2లో జరిగిన తల్లిదండ్రులు ఉపాద్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థుల విద్య, వారి ప్రవర్తన, పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. మానసిక, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు యోగా, క్రీడలను ప్రతిరోజు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బాలాజీ, ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, సర్పంచ్లు కొర్రా సింహాదిర, సోమెల రూతు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జెలి మధుసూదన్ పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరిక చింతపల్లి: విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మండలంలోని వంగసార బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొంతసేపు విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగనం, స్టాక్ రూమ్, వంటశాలను ఆమె పరిశీలించారు.ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యత, రుచితో కూడిన మంచి భోజనాన్ని మెనూ ప్రకారం పెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పాడేరు రూరల్: సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో సూత్రీకరణ సాంకేతిక సంస్థ (హర్యానా) సౌజన్యంతో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (గుంటూరు) ఆధ్వర్యంలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పాడి రైతులకు నిర్వహించిన వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. గ్రామ స్థాయిలో సుస్థిరమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సంబంధింత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని మానుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు మందులు, వివిధ రకాల విత్తనాల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్జీడీసీ ఎఫ్ఎల్ ఎండీ డాక్టర్ అమరేంద్రకుమార్, జిల్లా డీహెచ్వో జయరాజు, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్పై చర్చించేందుకు చక్కని అవకాశం అరకులోయటౌన్: పిల్లల భవిష్యత్పై చర్చించేందుకు పేరెంట్, టీచర్ మీటింగ్ చక్కని అవకాశమని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. శుక్రవారం అరకులోయ మండలం రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం చదువు మాత్రమే కాకుండా ఆరోగ్యం, క్రీడలు, ఇతర సామాజిక అవసరాల కోసం చర్చించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో సీఐ ఎల్.హిమగిరి, జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
డీఎల్డీవోనే డీడీవోగా మార్చారు
● ఈ వ్యవస్థను తీసుకువచ్చిందే జగన్ ● పంచాయతీరాజ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఈ వ్యవస్థ ప్రారంభంతోనే మొదలు ● జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023లో పాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీవో) విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీవో)గా మార్పు చేసిందని తప్ప ఇందులో కొత్తగా ఏమీ లేదని జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన డీఎల్డీవోనే డీడీవో వ్యవస్థగా మార్చారే తప్ప ఇందులో కొత్తదనం గాని, విధివిధానాలు గాని ఆర్థిక వనరుల సమకూర్చడం గాని ఏమీ లేదన్నారు. జిల్లా పరిషత్కు సంబంధించిన భవనాలనే వీటిని కేటాయిస్తూ జిల్లా పరిషత్ నిధులనే వాటి ఆధునికీకరణకు కేటాయించడం మరీ దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక నూతన కార్యక్రమం చేపడుతుందంటే కొత్తగా విధులు, నిధులు వస్తాయి కానీ ఇక్కడ అటువంటిదేమి లేదన్నారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు అసలు ప్రమోషన్ లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పడం దుర్మార్గమన్నారు. 2023లో డీఎల్డీవో వ్యవస్థను తీసుకువచ్చినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ప్రమోషన్లతోనే ప్రారంభమయ్యాయని, ప్రమోషన్లకు శ్రీకారం చుట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. డీఎల్డీవోగా ఎంపీడీవో స్థాయి అధికారులు మాత్రమే ప్రమోట్ చేసి ఆ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈరోజు ప్రమోషన్ల సంఖ్య పెరిగింది తప్ప.. ప్రమోషన్ అనేది కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది కాదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు డీడీవో కార్యాలయాలు తీసుకొచ్చారని, అవన్నీ పంచాయతీ రాజ్ భవనాలని చెప్పారు. -
ఆరు బోట్లు ప్రారంభం
చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక వికాస్ సమకూర్చిన ఆరు బోట్లను తాజంగి సర్పంచ్ వంతల మహేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. 2019 లో ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఈ జలాశయం వద్ద సాహస క్రీడలను ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణతో ఉపాధి పొందే అవకాశాన్ని పర్యాటక వికాస్ కమిటీ కల్పించారు. బోటు షికారుకు నాలుగు బోట్లను కూడా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. వీటిలో రెండు ఏడాది కిందట పాడై పోగా, మరో రెండు నామమాత్రంగా వినియోగంలో ఉన్నాయి. దీంతో జలాశయంలో బోటు షికారుకు బ్రేకు పడింది. ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో ఐటీడీఏ అధికారుల సూచనలతో పర్యాటక వికాస్ ఆధ్వర్యంలో ఆరు బోట్లను కొనుగోలు చేశారు. దాంతో శుక్రవారం నుంచి ఈ బోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ బోట్ల షికారుకు పర్యాటకులు నుంచి రూ. వంద వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యాటక వికాస్ అధ్యక్షుడు శెట్టి శంకరరావు, సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ టీచర్ల విభాగం అరకు అధ్యక్షుడిగా జగన్కుమార్
సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అరకు అసెంబ్లీ నియోజకవర్గ టీచర్ల విభాగం అధ్యక్షుడిగా కిల్లో జగన్కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం తెలిపింది.సేంద్రియ పద్ధతులతోనే భూసార పరిరక్షణ చింతపల్లి : గిరిజన రైతులు సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేసినప్పుడే భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని మృత్తిక శాస్త్రవేత్త పి.జోగారావు అన్నారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్లో శుక్రవారం ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొలాల్లో రసాయన ఎరువులు,మందులు పిచికారీ చేయడం వల్ల భూమిలో సూక్ష్మ జీవుల చర్యలు తగ్గుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. -
రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
ఎమ్మెల్సీ కుంభా రవిబాబుఅరకులోయ టౌన్: రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. శుక్రవారం గద్యగుడలోని తన ఫాంహౌస్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని, అటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎం అవుతారన్నారు. తమ కార్యకర్తలకు ఇబ్బందులు గురిచేసిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టె ప్రసక్తే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన నాటి నుంచి గిరిజనులంతా వైఎస్సార్సీపీ వెంట ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడ ఎంపీ స్థానంతోపాటు ఎమ్మెల్యే స్థానాలు కై వసం చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, మండల పార్టీ ఉపాద్యాక్షుడు గుడివాడ ప్రకాషరావు, మాజీ జెడ్పీటీసీ కొర్రా కాసులమ్మ, నాయకులు రేగం రమేష్, సుందర్రావు, రాందాస్, రాంప్రసాద్, సుభాష్చంద్ర, ధర్మనాయుడు, రాంనాయుడు, పట్టాసి కొండలరావు, జర్రా రఘునాథ్, చిన్నయ్య,అప్పన్న, తుమ్మాద్ పాల్గొన్నారు. -
ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్
● 2.57 ఫార్ములా ప్రకారం చేపట్టాలి ● బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు అనకాపల్లి: బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు 2.57 ఫార్ములా ప్రకారం జరగాల్సిందేనని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా బీఎస్ఎన్ఎల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుప్పిలి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాట్ తీర్పుని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా హైకోర్టులో అపీలు చేసిందన్నారు. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉందని, పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.పట్నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లందరూ సంఘటితంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్ 37ఏ ప్రకారం పెన్షన్ చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిదో వేతన సంఘ సిఫార్సుల్లో టేరమ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం బలోపేతంగా ఉందని గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి శ్యామసుందరం మాట్లాడుతూ పెన్షనర్ల నోషనల్ ఇంక్రిమెంట్పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీడీ స్వామి మాట్లాడుతూ పెన్షనర్లకు సీజీహెచ్ఎస్లకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లా కమిటీ అడ్వైజర్ వి.ఆర్.కె.శర్మ మాట్లాడుతూ గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను కలిసి పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పిన్నింటి బాబూరావు, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, సబ్ డివిజన్లలోని పెన్షనర్లు పాల్గొన్నారు. అనకాపల్లి బ్రాంచి పెన్షనర్ల సంఘం ఎన్నిక ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి గౌరవాధ్యక్షునిగా ఎడ్ల త్రినాథరావు, అధ్యక్షునిగా కోన సత్యనారాయణ, కార్యదర్శిగా పక్కి రమేష్, కోశాధికారిగా వై.కోటిలింగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
రోడ్డుప్రమాదంలోయువకుడికి గాయాలు
చింతపల్లి: లంబసింగి ఘాట్రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంఘటనలో ఓ గిరిజన యువకుడు గాయపడ్డాడు. జి మాడుగులు మండలం వామరాజు వాడపల్లి గ్రామానికి చెందిన కిముడు దావీదు రాజు శుక్రవారం ద్విచక్ర వాహనంపై డౌనూరు నుంచి చింతపల్లి వస్తుండగా మార్గ మధ్యంలో లంబసింగి ఘాట్రోడ్డులో ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో కింద పడిన దావీదురాజుకు తీవ్ర గాయాలయ్యాయి.అదే సమయంలో అటుగా వస్తున్న చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర రావు గమనించి వెంటనే లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫోన్చేసి అంబులెన్స్ను రప్పించి వెనువెంటనే ఉన్నత వైద్యానికి నర్సీపట్నం పంపే ఏర్పాటు చేశారు. -
లేబర్ కార్డుతో ఎంతో ప్రయోజనం
● కార్మికశాఖ జిల్లా అధికారిసూర్యనారాయణ ముంచంగిపుట్టు: అసంఘటిత రంగ కార్మికులు ప్రతి ఒక్కరు లేబర్ కార్డు కలిగి ఉండాలని కార్మికశాఖ జిల్లా అధికారి టి.సూర్యనారాయణ సూచించారు. స్థానిక కల్యాణ మండపంలో గురువారం మండల భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు పొందేందుకు, ఆరోగ్య బీమా, పిల్లల విద్య, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, ప్రమాద బీమా, పించను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్మికుడికి అధికారిక గుర్తింపు పత్రంగా పనిచేస్తున్నందున అందరూ లేబర్ కార్డు పొందాలని ఆయన కోరారు. వినియోగదారుల సంఘ చైర్పర్సన్ చిట్టిబాబు, డీసీపీసీ మెంబర్ శివప్రసాద్, డీసీపీసీ ఉపాధ్యాక్షుడు సోములు, మండల భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షుడు నర్సింగ్ పాల్గొన్నారు. -
దట్టంగా మంచు, చలి
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలతోపాటు చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. బుధవారం డుంబ్రిగుడలో 14.3 డిగ్రీలు, అరకువ్యాలీలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అదికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 15.1 డిగ్రీలు, పెదబయలులో 15.6 డిగ్రీలు, జి.మాడుగులలో 15.8 డిగ్రీలు, హుకుంపేటలో 15.8 డిగ్రీలు, పాడేరులో 16.1డిగ్రీలు, చింతపల్లిలో 17.0 డిగ్రీలు, కొయ్యూరులో 18.3 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 17.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 18.7 డిగ్రీలు, అడ్డతీగలలో 18.9 డిగ్రీలు, మారేడుమిల్లిలో 19.1డిగ్రీలు, రంపచోడవరంలో 20.3 డిగ్రీలు, గంగవరంలో 23.3 డిగ్రీలు, చింతూరు డివిజన్లో చింతూరులో 20.6 డిగ్రీలు, ఎటపాకలో 22.6 డిగ్రీలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు. ఇలావుండగా చలిగాలుల తీవ్రత నెలకొంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు.కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు -
రక్తదాన శిబిరం విజయవంతం
అరకులోయటౌన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఏఎస్ దినేష్కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎం.గంగరాజు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రక్త నిల్వలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు అత్యవస పరిస్థితుల్లో ఉపయోగపడుతుందన్న అవగాహనతో రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అపోహలను విడనాడి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లాలోని పాడేరు జిల్లా ఆస్పత్రిలో రోగులకు అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఉచితంగా రక్తం అందిస్తుందని, ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి నుంచి 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, ఎంపీడీవో అడప లవరాజు, సీఐ ఎల్.హిమగిరి, ఈవోపీఆర్డీ డాక్టర్ రాఘవేంద్ర, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, వైకుంఠరావు, ఎంఈవో వంతాల త్రినాథరావు, ఆర్ఐ పట్టాసి శంకర్రావు పాల్గొన్నారు. -
మావోయిజం వద్దు..అభివృద్ధే ముద్దు
● చింతూరులో ఆదివాసీ యువత ర్యాలీ చింతూరు: మావోయిజం వద్దు–అభివృద్ధే ముద్దు అంటూ ఆదివాసీ యువత గురువారం డివిజన్ కేంద్రం చింతూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులను మట్టుపెట్ట వద్దంటూ బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేశారు. మావోయిస్టులు అఘాయిత్యాలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల లోతట్టు గ్రామాలకు రహదారి సదుపాయాలు లేవని, నేటికీ బస్ సౌకర్యం అందుబాటులో లేదని ఆరోపించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు వ్యతిరేకంగా యువత నినాదాలు చేశారు. -
బురుజుపేటలో జనజాతర
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విశాఖవాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాసోత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా రెండో గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే బురుజుపేట పరిసరాలు కిటకిటలాడాయి. గురువారం ఒక్క రోజే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వైభవంగా విశేష పూజలు : వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణాలు, వేద పారాయణాలు, శ్రీ చక్రార్చన, లక్ష్మీ హోమం వంటి విశేష క్రతువులను నిర్వహించారు. పసుపు, కుంకుమ జలాలతో పాటు పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం స్వర్ణాభరణ అలంకరణ చేసి బుధవారం అర్థరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత వెండి కవచం తొడిగారు. -
గంజాయితో పట్టుబడితే కఠిన చర్యలు
డుంబ్రిగుడ: మండలంలోని పోలీసు స్టేషన్లో పాడేరు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లోని ఉన్న రికార్డులతో పాటు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్ఐ పాపినాయుడు వద్ద అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలతో పట్టుబడిన వారిపై చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలన ఎస్ఐకి సూచించారు. మద్యంతో వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన వాహనచోదకులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలన్నారు. గంజాయితో పట్టుబడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. రికార్డులు తనిఖీ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. అరకులోయ సీఐ హిమగిరి, డుంబ్రిగుడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.పాడేరు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ -
వేతన వాతలు
స్టీల్ప్లాంట్లో ఉత్పత్తి ఆధారిత వేతన విధానం అమలు కష్టపడి పనిచేస్తే పొట్ట కొట్టారని ఉద్యోగుల ఆగ్రహంపనిచేసే వారికి 66 శాతం వీఆర్ఎస్ తీసుకున్న వారికి 100 శాతం యాజమాన్యం తీరుపై కార్మికుల కన్నెర్ర సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తూనే.. మరోవైపు సంస్థను మరింత కుంగదీసేలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పావులు కదుపుతోంది కొన్నాళ్లుగా ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించని యాజమాన్యం.. ఇప్పుడు మరోసారి తన పంతం నెరవేర్చుకుంది. ఉత్పత్తికి తగ్గట్లుగానే వేతనాలు చెల్లిస్తామంటూ జారీ చేసిన సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నప్పటికీ, యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ విధానం వల్ల కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్లో భారీ కోత పడగా.. వీఆర్ఎస్ తీసుకుని ఇంటి వద్ద ఉన్నవారికి మాత్రం 100 శాతం వేతనాలు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏకపక్ష నిర్ణయంపై రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) సీరియస్ అయ్యారు. తక్షణమే ఆ సర్క్యులర్ను నిలిపివేసి, పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆదేశించడం కార్మికులకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ ఆదేశాలను యాజమాన్యం అమలు చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పనిచేసిన వారికి 66 శాతమే.. నిర్దేశించిన మేర ఉత్పత్తి సాధించలేదు కాబట్టే.. పూర్తిస్థాయి జీతాలు ఇవ్వడం లేదంటూ యాజమాన్యం స్ప ష్టం చేసింది. కష్టించి పనిచేసిన వారిలో ఏ ఒక్క విభాగానికి కూడా 100 శాతం వేతనాలు చెల్లించలేదు. కానీ.. వీఆర్ఎస్ తీసుకున్న వారికి పూర్తిస్థాయి జీతాలు చెల్లించడం గమనార్హం. అత్య ల్పంగా మెటీరియల్ మేనేజ్మెంట్(ఎంఎం) విభాగం ఉద్యోగులకు 66 శాతం మాత్రమే చెల్లించారు. కోక్ఓవెన్స్ విభాగం ఉద్యోగులకు 93 శాతం, మార్కెటింగ్కు 84 శాతం, బ్లాస్ట్ఫర్నేస్కు 83 శాతం, ఎస్ఎంఎస్కు 81 శాతం, సింటర్ప్లాంట్కు 80 శాతం, రోలింగ్ మిల్స్ ఉద్యోగులకు 79 శాతం మేర కోతలు, ఇతర విభాగాలకు 83 శాతం చొప్పున మాత్రమే చెల్లింపులు జరగడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్కును ముక్కలు చేసే కుట్ర? ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తూ.. ప్లాంట్ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా యాజమాన్యంతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే నష్టాల ఊబిలో విశాఖ ఉక్కు కర్మాగారం కూరుకుపోయింది. ఈ క్రమంలో ఉద్యోగులను పొమ్మనలేక పొగబెట్టినట్లుగా బయటకు పంపించేందుకు చేయాల్సిన కుటిల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు వరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వమంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారు. ఉక్కును ముక్కలు చేసేందుకు సిద్ధమయ్యారన్నది తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. నిన్నమొన్నటి వరకూ పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసిన యాజమాన్యం.. ఇప్పుడు ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలను చెల్లించడంతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. ఆర్ఎల్సీఆదేశాలు అమలయ్యేనా? కార్మిక సంఘాల ఫిర్యాదు మేరకు స్పందించిన రీజనల్ లేబర్ కమిషనర్.. యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి ఈ సర్క్యులర్ను అమలు చేయొద్దని, ఈ నెలలో కోత విధించిన జీతాలను త్వరగా చెల్లించాలని ఆదేశించారు. అయితే, యాజమాన్యం ఈ ఆదేశాలను పాటిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. తప్పు యాజమాన్యానిది.. శిక్ష ఉద్యోగులకా? ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రభుత్వాల మద్దతుతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న యాజమాన్య వైఖరే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ‘పిండికొద్దీ రొట్టె’అన్నట్లుగా.. వనరులు, వసతులు, ముడిసరుకు లభ్యత ఆధారంగానే ఉత్పత్తి సాధ్యమవుతుందన్న విషయం తెలిసి కూడా.. ఉద్యోగులను బలి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది సింగిల్ ఫర్నేస్ మాత్రమే అందుబాటులో ఉండగా, రెండు ఫర్నేస్లను షట్డౌన్ చేశారు. అప్పుడు సింగిల్ ఫర్నేస్ లక్ష్యానికి అనుగుణంగా 90 శాతం ఉత్పత్తి సాధించారు. సాధారణంగా వర్షాకాలంలో నిర్వహణ కష్టమని తెలిసినా.. జూన్లో షట్డౌన్లో ఉన్న రెండు ఫర్నేస్లను ప్రారంభించారు. వర్షాకాలంలో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్లో ఇబ్బందులు తలెత్తడం, ఎక్విప్మెంట్ ఆపరేటింగ్లో సమస్యలు రావడం సహజం. దీనికి తోడు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ.. 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. సెయిల్లో మిలియన్ టన్నుకు 2,700 మంది ఉంటే, ఇక్కడ 1,350 మందే ఉన్నారు. నెలకు 9 రేక్ల ముడిసరుకు రావాల్సి ఉండగా, గత ఆరేడు నెలలుగా కేవలం 5 రేక్లు మాత్రమే వస్తున్నాయి. ముడిసరుకు లేకుండా ఉత్పత్తి ఎలా సాధ్యమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. నిధులు, వనరులు సమకూర్చకుండా.. ఉత్పత్తి రాలేదంటూ కార్మికుల పొట్టకొట్టడం కుట్రపూరితమని ఆరోపిస్తున్నారు. అన్యాయమైన నిర్ణయమిది ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాల్లో కోత విధించడం కార్మికుల ఆర్థిక భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు వంటిది. ఏ సంస్థలోనైనా ఉత్పత్తి పెరిగితే ఇన్సెంటివ్లు ఇస్తారు కానీ, ఇలా జీతాలు కట్ చేయరు. ముడిసరుకు సకాలంలో అందించలేని, యంత్రాలకు మరమ్మతులు చేయించలేని యాజమాన్య చేతకానితనానికి కార్మికులను బాధ్యులను చేయడం హేయం. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ -
విలువిద్య క్రీడాకారులకు అభినందన
పాడేరు : జాతీయ స్థాయి సబ్ జూనియయర్ విలువిద్య పోటీల్లో రజత పతకాలు సాధించిన గిరిజన విద్యార్థులు మోహిత్సాయి, వి.లలిత్సాయి గురువారం కలెక్టర్ దినేష్కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా వీరిని ఆయన అభినంధించారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి 18 వరకు హైదరాబాద్లో జరిగే 32వ జాతీయ స్థాయి సీనియర్ విలువిద్య పోటీల్లో పాల్గొనే అల్లూరి ఆర్చరీ అకాడమి విద్యార్ధులు సొలగం సాంబ, మోహిత్ సాయి, సోడే దేశయ్యకు ఆర్థిక సహాయం చేయాలని కోచ్ అడపా సుధాకర్ నాయుడు కలెక్టర్ దినేష్కుమార్ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి జగన్మోహన్రావు, కోచ్ లకే సూరిబాబు, మోదమాంబ హైస్కూల్ ప్రిన్సిపాల్ నాగమణి పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తత అవసరం
● డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ పాడేరు : స్క్రబ్ టైఫ స్ వ్యాధి పట్ల జిల్లా పరిధిలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ ఆదేశించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వరం, చలి, తలనొప్పి, శరీరం నొప్పులు, కండరాల నొప్పులు, ఎస్కార్–చిగ్గర్ కాటు ఉన్న చోట నలుపు రంగు గడ్డలు, శోషరస గ్రంధులు పెద్దవి కావడం, మెడ, చంకలు, గజ్జ గుదభాగం, రొమ్ము, చంక, చెవి వెనుక, పాదల దర్శనం, తీవ్రమైన జ్వరం ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిగా అనుమానించవచ్చన్నారు. వ్యాధి నిర్థారణ అయితే తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు ఈ వ్యాధిపై గ్రామస్థాయిలో క్షేత్ర స్థాయి సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బంది అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో ఆదేశించారు. -
పాడేరులో డీడీవో కార్యాలయం ప్రారంభం
పాడేరు : పరిపాలన సౌలభ్యం కోసం పాడేరులో డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. గురువారం ఈ కార్యాలయాన్ని ప్రారంభంచిన ఆయన మాట్లాడారు. రాష్ట్రవాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీటిలో పాడేరులో ఒకటి కావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యాలయంలో పంచాయతీరాజ్కు సంబంధించి డీఎల్డీవో, డీఎల్పీవో, ఏపీడీ, డ్వామా తదితర శాఖల అధికారులు సేవలందిస్తారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిపాలన సంస్కరణల్లో భాగంగా జీవో నంబరు 57,58ను తీసుకురావడం జరిగిందన్నారు. గ్రూప్–1 స్థాయి అధికారి డీఎల్డీవోగా విధులు నిర్వహిస్తార్తన్నారు. కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొనారి రత్నకుమారి. జెడ్పిటిసి గాయత్రిదేవి, సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, డీపీవో చంద్రశేఖర్, డ్వామా పీడీ విద్యసాగర్, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత సుఖీభవ అందలేదు
అన్నదాత సుఖీభవ సాయం అందించకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా కిసాన్ వికాస్ యోజన పథకం రూ.2వేలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. ఇటీవల కిసాన్ యోజన పథకం సాయం రూ.2వేలు మాత్రమే జమ అయింది. అన్నదాత సుఖీభవ నగదు పడలేదు. రైతన్నా మీకోసం దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. – తాంగుల సోమన్న, గిరిజన రైతు, గబ్బంగి పంచాయతీ, పాడేరు మండలంపట్టించుకోలేదు అన్నదాత సుఖీభవ సాయం కోసం సచివాలయంతో పాటు పాడేరులో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది, ఈ సారి మొత్తం రూ.4వేలు మాత్రమే పీఎం కిసాన్ వికాస్ పథకం సాయం అందింది. ఆధార్ సీడింగ్ చేసుకున్నా అన్నదాత సుఖీభవ సాయం జమకాలేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. – ఎస్.సోంబాబు, గబ్బంగి, పాడేరు మండలం -
హైవే పనులకుఆటంకం కలిగించొద్దు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు జి.మాడుగుల: జాతీయ రహదారి 516ఈ నిర్మాణ పనులకు సంబంధించి నష్టపరిహారం అందని వారు అటంకం కలిగించవద్దని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. మండలంలోని బలమానుశంక, వరిగెలపాలెం, కులుపాడు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో ఇల్లు, భూములు నష్టపోయిన బాధితులు అందరికీ తగిన నష్టపరిహారం కచ్చితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అందరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎస్ఐ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. -
లంబసింగి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
చింతపల్లి: లంబసింగి ఘాట్రోడ్లో ఆటో బోల్తాపడిన సంఘటనలో గిరిజన మహిళ మృతి చెందగా మరో నలుగురు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సిఐ వినోద్బాబు అందించిన వివరాలిలా ఉన్నాయి. లంబసింగి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఘాట్రోడ్డులో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కిల్లో సన్యాసమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందగా లంబసింగి పంచాయతీ భీమనాపల్లి గ్రామానికి చెందిన కొర్రా జ్యోతి, కొత్తపాలెం పంచాయతీ జున్నులు గ్రామానికి చెందిన గొల్లూరి కమలమ్మ,కిల్లో సుమిత్ర, కొల్లో మోహన్లు గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న సిఐ వినోద్బాబు, ఎస్ఐ వెంకటేశ్వరరావులు హూటాహుటిన ససంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులుమహిళ మృతి, మరో నలుగురికి గాయాలు -
ఆంధ్రా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రక్షణ కల్పించండి
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని బిర్సా ముండా ఎస్టీ మ్యూచ్వల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు వనుగు శేషాద్రి, మదన బిర్సా ముండా కోరారు. గురువారం వారు తహసీల్దార్ భాస్కరఅప్పారావును కలిసి సమస్యను వివరించారు. ఆంధ్రాకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఇరురాష్ట్రాల జెన్కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా శేషాద్రి, మదన బిర్సాముండా మాట్లాడుతూ మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు మాచ్ఖండ్ ప్రాజెక్టులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒడిశాకు చెందిన కొంతమంది వ్యక్తులు విధులకు వెళ్లే సమయంలో అడ్డుకోవడం, మానసిక వేధింపులు, భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పలుసార్లు ఇరురాష్ట్రాల అధికారులకు తెలియజేసినా వారికి ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాచ్ఖండ్ ప్రాజెక్టు ఒడిశాకు చెందినదని, ఆంధ్రకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పని చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ఇరురాష్ట్రాల జెన్కో అధికారులతో మాట్లాడి, విధులు నిర్వహించే ఉద్యోగులకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని వారు కోరారు. మాచ్ఖండ్లో ఆంధ్రాకు కేటాయించిన అన్ని హక్కులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ భాస్కరఅప్పారావు మాట్లాడుతూ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీ సభ్యులు బాలకృష్ణ, బాబూజీ పాల్గొన్నారు. బిర్సాముండా ఎస్టీ మ్యూచ్వల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ వినతి -
ప్రపంచ విజేతకు పట్టాభిషేకం
విశాఖ స్పోర్ట్స్: టీ–20 అంధుల మహిళల క్రికెట్ ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాంగి కరుణకుమారిని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు, అంధ పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు గురువారం కరుణకుమారిని జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమెను కలెక్టర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విభిన్న ప్రతిభావంతులు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే విజయం సాధిస్తారనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరుణకుమారి. వైకల్యం అనేది న్యూనత కాదు. సాధించాలనే పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు. ఒక కుగ్రామం నుంచి వచ్చిన బాలిక, అంతర్జాతీయ వేదికపై మెరిసి.. దేశానికి కప్ను అందించడం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. కరుణకుమారి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుందన్నారు. ఆమెను క్రమశిక్షణతో పెంచిన తల్లిదండ్రులకు, వెన్నంటి ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్, కోచ్, అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కరుణకుమారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రోత్సాహకరంగా కలెక్టర్ రూ.లక్ష, క్రికెట్ ఫర్ ది బ్లైండ్ రాష్ట్ర అధ్యక్షుడు శరత్ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. తొలుత భయపడ్డా.. ఇప్పుడు మురిసిపోతున్నా.. పాడేరులోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన కరుణకుమారి ప్రయాణం పూల పాన్పు కాదు. ఈ విజయం వెనుక ఉన్న కష్టాన్ని ఆమె తండ్రి రాంబాబు వివరించారు. ‘7వ తరగతి వరకు అతి కష్టం మీద చదివించా. స్థానికంగా వసతులు లేక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయితే సాగర్నగర్లోని అంధుల పాఠశాలలో ప్రవేశం దొరకడంతో చదువుతో పాటు ఆటల్లో ప్రావీణ్యం సాధించడానికి అవకాశం చిక్కింది. మొదట బెంగళూరు తీసుకువెళతామంటే అయిష్టంగా ఒప్పుకున్నా. ఢిల్లీ అంటే అసలు వద్దన్నా. కానీ, కరుణ పట్టుదల చూసి అంగీకరించా. మా అమ్మాయిని దేశ ప్రముఖులు ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మా గ్రామస్తులందరూ ఆనందిస్తున్నారు.’అని చెప్పుకొచ్చారు. నాలాంటి వారికి చేయూతనివ్వాలి తన విజయ రహస్యాన్ని, భవిష్యత్తు ఆకాంక్షలను కరుణకుమారి మీడియాతో పంచుకున్నారు. ‘అంధ పాఠశాలలో చేరాక అథ్లెటిక్స్ వైపు ఆసక్తి చూపించాను. పలు పోటీల్లో పతకాలను సాధించాను. నాకు క్రికెట్పై ఉన్న ఆసక్తిని పాఠశాల యాజమాన్యం గుర్తించి ప్రోత్సహించింది. బంతి నుంచి వచ్చే శబ్దాన్ని విని బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నా. ఢిల్లీలో లభించిన ప్రాక్టీస్ వరల్డ్కప్లో నాకు ఎంతగానో ఉపయోగపడింది. నాకు ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదు. నాలాంటి వారికి ఇలాంటి అవకాశాలు, చేయూత లభించాలన్నదే నా ఆకాంక్ష.’అని వివరించింది.కరుణకుమారికి కలెక్టర్ ఘన సత్కారం -
రెండేళ్ల చిన్నారికి చూపు
● శంకర్ ఫౌండేషన్ శస్త్రచికిత్స సింహాచలం : రెండేళ్ల చిన్నారికి చూపు ప్రసాదించి వెలుగులు నింపింది నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి. ఆసుపత్రి డీజీఎమ్ బంగార్రాజు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి సమీపంలోని తాడిబండ గ్రామానికి చెందిన రెండేళ్ల గిరిజన బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటూ పడిపోవడంతో కంటికి తీవగ్రాయమై రక్తస్త్రావం జరిగింది. బాలికను చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు చిన్నారిని పరీక్షించి అత్యవసర కంటి శస్త్రచికిత్స అవసరమని శంకర్ ఫౌండేషన్కి పంపించారు. శంకర్ ఫౌండేషన్లో కార్నియా విభాగాధిపతి డాక్టర్ నస్రిన్ నేతృత్వంలో డాక్టర్ వి.కె.యశస్విని శస్త్రచికిత్స చేశారు. చిన్నారికి కంటి చూపును ప్రసాదించారు. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో డిశార్జ్ చేశారు. -
సీనియర్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
ముంచంగిపుట్టు: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో యూటీఎఫ్ మండల మహాసభను నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా యూటీఎఫ్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులంతా సర్వీసులో కొనసాగాలంటే రెండేళ్లలో కచ్చితంగా అర్హత పరీక్షలో టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపాధ్యాయులను మానసికంగా ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వారిని టెట్ పరీక్ష నుంచి మినహాయిండం మంచిందన్నారు. ఇందుకోసం ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు దేముడు, కన్నయ్య, ధర్మారావు, అధ్యక్షులు రాజు,కా ర్యదర్శి గోపి, కార్యవర్గం త్రినాథ్, సుబ్బారావు, శ్రీనివాసమూర్తి, రఘుమణి, పుండరి, కృష్ణ, పద్మసేన పాల్గొన్నారు.ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు -
ప్రతి గిరిజన రైతు సమస్యలను ఇంటింటికి వెళ్లి తెలుసుకోవడంతో పాటు వీరికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా వివరించేందుకు ఏర్పాటు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. దీనివల్ల తమకు ఎటువంటి ప్రయోజనం లేదని, టీడీపీ నేతల ప్రచార కార్యక్రమ
సాక్షి,పాడేరు: రైతులకు రబీలో వ్యవసాయ రుణాలు, వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, ఉచిత విత్తనాలు, ఇతర సౌకర్యాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో రైతన్న మీకోసం కార్యక్రమాలకు కొద్దోగొప్పో గిరిజన రైతులు హాజరయ్యారు. గత నెల 24నుంచి 29 వరకు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 3,050 గ్రామాల్లో రైతన్న మీకోసం సభలు నిర్వహించారు. ఇవన్నీ మొక్కుబడిగా జరిగాయని, వీటి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని పలువురు గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వతేదీన జిల్లాలోని 304 రైతు సేవా కేంద్రాల పరిధిలో గ్రామ సచివాలయాల స్థాయిలో నిర్వహించిన సమావేశాలది ఇదే పరిస్థితి అని వారు ఉదహరిస్తున్నారు. సాగుపై కానరాని భరోసా గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటా తిరిగి వ్యవసాయంపై భరోసా కల్పిస్తారని గిరిజన రైతులు ఆశించినా ఫలితం లేకపోయింది. గ్రామాలు, సచివాలయాల పరిధిలో రాజకీయ సభలుగా ఈ కార్యక్రమం మారిందని పలువురు విమర్శిస్తున్నారు. కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ అన్నింటా టీడీపీ నేతలు, కార్యకర్తలదే హవాగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంగా సభలు మార్చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. గిడ్డికి అధికారుల వత్తాసు పాడేరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం పాడేరు మండలం డోకులూరు సచివాలయంలో రైతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల సాక్షిగా అధికారికంగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచారం చేశారు. అమెకు అధికారికంగా ఏహోదా లేకపోయినా కీలకంగా వ్యవహరించడం, అందుకు అధికారులు వత్తాసుపలకడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పట్టని రైతు సమస్యలు జిల్లా వ్యాప్తంగా 3035 గిరిజన గ్రామాలు, 305 గ్రామ సచివాలయాల పరిధిలో నిర్వహించిన రైతన్న నేస్తం కార్యక్రమంలో గిరిజన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 18 నెలల కాలంలో గిరిజన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పండించిన వ్యవసాయ, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా, అన్నదాత సుఖీభవ ప్రభుత్వ సాయం చాలామంది అర్హులైన గిరిజన రైతులు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం రూ.2 వేల సాయం పొందుతున్న గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ సాయం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య కోసం మాట్లాడే తీరిక ఈ సభల్లో అధికారులకు లేకపోయిందని వారు వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన రైతులు విలువైన పశుసంపదను అమ్ముకుంటున్న దుస్థితి జిల్లాలోని గ్రామాల్లో నెలకొంది.రైతన్నా మీకోసం.. అంతా మోసం! తూతూమంత్రంగా ఇంటింటి సర్వే రైతు సమస్యలపై కానరాని చర్చ రాజకీయ సభల్లా కార్యక్రమం అధికారికంగా ఏ హోదా లేకున్నా గిడ్డి ఈశ్వరి పెత్తనం పార్టీ ప్రచారంగా మారిందని గిరి రైతుల విమర్శ మమ అనిపించిన చంద్రబాబు సర్కారు -
విన్యాసాలు లేవు.. వీక్షకులు లేరు!
డాబాగార్డెన్స్: డిసెంబర్ 4.. ఈ తేదీ రాగానే నగరవాసుల చూపు ఆకాశం వైపు.. మనసు సాగరం వైపు మళ్లుతుంది. కానీ గతేడాది లాగే ఈ ఏడాది కూడా ఆ అద్భుత దృశ్యాలు కనుమరుగయ్యాయి. నేవీ డే సందర్భంగా ఏటా ఆర్కే బీచ్ వేదికగా జరిగే యుద్ధ విన్యాసాలు ఈ సారి కూడా విశాఖలో జరగకపోవడంతో సాగర తీరం వెలవెలబోయింది. సాధారణంగా నేవీ డేకి వారం రోజుల ముందు నుంచే విశాఖలో పండగ వాతావరణం నెలకొనేది. యుద్ధ విమానాల గర్జనలు, నౌకల విన్యాసాలతో రిహార్సల్స్ జరుగుతుంటే జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఇక డిసెంబర్ 4న అయితే నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే జనంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయేది. కానీ, ఈ ఏడాది ఆ సందడి పూర్తిగా లోపించింది. ఆర్కే బీచ్, గోకుల్ పార్క్, పాండురంగాపురం ప్రాంతాలు జనం లేక, పర్యాటకులు రాక బోసిపోయాయి. నేవీ డేను విశాఖ వెలుపల నిర్వహించడంతో.. ఈ సారి కేవలం యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించడానికే వేడుక పరిమితమైంది. తమ కళ్లెదుట జరిగే సాహస కృత్యాలను చూసి పరవశించే అవకాశం కోల్పోయామని.. రెండేళ్లుగా విశాఖకు ఈ వైభవం దక్కకపోవడం బాధాకరమని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మైక్రో బయోమ్ అధ్యయనానికి పరిశోధన ప్రాజెక్ట్
● సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయోలజీ టీమ్ సభ్యుల వెల్లడి ● గిరిజనుల ఆరోగ్యానికి దోహదం ● కొక్కిరాపల్లి గ్రామంలో ప్రారంభం జి.మాడుగుల: గిరిజన ప్రాంతాల్లో మానవ ఆరోగ్య అభివృద్ధి, చర్మ మైక్రో బయోమ్పై అధ్యయనం చేసేందుకు పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయోలజీ టీమ్ సభ్యులు డాక్టర్ వి వెంకటరమణ, డాక్టర్ సురోష్ కిశోర్, డాక్టర్ పి.అనిల్, దేవదట్ట, డాక్టర్ హరివోం కుషవహా తెలిపారు. మండలంలో కొక్కిరాపల్లి గ్రామంలో బుధవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన వారు మాట్లాడారు. పరిశోధన ద్వారా ఆరోగ్యానికి మేలు చేసే జీవ క్రియ మార్గాలు, వ్యాధి–ఆరోగ్యం మధ్య సంబంధాలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు. గిరిజన మైక్రోబయోమ్ ప్రాజెక్టు వల్ల ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మండలంలో కొక్కిరాపల్లిని ఎంపిక చేశామని, పాడేరు మండలంలో ఒక గ్రామాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. స్థానిక నాయకులు, ప్రభుత్వ శాఖలు, సేవా సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మల నమూనాలు, చర్మ, రక్త నమూనాలు సేకరిస్తామని వారు వివరించారు. ముందుగా కొక్కిరాపల్లిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్, ఏడీఎంహెచ్వో ప్రతాప్ ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ కిశోర్, డాక్టర్ ఇందిర ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులు ప్రతి ఒక్కరికీ ఒక దుప్పటితో పాటు టర్కీ టవల్ అందజేశారు. ఎంపీహెచ్ఈవో నడిగట్ల ప్రకాష్, ఎంఎల్హెచ్పీలు జ్యోతి, ధనలక్ష్మి, సాయి, పద్మ, సంధ్యారాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీపతిరాజు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
సిరీస్ తేలేది వైజాగ్లోనే..
● హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు ● 6న దక్షిణాఫ్రికా–భారత్ వన్డే మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో ఫలితాన్ని తేల్చే ఆఖరి మ్యాచ్కు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ నెల 6న మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ డే/నైట్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్పై ఉన్న క్రేజ్ టికెట్ల అమ్మకాల్లో స్పష్టంగా కనిపించింది. మూడు దఫాలుగా ఆన్లైన్లో విడుదల చేసిన టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉన్న రోహిత్ శర్మ ఓపెనింగ్ను, వన్డౌన్లో కింగ్ కోహ్లీ మెరుపులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. మ్యాచ్ నిర్వహణలో ఎక్కడా లోపం రాకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఆటగాళ్లు, అభిమానుల కోసం ప్రవేశ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డిజిటల్ టికెట్ల స్కానింగ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను సిద్ధం చేశారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో జీరో క్లీనింగ్ పద్ధతిలో స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఫ్లడ్లైట్ల వెలుతురును నిర్వాహక కమిటీ మరోసారి పరిశీలించింది. అవుట్ ఫీల్డ్, డ్రైనేజీ వ్యవస్థ, గ్యాలరీల్లో సీటింగ్, పార్కింగ్ సదుపాయాలను పర్యవేక్షించింది. కాగా.. గురువారం రెండు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకుంటారు. శుక్రవారం స్టేడియంలో ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తాయి. ఈ సందర్భంగా ఏసీఏ ప్రతినిధి గిరిష్ డొంగ్రే మాట్లాడుతూ.. ‘విశాఖ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్కు పెట్టింది పేరు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేశాం.’అని వివరించారు. పిచ్ క్యురేటర్ నాగమల్లయ్య మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలించేలా బ్యాలెన్స్డ్ వికెట్ను తయారు చేశాం. ఇది కచ్చితంగా వన్డేలకు సరిపోయే పిచ్. ఇరు జట్ల ప్రదర్శన ఈ పిచ్పై ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.’అని తెలిపారు. -
మూడు నెలలకోసారి జాబ్ మేళా
బీచ్రోడ్డు: విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒక సారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు వారికి తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సాధారణ పౌరులకు దీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తున్న విభిన్న ప్రతిభావంతుల పని తీరు ప్రశంసనీయమని, వారి నడక, నడత అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఇటీవల జరిగిన అంధుల వరల్డ్ క్రికెట్ కప్ను భారత్ జట్టు గెలుచుకుందని, ఇందులో పాంగి కరుణ కుమారి కీలక ప్రదర్శనతో ఆకట్టుకుందన్నారు. అంగవైకల్యం ఉన్నవారు కుంగిపోకుండా ప్రతి ఒక్కరూ కరుణ కుమారిలా ఎదగాలని పిలుపునిచ్చారు. ‘ఈగో’అనే వైకల్యాన్ని వీడాలి : అంగవైకల్యం కలిగిన చిన్నారుల ప్రతిభను చూసి చాలా ముచ్చటేసిందని, వారి నైపుణ్యం నిజంగా అబ్బురపరిచిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శారీరక వైకల్యం ఉన్నా వీరిలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, కానీ సాధారణ పౌరుల్లో మాత్రం ‘ఈగో’అనే మానసిక వైకల్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చిన్నారుల ప్రతిభను చూశాక వారంతా ‘ఈగో’అనే వైకల్యాన్ని తప్పక పోగొట్టుకోవాల్సి ఉంటుందని హితవు పలికారు. సంజ్ఞా భాష గురించి సాధారణ పౌరులు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, కనీసం తల్లిదండ్రులైనా కచ్చితంగా తెలుసుకుంటేనే విభిన్న ప్రతిభావంతులకు తగిన విధంగా సహాయపడగలమన్నారు. 521 మందికి ప్రశంసాపత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా యూసీడీలో రెండు ప్రత్యేక బృందాలకు రూ.13 లక్షల విలువ గల చెక్కును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో కలిసి కలెక్టర్ అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన 521 మందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత, యూసీడీ పీడీ సత్యవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, సీపీవో శ్రీనివాసరావు, ఏపీసీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


