breaking news
Alluri Sitarama Raju District Latest News
-
● మంచు తెరల విహారం
సాధారణంగా చలికాలంలో మాత్రమే దర్శనమిచ్చే పొగమంచు, వేసవిలోనూ మన్యం ప్రాంతాన్ని పలకరించింది. శనివారం పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాలను దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ఎండలు మండిపోవాల్సిన వేళ, అకస్మాత్తుగా ఏర్పడిన ఈ మంచు తెరలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేశాయి. ఉదయం నుంచే మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఏమాత్రం కనిపించక వాహన చోదకులు ప్రమాదాలను నివారించేందుకు తమ వాహనాలకు లైట్లు వేసి, నెమ్మదిగా రాకపోకలు సాగించారు. వేసవిలో ఈ చల్లని అనుభూతి పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు పండగలా మారింది. మంచు తెరల వెనుక నుంచి ప్రకృతి అందాలు మెరిసిపోతుంటే, ఆ దృశ్యాలను కళ్లారా చూసి పర్యాటకులు పులకించిపోయారు. అరకు, చింతపల్లి వంటి ప్రాంతాల్లోని కొండ కోనలు మంచులో మునిగిపోయి, ఊటీని తలపించేలా అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు వచ్చిన వారికి ఈ పొగమంచు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. – సాక్షి, పాడేరు -
యువతకు ఆదర్శం.. ఆయన సాహసం
అచ్యుతాపురం రూరల్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్న పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నీడి కృష్ణమోహన్కు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ 5 పదులు దాటిన వయస్సులో సుమారు 6500 కిలోమీటర్లు బైక్పై ప్రయాణం చేసి శిఖరం అధిరోహించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సాధించిన విజయం ఉపాధ్యాయ వర్గానికే కాకుండా విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయులు కృష్ణమోహన్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిని విజయాలు సాధించి దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు, గణేష్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
లక్ష మొక్కలు లక్ష్యం
కశింకోట: జిల్లాలో అనంత అరణ్య కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తాళ్లపాలెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అనంత అరణ్య కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 70 వేల మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో 1,650 మొక్కలు నాటినట్టు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటారు. డ్వామా పీడీ నిర్మలదేవి, అడిషనల్ పీడీ మణికుమార్, ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖరరావు, ఏపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మలేరియా పంజా
● పరమసింగవరంలో ఇంటింటికీ జ్వరాలు ● మంచంపట్టిన గిరిజనులు ● వైద్యం కోసం అల్లాడుతున్న వైనం సీలేరు: జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంత గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు కలకలం రేపుతున్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక, వైద్యం అందక గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు చిట్టచివరి సరిహద్దు గ్రామమైన గుమ్మురేవులు పంచాయతీ పరిధిలోని పరమ శింగవరం గ్రామంలో పరిస్థితి దయనీయంగా ఉంది. కొండ కోనల మధ్య వైద్యం అందని ద్రాక్ష గుమ్మురేవులు పంచాయతీ కేంద్రం నుంచి పులుసు మామిడి మీదుగా పరమ శింగవరం గ్రామానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే గిరిజనుల ప్రధాన సమస్య. దారిలో మూడు చిన్న వాగులు, మూడు పెద్ద గడ్డలు దాటుకుంటూ, మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకరమైన కొండ అంచు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇంటికో రోగి.. మంచం పట్టిన బాధితులు సుమారు 15 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ప్రస్తుతం పలువురు మలేరియా, ఇతర వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం గ్రామంలో ఆరుగురు పిల్లలు, 11 మంది పెద్దలు తీవ్ర జ్వరాలతో మంచాన పడ్డారు. ప్రకాష్ అనే యువకుడు, చిన్న అమ్ములు అనే మహిళ మలేరియాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారకొండ పంచాయతీ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఆర్ఎంపీ సాయం ప్రభుత్వ వైద్యులు గ్రామానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు జిల్లా సరిహద్దులోని వై.రామవరం మండలం, పొతవరం గ్రామానికి చెందిన ఒక ఆర్ఎంపీని పిలిపించి ప్రకాష్ అనే యువకుడికి చికిత్స అందించారు. వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి, పరమ శింగవరం గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల ప్రాణాలను కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పోలీసుల నిఘాలో స్మగ్లర్లు ఉండటం చూశాం.. కానీ, స్మగ్లర్ల నిఘాలో పోలీసులు ఉండటం ఎప్పుడైనా విన్నారా? ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. గంజాయి రవాణాను కట్టడి చేస్తున్న పోలీసుల కదలికలను పసిగట్టేందుకు స్మగ్లర్లు ఏ
రివర్స్ ఆపరేషన్గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు చెక్ గుట్టురట్టు చేస్తున్న నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పోలీసులు నిఘా వ్యవస్థలో సరికొత్త మార్పులుముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ముంచంగిపుట్టు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గంజాయి రవాణా చేసే స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. సాధారణంగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్మగ్లర్లు పోలీసుల కదలికలను గమనించడానికి ఏకంగా ‘నిఘా వ్యవస్థను’ ఏర్పాటు చేసుకున్నారు. స్మగ్లర్ల కొత్త ఎత్తుగడలు.. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. పోలీసులు ఏ జంక్షన్ వద్ద ఉన్నారు, ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు అన్నది తెలియక దొరికిపోతున్నామని గ్రహించిన స్మగ్లర్లు తమ వ్యూహాన్ని మార్చారు. తమకు కావాల్సిన సమాచారం కోసం స్థానిక యువతను ఎంచుకున్నట్టు సమాచారం. మండల కేంద్రాల్లోని కొంతమంది యువకులకు నెలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చి, పోలీసుల కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ● పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు ఎప్పుడు బయలుదేరుతున్నారు.. ఎంతమంది వెళ్తున్నారు అనే వివరాలను స్మగ్లర్లకు చేరవేస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగానే, గంజాయిని ఏ మార్గంలో, ఏ సమయంలో తరలించాలో స్మగ్లర్లు పథకాలు వేస్తున్నారు. దీనికి తోడు, గంజాయి వాహనానికి ముందుగా పైలట్ వాహనాన్ని నడుపుతూ రూట్ క్లియరెన్స్ కోసం అమాయక గిరిజన యువతకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు డబ్బు ఆశ చూపి ఉచ్చులో దించుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇలా వారి ప్రలోభాలకు గురైన గిరిజన యువత చివరకు పోలీసులకు పట్టుబడి, జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నార్కోటిక్స్ అధికారుల దాడి పోలీసులపై స్మగ్లర్లు నిఘా పెడుతున్న విషయాన్ని ఇటీవల పోలీసులు గుర్తించారు. ఈ నెల 20న భూసిపుట్టు నుంచి ముంచంగిపుట్టు మీదుగా ఒడిశాకు గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు రాత్రంతా మాటు వేశారు. తెల్లవారుజాము వరకు ఏ వాహనం రాకపోవడంతో వారు స్టేషన్లకు తిరిగి వెళ్లారు. అయితే, ఇదే సమయంలో స్మగ్లర్లు తవుడు బస్తాల కింద 1200 కేజీల గంజాయిని దాచి తరలిస్తుండగా, పెదపుట్టు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు. ● స్థానిక పోలీసులపై నిఘా పెట్టిన స్మగ్లర్లు, విశాఖపట్నం నుంచి వచ్చిన నార్కోటిక్స్ అధికారుల ఉనికిని గుర్తించలేకపోయారు. విచారణలో స్మగ్లర్లు పోలీసుల కదలికలపై నిఘా పెట్టిన విషయాన్ని బయటపెట్టారు. సమాచారం చేరవేస్తున్న వ్యక్తులు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు ఇప్పుడు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.స్మగ్లర్ల ప్రలోభాలకు గురి కావద్దుగంజాయి అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెడుతున్నాం. భవిష్యత్తును నాశనం చేసే గంజాయిపై దూరంగా ఉండేలా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు గిరిజన యువతకు గంజాయి స్మగ్లర్లు ఆశ చూపి వారిని వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గిరిజన యువత గ్రహించాలి. గంజాయి రవాణా,సాగుకు దూరంగా ఉండాలి. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడమే కాకుండా వారి ఆటకట్టిస్తాం. – ఎస్.లక్ష్మణరావు, సీఐ, జి.మాడుగుల -
కొయ్యూరులో భారీ వర్షం
రాజేంద్రపాలెంలో వర్షం నీటితో నిండిన రోడ్డు కొయ్యూరు: శనివారం కొయ్యూరులో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం సుమారు గంటపాటు కురిసింది. ఈ వర్షంతో మండలంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆకుమడులు వేయలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. పొలాలను దున్నడానికి, ఆకుమడులు సిద్ధం చేసుకోవడానికి ఈ వర్షం ఎంతో అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో మండల కేంద్రంలోని రాజేంద్రపాలెం రోడ్డు నీటితో నిండిపోయింది. దీంతో వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, వర్షం ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు రావడంతో పిడుగులు పడతాయేమోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సీలేరు: జిల్లా ఏజెన్సీ పరిధిలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో శనివారం వింత వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 7 గంటల సమయంలో అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురవగా, ఆ తర్వాత సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగింది. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో మళ్ళీ జల్లులు కురిసి ఆగిపోయాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూన్ నెల ముగుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సీలేరుతో పాటు దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవుల, అమ్మవారి దారకొండ తదితర పంచాయతీల పరిధిలో గిరిజన రైతులు పొలం పనులను ముమ్మరం చేశారు. డుంబ్రిగుడ: మండల కేంద్రంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. సుమారు 11 గంటల వరకు వర్షం దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. ఈ వర్షం కారణంగా చాపరాయి పర్యాటక ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు, అరకు–పాడేరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లోకి చేరింది. దీనివల్ల వ్యాపారులకు ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ప్రధాన బజారులో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రాష్ట్రంలో గాడి తప్పిన పాలన
అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసులే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని లాకప్డెత్లు చేస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. స్ధానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన గాడి తప్పాయని, యుద్ధాల వల్ల నిత్యావసర ధరలు పెరిగినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. అయోధ్య రామ మందిరం హుండీ కానుకల చోరీ కేసు సిట్కు కాకుండా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఆగస్ట్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వాహించాలని, ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతుల సమస్యలపై నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సహాయ కార్యదర్శి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
పలు చోరీ కేసుల్లో నిందితురాలి అరెస్టు
అనకాపల్లి: పలు చోరీ కేసుల్లో నిందితురాలిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జి.ప్రమ్కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సబ్బవరం నుంచి అనకాపల్లి వస్తున్న ఆటోలోంచి గంటా మీనా అనే మహిళ దిగి వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి విచారణ చేయగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం 202 కాలనీకి చెందిన మీనా ఆటోల్లో ప్రయాణిస్తూ పలు చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. ఈనెల 11న అనకాపల్లి పట్టణం భీమునిగుమ్మం ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరి సంచిని బ్లేడ్తో కోసి అందులోని రూ.20వేలు నగదు చోరీకి చేసినట్టు తెలిపారు. ఈనెల 17న విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఆటోఎక్కి ఒక మహిళ మెడలో సుమారు రెండున్నర తులాల బంగారు మంగళ సూత్రాలతో కూడిన పుస్తెల తాడును దొంగలించినట్లు చెప్పారు. నిందితురాలి నుంచి రెండు చోరీలకు సంబంధించి రెండున్నర తులాల బంగారం, రూ.14వేలు నగదు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. విలేకరుల సమావేశంలో క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పది’ంతల ప్రతిభకు పురస్కారాలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. జెడ్పీ సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సేనాపతి పునీత్ కుమార్(592), ఇమంది దేవిక (592), వంగపండు శివసాయి అతిథి(591), అనకాపల్లి జిల్లాకు చెందిన ఆడారి ప్రణతి(593), తనకాల ఉషా(592), కనిగిరి హరిణి(591), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పరుంబుడి దేవి(593), పెరుశెట్టి ఊర్మిళ(515), కె.కీర్తన(505) పురస్కారాలు అందుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జేసీ విద్యాధరి, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీ తిరుమణి శ్రీపూజ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యానారాయణమూర్తి, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ?
మునగపాక: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దోచుకోవడం,దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే 33 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే విజయకుమార్ చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్లలో విలువైన కొండలను తవ్వేస్తూ అక్రమార్జనకు పాల్పడిన సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పారు. పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెట్టీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా గంగాదేవిపేట నుంచి మునగపాక వరకు ఉన్న సాగునీటి కాలువలను కప్పేసి రైతులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా కాలువలను కప్పేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. యలమంచిలి నుంచి అచ్యుతాపురం మీదుగా పరవాడకు రహదారి విస్తరణ చేస్తామంటూ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడంలో ఎమ్మెల్యే విజయకుమార్ విఫలమయ్యారని విమర్శించారు. కాపు యువకుడు సాయికృష్ణ మృతి వెనుక ఎంతోమంది పోలీసుల పాత్ర ఉందని, వారి వెనుక ఉన్న నేతల ప్రమేయంపై ప్రభుత్వం ఎందుకు నిగ్గు తేల్చడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు కుల రాజకీయం చేయడం విచారకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటతీరు సరిగ్గా లేదని, సినిమాల్లో పవన్కల్యాణ్ యాక్టింగ్ చేసినట్లు రాజకీయంగా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి నాయకుల అన్యాయాలు, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైస్ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్, రాంబిల్లి మాజీ ఎంపీపీ తిరుపతిరావు,పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కాండ్రేగుల జగన్,శరగడం జగన్నాథరావు పాల్గొన్నారు. -
మన్యం అందాలు ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం
చింతపల్లి: మన్యం ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నామని వాల్తేర్ ఫొటోగ్రఫీ సొసైటీ కార్యదర్శి ఎంవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 29న జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా, సొసైటీ ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలంలో ఫొటోగ్రాఫర్లు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫొటోగ్రాఫర్లు తాజంగి, కృష్ణాపురం, లంబసింగి, చింతపల్లి మరియు కొత్తపల్లి ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని, ల్యాండ్స్కేప్లను తమ కెమెరాలలో బంధించారు. జాతీయ కెమెరా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, చీరాల, చైన్నె, హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చిన సుమారు 30 మంది ఫొటోగ్రాఫర్లు చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ వర్క్షాపులో భాగంగా మన్యం ప్రాంతపు ప్రకృతి అందాలు, ఆదివాసీల జీవనశైలి, వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఫొటోలు తీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ తీసిన ఫొటోలను ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సెమినార్, ప్రత్యేక ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మన్యంలోని ప్రకృతి వైభవాన్ని పర్యాటక ప్రేమికులకు చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ ఫొటోగ్రఫీ సొసైటీ ప్రతినిధులు ఎస్.శ్రీనివాసరావు, ఎస్. రాము, సతీష్, సత్యనారాయణ, సన్నీ, బాలాజీ, టరాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.వాల్తేర్ ఫొటోగ్రఫీ సొసైటీ -
బాకై ్సట్ తవ్వకాలపై రగడ
మహారాణిపేట (విశాఖ): గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర కోరారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడియం వద్ద నిరసన సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితర సభ్యులు పోడియంను చుట్టుముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన చైర్పర్సన్ జె. సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు. తవ్వకాలపై జీవోలు లేవు: జాయింట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని ఆమె వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందడం లేదని మాడుగుల ఎంపీపీ దాలపురెడ్డి వెంకట రాజారావు ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ ఆదేశించారు. పెదబయలు జెడ్పీటీసీ బొంజుబాబు మాట్లాడుతూ పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతోపాటు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజా సమస్యలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 108 వాహనాల పనితీరు బాగోలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా డీఎంహెచ్వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్పర్సన్ సుభద్ర కోరారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, విద్య వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ● అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. అనంతగిరి మండలంలో ఐదు గ్రామాలను నాన్–షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, విశాఖపట్టం జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారంటూ అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు విమర్శ డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగంపై ధ్వజం ఆయనకు మద్దతు తెలిపిన సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నిరసన గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర సూచన -
ఎన్సీసీ విభాగంలో లోకజ్ఞ ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : ఎన్సీసీ విభాగంలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యా ర్థిని లోకజ్ఞకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమని వ్యవస్థాపకుడు కూండ్రపు మూర్తి శనివారం విద్యార్థిని లోకజ్ఞను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25న విశాఖపట్నం ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీడీజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుందన్నారు. ఎన్సీసీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం, చురుకై న భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన క్యాడెట్లలో ఆరుగురు బాలికలను డీడీజీ ప్రశంసాపత్రానికి ఎంపిక చేయగా వారిలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యార్థిని లోకజ్ఞ చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్, వివిధ ఎన్సీసీ యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సీలేరులో ఆపన్నహస్తం
● రోగులకు ఉచిత భోజనంతో సేవలందిస్తున్న దంపతులు సీలేరు ఆసుపత్రిలో రోగులకు భోజనం అందిస్తున్న బాలాజీ దంపతులు సీలేరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద గిరిజన రోగుల ఆకలి తీర్చడంలో బాలాజీ రెస్టారెంట్ నిర్వాహకులు నక్క జ్ఞానేశ్వర్రావు (బాల), ఆయన భార్య ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 50 గిరిజన గ్రామాలకు చెందిన రోగులు, గర్భిణుల వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. సరైన ఆహారం దొరకక, బయట హోటళ్లలో తినే స్థోమత లేక వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఈ దంపతులు, ప్రతిరోజూ నేరుగా ఆసుపత్రికి వెళ్లి రోగులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు. ‘ఆకలితో వచ్చే ప్రతి రోగికి, వారు చికిత్స పొందే ఎన్ని రోజులైనా సరే భోజనం అందించడమే మా లక్ష్యం’ అని జ్ఞానేశ్వర్రావు పేర్కొన్నారు. వీరి మానవత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. -
పైనాపిల్ ధర పతనం
● ధర తగ్గడంతో పరిస్థితి దయనీయంవారపుసంతలో విక్రయానికి తీసుకువచ్చిన పైనాపిల్ డుంబ్రిగుడ: అరకు వారపు సంతలో పైనాపిల్ ధరలు భారీగా పడిపోవడంతో మండలంలోని గిరిజన రైతులు నష్టపోతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు గణనీయంగా తగ్గడం రైతులకు తీరని ఆవేదన కలిగిస్తోంది. గతంలో పెద్ద సైజు పైనాపిల్ ధర రూ. 60 నుంచి రూ. 40 వరకు ఉండగా, ఈ వారం ఆ ధర రూ. 30 నుంచి రూ. 20కి పడిపోయింది. ధరలు అకస్మాత్తుగా పతనం కావడంతో, పంటను నమ్ముకున్న గిరిజన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
షైనింగ్ స్టార్ అవార్డుకుకేజీబీవీ విద్యార్థిని ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డుకు అచ్యుతాపురం కేజీబీవీ విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రిక ఎంపికై నట్టు మండల విధ్యాశాఖ అధికారి దేవరాయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అచ్యుతాపురం మండలానికి చెందిన విద్యార్థిని ఎంపికవడం గర్వకారణమన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కేవలం ఒక్క విద్యార్ధిని ఎంపికవడం విశేషమన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న మంగళగిరిలో రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రికతో పాటు తల్లిదండ్రులు తప్పనిసరిగా జూన్ 28 మద్యాహ్నం 2 గంటలలోపు మంగళగిరికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు విద్యార్థినికి అభినందనలు తెలిపారు. -
గిరి రైతుకు కష్టం.. దళారికి లాభం
పాడేరు పాతబస్టాండ్ సంత ప్రాంగణంలో కొనుగోలుదారులకోసం ఎదురుచూపులుసాక్షి,పాడేరు: అందరికీ తీపిని పంచే చిలగడదుంపల సాగు గిరిజన రైతులకు మాత్రం గత రెండేళ్లుగా చేదు అనుభవాన్నే మిగుల్చుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దిగుబడులు మార్కెట్కు వస్తున్నా, వ్యాపారుల సిండికేట్ కారణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రూ.వెయ్యి నుంచి రూ.700కు ధర పతనం పాడేరు పాతబస్టాండ్లో శుక్రవారం జరిగిన వారపు సంతలో గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత వారం 60 కిలోల బస్తా రూ. వెయ్యి ధర పలకడంతో రైతులు ఆశపడ్డారు. కానీ, వారం తిరిగేసరికి వ్యాపారులంతా కుమ్మకై ్క, బస్తా ధరను రూ. 600కు తగ్గించారు. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట మండలాల నుంచి సుమారు 150 బస్తాలను రైతులు సంతకు తీసుకురాగా, వ్యాపారులు తక్కువ ధరకే కొంటామని మొండికేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో, చివరికి ఒడిశాకు చెందిన ఓ వ్యాపారికి బస్తాకు రూ. 150 మినహాయించి అమ్ముకోవాల్సి రావడంతో రైతులు భారీగా నష్టపోయారు. సేంద్రియ సాగుకు డిమాండ్ ఉన్నా..: జిల్లాలోని 11 మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో గిరిజన రైతులు మెట్ట, కొండపోడు భూముల్లో చిలగడదుంపను పండిస్తున్నారు. వనుగుపల్లి, కిండంగి, కాడెలి, గొండెలి, గుత్తులపుట్టు, గబ్బంగి, తుంపాడ పంచాయతీలతో పాటు చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో దిగుబడులు ప్రారంభమయ్యాయి. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తుండటంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లలో మన్యం చిలగడదుంపలకు మంచి డిమాండ్ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో రూ. 30కి పైగా అమ్ముడవుతున్నా, తమకు మాత్రం సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి వారపు సంతల్లో వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. రెండేళ్లుగా నష్టాలే తియ్యదుంపకు అనేక రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్నా కష్టపడి సాగు చేసిన మా గిరిజన రైతులకు మాత్రం గత రెండేళ్లుగా నష్టాలే మిగులుతున్నాయి. గత ఏడాది బస్తా రూ.వెయ్యికి విక్రయించగా, ఈ ఏడాది స్థానిక వ్యాపారులు ధరలను పతనం చేశారు. ఒడిశా వ్యాపారులు బస్తా రూ.700కు మించి కొనుగోలు చేయడం లేదు. వారం వ్యవధిలోనే తియ్యదుంపల ధరను వ్యాపారులు పతనం చేయడం అన్యాయం – లైకోన్ లక్ష్మణ్, గిరిజన రైతు, గురుపల్లి, పాడేరు మండలం -
వాలీబాల్ క్రీడా మైదానం అభివృద్ధికి చర్యలు
అరకులోయ టౌన్ : గిరిజన ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని, అరకులోయలోని వాలీబాల్ క్రీడా మైదానాన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్రీడా మైదాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, స్థానిక ఓల్డ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, అల్లూరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, ఈ మైదానాభివృద్ధి విషయమై రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిని కోరానని తెలిపారు. గిరిజన యువత క్రీడల్లో రాణించే సత్తా కలిగి ఉందని, వారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారని ఆయనకు వివరించినట్లు తెలిపారు. తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సుబ్బారెడ్డి, కేవలం రెండు రోజుల్లోనే రూ. 30 లక్షల నిధులు కేటాయించారని, ఈ ప్రాంత ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ నిధులతో రెండు వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్, రెండు హైమాస్ట్ లైట్లు, బాలుర, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, బోరు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీకి మరమ్మతులు చేయిస్తామని ఎంపీ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని ఎంపీ తెలిపారు. లిట్టిగుడ గ్రామానికి చెందిన 8 ఏళ్ల రన్నర్ జీవన తన్య ప్రతిభను సోషల్ మీడియా ద్వారా గమనించి, పరుగుల రాణి పి.టి. ఉషాతో మాట్లాడి ఆమె కోచింగ్ సెంటర్లో చేర్పించామని చెప్పారు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు. అనంతరం క్రీడాకారులకు టీ–షర్టులను పంపిణీ చేశారు. ఓల్డ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.పౌలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, తహసీల్దార్ రాజా శ్రీధర్, డీఈ అభిషేక్, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, ఎల్బీ భీమరాజు, మాజీ సర్పంచ్లు భాస్కర్రావు, రాధిక, వైఎస్సార్సీపీ నాయకులు ఎల్బీ కిరణ్కుమార్, పట్టాసి సంపత్కుమార్, ముఖీ సాంబయ్య, సోమేష్, అసోషియేషన్ చైర్మన్ బురిడి ఆనందరావు, వైస్ చైర్మన్ కొర్రా మధుసుధన్రావు, ఉపాధ్యక్షుడు జి. బాబురావు, కార్యదర్శి కె. అప్పలరాజు, మయూరి రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పాఠశాల ఉన్నా.. బోధించేవారేరీ?
సీలేరు: కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించి, అన్ని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నా, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉపాధ్యాయుల నియామకంపై మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల ఉన్నా.. బోధించే వారే లేక.. దారకొండ పంచాయతీ పెద్దగంగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఒక్క ఉపాధ్యాయుడూ లేకపోవడంతో విద్యార్థుల చదువు గాలిలో దీపంలా మారింది. ఉపాధ్యాయుడు లేకపోవడంతో తరగతులు నిర్వహించడమే లేదు. దీంతో నిత్యం పాఠశాలకు వచ్చే విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఉపాధ్యాయుల నియామకం లేకపోవడంతో గత వారం రోజులుగా విద్యార్థులు పాఠశాలకే రావడం మానేశారు. ఆటపాటలకే పరిమితం ప్రవేశాలు కల్పించేందుకు, అలాగే టీసీలు ఇచ్చేందుకు కనీసం ఒక బాధ్యతాయుతమైన అధికారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడికి వెళ్లాల్సిన విద్యార్థులు ఆటపాటలకు పరిమితం కాగా, మరికొందరు పొలం పనులకు వెళ్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఉన్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిన తర్వాత, కొత్తగా ఎవరినీ నియమించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు మండల విద్యాశాఖ అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని వారు వాపోయారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం 50 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఏపీజీఎస్ జిల్లా అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ వార్డు మెంబర్ పాంగి పుల్లయ్య, పంగి బలరాం, పంగి సన్యాసిరావు, తిరుపతి, వంతల శ్రీను, కోడా నారాయణ తదితరులు హెచ్చరించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. -
కూటమి నేతలు చెబితే విత్తనాలు
నాతవరం: మీకు నచ్చిన విత్తన రకం కావాలంటే కూటమి నేతలు చెబితే చాలు అధికారులు ఠంచనుగా ఇచ్చేస్తారు. అదే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రైతులు వెళ్తే సవాలక్ష నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది నాతవరం మండలంలో వరి విత్తనాల పంపిణీలో చూపిస్తున్న వివక్ష.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో జిల్లాలోనే నాతవరం మండలంలో అధిక విస్తీర్ణంలో వరి పంట రైతులు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మండలంలో 8 వేల నుంచి 10 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సాగుకు 1,507 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు చేశారు. గత నెల 29వ తేదీన మండలానికి వచ్చిన నాలుగు రకాల విత్తనాలు 553 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. ఈ నెల 12వ తేదీన చినగొలుగొండపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి ఆధ్వర్యంలో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతులకు విత్తనాలు పంపిణీని ప్రారంభించారు. స్పీకరుతో ఆర్భాటంగా పంపిణీ చేయడంతో రైతులందరికి కావలసిన విత్తనాలు సకాలంలో అందుతాయని ఆశించారు. కూటమి నేతలు చీటీలు రాసి ఇస్తే విత్తనాలు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది కొరత ఉండటంతో క్షేత్రస్థాయిలో కూటమి నేతలు ఇష్టానుసారంగా పెత్తనం చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లో వరి విత్తనాలు కూటమి నేతలు వద్దకు వెళ్లి చీటీలు రాసి తెచ్చుకుంటే కావలసిన రకం విత్తనాలు ఇస్తున్నారు. నేరుగా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే విత్తనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. రేపుమాపు రావాలంటూ రైతులను తిప్పించుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామంటూ అధికారులు ప్రకటన చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులకు కావలసిన వరి విత్తనాలు పంపిణీ చేయడంలో వివక్ష చూపకుండా కూటమి నేతలు పెత్తనం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. రైతులకు వరి విత్తనాలు పంపిణీలో వివక్ష అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో పంపిణీ వైఎస్సార్సీపీ మద్దతు రైతులకు ఇబ్బందులు -
పాముకాటుతో కూలీ మృతి
మాడుగుల రూరల్: మండలంలో వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను(40) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కృష్ణాపురంలో నీరుకొండ ప్రసాదరావుకు చెందిన పామాయిల్ తోటలో ఉదయం కూలి పనికి వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా మధ్యాహ్నం అతడి కాలిపై పాము కాటేసింది. వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు భార్య లక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు ఉన్నారు. రోజూ మాదిరిగానే పామాయిల్ తోటకు పనికి వెళ్లిన శ్రీను మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
ఉపాధ్యాయుడి బైక్ అపహరణ
పెదబయలు: మండలకేంద్రంలో రోగులపేట సమీపంలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు బిడ్డిక మహేష్ తెలిపారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను దొంగిలించినట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇటీవల చిల్లర దొంగతనాలు పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సమయంలో, సీతగుంట పంచాయతీ చిట్రాయిపుట్టు గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతరకు వెళ్లిన సమయాన్ని గమనించిన దొంగలు, ఇంటి తాళాలు పగలగొట్టి ఐదు తులాల బంగారం అపహరించారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలతో భయాందోళనకు గురవుతున్న మండల ప్రజలు, పోలీసులు రాత్రిపూట గస్తీని పెంచి, నిఘా కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. -
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
నర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి అబిద్సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. అబిద్సెంటర్లో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకొని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గపూర్, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావు, దామోదర్నాయుడు, రామారావు, రాజారావు, తారకేశ్వరరావు, రుషికేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు -
గుడ్డిప విద్యార్థికి మద్రాస్ ఐఐటీలో సీటు
రావికమతం: రైతు కుటుంబంలో పుట్టిన మాచపల్లి సంతోష్కుమార్ మద్రాస్ ఓషన్ స్ట్రక్చ ర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు సంపాందించాడు. రావికమతం మండలం గుడ్డిప గ్రామానికి చెందిన సంతోష్కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన గేట్ పరీక్షలో సత్తా చాటి ఆలిండియాలో 6వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా మద్రాస్ ఓషన్ స్ట్రక్చర్ కాలేజీలో మైరెన్ ఇంజనీరింగ్లో సీటు ఖరారు చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, గంగాభవాని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి సంతోష్కుమార్ను గ్రామ పెద్దలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందించారు. -
ఆటోడ్రైవర్ నిజాయితీ
యలమంచిలి రూరల్: బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తన ఆటోలో మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి ఆ బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీసులు,సహచర ఆటోడ్రైవర్లు ప్రశంసించారు.అతని నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు రూ.500 నగదు బహుమతి అందజేశారు.వివరాలివి..గుంటూరుకు చెందిన మహిళ బత్తుల రమణ యలమంచిలి మండలం ములకలాపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చి, తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ములకలాపల్లి గ్రామంలో ఆటో ఎక్కింది.యలమంచిలి బస్టాండుకు చేసుకున్నాక తన బ్యాగును ఆటోలో మర్చిపోయి దిగిపోయింది.తర్వాత బ్యాగు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఆటో కోసం వెతకసాగింది.సమీపంలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామారావుకు విషయం చెప్పింది.ఇద్దరూ కలిపి ప్రధాన రహదారిపై ఆటోకోసం వెతుకుతున్న సమయంలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిన ఆటోడ్రైవర్ అక్కడకు వచ్చి నా ఆటోలో ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయిందని హెడ్ కానిస్టేబుల్ రామారావుకు చెప్పాడు. బ్యాగు తనదేనని చెప్పిన ప్రయాణికురాలు రమణకు పట్టణ పోలీసుల సమక్షంలో బ్యాగును అప్పగించారు.బ్యాగులో తులంపావు బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు.మర్చిపోయిన బ్యాగును నిజాయతీగా అప్పగించిన ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అందిబోయిన సత్యనారాయణను పట్టణ ఎస్ఐ సావిత్రి అభినందించారు. బంగారు ఆభరణాలతో మర్చిపోయిన బ్యాగు అప్పగింత -
మోదమ్మ ఆలయంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
ఆర్వో ప్లాంట్ను ప్రారంభిస్తున్న ఆలయకమిటీ సభ్యులు పాడేరు రూరల్: మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ. 1.60 లక్షల వ్యయంతో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు, కమిటీ సభ్యులు చల్ల రామకృష్ణ, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ ఈ ప్లాంట్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో వారానికి మూడు రోజుల పాటు అన్నసమారాధనతో పాటు, నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, భక్తులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటరమణ, చంద్రమోహన్, శంకర్ రావు, హరిబాబు, లక్ష్మయ్య, రమణమ్మ, సత్తిబాబు, స్వరూప, సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మాచ్ఖండ్కు నీటి కష్టాలు
పూర్తిగా అడుగంటిపోయిన జోలాపుట్టు జలాశయం స్పిల్వే (ఇన్సెట్) మాచ్ఖండ్ ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడు ఏళ్లుగా జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. జోలాపుట్టు జలాశయం: పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా, ప్రస్తుతం 2711.80 అడుగులు మాత్రమే ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే (2024లో 2710 అడుగులు, 2025లో 2709 అడుగులు) ఈ ఏడాది కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పటికీ, జలాశయం సామర్థ్యంతో పోలిస్తే ఇది తక్కువే. జోలాపుట్టు స్పిల్వే పూర్తిగా అడుగంటింది. డుడుమ జలాశయం: దీని పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 2580 అడుగుల వద్ద ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. 1955లో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం, దశాబ్దాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ వస్తోంది. అయితే, గత మూడేళ్లుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి ఎదురవుతోంది. జోలాపుట్టు నుంచి డుడుమ మీదుగా బలిమెల వరకు నీరు ప్రవహిస్తూ, పలు విద్యుత్ కేంద్రాలకు ఆధారంగా నిలుస్తోంది. మాచ్ఖండ్లో మరమ్మతులు గత నెలలో మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలోని ఎల్ఏవీటీ ప్యానెల్స్ పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల రోజుకు సుమారు 2.8 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి నష్టం జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఇతర విద్యుత్ కేంద్రాల నుండి కొత్త ప్యానెల్ బోర్డులు, ఇతర సామగ్రిని తెప్పించి కంట్రోల్ రూమ్లో అమర్చుతున్నారు. పాడైన వైరింగ్ను పునరుద్ధరిస్తున్నారు. జూలై మొదటి వారంలోగా రెండు జనరేటర్లను సిద్ధం చేసి, తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అడుగంటిన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు గణనీయంగా పడిపోయిన నీటిమట్టాలు ఎడారిని తలపిస్తున్న స్పిల్వే విద్యుత్ ఉత్పత్తికి సవాళ్లువర్షాలు పడకుంటే ఇబ్బందే మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం నూతన ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.రెండు జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి.విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే సమయానికి వర్షాలు కురిసి నీటి మట్టాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. – సీహెచ్ అప్పాజి, ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
ఊబిలో చిక్కుకుని యువకుడి మృతి
● ధారమటం జలపాతం వద్ద ఘటన ● గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు గొలుగొండ: కన్నవారికి పుత్రశోకం మిగిలింది. ఎదిగొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. సరదాగా జలపాతాల వద్ద స్నానం చేద్దామని అనుకున్న యువకుడు కాలుజారి ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకొన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన చుక్కల సాంబశివ(21) ప్రమాదశాత్తూ ధారమఠం జలపాతంవద్ద శుక్రవారం మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు ఈ ప్రాంత ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే..బంధువులైన వాడపల్లి మణికంఠ, పలక భానుప్రసాద్తో కలిసి జి. మాడుగుల గ్రామానికి చెందిన చుక్కల సాంబశివ(21) శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ధారమఠం శివా లయానికి వచ్చాడు. శివాలయం వద్ద నుంచి కొండఅంచున చాలా దూరం వెళ్లి అక్కడ మూడు కొండల నడుము ఉన్న జలపాతం వద్ద సాంబశివ స్నానం చేసే సమయంలో కాలుజారి పక్కనే ఊబి లో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న మణికంఠ, భానుప్రసాద్ హుటాహుటిన గుడి వద్దకు వచ్చి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికులు గొలుగొండ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గొలుగొండ ఎస్ఐ పి.రామారావు, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించారు. సాంబశివ పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్టు గుర్తించి తాళ్లు, కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. దారమఠం వద్ద ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారికావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాంబశివ విశాఖ ఏయూలో ఇంజినీరింగ్(ఈఈఈ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. -
1/70 పరిరక్షణకు సిద్ధం కావాలి
గిరిజన భవన్ ఎదుట నినాదాలు చేస్తున్న ఐక్యవేదిక నేతలు కొయ్యూరు: 1/70 చట్టాన్ని రక్షించుకోవాలని, గిరిజనేతరుల ఆక్రమణలను అడ్డుకోవాలని చింతపల్లి డివిజన్ ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాజేంద్రపాలెం గిరిజన భవన్లో నిర్వహించిన సమావేశంలో గిరిజన చట్టాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. స్థానిక నేత నర్సి పాపారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చట్ట సవరణపై ఆందోళన గిరిజన భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని కోరుతూ 1,700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు నేపథ్యంలో, చట్టాన్ని కాపాడుకునేందుకు న్యాయ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని ఐక్యవేదిక విమర్శించింది. ఒకవేళ సుప్రీంకోర్టు చట్ట సవరణకు ఆమోదం తెలిపితే, గిరిజన భూములకు రక్షణ ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోరాటాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్న పడాల్, భారత్ రాష్ట్ర ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు, విశ్రాంత డీఎస్పీ కాకూరి బాలరాజు, వైఎస్సార్సీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, వైఎస్సార్సీపీ నేత వారా చిన నూకరాజు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఎం నేత సరుమూర్తి సూరిబాబు, సీపీఐ మండల కార్యదర్శి ఉల్లి సూరిబాబు, స్థానికులు చుంద్రు కృష్ణ, బూరుగు వెంకటరావు, శ్యామల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణభయం
గిరిజన బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, సకాలంలో చికిత్స అందక వరుసగా విద్యార్థులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఫైళ్లకే పరిమితం కావడంతో, జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు నేడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమని గడపాల్సిన దుస్థితి నెలకొంది ఆశ్రమాల్లోసాక్షి,పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందని ద్రాక్షలా మారింది. పాఠశాలల్లో వైద్య సిబ్బంది నియామకాలు లేకపోవడంతో, విద్యార్థులకు అనారోగ్యం సోకితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందక గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 22న చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాలకు చెందిన కొర్రా సంజు (13) అనే విద్యార్థి మలేరియాతో మరణించడం విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. సకాలంలో వైద్య పరీక్షలు చేసే సిబ్బంది లేకపోవడంతో, ఆ విద్యార్థిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మాట తప్పిన సీఎం చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో అరకులో నిర్వహించిన సభలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండు విద్యాసంవత్సరాలు ముగిసి, మూడవ సంవత్సరం ప్రారంభమైనా ఆ హామీ అమలుకు నోచుకోలేదని, దీనివల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి తొలి సంతకం ఏమైంది? గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సంధ్యారాణి, హెల్త్ వలంటీర్ల నియామకంపైనే తొలి సంతకం చేశారు. ఇది గిరిజన వర్గాల్లో ఆశలు రేకెత్తించినప్పటికీ, సంతకం చేసిన రెండేళ్ల తర్వాత కూడా ఒక్క హెల్త్ వలంటీర్ను కూడా నియమించకపోవడం గమనార్హం. మంత్రి పెట్టిన ఆ ఫైలు కార్యాలయాలకే పరిమితమై మూలకు చేరింది. విద్యార్థులపై పెనుభారం ప్రస్తుతం జిల్లాలోని 117 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 55 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను ఆసుపత్రుల చుట్టూ తిప్పాల్సి వస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన తొమ్మిది రోజులకే అనంతగిరిలో ఒక విద్యార్థి మృతి చెందడం, అంతకుముందు 2024– 25లో ఆరుగురు, 2025–26లో జి.మాడుగుల మండలం బందవీధిలో ఒక విద్యార్థి మరణించడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో ఎనిమిది మంది మృతి వరుస మరణాలతో గిరిజన పాఠశాలల్లో ఆందోళన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం హెల్త్ వలంటీర్ల నియామకం గాలికి అమలుకాని ఎన్నికల హామీ అందనంత దూరంలో సత్వర వైద్యంవైద్యంపై నిర్లక్ష్యం దారుణం కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల వైద్యం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. హెల్త్ వలంటీర్లను నియమిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం అన్యాయం. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు గత రెండేళ్లుగా సత్వర వైద్య సేవలకు దూరమయ్యారు. వరుసగా విద్యార్థుల మరణాలు చోటుచేసుకుంటున్నా, ముఖ్యమంత్రికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఏమాత్రం పట్టకపోవడం దారుణం. – లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
టెన్త్ టాపర్లకు ‘గిరి ప్రతిభ’ పురస్కారాలు
సాక్షి,పాడేరు: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులకు గురువారం జిల్లా కలెక్టర్ నిశాంతి గిరి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందిస్తూ నగదు బహుమతులు, జ్ఞాపికలను అందించారు. ప్రథమ స్థానం సాధించిన ఉబ్బేటి దీపక్కు రూ.10 వేలు, ద్వితీయ స్థానం సాధించిన కుర్ర తేజశ్రీకి రూ.8 వేలు, తృతీయ స్థానం సాధించిన సాంగుల సాయిజ్యోతికి రూ.5 వేలు అందజేశారు. తరువాత స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 2,000 చొప్పున నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భద్రాచలం బీఈడీ కళాశాల పూర్వ విద్యార్థులు కూడా టెన్త్ టాపర్లను సన్మానించారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా
అరకులోయ టౌన్: అరకు పార్లమెంటు పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు కేంద్రమైన అరకులోయలో తన క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తెలిపారు. గురువారం అరకులోయలో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పార్టీ అరకు పార్లమెంటు పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఇతర నాయకులతో కలిసి ఆమె ఎంపీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. థింసా నృత్యాలతో మహిళా నాయకులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గతంలో పనిచేసిన ఎంపీలు ఎవరూ నియోజకవర్గ కేంద్రంలో అందుబాటులో ఉండేవారు కాదన్నారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితికి తావులేకుండా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.. అని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో అరకు పార్లమెంటు పరిధిలోని ఏడు మండలాల్లో రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏడు మండలాల్లో 10 అంబులెన్సుల ఏర్పాటు, తారాబు జలపాతం అభివృద్ధికి రూ.5 కోట్లు, 36 ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల అమరిక వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. గిరిజన చట్టాల రక్షణ కోసం పోరాటం హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అలాగే బాకై ్సట్ నమూనాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పేర్కొన్నారు. 1/70 చట్టం, జీవో నంబర్ 3, హైడ్రో పవర్ ప్రాజెక్టుల అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని, ప్రధాని, హోంమంత్రితో పాటు సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించిన జీవో 97ను రద్దు చేశారని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో అరకులోయ, పాడేరు స్థానాలతో పాటు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆమె జోస్యం చెప్పారు. అరకు పార్లమెంటు పార్టీ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, పార్టీకి అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీకి అండగా ఉంటున్న ప్రజలందరూ భవిష్యత్తులోనూ పార్టీకి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, నాయకులు, కార్యకర్తలు అరకులోయలోని ఈ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, మాజీ ఎమ్మెల్యే హైమావతి దేవి, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, వైఎస్సార్, టీఎస్సార్ ట్రస్టు వ్యవస్ధాపకుడు టి. సురేష్ కుమా ర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జెడ్పీటీసీ జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, టి. మిథుల, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఎంపీ కార్యాలయం ఎదుట ఎంపీ తనూజరాణి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్క్యాంప్ కార్యాలయం ప్రారంభానికి హాజరైన పార్టీ శ్రేణులు రెండేళ్లలో రూ.20 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి గిరిజన చట్టాల రక్షణకు పార్లమెంట్లో ప్రస్తావిస్తా 2029లో జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం ఎంపీ తనూజరాణి అరకులోయలో క్యాంప్ కార్యాలయం ప్రారంభం -
న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి
అరకులోయ టౌన్: అనంతగిరి మండలం బొర్రా గుహల వద్ద వ్యాపారాలు చేసుకుంటున్న 109 మంది గిరిజన వ్యాపారుల షాపులను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ, బాధిత వ్యాపారులు గురువారం ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని గద్యగుడలో ఉన్న రవిబాబు ఫామ్ హౌస్లో బొర్రా వర్తక సంఘం ప్రతినిధులు, దుకాణ యజమానులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొర్రా గుహల అభివృద్ధి కోసం పర్యాటక శాఖ రూ.30 కోట్లు కేటాయించిందని, అయితే అభివృద్ధి పనుల పేరిట ప్రస్తుతం అక్కడ ఉన్న 109 దుకాణాలను తొలగించి, డీపీఆర్లో కేవలం 38 దుకాణాలకు మాత్రమే స్థానం కల్పించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు, ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని పర్యాటక శాఖ డీవీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఎమ్మెల్సీకి వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: స్పందించిన ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. స్థానిక గిరిజనుల హక్కులు, జీవనోపాధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్య పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని, జిల్లా అధికారులు, పర్యాటక శాఖ డీవీఎంతో ఫోన్లో మాట్లాడారు. 109 గిరిజన కుటుంబాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ గిరిజనులకు అన్యాయం జరిగితే, బొర్రా గుహల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బొర్రా గుహల ప్రవేశ రుసుము, జిప్లైన్ ఆదాయంలో గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పంచాయతీకి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, బొర్రా మాజీ సర్పంచ్ జన్ని అప్పారావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబుకు‘బొర్రా గుహల’ బాధిత వ్యాపారుల వినతి -
ఆర్ ఐటీఐలో ప్రవేశానికి30 వరకు దరఖాస్తు గడువు
● ప్రిన్సిపాల్ రామ్మోహన్రావు చింతపల్లి: స్థానిక ఆర్ ఐటీఐలో మొదటి విడత ప్రవేశాలకు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రిన్సిపాల్ రామ్మోహన్రావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు సమీపంలోని ఏదైనా ఐటీఐ కేంద్రానికి వెళ్లి, సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయని పక్షంలో మెరిట్ జాబితాలో అభ్యర్థుల పేర్లు ఉండవని స్పష్టం చేశారు. మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న వారికి, మొదటి విడత కౌన్సెలింగ్ను అరకు ఐటీఐలో నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9494929704,9494377833 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
పరిశుభ్రత ముఖ్యం
డుంబ్రిగుడ: విద్యార్థుల విద్యా ప్రగతి, ఆరోగ్యం, సంక్షేమంతో పాటు పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ అన్నారు. గురువారం ఆయన మండలంలోని గుంటసీమ బాలుర, నందివలస బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గుంటసీమ పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంట గది, స్టోర్ రూమ్లు, డార్మిటరీలు,పాఠశాల పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్వహణను మరింత మెరుగుపరచాలని పీవో సూచించారు. -
బాకై ్సట్ తవ్వకాలు చేపడితేఉవ్వెత్తున్న ఉద్యమం
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక పాడేరు: గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా, వారి జీవన్మరణ సమస్యగా ఉన్న బాకై ్సట్ తవ్వకాలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రహస్య సర్వేలపై ఆగ్రహం ఈనెల 18న జర్రెల కొండల్లో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి అధికారులు రహస్యంగా సర్వేలు చేపట్టి, శాంపిల్స్ను సేకరిస్తుండగా స్థానిక గిరిజనులకు అడ్డంగా దొరికిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక గిరిజనులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారే స్పందించి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. గిరిజన సంపద దోపిడీకి కుట్ర ఏజెన్సీలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తుండటంతో, గిరిజనులపై ఉన్న అక్కసుతోనే కూటమి ప్రభుత్వం అడ్డదారిలో వారి సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గిరిజనుల మనుగడకు ఆయువుపట్టుగా ఉన్న 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కొందరు 1,700 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారని, కానీ గిరిజనుల తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఒక్క పిటిషన్ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. గిరిజన చట్టాలను, హక్కులను తుంగలో తొక్కి భూభాగాలను ఆక్రమించుకోవాలనే కుట్రలను గిరిజనులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బాకై ్సట్ తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు రాంబాబు, మత్స్యకొండం నాయుడు పాల్గొన్నారు. -
అరకు పర్యాటకంపై కూటమి నిర్లక్ష్యం
మాజీ మంత్రి బాలరాజు విమర్శఅరకులోయ టౌన్: దేశ, విదేశాల్లో పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అరకులోయ పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, కనీసం రాత్రి వేళల్లో వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు, అధికారులకు రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయినా పట్టించుకునే నాథుడే లేరని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అరకులోయ పట్టణంలోని డివైడర్లలో ప్రమాదకరమైన వయ్యారి భామ మొక్కలు పెరుగుతున్నాయని, వీటి వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి ఆ మొక్కలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 516 ఉ బైపాస్ రోడ్ల వద్ద బెంజిపూర్, అరకు సంతబయలు తదితర ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లను అస్తవ్యస్తంగా నిర్మించారని, దీనివల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు అప్రోచ్ రోడ్ల డిజైన్ను మార్చి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, భూర్జ సుందర్రావు, మాజీ సర్పంచ్ చటారి వెంకటరావు, సూపర్ ఎంపీటీసీ సొనాయి కృష్ణారావు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేఆశ్రమ విద్యార్థి మృతి’
పాడేరు రూరల్: అనంతగిరి ప్రభు త్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఈనెల 23న కొర్రా సంజు అనే విద్యార్థి మృతి చెందడం ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లే గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు చులకనగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు పెడుతున్న వంటకాల్లో నాణ్యత ఉండడం లేదని, అందువల్లే అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు.విద్యార్థి మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబుజ్జి, అంజల్కుమార్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రులే మన ముందున్న దేవుళ్లు
మద్దిలపాలెం (విశాఖ): నిత్యం మన కళ్లెదుట కనిపించే తల్లిదండ్రులే ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలని ప్రఖ్యాత గజల్ గాయకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘గజల్ శ్రీనివాస్ భారతీయం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు), కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరై మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో బాధ్యత, విలువలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంచేలా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో గజల్ శ్రీనివాస్ ఒకరని కొనియాడారు. సందేశాత్మకమైన గజల్స్ దాదాపు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, దేశభక్తి, మానవ విలువలను ప్రతిబింబించే గజల్స్ను గజల్ శ్రీనివాస్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన గేయాల ద్వారా సందేశమిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
పాడేరు : జిల్లాలో శాశ్వతంగా గంజాయి సాగు నిర్మూలించడంతో పాటు రైతులకు అధిక ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బి.కర్ణ తెలిపారు. పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి. మాడుగుల మండలాల గిరిజన రైతులకు ఉద్యానవన శాఖ, ఈగల్ టీం ద్వారా విలువైన అవకాడో, రాం బూటన్ మొక్కలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిషేధిత, అక్రమ పంటల సాగును పూర్తిగా విడిచిపెట్టి స్థిరమైన ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటలు, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. రైతులకు తోటల స్థాపన, నిర్వహణ, సాంకేతిక మార్గదర్శకాలను ఉద్యానవన శాఖ ఉచితంగా అందజేస్తూ వారిని జీవనోపాధి మెరుగుదలకు కృషి చేస్తోందని చెప్పారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంతో పాటు స్థిరమైన ఆదాయ వనరులను కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి బి. శరణ్యమాధురి, ఈగల్ టీం సీఐ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరికలు
ఎస్.రాయవరం: అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. భీమవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఇరువురు సీనియర్ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇతరులతో కలిపి పది మంది వైఎస్సార్సీపీలో చేఆరు. కంబాల జోగులు వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల జోగుల మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే చతికిలబడిందని ఎద్దేవా చేశారు. కుట్ర రాజకీయాలతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మరింత సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మధువర్మ, స్థానిక గ్రామ కమిటీ అద్యక్షులు గరగా శ్రీనివాసరావు, పార్టీలోచేరిన పాలపర్తి శ్రీను, రామారావు కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ మేళాలో138 మంది ఎంపిక
పాడేరు రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించి జాబ్ మేళాలో 138 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికై నట్టు పాడేరు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. యువత నైపు ణ్యం పెంపొందించుకోవడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రశాంత్కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయ్, 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ బస్లను ప్రభుత్వమే నడపాలి
అనకాపల్లి : బడుగు, బలహీన ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్లను దశలు వారిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసి, కొత్తగా విద్యుత్ బస్లను ప్రవేశపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని, విద్యుత్ బస్ను ఆర్టీసీలో కొనసాగించాలని ప్రజారవాణాశాఖ ఉద్యోగుల సంఘం(జేఏసీ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు అన్నారు. స్థానిక డిపో వద్ద బుదవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్లను ఆర్టీసీ వారే నిర్వహించాలని, మూసివేసిన డిపోలను తక్షణమే తెరిపించాలని, ఫినాజిల్ కంపెనీలో ఒప్పందాలు రద్దు చేయాలని, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటిని ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, బకాయిపడ్డ నాలుగు డీఏలు చెల్లించాలని, కొత్తగా నాలుగువేల బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నాయకులు కె.ఎన్.వి.రమేష్, వై.వి.ఎస్.కుమార్, టిఏ.రాజు, ఎల్యూఆర్.బాబు, జి.వి.రమణ, డి.ఎన్.మూర్తి, బి.ఎ.రావు, టి.టి.మూర్తి పాల్గొన్నారు. -
పల్స్ పోలియో విజయవంతం చేయాలి
పాడేరు: వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. పల్స్పోలియో నిర్వహణపై బుధవారం జిల్లా అధికారులతో టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 0–5 సంవత్సరాల పిల్లలు 85,676 మంది ఉన్నారని, వారిందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ సచివాలయ, వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో దండోర, మైక్ ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 875 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ప్రతి చిన్నారి–ప్రతి బూత్– ప్రతి చుక్క ఎంతో విలువైనది అనే నినాదాన్ని పల్స్పోలియో మార్గదర్శక సూత్రంగా పాటించాలన్నారు. అనంతరం పల్స్పోలియో బ్యాన ర్ను ఆవిష్కరించారు. డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్రావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్, డీఆర్డీఏపీడీ మురళి పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
అరకులోయటౌన్(పాడేరు రూరల్): పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం సాధ్యపడుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. మండల కేంద్రం అరకులోయలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నంబర 57 ప్రకారం 2004 కు ముందు నోటీఫై అయిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం వర్తింపు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రంగాల వారికి సౌకర్యంగా ఉండేందుకు అల్లూరి జిల్లాను జోన్1లోనే కొనసాగించాలని కోరారు. ఎంపీహెచ్ఏల ఐదు నెలల బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలతో పాటు ఇతర బకాయిలపై రాష్ట్ర కార్యవర్గం చర్చించి భవిషత్ ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లకె రవింద్రబాబు,ఉపాధ్యక్షుడు బొంజిబాబు,ఉద్యోగుల సంఘం నాయకుడు సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రావు -
గిరిజన యువతి జాతీయ స్థాయి ప్రతిభ
ముంచంగిపుట్టు : న్యూఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్(ఐఎన్ఐ–సెట్)–2026 జూన్ సెషన్ ఫలితాలలో ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామానికి చెందిన గిరిజన యువతీ డాక్టర్ చిట్టపులి శ్రావ్య దీప్తి ప్రియాపడాల్ ప్రతిభ కనబర్చింది.అఖిల భారత స్థాయిలో 6,436వ ర్యాంకు,కేటగిరీ ర్యాంకులో 38వ స్థానం సాధించారు.దీంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థలలో ఒకటైన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో ప్రసూతి, సీ్త్రరోగ విభాగంలో(ఎం.డి.గైనకాలజీ)లో సీటును మొదటి ప్రయత్నంలోనే కై వసం చేసుకుంది. కిలగాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు చిట్టపులి శ్రీనివాస్పడాల్,కృష్ణకుమారి దంపతుల ద్వితీయ కుమార్తె శ్రావ్య దీప్తి ప్రియా పడాల్.10వ తరగతి వరకు పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్ విద్యానికేతన్,ఇంటర్మీడియెట్ అంత విశాఖలోని శ్రీచైతన్యలో,2019లో నీట్–యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ప్రవేశం పొంది, 2025లో వైద్య విద్యను పూర్తి చేశారు.గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యువతీ శ్రావ్య దీప్తిప్రియాపడాల్ ఈ స్థాయికి చేరుకోవడం యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని,భవిష్యత్తులో వైద్య సేవా రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కిలగాడ గ్రామానికి చెందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు,నేతలు,ప్రజలు, మండల వాసులు అభినందనులు తెలియజేస్తూ,ఆకాంక్షించారు. -
అండర్–16 విశాఖ జట్టు విజయం
విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అండర్–16 మల్టీడే అంతర జిల్లాల నార్త్జోన్ క్రికెట్ పోటీల్లో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్లో 61 పరుగులకే ఆలౌటైంది. విశాఖ బౌలర్లలో యతీష్ మూడు వికెట్లు పడగొట్టగా, రామ్చరణ్, లోహిత్, భాను తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన విశాఖ జట్టు 6 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ చైతన్య 82 పరుగులు చేయగా, గణేష్కృష్ణ 210 పరుగులతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రామ్చరణ్ (119), రుత్విక్ (నాటౌట్ 100) సెంచరీలతో రాణించగా, చెరిష్వర్ధన్ 86 పరుగులు చేశాడు.భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. మణివర్ధన్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విశాఖ బౌలర్లలో లోహిత్ నాలుగు వికెట్లు, భాను మూడు వికెట్లు, యతీష్ రెండు వికెట్లు పడగొట్టారు.దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. -
వైఎస్ జగన్ హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధి
ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డుంబ్రిగుడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పర్యాటక రంగం అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తెలిపారు. 2022–23లో ఐటీడీఏ ద్వారా రూ.80 లక్షలతో చాపరాయిని అభివృద్ధి చేయడంతో పాటు మరెన్నో ప్రాంతాల్లో పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించారని చెప్పారు. బుధవారం ఆయన చాపరాయిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం నిధులను ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కేటాయించారని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరకులోయ, బొర్రా గుహలు, కొత్తపల్లి, చాపరాయిల ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్కరూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదన్నారు. పర్యాటక రంగంలో పనిచేసే ఉద్యోగులకు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నరావు, పార్టీ ఎస్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, అరకులోయ ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, సీనియర్ నాయకులు ఎస్.భాస్కరరావు, రాందాస్, వి. గురునాయుడు, జి.ప్రకాష్, సొనాయి కృష్ణ పాల్గొన్నారు. కల్తీ ఆహారంపై అప్రమత్తం అరకులోయ టౌన్(పాడేరురూరల్): కాలం చెల్లిన, కల్తీ ఆహారపదార్థాల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు తెలిపారు. బుధవారం ఆయన అరకులోయలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారులు కల్తీ ఆహారపదార్థాలను అధికంగా విక్రయిస్తుండడంతో ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే కల్తీ, నకిలీ సరుకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. -
శారదానదిలో బాలుడు గల్లంతు
కశింకోట: మండలంలోని అమీన్సాహెబ్పేట వద్ద శారదానదిలో మిత్రులతో పాటు కలసి సరదాగా స్నానానికి దిగిన యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... యలమంచిలి మండలం వెంకటాపురానికి చెందిన వీసం చందు (16), మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి వారితో పాటు ఎఎస్ పేట వద్ద శారదా నదిలో స్నానానికి దిగాడు. ఈత రాక నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ మేరకు అందిన సమాచారంపై సంఘటనా స్థలాన్ని సందర్శించి ముమ్మరంగా నవీన్చంద్ర ఆచూకి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
ఆదివాసీల సంపదను దోచుకోనివ్వం
అనంతగిరి(పాడేరు రూరల్): ప్రాణాలైనా ఇస్తాంగానీ ఆదివాసీల అటవీ సంపదను దోచుకోనివ్వబోమని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం అనంతగిరి మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బాకై ్సట్ పై రాజకీయ పార్టీల అభిప్రాయలను వెల్లడించాలన్నారు. గిరిజన ప్రాంతంలో నిక్షిప్తమైన ఉన్న బాకై ్సట్ ఖనిజ సంపదపై రాజకీయ పార్టీల వైఖరి ప్రకటించాలన్నారు. చింతపల్లి ఏరియాలో బాకై ్సట్ నమూనాలను రహస్యంగా సేకరించి తరలించడంపై తీవ్రంగా అభ్యంతరం చేస్తున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతంపై అన్ని హక్కులు ఆదివాసీలకే ఉంటాయని, ఖనిజ సంపదను దోచుకోవడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. ఆదివాసీ మహిళలు కట్టెలకోసం అడవికి వెళ్తే కేసులు పెట్టే అధికారులు, ఆదివాసీల సంపదనే దోచుకునే ప్రయత్నం చేస్తున్న దొంగలను ఎందుకు విడిచి పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు బాకై ్సట్కు వ్యతిరేకంగా టీఏసీ తీర్మానం చేశామని గుర్తు చేశారు.మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు -
హాస్టల్లోప్రవేశాలకునోఛాన్స్
నర్సీపట్నం : బీసీ హాస్టల్లో విద్యార్థులను చేర్పేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. దీంతో బాలబాలికలను సంబంధిత వసతి గృహాల్లో చేర్చుకునేందుకు సంక్షేమాధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. పేదవర్గాలు చిన్నారుల చదువులకు భరోసా ఇవ్వడంలో ఇవి పునాదిలా నిలుస్తున్నాయి. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందుతుండడంతో వీటిలో సీట్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ముందుచూపుతో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టి ఉంటే విద్యార్థులకు మేలు చేకూరేది. వెంటాడుతున్న సమస్యలు నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో 15 గదులు ఉండగా వీటిలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతిని పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో వసతి గృహంలో ఇప్పటికే వసతి పొందుతున్న విద్యార్థులను మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. కొత్త విద్యార్థులు చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. వసతి సమస్యతో సతమతం నర్సీపట్నం సబ్ డివిజన్లో వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 11 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సుమారు 1600 మంది విద్యార్థిని, విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒక్కో హాస్టల్లో 100 నుంచి 300 మందిని చేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. వేములపూడి బాలికల వసతిగృహంలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన పది గదుల్లో ఉన్న విద్యార్థులకే వసతి సమస్య కారణంగా కొత్త విద్యార్థులను తీసుకోవడం లేదు. 70 మంది విద్యార్థినులు వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. సీటు వస్తుందనే నమ్మకంతో సమీపంలోని హైస్కూళ్లలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించారు. తీరా వసతి గృహానికి వెళ్తే కొత్త విద్యార్థులను చేర్పించుకోవడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టి విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవనం మరమ్మతుపనులకు ప్రతిపాదనలు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ స్థానిక సంక్షేమాధికారి, హైస్కూళ్ల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. వసతి చాలని కారణంగా కొత్త విద్యార్థులను చేర్చుకోవద్దని ఉన్నతాధికారులు సూచించినట్టు సంక్షేమాధికారి వెంకటలక్ష్మి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తొందరపడి విద్యార్థులను తిరిగి పంపించొద్దని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుందామని సూచించినట్టు తెలిసింది. దీనిపై ఏబీసీ డబ్ల్యూవో గోపీనాథరావును వివరణ కోరగా వసతి సమస్య వల్లనే పిల్లలను చేర్చుకోవడం లేదని తెలిపారు. భవన మరమ్మతులకు రూ.23 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైన వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. వసతి సమస్య తీరిన వెంటనే విద్యార్థులను చేర్చుకుంటామని తెలిపారు. -
విత్తన బంతులతో అటవీ సంపద వృద్ధి
సీలేరు: విత్తన బంతులతో అటవీ సంపద వృద్ధి చెందుతుందని, అంతరించిపోతున్న అడవులు మళ్లీ చిగురించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సీలేరు అటవీ రేంజ్ అధికారి వెంకటరావు అన్నారు. చింతపల్లి అటవీ డివిజన్ సీలేరు రేంజ్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని పలు పాఠశాల విద్యార్థులతో కలిసి అటవీ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి మాట్లాడుతూ పచ్చదనం పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 2.50 కోట్ల విత్తన బంతులు తయారీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. చింతపల్లి డివిజన్లో 6.50 లక్షల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు.ఇందులో సీలేరు రేంజ్ పరిధిలో 1.20 లక్షల బంతులు తయారు చేసి పలు అటవీ ప్రాంతాలు, పాఠశాలల వద్ద చల్లుతున్నట్టు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటవీ సిబ్బంది 1,100 విత్తన బంతులు వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి రమణమ్మ, సెక్షన్ ఆఫీసర్ సతీష్, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పీఎంఎంవీవై సద్వినియోగం చేసుకోవాలి
● ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ పాడేరు : కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మా తృ వందన యోజన్( పీఎంఎంవీవై)ను గర్భిణులు, పాలిచ్చే తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మహి ళలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార భద్రత, సంక్షేమం కోసం ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని చెప్పారు. రూ.5వేల ఆర్థిక సాయం రెండు విడతల్లో జమ అవుతుందని తెలిపారు. అర్హులైన మహిళలు సమీపంలో ఉన్న అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. -
మెరుగైన విద్య అందించాలి
మాట్లాడుతున్న డీఐఈవో వినోద్ బాబు మాడుగుల: కళాశాలలో మెరుగైన విద్య అందించాలని అనకాపల్లి జిల్లా డీఐఈవో మద్దిల వినోద్బాబు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలను ఆయన బుధవారం అకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలన్నారు. 2026 మార్చిలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలవగా మాడుగుల ప్రత్యేక స్థానం దక్కించుకుందున్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు సిబ్బందికి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సూపరింటెండెంట్ సుధాకర్, యూడీసీ శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులున్నారు. -
‘బొడ్డేడ’ రచనకు జాతీయ స్థాయి బహుమతి
కశింకోట: కశింకోటకు చెందిన కథా రచయిత బొడ్డేడ బలరామస్వామి రాసిన ‘మొక్కు’ కథ జాతీయ స్థాయి కథల పోటీలో వరుసగా మూడోసారి తృతీయ బహుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన 2026 కథల పోటీ ఫలితాలను బుధవారం ప్రకటించగా బహుమతి వచ్చినట్లు బలరామస్వామి తెలిపారు. ఈ మేరకు పది వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో వచ్చే నెల 19,న జరిగే కార్యక్రమంలో బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో 2024లో డేగ, 2025లో తోడపెద్దు కథలకు తృతీయ బహుమతులు వచ్చాయన్నారు. సాహితీవేత్తలు, స్థానిక పెద్దలు బహుమతి పొందిన బలరామస్వామిని అభినందించారు. -
చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్గా ఆదిలక్ష్మి
చింతపల్లి: స్థానికప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్(ఏడీఆర్)గా డాక్టర్ డి.ఆదిలక్ష్మి నియమితులయ్యారు. అనకాపల్లి నుంచి ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. గత మూడేళ్లుగా ఇక్కడ ఏడీఆర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆళ్ల అప్పలస్వామిని అనకాపల్లి చెరుకు ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీ చేశారు. డాక్టర్ ఆదిలక్ష్మి 13 ఏళ్ల పాటు వరి, 12 ఏళ్లపాటు చెరకు పంటలపై పరిశోధనలు జరిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధానా స్థానంలో బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శాస్త్రవేత్తలు,కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ప్రాంత రైతులకు అవసరమైన సాంకేతిక విజ్ఞానం,యాంత్రీకరణ,విలువలు జోడింపు వంటి అంశాలపై పరిశోధనలు జరిపి వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి ,బాలహుస్సేన్ రెడ్డి,సందీప్ నాయక్,వెంకటేష్,జోగారావు, టీచింగ్ అసోసియేట్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు
చీడికాడ: మండలంలోని ఖండివరం గ్రామం మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న మోదమాంబ పాదల నుంచి ఖండవరం, ఎల్.బి.పట్నం గ్రామాలకు చెందిన సూమారు 50 కళ్లాలకు వెళ్లే మార్గంలో ఆక్రమణలను బుధవారం తొలగించి రెవెన్యూ అధికారులు సరిహాద్దులు వద్ద రాళ్లు పాతించారు. ఈ రహదారిని ఖండివరం గ్రామానికి చెందిన గండి సూర్యనారాయణ అనే నాయకుడు ఆక్రమించుకుని ఆ మార్గంలో వెళ్లే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు గత సోమవారం పీజీఆర్ఎస్లో బాధిత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గత గురువారం సాయంత్రం తహసీల్దార్ కిషోర్ లింకన్ ఆక్రమణ గురైన వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వం స్థలమని నిర్ధారించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు బుధవారం మండల సర్వేయర్ సురేష్, వీఆర్వో అర్జునరావు, రైతులు, గ్రామపెద్దలు సి.డి.సి చైర్మన్ సుంకర శ్రీనువాసరావు, కో–ఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు మోసూరి సన్నిబాబు, మండల కో–ఆప్సన్ మెంబర్ షేకు సూర్యనారాయణలు, వేచలపు కామేశ్, అమ్మతల్లినాయుడు సమక్షంలో సర్వే రాళ్లు పాతారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : విశాఖ–విజయవాడ స్థానిక అనకాపల్లి శారదనది బ్రిడ్జి రైల్వే ట్రాక్పై సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడు నల్లరంగు పుల్హ్యాండ్స్ చొక్కా, ఎర్ర రంగు బనియాన్, నలుపురంగు ఫ్యాట్ ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996 ను సంప్రదించాలన్నారు. -
అరకొరగావిద్యా కానుక
విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ● బ్యాగులు కరువు ● యూనిఫాంల సంగతీ అంతే ● బూట్లు లేక పాత చెప్పులే గతి సాక్షి,పాడేరు: పాఠశాలలు తెరిచిన రోజే ప్రతి విద్యార్థికీ విద్యాకానుక అందజేస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది.వాస్తవానికి పూర్తిస్థాయిలో విద్యాకానుక కిట్లు రాకపోవడంతో అందినవాటినే అరకొరగా పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక కింద అన్ని వస్తువులూ ఏ స్కూలులోనూ, ఏ పిల్లవాడికీ అందిన దాఖలాలు లేవు. బూట్లు,యూనీఫాంలు అందకపోవడంతో పాత, చిరిగిన వాటినే విద్యార్థులు ధరించి పాఠశాలలకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాకానుక కిట్లను పాఠశాలల ప్రారంభం రోజునే పంపిణీ చేయగా,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా కిట్ల పంపిణీని అటకెక్కిస్తోంది.ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరచి 10 రోజులు కావస్తున్నా విద్యా కానుక కిట్లు కేవలం పాఠ్య,నోటు పుస్తకాలకే పరిమితమైంది. యూనిఫాం, ఇతర సామగ్రి కరువే అల్లూరి సీతారామరాజు,పోలవరం జిల్లాలు యూనిట్గా విద్యాశాఖ పనిచేస్తోంది.ఈ రెండు జిల్లాల్లోని 22 మండలాల పరిధిలో 1,77,733 మంది విద్యార్థులు చదువుతున్నారు.వారందరికీ విద్యా కానుక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉండగా పుస్తకాలకే పరిమితమైంది.ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి అర కొరగానే మండల కేంద్రాలకు చేరుకోవడంతో వాటిని అన్ని పాఠశాలల విద్యార్థులకు పంపిణీని చేయలేకపోతున్నారు. ఇప్పటికీ చేరని కానుకలు రెండు జిల్లాల పరిధిలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విద్యా కిట్లు సరఫరా కాలేదు.46,439 యూనిఫాం మెటీరియల్, బూట్లు, 69,560 బ్యాగులు,18,641 బెల్ట్లు మాత్రమే మండల కేంద్రాలకు చేరుకున్నాయి.విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విద్యా కిట్లు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చిరిగిన బ్యాగులు.పాత యూనిఫాంలనే విద్యార్థులు వినియోగిస్తున్నారు.బూట్లు పంపిణీ చేయకపోవడంతో తమ పాత చెప్పులతోనే పాఠశాలలకు వస్తున్నారు. -
చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్
అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బోడపు త్రినాథ్ది అత్యంత నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పారునాయుడు, రమణమ్మలతో పాటు చెల్లి మాధవిని తనే పోషిస్తున్నాడు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి, ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళ్లల్లో ఆశలు ఇంకా మిగిలి ఉండగానే, 24 ఏళ్ల ప్రాయంలోనే త్రినాథ్ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోదిస్తున్న త్రినాథ్ బంధువులు -
కరిగిపోయిన కలలు
నిప్పుల గుండంలో ‘సహజ వనరుల దోపిడీకి కుట్ర’ డుంబ్రిగుడ: ఆదివాసి గిరిజనులను అడవుల నుంచి తరలికొట్టేందుకు మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనరస విమర్శించారు. డుంబ్రిగుడలోని సామాజిక భవనంలో సీపీఎం మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై ఆదివాసుల అడవులు, భూములు, సహజ వనరులను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు నిర్వహించినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ, పోతురాజు, సురేష్, డొంబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే పరవాడ : ఆ తెల్లవారుజాము వారిద్దరూ ఎప్పటిలాగే తమ విధుల్లో మునిగిపోయారు. కుటుంబాలను సాకుతున్నామన్న తృప్తి, రేపటి జీవితంపై ఎన్నో ఆశలు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ పరిశ్రమే వారికి చితిగా మారింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రీయల్ పార్క్(ఏపీఐఐసీ జోన్–3)లో గల ’దక్షిణ్ ఎనర్జీ’ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు యువ కార్మికులను సజీవ దహనం చేసింది. ఈ హఠాత్పరిణామంతో అనకాపల్లి జిల్లాలోని రెండు గ్రామాలు ఒకేసారి కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. క్షణాల్లో జరిగిన ఘోరం ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, ఇంధన నూనెలను తయారు చేసే ఈ పరిశ్రమను గతేడాది సెప్టెంబరులోనే ప్రారంభించారు. సోమవారం రాత్రి షిఫ్ట్ విధులకు హాజరైన ఆపరేటర్ వేపాడ వెంకటేష్(34), ఫిట్టర్ బోడపు త్రినాథ్(24)లు మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద ప్రాసెసింగ్ పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక రియాక్టర్ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది, గోడలు బీటలు వారాయి. క్షణాల వ్యవధిలో పరిశ్రమను దట్టమైన మంటలు అలుముకున్నాయి. రియాక్టర్ వద్దే ఉన్న వెంకటేష్, త్రినాథ్లు తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గుండెలు పగిలేలా రోదనలు ఈ ప్రమాదం సృష్టించిన బీభత్సం ఒకవైపు అయితే, మృతుల కుటుంబాల గాథలు కంటతడి పెట్టించాయి. పరిశ్రమ గేటు వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది. అధికారుల సందర్శన : ప్రమాద వార్త తెలియగానే పరవాడ డీఎస్పీ మోహన్రావు, సీఐ భాస్కరరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జేసీ శౌర్యమాన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్రెడ్డి పరిశ్రమను సందర్శించి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం మహారాణిపేట: ‘దక్షిణ్ ఎనర్జీ’ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు వేపాడ వెంకటేష్, బొడ్డాపు త్రినాథ్ల మృతదేహాలకు మంగళవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోలీసులు పంచనామా పూర్తి చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడవుల సంరక్షణతోనే మనుగడ ముంచంగిపుట్టు : భవిష్యత్తు తరాల మనుగడకు అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సీహెచ్.నారాయణపడాల్ అన్నారు. మండలంలోని కిలగాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఇంగ్లిష్ మీడియం బాలుర పాఠశాలలో మంగళవారం ముంచంగిపుట్టు రేంజ్ ఫారెస్టు అధికారులు ఏఎస్ఆర్ అరణ్య కార్యక్రమం నిర్వహించారు. అడవుల సంరక్షణ, ప్రాముఖ్యత, ఉపయోగాలు, జీవవైవిధ్యంలో మొక్కలు, జంతువుల సముతుల్యతపై అవగాహన కల్పించారు. నారా యణ పడాల్ మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచవచ్చునన్నారు. వర్షాలు పడటానికి, భూగర్భ జలాలు పెరగడానికి అడవులు దోహదపడతాయని చెప్పారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బి.వెంకటపతిరాజు, కార్తీక్, ఉపాధ్యాయులు భగత్రామ్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
ఆస్పత్రి హౌస్ఫుల్
సాక్షి,పాడేరు: జిల్లాలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో గిరిజ నుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం ప్రభావంతో నిల్వ నీరు పెరగడం, పారిశుధ్య లోపాలు కారణంగా దోమల సంఖ్య అధికమవ్వడంతో ఈ వ్యాధులు విజృంభిస్తున్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో జ్వర పీడితులు చేరుతున్నారు. 430 బెడ్ల సామర్థ్యం ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 400 పడకలు దాదాపు నిండిపోయాయి. కొత్తగా వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడం వైద్య సిబ్బందికి సవాలుగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే కేసులు ఎక్కువగా ఉండటంతో, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి రిఫరల్ కేసులు పెరుగుతున్నాయి. మలేరియా కేసులు గిరిజన ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతాలు, చెరువులు, వాగులు దగ్గర నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. మరోవైపు డెంగ్యూ కేసులు కూడా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం. 600 దాటుతున్న ఓపీ సీజనల్ వ్యాధుల ప్రభావంతో పాడేరులోని జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ఏరియా ఆస్పత్రి, చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగుల రద్దీ అధికమైంది. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జ్వర పీడితులను పాడేరు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 400 వరకు రోగులు ఇన్పేసెంట్లుగా ఉన్నారు. రోజు వారి ఓపీ 600 దాటుతుంది. వీరిలో 200 మంది వరకు జ్వరపీడితులు ఉండడంతో రక్త పరీక్షల కేంద్రం నిత్యం రద్దీగా ఉంటుంది. గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించి మలేరియా, డెంగ్యూ, వైరల్, టైపాయిడ్ వంటి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. కానరాని ఫాగింగ్ జిల్లాలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ పనులు జరగకపోవడం, అన్ని కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు దోమకాట్లకు గురవుతూ మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. పీహెచ్సీల నుంచి వస్తున్న మలేరియా కేసులకు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు కల్పిస్తుండడంతో ప్రాణాపాయం తప్పుతుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు మైదాన ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా మలేరియా, డెంగ్యూ రోగులు అధికంగా తరలివెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 10 మంది వరకు మలేరియా రోగులు ఉండగా.. వారిలో కొంత మందికి ప్లేట్లెట్స్ తగ్గిపోయిన పరిస్థితితో ఆందోళనకరంగా ఉంది. జిల్లా ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ పెంచేందుకు ఉన్నత వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులను కేజీహెచ్కు తరలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో 1133 మలేరియా కేసులు నమోదయ్యాయి. మరోవైపు అధికారికంగా 7 డెంగ్యూ కేసులు నమోదవ్వగా, ప్రైవేట్ ఆస్పత్రులలో అనధికారికంగా చికిత్స పొందిన డెంగ్యూ రోగులు అధికంగా ఉన్నట్టు సమాచారం. మలేరియా, డెంగ్యూ తీవ్రత ఉన్నప్పటికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశుధ్య చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరు నెలల్లో మలేరియా కేసుల వివరాలు పాడేరు జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి బెడ్ల సామర్థ్యం 430 ఇన్పేషెంట్లు 400 రోజు వారీ ఓపీ 600 విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు భయపెడుతున్న మలేరియా డెంగ్యూ కేసులూ నమోదు జిల్లా ఆస్పత్రికి రోగుల తాకిడి బెడ్స్ సరిపోక అవస్థలు పీహెచ్సీల నుంచి రిఫరల్ కేసులూ అధికమే నెల కేసులు జనవరి 23 ఫిబ్రవరి 43 మార్చి 106 ఏప్రిల్ 165 మే 445 జూన్ 351 మొత్తం 1133 -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
పెదబయలు: గ్రామాల్లో ఎవరికి జ్వరం వచ్చినా వెంటనే ఆశ కార్యకర్తను సంప్రదించి సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ తర్వాతే మందులు వాడాలని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డా. తులసి సూచించారు. మంగళవారం మండలంలోని కుంతుర్ల పంచాయతీ బొడ్డగొంది గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో దోమల నివారణ చర్యలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇంటింటా తిరిగి దోమల మందు పిచికారీ జరిగిందా లేదా అన్నది ఆరా తీశారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వనుగూరు మేరీ(9), వనుగూరు జీవన్రాజ్(7) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతి చెందిన చిన్నారుల తండ్రి అనుగూరు కోటిబాబు, అనుగూరు మేసేలుకు మలేరియా పాజిటివ్గా తేలడంతో వారికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న 70 మంది, మంగళవారం మరో 12 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా, ఎక్కువ మందికి వైరల్ జ్వరాల లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. గ్రామంలో తాగునీటి పరిస్థితిని కూడా పరిశీలించారు. అన్ని ఇళ్లలో దోమల మందు పిచికారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయించాలి జిల్లాలో ఎవరికి జ్వరం వచ్చినా నాటు వైద్యం లేదా అనధికార వైద్యుల వద్దకు వెళ్లకుండా, ఆశ కార్యకర్తల సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని తులసి సూచించారు. వ్యాధి నిర్ధారణ కాకముందే మందులు వాడటం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కాచిచల్లార్చిన నీరు తాగాలని, దోమలు నివారణకు ప్రతి మూడు రోజులకు ఒకసారి వేపాకులు లేదా పిడకల పొగ వేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 1604 గ్రామాల్లో మొదటి దఫా దోమల మందు పిచికారీ పూర్తి కాగా, మిగిలిన గ్రామాల్లో జూలై 1 నుంచి రెండో దఫా చేపట్టనున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైతే వెంటనే తనను సంప్రదించాలని డా. తులసి ఫోన్ నంబర్ను గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్సల్టెంట్ అధికారి శ్రీనివాసరావు, మండల మలేరియా సిబ్బంది బింగురాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలి జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి జిల్లాలో 1604 గ్రామాల్లో మొదటి దఫా ఫాగింగ్ బొడ్డగొంది గ్రామాన్ని సందర్శించిన జిల్లా మలేరియా అధికారి తులసి -
విద్యా ప్రమాణాలు పెరగాలి
● ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం ● పాఠశాల సంసిద్ధతపై సమీక్ష పాడేరు : విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఏటీడబ్ల్యూవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన తీరు, మధ్యాహ్న భోజనం మెనూ, పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణతో మెలగాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పీవో హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పరిమల, ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ముగ్గురు ఆడపిల్లల తండ్రి వెంకటేష్
చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్కు భార్య కోమలి, ముగ్గురు చిన్నారి ఆడపిల్లలు ఉన్నారు. గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వెంకటేష్, అది మూతపడటంతో ఐదు నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. తన ముగ్గురు కూతుళ్లను బాగా చదివించుకోవాలని ఆశపడ్డ ఆ తండ్రి, ఇలా మంటల్లో కలిసిపోవడంతో.. ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ ఆ భార్యాపిల్లలు చేస్తున్న రోదనలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి. రోదిస్తున్న వెంకటేష్ భార్య కోమలి -
ఎఫ్ఎల్ఎన్ అమలుపైఏజీ అడిట్ బృందం ఆరా
ముంచంగిపుట్టు : క్షేత్ర స్థాయిలో పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు పరిశీలన కోసం మంగళవారం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ అడిట్ బృందం సభ్యులు విజయవాడ నుంచి వచ్చి ముంచంగిపుట్టు మండలంలో పర్యటించారు. దారపల్లి, సరియాపల్లి, కిందుపుట్టు, పోలీపుట్టు, సగ్గులు, జర్రెల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం వంటి కనీస నైపుణ్యాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ఎంత వరకు అమలు జరుగుతుంది అనే దానిపై ఆరా తీశారు. 3వ తరగతి పిల్లల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం సాధించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై అంచనా వేశారు. అంగన్వాడీ కేంద్రాలను సైతం తనిఖీలు చేసి మౌలిక వసతులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రాలలో బోధనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆడిట్ అఫీసర్ ఎల్.సత్యనారాయణ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం పాఠశాలల్లో అమలుపై ఈ నెల 28వ తేదీ వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ అసిస్టెంట్ అడిట్ అఫీసర్లు హెచ్.సుమన్, మానుయాదవ్, ఎంఈవోలు కృష్ణమూర్తి, త్రినాథ్, సీఆర్పీలు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
జి.మాడుగుల: ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించి సేంద్రియ ఉత్పత్తులు మరింతగా పెంచాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. మండలంలో గెమ్మలి పుత్తడిగొంది గ్రామంలో మంగళవారం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం అధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ఈ పరికరాల వినియోగంతో శ్రమ ఆదాతో పాటు పంటల రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ చందు మీనా మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాలు, సాంకేతికతను రైతులు అందించే ఉద్దేశంతో దేశం అంతటా ఐఏఆర్ఐ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 8 గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు స్ప్రేయర్లు, విత్తన గొర్రు(సీడ్ డ్రిల్), టార్పాలిన్లు, పవర్ వీడర్లు, చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదనపు ఆదాయం నిమిత్తం నాటు కోళ్లను కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ కుర్రా, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, తహసీల్దార్ రాజ్కుమార్, డిప్యూటీ ఎంపీడీవో సన్యాసిరావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్, వ్యవసాయ అధికారి పాత్రుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ సమన్వయకర్త సీతారామరాజు, రైతులు పాల్గొన్నారు. -
బొండగుడలో విష జ్వరాల విజృంభణ
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): బస్కి పంచాయతీ పరిధిలోని బొండగుడ గ్రామంలో విషజ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, నేటికి 15కి చేరిందని వైస్ ఎంపీపీ కిల్లో రామన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే బాధితుల సంఖ్య పదులకు చేరుకుందని ఆరోపించారు. ఇప్పటికే బస్కి పంచాయతీ పరిధిలో మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని కోరినా, అధికారులు స్పందించలేదని మండిపడ్డారు. పారిశుధ్య లోపం కారణంగా దోమలు, ఈగల సంతతి పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత వైద్యాధికారులు స్పందించి, బస్కి పంచాయతీ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, బాధితులకు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. -
వారధి లేని
బతుకులుగుమ్మరేవుల మార్గంలో ధ్వంసమైన ప్రాంతంసీలేరు: గూడెంకొత్తవీధి మండలంలోని గిరిజన గ్రామాల్లో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వాగులు, గెడ్డలు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లలేక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రధాన రహదారులపై వంతెనల నిర్మాణం పెండింగ్లో ఉండటంతో, గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఆరో తరగతిలో సీట్లు పెంచాలని నిరసన
ముంచంగిపుట్టు: ఆరో తరగతిలో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా నేతలు కె. త్రినాథ్, ఎం. శ్రీను మాట్లాడుతూ, ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేర్పించేందుకు వెళ్తే, సీట్లు లేవని ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున, సీట్లు పెంచడంతో పాటు కొత్త పాఠశాలలను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో ధర్మారావు స్పందించి, ఏటీడబ్ల్యూవో స్వర్ణలతతో మాట్లాడారు. ప్రవేశం కోరిన ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని హెచ్ఎంలను ఆదేశించడంతో, నిరసనకారులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం మండల కార్యదర్శి ఎస్. ఈశ్వరి, పలువురు నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
మహారాణిపేట: స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, కార్యదర్శి రోహిణిదేవి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
తుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమెతోపాటు జేసీ శౌర్యమాన్ పటేల్, ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాస్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. తద్వారా అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. అర్జీలు పునరావృతం అయ్యిందంటే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్ఎస్కు– 135 అర్జీలు, రెవెన్యూ క్లినిక్కు– 172 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు దివ్యాంగుల సహాయ పరికరాల నిల్వకు భవనం కేటాయించాలి నూతనంగా ఏర్పడిన జిల్లాలో నేటికి దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించడం దారుణమని, దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక పరికరాల కోసం ఆ జిల్లా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడం, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూక అప్పారావు పీజీఆర్ఎస్లో వినతి అందించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ శాశ్వత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అనకాపల్లిలో దివ్యాంగుల పరికరాలు నిల్వ ఉంచుటకు తాత్కాలిక భవనాన్ని కేటాయించాలంటూ అధికారుల వద్ద మొర పెట్టుకున్నారు. దివ్యాంగులైన ఎస్.సిద్ధుకు ట్రై సైకిల్, జి.సాయికుమార్కు వీల్ చైర్ మంజూరు చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈ పార్క్కు వ్యతిరేకంగా రైతుల ధర్నా కె.కోటపాడు మండలం గొండుపాలెం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే నిలిపివేయాలని, ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్కు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి ఈర్లె నాయుడుబాబు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ఎటువంటి గ్రామసభ నిర్వహించకుండా తహసీల్దార్ కార్యాలయానికి కొంతమంది రైతులను రప్పించుకుని భయపెట్టి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తున్నారని, ఇది దుర్మార్గపు ఆలోచన అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులను బెదిరిస్తున్నారని, దీన్ని ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిపారు. గొండుపాలెం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్క్కు చేసిన శంకుస్థాపనను వెంటనే విరమించుకోవాలని, లేదంటే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్. నాయుడు, ఆర్. రామకృష్ణ, ఆర్.మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్, ఆర్. భారతి, బి.తారకేశ్వరకుమార్, రొంగలి మోహన్కుమార్, మహిళలు, రైతులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర హామీ ఇచ్చారు. సోమవారం ఆమె మండలంలోని సుజనకోట పంచాయతీ, తోటపుట్టు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ గ్రామంలో ఎంతో కాలంగా ఉన్న కల్వర్టు సమస్యను పరిష్కరిస్తూ, జెడ్పీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ ప్రత్యేక పూజలు చేసి, శంకుస్థాపన చేశారు. కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చొరవతో గిరిజన మహిళను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టడం వల్ల, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. సుజనకోట పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి బోర్లు, డ్రైనేజీలు, కల్వర్టుల కోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలను ఆమె పరామర్శించి, ఓదార్చారు. అంగన్వాడీ భవనం కోసం వినతి తోటపుట్టు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారని గ్రామస్తులు నారాయణ, రమేష్, మహేంద్ర, జీనబంధు, జయరాం, డొంబ్రులు చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుభద్ర, అంగన్వాడీ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అరబీరు జగబంధు, ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచ్ వెంగడ రమేష్, మండల వైఎస్సార్సీపీ నేతలు బాబురావు,రాధాకృష్ణ పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
ఘాట్రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, పాడేరు: ఘాట్లోని ఏనుగురాయి సమీపంలోని ఇరుకై న మలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి భారీ లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల నుంచి లోడ్తో పాడేరు వస్తున్న లారీ సాంకేతిక కారణంతో ఆకస్మికంగా నిలిచిపోవడంతో ఉదయం వరకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. మైదాన ప్రాంతాలకు రవాణా స్తంభించింది. వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే పోలీసులు, పలు విభాగాల సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని లారీని అక్కడ నుంచి తొలగించే పనులు చేపట్టారు. ఉదయం 8గంటలు దాటిన తరువాత ఘాట్లో ఇరువైపులా వాహనాలు నడిచాయి. రోడ్డుకు అడ్డంగా తిరిగిన లారీ -
అంతర్ జిల్లా సరిహద్దులో సారా బట్టీలపై దాడులు
మాడుగుల రూరల్: మండలంలోని శివారు గిరిజన గ్రామాల్లో సారా బట్టీలుపై దాడులు చేసి, పది లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, 800 లీటర్లు బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు మాడుగుల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎల్. ఉపేంద్ర సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అల్లూరు జిల్లా సరిహద్దులో మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ బిళ్లలపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సారా బట్టీలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో సారా స్వాధీనం చేసుకుని, బెల్లం పులుపుతోపాటు వంటపాత్రలు ధ్వంసం చేశామన్నారు. బిళ్లలపాలెం గ్రామానికి చెందిన పళ్లేజు కొండమ్మ, పాడేరు మండలం అర్జాపురం, ఓబర్తి గ్రామాలకు చెందిన జోడి రాజు, జన్ని ఈశ్వరరావు, మడక జగ్గారావులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. విచారణలో నల్లబెల్లం తయారుదారుపై కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో సీఐతోపాటు ఎస్ఐ కె. శ్రావణి, హెచ్సీలు కె. అప్పలనాయుడు, ఎం. గురునాయుడు, సిబ్బంది ఆనంద్, విజయ, కనకరాజు, పాల్గొన్నారు. -
బీమా కార్మికులకు ఆశ్రిత ప్రయోజన పింఛన్ల అందజేత
సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆశ్రిత ప్రయోజనం (డిపెండెంట్ బెనిఫిట్) ఒక ముఖ్యమైన ప్రయోజనమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ అన్నారు. ఉద్యోగ నిర్వహణ సమయంలో, ఉద్యోగ సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించిన బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద నెలవారీ పింఛను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధిత ప్రమాదాల్లో మరణించిన గాజువాక ఈ.ఎస్.ఐ బ్రాంచ్ ఆఫీసు పరిధిలోని ముగ్గురు బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు నగరంలోని ఈఎస్ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆశ్రిత ప్రయోజనం కింద మంజూరైన పింఛను చెక్కులు అందజేశారు. హిందుస్థాన్ షిప్యార్డ్లో పనిచేస్తూ వేగి వెంకట కృష్ణ గుండెపోటుతో మృతి చెందగా అతని భార్య, కుటుంబ సభ్యులకు నెలకు రూ.21,204లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరు చేశారు. నాగార్జున వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో హెల్పర్గా పనిచేస్తున్న ఎం.నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని భార్యకు పార్వతికి నెలకు రూ.10,479 పెన్షన్ మంజూరు చేశామన్నారు. తులసి ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రతినిధిగా ఉక్కు కర్మాగారంలోని ఎంజీఎం యార్డ్లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కె.సూర్యారావు భార్యకు భవానికి నెలకు రూ.12,388 ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరైందన్నారు. ఈ సందర్భంగా జేడీ కేఆర్ రవి కుమా ర్ మాట్లాడుతూ ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల బీమా కార్మికుడు మరణించిన సందర్భంలో, అర్హులైన కుటుంబ సభ్యులకు కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా ఆశ్రిత ప్రయోజన పింఛను, బకాయి చెల్లింపులు, ఇతర చట్టబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉందని తెలిపారు. మృతి చెందిన బీమాదారుని భార్యకు రూల్ 25 (10) సోషల్ సెక్యూరిటీ సెంట్రల్ రూల్స్ 2026 ప్రకారం నామమాత్రపు రుసుముతో నెలకు రూ. 50 చొప్పున సంవత్సరానికి రూ. 600 ముందస్తు చెల్లింపుతో ఈ.ఎస్.ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్స్లో వైద్య సదుపాయం పొందవచ్చున్నారు. మృతి చెందిన బీమాదారుని పిల్లలకు ఈఎస్ఐసి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లలో నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ప్రకారం ప్రత్యేక కోటాకు అర్హత లభిస్తుందన్నారు. ఆయా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో బాధితులకు న్యాయం
తుమ్మపాల: బాధితుల ముఖంలో నవ్వే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాలన్నారు. స్టేషన్లో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపాలని, విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతామన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని, ప్రజలకు అండగా నిలవడానికి పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ వారం మొత్తం 60 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. -
గంభీరం రిజర్వాయర్లో మునిగి యువకుడి మృతి
ఆనందపురం: స్నేహితులతో కలిసి సరదాగా సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు రిజర్వాయర్లో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టుముక్కల శ్రీధర చక్రవర్తి (28) సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన స్నేహితులు ప్రశాంత్, శౌవిక్ చౌదరీతో కలిసి గంభీరం రిజర్వాయర్కు వెళ్లాడు. ముగ్గురూ కలిసి ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరగడంతో శ్రీధర చక్రవర్తి నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడి తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గొట్టుముక్కల మధు జగన్నాధ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సీఐ సీహెచ్.వాసు నాయుడు ఆదేశాలతో ఎస్ఐ ఎం.హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గండి బాబ్జీ దౌర్జన్యాలను అరికట్టాలి
మహారాణిపేట: పెందుర్తి మండలం రాణివారి కల్లాలు (సర్వే నెంబర్ 107/11) పరిధిలోని పేద ప్రజల నివాసాలపై టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, భూ కబ్జాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి బాధితుడు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాణివారి కల్లాల్లో దాదాపు 40 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నాయని, ఆ ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. గండి బాబ్జీ అనుచరులు జేసీబీలతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేస్తూ దౌర్జన్యానికి తెగబడుతున్నారని, దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి పేదలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎస్. వెంకటలక్ష్మి, ఈసరాపు లక్ష్మి పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెన్యువల్కు అక్రమ వసూళ్లు
సాక్షి, పాడేరు: జిల్లాలోని కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు, సీహెచ్వోలు, ఎంఎల్హెచ్పీల నుంచి డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, ఇతర సిబ్బంది బాండ్లు రెన్యువల్కు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అందిన ఫిర్యాదు మేరకు అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ సోమవారం విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన 300 మంది పాడేరులో నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. బాండ్లు రెన్యువల్కు సంబంధించి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వరకు వసూళ్లు చేసినట్టు వారంతా అడిషనల్ డైరెక్టర్కు పలు ఆధారాలతో వివరించారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్, డీఎంహెచ్వో కార్యాలయంలోని పలువురు సిబ్బందిని అడిషనల్ డైరెక్టర్ సమగ్రంగా విచారించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని కాంట్రాక్టు వైద్య ఉద్యోగులను మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ ఆవరణలో అడిషనల్ డైరెక్టర్ విచారించనున్నారు. -
ఇద్దరు చిన్నారుల మృతి బాధాకరం
ఎంపీడీవో శ్యాంసుందర్ పెదబయలు: మండలంలోని కుంతుర్ల పంచాయతీ, బొడ్డగొంది గ్రామంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని స్థానిక ఎంపీడీవో శ్యాంసుందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బొడ్డగొంది గ్రామాన్ని సందర్శించి, మృతి చెందిన మనుగూరు మేరీ (9), అనుగూరు జీవన్రాజ్ (7) కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఒకే కుటుంబంలో అక్కాతమ్ముళ్లు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన వైద్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరికై నా జ్వరం లేదా ఇతర వ్యాధుల లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆశా కార్యకర్తను సంప్రదించి స్థానిక పీహెచ్సీకి సమాచారం అందించాలని సూచించారు. ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం పొందాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కుంతుర్ల పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే, గ్రామస్తులు వినియోగిస్తున్న గ్రావిటీ నీటిని ఆయన పరిశీలించారు. రెండో రోజు కొనసాగిన వైద్య శిబిరం పెదబయలు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో గ్రామంలో రెండో రోజు కూడా వైద్య శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు 70 మందికి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో ఎవరికై నా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 108కి లేదా సంబంధిత వైద్యులకు ఫోన్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గోదావరి డెల్టాకు డొంకరాయి నుంచి నీటి విడుదల
సీలేరు: గోదావరి డెల్టా పంటల సాగుకు నీటి ఎద్దడి తలెత్తిన నేపథ్యంలో, రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి నిల్వలు పెంచేందుకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల అభ్యర్థన మేరకు, ఏపీ జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భీమవరపు బాలకృష్ణ మాట్లాడుతూ, మొత్తం 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4 వేల క్యూసెక్కులు, డొంకరాయి జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి లేకుండా నేరుగా మరో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి డొంకరాయి జలాశయం యొక్క 6, 7 నంబర్ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ నీటి విడుదల ఈ నెల 27 వరకు కొనసాగుతుందని, ఈ క్రమంలో పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
బాకై ్సట్ తవ్వకాలకు అనుమతిస్తే పోరాటం తప్పదు
అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి హెచ్చరికసాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే బాకై ్సట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని, గిరిజనుల పక్షాన తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ఆదివారం ఆమె సాక్షితో ఫోన్లో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబుపై విమర్శలు ఏజెన్సీలోని అపారమైన బాకై ్సట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు బాకై ్సట్ తవ్వకాలకు అనుకూలంగా జీవో నంబరు 97ను తెచ్చి గిరిజనులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన నిలబడి, బాకై ్సట్ వ్యతిరేక పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయం: 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం హోదాలో జగన్మోహన్రెడ్డి బాకై ్సట్ జీవోనంబు 97ను రద్దు చేసి గిరిజనులకు అండగా నిలిచారన్నారు. ఆ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఏజెన్సీలో ఎంతోకాలంగా ఉన్న బాకై ్సట్ భూతం వదిలి, గిరిజనులు ప్రశాంతంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రతిఘటన తప్పదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్రమ సర్వేలతో గిరిజనులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని ఎంపీ హెచ్చరించారు. గిరిజనులకు అన్యాయం చేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోకపోతే, గిరిజనులతో కలిసి వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో పోరాడుతుందని, ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ గుమ్మా తనూజరాణి స్పష్టం చేశారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
ముంచంగిపుట్టు : రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక సీహెచ్సీలో పోలీసుశాఖ సహకారంతో ఆదివారం వైద్య సిబ్బంది నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. జెడ్పీ చైర్ పర్సన్తో పాటు ఎస్ఐలు నాని, వెంకటేష్, సీఆర్పీఎఫ్ జవాన్లు, నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరికి పండ్లు,గ్లూకోజ్ డ్రిక్స్ అందించారు. అనంతరం 27 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయారన్న మాట వినిపించకూడదన్నారు. ,ప్రతి ఒక్కరూ రక్తదానం చేపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై గిరిజన గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని, ముఖ్యంగా సికిల్సెల్ ఎనీమియాతో బాధపడు తున్న వారికి నిరంతరం రక్తమార్పిడి అవసరమని అన్నారు. సమాజంలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి, యువతను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయారనే మాటే వినిపించకుండా అందరూ పని చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి, సీహెచ్సీ సూపరిటెండెంట్ ధరణి, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పీకే దాసు, ఎంపీటీసీలు కమల, సుబ్బలక్ష్మి, గణపతి, నబ్బో, ఏవో చంద్రశేఖర్, వైద్యులు రమేష్, శ్యాంప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు,మాజీ సర్పంచులు రమేష్,త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారుల మృతి
● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెదబయలు : కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం చాణక్య ఆరోపించారు. పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ బొడ్డాగొంది గ్రామానికి చెందిన అనుగూరు కోటిబాబు కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, పచ్చకామెర్ల బారిన పడి, అనుగూరు మేరీ (9), ఆమె తమ్ముడు అనుగూరు జీవన్రాజు (7) చికిత్స అందక 12 గంటల వ్యవధిలోనే మృతి చెందడం ఎంతో బాధాకరమని చాణక్య ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అంది ఉంటే చిన్నారులు ప్రాణాలతో ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 19న గోమంగి పీహెచ్సీ సిబ్బంది నిట్టాపుట్టు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి, కోటిబాబు అక్కడికి వెళ్లి తమ పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, గ్రామానికి వచ్చి వైద్యం అందించాలని ప్రాధేయపడ్డారని చాణక్య వివరించారు. అంతేకాదు, వైద్యులను తీసుకురావడానికి ఆటో కూడా ఏర్పాటు చేస్తానని కోరినా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఒకవేళ అప్పుడే స్పందించి ఉంటే చిన్నారుల మృతిని ఆపగలిగేవారని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారుల మృతి విషయం తెలుసుకున్న రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి వెళ్లి, అస్వస్థతతో బాధపడుతున్న ఇతర కుటుంబ సభ్యులను మెరుగైన వైద్యం కోసం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, చిన్నారులను కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, అరకు మండల ఎస్టీ సెల్ నాయకులు పాంగి నాగేశ్వరరావు, బొంగరం, గుల్లేలు మాజీ సర్పంచ్ ఉడ్డు లక్ష్మీపతి, సాగేని నాగరాజు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తెరవాడ వెంకటరావు పాల్గొన్నారు. -
బాకై ్సట్ గుబులు
గూడెం గుండెల్లో..ఏజెన్సీలో గిరిజనుల ఆత్మగౌరవానికి, జీవనాధారానికి ప్రతీకగా ఉన్న బాకై ్సట్ నిక్షేపాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు గిరిజన ఉద్యమాలకు కేంద్ర బిందువైన బాకై ్సట్ తవ్వకాల భూతం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ గిరిజన గూడేలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం రహస్యంగా చేపడుతున్న సర్వేలు, ఆపరేషన్లు ఇప్పుడు గిరిజనులను రోడ్డెక్కేలా చేశాయి. గిరిజనుల అనుమతి లేకుండా, వారి ఆమోదం లేకుండా ఏజెన్సీలో అడుగుపెట్టే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకుని తీరుతామని ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ హెచ్చరిస్తున్నాయి. ● ఏజెన్సీని వణికిస్తున్న బాకై ్సట్ భూతం ● ప్రశాంతంగా ఉన్న మన్యంలో చిచ్చు రగులుస్తున్న కూటమి ప్రభుత్వం ● వెనక్కి తగ్గకుంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్న గిరిజనం పాడేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంటే విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు, ప్రత్యేక జీవన విధానం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రశాంతతకు మారుపేరైన ఈ గిరిజన గూడేలను ఇప్పుడు బాకై ్సట్ తవ్వకాల భూతం భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో విలువైన బాకై ్సట్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ సంపదను కొల్లగొట్టేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా, గిరిజనులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల పోరాటంతో తవ్వకాలను అడ్డుకుంటూ వస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి సీఎం చంద్రబాబు బాకై ్సట్ తవ్వకాల కోసం జీవో నంబరు 97ను జారీ చేయడంతో ఏజెన్సీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చింతపల్లి వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాకై ్సట్ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, 2019లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్రెడ్డి ఆ జీవోను రద్దు చేసి గిరిజనులకు అండగా నిలిచారు. కొత్త ప్రభుత్వం, పాత కుట్రలు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాకై ్సట్ సంపదపై మళ్లీ కన్ను పడింది. ఈ నెల 17న జర్రెల బ్లాక్లోని బాకై ్సట్ కొండపైకి ఆరుగురు సభ్యుల బృందం గుట్టుచప్పుడు కాకుండా వచ్చి, బాకై ్సట్ శాంపిల్స్ సేకరిస్తుండగా గిరిజనులకు పట్టుబడ్డారు. కలెక్టర్ అనుమతి ఉందని వారు చెప్పినా, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు చూపలేకపోయారు. పోలీసులు వారిని సురక్షితంగా తరలించినా, ఇప్పటికీ ఆ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేదు. మళ్లీ మొదలైన నిరసనలు ఈ ఘటనతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. చాపకింద నీరులా బాకై ్సట్ దోపిడీకి కుట్ర జరుగుతోందని మండిపడుతున్న గిరిజనులు, మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నేతృత్వంలో స్థానిక నాయకులు బాకై ్సట్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నిరసన ర్యాలీలు చేపట్టారు. వీరికి తోడు జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఏకమై ఆందోళనలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టడమే కాకుండా మరో మహోద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమ కార్యాచరణ కోసం ఆదివారం పాడేరులో కాఫీ హౌస్లో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. బాకై ్సట్కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ ఆయుధాలు పట్టిన గిరిజనులుకొల్లగొట్టే కుట్రలను ఉపేక్షించం గిరిజనుల జీవితాలతో కూ టమి ప్రభుత్వం ఆటలాడుతోంది. బాకై ్సట్ సమస్య పూర్తిగా సద్దుమణిగిందని భావిస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మళ్లీ గిరిజన సంపదను కొల్లగొట్టేందుకు కుటిల యత్నాలు చేస్తోంది. గ్రామసభల అనుమతులు, పీసా కమిటీల తీర్మానాలు లేకుండా ఏ సర్వే బృందాలు, కంపెనీల ప్రతినిధులు ఏజెన్సీలో అడుగుపెట్టడం చట్టవిరుద్ధం. కానీ, రహస్యంగా జర్రెల కొండల్లోకి ప్రవేశించి బాకై ్సట్ శాంపిల్స్ సేకరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా లేదా అన్నది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇది గిరిజన హక్కులు, చట్టాలపై జరుగుతున్న తీవ్రమైన దాడి. బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. – పి.అప్పలనర్స, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం, పాడేరు గిరిజనుల పక్షానమహోద్యమం ప్రశాంతంగా ఉన్న గిరిజన ప్రాంతంలో మరోసారి బాకై ్సట్ అంశాన్ని తెరపైకి తెచ్చి, కూటమి ప్రభుత్వం గిరిజనుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల మనోభావాలను, స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుని జీవో నంబరు 97ను పూర్తిగా రద్దు చేసి, గిరిజనుల పక్షాన నిలబడ్డాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాకై ్సట్ సంపదను దక్కించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వారి అక్రమ యత్నాలను మేము చూస్తూ ఊరుకోం. గిరిజనులకు అండగా నిలిచే అందరినీ కలుపుకుని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మహోద్యమం చేపడతాం. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుండెల్లో గునపాలుదించుతాం తాము అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. అడవే మాము జీవనాధారం. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ బాకై ్సట్ సర్వే కోసం గుట్టుచప్పుడు కాకుండా బృందాలు వచ్చి మా ప్రాంతంలో అలజడి సృష్టించాయి. బాకై ్సట్కు వ్యతిరేకంగా గతంలో ఎన్నో పోరాటాలు చేశాం. మళ్లీ బాకై ్సట్ జోలికి ఎవరు వచ్చినా వారి గుండెల్లో గునపాలు దించుతాం. మా సంపద మేము కాపాడుకుంటాం. – సూకూరు చిన్నయ్య, గునుకురాయి, గూడెంకొత్తవీధి మండలం -
యోగా సాధనతో ఆరోగ్యం: జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర
ముంచంగిపుట్టు : ప్రతి రోజు యోగా సాధనతో మానసిక ప్రశాంతతతోపాటు ఆరోగ్యం సాధ్యమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. ఆదివారం స్థానిక హోళీ క్రీడా మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఆమెతో పాటు నేతలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ యోగాతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, రక్త ప్రసరణ పెంచుతుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని, కండరాలను బలోపేతం చేస్తుందన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సైతం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, ఎస్ఐ నాని, సీఆర్పీఎఫ్ కంపెనీ కమాండ్ ఇన్స్పెక్టర్ పీకే దాసు, ఎంఈవో–2 త్రినాథరావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ జగబంధు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, నబ్బో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా యోగా దినోత్సవం సాక్షి,పాడేరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయలోని రవ్వలగుడ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమాలను కలెక్టర్ టి.నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జేసీ, ఐటీడీఏ పీవోలు విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి సుమారు రెండు గంటల పాటు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, యోగాంధ్ర కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన జేసీ, ఐటీడీఏ పీవోతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ నిశాంతి అభినందించి, వారికి జ్ఞాపికలను అందజేశారు.ముంచంగిపుట్టులో యోగా చేస్తున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,విద్యార్థులు, అధికారులు, నేతలు యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ -
తీరానికి కాలుష్య గండం
నీలి సముద్రపు అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో దక్షిణ తీర ప్రాంత పర్యావరణం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జాతీయ దూరస్పందన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. –సాక్షి, విశాఖపట్నం ‘మురుగు’తోనే ముప్పు ఎక్కువ తీర ప్రాంత సముద్ర కాలుష్యానికి నగరంలోని మురుగునీటి కాలువలు, డ్రైన్లే ప్రధాన కారణంగా మారాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కాలుష్యంలో సుమారు 41.6 శాతం వాటా మురుగునీటి ప్రవాహాలదేనని పరిశోధకులు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలోని అనేక కాలువలు, గెడ్డల ద్వారా ప్రతిరోజూ భారీగా మురుగునీరు సముద్రంలోకి చేరుతోంది. నిబంధనల ప్రకారం ఈ నీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. నగర పరిధి, పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాలు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఏర్పడుతున్న ‘ఉష్ణ ద్వీప’ పరిస్థితులు పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా రూపొందించిన సముద్ర కాలుష్య సూచిక ప్రకారం గంగవరం పోర్టు, విశాఖ హార్బర్ నుంచి గాజువాక, పెదగంట్యాడ వరకు ఉన్న దక్షిణ తీర ప్రాంతం తీవ్ర కాలుష్య ప్రభావంతో ప్రమాదకర మండలంగా మారుతున్నట్లు తేలింది. మేఘాద్రిగెడ్డ డ్రెయిన్ అవుట్లెట్, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ పరిసరాల్లో కాలుష్యం అధికంగా నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది. సముద్ర జలాల నాణ్యత క్షీణించడంతో పాటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రపు నీటిలో పెరిగిన క్లోరోఫిల్–ఏ కాలుష్య కాసారాలుగా మారిన ఈ ప్రాంతాల్లోని సముద్రపు నీటిలో క్లోరోఫిల్–ఏ సాంద్రత, లవణీయత, నీటి కాలుష్య సాంద్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లోరోఫిల్–ఏ సాంద్రత పెరిగిపోతే.. సముద్రంలో నాచు దట్టంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఆల్గల్ బ్లూమ్ అని పిలుస్తారు. దీనివల్ల నాచు కుళ్లిపోయి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి చేపలు, ఇతర సముద్ర జీవులు ఊపిరాడక మృత్యువాత పడతాయి. ఇలాంటి ప్రాంతాల్ని డెడ్జోన్లుగా పిలుస్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కష్టమే కాలుష్య ప్రాంతాలుగా మారుతున్న తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి. జీవీఎంసీ, ఏపీపీసీబీ అధికారులు హాట్స్పాట్లను గుర్తించి తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా కట్టడి చేయకపోతే.. భవిష్యత్తులో మరింత ప్రమాదం ముంచుకొస్తుందని పరిశోధన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకరంగా మారిన నీటి నాణ్యత సూచీలు మేఘాద్రిగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతంతో పాటు.. మల్కాపురం, గాజువాక సమీప తీర ప్రాంతాల్లో క్లోరోఫిల్–ఏ స్థాయి అత్యధికంగా 14.8 ఎంజీ/మీటర్ క్యూబ్గా నమోదైంది. అదేవిధంగా.. నీటి కాలుష్య సాంద్రత రేటు 0.017 నుంచి 25.3 ఎన్టీయూ వరకు ఉండగా, కాలుష్య హాట్స్పాట్స్లో ఇది 20 ఎన్టీఏ కంటే ఎక్కువగా రికార్డు కావడం ఆందోళన కలగించే అంశం. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ తీరాల్లో కాలుష్య తీవ్రత ‘మధ్యస్థంగా’ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. నగరానికి ఉత్తరాన ఉన్న భీమిలి తీరం మాత్రం చాలా తక్కువ కాలుష్యంతో ప్రశాంతంగా ఉంది. కానీ గోస్తనీ నది సముద్రంలో కలిసే చోట వ్యవసాయ వ్యర్థాలు, పూడిక కారణంగా కొంత మేర కాలుష్య ప్రభావం కనిపిస్తోందని పరిశోధనలు స్పష్టం చేశాయి. సముద్ర కాలుష్యానికి ప్రధాన కారణాలు పెద్ద డ్రైన్లు, గెడ్డలు – 41.6 శాతం పరిశ్రమలు, పోర్టులు – 23.7 శాతం అంతర్గత కాలువలు – 33.2 శాతం ఇతర కారణాలు – 1.5 శాతం సముద్ర తీరం వెంబడి 15 కిమీ మేర శాటిలైట్ ద్వారా సేకరించిన వివరాలివీ.. -
పూర్వ విద్యార్థుల సామూహిక షష్టిపూర్తి వేడుక
సామూహిక షష్టిపూర్తిలో పూర్వ విద్యార్థులు మాకవరపాలెం: పూర్వ విద్యార్థుల సామూహిక షష్టి వేడుక ఎంతో సందడిగా జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాలలో చదివిన 1980–81 టెన్త్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక శ్రీకన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ఒకే వేదికపై కలుసుకుని 45 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులకు 60 ఏళ్లు పూర్తి కావడంతో సామూహిక షష్టి పూర్తి కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 60 మందికిపైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
బాకై ్సట్ను దోచుకునేందుకు రహస్యంగా సర్వే
● నోరు మెదపని కూటమి ప్రభుత్వం ● మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శ పాడేరు: దట్టమైన అటవీ ప్రాంతంలోని అపారమైన బాకై ్సట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు రహస్యంగా సర్వేలు జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? బాకై ్సట్ తవ్వకాల విషయంలో మీ వైఖరేమిటో వెంటనే స్పష్టం చేయాలి.. అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గూడెంకొత్తవీధి మండలం జర్రెల బాకై ్సట్ కొండపై ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తూ గిరిజనులకు దొరికిపోవడంతో అసలు విషయం బయటపడిందని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే గిరిజన సంపదను దోచుకుంటారని మేము ముందే హెచ్చరించాం, ఇప్పుడు అదే జరుగుతోంది.. అని ఆమె ఆరోపించారు. ఐదో షెడ్యూల్డ్ ఏరియాలోని ప్రత్యేక అధికారాలను, చట్టాలను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని, స్థానిక అధికారులు దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా జీవో నంబర్ 97ను పూర్తిగా రద్దు చేశామని, దీంతో ఏజెన్సీలో ఇక బాకై ్సట్ తవ్వకాల ఊసే ఉండదని గిరిజనులు ప్రశాంతంగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న రహస్య సర్వేలతో మళ్లీ గిరిజనుల్లో ఆందోళన మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంపదను, భూములను కాపాడుకునేందుకు స్థానిక గిరిజనులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే, కూటమి నేతలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గిరిజన సంపదను అడ్డదారిలో దోచుకునే హక్కు ఏ సంస్థకు, ప్రభుత్వానికి లేదన్నారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
రోలుగుంటలో అగ్నిప్రమాదం
ప్రమాద స్థలంలో కాలి బూడిదైన దుస్తులు, గృహ సామగ్రి రోలుగుంట: స్థానిక యాతవీధిలో బొందల సుబ్బలక్ష్మి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుస్తులు, గృహ సామగ్రి, ఖాతాదారులకు కుట్టాల్సిన కొత్త దుస్తులు కాలి బూడిదయ్యాయి. సుబ్బలక్ష్మి దర్జీ వృత్తి చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటోంది. శనివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి పొరుగింటికి పని మీద వెళ్లింది. ఇంతలో ఇంట్లో నుంచి మంటలతోపాటు పొగ రావడంతో వెంటనే వచ్చి తలుపులు తీయగా, దుస్తులు, ఫర్నిచర్, తదితర గృహ సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వీఆర్వో ఎస్.కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ప్రభుత్వ పరిహారం కోసం నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని వీఆర్వో తెలిపారు. -
మాడగడ వ్యూపాయింట్రహదారికి మోక్షం
● రూ.15 కోట్లతో రోడ్డు పనులు పూర్తి అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): :ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్కు వెళ్లే రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యాటకులు, స్థానికుల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బోసుబెడ్డ నుంచి మాడగడ మీదుగా పక్కనగుడ జంక్షన్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర తారురోడ్డు, డ్రైనేజీ, కల్వర్టులు, సైడ్ వాల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. అటవీశాఖ ఆంక్షల కారణంగా ఈ పనులు కొంతకాలం జాప్యానికి గురయ్యాయి. దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రహదారిలో ఇంకా కొంత భాగంలో పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తే పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉంటుందని స్థానిక గ్రామస్తులు, పర్యాటకులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి చెందింది. సీఐ అల్లు స్వామినాయుడు ఆదివారం అందించిన వివరాల ప్రకారం..మునగపాక మండలం కుమార పురం గ్రామానికి చెందిన అగ్గాల కుమారి (20) ఆటోలో అనకాపల్లికి శనివారం వెళుతుండగా మార్గ మధ్యంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆటో స్టీరింగ్ లాక్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కుమారి త్రీవంగా గాయపడింది. ఆమెను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతురాలి చెల్లి గ్రేస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ చెప్పారు. మృతురాలు కుమారి స్టాఫ్ నర్స్గా శిక్షణ పొందుతోందని, ఆమె తల్లిదండ్రులు అగ్గాల లక్ష్మి,సూరిబాబు, సోదరి ఉన్నారని సీఐ తెలిపారు. -
మారెమ్మ తల్లికి కంచు గంట బహూకరణ
● అందజేసిన జెడ్పీ హైస్కూల్పూర్వ విద్యార్థులు సీలేరు: స్థానిక గ్రామ దేవత శ్రీ మారెమ్మ అమ్మవారికి 1992–93 బ్యాచ్కు చెందిన జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు కంచు గంటను బహూకరించారు. ఇటీవల అమ్మవారి జాతరకు వచ్చిన పూర్వ విద్యార్థులు, తమ వంతు సేవగా ఆలయానికి 20 కేజీల బరువున్న కంచు గంటను సమర్పిస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఆ గంటను ఆలయానికి తీసుకువచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వ విద్యార్థుల్లో ఒకరైన రామకృష్ణ దంపతులు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి, అనంతరం గంటను ఆలయ అర్చకులు దామోదర శర్మ, కమిటీ సభ్యులు కార్య శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి చిన్నారి బలి!
మధురవాడ: అధికారుల నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మధురవాడ సమీపంలోని సాయిరాం కాలనీ జీసీసీ లేఅవుట్లో విద్యుత్ షాక్తో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి ఉపాధి కోసం విశాఖకు వచ్చిన కురిటి నారాయణరావు, చిన్నమ్మలు దంపతులు సాయిరాం కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొడుకు కురిటి అఖిల్(6) స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బంతి కోసం వెళ్లి... అనంత లోకాలకు! ఆదివారం ఉదయం అఖిల్ తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బంతి ప్రమాదవశాత్తు ‘శ్రీ రేణుక అపార్ట్మెంట్’ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ పైపుల వద్దకు వెళ్లింది. బంతిని తెచ్చేందుకు అఖిల్ అక్కడికి వెళ్లగా, తెగిపోయి బయటకు ఉన్న వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. యూజీడీ పనులే కారణం? సదరు ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ పనుల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పనుల క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ తెగిపోయి బయటకు వచ్చేసిందని, దానివల్లే విద్యుదాఘాతం సంభవించిందని ఆరోపిస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్ఈ శ్యామ్బాబు, ఈఈ సింహాచలం నాయుడు, డీఈ కిరణ్కుమార్ తదితరులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. యూజీడీ కేబుల్ పనుల వల్లే ఎర్త్ వైర్ కట్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యుత్ శాఖ, శ్రీ రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి కురిటి అఖిల్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం రాత్రి బాధితులతో కలిసి సాయిరాం కాలనీలోని రేణుక అపార్ట్మెంట్ వద్ద ధర్నా చేశారు. -
పిడుగు పాటుకు పాడి ఆవు మృతి
మృతి చెందిన పాడి ఆవు మునగపాక:మండలంలోని మడకపాలెంలో శనివారం రాత్రి పిడుగుపడి ఓ పాడి ఆవు మృతి చెందింది. మడకపాలెంలో పశువులను మేపుకుంటూ రైతు రాయి కుమార్ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగానే పశువులకు గడ్డి వేసి ఇంటికి చేరుకున్నాడు.రాత్రి కురిసిన వర్షంతో పాటు ఉరుములు,మెరువులతో కూడిన పిడుగులు పడ్డాయి. ఈ సంఘఽటనలో కుమార్కు చెందిన ఆవు మృతి చెందింది. ఆవు ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.తనకు న్యాయం జరిగేలా చూడాలని కుమార్ కోరాడు. -
లారీని ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అబ్దుల్ గఫార్ (17) అనే ఇంటర్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్ ఎస్ఆర్ఎంటీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్ కుమారుడు గఫార్ స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సమీపంలోని పెట్రోల్ బంక్లో బైక్కు పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా.. ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయం వద్దకు రాగానే ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై గఫార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
అచ్యుతాపురం ఏఈ శ్రీనివాసరావు అచ్యుతాపురం రూరల్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అచ్యుతాపురం ఏఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయమై ఆదివారం ఆయన అవగాహన కల్పించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడి రోడ్లపై, నీటిలో పడే ప్రమాదముందని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు ఆనుకున్న చెట్లు, ఇతర వస్తువులను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో తడి చేతులతో విద్యుత్ స్విచ్లు, పరికరాలను ఉపయోగించకూడదు. పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. ఎటువంటి విద్యుత్ ప్రమాదం, లోపం గమనించినా వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబరుకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన’ను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి పైకప్పులపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. అర్హులైన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీ అందిస్తుంది. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకున్నాక ఉత్పత్తి అయ్యే విద్యుత్ను స్వీయ అవసరాలకు వినియోగించుకోవాలి. అదనపు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిందని, ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందవచ్చునని ఏఈ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడి మృతి
మాడుగుల రూరల్: మండలంలోని ఘాట్రోడ్డు జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సురవరం గ్రామానికి చెందిన వసంత కుమారస్వామి(40) ఘాట్రోడ్డు సమీపంలో సాగరం వైపు నడిచి వస్తుండగా, చోడవరం నుంచి పాడేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని 108 వాహనంలో మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
యువకుడిపై కత్తితో దాడి
ఆరిలోవ: జీవీఎంసీ13వ వార్డు పరిధి గిరిజన గ్రామం శ్రీకృష్ణాపురంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో గాయపడిన యువకుడు విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆరిలోవ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇరువురు యువకులు టీడీపీకి చెందినవారు కావడంతో తూర్పు ఎమ్మెల్యే రంగంలోకి దిగి కేసు లేకుండా చూడాలని ఆరిలోవ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గాయపడిన యువకుడు మారిక శివకుమార్ తండ్రి జక్కన్న తెలిపిన వివరాలు ప్రకారం.. దగ్గర బంధువైన బత్తిన అప్పలరాజు ఆస్తి వ్యవహారంలో తన కుమారుడితో తరుచూ గొడవకు దిగుతున్నాడన్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే వ్యవహారంలో తన కుమారుడిపై దాడి చేయగా..స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కుమారుడు శివకుమార్పై అప్పలరాజు కత్తితో దాడి చేశాడని, అప్పలరాజు వల్ల నా కుమారుడు, మా కుటుంబానికి ప్రాణ హాని ఉందని జక్కన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్ని రాజకీయం చేకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబీకులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు కేసు లేకుండా పోలీసులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. -
వీసీబీ డివిడెండ్ 10 శాతం
చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ● ఘనంగా వీసీబీ మహాజన సభ మాట్లాడుతున్న బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణబీచ్రోడ్డు: ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీ) ఈ ఏడాది 10 శాతం డివిడెండ్ను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు బ్యాంక్ చైర్మన్ జె.వి.సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆదివారం సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో వీసీబీ మహాజన సభ ఘనంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలనా, ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలిపారు. బ్యాంకు లాభాల్లో డివిడెండ్ మొత్తం రూ.39.24 కోట్లుగా ఉందని, మిగిలిన లాభాలను చట్టపరమైన నిష్పత్తుల్లో ఆయా ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు రూ.66.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని వెల్లడించారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖ నగరం, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభించి, బ్రాంచ్ల సంఖ్యను 68కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, సి.కృష్ణ మోహన్, ఉప్పలపాటి పార్వతీదేవి, చలసాని రాఘవేంద్ర రావు, ఎస్.నాగభూషణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సమృద్ధిపై అవగాహన కల్పించాలి
పాయకరావుపేట : స్ధానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు శనివారం పతంజలి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, పతంజలి విశ్వ విద్యాలయ ఉపకులపతి డా.ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో వ్యర్థాల నుంచి పర్యావరణ రక్షణ చేస్తూ పునర్వినియోగం చేసే విధానంపై విద్యా సంస్థల యాజమాన్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సౌథంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం, ఆయుర్వేద చికిత్సాలయ జౌషధ వనం, నూతనంగా నిర్మించిన పరిపాలనా విభాగ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా శక్తిని, యోగా ద్వారా ఐక్యతను చాటి చెప్పాలని కోరుకుంటున్నామన్నారు. విద్యార్థి దశలోనే స్వయం సమృద్ధి, సంపాదన గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యమన్నారు. విదేశాల్లో ఎంత ధనవంతుడైనా వారి పిల్లలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత స్వయం సమృద్ధి సాధిస్తారని, కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదన్నారు. ఏ పిల్లలైతే ఎక్కువగా సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారో వారు ఎప్పటికీ ఒత్తిడికి గురి కారని తెలిపారు. మున్ముందు పతంజలి స్కూల్లో కూడా శ్రీ ప్రకాష్ విద్యా సంస్ధల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్ట్ మోడల్ను అమలు చేద్దామనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఆచార్య బాలకృష్ణను నరసింహరావు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్. అధ్యక్షులు కంటిపూడి నరేంద్రబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మీకోసంలో 91 అర్జీల స్వీకరణ
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 91 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, రెవెన్యూ, విద్య, ఆర్డబ్ల్యూఎస్, సివిల్ సప్లయ్, విద్యుత్, శిశు సంక్షేమం, ఇరిగేషన్, రవాణా, సమగ్ర శిక్ష, హౌసింగ్, రోడ్లు–భవనాల శాఖ, పర్యాటక శాఖలకు సంబంధించి అత్యధికంగా వినతులు అందాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. చిన్నలబుడు పంచాయతీ మాలివలసలో జలధార–జలహారతి పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో సాగునీటి పనులను చేపడుతున్నామని, దీనివల్ల గిరిజన కూలీలకు ఉపాధి లభించడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని ఆమె వివరించారు. సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగుడలో రూ. 31.91 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన మండల పరిషత్ పాఠశాల భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దివీస్ ఫార్మా సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ, ఇటువంటి సేవలు మరిన్ని గిరిజన గ్రామాలకు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్య పడాల్, ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ రాజా శ్రీధర్, ఎంఈవో భారతీరత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా?
చోడవరం : కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే గొంతునొక్కి అక్రమ అరెస్టులు చేయడమే పనిగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్సీపీ యువజన విభాగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ చోడవరం కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, తాజా మాజీ కార్పొరేటర్, యూత్ విభాగం ప్రతినిధి జాజుల రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక వారిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధంలేని తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానుమూరి సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యువజన విభాగం ఖండిస్తుందని, ఇటువంటి అక్రమ అరెస్టులకు తాము భయపడేదిలేదన్నారు. 2014–19మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు విచ్ఛలవిడిగా నిర్వహించడం వల్ల అనేక నేరాలు జరిగాయన్నారు. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం అమ్మకాలపై అనే కఠిన నిబంధనలు విధించి షాపుల సంఖ్యలో 40 శాతానికి తగ్గించి, బెల్టు షాపులు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారన్నారు. దీనివల్ల గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నేరాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిందన్నారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు ఇచ్చి, ఎక్కడికక్కడ షాపులు పెట్టి, అక్రమంగా బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లు నిర్వహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్ల ఎక్కడపడితే అక్కడ మద్యం బాబులు రోడ్లపై గొడవలు చేస్తుండడంతో మహిళలు, స్కూల్ పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురికావలసి వస్తుందన్నారు. మద్యం బాటిళ్లపై కూడా ధరలు పెంచి అక్రమ వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నారన్నారు. వాటిని అరికట్టలేని చంద్రబాబు ప్రభుత్వం అలాంటి అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తుందన్నారు. విద్య, వైద్యం, సూపర్సిక్స్ పథకాలు సకాలంలో సక్రమంగా ప్రజలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, అంతేకాని ఇలా అక్రమ అరెస్టులు, కేసులు పెట్టి ప్రశ్నించే గొతులు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రతిఘటించి రోడ్లపైకి వచ్చి ప్రజల తరపున ఆందోళనలు చేయాల్సి వుంటుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గొంది సిద్దు, కార్యదర్శి బొండా చిన్నారావు, ఉపాధ్యక్షుడు రుద్రనాయుడు, సభ్యులు పెచ్చేటి మణిరాజు, నియోజవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, ఉపాధ్యక్షుడు సంతోష్, సకలా సూరిబాబు పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45), చేపల వేటకు వెళ్లి మత్స్యగెడ్డలో గల్లంతై మృతి చెందాడు. శుక్రవారం గల్లంతైన అద్దు కోసం ఎస్ఐ నాని, ఎంపీటీసీ కమల, మాజీ సర్పంచ్ నీలకంఠం ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తులు నాటు పడవలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు మృతదేహం లభ్యం కావడంతో, దానిని ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అద్దు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విద్యుత్ సామగ్రి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
నిందితులతో ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం: విద్యుత్ వైర్ల కాయిల్స్ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. నర్సీపట్నం, తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వి.బి.ఆగ్రహారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 30 కిలోల విద్యుత్ కాయిల్స్ పట్టుబడినట్టు చెప్పారు. వీటిని ఎక్కడో దొంగిలించి తునిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తెలిందన్నారు. ఇలాంటి విద్యుత్ సామగ్రి కొనుగోలు, విక్రయాలు చట్టరీత్యా నేరమన్నారు. -
యో
‘కారుమూరి’ అరెస్టు అప్రజాస్వామికంకలెక్టర్ నిశాంతిఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026గానేడు యోగాంధ్ర ముగింపు ● జేసీ తిరుమణి శ్రీపూజ అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): స్థానిక (రవ్వలగుడ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర ముగింపు కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ శనివారం ఒక ప్రకటనలో కోరారు. కలెక్టర్ నిషాంతి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు ఉదయం 7.30 గంటలకు మైదానంలో అందుబాటులో ఉండాలని జేసీ సూచించారు.గిముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ప్రకృతి రమణీయతకు నిలయం డుడుమ జలపాతం. ఆ జలపాతం హోరు, కొండల గాలి, పచ్చని ప్రకృతి మధ్య ఒక అద్భుతం నిత్యం కనిపిస్తుంది. వంద ఏళ్లు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో, ఎంతో చురుకుగా యోగాసనాలు వేస్తూ పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు ప్రధాన కాశీ విశ్వనాథం. ఎవరీ యోగా వృద్ధుడు? మండలంలోని వనుగుమ్మ పంచాయతీ, సంగడ గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం నిత్య యోగా సాధకుడు. సాధారణంగా వృద్ధాప్యంలో నడవడానికి ఇబ్బంది పడే వయసులో, ఆయన గత 45 ఏళ్లుగా డుడుమ జలపాత పరిసరాల్లోనే ఉంటూ యోగా సాధన చేస్తున్నారు. 104 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆరోగ్యం, చురుకుదనం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రకృతి ప్రసాదించిన ఆహారమే ప్రాణం ఆయన జీవనశైలి చాలా భిన్నమైనది. అడవిలో దొరికే దుంపలు, పండ్లు తింటూ, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ఎటువంటి కాలుష్యం లేని ఆహారం, నిరంతర యోగా సాధనే తన సుదీర్ఘ ఆరోగ్యకర జీవనానికి రహస్యమని ఆయన చెబుతారు. పర్యాటకులకు ఆకర్షణగా..: డుడుమ సందర్శనకు వచ్చే పర్యాటకులు విశ్వనాథం చేస్తున్న యోగాసనాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి, యోగా విశేషాలు తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఒక వృద్ధుడు అంతటి క్రమశిక్షణతో యోగా చేయడం వారిలో ఎంతో స్ఫూర్తిని నింపుతోంది.చింతపల్లి జీసీసీ డివిజనల్ మేనేజర్ బదిలీ చింతపల్లి : స్థానిక జీసీసీ డివిజనల్ మేనేజర్ డి. సింహాచలంకు చింతూరు బదిలీ అయ్యింది. ఈయన చింతపల్లి డీఎంగా ఆరు నెలలుగా క్రితం విధుల్లో చేరారు. ఈయన స్థానంలో కొయ్యూరు జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సరమండ విజయ్కుమార్ను పదోన్నతి కల్పిస్తూ నియమించారు.వైఎస్సార్సీపీ యువవజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య -
బదిలీపై వెళ్తున్న ఏడీఆర్కు సన్మానం
చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆళ్ల అప్పలస్వామికి స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెరకు ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ విధుల్లో ఉన్నా బాధ్యతాయుతంగా పనిచేయడం తన వృత్తి ధర్మమని, చింతపల్లిలో పనిచేసిన అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్నప్పటికీ, ఈ సంస్థకు తన సేవలు ఎప్పుడూ అందుతాయని హామీ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఆయన నేతృత్వంలో జరిగిన పరిశోధనలు, సంస్థ అభివృద్ధికి చేసిన కృషిని సహచర శాస్త్రవేత్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, సందీప్ నాయక్, వెంకటేష్, ఏరువాక విస్తరణ శాస్త్రవేత్త ప్రదీప్కుమార్, గూడెంకొత్తవీధి ఏవో గిరిబాబు, టీచర్ అసోసియేట్ బాపూజీ, సిబ్బంది, సేంద్రియ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతోగిరిజనుడికి అస్వస్థత
సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇప్పటికీ డోలిమోతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆపద సమయంలో వాహనాలు వచ్చే అవకాశం లేక, రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనంతగిరి మండలం, గుమ్మ పంచాయతీలోని మారుమూల గ్రామం కర్రిగుడకు చెందిన బడ్నాయిని కుమార్ (48), శనివారం మధ్యాహ్నం పశువులు కాస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో, గ్రామస్తులు ఆయనను డోలీలో మోస్తూ సుమారు 5 కిలోమీటర్ల దూరం కాలినడకన నిమ్మఊట గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో ఆయన ప్రాణాపాయం తప్పింది. తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితి ఏర్పడుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఆరోగ్య జీవనానికి రాజ్ యోగం
యోగాసనాలు చేస్తున్న రాజు తుమ్మపాల : ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని చెబుతూ అనకాపల్లి ఉడ్పేటకు చెందిన ప్రముఖ యోగా గురువు బి.గోవిందరాజు యోగా చైతన్యాన్ని విస్తరిస్తున్నారు. గతంలో చైనాలో యోగా శిక్షకుడిగా సేవలందించిన ఆయన, విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ స్వస్థలంపై ఉన్న ప్రేమతో తిరిగి వచ్చి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉడ్పేటలో ‘రాజ్ యోగా’ కేంద్రాన్ని స్థాపించారు. యువత ఒత్తిడిని జయించేలా.. యువతలో మొబైల్ ఫోన్, కంప్యూటర్ వినియోగం కారణంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని గోవిందరాజు తెలిపారు. వృద్ధులకు శారీరక చురుకుదనం, మహిళలకు ఆరోగ్య పరిరక్షణ, విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్యకర జీవనంపై అవగాహన రాజ్ యోగా కేంద్రంలో యోగా ఆసనాలతో పాటు ప్రాణాయామం, ధ్యానం, ఒత్తిడి నియంత్రణ పద్ధతులు, ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన శిక్షణతో అనేక మంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక శిబిరానికి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మందికి యోగా ప్రయోజనాలు చేరవేయాలని గోవిందరాజు లక్ష్యంగా పెట్టుకున్నారు. గోవిందరాజు పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమందికి యోగాసనాలపై శిక్షణ ఇచ్చి గురువులను తయారు చేశారు. అనకాపల్లిలో పదేళ్ల క్రితం మొదలుపెట్టిన యోగా కేంద్రం కొనసాగిస్తూ చైనాలో యోగాగురువుగా అవకాశం రావడంతో మూడేళ్ల పాటు అక్కడ యువతకు వివిధ యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాతృభూమిపై అభిమానంతో దేశానికి తిరిగివచ్చి యోగాసనాల ద్వారా స్థానికులకు అవగాహన చేసి ఆరోగ్యవంతుల్ని చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే జాతీయ అంతరాతీయ పోటీలలో పాల్గొనేలా యువతకు శిక్షణ ఇస్తున్నారు. యోగాతో ఆరోగ్య బాట నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ దోహదం చేస్తుంది. ప్రతి ఇంటిలో యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం’’ అనే సందేశంతో ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. – బి.గోవిందరాజు, యోగా గురువు, వ్యవస్థాపకుడు–రాజ్ యోగా కేంద్రంఅనకాపల్లి (ఉడ్పేట) రాజ్ యోగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువత -
దళితుల హక్కుల పరిరక్షణకు కమిషన్ కట్టుబడి ఉంది
అచ్యుతాపురం రూరల్ : దళితుల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఎస్సీ సెల్ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. శనివారం మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు తట్టా రాజు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయంలో దళితుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూ వివాదాలు, అసైన్డ్ భూములు, జిరాయితీ భూములకు సంబంధించిన సమస్యలను వివరించారు. ముఖ్యంగా దళిత రైతుల భూములు పెత్తందారుల ఆధీనంలో ఉన్నాయని ఫిర్యాదు చేయగా, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సీతారాం అన్నారు. ఈ అంశాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్ఈజెడ్ జోనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన, ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను వినియోగించి వీధులు, ఇతర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. మార్టూరు గ్రామంలో పరిశ్రమల కారణంగా భూములు కోల్పోయిన దళిత రైతులు, నిరుద్యోగులకు ఏటీసీ టైర్స్ యోకోహమా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యానికి సూచిస్తామన్నారు. కార్యక్రమంలో అచ్యుతాపురం తహసీల్దార్ డి.శ్రీను, సీఐ చంద్రశేఖర్ రావు, దళిత నాయకులు తట్టా పెంటయ్యనాయుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి అప్పారావు, మండల కార్యదర్శి మైలపల్లి రాహుల్, కోశాధికారి ఈరిగల సంతోష్ కుమార్, తట్టా ధనలక్ష్మి, ఊషా నాగరాజు, డీవీఎమ్సీ సభ్యుడు ఎండీ రాజు, సహదేవుడు, బోణి గణేష్ పాల్గొన్నారు. ఎంపీడీవో గైర్హాజరుపై మండల సభ్యుల ధ్వజం -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బ్రాండిక్స్ బస్సు
● 15 మందికి స్వల్ప గాయాలుప్రమాదానికి గురైన బస్సులు అచ్యుతాపురం రూరం: బ్రాండిక్స్కు ఉద్యోగులను తరలించే బస్సు రాంగ్రూట్లో ప్రయాణించి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 15మంది స్వల్ప గాయాలైనట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చీమలాపల్లి సమీపంలో బ్రాండిక్స్ పరిశ్రమకు చెందిన బస్సు గాజువాక వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 15 మంది స్వల్పగాయాలైనట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
ఇద్దరు విద్యార్థినులకు సెంట్రల్ వర్సిటీల్లో సీట్లు
మాడుగుల రూరల్ : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు వివిధ సెంట్రల్ యూనివర్శిటీల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధించారని, కళాశాల ప్రిన్సిపాల్ పి.జయ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల బీఎస్పీ విద్యార్థిని పి.మల్లేశ్వరి సెంట్రల్ యూనివర్సీటీ ఆఫ్ తమిళనాడులో ఎంఏ ఇంగ్లిష్లో సీటును సాధించగా, కళాశాలకు చెందిన మరో బీఏ విద్యార్థిని, సి.హెచ్. ఏసుకుమారి, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళలో ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్సు అండ్ పోలిటికల్ సైన్సు విభాగంలో సీటు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా అధ్యాపకుల నిరంతర శిక్షణ పర్యవేక్షణతో ఈ విజయాన్ని సాధించగలరన్నారు. ఈ విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ నిషాంతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండలంలోని మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్లో శనివారం ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధి కూలీలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సూచించారు. యోగా శిబిరానికి భారీగా జనాన్ని తరలించిన అధికారులు, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఉదయం 5.30 గంటలకే విద్యార్థులను తీసుకువచ్చిన నిర్వాహకులు, యోగా ముగిసే వరకు వారికి అల్పాహారం అందించలేదు. ఆకలితో అలమటించిన విద్యార్థులకు కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ అధికారులు అందరిలా యోగాసనాలు వేయకుండా, నిలబడిన చోటే వింతగా యోగా చేసి ఆశ్చర్యపరిచారు. ఇతరులు యోగాసనాలు వేస్తుంటే, వీరు మాత్రం కార్యక్రమం ఆద్యంతం నిలబడే ఉండిపోవడం అక్కడున్న వారిలో చర్చకు దారితీసింది. ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యం: పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. -
ఉద్యోగాలు ఇస్తామని మోసం
● గిరిజన యువత ఆవేదన సీలేరు: ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని భవ్య ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని గిరిజన నిరుద్యోగ యువకులు ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న వాచ్మెన్ ఉద్యోగం కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరొకరిని నియమించారని వారు ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దరఖాస్తుదారులందరికీ పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
అనకాపల్లి: స్థానిక శారద బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి(70) మృతదేహం లభించినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి శనివారం తెలిపారు. నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు. మృతదేహం వద్ద గల బ్యాగ్మీద తమిళ అక్షరాలు ఉన్నాయని, బ్యాగ్లో పరిశీలించగా ఐదు కిలోల సన్నబియ్యం, ఎస్.ఎ.బాలమ్, అరంగనూర్, పాండిచ్చేరి అనే వివరాలు కనిపించాయని ఎస్ఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలన్నారు. -
కారు చీకట్లో మృతదేహంతో 5 కి.మీ
సీలేరు : ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల దయనీయ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ, మారుమూల గ్రామాల ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో బాధపడేవారిని, గర్భిణులు, మృతదేహాలను సైతం డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గూడెంకొత్తవీధి మండలం దేవరకొండ పంచాయతీకి చెందిన మురళి ఎరయ్య చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు. అయితే అదే రోజు కురిసిన భారీ వర్షాలకు చాపగెడ్డ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై వరదనీరు ప్రవహించింది. రాత్రి 8 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచిచూసినా వరద ప్రవాహం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు గత్యంతరం లేక మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించారు. అర్ధరాత్రి సమయంలో సెల్ఫోన్ వెలుతురులో మృతదేహానికి డోలీ కట్టి, ప్రమాదకరమైన వాగును దాటించి, అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, రవాణా సదుపాయాల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యావలంటీర్ను నియమిస్తాం
ఎంఈవో ిసింహాచలంకొయ్యూరు: మండలంలోని కొండపై ఉన్న మూలపేట పంచాయతీ జాజులబంద ప్రాథమిక పాఠశాలను ఎంఈవో పి.సింహాచలం శనివారం సందర్శించారు. రహదారి లేని కారణంగా కొంత దూరం కాలినడకన పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల తల్లిదండ్రులు కలెక్టర్కు విన్నవించడంతో, ఎంఈవో స్వయంగా పాఠశాలను తనిఖీ చేశారు. త్వరలోనే ఉపాధ్యాయుడిని లేదా విద్యా వాలంటీర్ను నియమిస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు పాఠాలు, డ్రిల్ చేయించారు. మండలంలోని ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 35 మంది విద్యా వలంటీర్లను నియమించాలని కోరుతూ డీఈవోకు నివేదించామని ఎంఈవో తెలిపారు. జాజులబంధ పాఠశాల విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. -
బూదరాళ్ల పాఠశాలలో ఎంఈవో విచారణ
కొయ్యూరు: బూదరాళ్ల మండల పరిషత్ పాఠశాలలో బోధన సరిగా జరగడం లేదని వస్తున్న ఆరోపణలపై ఎంఈవో పి. సింహాచలం శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గణేష్ బోధన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొద్ది రోజుల క్రితం స్థానికులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పాఠశాలను మూసివేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదు మేరకు పాఠశాలను సందర్శించిన ఎంఈవో, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుడు గణేష్ తీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, 40 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆయనను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. కంఠారం ఉపాధ్యాయుడికి డిప్యూటేషన్ చక్కని బోధనా నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయునిగా పేరున్న రేవళ్లు పంచాయతీ, ఆర్. కంఠారం పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణను గ్రామస్తుల అభ్యర్థన మేరకు బూదరాళ్లకు డిప్యూటేషన్పై పంపాలని నిర్ణయించారు. గ్రామస్తుల కోరిక మేరకు, సత్యనారాయణ కూడా డిప్యూటేషన్పై విధులు నిర్వహించేందుకు అంగీకరించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. సోమవారం నుంచి ఆయన బూదరాళ్ల పాఠశాలలో విధులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, బోధన సరిగా చేయడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు గణేష్, అనారోగ్య కారణాల దృష్ట్యా సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం. -
గిరిజన చట్టాల రద్దుకుకుట్ర చేస్తే సహించం
● ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిపాంగి జీవన్ కృష్ణ చింతపల్లి: గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలను రద్దుచేసే కుట్రలకు పాల్పడితే సహించేది లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం స్ధానిక గిరిజన్ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన్యంలో ఉన్నటువంటి గిరిజనులంతా ఏకతాటిపై పార్టీల కతీతంగా గిరిజన చట్టాలను రక్షించుకోవడానికి పోరాటం చేయాలన్నారు. గిరిజన హక్కులు భూములు, రాజ్యాంగ పరిరక్షణకు కోసం రూపొందించిన ఈ చట్టాలను బలహీనపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. పార్టీలు అనుబంధాలను పక్కన పెట్టి గిరిజనలందరూ ఐక్యంగా ఉండాలని, ఆదివాసీ చట్టాలు అమలు, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఏకంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గిరిజన సంఘం కార్యదర్శి సాగిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా గుణపాఠం
చింతపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందునే, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదని ఎంపీపీ అనూషదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య స్పష్టం చేశారు. శుక్రవారం చింతపల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అసెంబ్లీకి హాజరవుతారని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అత్యధిక సీట్లు సాధించిన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉందని వారు గుర్తు చేశారు. ఆ హోదా కల్పించనప్పుడు అసెంబ్లీకి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని వారు పేర్కొన్నారు. తరచూ టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలను వారు తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పలేని గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యేలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానుకోవాలని వారు హితవు పలికారు. అధికారంలోకి వస్తే జీవో నం. 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, నేడు ఆ ఊసెత్తకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు ఎందుకు అప్పగిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.చింతపల్లి ఎంపీపీ అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జిల్లా కలెక్టర్ నిశాంతిపాడేరు: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో భాగంగా అర్జీదారుల నుంచి స్వీకరించే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఆర్డీవో భుజంగరావులతో కలిసి 94 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల హాజరు కాలేని అధికారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్కు గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ (1100) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదులపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్, జిల్లా పరిశ్రమల అధికారి రమణరావు, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ప్రసాద్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలో గిరిజనుడి గల్లంతు
చేపల వేట సమయంలో ఘటన ముంచంగిపుట్టు : మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ బొండ్రు గూడ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో శుక్రవారం సాయంత్రం చేపల వేట చేస్తూ ఒక గిరిజనుడు గల్లంతయ్యాడు.అతని ఆచూకీ కోసం గిరిజనులు గాలింపు చేపట్టారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45) గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలోని బలిఘాట్ ప్రాంతంలో చేపల వేటలో నిమగ్నమయ్యాడు. దీనిలో భాగంగా వలను లాగుతూ ప్రమాదవశాత్తూ కాళ్లు జారి గెడ్డలో పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు హూటహూటిన మత్స్యగెడ్డ వైపు పరుగులు పెట్టి చూసేసారికి అద్దు మునిగిపోయాడు. బొండ్రుగూడ గ్రామ గిరిజనులు నాటుపడవలతో మత్స్యగెడ్డలో విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ నాని, రెవెన్యూ సిబ్బంది, మహిళా పోలీసు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో నాటు పడవలపై మత్స్యగెడ్డలో గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో నిలిపివేశారు. గల్లంతైన అద్దుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఇంటి పెద్దదిక్కు గల్లంతవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. నాటు పడవలపై గాలింపు కష్టంగా ఉన్నందున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి, గాలింపు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
సీలేరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
● సాయంత్రానికి పునరుద్ధరణ సీలేరు: ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాలనీలో సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం సుమారు ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీలేరు గ్రా మానికి జలవిద్యుత్ కేంద్రం వెనుక ఉన్న స్విచ్యార్డులోని 33/11 కేవీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. గురువారం సాయంత్రం 33 కేవీ లైన్ పరిధిలోని సీటీపై కోతి ప్రమాదవశాత్తు పడటంతో, నిడిల్ కాలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జెన్కో స్విచ్యార్డు సిబ్బంది తక్షణమే స్పందించి, బైపాస్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ మేరకు ఎల్సీ అనుమతులు తీసుకుని, మధ్యాహ్నం వరకు సిబ్బంది పనులు చేపట్టారు. జెన్కో స్విచ్యార్డు సిబ్బంది, ఇంజనీర్లు శ్రమించి, కాలిపోయిన సీటీని తొలగించి కొత్త నిడిల్ను అమర్చారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి సీలేరు కాలనీకి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
కానరాని విస్తరణ
జిల్లా కేంద్రంగా ఎదిగిన పాడేరుపట్టణంలో అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. ప్రధాన రహదారుల విస్తరణపై గత రెండేళ్లుగా ఊరిస్తున్న రూ.44 కోట్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో, స్థానికులు నిత్యం ట్రాఫిక్ కష్టాలతోసతమతమవుతున్నారు. కాగితాలకే పరిమితమైన పాడేరు మెయిన్ రోడ్డు పనులుసాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో రోడ్ల విస్తరణ కలగానే మిగిలిపోయింది. గత రెండేళ్లుగా రూ.44 కోట్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రం ఏర్పడిన నాటి నుంచి గత నాలుగేళ్లలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా రోడ్ల అభివృద్ధి మాత్రం జరగలేదు. రోడ్డును ఆక్రమించిన దుకాణాలు పాడేరు పాత బస్టాండ్ నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా తలారిసింగి వరకు, అలాగే పాత బస్టాండ్ నుంచి సుండ్రుపుట్టు సాయిబాబా టెంపుల్ వరకు రెండు ప్రధాన ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లకు ఆనుకుని వ్యాపారులు అక్రమంగా దుకాణాలను నిర్మించుకున్నారు. వీటిని వెనక్కి జరుపుకోవాలని రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎలాంటి ఫలితం లేదు. ముఖ్యంగా శుక్రవారం వారపు సంత రోజున దుకాణాలన్నీ ప్రధాన రహదారిపైకి రావడంతో, వాహనదారులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రహసనంగా మారిన రోడ్డు అభివృద్ధి గతంలో ఆర్అండ్బీ శాఖ నిర్మించిన కాలువల వరకు రోడ్డును విస్తరిస్తామన్న ప్రచారం మాటలకే పరిమితమైంది. ప్రస్తుతం రోడ్డుకు, కాలువకు మధ్య సుమారు 20 మీటర్ల వరకు ఖాళీ స్థలం ఉన్నప్పటికీ, ఆ మేర రోడ్డును వెడల్పు చేయాలనే ప్రజల విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం ట్రాఫిక్ కష్టాలు పాడేరు పట్టణంలో వాహనాల రద్దీ పెరగడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సినిమా హాల్ సెంటర్ వద్ద ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా 108, 104 అంబులెన్స్లతో పాటు, కలెక్టర్, జేసీ, ఎస్పీ, ఐటీడీఏ పీవో వంటి ఉన్నతాధికారుల వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెద్ద వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ప్రధాన బజార్ రోడ్డులో కూడా ఇదే దుస్థితి కొనసాగుతోంది. పోలీసుల హెచ్చరికలను వాహన చోదకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ముఖ్యంగా ఇదే రహదారిపై జిల్లా ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అంబులెన్స్లు అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో ట్రాఫిక్ జాం కావడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రోడ్లపై ప్రయాణించే అధికారులు సైతం ట్రాఫిక్ ఇబ్బందులను గమనిస్తున్నా, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరులోరోడ్ల అభివృద్ధికి గ్రహణం రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం నిత్యం ట్రాఫిక్ సమస్యలతోప్రజల ఇబ్బందులు పరిష్కారంపై దృష్టి పెట్టనికూటమి ప్రభుత్వం రోడ్ల్ల విస్తరణతో అభివృద్ధి పట్టణంలోని అన్ని రోడ్లు వెడల్పుగా విస్తరించి అభివృద్ధి చేయాలి. వాహన చోదకులతో పాటు పాదచారులు ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేకసార్లు రోడ్డు విస్తరణ అంటూ మార్కింగ్ వేసినా పనులు మాత్రం జరగకపోవడం అన్యాయం. – రామారావుదొర, జిల్లా అధ్యక్షుడు, ఆదివాసీ జేఏసీ, పాడేరు ట్రాఫిక్ సమస్య పెరిగింది రోడ్డుకు ఇరువైపులా ఉ న్న కాల్వల వరకు అయిన అత్యవసరంగా రోడ్డు అభివృద్ధి చేయాలి. ట్రాఫిక్ సమస్య అఽధికమైంది. సంత రోజున మరింత ఇబ్బందిగా మారింది. సినిమాహల్ సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో రోడ్డుమీదే వాహనాలు నిలిపివేతపై చర్య లు తీసుకోవాలి. – బి.సుందరరావు, గిరిజన సంఘ నేత, పాడేరు నిధులు మంజూరైనవెంటనే పనులు పాడేరు పట్టణంలోని అన్ని ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.గతంలో రూ.44కోట్ల ప్రతిపాదనల వివరాలను మళ్లీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళతాం. నిధులు మంజూరు అయిన వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. – సాగర్, ఈఈ, ఆర్అండ్బీ, పాడేరు -
బాకై ్సట్ జోలికి వస్తే ఖబడ్దార్
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాల జోలికి కూటమి ప్రభుత్వం వస్తే ఉపేక్షించేది లేదని, గిరిజనుల హక్కుల కోసం పదవిని త్యాగం చేయడానికై నా, ప్రాణాలను పణంగా పెట్టడానికై నా సిద్ధమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసేలా బాకై ్సట్కు అనుకూలంగా జీవో నంబరు 97ను జారీ చేస్తే, అప్పట్లో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. చింతపల్లిలో గిరిజనులతో కలిసి నిర్వహించిన బాకై ్సట్ వ్యతిరేక సదస్సులో జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. ఆ సభలో అప్పటి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. బాకై ్సట్ జోలికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరుకుతా.. అని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేడు అదే టీడీపీ కండువా కప్పుకుని, కూటమి ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమెను ప్రజలు రెండుసార్లు ఓడించినా బుద్ధి రాలేదని, ఇప్పుడు బాకై ్సట్ సర్వేపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగనన్నే గిరిజనుల రక్షకుడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్రెడ్డి గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆ జీవోను రద్దు చేసి చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. గిరిజనుల రక్షకుడిగా జగనన్న పేరు పొందారన్నారు. గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో బాకై ్సట్ సర్వే కోసం వెళ్తున్న బృందాన్ని గురువారం గిరిజనులు అడ్డుకున్నారని, అధికారులే గిరిజనులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను అడవికి దూరం చేసే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదని, బాకై ్సట్ తవ్వకాలకు పూనుకుంటే గిరిజన తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇటీవల పాడేరు కలెక్టరేట్ ముట్టడితో గిరిజనులు తమ సత్తా చాటారని, బాకై ్సట్ విషయంలో కూడా అదే తరహాలో మహోన్నత ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర,ఎస్టీసెల్ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ పాల్గొన్నారు. బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): ఏజెన్సీలో బాకై ్సట్ జోలికి వస్తే ఉపేక్షించేది లేదని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స హెచ్చరించారు. శుక్రవారం అరకులోయ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో రహస్యంగా సాగిస్తున్న బాకై ్సట్ సర్వేలను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి, చీకటి ఒప్పందాలతో బాకై ్సట్ తవ్వకాలకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అప్పలనర్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను, చట్టాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే గిరిజన చట్టాలకు తూట్లు పొడవడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాలదేవ్, ధర్మనపడాల్, నాయకులు బాబుజ్జిబాబు, సూర్యనారాయణ, బాలయ్య, జగన్నాథం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పదవి, ప్రాణత్యాగాలకు సిద్ధం చంద్రబాబు తలతీస్తానన్న గిడ్డి ఈశ్వరి వైఖరి ఏమిటో? పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం -
ఓటర్ల సర్వేకు ఇబ్బందులు
సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వేకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకుని బీఎల్వోలు ఇంటింటా తిరుగుతున్నప్పటికీ, ఆ సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో సర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీనివల్ల అధికారులు ఒకే ఇంటికి పదేపదే తిరగాల్సి వస్తోంది. అలాగే, రాజకీయ పార్టీల పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు కూడా సర్వే బృందాలతో పాటు ఇంటింటికి రాకపోవడంతో సర్వేలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడేరు పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం బీఎల్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో, సిబ్బంది స్థానికంగా ఉన్న వారితో ఓటర్ల పేర్లను పిలిపించాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొద్దిమంది ఓటర్లకు అక్కడికక్కడే సామూహికంగా ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి కావాలంటే ఓటర్లు సహకరించాలని, అలాగే ఏజెంట్లు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సిబ్బంది కోరుతున్నారు. -
మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణానికి కొలతలు
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారుల నుంచి సానుకూల స్పందన లభించింది. ‘మృత్యువుతో నిత్య పోరాటం, ..కుమ్మరిపుట్టు వద్ద నోచుకోని వంతెన, సర్వేలతో కాలయాపన, ఇప్పటివరకు 91 మంది గిరిజనుల బలి.. అనే అంశాలతో ప్రచురించిన ప్రత్యేక కథనంపై ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కుమ్మరిపుట్టు వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి మత్స్యగెడ్డను పరిశీలించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి, గెడ్డకు ఇరువైపులా వెడల్పు, ఎత్తు, పొడవు తదితర కొలతలను సేకరించారు. నాయకులు జగత్రాయ్, శ్రావణ్, చిన్నిబాబు, రామారావు, సతీష్, ప్రభాకర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
సురభి నాటకాలు గిన్నిస్ రికార్డ్స్లో నమోదు కావాలి
మద్దిలపాలెం: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మించి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న సురభి నాటకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావాలని వక్తలు ఆకాంక్షించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో భానోదయ నాట్య మండలి నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రంగస్థల నటులు మీగడ రామలింగస్వామి, చలసాని కృష్ణప్రసాద్, కొరిటాల ప్రభాకర్, పైడా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, కళాపోషకులు నమ్మి అప్పలరాజు, బిల్డర్ రామకృష్ణ, రిటైర్డ్ ఏసీపీ మహమ్మద్ ఖాన్, గాయని మణిపల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురభి నాటక కళను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భూకై లాస్’ నాటకంలో ఒక్కో ఘట్టం సినిమాను తలపించేలా సాగింది. సురభి కళాకారుల అద్భుత నటన, మంత్రముగ్ధులను చేసే స్టేజ్ టెక్నాలజీతో కళాభారతి హాల్ కరతాళ ధ్వనులతో మారుమోగింది. నటి శివజ్యోతి, కోఆర్డినేటర్ భానుప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
ఉపాధి కూలీలకు బొడ్డేడ వితరణ
మునగపాక: ఉపాధి కూలీలకు తనవంతు సాయం అందించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముందుకొచ్చారు. వేసవిలో పనులు చేసే కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తన సొంత నిధులతో సమకూర్చిన హాట్ బాక్స్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం నాల్గో రోజుకు చేరుకుంది. ములబంద గోడీ ప్రాంత కూలీలు, పేటకట్టు మూల సంఘ పరిధిలో 114 మంది కూలీలకు ఆయన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాధ్యమైనంతలో ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, పార్టీ నేతలు మళ్ల రామజోగినాయుడు, పెంటకోట సారధి, పెంటకోట సత్యనారాయణ, పెంటకోట వెంకట్, ఎంఎం నాయుడు, ఆడారి లక్ష్మణరావు, మళ్ల జగ్గప్పారావు, దాడి శ్రీరామమూర్తి, బొడ్డేడ సోమరాజు, పెంటకోట శ్రీనివాసరావు(నెట్), భీశెట్టి ఈశ్వరరావు, ఆడారి రమణబాబు, కోనపల్లి రామ్మోహనరావు, టెక్కలి కొండలరావు, బొడ్డేడ రామారావు, కరణం గణేష్, దాడి చంద్రరావు, వెలగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇదండీ జీవీఎంసీ వరస..!
డాబాగార్డెన్స్: నగరంలో మండే ఎండల నుంచి బాటసారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ ‘హరితాశ్రయం’ పేరుతో పలు ప్రాంతాల్లో గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా గత మే నెలలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద గ్రీన్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులు, పాదచారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా నీటి తుంపర్లు చల్లే విధానాన్ని కూడా ఇంజినీరింగ్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఏర్పాటు ఎక్కువకాలం నిలవలేదు. సుమారు 20 రోజుల క్రితం నగరంలో వీచిన ఈదురుగాలులకు గ్రీన్ షెల్టర్ నెట్ పూర్తిగా దెబ్బతింది. దాన్ని మరమ్మతు చేయడం లేదా పునరుద్ధరించడం పక్కనపెడితే, ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జీవీఎంసీ మరో గ్రీన్ షెల్టర్ను సత్యం జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రెండున్నర నెలల పాటు నగరవాసులు భానుడి ప్రతాపానికి అల్లాడిన సమయంలో కాకుండా, వర్షాలు కురుస్తున్న వేళ ఈ ఏర్పాట్లు చేపట్టడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలో కాకుండా ఆలస్యంగా చేపట్టిన చర్యలతో జీవీఎంసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
విద్యుత్షాక్కు గురై చూడి గేదె మృతి
అచ్యుతాపురం రూరల్ : విదు్య్త్షాక్కు గురై చూడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన అచ్యుతాపురం పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఫెన్సింగ్ వద్ద శుక్రవారం జరిగింది. అచ్యుతాపురం గ్రామ పాడి రైతు కిల్లాడి చంటికి చెందిన గేదె 9 నెలల చూలుతో ఉందని తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఫెన్సింగ్ తీగల ద్వారా షాక్ తగిలి పాడిగేదె అకారణంగా మృత్యువాత పడిందని రైతు వాపోయారు. రూ. లక్ష 30 వేల రూపాయలకు కొనుగోలు చేశానని పాడి రైతు ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. స్థానికులు ఎవరైనా అటువెళ్లినా ప్రమాదం బారిన పడేవారని ఆందోళన చెందారు. విద్యుత్శాఖ నిర్లక్ష్యం జనానికి ప్రాణ సంకటంగా మారిందని స్థానిక ప్రజలంటున్నారు. రానున్నది వర్షాకాలం కనుక విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తత వహించాలని కోరుతున్నారు. -
జీవ ఎరువులతో పంటల దిగుబడి
నర్సీపట్నం: బయో ఫెర్టిలైజర్స్(జీవ ఎరువులు) వాడకం వల్ల నేల ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలో ధర్మసాగరంలో ఆత్మ ఆధ్వర్యంలో జీవ ఎరువుల వినియోగం, ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడటం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారన్నారు. బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల ఆహార పంటల్లో పోషక విలువలు పెరుగుతాయన్నారు. భూసారం దెబ్బతినకుండా ఉండి రసాయన ఎరవుల ఖర్చు తగ్గుతుందన్నారు. మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల గురించి అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం అనకాపల్లి ఏవో పి.విజేత నేల సారం గురించి అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో దిగుబడి తగ్గుతుందన్నారు. నేల పరీక్షల ఆధారంగా బయోఫెర్టిలైజర్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సుర్ల అప్పలనాయుడు, పెట్ల శ్రీనువాసు, వ్యవసాయ అసిస్టెంట్ కె.భవాని, రైతులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కుకు భూములివ్వం
గొండుపాలెం సచివాలయం వద్దరైతుల నిరసన కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూములను ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. సీపీఎం నాయకులతో కలిసి గ్రామ సచివాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కుకు మే 25న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించలేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నోయేళ్ల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులు భూములు కోల్పోవడం వల్ల రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్, భారతి, తారకేశ్వరరావు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతంకలిగిస్తే ఉపేక్షించం
నర్సీపట్నం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని డీఎస్పీ పి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్న యువతి డ్యూటీలో ఉంటూ ఈ నెల 16వ తేదీ రాత్రి పనినిమిత్తం ఇంటికి వెళ్లి తిరిగి డ్యూటీకి వస్తుండగా అప్పన్నదొరపాలెం వద్ద ఆమెను అడ్డగించి ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పెదబొడ్డేపల్లికి చెందిన కె.హరి(30), పి.కుమార్(42)ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు.ఇద్దరిలో ఒకరిపై రౌడీషీట్ కొనసాగుతోందన్నారు. ఇద్దరుపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. టౌన్ పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు దౌర్జన్యాలు, భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. రోడ్లపై మద్యం సేవించి హల్చల్ చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని, ప్రవర్తనలో మార్పు రాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ గఫూర్, ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సదరన్ రైల్వే, అరక్కోణం రైల్వేస్టేషన్ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన టాటానగర్–ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్, ఈ నెల 23వ తేదీన విల్లుపురం–ఖరగ్పూర్(22604) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ నెల 24వ తేదీన తిరునల్వేలి–పురూలియా(22606) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ నెల 21వ తేదీన రాధికాపుర్–ఎస్ఎంవీటి బెంగళూరు (16224) ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా గూడూరు, రేణిగుంట, తిరుత్తని, మెల్పక్కం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా తేదీల్లో ఈ రైళ్లకు తిరుత్తని స్టేషన్లో అదనపు హాల్ట్ను కల్పించారు. -
పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యత
కలెక్టర్ నిశాంతిపాడేరు: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జిల్లా అధికార యంత్రాంగం పాలనను కొనసాగిస్తోందని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన విశ్వాస్, వికాస్, జన కల్యాణ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల సగటు తలసరి ఆదాయం రూ.2,57,411లకు పెరిగిందని, అలాగే జిల్లా స్థూల దేశీయోత్పత్తి రూ.18,300 కోట్లకు చేరుకుందని వెల్లడించారు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆమె స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.751.91 కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.145.41 కోట్లు, పీఎం జన్మన్ పథకం రూ.312 కోట్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు 2,78,332 పంపిణీ జరిగిందన్నారు.డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 703 మందిని నియమించినట్టు తెలిపారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 317 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,410 మంది సభ్యులకు రూ.26 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి పథకం కింద 210 సంఘాలకు చెందిన 692 మంది సభ్యులకు రూ.6 కోట్ల చెక్కులను ఆమె అందజేశారు. అలాగే, అర్హులైన రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్ గంగులయ్య, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ ఆస్తుల జప్తు
పాయకరావుపేట: రుణాలను చెల్లించకపోవడంతో పట్టణంలోని సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ సంస్థ ఆస్తులను కెనరా బ్యాంకు జప్తు చేసింది. సంస్థ రుణ ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వాటిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకుని బ్యాంకుకు అప్పగించినట్లు ఏఆర్ఎం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి వేలం ప్రక్రియ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వేణుగోపాలరెడ్డి, ఏఆర్ఎం సత్యనారాయణ, డివిజినల్ మేనేజర్ ధనుంజయరావు, పోలీసు సిబ్బంది, మండల రెవెన్యూ సిబ్బంది, తుని బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. -
20,870 కిలోలగంజాయి ధ్వంసం
సాక్షి, అనకాపల్లి: విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20,870 కిలోల గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు పరవాడలోని కోస్టల్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లో గురువారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ డీజీపీ గోపీనాథ్ జట్టి ఐదు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. భారీగా రికవరీలు : విశాఖ రేంజ్ పరిధిలో పోలీసులు గంజాయి నెట్వర్క్లపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 1,142 కేసులు నమోదు చేసి, 3,377 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 65,560 కిలోల గంజాయి, 83.19 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన 832 వాహనాలను సీజ్ చేశారు. 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11.02 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అంతర్జాతీయ, అంతరాష్ట్ర ముఠాల గుర్తింపు శ్రీలంక డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న అంతర్జాతీయ ముఠా కార్యకలాపాలను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ఛేదించి, రూ.1.07 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర ముఠాను పట్టుకుని, రూ.1.04 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సాయంతో 144 హాట్స్పాట్లను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 28 స్టాటిక్, 480 డైనమిక్ చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, విజయనగరం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు. -
స్పా దందా!
సెలూన్ పేరిటఇతర రాష్ట్రాల నుంచే.. విశాఖపట్నంలోని అనేక మసాజ్ కేంద్రాల్లో స్థానిక యువతుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి వసతి సదుపాయాలను కూడా కొందరు నిర్వాహకులే కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సెలూన్లు, స్టూడియోల పేర్లతో అనుమతులు తీసుకుని స్పా కేంద్రాలను నిర్వహిస్తుండగా, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మసాజ్ కేంద్రాలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ కేంద్రాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి మామూళ్ల వ్యవహారమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి స్పాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన గదులకు బదులుగా కర్టెన్లతో మాత్రమే విభజనలు ఉండాలని గతంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిబంధనలను చాలా కేంద్రాలు పాటించకపోయినా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సంపత్ వినాయగర్ ఆలయానికి కూతవేటు దూరంలో సెలూన్ పేరిట నడుస్తున్న ఓ స్పా సెంటర్ విషయంలో పోలీసులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ కేంద్రం జోలికి పోలీసులు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని తెరిచి ఉంచడంతో పోలీసులు దాడి చేశారు. అప్పట్లో బాడీ మసాజ్ల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సెలూన్ ముసుగులో స్పా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్పా కేంద్రాలపై తరచూ దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ కేంద్రం వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేంద్రంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం వెంటనే నిర్వాహకులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే యువతులకు సెలూన్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, క్రమంగా స్పా కార్యకలాపాల్లోకి దింపుతున్నట్లు సమాచారం. వీఐపీ రోడ్డులో ఉన్న మరో సెలూన్ స్టూడియో విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్తో ఎంట్రీకి అడ్డుకట్ట! స్పా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమే. అయితే మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో మసాజ్ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ పొందిన థెరపిస్టులు ఉండాలి. అయితే విశాఖపట్నంలోని కొన్ని కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మసాజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల కోసం పోలీసులు లేదా ఇతరులు నేరుగా లోపలికి రాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్పా సిబ్బంది మినహా ఇతరులు లోపలికి వెళ్లాలంటే బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన వ్యవస్థలు ఉండకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ, వాటి వినియోగం మాత్రం కొనసాగుతూనే ఉంది. మామూళ్ల వ్యవహారమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యభిచారం అరోపణలున్నా.. వాస్తవానికి నగరంలో స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నా యి. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి మసాజ్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలో అడుగడుగునా కనిపిస్తున్న స్పా కేంద్రాల్లో చాలావరకు ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంపత్ వినాయక ఆలయానికి సమీపంలోని ఈ కేంద్రంతో పాటు వీఐపీ రోడ్డులోని మరో స్టూడియోపైనా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. బయటకు సెలూన్లుగా కనిపిస్తున్నప్పటికీ, లోలోపల వ్యభిచారం సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారం నిర్వాహకులకు చేరుతుండటంతో వారు ఫిర్యాదు చేసిన వారిని సంప్రదించి వ్యవహారాన్ని ‘మేనేజ్’ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఉపాధ్యాయులకు చిట్టయ్య ఆదర్శం
కోటవురట్ల: ఆ గురువు ఆదర్శంగా నిలిచి పలువురి మన్ననలు పొందుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పడమే కాకుండా తన ఇద్దరు పిల్లలను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్చి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు పాములవాక జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఎం.చిట్టయ్యను సమగ్ర శిక్ష అభియాన్ ఏఎంవో కెజియా గురువారం ఘనంగా సత్కరించారు. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుడు చిట్టయ్య మాట్లాడుతూ డీఈవో అప్పారావునాయుడు స్ఫూర్తితో తన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని తెలిపారు. హెచ్ఎం కె.వి.ఎల్.నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిత్య పోరాటం
ఒకవైపు గెడ్డ దాటలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు.. మరోవైపు ఏళ్ల తరబడి వంతెన కోసం ఎదురుచూపులు! ఇది ముంచంగిపుట్టు మండలంలోని మత్స్యగెడ్డ పరివాహక గ్రామాల గిరిజనుల నిత్యకృత్యం. అభివృద్ధి కన్నా ప్రమాదాలే ఎక్కువగా పొంచి ఉన్న ఈ జలమార్గం, గిరిజనులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ఎన్నికల వేళ హామీల జల్లులు కురిపించే నేతలు, గెలిచిన తర్వాత ఈ గెడ్డ దాటే కష్టాలను పట్టించుకోకపోవడంతో వంతెన కల ఏళ్లుగా నీటిపై రాతగానే మిగిలిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృత్యువుతోముంచంగిపుట్టు: మండలంలోని పలు గ్రామాల గిరిజనులకు మత్స్యగెడ్డను దాటడమంటేనే నిత్యం మృత్యువుతో పోరాటం. నిత్యావసర సరుకులు, వ్యాపార లావాదేవీలు, విద్య వంటి ప్రతి అవసరానికి గిరిజనులు గెడ్డపై నాటు పడవలనే ఆశ్రయించక తప్పడం లేదు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాల్లో పడవలు మునిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ● మండలంలోని పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు పంచాయతీల పరిధిలోని దాదాపు 86 గ్రామాల ప్రజలు ప్రతిరోజూ నాటు పడవలపైనే మండల, పంచాయతీ కేంద్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గిరిజన మత్స్యకారులు సైతం ఇదే పడవలపై చేపల వేట సాగిస్తూ, వాటిని మండల కేంద్రంలోని వారపు సంతల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. నీటిపై రాతలుగానే.. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు హుటాహుటిన వచ్చి బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తుంటారు. ఆ తర్వాత ఆ హామీలను విస్మరించడం పరిపాటిగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం, మండలంలోని ఆరు పంచాయతీల పరిధిలో నాటు పడవల ప్రమాదాల వల్ల ఇప్పటివరకు 91 మంది మృతి చెందారు. ముఖ్యంగా సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామం వద్ద గిరిజనులు తాడు సాయంతో బోటును ప్రమాదకరంగా లాగుతూ గెడ్డ దాటుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు నాటు పడవ ప్రమాదాలు, ఈతకు వెళ్లిన సమయంలో మునిగి 32 మంది వరకు జలసమాధి అయ్యారు. కుమ్మరిపుట్టు వద్ద వంతెన నిర్మించాలని గిరిజనులు ఏళ్లుగా పోరాడుతున్నా, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు హామీలిచ్చి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలతో కాలయాపన వంతెన నిర్మాణం కోసం సుజనకోట పంచాయతీ గిరిజనులు పాడేరు వెళ్లి, మండల కేంద్రానికి వచ్చిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపినప్పటికీ, నేటికీ నిధులు మంజూరు కాలేదు. అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేయడం మానేసి, వెంటనే నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని సుజనకోట పంచాయతీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, గిరిజన మత్స్యకారులకు రాయితీపై బోట్లు, వలలు అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.మత్స్యగెడ్డలో నాటు పడవలపై ప్రమాదకరంగా ప్రయాణం! కుమ్మరిపుట్టు వద్ద నోచుకోని వంతెన నిర్మాణం సర్వేలతో కాలయాపన చేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటివరకు 91 మంది గిరిజనుల బలి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం కనీసం ఫైబర్ బోట్లు, వలల పంపిణీకి నోచుకోని వైనంప్రతిరోజూ ప్రాణ సంకటమే నిత్యం ఈ గెడ్డ దాటితేనే మాకు జీవనం గడుస్తుంది. మండల కేంద్రానికి, వారపు సంతలకు వెళ్లి మట్టి పాత్రలు అమ్ముకుని బతుకుతున్నాం. గెడ్డ దాటే క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మంత్రులు వచ్చి వంతెన కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు కానీ, అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి మా రాకపోకల కష్టాలను తీర్చాలి. – కృష్ణ, గ్రామస్తుడు, కుమ్మరిపుట్టు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి మత్స్యగెడ్డ ప్రాంతాల్లో గిరిజనులు తరచూ నాటు పడవ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి హామీలు ఇస్తున్నారు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన మత్స్యకారులకు ఉచితంగా బోట్లు, వలలు అందించాలి. ముఖ్యంగా కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించడం అత్యంత ఆవశ్యకం. – వెంగడ రమేష్, మాజీ సర్పంచ్, సుజనకోట పంచాయతీనివేదికలు పంపాం కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి గిరిజనులు ఈ సమస్యను తీసుకెళ్లడంతో, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం. వంతెన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరిగింది. గిరిజనులు నాటు పడవలపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. – వేణుగోపాల్, ఈఈ, ట్రైబల్ వెల్ఫేర్, పాడేరు -
ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా పరిశీలన
పాడేరు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు సర్(ఎస్ఐఆర్) ప్రక్రియ దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ నిశాంతి అన్నారు. పట్టణంలోని సుండ్రుపుట్టు గ్రామ సచివాలయ పరిధిలో ఇంటింటా ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను గురువారం ఆమె పరిశీలించారు. మండల తహాశీల్ధార్, ఎన్నికల సిబ్బంది, బూత్ స్థాయి అధికారులతో కలిసి క్షేత స్థాయిలో ఇంటింటా వెళ్లి ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు తనిఖీ చేసి వాటిలోని ఓటర్ల వివరాలను అనుసంధానిన చాయాచిత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓటర్ల నమోదుకు పారదర్శకతను పాటించాలన్నారు. ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆమె వెంట డీపీవో చంద్రశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, బీఎల్వోలు, ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
బూసిపల్లి పాఠశాల అభివృద్ధికి చేయూత
జి.మాడుగుల: మండలంలోని బూసిపల్లి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల భవనాన్ని ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సొసైటీ ప్రతినిధులు, వెంటనే స్పందించి పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చారు. గ్రామస్తుల సహకారంతో సొసైటీ ప్రతినిధులు పాఠశాల భవనానికి సుందరంగా రంగులు వేయించడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, దుస్తులు, పుస్తకాలు, పలకలు, వాటర్ బాటిళ్లు వంటి సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు కంటా స్వాతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నాగేంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధి కోసం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ఆమె అభినందించారు. సొసైటీ సేవలను గ్రామస్తులు కొనియాడుతూ, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.దత్తత తీసుకుని అభివృద్ధి చేసినఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ -
జూలో జీబ్రా, నక్షత్ర తాబేలు దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల దత్తత స్వీకార కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర గురువారం జూలోని ఒక జీబ్రాను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. దత్తత నిమిత్తం రూ.60 వేల విరాళాన్ని జూ క్యూరేటర్ జి.మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సిరి సహస్రకు క్యూరేటర్ దత్తత స్వీకార పత్రాన్ని అందజేశారు. అలాగే బుక్కవరపు రమాదేవి అనే దాత ఒక నక్షత్ర తాబేలును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. దీనికోసం ఆమె రూ.10 వేల విరాళాన్ని క్యూరేటర్కు సమర్పించారు. వన్యప్రాణులపై ప్రేమతో దత్తతకు ముందుకు వచ్చిన దాతలిద్దరినీ జూ అధికారులు అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని క్యూరేటర్ మంగమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో జూ అడ్మినిస్ట్రేటర్ ఇ.ఉమాదేవి, అసిస్టెంట్ క్యూరేటర్లు బి.గోపి, పి.వి.చౌదరి, ఎఫ్ఎస్వోలు భారతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రూ.60 వేల విరాళం అందించిన మజ్జి సిరి సహస్ర -
బొందుగూడలోతాగునీటి కష్టాలు
● ఊటగెడ్డ వద్ద గిరిజనుల నిరసన అరకులోయ టౌన్/పాడేరు రూరల్: తమ గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఊటగెడ్డ వద్ద బొందుగూడ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు పొట్టంగి శ్రీను మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన బోర్లు, బావులు, రక్షిత తాగునీటి పథకాలు లేకపోవడంతో, గ్రామస్తులు మైళ్ల దూరం వెళ్లి ఊటగెడ్డల వద్ద దొరికే బురద నీటిని తాగక తప్పడం లేదని తెలిపారు. కలుషితమైన ఆ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చిన నాయకులు, గెలిచిన తర్వాత తమ కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కన్నయ్య, రాధమ్మ, అప్పలరాజు, స్వప్న, బాబూరావు, రాములమ్మ పాల్గొన్నారు. -
ఎర్రచెరువు ఆక్రమణలపై ఫిర్యాదు
రోలుగుంట: మండలంలోని బుచ్చింపేట ఎర్రచెరువు ఆక్రమణలను తొలగించి తమ భూములకు సాగునీరు అందించి ఆదుకోవాని ఆయకట్టుదారులు కోరుతున్నారు. దీనిపై కలెక్టరేట్తోపాటు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినట్టు గురువారం వారు తెలిపారు. బుచ్చింపేట గ్రామంలో వడ్డిప పోయే రోడ్డును ఆనుకొని సచివాలయం పక్కనున్న ఎర్రచెరువు ఆక్రమణలకు గురవుతోంది. చెరువు కింద 30 మంది రైతులకు చెందిన 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. చెరువు సమీపంలోనే భక్తమండలి ఆరు మాసాల క్రితం కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణ పనులు చేపట్టింది. ఇటీవల ఎండలకు చెరువు ఎండిపోవడంతో ఆక్రమణదారుడు మట్టిని చెరువులోకి డంపింగు చేసి దిబ్బ చేసుకుంటున్నాడు. డంపింగు చేసిన మట్టి ఆలయం పక్కన, వేరొక చోట వేసి దిబ్బ చేశాడు. దీనిని ఆసరా చేసుకొని మరి కొందరు చెరువు గర్భంలోనే మరికొన్ని నిర్మాణాలు చేపట్టేందుకు ఆలోచనలు చేసుకుంటున్నారు. ఇలాగైతే చెరువు గర్భం తగ్గిపోయి తమ పంట భూములకు సాగునీరుకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేయించి, సరిహద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలను నియంత్రించాలని ఆయకట్టు రైతులు ఉలబాల వెంకటరమణ, సోమినాయుడు, చిటికెల సత్తిబాబు, అల్లు రాంబాబు తదితరులు కోరుతున్నారు. -
పశువైద్యాధికారులకు భద్రత కల్పించాలి
తుమ్మపాల: జిల్లాలో పశువైద్యాధికారులకు భద్రతకల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పశువైద్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పశువైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ విజయ్పై కొందరి వ్యక్తుల దాడి చేయడం దురదృష్టకరమన్నారు. అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించి, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము బగాది , ప్రధాన కార్యదర్శి పి.సురేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు. -
‘మా కుమార్తెను అల్లుడే చంపేశాడు’
అల్లిపురం: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరుపూడి రాధా గాయత్రి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పోలీస్ కమిషనరేట్లో డీసీపీ–2 మేరీ ప్రశాంతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. గాయత్రి మరణం సహజసిద్ధమైనది కాదని, అల్లుడే పథకం ప్రకారం చంపేశాడని, ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికితీయాలని తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాధా గాయత్రి, శ్రీచరణ్లకు గతేడాది నవంబర్ 8న విశాఖలో వివాహం జరిగిందని తెలిపారు. గాయత్రి గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేయగా, ఇటీవల గురుగ్రామ్లోని ఓ సంస్థలో చేరగా, ఆమె భర్త శ్రీచరణ్ పుణెలోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విహారయాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్లోని ముస్సోరి వెళ్లిన దంపతులు ఓ హోటల్లో బస చేసిన సమయంలో గాయత్రి మృతి చెందిందని చెప్పారు. ఆమె మరణం వెనుక అల్లుడిపై అనేక ఆరోపణలు వ్యక్తం చేశారు. భర్త అనుమానంతో వేధింపులు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీచరణ్ భార్య గాయత్రిపై తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేసేవాడు. హైదరాబాద్లో నివసిస్తున్న సమయంలో ఆమె ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వాచ్మ్యాన్ సహకారంతో పరిశీలిస్తూ, ఇంటికి వచ్చే వారిపై నిఘా పెట్టేవాడు. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో ఉన్నప్పటికీ గాయత్రి కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆమె అనుమతి లేకుండానే హ్యాండ్బ్యాగ్లో ట్రాకింగ్ పరికరాన్ని కూడా అమర్చాడు. సహోద్యోగుల గురించి తరచూ ప్రశ్నిస్తూ, వివాహేతర సంబంధాలపై నిరాధార ఆరోపణలు చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడు. గురుగ్రామ్కు మారిన తర్వాత కూడా గాయత్రి కార్యాలయానికి వెళ్లే సమయంలో వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. నిత్యం ఆమెను మానసికంగా వేధించేవాడు. అన్ని ఆధారాలను పరిశీలించాలి గాయత్రి మృతికి సంబంధించిన పరిస్థితులపై శ్రీచరణ్ను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదు. ఘటన జరిగిన హోటల్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, రిజిస్టర్ వివరాలు, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచి పరిశీలించాలి. పోస్టుమార్టం నివేదికలోని అంశాలను కూడా సమగ్రంగా విశ్లేషించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, గాయత్రి మృతిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి దర్యాప్తు వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. -
గృహ నిర్మాణాలుత్వరితగతిన పూర్తి
● హౌసింగ్ పీడీ బాబు జి.మాడుగుల: గిరిజన గ్రామాల్లో గృహ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆశాఖ పీడీ పి.బాబు ఆదేశించారు. మండలంలో మారుమూ గ్రామాలైన తాసురుబయలు, గొందిగూడ, భీమలోయ తదితర గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆదివాసీ గిరిజన లబ్ధిదారుల గృహ నిర్మాణాలను పరిశీలించారు. గృహ నిర్మాణా లు, బిల్లులు జాప్యంపై వివరాలు తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని పీడీ తెలిపారు.


