Alluri Sitarama Raju District Latest News
-
ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న పీవో ఆదిత్యవర్మ
చింతపల్లి: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్యవర్మ గురువారం చింతపల్లిలోని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. పీవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా చింతపల్లికి విచ్చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి, ఇసుకేస్తే రాలనంత జనంతో కోలాహలంగా కనిపించాయి. పీవోతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దారు శంకర్రావు, ఆస్పత్రి పర్యవేక్షకులు నీలవేణి, ఇతర శాఖల అధికారులు, ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, మాజీ సర్పంచ్ పుష్పలత అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అన్నసమారాధన ప్రతి ఏటా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అన్నదానంలో భాగంగా, గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి పైగా భక్తులకు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత చింతపల్లి: ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కటుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండు రోజుల జాతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగింది. బుధవారం రాత్రి ఆయన ఆలయం నుంచి వాహనాలు పార్కింగ్, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను నేరుగా పరిశీలించారు. పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. -
కోర్ కమిటీల ప్రక్రియ పూర్తి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ని ఆరు మండలాల్లో గ్రామ, వా ర్డు స్థాయి కోర్ కమిటీల నియామక ప్రక్రియ పూ ర్తయిందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయి కోర్ కమిటీల నిర్మాణం, అనుబంధ విభాగాల వివరాలు ఇప్పటికే తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాయని, వాటికి సంబంధించిన ఐడీ కార్డుల అప్లోడింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. వెరిఫికేషన్ కాని వారు వెంటనే తమ మండల పార్టీ అధ్యక్షులను సంప్రదించి వివరాలను అప్లోడ్ చేయించుకోవాలని సూచించారు. ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కార్డుల్లో మార్పులు లేదా చేర్పుల కోసం సంబంధిత మండల పార్టీ అధ్యక్షులను ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రామూర్తి ( అరకులోయ): 91103 34636, పాంగి పరశురాం (డుంబ్రిగుడ)73829 87645, కొర్రా సూర్యనారాయణ (అనంతగిరి) 96669 42471, పాంగి అనిల్ కుమార్ (హుకుంపేట) 63041 77763, చంద్రుబాబు (పెదబయలు)83320 44274, పాంగి పద్మారావు (ముంచంగిపుట్టు)77801 89923. కార్యకర్తలు, నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా ఐడీ కార్డుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. -
వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం
● విద్యార్థులకు వైద్యపరీక్షలు ● కలెక్టర్ నిశాంతి ఆదేశాలు సాక్షి,పాడేరు: జిల్లాలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ టి.నిశాంతి వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని విభాగాల వైద్యాధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ ఈనెల 24లోపు తప్పనిసరిగా పూర్తిస్థాయి వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా 14 ఏళ్లు నిండి,15ఏళ్ల లోపు ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మలేరియా జ్వరాలు సోకకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా దోమల నివారణ మందు పిచికారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు దోమతెరలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆధార్ నమోదును ఫోన్ ద్వారా అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో వైద్య కళాశాల, అరకు ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగమంతా సమయపాలన పాటించాలని, అంకితభావంతో విధులు నిర్వహించాలని, పెండింగ్ పనులన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, డీసీహెచ్ఎస్ నీలవేణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, గైనిక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ తమర్భ నరసింగరావు పాల్గొన్నారు. -
గిరిజనులకు డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తాం
అనంతగిరి (అరకులోయ టౌన్): అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాల్లో మృతి చెందిన గిరిజనులకు త్వరలోనే డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హామీ ఇచ్చారు.బూరిగ, చినకోనెల గ్రామాల్లో సుమారు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా గ్రామాల్లో 18 మంది మృతి చెందగా, వారి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏడాది కాలంగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన గిరిజనులు ఇటీవల మోకాళ్లపై కూర్చొని, చేతులు జోడించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటనపై ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించారు. గురువారం బూరిగ గ్రామాన్ని సందర్శించిన ఆమె బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న 18 డెత్ సర్టిఫికేట్లను త్వరితగతిన అందజేస్తామని భరోసా ఇచ్చారు. జేసీ హామీతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు మరణించిన తేదీ, సంవత్సరం కచ్చితంగా చెప్పలేకపోవడం వల్లే ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యమైందని తహసీల్దార్ వీరభద్రచారి వివరణ ఇచ్చారు. ఈ నెల 17న రెవెన్యూ బృందం గ్రామాలకెళ్లి సమగ్ర విచారణ జరిపి, నివేదికను జేసీకి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. డీటీ వంతాల మాణిక్యం, వీఆర్వోలు నాగేశ్వరరావు, రాంబాబు, గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హామీ -
ముగ్గురు చిన్నారుల మృతి బాధాకరం
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం, బియ్యం అందజేత పెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు పెదబయలు సమీపంలోని మత్స్యగెడ్డలో ఈత కోసం వెల్లి ఊబిలో చిక్కుకుని మృతి చెందడం చాలా బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం పన్నెడ గ్రామంలో కోడా ప్రదీప్, గల్లోంగి హర్షిత, పాంగి బబ్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి విషాద ఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు.పిల్లలు,పెద్దలు ఈత,చేపల వేటలకు వెళ్లి ప్రమాదాల బారిన పడి మత్యువాత పడుతున్నారన్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కోదానికి ప్రభుత్వం నష్టపరిహారం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల హుకుంపేట మండలం భూర్జ పంచాయతీ మాలగుమ్మి జలపాతంలో లోతు తెలియక ముగ్గురు యువతులు మృతి విషయం మరువక ముందే పెదబయలు మత్స్యగెడ్డలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. సెలవులకు పిల్లలు ఇళ్లకు వస్తే గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లలకు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాద్యత ఉందన్నారు.ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే కొంత ఆర్థిక సహాయం, బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, సీకరి ఎంపీటీసీ వంతాల ఆనందరావు, మాజీ సర్పంచ్లు గుల్లేలు కృష్ణారావు, వనల్భ సన్యాసి, పండా సుబ్రమణ్యం, మండల వైఎస్సార్సీపీ నేతలు జుంబు పూర్ణయ్య, గోమంగి సూర్యనారాయణ, గల్లోంగి మాలన్న, గల్లొంగి మోహనకుమార్ ఉద్యోగ, ఉపాధ్యాయులు గల్లోంగి సిద్ధేశ్వరరావు, పలాసి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
మోదమ్మ జాతరపై రాజకీయ పెత్తనం తగదు
మాట్లాడుతున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తదితరులుమోదకొండమ్మ ఆలయంలో శుద్ధి చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాసవిశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలుసాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి జాతరను రాజకీయం చేయడంపై ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో కూటమి ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరును నిరసిస్తూ గురువారం పాడేరులోని ఆలయంలో గ్రామ పెద్దలు, వర్తకులు, వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన చెందుతూ, ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జాతరను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని గతంలోనే నిర్ణయించామని ఎమ్మెల్యే తెలిపారు. పండగ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, కలకత్తా లైటింగ్ వంటి కార్యక్రమాలకు అడ్వాన్స్లు కూడా చెల్లించామని పేర్కొన్నారు. అయితే, కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి ఏకపక్షంగా వ్యవహరిస్తూ, జాతరను మే 17, 18, 19 తేదీలకు మార్చడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల జాతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు రాజకీయాలు చేయడం దుర్మార్గమని, ప్రభుత్వం ఉత్సవ కమిటీకి పైసా ఇవ్వకపోయినా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ జోక్యం సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనుల ఆరాధ్యదైవమైన మోదమ్మ ఉత్సవాలలో కూటమి ప్రభుత్వం రాజకీయ పెత్తనం చేయడం సరికాదన్నారు. స్థానిక పెద్దలు నిర్ణయించిన తేదీలను మంత్రి మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జాతర ఘనంగా జరుగుతుందనే అసూయతోనే మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి జాతర సంప్రదాయాలు తెలిసినా రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. పాత నిర్ణయం ప్రకారమే మే 10 నుంచి జాతరను ఘనంగా నిర్వహించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు వైస్ ఎంపీపీ కె.కనకాలమ్మ, జి.మాడుగుల మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు,పాడేరు మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, గిరిజన ఉపాధ్యాయ సంఘ నేత కిల్లు గంగన్నపడాల్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, బీజేపీ నేతలు సల్లా రామకృష్ణ.బి.కేజీయారాణి, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణపాత్రుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు ఉర్వశిరాణి, ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మాజీ ఎంసీ చైర్మన్ లకే రామసత్యవతి, వైఎస్సార్సీపీ నేతలు కె.సూరిబాబు, కొట్టగుళ్లి నాగేంద్ర, కొండాజీ, బోనంగి వెంకటరమణ, కూడి వలసంనాయుడు, కొట్టగుళ్లి చిన్ని, వర్తక సంఘ నేతలు రొబ్బి శంకరరావు, శివరాత్రి నాగేశ్వరరావు, రొబ్బి మధు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం గిరిజన మంత్రి సంధ్యారాణి తీరును నిరసిస్తూ ఆలయం శుద్ధి నిర్వహణ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆమె తీరు ఉందని ధ్వజం -
అటవీ సంపద మట్టిపాలు
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ సంపదను మట్టిపాలు చేస్తోంది. కొయ్యూరులోని ఐటీడీఏ కాలనీ కలప డిపోలో సుమారు రూ. కోటి విలువైన యూకలిప్టస్ కలప వేలం వేయకుండా వదిలేయడంతో, అది నేలపాలై కుళ్లిపోతోంది. అటవీ శాఖకు కాసుల వర్షం కురిపించాల్సిన వృక్షాలు నేడు అధికారుల ఉదాసీనత వల్ల అక్రమార్కుల పాలవుతున్నాయి. పాడవుతున్న యూకలిప్టస్ చెట్ల కలపకొయ్యూరు: అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. స్థానిక ఐటీడీఏ కాలనీలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ కలప డిపోలో సుమారు రూ. కోటి విలువైన యూకలిప్టస్ చెట్లు సరైన సంరక్షణ లేక మట్టిపాలవుతున్నాయి. సకాలంలో వేలం వేయకపోవడం వల్ల ఏపుగా పెరిగిన ఈ వృక్షాలు నేలకొరుగుతూ, అటవీ శాఖకు రావాల్సిన భారీ ఆదాయం వృథా అవుతోంది. ● 1985లో ఐటీడీఏ కాలనీలో నర్సరీ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం అటవీ శాఖకు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున యూకలిప్టస్ మొక్కలను నాటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో అప్పట్లో రైతులు కూడా వీటి సాగుపై ఆసక్తి చూపేవారు. అయితే, సుమారు 40 ఏళ్లు గడుస్తున్నా అటవీ శాఖ ఈ చెట్ల నరికివేతపై గానీ, విక్రయంపై గానీ దృష్టి సారించలేదు. ప్రమాదకరంగా మారిన వృక్షాలు ప్రస్తుతం ఈ చెట్లు ముదిరిపోయి, వేర్ల పటుత్వం కోల్పోయాయి. చిన్నపాటి ఈదురు గాలులు వీచినా ఇవి విరిగి పడిపోతున్నాయి. గతంలో ఇక్కడ సుమారు 250 చెట్లు ఉండగా, ఇప్పటికే వందకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం మరో 150కి పైగా భారీ వృక్షాలు పడిపోయే స్థితిలో ఉన్నాయి. క్షీణిస్తున్న నాణ్యత రెండేళ్ల క్రితం ఇక్కడ అటవీ శాఖ కలప డిపోను ఏర్పాటు చేసినప్పటికీ, పడిపోయిన చెట్లను తరలించడం, వేలం వేయడంలో గానీ అధికారులు చొరవ చూపడం లేదు. ఎండకు ఎండి, వానకు తడిసి ఈ కలప నాణ్యత కోల్పోయి పాడైపోతోంది. సరైన రక్షణ లేకపోవడంతో పడిపోయిన కలపను కొందరు అక్రమంగా తరలిస్తుండగా, మిగిలినది మట్టిలో కలిసిపోతోంది. ప్రస్తుతం మార్కెట్లో యూకలిప్టస్ కలపకు మంచి డిమాండ్ ఉంది. వీటిని బహిరంగ వేలం వేసినా లేదా నేరుగా వ్యాపారులకు విక్రయించినా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ● ముదిరిపోయిన ఈ చెట్ల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఈ కలపను వేలం వేయాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం వీడకపోతే రూ.కోట్లు విలువైన ప్రభుత్వ సంపద పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ముదిరిపోయిన యూకలిప్టస్ తోటలు -
ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణం వేగవంతం
● ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం గూడెంకొత్తవీఽధి: స్థానికంగా నిర్మిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆధిత్యవర్మ ఆదేశించారు. గురువారం ఆయన తీములబంద గ్రామంలో అసంపూర్తిగా ఉండిపోయిన ఎకో కాఫీ పల్పింగ్ యూనిట్ను పరిశీలించారు. ప్రభుత్వం తాజాగా ఈకేంద్రం పునఃనిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో మళ్లీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈపనులను పీవో పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజీనీరింగ్ డీఈ రఘునందనరావు, జేఈ కిషోర్, తహసీల్దారు అన్నాజీరావు, ఐటీడీఏ కాఫీ ఏడీ బొంజుబాబు, హెచ్వో అరుణకుమారి పాల్గొన్నారు. -
మారెమ్మ తల్లి గానామృతం ఆడియో సీడీ ఆవిష్కరణ
సీలేరు: కొండల మధ్య, జలాశయపు అలల చెంత కొలువైన మహిమాన్విత శ్రీ మారెమ్మ అమ్మవారిపై రూపొందించిన గానామృతం ఆడియో సీడీని గురువారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు ఈ సీడీని విడుదల చేశారు. సీలేరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు భాను ప్రకాష్ అమ్మవారిపై భక్తితో ఈ గీతాలను రచించి, చిత్రీకరించారు. ఈ సందర్భంగా సీఈ రాజారావు మాట్లాడుతూ 1950వ సంవత్సరానికి పూర్వం ఇక్కడ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు ఈ మారెమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాల్లో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ రాష్ట్రమంతటా వెలుగులు నిండుతున్నాయంటే అది ఆ తల్లి దయ వల్లేనని ఆయన కొనియాడారు.తక్కువ సమయంలోనే అమ్మవారి మహిమను గుర్తించి, అష్టోత్తర శతనామవళి శ్లోకంతో పాటు ఐదు పాటలను అద్భుతంగా రచించిన ఉపాధ్యాయుడు భాను ప్రకాష్ను ఆయన అభినందించారు. ఇటువంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీడీని ఆవిష్కరించిన అనంతరం రచయిత భాను ప్రకాష్ను ముఖ్య అతిథులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్ఈ సీతారాం, సీలేరు ఎస్ఐ యాసిన్, ఈఈలు అప్పలనాయుడు, బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, జయపాల్, సురేష్ పాల్గొన్నారు. -
పండగ తేదీల మార్పు సరికాదు
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర హితవు ముంచంగిపుట్టు: గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పండుగ తేదీలను మార్చడం సరికాదని, గిరిజన పండుగల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయం చేయడం మానుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర హితవు పలికారు. బుధవారం పాడేరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి సమక్షంలో పండుగ తేదీలను మార్చడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా మే 12న మోదకొండమ్మ తల్లి జన్మదినం కావడంతో, ఆ తేదీని కలిపి పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గిరిజన పెద్దలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులంతా కలిసి రెండు నెలల క్రితమే పండుగ తేదీలను ఖరారు చేశారన్నారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాటను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి ప్రవర్తించడం సరికాదన్నారు. పండగల్లో తనకిష్టమొచ్చినట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జెడ్పీ చైర్పర్సన్, అరకు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే పండగను మే 17, 18, 19 తేదీలకు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. మే 13న పాడేరులో ఒక టీడీపీ నేత వివాహం ఉండటం వల్లే ఈ తేదీలను మార్చారని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన సంప్రదాయాలను పక్కన పెట్టకూడదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మోదకొండమ్మ తల్లి పండుగను నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఆశాజనకంగా ఇంటర్ ఫలితాలు
సాక్షి, పాడేరు: ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు గత ఏడాది కన్నా ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,653మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,368మంది ఉత్తీర్ణులై 77శాతం ఫలితాలు సాధించారు.అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,370మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,603 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులై 86శాతం ఫలితాలు సాధించారు. గురుకులాల్లో మెరుగుపడిన ఫలితాలు : జిల్లా లోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ఫలితాలు మెరుగుపడ్డాయి.జిల్లాలోని తొమ్మిది గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,237మందికి 1,187మంది ఉత్తీర్ణులై 95.96 శాతం ఉత్తీర్ణత సాఽధించారు. జి.మాడుగుల బాలురు, పాడేరు బాలికల గురుకుల కళాశాలల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,248మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,226మంది ఉత్తీర్ణులై 98.23శాతం ఫలితాలు సాధించారు. గూడెంకొత్తవీధి, అరకులోయ బాలికల గురుకుల కళాశాలల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి. కేజీబీవీల్లో.. జిల్లాలోని 11 కేజీబీవీ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 413 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 390 మంది ఉత్తీర్ణులయ్యారు.94.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతగిరి, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు కేజీబీవీల్లో నూరుశాతం ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 414మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా,409మంది ఉత్తీర్ణులై 98.79శాతం ఫలితాలు సాధించారు. అనంతగిరి, డుంబ్రిగుడ, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు, పాడేరు కేజీబీవీల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో.. జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 1964మంది విద్యార్థులు పరీక్షలు రాయగా1593మంది విద్యార్ధులు ఉత్తీర్ణులై 80.6శాతం ఫలితాలు సాధించారు. అప్పర్ సీలేరు కళాశాలలో మాత్రమే నూరుశాతం ఫలితాలు వచ్చాయి. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1876మంది పరీక్షలు రాయగా 1571మంది ఉత్తీర్ణులై 88.45శాతం ఫలితాలు సాఽధించారు. -
మోదమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దాం
సాక్షి, పాడేరు: పాడేరు మోదకొండమ్మ తల్లి జాతరను మే 17, 18, 19 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మోదకొండమ్మ ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది రాష్ట్ర పండగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని, ఘాట్ రోడ్డు ప్రయాణాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ జాతర బందోబస్తుకు సుమారు 750 మంది పోలీసులు అవసరమని తెలిపారు. జిల్లాలోని ప్రత్యేక బలగాలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లినందున, బందోబస్తు సౌలభ్యం కోసం జాతర తేదీలను మార్చాలని ఇన్చార్జి మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి స్వయంగా భోజనం వడ్డించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి -
దోమల నివారణే లక్ష్యం
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా దోమల నివారణ లక్ష్యంగా మొదట విడత దోమల మందు పిచికారి పనులు చేపడుతున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. మండలంలోని ఉబ్బేటిపుట్టులో దోమల నివారణ మందు పిచికారి పనులను బుధవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల నివారణ మందును ప్రతి ఇంటిలోను తప్పనిసరిగా పిచికారి చేయాలన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే సకాలంలో వైద్యసేవలు పొందాలన్నారు. దోమలు కుట్టడం వల్ల వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ జ్వరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియాశాఖ అధికారి తులసీ, ఏడీఎంహెచ్వో డాక్టర్ డి.ప్రతాప్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. బోసుబెడలో.. అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ, గన్నెల పీహెచ్సీల పరిధిలో జరుగుతున్న దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులను జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మలేరియా సోకకుండా ఉండేందుకు ప్రతీ ఇంట్లో దోమల నివారణ మందు పిచికారి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎం.బద్రయ్య, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అప్పలస్వామి, సిబ్బంది నూకరాజు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ప్రమాదంగూడెంకొత్తవీధి: మండలంలోని జడుమూరు – నిమ్మలపాలెం మధ్య జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వనబలింగం గ్రామానికి చెందిన చిలకల అబ్రహం (28), జడుమూరుకు చెందిన దేశగిరి కిషోర్ కుమార్ బుధవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వసువాడ నుంచి చిలకవీధి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చింతపల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు అబ్రహం, కిషోర్ కుమార్ ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. నెరెళ్లబంద గ్రామానికి చెందిన వంతల రమణబాబు తన వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒక్క క్షణం జరిగిన అజాగ్రత్త, రెండు నిండు ప్రాణాలను బలితీసుకొని ఆ కుటుంబాల్లో ఎన్నటికీ పూడ్చలేని లోటును మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన రమణబాబుపై చట్టపరమైన చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అబ్రహం, కిషోర్కుమార్ (ఫైల్) -
పండగపై రాజకీయం తగదు – ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పండగపై కూటమి ప్రభుత్వం, గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయాలు చేయడం తగదని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మతల్లి ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసేలా కూటమి ప్రభుత్వం మోదమ్మ పండగను రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు, ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు మోదమ్మ ఉత్సవాల తేదీలు మార్చడం అన్యాయమన్నారు. ఉత్సవాల పందిరి రాట ప్రతిష్టించిన తరువాత ఉత్సవాల తేదీలు మార్చడం మంచి పద్ధతి కాదని, ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్న కూటమి పెద్దలకు అమ్మవారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మే 12వ తేదీన మోదకొండమ్మతల్లి పుట్టినరోజు వేడుకను మాత్రమే ఆలయ, ఉత్సవ కమిటీలు ఘనంగా జరుపుతాయన్నారు. ఉత్సవాలు మార్పు చేసిన మే 17,18,19 తేదీల్లో జరిగే మోదకొండమ్మతల్లి జాతరకు ఉత్సవ, ఆలయ కమిటీలకు ఎలాంటి సంబంధం లేదని, ఖర్చు మొత్తం కూటమి ప్రభుత్వమే బరాయించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
జాతరకుగ్రహచారం
పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలకు ముహూర్తపు రాట వేశాక తేదీలు మార్పు మే17,18,19కు ఏకపక్షంగా మార్చిన గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై భక్తుల ఆగ్రహం ● అమ్మవారే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరికమన్యం ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణ వివాదాస్పదంగా మారింది. దశాబ్దాల తరబడి వస్తున్న సంప్రదాయాలను పక్కనబెట్టి, కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఉత్సవాల తేదీలను మార్చడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పందిరి రాట వేసి ముహూర్తం ఖరారైన తర్వాత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏకపక్షంగా తేదీలను మార్చడంపై గిరిజన ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, పాడేరు: గిరిజనుల ఆరాధ్య దైవం, మన్యం ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల చుట్టూ కూటమి ప్రభుత్వం మురికి రాజకీయం చేస్తోంది. 40 ఏళ్ల పండగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పెద్దలు ఉత్సవాల తేదీలను మార్చడంపై భక్తులు, గిరిజన శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. ముహూర్తం ఖరారై.. పందిరి రాట వేసినా మార్పులా? ఈ ఏడాది మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను మే 10, 11, 12 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలంతా గత నెలలోనే ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. శాస్త్రోక్తంగా పందిరి రాట కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. వివిధ సేవల కోసం కమిటీ ఇప్పటికే అడ్వాన్సులు కూడా చెల్లించింది. ఇంత జరుగుతున్నా, అవేవీ పట్టించుకోకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర టీడీపీ నేతలు తమ రాజకీయ పంతం కోసం తేదీలను మే 17,18,19వ తేదీలకు మారుస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించడం కలకలం రేపింది. మంత్రి తీరుపై ఎమ్మెల్యే ధ్వజం.. సమావేశం నుంచి వాకౌట్! కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సంధ్యారాణి నిర్ణయాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్రంగా ఖండించారు. భక్తుల నమ్మకాలతో రాజకీయం చేయడం దారుణమని మంత్రితో పాటు అధికారులను నిలదీశారు. లక్షలాది భక్తుల సెంటిమెంట్ కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? పందిరి రాట వేసిన తర్వాత ముహూర్తాలు మార్చడం అరిష్టం. ఈ అపచారానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ఆ అమ్మవారే తగిన గుణపాఠం చెబుతుంది.. అని హెచ్చరిస్తూ ఆయన సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. భక్తుల మనోభావాలతో ఆటలా? మేడారం జాతర తరువాత జాతీయ స్థాయిలో అంతటి గుర్తింపు ఉన్న మోదమ్మ జాతరపై కూటమి ప్రభుత్వం పెత్తనం చెలాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రామ పెద్దల నిర్ణయానికే విలువ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మంత్రి తన ఇష్టానుసారం తేదీలు మార్చడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. -
వైభవంగా మారెమ్మ జాతర మహోత్సవాలు
సీలేరు: అమ్మలగన్న అమ్మ, ముక్కోటి దేవతల మూలశక్తి, ఆపద మొక్కుల తల్లి శ్రీ మారెమ్మ అమ్మవారి 54వ వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బుధవారం నాటి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల మధ్య ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పవిత్ర అభిషేకాలు..విశేష పూజలు ఉత్సవాల్లో భాగంగా తొలుత విశాఖపట్నానికి చెందిన కె. నాగరాజు, విజయ దంపతులు తమ మొక్కుబడిని చెల్లించుకుంటూ పంచామృతాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు దామోదర శర్మ పర్యవేక్షణలో, తమిళ అర్చకులు సుబ్రహ్మణ్యం వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో తల్లిని నేత్రపర్వంగా అలంకరించారు. అగ్నిగుండ ప్రవేశం.. గరగ ప్రతిష్ట స్నానాల ఘాట్ వద్ద అత్యంత భక్తితో అలంకరించిన మారెమ్మ అమ్మవారి గరగను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మండుతున్న అగ్నిగుండం మీదుగా తల్లి గరగను తీసుకువెళ్లి గర్భాలయంలో ప్రతిష్టించడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 120 మంది మాలధారులు భక్తిప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం చేశారు. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల అలంకరణల మధ్య సీలేరు గ్రామం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది.ఈ మహత్తర దృశ్యాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విశాఖ పోలీస్ శాఖకు చెందిన కె. నాగరాజు కుటుంబం ఈ పండుగలో ధ్వజం (జెండా), అగ్నిగుండం, ప్రధాన అన్నదాన కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఈ వేడుకలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన సీలేరు -
గిరిజనాభివృద్ధిని అడ్డుకుంటున్న ‘కూటమి’
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ చింతపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులు తమకు ఓటు వేయలేదన్న కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చింతపల్లి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ పండగ సందర్భంగా అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ పుష్పలత ఆధ్వర్యంలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు పరిపాలనను చేరువ చేసేందుకు, జిల్లా స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు అల్లూరి సీతారామరాజు పేరిట పాడేరును జిల్లా కేంద్రంగా జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 97ను రద్దు చేసి గిరిజన ప్రయోజనాలను కాపాడామన్నారు.ఏడు దశాబ్దాలుగా గిరిజన ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను, పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా జగన్ సాకారం చేశారని కొనియాడారు.గిరిజన ప్రాంత ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జీవో నంబరు 3 పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా దీనిపై స్పష్టత లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోవడంతో, ఇక్కడి అభివృద్ధి పనులను కావాలనే నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు ద్వారా జగన్మోహన్రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు. తమ పార్టీ గిరిజనుల పక్షాన నిలబడి పోరాడుతుందని అమర్నాథ్ పేర్కొన్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు సత్యారావు, గండి రవి, ఎంపీపీలు కోరాబు అనూషదేవి, బోయిన కుమారి, వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, పార్టీ మండల అధ్యక్షులు గణబాబు, మాజీ అధ్యక్షులు రవి, చీడికాడ మాజీ జెడ్పీటీసీ సుంకర శ్రీనివాస్, జల్లి సుధాకర్, జల్లి బాబులు, తాజా, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
ప్రయాణికురాలు రజినికి పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పెళ్లి దుస్తులు అందజేస్తున్న ఆటో డ్రైవర్ వనం రాజేష్ అనకాపల్లి: పెళ్లి దుస్తులు, విలువైన వస్తులున్న బ్యాగును బాధితురాలు పోగొట్టుకోగా.. ఆటో డ్రైవర్ నిజాయతీగా బుధవారం అందజేశారు. వివరాలు ఇలా.. పట్టణంలో గవరపాలెంకు చెందిన వి.రజిని తుమ్మపాలెం వనం రాజేష్ ఆటో ఎక్కింది. పెళ్లి దుస్తుల బ్యాగ్, విలువైన సామగ్రిని ఆటోలో మరిచిపోయి అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్లో దిగిపోయింది. స్థానిక గాంధీనగరంలో గల తుమ్మపాల పాయింట్ తలుపులమ్మ ఆటో స్టాండ్ డ్రైవర్ వనం రాజేష్ వాటిని పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రజినికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోలో ప్రజలు ప్రయాణించే సమయంలో తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు. -
ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనుల ధర్నా
నర్సీపట్నం : గిరిజనులకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్ను ఉద్యోగం నుంచి తొలగించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు కె.జనార్దన్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ లబిరేషన్ ఆధ్వర్యంలో గిరిజనులు తహసీల్దార్ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏవో బి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కొండఅడ్డసారు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి ఆర్.చంద్రశేఖరరావు ప్రయత్నించారన్నారు. రెవెన్యూ అధికారులు రద్దు చేసిన డిజిటల్ సైన్ను యథావిఽధిగా వన్బీలో నమోదు చేశారన్నారు. 2018లో జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆ భూములను పరిశీలించి, అప్పటి ఆర్డీవో కోరాడ సూర్యారావును విచారణ నిమిత్తం ఆదేశించారన్నారు. విచారణ చేసిన ఆర్డీవో రాయవరపు చంద్రశేఖరరావుకు ఆ భూములపై ఎటువంటి హక్కులు లేవని, డిజిటల్ సైన్ రద్దు చేశారన్నారు. నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆర్.చంద్రశేఖరరావు అపీల్ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. యలమంచిలి తహసీల్దార్ నుంచి చంద్రశేఖరరావు వారసత్వ ధృవపత్రం తీసుకురావడం జరిగిందన్నారు. తహసీల్దార్ను సంప్రదించగా తన సంతకం ఫోర్జరీ చేసి తయారు చేశారని నర్సీపట్నం ఏఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ వద్ద ఆర్ఓఆర్ అపీల్ నడుస్తుండగా, చంద్రశేఖరరావు పేరున తహసీల్దార్ వన్బీ నమోదు చేశారన్నారు. జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఘర్షణలు, గొడవలకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారులే అన్నారు. ఒకరి భూముల్ని మరొకరి పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు చేయడం వల్ల ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. -
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
యలమంచిలి రూరల్ : పట్టణంలోని కోర్టుపేట భాష్యం స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. ఈ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు కొలగాని బాలు, ప్రగడ నితిన్లు మధ్యాహ్నం 12.40 గంటలకు స్కూల్ విడిచి పెట్టిన తర్వాత ఇంటికి వెళ్లలేదు. ఎస్.రాయవరం మండలం వేమగిరికి చెందిన కొలగాని బాలు రోజూ భాష్యం స్కూల్ బస్సులో పాఠశాలకు వచ్చి వెళ్తుంటాడు. మరో విద్యార్థి ప్రగడ నితిన్ యలమంచిలి పట్టణంలోని పాతవీధి వీరభద్రస్వామి ఆలయ ప్రాంతానికి చెందిన వాడు. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులూ స్నేహితులు. వీరు కనిపించకపోవడంతో పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. కుటుంబసభ్యులు ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. విద్యార్థులు ఎందుకు అదృశ్యమయ్యారో కారణం తెలియలేదు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ తెలిస్తే 9440796103 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. -
మూడు లారీలకు రూ.1.94 లక్షల జరిమానా
నక్కపల్లి : టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో పరిమితికి మించి లోడుతో వెళ్తున్న మూడు టిప్పర్లను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం పరిమితికి మించిన లోడుతో మూడు లారీలు ఫ్లైయాష్తో ఉపమాక చందనాడ, మీదుగా వేంపాడునుంచి జాతీయరహదారిపై చేరుకుని కాకినాడ వెళ్తుండగా వేంపాడు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. సాధారణంగా 35 టన్నుల సామర్ధ్యంతో రాకపోకలు సాగించాల్సిన ఈ లారీలు 6 టన్నులలకు పైగా లోడుతో ప్రయాణిస్తున్నాయి. టోల్గేట్ మీదుగా వెళ్తే అక్కడ తనిఖీ చేసి పరిమితికి మించి లోడు వేయడంతో లారీకి సుమారు రూ.8వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునేందుకు ఉపమాక, చందనాడ అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిని చేరుకుని కాకినాడ వెళ్తుంటాయి. ఈ మూడు టిప్పర్లు అడ్డదారిలో వెళ్తుండడాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో ఒక టిప్పర్కు రూ.56వేలు, రెండో టిప్పర్కు రూ.66వేలు, మూడో టిప్పర్కు రూ.74వేలు పెనాల్టీ విధించారని ఎస్ఐ తెలిపారు. -
టీడీపీ కుటిల రాజకీయాల వల్లే అమర్నాఽథ్పై కేసులు
బుచ్చెయ్యపేట: టీడీపీ నాయకుల కుటిల రాజకీయాల వల్లే మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్పై కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా చేశారని మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేటలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ బుధవారం మండల కేంద్రం అధ్యక్షుడు జోగా కొండబాబు,రాష్ట బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి కె. అచ్చింనాయుడు,వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్ధనరావులు టీడీపీ నాయకుల తీరుపై మండి పడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని శాంతియుతంగా అమర్నాఽథ్ అమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం అయన ప్రాణాలు తీసుకుంటున్నట్లు పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఆరు నెలలు జైలు శిక్ష పడేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై పలు సార్లు అమరణ నిరాహారదీక్షలు చేసినా ఎవరికీ జైలు శిక్ష పడిన దాఖలాలు లేవని చెప్పారు. మూడు తరాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న అమర్నాథ్ కుటుంబంపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చెప్పారు. రైల్వే జోన్ తెచ్చి విశాఖ అభివృద్ధికై కృషి చేస్తున్న అమర్నాఽథ్పై తప్పుడు కేసులు పెట్టించిన టీడీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట ప్రజల కోసం చేస్తున్న పోరాటాల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు అండగా ఉంటారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గొలజాన శ్రీను,పెదిరెడ్ల మాణిక్యం,గోపిశెట్టి శ్రీను,కోరుకొండ రమణ,ముచ్చకర్ల అప్పారావు,గోకివాడ రాము,సిగిరెడ్డి సుశీల తదితర్లు పాల్గొన్నారు. రావికమతం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్పై టీడీపీ నాయకులు కుట్రలు పన్నడం తగదని, ఆయనకు పార్టీ నాయకత్వంతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు కంచిపాటి జగ్గారావు,ఎంపీపీ పైల రాజు అన్నారు.బుధవారం పార్టీ అధ్యక్షుడు జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కా మహాలక్ష్మి నాయుడు,రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి గుమ్ముడు సత్యదేవా, జెడ్ప్టీసీ తలారీ ఆదిమూర్తి మాట్లాడుతూ రైల్వేజోన్కోసం పోరాడితే కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా కుట్రపన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గంటా ఈఽశ్వరరావు,ఎంపీటీసీలు పూడి దేవా,కుంచా శంకరరావు,పార్టీ నాయుకులు కంచిపాటి త్రిమూర్తులు,శీలం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా చెరువు నీరు తరలింపు
ఎస్.రాయవరం : గుడివాడ శిశారులో చెరువులో నీటిని కూటమి నేతల అండదండలతో స్థానికులు నీటిని బయటకు తోడేస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మామిడి చంటి మంగతాయరులు నీటిపారుదలశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. వేసవి రోజులు ప్రారంభ అయిన సమయంలో చెరువులో నీటిని ఇంజన్లతో తరలించి పశువులకు తాగునీరు లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చేపలు పట్టుకోవడం కోసం అక్రమంగా చేస్తున్న పనులు అడ్డుకుని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులో నీటిని తరలిస్తే పశువులకు తాగునీటి సమస్యతో పాటు సమీప ఆయకట్టు రైతులకు, బోర్లు, ఇతర అవసరాలకు నీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
మండల అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
బుచ్చెయ్యపేట: మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నాగేశ్వరిదేవి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. 35 పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు హాజరైనా పలుశాఖలకు చెందిన మండల అధికారులు హాజరుకాలేదు. మూడు నెలలకొకసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశానికి ప్రజల సమస్యలు తెలపడానికి జీతం లేకపోయినా మేం హాజరవుతున్నాం, రూ.లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు ఎందుకు హాజరుకావడం లేదని ఎంపీడీవో శివ నారాయణను జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,కోఆప్షన్ సభ్యుడు కె.అచ్చింనాయుడు తదితరులు ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తహసీల్దార్, ఎంఈవో, విద్యుత్, సివిల్ సప్లయి, ఆర్అండ్బీ, ఆర్టీసీ, ఐసీడీఎస్, అటవీశాఖ, పంచాయతీరాజ్,హార్టికల్చర్, సెరి కల్చర్,దేవదాయశాఖ,సోషల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు హాజరుకాకపోగా కొన్ని శాఖల అధికారులు కిందస్థాయి సిబ్బందిని పంపించారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో సర్ది చెప్పడంతో ప్రజాప్రతినిధులు శాంతించారు. వడ్డాది,బుచ్చెయ్యపేట, తురకలపూడి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి నిధులు ఖర్చుల వివరాలు స్థానిక నాయకులకు తెలపకపోవడంపై నిలదీశారు. పలు సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.ఎంపీడీవోను నిలదీసిన ఎంపీటీసీలు -
ఇంటర్లో మెరిసిన పేదింటి కుసుమాలు
యలమంచిలి రూరల్ : వారంతా పేదింటి బిడ్డలు... ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో అద్భుతంగా రాణించి తాము చదువుకున్న కళాశాలకు..తల్లిదండ్రులకు పేరు తెచ్చారు.చదువుకు పేదరికం అడ్డుకాదంటూ ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటారు.యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం విద్యార్థినులు జి.గిరిజ బైపీసీలో 982,ఎంపీసీలో ఎం.దివ్య 974 మార్కులు సాధించారు.మొదటి సంవత్సరం విద్యార్థులు ఆర్. వెంకటలక్ష్మి 442(ఎంపీసీ), కె.కృష్ణవేణి 441(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు. సాధారణ రైతు కుటుంబాల నుంచి ... వారిద్దరూ సాధారణ రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు. ప్రణాళికాబద్ధంగా చదివారు. క్రమం తప్పని సాధనతో యల్లపు ప్రశాంతి,పిల్లా కావ్య మెరుగైన ఫలితాలు సాధించారు సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు ప్రశాంతి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 978 మార్కులు, రాంబిల్లి మండలం మూలజంప గ్రామానికి చెందిన పిల్లా కావ్య 966 మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించిన ప్రశాంతిని తల్లిదండ్రులు శ్రీనివాసు,లత బుధవారం స్వీటు తినిపించి అభినందించారు.ఉన్నత చదువులు చదివి మంచి ప్రభుత్వోద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమని వారిద్దరూ సాక్షికి తెలిపారు.తమ విద్యార్థులు ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడం పట్ల గీతాంజలి కళాశాల చైర్మన్ పి.సురేష్బాల్ ఆనందం వ్యక్తం చేసి, విద్యార్థినులను అభినందించారు. కశింకోట: మండలంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలికలంతా కూలీల పిల్లలే కావడం విశేషం. తేగాడలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదివిన జి.రమ్య బైపీసీలో 987 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బుచ్చియ్యపేట మండలం చిన్న మల్లాం గ్రామానికి చెందిన ఆమె తండ్రి అప్పలనాయుడు రోజువారీ కూలీ. తల్లి లక్ష్మి గృహిణి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా డాక్టర్ కావాలని రమ్య ఆకాంక్షిస్తున్నట్లు సాక్షికి తెలిపింది. ద్వితీయ స్థానంతో 983 మార్కులు పొందిన కె.గంగా భవానిది రావికమతం మండలం గొంప గ్రామం. తండ్రి రాము రోజు వారీ కూలీ. తల్లి సత్యవతి. ఆమె కూడా డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 974 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన జి. సంధ్య కశింకోట మండలంలోని గోకివానిపాలెం గ్రామానికి చెందిన రాజు, చినతల్లి కుమార్తె. తండ్రి రోజు వారీ కూలీ. బీఫార్మసీ చేయాలని లక్ష్యమని తెలిపింది. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో చదువుతూ ఇంటర్లో ద్వితీయ స్థానంలో 983 మార్కులతో నిలిచిన తాడి హేమలతది మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామం. తండ్రి చిన మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి. వీరు కూలీలు. కొండ్రి నాగలక్ష్మి 969 మార్కులతో తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన తండ్రి అప్పారావు, తల్లి పార్వతి కూలీలు. వైద్య రంగంలో స్థిరపడాలని ఆకాంక్షిస్తోంది. డాక్టర్ కావడమే ధ్యేయంకశింకోట: తాను డాక్టర్ను కావాలని ఆశిస్తున్నట్టు ఇంటర్మీడియెట్లో అత్యధికంగా 987 మార్కులు సాధించిన కాకర ప్రవల్లిక తెలిపింది. మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడింది. మాడుగుల మండలం కింతలిలో నివసిస్తున్న తన తల్లిదండ్రలు రాజు, ఆనందరావు కూలీ పనులు చేస్తున్నట్టు తెలిపింది. నీట్ రాసి ఎంబీబీఎస్ చదవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె చెప్పింది. లేదంటే నర్సింగ్ అయినా చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. జి.గిరిజ, 982/1000 ఆర్ వెంకటలక్ష్మి, 442/470 ప్రభుత్వ జూనియర్ కళాశాల, యలమంచిలి -
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ): వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వయా దువ్వాడ, కొత్తవలస మీదుగా పలు సమ్మర్ స్పెషల్, వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ●చర్లపల్లి–సంత్రగచ్చి(07671) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17, 20, 24, 27, 30వ తేదీల్లో ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 10.48 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07672) సంత్రగచ్చిలో ఈ నెల 18, 21, 25, 28, మే 1వ తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటాయి. ●చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ(07165) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 20న సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు దువ్వాడ, అదే రోజు సాయంత్రం 5.20 గంటలకు భువనేశ్వర్ న్యూ చేరుకుంటుంది. ●మైసూరు–డిబ్రూగడ్(06253) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 26న ఉదయం 8 గంటలకు మైసూరులో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, బుధవారం తెల్లవారు 1.30 గంటకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06254) డిబ్రూఘడ్లో ఈ నెల 16, 30వ తేదీలలో తెల్లవారు 1.30 గంటలకు బయల్దేరి ముసటిరోజు రాత్రి 7.38 గంటలకు కొత్తవలస, శనివారం సాయంత్రం 4.15 గంటలకు మైసూరు చేరుకుంటాయి. ●యశ్వంత్పూర్–న్యూ జల్పయ్గురి(06567) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17, 24వ తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్పూర్లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు న్యూ జల్పయ్గురి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06568) ఈ నెల 20, 27వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు న్యూ జల్పయ్గురిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.13 గంటలకు కొత్తవలస, బుధవారం ఉదయం 9.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటాయి. ●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06073) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో ఈ నెల 20, 27వ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.53 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06074) ఈ నెల 22, 29 తేదీల్లో ఉదయం 10.45 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.03 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 7.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్కు చేరుకుంటాయి. ●తాంబరం–సంత్రగచ్చి(06075) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 21, 28వ తేదీలలో తాంబచంలో ఉదయం 10.15 గంటలకు బయల్దేరి అదేరోజు అర్ధరాత్రి 1.58 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో సాయంత్రం 6.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06076) ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు దువ్వాడ, శుక్రవారాల్లో ఉదయం 10.30 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06067) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో ఈ నెల 16న ఉదయం 6.55 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7 గంటలకు దువ్వాడ, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06068) ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.38 గంటలకు దువ్వాడ, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్కు చేరుకుంటుంది. యశ్వంత్పూర్ స్పెషల్కు దువ్వాడ, కొత్తవలసలో హాల్ట్ తాటిచెట్లపాలెం: యశ్వంత్పూర్–కతిహార్–యశ్వంత్పూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్కు దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, పలాసలలో అదనపు హాల్ట్ను కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితాను తగ్గించేందుకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(06077/78) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్కు 1–స్లీపర్ క్లాస్ కోచ్ను అదనంగా జత చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
21న పాడేరు ఐటీడీఏ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
● పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యూవీ గిరి చింతపల్లి: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 21న పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యూవీ గిరి తెలిపారు. మంగళవారం చింతపల్లి గిరిజన సంక్షేమ బాలర ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్, సూర్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్–1 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులంద రూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు లు కొర్రు మత్స్యలింగం, జిల్లా ఉపాధ్యక్షురాలు రమణమ్మ, గిరిజన సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గెమ్మిలి మోహన్, మండల అధ్యక్షులు ప్రసాద్, జయబాదురి, రూప పాల్గొన్నారు. -
చింతపల్లిలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. మే 1వ తేదీన జరగనున్న ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఈ పోటీల్లో తొలిరోజు తలపడుతున్న చౌడుపల్లి – డిగ్రీ కళాశాల జట్ల క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం స్వయంగా బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతలో అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉందని, అయితే సరైన వేదికలు లేక చాలామంది వెలుగులోకి రాలేకపోతున్నారని అన్నారు. గ్రామదేవతల పండుగల సందర్భంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల ప్రతిభ వెలికివస్తుందని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆకాంక్షించారు.ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. విజేతలకు అందించే బహుమతుల వివరాలను నిర్వాహక కమిటీ ప్రకటించింది.ప్రథమ బహుమతి దివంగత పసుపులేటి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం రూ. 50వేలు, ద్వితీయ బహుమతి ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్య, ఎంపీటీసీ పద్మ తరఫున రూ. 25 వేలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయకరావు, పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బేతాళుడు పాల్గొన్నారు. అలాగే నిర్వాహక కమిటీ సభ్యులు దాసరి మత్స్యరాజు, వడ్డే శ్రీనివాస్, మాసాడ రాము, తరుణ్, పృథ్వీ పాల్గొన్నారు. -
వైభవంగా మారెమ్మఉత్సవాలు ప్రారంభం
సీలేరు: కోర్కెలు తీర్చే కల్పవల్లి, సీలేరు శ్రీ మారె మ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 54వ జాతర మహోత్సవంలో భాగంగా, తమిళ ఉగాదిని పురస్కరించుకు ని తమిళ అర్చకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముందుగా మాలలు ధరించిన మారెమ్మ భవానీలు, స్థానిక మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు కలిసి 108 కలశాలతో గ్రామం నుంచి ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్నానాల ఘాట్ వద్ద నదిలోని గంగా జలాలను సేకరించి అమ్మవారికి పుణ్యజలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం తమిళ అర్చకులు సుబ్రమణ్యం, శ్రీను, ఆలయ అర్చకులు దామోదర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద అమ్మవారి పాదాలకు పంచామృతాలతో అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించిన అనంతరం, జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు విశాఖపట్నానికి చెందిన కె. నాగరాజు, విజయ దంపతులు సహకారం అందించారు. సుమారు 100 మంది భవానీ భక్తులు, గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ఈ పూజల్లో పాల్గొన్నారు. ఇలావుండగా 54వ మారెమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించనున్నారు. విద్యుత్ దీపాల అలంకరణలు, బాణాసంచా మెరుపుల మధ్య స్నానాల ఘాట్ వద్ద అమ్మవారి గరగను అలంకరించి, అగ్నిగుండం మీదుగా తీసుకువచ్చి గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ వేడుక కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు
● కలెక్టర్ నిశాంతి ● వాడవాడలా ఘనంగా అంబేడ్కర్ జయంతి సాక్షి,పాడేరు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు స్మరించుకుని మంచి సమాజ లక్ష్యం నిర్మించుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి కోరారు. ఆయన జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ అమిత్బర్దర్,జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ,ఇన్చార్జి డీఆర్వో నీలకంఠరావు డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ నిశాంతి,జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన అందరి లక్ష్యం కావాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పిలుపునిచ్చారు. ఐటీడీఏలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు,ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ నిధులతో అంబేడ్కర్పార్కు అభివృద్ధి ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వివిధ పార్టీల నేతలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాతల సహకారంతో అన్నసంతర్పణ నిర్వహించారు.అంబేడ్కర్ పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్న జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర,మూర్తి దంపతులను సత్కరించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థానిక అంబేడ్కర్ పార్కును జెడ్పీ నిధులతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కళావేదిక నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు. మండల అంబేడ్కర్ ఆశయ కమిటీ అధ్యక్షులు కె.సూర్యనారాయణ,వైస్ఎంపీపీ భాగ్యవతి,ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, పార్టీల నేతలు పద్మారావు, రమేష్, సన్యాసమ్మ, బాబురావు, నరసింగరావు పాల్గొన్నారు. -
గ్రామ సభలు సద్వినియోగం చేసుకోండి
● డీఎల్పీవో పీఎస్ కుమార్ పాడేరు రూరల్: గ్రామ సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్పీవో పీఎస్ కుమార్ కోరారు. మండలంలో పాడేరు మేజర్ పంచాయతీ గ్రామసభను మోదమాంబ కల్యాణ మండపంలో పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా పంచాయతీ, గ్రామ సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా వేసవిలో తాగునీటి సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. గ్రామాల్లో పథకాలు మొరాయించడంతో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వారు వివరించారు. దీనిపై తదుపరి చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పీసా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం
పెదబయలు: ఈతకు వెళ్లి ముగ్గురు గిరిజన చిన్నారులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం పెదబయలు మండలం, పన్నెడ గ్రామానికి చెందిన మృతులు కోడా ప్రదీప్ (10), గల్లోంగి హర్షిత (10), పాంగి బబ్లు (10) కుటుంబ సభ్యులను వారు పరామర్శించి, ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగత సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటం అత్యంత బాధాకరమన్నారు. ఘటన జరిగిన తర్వాత గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు వచ్చారా? అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తుచేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఇటీవల హుకుంపేట మండలం మాలగుమ్మి జలపాతంలో ముగ్గురు యువతులు మృతి చెందిన ఘటన మరువకముందే.. ఇప్పుడు పెదబయలు మత్స్యగెడ్డలో మరో ముగ్గురు మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందని జల్లిపల్లి సుభద్ర, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి. ఒంటిపూట బడులు ఉండటం, ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు చెరువులు, గెడ్డల వద్దకు వెళ్తున్నారని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రమాదకరమైన జలపాతాలు, గెడ్డలు, పర్యాటక ప్రాంతాల వద్ద పోలీస్, రెవెన్యూ, టూరిజం, ఐటీడీఏ అధికారులు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎంవీవీవీఎస్. నర్సింగమూర్తి, జగబంధు, మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, నాయకులు సందడి కొండబాబు, గంపరాయి సూరయ్య, డడియా రాంబాబు, రూడ లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ తిరుపతి, గల్లొంగి మాలన్న తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి డిమాండ్ -
అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దాం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ 27వ వార్డు పరిధి శంకరమఠం వెనుక ఉన్న ఇందిరా సంజీవ్ భీమ్నగర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ.. సేవలోనే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, అదే అంబేడ్కర్ ఆలోచన విధానమని గుర్తు చేశారు. పేదలు, దళితులు విద్యావంతులైనప్పుడే వారికి సమాజంలో సరైన న్యాయం, గౌరవం లభిస్తాయన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నీలాపు సర్వేశ్వరరెడ్డి చిన్నారులకు పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ, రవిరాజు, పద్మనాభం అమ్మాజీ, రెయ్యి డేవిడ్రాజు, గనగల రామరాజు, ఈతలపాక విజయ్, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయలు, సనపల రవీంద్రభరత్, కోన శంకర్, చోడిపిల్లి శివ, ఆకుల శ్యామ్, గోవింద్, పైలా అప్పలరాజు, మోహన్, కె.అప్పన్న, లాజర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్నగర్లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ -
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం
అల్లిపురం: నిత్యం పనిభారంతో ఉండే ఉద్యోగులకు క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. గెలుపోటములకంటే కలిసి టీమ్గా పాల్గొనడం ముఖ్యమని, ఇది అధికారుల మధ్య స్నేహబంధాన్ని బలపరుస్తుందని అన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సూర్యాబాగ్లోని ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు జరిగిన క్రీడా పోటీల అనుభవాలు విధి నిర్వహణలో ఎంతో ఉపయుక్తమయ్యాయని తెలిపారు. ఈ స్ఫూర్తితో రెవెన్యూ శాఖలో కూడా త్వరలో క్రీడా పోటీలను నిర్వహించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. విశాఖలో ఈ తరహా కార్యక్రమాలు ఒక మంచి సంప్రదాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో వెస్ట్, సౌత్, నార్త్, హార్బర్, ఈస్ట్, ద్వారకా సబ్డివిజన్లు, ట్రాఫిక్ డివిజన్తో పాటు స్పెషల్ వింగ్ టీమ్లు కలిపి మొత్తం పది జట్లు పాల్గొన్నాయి. ప్రారంభంలో జట్లు మార్చ్పాస్ట్ నిర్వహించి కలెక్టర్కు గౌరవ వందనం అందించాయి. 100 మీటర్ల పరుగులు (మెన్, ఆఫీసర్స్), టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలను కలెక్టర్ ప్రారంభించి వీక్షించారు. పోలీస్ సిబ్బంది చూపిన ఉత్సాహం ప్రశంసనీయమని పేర్కొంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ విజేతలుగానే భావిస్తున్నానన్నారు. మొత్తం 20 విభాగాల్లో నిర్వహించిన 140కు పైగా పోటీల్లో సుమారు 250 మంది విజేతలు, రన్నర్స్గా నిలిచారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. స్పోర్ట్స్ మీట్ జెండాను కలెక్టర్కు అందజేయగా, ఆయన దానిని పోలీస్ కమిషనర్కు భద్రపరచడానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా అగ్నిమాపక సేవా దినోత్సవం
అగ్నిమాపక సేవా దినోత్సవంలో పాల్గొన్న సింహాద్రి ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, అధికారులు పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీలో అగ్నిమాపక సేవా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. సంస్థ ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, సీఐఎస్ఎఫ్ యూనిట్ కమాండర్ రాజ్కుమార్, ఫైర్ వింగ్ డిప్యూటీ కమాండెంట్ రామ్లఖన్ సింగ్, ఏసీ ఫైర్ రాజ్ చౌదరి అమరవీరుల స్థూపంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అగ్ని ప్రమాద భద్రతపై బ్యానర్లు, బుక్లెట్స్, కరపత్రాలను దీపాంజలినగర్, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. -
గ్యాస్ కోసం తప్పని అవస్థలు
● భుజాన మోస్తూ.. బండిపై తీసుకెళ్తూ.. మారని వాహనదారుల తీరు ● ప్రాణమా.. ఫోనా? ● సుర్రుమంటున్న సూరీడు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. అత్యవసర పనుల మీద గడప దాటి బయటకు వస్తే చాలు.. సురీడు సుర్రుమనిపిస్తూ మంట పుట్టిస్తున్నాడు. ఎండ తీవ్రతకు, ఉక్కపోతకు నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఈ మండుటెండల బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎండ దెబ్బ, వడగాల్పుల నుంచి రక్షణ పొందేందుకు మహిళలు ముఖానికి పూర్తిగా చున్నీలు, స్కార్ఫ్లు కప్పుకుని బయటకు వస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా ఎండ తగలకుండా జాగ్రత్త పడుతున్న దృశ్యాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. -
స్పీకర్కు తొత్తుగా నర్సీపట్నం సీఐ
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసు కట్టారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాఽశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశాలతో తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యేతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మంగళవారం నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత భూమిలో చెట్లు నరుక్కుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై డప్పు కళాకారుడైన దళితుడిని చెంప చెల్లుమనిపిస్తే, ఇదే పోలీసులు పేక్షకపాత్ర వహించారని ఆగ్రహించారు. తమ పార్టీ నాయకుడు సన్యాసిపాత్రుడు తన సొంత భూమిలో తోట నరికిస్తుంటే పోలీసులు అడ్డగించడమే కాకుండా అక్రమ కేసు పెట్టారన్నారు. సన్యాసిపాత్రుడు కుటుంబ సభ్యులు ఈరెల్లి రాజుబాబుకు భూమిని లీజుకు ఇస్తూ అగ్రిమెంట్ చేశారన్నారు. లీజు అగ్రిమెంట్ 2024 నాటికి ముగిసిందన్నారు. అగ్రిమెంట్ అయిపోయి రెండేళ్లు అవుతుంటే ఈరెల్లి రాజుబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ వాటాకు సంబంధించిన తోటను మట్టుకోకుండా సన్యాసిపాత్రుడు, మరో ఇద్దరు అన్నదమ్ముల వాటాలోని తోటను నరుకుతుంటే సీఐ అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ ఘటనలో తమ పార్టీ నాయకుడు లాలం స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజుబాబు మరో వ్యక్తి దాసుకు లీజుకు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దాసు సర్వేకర్ల వ్యాపారం చేయటం ఎప్పుడైనా చూశారా? అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున రూరల్ సీఐ తప్పుడు కేసు బనాయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. స్పీకర్ పట్ల సీఐ రేవతమ్మ స్వామిభక్తి ప్రదర్శిస్తూ, తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లను తక్షణమే విడిచి పెట్టాలన్నారు. తమ నాయకుడి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఐ చర్యలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, చింతకాయల వరుణ్, దాడి బుజ్జి, సుర్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సింహగిరిపై ఆర్జిత సేవల పునరుద్ధరణ
జీలకర్రబెల్లం ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించారు. స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాల సందర్భంగా గత నెల 28 నుంచి ఈ నెల 13 వరకు ఆర్జిత సేవలన్నీ నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. దీనిలో భాగంగా ఉదయం స్వామివారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో అర్చన జరిపి, విశేష హారతులు అందించారు. విశేషంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయ దాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శాస్త్రోక్తంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్టు
కశింకోట : దాదాపు ఏడేళ్లుగా గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సుదూర ప్రాంతానికి వెళ్లి వెతికి మరీ పట్టుకొని కశింకోట పోలీసులు అరెస్టు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిల్బుల్ వారెంట్ను కోర్టు ఆదేశాల మేరకు అమలు చేయడంలో భాగంగా గంజాయి కేసులో కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న లారీ డైవర్ను ఎట్టకేలకు పట్టుకొని అరెస్టు చేసినట్టు ఎస్ఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా దల్బెలున్ గ్రామానికి చెందిన డెబాసిస్ ఘెరాయ్ (26) కశింకోట వద్ద ట్రాలీపై మరమ్మతుకు తరలిస్తున్న కారుగా భ్రమింపజేసి దానిలో 2019లో గంజాయి తరలిస్తున్న కేసులో నిందితుడన్నారు. అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు కోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో భాగంగా నిందితుడిని గ్రామానికి తమ సిబ్బందితో పాటు వెళ్లి పట్టుకొని అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరు పరిచామన్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాత అనకాపల్లి కోర్టులో నిందితుడిని హాజరు పరిచామన్నారు. -
మహిళ నిజాయితీ
పెందుర్తి: ఓ ఆర్మీ అధికారి భార్య నిజాయితీని చాటుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న దాదాపు రూ.2.5లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అప్పగించారు. వివరాలివి.. వేపగుంట అప్పలనర్శయ్యకాలనీలో నివాసం ఉంటున్న సిరిగుడి వరలక్ష్మి ఆదివారం సాయంత్రం తన బ్యాగ్లో బంగారు నక్లెస్ పెట్టుకుని కుమార్తెతో కలిసి గోపాలపట్నంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కి నాయుడుతోటలో దిగింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి వెళ్లి బ్యాగ్ చూడగా అందులో ఆభరణం లేదు. వెంటనే బాధితురాలు వరలక్ష్మి పెందుర్తి క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉన్నాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చేపట్టాయి. నాకు బంగారం దొరికింది రెండు రోజులుగా ఆభరణం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టిన పోలీసులకు ఆచూకీ దొరకలేదు. అయితే మంగళవారం ఉదయం పద్మనాభనగర్కు చెందిన ఆర్మీ అధికారి కట్టా శ్రీనివాసరావు భార్య శ్రావణి తాను వాకింగ్ చేస్తున్న సమయంలో నాయుడుతోట వద్ద ఆభరణం దొరికిందని పోలీస్ స్టేషన్కు వచ్చి నక్లెస్ను అప్పగించారు. దీంతో పోలీసులు బాధితురాలు వరలక్ష్మిని పిలిపించి ఆభరణం సరిపోల్చారు. ఆమెకు ఎస్ఐ సూరిబాబు ఆభరణాన్ని అప్పగించారు. నిజాయితీ ప్రదర్శించిన కట్టా శ్రావణిని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణం పోలీసులకు అప్పగింత -
ఉపాధికి లంగరు
మహారాణిపేట: సముద్ర మత్స్య సంపద వృద్ధి, పునరుత్పత్తి లక్ష్యంగా తూర్పు సముద్ర తీరంలో ఏటా అమలు చేసే ‘వేట నిషేధం’ మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధ కాలం అమలులో ఉంటుంది. దీనివల్ల విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 749 మరపడవలు, 1310 మోటారు బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకుని లంగరు వేశాయి. ట్రాలర్లు, మోటార్ బోట్లు, వాహన నౌకలు వంటి వాణిజ్య వేట నౌకలకు నిషేధం వర్తిస్తుండగా, మోటారు లేని సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు కొంత మినహాయింపు ఇచ్చారు. ఇవి తీరానికి 8 కిలోమీటర్ల లోపే వేట కొనసాగించవచ్చు. మత్స్యకారులకు రెండు నెలల విరామం పది నెలల పాటు నిరంతరంగా వేటలో నిమగ్నమయ్యే మత్స్యకారులకు ఈ 61 రోజుల నిషేధ కాలం విశ్రాంతిని కలిగిస్తుంది. మళ్లీ జూన్ 15 నుంచి వేట కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. విశాఖ జిల్లాలో 65 కిలోమీటర్ల తీరరేఖ, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 749 మరబోట్లు, 1310 మోటారు బోట్లు, 488 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. మత్స్య సంపద పరిరక్షణ కోసం ఈ నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీజన్ కన్నా ముందే బోట్లు నిలిపివేత ఈ ఏడాది అనేక సమస్యల కారణంగా మత్స్యకారులు సీజన్కన్నా ముందుగానే వేటను నిలిపివేశారు. ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందకపోవడం, ఖర్చులు పెరగడం, చేపలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాల వల్ల వేటలో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో చాలా మంది బోటు యజమానులు ముందుగానే హార్బర్లో బోట్లు నిలిపివేశారు. అయితే చిన్న సంప్రదాయ పడవలతో రోజువారీ వేట మాత్రం కొనసాగుతోంది. మరమ్మతులకు సమయం వేట నిషేధ కాలంలో బోటు యజమానులు తమ నౌకలకు మరమ్మతులు చేపడతారు. ఇంజిన్, గేర్బాక్స్, వలలు, ఇతర పరికరాలను సరిచేసి తదుపరి సీజన్కు సిద్ధం చేసుకుంటారు. వేలాది మంది మత్స్యకార కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఇతర పనుల బాట పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నిషేధ కాలంలో చేపల వేట కొనసాగిస్తే పట్టుబడిన చేపలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మత్స్యశాఖ, కోస్టల్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, పోలీస్, నేవీ, రెవెన్యూ విభాగాల సంయుక్త గస్తీ కొనసాగనుంది. మత్స్య సంపద పరిరక్షణ కోసం విధించిన నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలి. –పి.లక్ష్మణరావు, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ, విశాఖపట్నం -
రౌడీయిజం చేస్తే తాట తీయండి..
గొలుగొండ/నాతవరం : గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించి తాటతీయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుగొండ మండలంలో కృష్ణదేవిపేట, గొలుగొండ గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేసిన రెండు పోలీస్ స్టేషన్లు, నాతవరంలో పోలీస్స్టేషన్ నూతన భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభోత్సవం చేశారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, రౌడీయిజం అరికట్టే విధంగా ప్రజలను భాగస్వాములు చేసి అనేక కార్యక్రమాలు పోలీస్శాఖ చేపడుతోందన్నారు. నాతవరం ఎస్సీ కాలనీలో నిర్మించిన సోలార్ ప్లాంటును స్పీకర్, ఎస్పీలతో కలిసి హోంమంత్రి అనిత ప్రారంభించారు. అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ కాలనీలో రాయితీపై ఏర్పాటు చేసిన విద్యుత్ సోలార్ ప్లాంటును, నాతవరం, గొలుగొండ మండలాల్లో రూ.7.50 కోట్లతో నిర్మించిన 3 పోలీసుస్టేషన్లకు నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. -
అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం
తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం పేరుకే పరిమితమైందంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారంగాక అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా అధికారుల వద్దకు వస్తే సమస్య తెలుసుకుని తక్షణమే పరిష్కరించకుండా సంబంధిత శాఖ సిబ్బందికిచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే తమ సమస్యలను కలెక్టరేట్లో అధికారుల ముందుంచగా, ఫిర్యాదులను నమోదు చేసి, వాటి స్థితిగతులపై కనీసం పునః పరిశీలన చేయడం లేదని వాపోతున్నారు. పదే పదే భూసమస్యలపై.. భూ సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు నెలల తరబడి ఎటువంటి పురోగతి లేకపోవడంతో కలెక్టరే దిక్కంటూ కొందరు పదేపదే కలెక్టరేట్లో ఫిర్యాదులు చేస్తూనే ఉంటున్నారు. మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ పరిష్కారం కోసం వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీల ద్వారా అప్రమత్తం చేయాలని, తద్వారా అర్జీదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం : జేసీ ప్రజలు తమ సమస్యలపై చేసిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అర్జీదారునితో విచారించి పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టరేట్ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం –1, 2లలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్ ), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయనతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎన్ఏవోబీ, బీజేఆర్ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామమణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. ఈ వారం పీజీఆర్ఎస్కు 108, రెవెన్యూ క్లినిక్కు 173 మొత్తం 281 అర్జీలు వచ్చాయి. కక్షసాధింపుతో భూసేకరణ జాబితాలో పేరు తొలగింపు రికార్డుల్లో 2 ఎకరాల భూమికి బదులు 60 సెంట్లు మాత్రమే భూసేకరణ జాబితాలో ఉందని, మిగిలిన భూమి ఆన్లైన్లో కనిపించడం లేదని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినందుకు రెవెన్యూ అధికారులు తన పేరును పూర్తిగా తొలగించారంటూ మాకవరపాలెం మండలం రాచపల్లికి చెందిన బొంతు రమణ మళ్లీ ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 737లో 2 ఎకరాల భూమిని 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ఇటీవల ప్రభుత్వం వివిధ కంపెనీల స్థాపన కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసి తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించారు. ఆ జాబితాలో మొదటి దఫా నా పేరున ఉన్నప్పటికీ రెండవ జాబితాలో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. భూములు లేని కొంతమంది వ్యక్తులు అక్రమంగా హక్కులు చూపుతూ జాబితా సిద్ధం చేశారన్నారు. భూ సేకరణ జాబితాలో తికమకలపై మరికొందరు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేశారు. చెరువు గర్భం ఆక్రమించినా పట్టించుకోని అధికారులు మూడు గ్రామాలకు చెందిన చెరువు గర్భాన్ని ఆక్రమించి మట్టితో కప్పేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మల్లవరం కాలువ చైర్మన్ ఎస్.వి.కె.దొర పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. మాకవరపాలెం మండలం మల్లవరం, గిడుతూరు, వజ్జరగడ గ్రామాలకు చెందిన చెరువు ఆక్రమణపై నర్సీపట్నం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేపినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. 750 ఎకరాలకు సాగు నీరందించే చెరువును కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి కొంత భాగాన్ని మట్టితో కప్పేస్తున్నా పట్టింకునే వారే లేకుండా పోయారని, కలెక్టరమ్మ స్పందించి చెరువును కాపాడాలని కోరారు. తూతూమంత్రంగా మారిన కలెక్టరేట్ పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరించి చేతులు దులుపుకుంటున్న అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు -
బంగారం
బూడిదేవేస్ట్ మేనేజ్మెంట్లో ఎన్టీపీసీ సింహాద్రి సరికొత్త రికార్డు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా శత శాతం వినియోగం నిర్మాణ రంగానికి బూడిద ప్రధాన ముడిసరుకు పర్యావరణ పరిరక్షణలో దేశానికి మార్గదర్శకంవ్యర్థం ‘అర్థవంతం’విశాఖ సిటీ: ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద అంటే కేవలం వ్యర్థం, పర్యావరణానికి ముప్పు అనే అభిప్రాయం ఉండేది. కానీ సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్ ఆ భావనను పూర్తిగా మార్చేసింది. కేవలం విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా, వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ కాంతులు పంచుతున్న ఈ ప్లాంట్, పర్యావరణ పరిరక్షణలో దేశంలోని ఇతర ప్లాంట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. బొగ్గును మండించి విద్యుత్ను ఉత్పత్తి చేసే క్రమంలో వెలువడే ‘ఫ్లై యాష్’ (బూడిద)ను వ్యర్థంగా పారేయకుండా, నిర్మాణ రంగానికి కీలక వనరుగా మలుస్తోంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా 100 శాతం వినియోగాన్ని సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు ఒక్క గ్రాము బూడిదను కూడా వృథా కానివ్వకుండా, ప్రకృతిలో కలవకుండా జాగ్రత్త పడుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో అజేయ శక్తి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ గ్రిడ్కు వెన్నెముకలా నిలుస్తోంది. 2000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి దాదాపు 11,136 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు సింహాద్రి విద్యుత్ ఎంతో కీలకంగా మారింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే వ్యర్థాల నిర్వహణలో మేటిగా నిలుస్తోంది. కొండంత బూడిద.. కోటి ప్రయోజనాలు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో ఏడాదికి సగటున 2.8 మిలియన్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇంత భారీ పరిమాణాన్ని నిర్వహించడం ఏ ప్లాంట్కై నా సవాలే. గతంలో ఈ బూడిద వల్ల కాలుష్యం పెరిగి సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, సింహాద్రి యాజమాన్యం దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బూడిదను వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. గత ఏడాది ఏకంగా 102 శాతం వినియోగాన్ని సాధించింది. అంటే, ప్రస్తుత ఉత్పత్తితో పాటు పాత నిల్వలను కూడా వినియోగంలోకి తెచ్చింది. కాలుష్యానికి అడ్డుకట్ట.. నిర్మాణానికి ఊతం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యే క్రమంలో భారీగా ఫ్లై యాష్ వెలువడుతుంది. దీనిని సరిగ్గా నిర్వహించకపోతే గాలిలో కలిసి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవ్వడమే కాకుండా, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది. అయితే సింహాద్రి ప్లాంట్ ఈ సమస్యను ఒక అవకాశంగా మలిచింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బూడిదను ఏమాత్రం వృథా కాకుండా సిమెంట్ పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా అవుతోంది. పోర్ట్ల్యాండ్ పోజోలానా సిమెంట్ (పీపీసీ) తయారీలో ఈ ఫ్లై యాష్ అత్యంత కీలకం. విశాఖపట్నం, సమీప జిల్లాల్లోని సిమెంట్ కర్మాగారాలు ఫ్లై యాష్పైనే బూడిదపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల సిమెంట్ నాణ్యత పెరగడమే కాకుండా, తయారీ వ్యయం కూడా తగ్గుతోంది. హరిత శక్తి వైపు అడుగులు శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే, మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరుల (గ్రీన్ ఎనర్జీ) వైపు సింహాద్రి అడుగులు వేస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ (నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం) ప్రాజెక్టుల్లో ఒకటైన 25 మెగావాట్ల ప్లాంట్ ద్వారా సుమారు 39.362 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీనివల్ల బొగ్గు వినియోగం తగ్గడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతున్నాయి. రిజర్వాయర్ నీటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల నీటి ఆవిరీభవనాన్ని కూడా తగ్గించగలుగుతున్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనలే సింహాద్రిని ఇతర ప్లాంట్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి.ఒకప్పుడు పర్యావరణానికి ముప్పుగా భావించిన ఫ్లై యాష్ను.. సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్ ఇప్పుడు ఆర్థిక, నిర్మాణ రంగాలకు బలమైన వనరుగా మార్చింది. విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. హైవేల నిర్మాణంలో కీలక పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణంలో కూడా సింహాద్రి బూడిద వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో మట్టికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. రోడ్ల పునాదిలో బూడిదను వాడటం వల్ల అవి మరింత దృఢంగా మారుతున్నాయి. దీంతో మట్టి కోసం కొండలను తవ్వాల్సిన అవసరం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతోంది. అనకాపల్లి–ఆనందపురం హైవే వంటి కీలక ప్రాజెక్టుల్లో ఈ బూడిదను విస్తృతంగా వినియోగించారు. అలాగే ఇటుక తయారీ యూనిట్లకు తక్కువ ధరకే లేదా ఉచితంగా బూడిద అందించడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, గనుల పునరుద్ధరణ పనులకు కూడా ఈ బూడిదను వినియోగిస్తున్నారు. -
వేస్ట్ ఆయిల్తో చక్కగా వంట!
ఇది చూడటానికి కాస్త వైరెటీగా ఉంది కదూ... పనికిరాని ఇంజిన్ ఆయిల్తో పనిచేసే గ్యాస్ స్టౌ ఇది. జోనల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న కుందూరి ప్రకాష్ (శ్రీరామ్నగర్ వాసి) దీనిని రూపొందించారు. సోమవారం ఇలా ప్రదర్శించి చూపారు. ఇలా స్టౌను ఏర్పాటు చేసి దానికి ఒక చిన్నపాటి ట్యాంకర్ అనుసంధానం చేసి, అందులో వేస్ట్ ఇంజిన్ ఆయిల్ వేసి, విద్యుత్ ద్వారా గాలిని పంపించి స్టౌ వెలిగించారు. దీంతో చక్కగా వంట చేసుకోవచ్చంటున్నారు. భలే ఐడియా కదూ. – అనకాపల్లి -
బొగ్గు ఫ్యాక్టరీ తొలగించాలని నిరసన
అనకాపల్లి: ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు ప్రభుత్వం చలగాటం అడుతుందని, కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీలను తక్షణమే తొలగించాలని, ఇప్పటికే గ్రామంలో సుమారుగా నలుగురు బొగ్గు కాలుష్యం కారణంగా మృత్యవాత పడ్డారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పిసినికాడ రెవెన్యూ పరిధిలో బీఆర్టీ కాలనీలో అనహిత రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(బొగ్గు కంపెనీ–1,2)ని తక్షణమే తొలగించాలని, బీఆర్టీ కాలనీ, సంపతిపురం, వెటజంగాలపాలెం గ్రామాల ప్రజలు సోమవారం కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీల ద్వారా కిడ్నీ, లీవర్ సమస్యతో గడిచిన మూడు, నాలుగు నెలల్లో కొంతమంది మృత్యవాత పడ్డారన్నారు. ఫ్యాక్టరీని తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. పోలీస్, ఇతర శాఖల అధికారులు ఐదు రోజుల్లో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈనెల 18వ తేదీ వరకూ నిరసన కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. లేని పక్షంలో ప్రజలు పక్షాన నిత్యం ధర్నాలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రజల ప్రాణాలను హరించే కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్యాయమని, తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, ఎంపీటీసీలు మెల్లేటి హేమ, బుద్ద నాగేష్, స్థానిక ప్రజలు ఎల్లపు వెంకట్రావు, పెదిశెట్టి రమేష్, మల్ల శ్రీనివాసరావు, భాస్కర్రావు, నీలకంఠ సంతోష్ లక్ష్మి, ఎం.పాపారావు, కాండ్రేగుల పరమేష్, మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
జాతీయ రహదారి పనులు గడువులోగా పూర్తి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ నిశాంతి సాక్షి, పాడేరు: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రాజెక్ట్ ఏపీడీ, కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ ఆథారిటీ,సైట్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు అత్యంత నాణ్యతగా ఉండాలని,ఎక్కడా నిబంధనలు ఉల్లంఘన జరగకూడదని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని,పనులు సమయంలో ప్రయాణికులు,స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లాలో జలధార,జలహారతి పనులకు సంబంధించి 100రోజుల ప్రత్యేక యాక్షన్ప్లాన్ అమలుచేస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు.సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.చెరువులు, చెక్డ్యామ్ల మరమ్మతులతో పాటు కొత్తసాగునీటి చెరువుల నిర్మాణాలకు సాధ్యతను పరిశీలించాలన్నారు.ఈ సమావేశంలో జేసీ,ఐటీడీఏ పీవోలతో పాటు ఇన్చార్జి డీఆర్వో నీలకంఠరావు, జలవనరులశాఖ ఈఈ రాజేశ్వరరావు,ఇన్చార్జి డీఎఫ్వో ఉమామహేశ్వరి,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు,బాలకర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మమ్మేలు.. ముత్యాలమ్మా
చింతపల్లి: మన్యం ప్రజల ఆరాధ్యదేవత ముత్యాలమ్మతల్లి జాతరకు చింతపల్లి ముస్తాబయింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.జిల్లాలో పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవం తరువాత జరిగే అతిపెద్ద రెండవ జాతర ఇదే. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ఉత్సవ కమిటీ చేపట్టింది.ఏటా ఈ ఉత్సవాలను నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. జాతరకు రెండు లక్షల మంది హాజరవుతారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లను, భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మొదట డప్పుల పండగగా.. చింతపల్లిలో ఐదు దశాబ్దాలు కిందట అమావాస్య రోజున ముత్యాలమ్మ తల్లి పండగను డప్పుల పండగగా ప్రారంభించారు. ఒక్క రోజు పండగను నిర్వహించేవారు. అనంతరం 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మన్యం వాసుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ తల్లి జాతర మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. 15వ తేదీ బుధవారం అమ్మవారి పూజారు(సుర్ల వంశస్తుల)ల ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం,ఇత్తడి పాదాలు,గరగలను ఊరేగింపుగా సతకం పట్టువరకూ తీసుకువచ్చి తొలిరోజు కొలువు దీరుస్తారు.16వతేదీ గురువారం రాత్రి సతకం పట్టువద్ద కొలువు దీరిన అమ్మవారిని చింతపల్లిలో గల అన్ని వీధుల్లో ఊరేగించి, తెల్లవార్లూ జాగరణ జరిపి, తిరిగి పూజారుల ఇంటికి చేరుస్తారు. 17వ తేదీ శుక్రవారం చివరి రోజున పెద్ద పండగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు హాజరై చీర సారెలు సమర్పిస్తారు.సాయంత్రం పూజారుల ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘటాలను భారీ ఊరేగింపుతో ఆలయం వరకు తీసుకురావడంతో పండగ ముగుస్తుంది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా... ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.సాయిబాబా ఆలయం నుంచి జిల్లా పరిషత్ అతిథి గృహం వరకు,మూడు రోడ్ల జంక్షన్ నుంచి సంతబయలుతో పాటు మండల కేంద్రంలోని అన్ని పురవీధుల్లోను రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మూడు రోడ్ల జంక్షన్, కోర్టు, రంగా సెంటర్, పాత బస్టాండుతో పాటు అమ్మవారి ఆలయం, సతకం పట్టువద్ద భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు.అదే విధంగా ఈ ఏడాది బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చనున్నారు. మూడు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మూడు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు.జిల్లా పరిషత్ పాఠశాల,అమ్మవారి ఆలయ ప్రాంగణం,సబ్ జైలు ఎదుట ఈ స్టేజీలను సిద్ధం చేశారు.ఈ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో సీఐ వినోద్బాబు ఆధ్వర్యంలో నాలుగు వందల మందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా చింతపల్లి: ముత్యాలమ్మతల్లి ఉత్సవాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యప్రాంతాల్లో నిఘా కెమెరాలుంటాయన్నారు. ముఖ్య కూడళ్లలో సీఐ స్థాయి అధికారితో పాటు అదనంగా బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈవ్టీజింగ్, చైన్స్నేకింగ్ తోపాటు, భక్తులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మవారి ఆలయం,సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వాహనాలు నిలుపు ప్రాంతాలు ఇవే జాతర నాలుగు రోజుల పాటు వాహనాలు రాకపోకలపై నిబంధనలు విధించినట్టు ఏఎస్పీ తెలిపారు.సాయంత్రం 5 గంటల నుంచి నాలుగు చక్రాలు వాహనాలను చింతపల్లి పట్టణంలోకి అనుమతి లేదన్నారు.ముఖ్యంగా నర్సీపట్నం రూటు నుంచి వచ్చే వాహనాలను ఏపీఆర్ కళాశాలవద్ద,కేడీపేట–జీకే వీధి నుంచి వచ్చే వాహనాలు జిల్లా పరిషత్ వద్ద,పాడేరు,జెర్రల నుంచి వచ్చేవి స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో నిలుపుదల చేసుకోవాలని సూచించారు.జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు , స్థానికులు పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వినోద్బాబు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతి చేస్తామన్నందుకు చితకబాదారు
మేడిచర్లకు చెందిన దళిత యువకుడి ఆరోపణ కె.కోటపాడు: మండలంలోని మేడిచర్ల గ్రామంలో దళిత వర్గానికి చెందిన తనపై సోమవారం గ్రామానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారని బాధితుడు యల్లపు ప్రసాద్ తెలిపారు. దాడిలో గాయపడి కె.కోటపాడు ఆసుపత్రిలో వైద్యం పొందేందుకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. కొంత కాలంగా ప్రతి ఏడాది నిర్వహించే అంబేడ్కర్ జయంతిని ఈ ఏడాది కూడా జరిపేందుకు దళితుల కాలనీకి చెందిన వారు చర్చించుకోవడం జరిగిందని, ఇది విన్న గ్రామానికి చెందిన కొందరు నాయకులు సోమవారం తన ఇంటికి వచ్చి తనను బయటకు పిలిచి ఏంటిరా నువ్వు అంబేద్కర్ జయంతిని చేసేదని అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య ఉండగానే తనపై గ్రామానికి చెందిన పూడి నారాయణమూర్తి, పూడి శేషగిరిరావు, రొంగలి కుమార్, గండేపల్లి నవీన్, పూడి అప్పలనాయుడు, బొడ్డు శ్రీనివాసరావు, పూడి రాంజీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన చేతులు వెనక్కి పట్టుకొని తనను చితకబాదారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఎ.కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
మృత్యుకుహరాలు
డుడుమ జలపాతంఅనంతగిరి మండలంలోని సరియా జలపాతంసాక్షి,పాడేరు: జిల్లాలో గెడ్డలు,జలపాతాల్లో స్నానం, ఈతకోసం దిగుతున్న స్థానికులతో పాటు,మైదాన ప్రాంత పర్యాటకులు మునిగి ప్రాణాలను విడుస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని యువత, బాలలు అధికంగా గెడ్డలు, చెరువు, జలపాతాల్లో ఈత కొట్టడంతో పాటు స్నానాలు చేస్తుంటారు. అప్రమత్తంగా లేకపోవడంతో క్షణాల్లో మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. చాలా జలపాతాల్లోను నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ వాటి వద్ద ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మత్స్యగెడ్డతో పాటు జలపాతాలు, వాగులు అధికంగా ఉన్నాయి. ‘చావు’రాయి.. డుంబ్రిగుడ మండలంలో గల చాపరాయిలోను ఈ 20ఏళ్లలో 10మంది వరకు పర్యాటకులు మృతిచెందారు.స్నానాలతో సరదాగా గడుపుతూనే దిగువ గెడ్డలోకి జారి పడి మరణించారు. ల్లాలో గెడ్డలు మృత్యుకుహరాలుగా మారాయి. సరదాగా ఈతకొట్టేందుకు, స్నానం చేసేందుకు వెళ్లిన చిన్నారులను పొట్టన పెట్టుకుని తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆదివారం పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మత్స్యగెడ్డలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇటీవల హుకుంపేట మండలం భూర్జ పంచాయతీ ములగుమ్మి జలపాతం ముగ్గురు యువతులను కబళించి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. గెడ్డలు, జలపాతాల వద్ద అప్రమత్తం గెడ్డలు, జలపాతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెదబయలు మండలంలో మత్స్యగెడ్డలో మునిగి ముగ్గురు బాలలు మృతి చెందడం బాధాకరం. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జలపాతాల్లో స్నానాలు చేయడం,సెల్ఫీలు దిగడం ప్రమాదకరం. అన్ని గెడ్డలు,జలపాతాల వద్ద ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ తగిన చర్యలు చేపడుతుంది. – అమిత్బర్దర్, ఎస్పీ జిల్లా ప్రధాన గెడ్డగా గుర్తింపు పొందిన మృత్యుగెడ్డతో పాటు పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రం మత్స్యగుండం కూడా గిరిజనుల ప్రాణాలను బలిగొంటోంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల వరకు విస్తరించిన మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో గిరిజనుల మరణాలు అఽధికంగా ఉన్నాయి.మత్స్యగెడ్డ దాటుతూ, నాటుపడవలు మునిగి, చేపల వేట చేస్తూ, స్నానాలు చేస్తూ ఇలా సుమారు 50మంది వరకు గిరిజనులు మరణించారు. వీరిలో చాలామంది మృతదేహాల జాడ కూడా తెలియలేదు. జిగాదెగుమ్మిలో 40 మంది మృతి కొయ్యూరు మండలంలోని గాదెగుమ్మి జలపాతం ఈ 20ఏళ్లలో 40 మంది వరకు పర్యాటకులు,స్థానిక గిరిజనులను కబళించింది. ఈ జలపాతంలో స్నానం చేసేందుకు దిగి ఊబిలోను,రాళ్ల మధ్య చిక్కుకుని పలువురు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఆందోళనకలిగిస్తున్నాయి. అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పర్యాటకులు అధికంగా మృతిచెందారు. జిల్లాలో ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు.ఈనెల 9వతేదీన అనంతగిరి మండలం వాలాసి ప్రాంతంలోని ములగుమ్మి జలపాతంలో స్నానం చేసేందుకు దిగిన సాలెపు త్రిష,పవిత్ర,రత్నకుమారి మృతిచెందగా,ఈనెల 11వతేదీన పెదబయలు మండలం గంపరాయి బ్రిడ్జి వద్ద అల్లంపుట్టుకు చెందిన తుర్రె సోమన్న అనే వృద్ధుడు మత్స్యగెడ్డలో మునిగి మృతిచెందాడు.ఈనెల 12వతేదీ ఆదివారం పెదబయలు మండలం లకేయిపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో 15ఏళ్ల లోపు ముగ్గురు గిరిజన విద్యార్థులు స్నానాలు చేస్తూ మునిగి చనిపోయారు.ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతిచెందడం జిల్లా వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రమాదకరంగా జలపాతాలు ప్రాణాలు తీస్తున్న స్నానం, ఈత సరదా గత ఐదు రోజుల్లో ఏడుగురి మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న ఘటనలు మృత్యుగెడ్డ -
పర్వతశ్రేణి ప్రాంతంలో కొత్త పంటల సాగుకు ప్రోత్సాహం
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో మంచి ఆదాయాన్ని ఇచ్చే కొత్త పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.వి. సత్యనారాయణ తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయపరిశోధన స్థానంలో సోమవారం జరిగిన వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల ఆధారంగా పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ వార్షిక సంవత్సరంలో గిరిజన రైతులు చేపట్టవలసిన పంటలు,వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ప్రణాళికను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎల్నినోపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మరో 15 రోజుల్లో దీని తీవ్రత స్పస్టమవుతుందని తెలిపారు. విశ్యవిద్యాలయం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఎ.వి.రమణ మాట్లాడుతూ జీవవైద్యాన్ని, భూసారాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. రసాయన,క్రిమిసంహార మందులు వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలన్నారు. రైతు సాధకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.బాబూరావు నాయుడు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మామిడి,జామ, బొప్పాయి,అరటి వంటి పంటల్లో వస్తున్న తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. 25–26 వార్షిక సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సాధించిన ఫలితాలను ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వివరించారు. ఆర్ఏఆర్ఎస్ బోర్డు మెంబర్ వండలం బాలయ్య, మాజీ బోర్డు సభ్యుడు దేముడు, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బయ్యపురెడ్డి,బాలహుస్సేన్రెడ్డి, సందీప్నాయక్ పార్వతీపురం ఏడీఏ రత్నకుమారి, చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, సీతంపేట,పాడేరు ఉద్యానవన శాఖ అధికారులు జయశ్రీ ,అనుశ్రీ పలు ఎన్జీవోల సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు సత్యనారాయణ -
ఎంఎల్ఎస్ పాయింట్లకు సకాలంలో సరుకులు
జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని మండలాల ఎంఎల్ఎస్ పాయింట్లకు నిత్యావసర సరుకులను సకాలంలో చేరవేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు,ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలతో సరుకుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే పాఠశాలలకు,గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలకు ఎలాంటి అంతరాయం లేకుండా సరుకులను చేరవేయాలన్నారు. సరుకుల నిల్వలు, పంపిణీ వ్యవస్థకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించి, సమగ్ర వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పౌరసరఫరాలశాఖ,రెవెన్యూ అధికారులు సరుకుల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని,జీసీసీ డిపోలను తనిఖీలు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపరచాలి
ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు అరకులోయటౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయ మండలంతో పాటు డుంబ్రిగుడ మండలంలో బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగు పరచాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. అరకులోయ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పానిరంగిని సమీపంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెరుగైన ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంటర్నెట్ సేవలు అధ్వానంగా ఉండటం వల్ల విద్యార్థుల ఆన్లైన్ చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. డుంబ్రిగుడ మండలంలోని కమలబంధ, కరకవలస, కొట్రగొంది, చమండపాడు, కిరికివలస, మొర్రిగుడ, నువ్వగుడ, గొందివలస, టిక్కిలిబెడ్డ పరిసరాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్నప్పటికీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో డిజిటల్ సేవలు, ఆన్లైన్ లావాదేవీలు, విద్య ,ఆరోగ్య సేవల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా బీఎస్ఎన్ఎల్ ఉన్నాతాధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రవిబాబు డిమాండ్ చేశారు. -
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
మునగపాక: మునగపాక శివారు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు మునగపాక పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మునగపాక శివారు ప్రాంతంలో పేకాడుతున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులతో పాటు వారి నుంచి రూ.35,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామమైన కొప్పాక రైల్వే బ్రిడ్జి వద్ద విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్పై సుమారుగా 45 నుంచి 55 సంవత్సరాల గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు దువ్వాడ రైల్వే జీఆర్సీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి సోమవారం చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతిచెందినట్టు భావిస్తున్నామన్నారు. మృతుడి శరీరంపై స్కైబ్లూ కలర్ ఫుల్షర్ట్, నేవీ బ్లూ కలర్ ఫ్యాంట్ ఉన్నాయన్నారు. వివరాల కోసం సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు. -
జలవనరుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం
సాక్షి, పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు,జలవనరుల వద్ద స్నానాలకు దిగిన యువతులు, విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని,ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా పర్యాటకులు, విద్యార్థులు గెడ్డల వద్దకు స్నానానికి వెళ్లే అవకాశం ఉందని, ఆ సమయంలో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కాలువలు,జలపాతాలు,చెరువులు,గెడ్డలను గుర్తించి ఈనెల 17వతేదీ లోగా పాడేరు ఐటీడీఏకు నివేదిక అందజేయాలన్నారు. సరియా, చాపరాయి, రణజిల్లెడ,కొత్తపల్లి జలపాతాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.వారాంతపు రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో రెవెన్యూ,పోలీసు,అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. మద్యం సేవించి నీటిలో స్నానానికి వెళ్లే వారిని అడ్డుకునేందుకు బ్రీత్ ఆనలైజర్ తనిఖీలు చేపట్టాలన్నారు. మండలాల్లో స్థానిక ఈతగాళ్ల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని,అరకు,అనంతగిరి ప్రాంతాల్లో అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులతో పాటు బారికేడ్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రమాదాలపై పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఒక్క మరణం సంభవించినా ఉపేక్షించేది లేదని,తమ ఆదేశాల అమలులో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కలెక్టర్ నిశాంతి ఆదేశాలు -
తారాబు... మృత్యువు తారాడు
పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీలో గల తారాబు జలపాతం ఈ ఐదేళ్లలో పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది.ఎత్తైన కొండల నుంచి ఏడాది పొడవున నీటి ప్రవాహం ఉంటుండడంతో పర్యాటకులు ఈజలపాతంలో జలకాలాడేందుకు ఉత్సహం చూపుతారు. ఈ ఐదేళ్లలో ఐదుగురు పర్యాటకులు ఈ జలపాతం వద్ద మృతిచెందారు.ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోగా కర్రల వంతెన సాయంతో జలపాతానికి వెళ్లాలి. ఈ ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది.ఈ పరిస్థితులలో ప్రమాదాలకు గురవుతున్నారు. కర్రల సాయంతో తారాబు జలపాతంకు చేరుకుంటున్న పర్యాటకులుకర్రల సాయంతో తారాబు జలపాతానికి చేరుకుంటున్న పర్యాటకులు -
ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
అచ్యుతాపురం రూరల్: ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అచ్యుతాపురం తహసీల్దార్ డి. శ్రీను హెచ్చరించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘చెరువు స్థలంపై కబ్జాదారుల కన్ను’ అనే శీర్షికపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన స్పందించారు. అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీకి ఆనుకున్న చెరువు గర్భంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ చెరువు స్థలంలో భారీ భవంతి నిర్మాణానికి తీసిన గోతులను పొక్లెయిన్తో కప్పేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం వీఆర్వో, ఆర్ఐ, సర్వేయర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలకు పాల్పడితే షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. గతంలో ఇక్కడ స్థలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి భవంతి నిర్మాణానికి పూనుకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. చెరువు గర్భం ఆక్రమణపై స్థానిక యువకులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావడం అభినందనీయమన్నారు.చెరువు స్థలం దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు -
దళితుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ కృషి
ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు సబ్బవరం: వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ వర్గాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు అన్నారు. మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విభాగం జిల్లా అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొడ్డేడ మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, ఉపాధి, గృహ, ఆరోగ్య రంగాల్లో ఎస్సీ వర్గాలకు విశేష ప్రాధాన్యత కల్పించామన్నారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయం, దాడులను పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి ఐడి బాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు, ఉత్తరాంధ్ర రీజనల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జానకిరామ్, విశాఖ జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకులు పూర్ణచంద్ర, వేచలపు ప్రకాష్, ఈర్లి సుధీర్ కుమార్ జ్ఞాన్ దీప్ పాల్గొన్నారు. -
రంగురాళ్ల క్వారీల వద్ద నిఘా
డీఎఫ్వో నరసింహారావు చింతపల్లి: డివిజన్ పరిధిలో రంగురాళ్ల క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరగుకుండా నిఘా ఏర్పాటు చేసినట్టు డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్వో)వై.నర్సింహారావు తెలిపారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా రంగురాళ్ల వ్యాపారులు తవ్వకాలకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారనే సమాచారం రావడంతో క్వారీ ప్రాంతాల్లో షిఫ్టుల వారీగా 24 గంటలూ కాపలా ఉండేలా సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. చింతపల్లి మండలంలో సత్యవరం,మేడూరు,పోతురాజుగున్నలు, జీకే వీధి మండలంలో గుర్రాలగొంది,సిగనాపల్లి క్వారీల్లో ఈ నాలుగు రోజుల పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే రంగురాళ్ల వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.ఈ క్వారీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించినట్టు డీఎఫ్వో తెలిపారు. -
పన్నెడ కన్నీరు..
పండగ పూట పన్నెడ గ్రామంలో పెను విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. మత్స్యగెడ్డ రూపంలో మృత్యువు పొంచి ఉందని తెలియని ఆ చిన్నారులు.. నీటిలో మునిగి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలల మృతితో ఆ ఊరంతా ఆవేదనలో మునిగిపోయింది.ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. ప్రమాదం జరిగిన మత్స్యగెడ్డ ప్రదేశంపెదబయలు: ఆ గ్రా మంలో అప్పటి వరకు ‘ఇటుకల పండుగ’ సందడి నెలకొంది. కానీ ఒక్క వార్త ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. మత్స్యగెడ్డ రూపంలో మృత్యువు ముగ్గురు చిన్నారులను కబళించడంతో పన్నెడ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. మృతి చెందిన ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రుల ఆక్రందనలు అరణ్య రోదనగా మారాయి. మృత్యుంజయడు కార్తీక్.. పన్నెడ గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఎండ తీవ్రత తట్టుకోలేక ఆదివారం గ్రామ సమీపంలోని సీతగుంట పంచాయతీ లకేయిపుట్టు, పెదబయలు గ్రామాల మధ్యలో మత్స్యగెడ్డ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గెడ్డలో ఈత కొడుతుండగా పాంగి నవీన్ (15) సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన కోడా కార్తీక్ (11), కోడా ప్రదీప్ (10), గొల్లోరి హర్షిత (10), పాంగి బబ్లు (10) నీటిలో మునిగిపోయారు. వీరిలో కోడా కార్తీక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కేకలు విని వచ్చిన చేపల వేటగాళ్లు కార్తీక్ను బయటకు తీసి, కడుపుపై నొక్కి ఊపిరి అందించడంతో అతడు కోలుకున్నాడు. ఎక్కువ మంది ఉండి ఉంటే మిగిలిన ముగ్గురిని కూడా కాపాడేవాళ్లం.. అని లకేయిపుట్టుకు చెందిన చేపల వేటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల్లో ప్రదీప్ గిరిజన సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి, హర్షిత, బబ్లు పన్నెడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. పొంచివున్న ఊబి ప్రమాదం మత్స్యగెడ్డలో ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, లోపల ఉన్న ఊబి ప్రాణాంతకమవుతోంది. ఏటా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు గెడ్డల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పండగ పూట ముగ్గురు చిన్నారుల బలి మత్స్యగెడ్డలో రాలిన పసి మొగ్గలు ఆటపాటల వేళ.. అనంత లోకాలకు.. మిన్నంటిన రోదనలు -
ఇష్టంతో చదివితేనే లక్ష్యాలు సాధించొచ్చు
మాకవరపాలెం: లక్ష్యసాధనకు ఇష్టంతో చదవాలని ఉత్తరప్రదేశ్ మాజీ అడిషినల్ డీజీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. తామరం ఇమ్మానుయేలు ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఆదివారం పల్లె ప్రతిభ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల విద్యార్థులు ఎందరో ఉన్నారన్నారు. కానీ వారికి తగిన సౌకర్యాలు లేక మరుగున పడుతున్నారని, అలాంటి విద్యార్థులకు చేయూత నివ్వడం కోసమే పల్లె ప్రతిభ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఐఐటీ, నీట్, జేఈఈలో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. గతనెలలో ఈ శిక్షణకు ఎంపిక చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఎంపికై న విద్యార్థుల జాబితాను వెల్లడించారు. ఈ నెల 16 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు.కార్యక్రమంలో ఇమ్మానుయేలు విద్యాసంస్థల డైరెక్టర్ జీవన్రాయ్, పోతల ప్రసాదనాయుడు, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోలుగుంట: పట్టణ విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏవిధంగానూ తీసిపోరని ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ అడిషనల్ డీజీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. రోలుగుంటలో వేద విద్యా డైరెక్టర్ పోతల ప్రసాద్నాయడు ఏర్పాటు చేసిన పల్లెల్లో ప్రగతి కేంద్రాన్ని ఆదివారం ఆయన ఐటీ కంపెనీల డైరక్టర్లతో కలసి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్యారా ఐఐటీ– నీట్కు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కోచింగ్కు సంబంధించి ఫిజిక్స్వాలా ప్రాజెక్ట్ డైరెక్టర్ జస్వంత్, మరో ప్రాజెక్టు డైరెక్టర్ మందుకు రావడం అభినందనీయం అన్నారు. టెస్టులో ప్రతిభ చూపిన విద్యార్థులను శాలువాతో సన్మానించి ప్రోత్సహించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ పి.రామకృష్ణారావు పాల్గొన్నారు. కొత్తకోటలో... రావికమతం: గ్రామీణ ప్రాంత పేద విద్యార్దులకు ఉచితంగా ఐఐటి–నీట్ వంటి పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు సమర్పణ సంస్థ ఆధ్వర్యంలో వేద సంస్థ సహాయంతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐజీ కిల్లాడ సత్యనారాయణ, వేద సంస్థ అధినేత పోతల ప్రసాద్ నాయుడు తెలిపారు. కొత్తకోట సెయింట్ మెరీస్ స్కూల్లో ఆదివారం ఐఐటీ–నీట్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. మెదటి విడతగా రావికమతం,రోలుగుంట,మాకవరపాలెం మండలాల్లో పల్లె ప్రతిభ కేంద్రాల పేరిట ఈ శిక్షణ కేంద్రాలు ప్రారంభించామన్నారు. తమ సంస్థల ద్వారా 7,8,9 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. కొత్తకోట,దొండపూడి,తదితర పాఠశాలల్లో చదువుతున్న సుమారు 663 మంది విద్యార్థులు కొత్తకోట సెయింట్ మేరీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పరీక్షలు రాశారని, మొదటి విడతగా 25 మందిని ర్యాంకుల ద్వారా ఎంపిక చేస్తామని,వారికి మూడు వేల రూపాయలు విలువైన బుక్స్ అందజేసి, శిక్షణ అందిస్తామని తెలిపారు. -
69 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టుకొయ్యూరు: మండలంలోని చీడిపాలెం జంక్షన్ వద్ద రూ. 34.8 లక్షల విలువైన 69.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ కిషోర్ వర్మ చీడిపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బూదరాళ్ల వైపు నుంచి వస్తున్న ఒక ఆటోను పోలీసులు ఆపారు. పోలీసులను చూసి ఆటోలోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారయ్యారు.ఆటోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో 12 ప్యాకెట్లలో దాచిన 69.6 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి సామర్లకోటకు, అక్కడి నుంచి చైన్నెకి తరలించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అరెస్ట్ అయిన వారిని ఒడిశా ప్రాంతానికి చెందిన తాలే కోటిబాబు, పడియేమి బచేల్గా గుర్తించారు. వీరి నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. -
జోలాపుట్టు నుంచి నీటి విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు జలాశయం నుంచి కొద్దిరోజులుగా ప్రాజెక్ట్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు జోలాపుట్టు నుంచి నీటి విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులు కాగా గురువారం ఉదయానికి 2721.50 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజుకు 2736 అడుగుల నీరు ఉండేందని, గత ఏడాది కన్నా ప్రస్తుతం 15 అడుగులు నీరు తక్కువగా ఉందని జలాశయ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా జోలాపుట్టు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయ నీటి సామర్థ్యం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2584 అడుగులుగా నీటి మట్టంగా నమోదు అయింది.మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 1,2,3,4,5,6 నంబరర్ల జనరేటర్ల సాయంతో 120 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. -
ఫైనాన్స్ వ్యాపారి అనుమానాస్పద మృతి
యలమంచిలి రూరల్: పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రాయి దుర్గా నాగ వెంకట సతీష్(42) ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక మామిడి అపార్ట్మెంట్లో 303వ నంబరు ఫ్లాట్లో ఓ మహిళ వద్దకు తరచుగా వచ్చి వెళ్తున్న సతీష్ మృతిపై అనుమానం ఉన్నట్టు అతని భార్య రాయి భార్గవి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు.దర్యాప్తులో భాగంగా యలమంచిలి సీఐ ధనుంజయరావు,పట్టణ ఎస్ఐ సావిత్రి,సిబ్బంది సతీష్ మృతి చెందిన ఫ్లాట్కు వెళ్లి పరిశీలించారు.క్లూస్ టీం బృందం సభ్యులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.సతీష్ ఇటీవల పచ్చకామెర్ల బారిన పడి చికిత్స తీసుకున్నట్టు,బాగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న సతీష్ భార్య, కుటుంబసభ్యులు మామిడి అపార్టుమెంటుకు వెళ్లేసరికి హాలులో అపస్మారక స్థితిలో సతీష్ పడి ఉన్నట్టు గుర్తించారు. సతీష్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక మరణానికి ఇతర కారణాలున్నాయా అన్నది తేలవలసి ఉంది. శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. -
సమన్వయంతో సమస్యల పరిష్కారం
కలెక్టర్ నిశాంతి ఆదేశంపాడేరు: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇంచార్జ్ డీఆర్వో నీలకంఠేశ్వరరావు, ఇంచార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులకు కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి గ్రీవెన్స్ డేలో ఎంపీడీవో, తహసీల్దార్, ఇంజనీరింగ్ విభాగాలు, అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని సూచించారు. గ్రీవెన్స్ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందో లేదో జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే సంబంధిత శాఖల లాగిన్లలో రిజిస్ట్రేషన్ చేసి, గడువులోపు పరిష్కరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
పిడుగుల పగ
భూతాపం పెరగడంతో జిల్లాలో వాతావరణం సెగలు రేపుతోంది. ఎండల తీవ్రతకు తోడు ఒక్కసారిగా కమ్ముకొస్తున్న మేఘాలు మన్యం వాసులపై పిడుగులై విరుచుకుపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజూ వస్తున్న హెచ్చరికలు, సూర్యుని ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడితో పడుతున్న పిడుగులు జిల్లాలో ప్రాణ,ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఈ పిడుగులు ఎందుకుపడుతున్నాయి? ఏజెన్సీ ప్రాంతాల్లోనే వీటి ముప్పు ఎందుకు ఎక్కువ? చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం నిపుణుల విశ్లేషణ మీకోసం.. భూతాపం సెగ..కొయ్యూరు : భూగోళం వేడెక్కుతున్న (గ్లోబల్ వార్మింగ్) ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగుల తీవ్రత పెరుగుతోంది. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉండటం వల్ల, మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పిడుగులు పడే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మేఘాల ఘర్షణ.. 30 వేల డిగ్రీల సెల్సియస్ వేడి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆకాశంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ మేఘాల్లోని నెగటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్, భూమిపై ఎత్తుగా ఉండే కొండలు, చెట్లపై ఉండే పాజిటివ్ ఛార్జ్ను ఆకర్షిస్తుంది. ఈ ప్రక్రియలో పిడుగు పడినప్పుడు వెలువడే ఉష్ణోగ్రత సుమారు 30 వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇది సూర్యుని ఉపరితలంపై ఉండే వేడి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఎత్తయిన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువ జిల్లాలోని కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు, పొడవైన చెట్లు ఎక్కువగా ఉంటాయి. పిడుగులు సహజంగానే ఎత్తయిన ప్రదేశాలను ఆకర్షిస్తాయి. ఏప్రిల్, మే మాసాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడం వల్ల పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. జూన్ నెలలో వాతావరణం చల్లబడ్డాక ఈ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాణహాని.. ఆస్తి నష్టం పిడుగు నేరుగా మనుషులపై పడితే తీవ్రమైన ఎలక్ట్రికల్ షాక్తో గుండె ఆగిపోయి తక్షణమే మరణిస్తారు. సమీపంలో పడితే మెదడు పనితీరు మందగించడం, నరాలు బలహీనపడటం వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. కేవలం మనుషులకే కాకుండా, అడవుల్లో మేతకు వెళ్లే పశువులు, మేకలు, గొర్రెలు కూడా భారీ సంఖ్యలో మరణిస్తుండటంతో గిరిజన రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ స్తంభాలపై పిడుగు పడినప్పుడు ఇళ్లలోని టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయి. ఇటీవల (మార్చి 30) జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ భీమలోయ గ్రామానికి చెందిన గమ్మెల భాస్కరరావు పిడుగుపాటుకు మృతి చెందాడు. జీవాలు కూడా మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. మెరుపు కనిపిస్తే.. అప్రమత్తం కావాల్సిందే! మెరుపు, ఉరుము ఒకేసారి సంభవించినప్పటికీ, కాంతి వేగం (సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు) శబ్ద వేగం కంటే ఎక్కువ కావడం వల్ల మెరుపు ముందు కనిపిస్తుంది. మెరుపు కనిపించిన వెంటనే ఉరుము వినిపించే లోపు సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం ఉత్తమమని అధికారులు హెచ్చరిస్తున్నారు.విపత్తు నిర్వహణ సంస్థ మొబైల్ ఫోన్లకు పంపే అలర్ట్ మెసేజ్లను చూసి వెంటనే అప్రమత్తం కావాలి. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పక్కా భవనాల్లోకి వెళ్లాలి. ఉరుములు మొదలైనప్పుడు టీవీలు, రిఫ్రిజిరేటర్ల ప్లగ్లను సాకెట్ల నుంచి తొలగించడం మంచిదని వారు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులే కారణం భూ తాపం పెరగడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. మేఘాల్లో ఛార్జ్ అయిన నెగిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్, భూమిపై ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే చెట్లు, భవనాలపై ఉండే పాజిటివ్ ఛార్జ్ను ఆకర్షించడం వల్లే పిడుగులు పడతాయి. ఏప్రిల్, మే నెలల్లో అప్రమత్తత చాలా అవసరం. – ఎల్. అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన స్థానం సెగలు కక్కుతున్న మన్యం హడలెత్తిస్తున్న ఉరుములు, మెరుపులు ప్రాణ, ఆస్తినష్టంపై ప్రభావం అప్రమత్తతే ముఖ్యమంటున్న ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్లైన్లో గుర్తు తెలియని రైలు ఢీకొని ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్టు తుని ప్రభుత్వ రైల్వే పీఎస్ ఎస్ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన నుజ్జునుజ్జైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానిక రైల్వే సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు పురుషుని మృతదేహంగా నిర్థారించారు. పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, చామనఛాయ రంగులో ఉన్న మృతుడు నలుపు రంగు జీన్ ప్యాంటు,పసుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా,గోధుమ రంగు చెప్పులు ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడుకు రెండు తాళం చెవులున్నాయని రైల్వే ఎస్ఐ తెలిపారు.మృతుని చిరునామా,ఇతర వివరాలు ప్రమాద స్థలంలో లభించలేదని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ నెంబర్ 9247585731కు సంప్రదించవచ్చు. -
రహదారి కష్టాలకు మోక్షం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని రామాలయం కాలనీ వాసుల దశాబ్దాల కల నెరవేరింది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన రహదారి లేక ఇక్కడి 40 కుటుంబాలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సమస్యతోనే సహవాసం చేస్తూ వచ్చారు. స్థానిక జెడ్పీటీసీ, విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కాలనీ వాసుల సమస్యను గుర్తించి తక్షణమే స్పందించారు. జెడ్పీ నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయించి, శరవేగంగా 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత మూడు రోజులుగా జరిగిన పనులు ఆదివారంతో పూర్తయ్యాయి. వర్షాకాలంలో వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలిపివేసి, కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేదని కాలనీ వాసులు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పూర్తి కావడంతో రాకపోకల సమస్య తీరిందని, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
గిరి రైతుకు భరోసా ఇచ్చేలా..
చింతపల్లి: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహామండలి సమావేశం జరగనుంది. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37 గిరిజన మండలాల పరిధిలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్య ఉదేశాలివీ.. మేలైన వంగడాల గుర్తింపు: గిరిజన ప్రాంత రైతులు పండిస్తున్న పంట రకాలు, వారు సాధిస్తున్న దిగుబడులపై చర్చించి, భవిష్యత్తులో సాగు చేయవలసిన మేలైన వంగడాలను సూచించడం. సాంకేతికత అభివృద్ధి: చింతపల్లి, సీతంపేట పరిశోధనా స్థానాల ద్వారా గిరిజన పర్వత శ్రేణులకు అనువైన సాగు పద్ధతులను, పరివాహక ఆధారిత సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం. శిక్షణ కార్యక్రమాలు: రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం. సాగుపై శాస్త్రవేత్తల సూచనలు: పర్వత శ్రేణి ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే వరి, చిరుధాన్యాలు (మిల్లెట్స్), నూనెగింజల సాగుపై రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కింది అంశాలపై చర్చిస్తారు. నూతన పంటల సరళి: వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త పంటలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు. ఎల్–నినో ప్రభావం: ఈ ఏడాది పంటలపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, వరి, అపరాలు, చెరుకు, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్తలు వివరించనున్నారు. విస్తరణ సేవలు.. పాడేరు, రస్తకుంటుబాయి ఏరువాక కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతికతను రైతుల ముంగిటకు చేరవేసి, అధిక దిగుబడులు సాధించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ అవకాశాన్ని గిరిజన రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.ప్రకృతి సవాళ్లను ఎదుర్కొని.. సాగులో విజయం సాధించడమే లక్ష్యంగా చింతపల్లి వేదికగా కీలక అడుగు పడనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రభావం మన్యం వ్యవసాయంపై పడకుండా ఉండేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త సాగు వ్యూహాలను సిద్ధం చేశారు. తక్కువ నీరు, తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై రైతులకు దిశానిర్దేశం చేస్తూ.. గిరిజన రైతాంగానికి అండగా నిలిచేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సిద్ధమైంది. చింతపల్లిలో నేడు వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ఎల్నినో సవాలును తట్టుకునేలాసరికొత్త సాగుకు వ్యూహం నూతన వంగడాలపై అవగాహన రైతులకు దిశానిర్దేశం చేయనున్నఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు వ్యవసాయానికి అండగా ఆర్ఏఆర్ఎస్ ఎల్నినో ప్రభావంపై దిశానిర్దేశం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించనున్న జెడ్ఆర్ఈఏసీ సమావేశంలో ఈసారి ప్రధానంగా ఎల్నినో ప్రభావంపై చర్చించబోతున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడనున్న ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా, రాబోయే కాలంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, రైతులు తక్కువ నీటితో, తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధించే పంటల వైపు మొగ్గు చూపాలి. ముఖ్యంగా వరి, వేరుశెనగ, వలిశెలు, రాజ్మా వంటి పంటలలో మేలైన సాగు పద్ధతులు, మా పరిశోధనా ఫలితాలను ఈ సమావేశం ద్వారా రైతులకు వివరించనున్నాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఈ వేదిక ద్వారా దిశానిర్దేశం చేయనున్నాం. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, ఆర్ఏఆర్ఎస్, చింతపల్లి -
చందనోత్సవానికి సింహగిరి సిద్ధం
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత ముఖ్యమైన చందనోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తక్కువ నడకతో సులభతర దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈసారి సామాన్య భక్తులు గతంలో వలె 6 కిలోమీటర్లు కాకుండా, కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే నడిచేలా మార్గాలను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా రూ. 300, రూ. 1000, రూ. 1500 టిక్కెట్ల భక్తులకు కూడా నడక దూరాన్ని తగ్గించినట్టు ఈవో జల్లేపల్లి వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం సింహాచలం పరిపాలనా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. టికెట్లు ..దర్శన వేళలు: దర్శనం టికెట్లను 70 శాతం ఆన్లైన్ ద్వారా, 30 శాతం ఎంపిక చేసిన యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ శాఖల ద్వారా విక్రయిస్తున్నారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక మార్గాల్లోనే టిక్కెట్లు పొందాలని ఈవో వెంకటరావు సూచించారు. టికెట్లపై కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం వస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుంది. 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు వంశపారపర్య ధర్మకర్త తొలి దర్శనం తర్వాత, ప్రభుత్వం, టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పిస్తారని ఈవో తెలిపారు.అనంతరం ఉదయం 4 గంటల నుంచి వీవీఐపీలకు, ఆ తర్వాత సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. రవాణా– పార్కింగ్ సదుపాయాలు భక్తుల తరలింపు కోసం 70 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఈసారి కొండపైకి ప్రైవేటు ఏసీ బస్సులను అనుమతించడం లేదు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కొండ దిగువన 5 పికప్ పాయింట్లు, 32 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోశాల నుంచి శ్రీనివాస కల్యాణ మండపం వరకు ఉచిత షటిల్ బస్సులు నడపనున్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండే కొండపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని ఈవో వెంకటరావు తెలిపారు. భక్తుల సౌకర్యాలు– భద్రత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 4 లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష బిస్కెట్ ప్యాకెట్లు, పంపిణీ చేయనున్నారు. చిన్న పిల్లల కోసం గోరువెచ్చని పాలను అందుబాటులో ఉంచుతున్నారు. పారిశుధ్యం కోసం జీవీఎంసీ సహకారంతో భారీగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీస్ నిఘా పటిష్టంగా ఉంటుంది. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన రూట్ మ్యాప్ను ప్రవేశపెట్టారు. ప్రసాదం..ఇతర సేవలు దర్శనం ముగించుకున్న భక్తుల కోసం లక్షన్నర చిన్న లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కొండ దిగువన అదనంగా మరో లక్ష లడ్డూలను విక్రయానికి ఉంచుతామని ఈవో వెంకటరావు పేర్కొన్నారు. పిఠాపురానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని, ప్రతి పార్కింగ్ వద్ద చెప్పులు భద్రపరుచుకునే ఉచిత సౌకర్యం ఉంటుందని ఈవో స్పష్టం చేశారు. 70 శాతం టికెట్లు ఆన్లైన్లోనే.. -
రూ.17.45 లక్షల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ ద్వారా గంజాయి అక్రమ రవాణా ప్రయత్నించిన ఇద్దరు మహిళలను ఆర్పీఎఫ్, ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించిన వివరాలివి. శనివారం రాత్రి రైల్వే భద్రతా దళం, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో సభ్యులు స్టేషన్లోని 8వ నంబర్ ప్లాట్ఫాం వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదు సంచులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను గమనించి వారిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వెంటనే ఎన్సీబీ ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. అధికారులు వారిని లోతుగా విచారించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమబుద్ధ నగర్కు చెందిన అమిత హల్దర్, నిభా హల్దర్లుగా గుర్తించారు. ఒడిశాలోని కోరాపుట్ నుంచి ఆగ్రాకు గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.17.45 లక్షల విలువైన 34.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ, ఎస్ఐ పి.కె.రౌల్, ఎన్సీబీ(సీపీడీఎస్) బృంద సభ్యులు పాల్గొన్నారు. యూపీకి చెందిన ఇద్దరు మహిళల అరెస్ట్ -
పోలీసు వార్షిక క్రీడోత్సవాలకు శ్రీకారం
అల్లిపురం: సిటీ పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హాజరై శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఫిట్నెస్ను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ వార్షిక స్పోర్ట్స్ మీట్ ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతుంది. ఈ పోటీల్లో వెస్ట్, సౌత్, నార్త్, హార్బర్, ఈస్ట్, ద్వారకా సబ్–డివిజన్లు, ట్రాఫిక్ డివిజన్, స్పెషల్ వింగ్ టీమ్ (స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్, వుమెన్ పోలీస్ స్టేషన్, సీసీఆర్బీ), క్రైమ్ సబ్–డివిజన్, సిటీ ఆర్ముడ్ రిజర్వ్ తదితర మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. కార్యక్రమం ప్రారంభంలో కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పురుషుల 800 మీటర్ల పరుగు పోటీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో డీసీపీ–1 (లా అండ్ ఆర్డర్), డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్), డీసీపీ (క్రైమ్స్), ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల రక్తదానం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ శనివారం నిర్వహించిన ఈ శిబిరాన్ని కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ పి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రక్తదానం చేసిన మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులను వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు.నాగరాజు,సూర్యారావు,తమర్భ ప్రసాదనాయుడు,రవి,శ్రీనివాస్,జయలక్ష్మి,పూర్ణ పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
పాడేరు రూరల్: పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం, పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్రావు విమర్శించారు. శనివారం పాడేరు మేజర్ పంచాయతీ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కార్మికులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలను సందర్శించి, వారిని వేధిస్తున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అవసరమైన పరికరాలు కూడా అందించకుండా పంచాయతీ పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎండనక, వాననక ఎంతో కష్టపడి వీధులను శుభ్రం చేస్తూ, చెత్తను తొలగిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించి, వారి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టెండర్ విధానాన్ని రద్దు చేసి 132, 142 జీవోలను అమలు చేయాలని కోరారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ. 21 వేల వేతనం చెల్లించాలని సుందర్రావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై సీఐటీయూ నేత సుందర్రావు విమర్శ -
ఏయూ ఆచార్యులకు ఆహ్వానం
ఢిల్లీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీరికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో వర్సిటీ తరపున ఎంపికై న ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య వి.సిద్ధయ్య, ఆచార్య కె.రమేష్ బాబు, ఆచార్య ఆర్.మధుసూదన్, డాక్టర్ పి.వెంకట్రావులను అభినందించారు. వీరు ఏయూ ప్రతినిధులుగా ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు...
ఎస్.రాయవరం: పెనుగొల్లు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఎస్.రాయవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాకకు చెందిన పి.సుజాత(37) భర్త గణేష్, కుమార్తెతో కలిసి బైక్పై ఉపమాక వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెనుగొల్లు జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సుజాత లారీ టైరు కింద పడడంతో అక్కడిక్కడే మృతిచెందింది. గణేష్, కుమార్తె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
15వ అంతస్తు నుంచి జారిపడి యువకుడి మృతి
గాజువాక: స్థానిక సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోని ఒక భవనం 15వ అంతస్తు నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లికి చెందిన వంతల పూర్ణనాగ తేజ (33) హైదరాబాద్లో అమెజాన్ సంస్థలో పని చేస్తున్నాడు. చింతపల్లిలో పండగకు రావాలని అతడి తండ్రి పిలవడంతో స్నేహితులతో కలిసి శుక్రవారం వందే భారత్ రైలులో విశాఖపట్నం వచ్చాడు. రాత్రి పొద్దుపోవడంతో గాజువాకలోని సెలెస్ట్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న తన సోదరుడు ఆదిత్య ఫ్లాట్కి వచ్చాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. అయితే, గ్రిల్స్ లేని కిటికీలో నుంచి కిందకి చూస్తూ పడిపోయినట్టు అతడి సహచరులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. నాగతేజ తన భార్యతో కలిసి ఇక్కడికి రావాల్సి ఉందని, ఆమెకు సెలవు లభించకపోవడంతో స్నేహితులతో కలిసి వచ్చాడని పోలీసులు తెలిపారు. కేసును ఎస్ఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
గిరి ప్రజల సేవలో నవ దంపతులు
జేసీగా తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా ఆదిత్యవర్మ బాధ్యతల స్వీకరణ సాక్షి.పాడేరు: జాయింట్ కలెక్టర్గా తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా ఆదిత్యవర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్రీపూజ, ఆదిత్యవర్మ గత నెలలో ఢిల్లీలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుమణి శ్రీపూజ పాడేరు ఐటీడీఏ పీవోతో పాటు ఇన్చార్జి జేసీగా పనిచేస్తున్నారు. ఆమెను ప్రభుత్వం పాడేరు జేసీగా పదోన్నతిపై ఇటీవల నియమించింది. అస్సాంలో పనిచేస్తున్న ఆదిత్యవర్మ ఆ రాష్ట్రం నుంచి రిలీవ్ అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పాడేరు ఐటీడీఏ పీవోగా నియమించింది. మోదకొండమ్మతల్లికి పూజలు ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ దంపతులు శనివారం పాడేరు మోదకొండమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. మోదకొండమ్మతల్లి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి: జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె జేసీగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీఆర్వో నీలకంఠరావుతో పాటు పలు శాఖల అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పీవోగా ఇన్చార్జి జేసీగా పనిచేసిన అనుభవంతో జేసీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గిరిజనాభివృద్ధికి కృషి: ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం గొప్పవరమని, అందరి సహకారంతో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ తెలిపారు. ఐటీడీఏ పీవోగా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏవో హేమలత, అన్ని విభాగాల అధికారులు పీవోకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్య,వైద్యం లక్ష్యంగా పనిచేస్తానన్నారు.గిరిజన యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల మెరుగుకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పీవో పేర్కొన్నారు.జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆదిత్యవర్మ -
సెజ్ నిర్వాసిత పునరావాస కాలనీల్లో కార్డెన్ సెర్చ్
అచ్యుతాపురం రూరల్ : ప్రత్యేక ఆర్థిక మండలి పునరావాస కాలనీలో పరవాడ డీఎస్పీ బి.మోహన్రావు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయి ఇళ్లను సోదా చేసి, వాహనాలను తనిఖీ చేశారు. విద్యా సంస్థలకు సమీపంలోని షాపుల్లో విక్రయిస్తున్న గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 16 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కార్డెన్ సెర్చ్లో అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, యలమంచిలి సీఐ ధనుంజయ రావు, ఎస్ఐలు సుధాకరరావు, వెంకటరావు, రామకృష్ణ, మహాలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలో వృద్ధుడి మృతదేహం లభ్యం
పెదబయలు: మండలంలోని గంపరాయిపంచాయతీ, అల్లంపుట్టు గ్రామానికి చెందిన తుర్రె సోమన్న (68) మృతదేహం స్థానిక మత్స్యగెడ్డలో లభ్యమైనట్లు ఎస్ఐ టి. వెంకటేష్ తెలిపారు. పోలీసులు, మృతుడి కుమార్తె బాలమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో సోమన్న గంపరాయి పంచాయతీ కేంద్రానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రమైనా ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా గాలిస్తున్న క్రమంలో, శనివారం మధ్యాహ్నం గంపరాయి వంతెన సమీపంలోని మత్స్యగెడ్డలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె బాలమ్మి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి స్వగ్రామం పెదకోడాపల్లి పంచాయతీలోని కుసుమగరువు కాగా, 20 ఏళ్ల క్రితం భార్య మృతి చెందడంతో అల్లంపుట్టులో కుమార్తె వద్దే ఉంటున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి గెడ్డలో పడి మునిగిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తండ్రి మరణంతో కుమార్తె కన్నీటి పర్యంతమయ్యింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
గాయపడిన యువకుడు నాగులపల్లి వెంకట మణికుమార్ రావికమతం: మండల కేంద్రం రావికమతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం గ్రామం చందక వీధికి చెందిన నాగులపల్లి వెంకట మణికుమార్ (19) కొమిర గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం చోడవరానికి స్కూటీపై వెళుతుండగా గుమ్మాలపాడు దాటిన తరువాత పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మణికుమార్ గాయపడ్డాడు. గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. -
నిందితులకు శిక్ష పడటంలో పీపీలదే కీలక పాత్ర
బీచ్రోడ్డు: వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక అన్యాయాలను సమూలంగా నిర్మూలించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సామర్థ్య పెంపుదల వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. పోలీసు శాఖ చార్జిషీటు దాఖలు చేసిన దశ నుంచే ప్రాసిక్యూటర్లు చురుకై న పాత్ర పోషిస్తేనే నిందితులకు కఠిన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా కన్విక్షన్ రేటు పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్ ట్రేస్లో భాగంగా 900 మంది పిల్లలను, వివిధ దేశాల్లో చిక్కుకున్న మరో 180 మందిని రక్షించామని తెలిపారు. ఇదే దృఢసంకల్పంతో పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. దర్యాప్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, దీనిపై పోలీసు శాఖలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ.30,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి విచారణ ముగిసే వరకు బాధితుల హక్కులను కాపాడటంలో పోలీసులు, ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు, బాధితుల పునరావాసంపై మానవీయ దృక్పథంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను మంత్రి అనిత సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, ఐజేఎం స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ క్లెమెంట్ డేవిడ్, వివిధ జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వర్క్షాప్లో మంత్రి వంగలపూడి అనిత -
ముత్యాలమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు
● 400 మంది పోలీసులతో పహారా ● చింతపల్లి సీఐ వినోద్బాబు చింతపల్లి: స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ వినోద్బాబు తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లాలో పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల తర్వాత అంతటి స్థాయిలో జరిగే ముత్యాలమ్మ జాతరకు సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాతర సమయంలో చింతపల్లి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. భక్తుల వాహనాల కోసం అంతర్ల, ఏపీఆర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పార్కింగ్ స్థలాలుగా కేటాయించామని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులతో సమన్వయం కావాలని కోరారు. కమిటీ సూచనల మేరకు అవసరమైన అన్ని ప్రాంతాలలో సిబ్బందిని మోహరిస్తామన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి ముత్యాలమ్మ ఆలయం, స్టేజీల ఏర్పాటు, అమ్మవారి సతకం పట్టు, గరగలు తీసే ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయరావు, పోతురాజు బాలయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బేతాళుడు, ఎస్ఐలు వీరబాబు, వెంకటరమణ, కమిటీ సభ్యులు వీరేంద్ర, రమణ, శ్రీను, దారబాబు తదితరులు పాల్గొన్నారు. -
దాడిలో ఇద్దరికి గాయాలు
రావికమతం: భార్య బంధువులపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు.దీనిపై కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రావికమతం మండలం దొండపూడి ఎస్సీ కాలనీలో దండా బికేష్, అతని భార్య తరుచూ గొడవలు పడుతుండటంతో బికేష్ అత్త సురారపు ఈశ్వరమ్మ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఇద్దరికీ సర్దిచెప్పారు. అయితేభార్యకు మద్దతుగా వచ్చిన బంధువులు దండా దేవుడు,దేముడుమ్మపై బికేష్ అతని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి దాడి చేసి గాయపరిచారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
రాజకీయ కక్షతోనే అమర్పై కేసులు
నక్కపల్లి : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ మంజూరు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్పై గత తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసులు బనాయించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. శ శనివారం ఆయన చందనాడలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తీసుకు రావాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అమర్ ఉత్తరాంధ్ర ప్రజల తరపున పోరాటం చేసారన్నారు. వెనుకబడిన ఉత్తరాంద్రకు న్యాయం చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆందోళన చేసిన అమర్పై అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కక్షసాదింపుచర్యలకు పాల్పడిందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన అమర్పై అక్రమ కేసులు బనాయించి దీక్షను భగ్నం చేయించిందన్నారు. ఉత్తరాంధ్రపై టీడీపీ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. రైల్వేజోన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో ఆందోళన చేసారన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైల్వే జోన్ సాధించకపోగా జోన్ సాధన కోసం పోరాటం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలు శిక్షపడేలా చేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసే పోరాటాలను రాజకీయ కోణంలో చూసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు వివపడకుండా నొక్కేయాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. తమను వ్యతిరేకించిన వారిని కేసులు పెట్టి వేధించడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ విధానం మార్చుకోవాలన్నారు. కోర్టులంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి గౌరవం ఉందన్నారు. తీర్పును శిరసావహిస్తామని న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, వైస్ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు కొప్పిశెట్టి హరిబాబు, చీడిక రిజర్వాయర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు కరణం ఈశ్వరరావు, పార్టీ కార్యదర్శి సాదిరెడ్డి శ్రీను, మాజీ సర్పంచ్ తళ్ల భార్గవ్, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మైలపల్లి సూరిబాబు ఉన్నారు. -
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు
వ్యానులో రవాణా అవుతున్న ఎద్దులు కోటవురట్ల: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి.. చౌడువాడ సమీపంలో పోలీసులు శనివారం వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో వ్యానులో పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వీటిని పాడేరు నుంచి తుని మార్కెట్కు తరలిస్తున్నట్టు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న వ్యానులో 11 పశువులను తరలిస్తుండడంతో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
కలెక్టరు సారూ.. ఇదేం తీరు!
సాక్షి, పార్వతీపురం మన్యం : ‘కలెక్టరు గారూ.. మీ దగ్గర నుంచి సమాధానం ఆశించడం లేదు. ఐయామ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వర్క్ ఫ్రం యు సార్! ఇన్కేస్ నా వర్క్స్ కన్సిడర్ చేయకపోతే మీ మీద ప్రివిలైజ్ మోషన్ స్పీకర్కు ఇవ్వడానికి కూడా వెనుకాడను.’ ‘కలెక్టర్ గారూ, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నన్ను వేరే విధంగా చూపించకండి. మీకు, నాకు పర్సనల్గా ఎటువంటి ఇష్యూలు లేవు. మీ చదువు మీ ఉద్యోగాన్ని నేను గౌరవిస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను.. నాకు ఓటేసిన ప్రజల డెవలప్మెంట్ మాత్రమే ఆశిస్తున్నాను. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పాలి. ఎంపీగా నేను వారి కోసం ఏదైనా చేయాలి.’ అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజరాణి ఇటీవల విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. సమావేశం సాక్షిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తీరును ఎత్తిచూపారు. తనకు ఓటేసిన ప్రజలకు సేవ చేసుకునే అవకాశానికి మోకాలడ్డుతున్నారని వాపోయారు. ఎంపీ ల్యాడ్స్ కింద కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా.. వాటితో అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓటేసిన ప్రజలకు అందరికీ తాను సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. యువ ఎంపీ.. గిరిజన బిడ్డ.. ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతో తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టి, అనతికాలంలోనే ధీటైన నాయకురాలిగా ఎదిగిన అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజూరాణి చేసిన వ్యాఖ్యలు.. రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఆవేదన వెనుక అంతులేని ‘రాజకీయ వివక్ష’ ఉంది. అభివృద్ధి కంటే కక్షపూరిత రాజకీయమే ముఖ్యమనుకునే ప్రజాప్రతినిధుల అసూయ దాగి ఉంది. ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి.. ఎంపీ ఏడు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధి. అధికార పార్టీలో ఎమ్మెల్యేకు ఇస్తున్న విలువ.. పార్లమెంట్ సభ్యురాలికి ఇవ్వకపోవడం.. జిల్లా యంత్రాంగం అందుకు వంతపాడటం బహుశా పార్వతీపురం మన్యం వంటి ప్రాంతంలోనే జరిగి ఉండొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు, మేధావులు పేర్కొంటున్నారు. ఎవరు నిధులిచ్చినా.. ప్రజల కోసమే కదా! గత ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గుమ్మ తనూజరాణి ఘన విజయం సాధించారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. గిరిజన ప్రాంత సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా గళం వినిపిస్తున్నారు. చిన్న వయసులోనే ఎంతో పరిణితి కనబరుస్తున్న ఆమైపె సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన పార్లమెంట్ పరిధిలోని ఎంపీ ల్యాడ్స్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున నిధులు ఆమె అందజేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి రూ.75 లక్షలు, పాలకొండకు రూ.75 లక్షలు, కురుపాం రూ.40 లక్షలు, సాలూరు నియోజకవర్గానికి రూ.30 లక్షలు చొప్పున 2024, సెప్టెంబర్ నుంచి ఇస్తున్నారు. స్థానిక అవసరాలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కోరిన మేరకు ఈ నిధులను సీసీ రహదారులు, కల్వర్టులు, తాగునీరు, వీధి దీపాలు, సోలార్ లైట్ల కోసం వెచ్చించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. తన పార్లమెంట్ పరిధిలోని ఏఎస్ఆర్ జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ను చక్కగా వినియోగించుకుని వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి అందులో ఒక్క రూపాయి కూడా అధికార యంత్రాంగం ఖర్చు చేయడం లేదు. పనులకు ప్రతిపాదనలే ఇవ్వడం లేదు. అందుకు కారణం ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తమవ్వడమే అన్న ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఎంపీ ల్యాడ్స్ విషయంలో 15 రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి చేసి, నెల రోజుల్లోనే గ్రౌండింగ్ అయిపోవాలి. కల్వర్టులు, రోడ్లు, లైట్లు వంటి పనులు వారం రోజుల్లోనే పూర్తిచేసేయవచ్చు. ఇవి పూర్తయితేనే కొత్తగా మరిన్ని నిధులు మంజూరు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అధికార యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు జిల్లా ప్రజలు, గిరిజన సంఘాల నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకుమోకాలడ్డేదెవరు..? ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో తాత్సారం ఎందుకు? నిధులిస్తున్నా.. ఎమ్మెల్యేలఅభ్యంతరం ఏమిటి? మన్యం జిల్లాను అభివృద్ధి చేయడం ఇష్టం లేదా? కేవలం అధికారుల వల్లే ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని అరకు ఎంపీ ఆవేదన ఆది నుంచి ఇలాగే... ఎంపీ తనూజరాణి పట్ల జిల్లా అధికార యంత్రాంగం ఆది నుంచి నిర్లక్ష్యం, వివక్షనే చూపిస్తోంది. గిరిజన ప్రాంతమైన మన్యంలో.. ఒక గిరిజన ఎంపీపై ఇటువంటి బేధాలు చూపడం పట్ల పలుమార్లు సమావేశాల్లోనే ఆమె వాపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు, సమావేశాలకు, ప్రారంభోత్సవాలకు ఎంపీగా పిలుపు ఉండడం లేదు. ఆమె వచ్చిన సందర్భాల్లో ప్రొటోకాల్ విస్మరిస్తున్నారు. ఎంపీ అధ్యక్షతన జరగాల్సిన దిశ సమావేశాల్లోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో హాజరు కాని పరిస్థితి. ఎంపీ ల్యాడ్స్ వినియోగించకపోవడంపై గత దిశ సమావేశంలోనే అందరి ముందు ఆమె కలెక్టర్ దృష్టిలో పెట్టారు. సుమారు మూడు నెలలవుతోంది. ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వారు అభ్యంతరం చెప్పడం వల్లే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివక్ష కారణంగానే, ఓటేసిన ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతో రెండు రోజుల కిందట జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్కు అంతా తెలిసే జరుగుతుందన్న అభిప్రాయం ఆమె మాటల్లో వ్యక్తమైంది. -
రెండు బైక్లు ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు
చింతపల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దగెడ్డ–చింతలూరు గ్రామాల మధ్య శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జి.మాడు గులు మండలం గెమ్మిలి పంచాయతీ సుర్లపాలెం గ్రామానికి చెందిన కిల్లో రాజేష్, మువ్వల కేశవరావు, మువ్వల గణేష్లు వ్యక్తిగత పనుల నిమిత్తం చింతపల్లి వస్తున్నారు. అదే సమయంలో జీ.మాడుగులు మండలం అరకపల్లికి చెందిన విండ్ర నాయుడు, దార ప్రసాద్, సుశీలలు చింతపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దగెడ్డ–చింతలూరు మధ్యలో వీరిద్దరి ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో వారిని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
హౌసింగ్ బకాయిలు విడుదల చేయాలని ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ, మెట్టబాధిపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న హౌసింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బిల్లుల మంజూరు కోసం డబ్బులు వసూలు చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పీఎం జన్మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు బిల్లులు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మెట్టబాధిపుట్టులో ఇళ్ల నిర్మాణం లింటల్, స్లాబ్ స్థాయికి చేరుకున్నా, గత ఐదు నెలలుగా నిధులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు అప్లోడ్ చేయడానికి హౌసింగ్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు అనేకసార్లు హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య ఆరోపించారు. సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు చంద్రయ్యతో పాటు పెద్ద సంఖ్యలో హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. -
●ప్రకృతి పరవశం.. మే ఫ్లవర్ వికాసం
వేసవి భానుడు సెగలు పుట్టిస్తున్నా, అల్లూరి జిల్లా మన్యం మాత్రం చల్లని మంచు దుప్పటిని కప్పుకుంటోంది. ఒకవైపు ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తున్న పొగమంచు ఆహ్లాదాన్ని పంచుతుంటే, మరోవైపు ముందస్తుగానే వికసించిన మే ఫ్లవర్లు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. మంచు ముసుగులో ఎర్రని పూల సోయగాలు మన్యం అందానికి మరింత వన్నె తెస్తున్నాయి. – సాక్షి, పాడేరు పాడేరు–మినుములూరు రోడ్డులో దట్టంగా కురుస్తున్న పొగమంచు వికసించిన మే ప్లవర్లు -
వడదెబ్బపై అప్రమత్తం
మహారాణిపేట: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కేజీహెచ్తో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేజీహెచ్లో ప్రత్యేకంగా 6 పడకల వార్డు సిద్ధం చేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో మందులు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచారు. పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో రెండు ప్రత్యేక పడకలు, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్లలో ఐస్ ప్యాక్లను సిద్ధం చేశారు. వడదెబ్బ లక్షణాలు గుర్తించండి ఇలా.. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు, మగత నిద్ర, కలవరింతలు లేదా ఫిట్స్ రావడం వడదెబ్బ ప్రధాన లక్షణాలు. ఇలాంటి పరిస్థితిలో రోగిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి, తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి. -
మారిటైం బోర్డు అవుట్
విశాఖపై కక్షసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మాటల్లో అమృతం.. చేతల్లో వంచన అంటే ఇదే.. విశాఖను రాష్ట్రానికి ’ఆర్థిక రాజధాని’గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం, ఆచరణలో మాత్రం ఒక్కొక్క ఇటుకను ఊడబీకుతోంది. అభివృద్ధి అంటే కొత్త సంస్థలను తీసుకురావడం అని ప్రజలు భావిస్తే.. ఉన్న కార్యాలయాలను విజయవాడ వైపు తరలించడమే తమ మార్క్ పాలన అని కూటమి సర్కార్ నిరూపిస్తోంది. సీబీఐ కోర్టు, సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనం, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం.. ఇలా వరుసగా నగరాన్ని ఖాళీ చేయిస్తూ, ఇప్పుడు ‘ఏపీ మారిటైం బోర్డు’ను కూడా మంగళగిరికి మార్చింది. విశాఖ కేంద్రంగా బోర్డు పనిచేయాల్సిందిగా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ చట్టంలో ఎలాంటి సవరణలు చేయకుండా కార్యాలయాన్ని తరలించడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. చట్టం చుట్టమైందా? సాధారణంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ ప్రధాన కార్యాలయం మార్చాలంటే చట్ట సవరణ అవసరం. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నవంబర్లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మారిటైం బోర్డు కేంద్రం విశాఖలోనే ఉంటుందని చట్టంలో స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం విశాఖలోని హెచ్బీ కాలనీలో కార్యాలయం ఏర్పాటైంది. ఉత్తరాంధ్రలో కీలకమైన మూలపేట పోర్టు పనులను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కనీసం చట్ట సవరణ కూడా చేయకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రికి రాత్రే బోర్డును మంగళగిరికి తరలించేసింది. చట్టం విశాఖ అని చెబుతున్నా.. పాలన మాత్రం మంగళగిరి నుంచే సాగిస్తామనడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వరుసగా తరలిపోతున్న కార్యాలయాలు విశాఖ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనాన్ని విజయవాడకు తరలించారు. విశాఖకు రావాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఒత్తిడి తెచ్చి మరీ విజయవాడకు మళ్లించారు. చివరికి సీబీఐ కోర్టును కూడా తరలించి విశాఖ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు వంటి దిగ్గజ సంస్థల పక్కనే ఉండాల్సిన మారిటైం బోర్డును కూడా తీసుకెళ్లిపోవడంతో విశాఖకు ’ఆర్థిక రాజధాని’ ట్యాగ్ కేవలం బోర్డులకే పరిమితమైందని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి శూన్యం.. భూములే లక్ష్యం విశాఖ నగరంపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది అభివృద్ధి కాంక్ష కాదు, భూములపై ఆశ మాత్రమేనని నగరవాసులు మండిపడుతున్నారు. విలువైన భూములను గీతం వంటి సంస్థలకు, ప్రభుత్వ అనుచరులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడటం చేతకాని ప్రభుత్వం, దానిని క్రమంగా ప్రైవేటుపరం చేస్తూ విశాఖ కీర్తిని మసకబారుస్తోంది. గత రెండేళ్లుగా నగర మౌలిక సదుపాయాల కోసం నయాపైసా కేటాయించలేదు. చివరకు రోడ్ల నిర్వహణను కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజలపై భారం వేయాలని చూస్తోంది. పోర్టుల నగరానికి దెబ్బ? విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు వంటి కీలక నౌకాశ్రయాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి మారిటైం బోర్డు కార్యాలయం పనిచేస్తే సమన్వయం సులభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా శ్రీకాకుళంలో అభివృద్ధి చెందుతున్న పోర్టు ప్రాజెక్టుల పర్యవేక్షణకూ విశాఖ అనువైన కేంద్రంగా ఉంది. అయితే ఈ అంశాలను పక్కనబెట్టి కార్యాలయాన్ని తరలించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. దోచిపెట్టడమే లక్ష్యంగా.. ఒకవైపు ప్రచార ఆర్భాటాలతో విశాఖను ’గ్లోబల్ సిటీ’ అని ఊదరగొడుతూనే, మరోవైపు నగర ప్రాభవాన్ని తగ్గించేలా సాగుతున్న ఈ ’తరలింపుల పర్వం’ చూస్తుంటే.. విశాఖకు మేలు చేయడం కాదు, నగరాన్ని కేవలం ప్రైవేటు శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పాలకుల అసలు రంగు మారిటైం బోర్డు తరలింపుతో మరోసారి బయటపడింది. ఆర్థిక రాజధాని హోదా దేవుడెరుగు.. ఉన్న ఆఫీసులను ఉంచితే చాలనే పరిస్థితికి విశాఖను దిగజార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి మంగళగిరికి మారిటైం బోర్డు తరలింపు చట్టాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నుంచి ఒక్కొక్కటిగా చెక్కేస్తున్న కీలక కార్యాలయాలు జీఎస్టీ, సీబీఐ, ఆర్బీఐ.. ఇప్పుడు మారిటైం బోర్డు వంతు అభివృద్ధి గాలికొదిలేసి.. భూముల పంపిణీపైనే సర్కార్ కన్నే.. -
రేషన్ సమస్య పరిష్కారం
కొయ్యూరు: రాజేంద్రపాలెం పంచాయతీ సోలాబులో శుక్రవారం డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేయడంతో జోగంపేట, సోలాబు గ్రామస్తుల రేషన్ కష్టాలు తీరాయి. గత కొన్ని నెలలుగా రేషన్ కోసం సోలాబు, జోగంపేట గిరిజనులు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై గతంలో కొయ్యూరు పర్యటనకు వచ్చిన ఆర్డీవోకు స్థానిక గిరిజనులు విన్నవించారు. మరోవైపు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నర్సి కృష్ణ తహసీల్దారుతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు మరియు ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సోలాబులో డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేశారు.దీనిపై వైఎస్సార్సీపీ నాయకుడు నర్సి కృష్ణ మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి డిపోను ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గిరిజనుల కష్టాలను తీర్చిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
అడ్డదారికి పోలీసుల అడ్డుకట్ట
● మూడు లారీలపై కేసులు నమోదుపోలీసులు పట్టుకున్న లారీలు నక్కపల్లి: పరిమితికి మించి లోడుతో జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తూ టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో ప్రయాణిస్తున్న మూడు లారీలకు నక్కపల్లి పోలీసులు అడ్డుకట్ట వేశారు. టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు ఉపమాక, వేంపాడు, అమలాపురం, చందనాడ, కాగిత మీదుగా జాతీయరహదారి చేరుకుని అక్కడనుంచి తునివైపు వెళుతున్న వాహనాలను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. టోల్ఫీజు ఎగ్గొట్టడం కోసం ఈ వాహనాలు అడ్డదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.ఈవాహనాల్లో చిప్స్,ఫ్లైయాష్ తదితర లోడు ఉందని ఈ మూడు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశామని అపరాధరుసుం విధించేందుకు రవాణాశాఖ అధికారులకు సిఫారసరు చేశామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
ఆంధ్రా నిర్లక్ష్యం.. ఒడిశా చొరవ
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. రవాణా కష్టాలతో అల్లాడుతున్న ఏవోబీ వాసుల కోసం జోలాపుట్టు వద్ద నూతన వంతెన నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల మళ్లింపు వంటి ఆటంకాలను దాటుకుని, ఒడిశా ప్రభుత్వ చొరవతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. పట్టాలెక్కిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంవంతెన కోసంఎన్నోసార్లు ఆందోళన జోలాపుట్టు వంతెన కోసం అనేక సార్లు ఆందోళనలు చేశాం. ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు, అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లాం. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం సరిహద్దు వంతెనకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం. వేగంగా వంతెన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయి. – వి.మణి, జోలాపుట్టు, ముంచంగిపుట్టు మండలం అవస్థలు తప్పుతాయి జోలాపుట్టు వద్ద వంతెన పనులు చకచకా జరుగుతూ ఉండడంతో చాలా ఆనందంగా ఉంది. ద్విచక్రవాహనదాలు ఐరెన్ వంతెన మీదుగా, కార్లు, ఆటోలు, జీపులు జోలాపుట్టు జలాశయం డ్యామ్ మీదుగా మూడు కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. వంతెన పూర్తి చేస్తే రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది. – పి.హరినాథ్, బిల్లాపుట్టు, ఒడిశా ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని జోలాపుట్టు వద్ద నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిహద్దులో సరైన వంతెన సౌకర్యం లేక గత కొన్ని దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం చొరవతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ. 10 కోట్లు మంజూరు చేసిన ఒడిశా.. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణంపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో, సరిహద్దు ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించిన ఒడిశా ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దీంతో గత మూడు నెలలుగా వంతెన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని వందలాది గ్రామాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. ఇబ్బందులు.. పరిమిత రాకపోకలు ప్రస్తుతం జోలాపుట్టు సరిహద్దు ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఐరన్ వంతెనపై కేవలం కాలినడకన లేదా ద్విచక్ర వాహనాలపై మాత్రమే ప్రయాణిస్తున్నారు. కార్లు, జీపులు, బొలెరో వంటి వాహనాలు పాత జలాశయం వంతెనపై నుంచి అతి కష్టం మీద వెళ్తున్నాయి. అయితే బస్సులు, లారీలు, వ్యాన్ల వంటి భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో నిత్యావసరాల రవాణాకు, అత్యవసర ప్రయాణాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల నిరీక్షణ..: నిజానికి ఈ వంతెన నిర్మాణం కోసం 2014లోనే అప్పటి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి (అరకు మాజీ ఎంపీ) కిశోర్ చంద్రదేవ్ తన ఎంపీ నిధుల నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనప్పటికీ, పునాదుల దశలోనే నిలిచిపోయాయి. కాలయాపన కారణంగా ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. తమ గోడును పట్టించుకోవాలని సరిహద్దు ప్రజలు ఏళ్ల తరబడి ఇటు ఆంధ్ర, అటు ఒడిశా ప్రభుత్వాలకు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూనే ఉన్నారు. అనేకసార్లు జోలాపుట్టు జలాశయం గేట్లు మూసివేసి ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేశారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి బంద్లు నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేస్తున్న సరిహద్దు ప్రజలు ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో ఏవోబీ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, పనులను మరింత వేగవంతం చేసి వంతెనను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఈ వంతెన పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. రూ.10 కోట్లు మంజూరు చేసిన ఒడిశా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన జోలాపుట్టు బ్రిడ్జి పనులు పదేళ్ల నిరీక్షణకు తెర.. ఏవోబీ సరిహద్దు ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం -
సీలేరు సివిల్ ఈఈగా అప్పలనాయుడు
● బాధ్యతల స్వీకరణ ● కార్మిక సంఘ నేతల అభినందనలు సీలేరు: ఏపీ జెన్కో విద్యుత్ కాంప్లెక్స్ సీలేరు సివిల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన అప్పలనాయుడును శుక్రవారం తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి విన్నపం అనంతరం అప్పర్ సీలేరు క్యాంపులో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సివిల్ సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను పరిష్కరించి సహకరించాలని కోరారు. దీనిపై ఈఈ అప్పలనాయుడు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రెసిడెంట్ రేఖ అప్పారావు, రీజనల్ ప్రెసిడెంట్ త్రినాథరావు, రీజినల్ జాయింట్ సెక్రటరీ భాస్కరరావు, రాష్ట్ర కమిటీ డిప్యూటీ సెక్రటరీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మూలగుమ్మి’ బాధితులను ఆదుకోండి
అరకులోయ టౌన్: హుకుంపేట మండలం, బూర్జ పంచాయతీ పరిధిలోని మూలగుమ్మి జలపాతంలో గురువారం జరిగిన దుర్ఘటనపై ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈత కోసం జలపాతంలో దిగి, నీటి లోతు తెలియక ముగ్గురు యువతులు (త్రిష, పవిత్ర, రత్నకుమారి) మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రవిబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి : పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కరువవ్వడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం మరి యు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఆర్థిక సహాయం అందించాలి ప్రాణాలు కోల్పోయిన యువతుల కుటుంబాలు నిరుపేదలు కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు.ఎమ్మెల్సీ కుంభా రవిబాబు -
అంతర్రాష్ట్ర రహదారిపై కూలిన భారీ వృక్షం
● దారకొండలో తప్పిన భారీ ప్రమాదం సీలేరు: గూడెంకొత్తవీధి మండలం దారకొండలో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. జనసంచారం అధికంగా ఉండే అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఎటువంటి గాలివాన లేకున్నా, మిట్టమధ్యాహ్నం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ చెట్టు ఒక్కసారిగా కూలడంతో స్థానికులు భయాందోళనకు గుర య్యారు. చెట్టు కూలుతున్న శబ్దాన్ని విన్న చుట్టుపక్కల నివాసాల వారు, బాటసారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చెట్టు పడిన ప్రాంతంలో ఇళ్లు, ప్రజలు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిలిచిపోయిన రాకపోకలు ఈ సంఘటన కారణంగా అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే, ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా, సాయంత్రం వరకు చెట్టును తొలగించేందుకు అధికారులు ఎవరూ స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పెట్రోల్ బంకుల్లో తేడాలొస్తే కఠిన చర్యలు
జీసీసీ డీజీఎం సూర్యనారాయణచింతపల్లి: పెట్రోల్ బంకుల నిర్వహణలో ఏమాత్రం తేడాలు వచ్చినా కఠిన చర్యలు తప్పవని జీసీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.సూర్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన స్థానిక జీసీసీ బ్రాంచ్ పరిధిలోని గ్యాస్ గోడౌన్ నిల్వలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జీసీసీ పెట్రోల్ బంకును సందర్శించి రికార్డులను, నిల్వలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకుల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. చింతపల్లి బంకులో ప్రతిరోజూ రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును మరుసటి రోజే బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. నిధుల జమలో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి బంకులోనూ 0.6 శాతం మేర ‘ఎవాపరేషన్’ (పెట్రోల్ ఆవిరి కావడం వల్ల వచ్చే వ్యత్యాసం) సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల పెట్రోల్, డీజిల్ నిల్వల ఎవాపరేషన్ శాతంలో మార్పులు ఉంటాయన్నారు. గూడెంకొత్తవీధి బంకులో రూ. 20 లక్షల నిధులు ఫ్రీజ్ (నిలిచిపోవడం) కావడం వల్ల కొంతకాలం బంకు మూతపడిందని, ప్రస్తుతం అక్కడ అవసరమైన నిల్వలను పంపిణీ చేసి పునరుద్ధరించామని వెల్లడించారు. బంకుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వినియోగదారుల పట్ల వినయంగా ప్రవర్తించాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే వారిని విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ వెంకటేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్ ఎస్. సుగునాథం, బంక్ ఇన్చార్జ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
చింతపల్లిలో13న వ్యవసాయసలహామండలి సమావేశం
● ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం, స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల 13న వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉన్నత పర్వత శ్రేణి పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతాలకు చెందిన రైతులతో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. గిరిజన రైతుల జీవనోపాధి పెంపుదల, వాతావరణానికి అనువైన వంగడాలు, కొత్త పంటల సరళి, మరియు సేంద్రియ వ్యవసాయ మెళకువలపై చర్చ జరుగుతుందన్నారు.ఈ ఏడాది పంటలపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరిస్తామని తెలిపారు.శాస్త్రవేత్తలు రూపొందించిన పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయడమే ఈ సమావేశ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణ యువత, మహిళలకు వృత్తిపరమైన శిక్షణతో పాటు, వ్యవసాయ విస్తరణ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి దిగుబడులు పెంచే మార్గాలను చర్చిస్తారన్నారు. పరిశోధనా సంచాలకుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వరి, మొక్కజొన్న, అపరాలు, నూనెగింజలు, చెరకు వంటి పంటల ప్రధాన శాస్త్రవేత్తలు హాజరవుతారని ఏడీఆర్ తెలిపారు. -
కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి
పాడేరు రూరల్: పంచాయతీ కార్మికులు, ఐటీడీఏ అంబులెన్స్ డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఐటీడీఏ ముఖద్వారం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమర్, జల్లి రాజుబాబు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం వారి చేత గొడ్డు చాకిరీ చేయిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారాన్ని మోయలేకపోతున్నారని తెలిపారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, స్వచ్ఛ భారత్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని నేతలు ఆరోపించారు. కార్మికుల వేతన బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని గతంలో కలెక్టర్ ఆదేశించినప్పటికీ, అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. జీవో నంబరు 680 అమలు చేయాలి కార్మిక సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం వేతనాలను రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ జారీ చేసిన జీవో నంబరు 680 ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. 108 అంబులెన్స్ డ్రైవర్ల తరహాలోనే ఐటీడీఏ అంబులెన్స్ డ్రైవర్లకు రూ. 28,500 వేతనం చెల్లించాలని, కార్మిక హక్కులు, చట్టాలను 100 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న డిమాండ్లను తక్షణమే పరిష్కరింలచాలన్నారు. లేకుంటే భవిష్యత్లో ఉద్యమం ఉధృతానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జీవన్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఏఐటీయూసీ ఆందోళన -
పిల్లల కదలికలపై నిఘా అవసరం
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● బాధిత కుటుంబానికి ఆర్థికసాయం పంపిణీ అరకులోయ టౌన్: పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచడం ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. హుకుంపేట మండలం, బూర్జ పంచాయతీ జంబవలస గ్రామ సమీపంలోని మూలగుమ్మి జలపాతంలో ఈతకు వెళ్లి మృతి చెందిన బాలికల కుటుంబాలను శుక్రవారం ఉదయం ఆయన అరకులోయ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతి చెందిన ముగ్గురు బాలికల కుటుంబాలకు తన వంతుగా రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 15 వేల నగదును అందజేశారు. అలాగే రెవెన్యూ శాఖ తరఫున బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. బాలికల మృతికి సంబంధించిన వివరాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి సెలవులకు ఇంటికి వచ్చే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి విషాద సంఘటనలు జరగకుండా ఉండాలంటే, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు వాగులు, గెడ్డల వద్దకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాము, ఎస్ఐ గోపాలరావులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గాయపడిన యువకుడి మృతి
● కూర్మన్నపాకలలో విషాదం చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం రింతాడ సమీపంలో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొర్రా కోటిబాబు (26) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కూర్మన్నపాకలు గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు గురువారం సాయంత్రం ద్విచక్రవాహనంపై గూడెంకొత్తవీధి వెళ్తుండగా, రింతాడ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పాంగి అప్పారావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రెండో యువకుడు కొర్రా కోటిబాబును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటిబాబు కూడా మరణించడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో కూర్మన్నపాకలు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. -
అల్లూరి విగ్రహ ఏర్పాట్లుపరిశీలన
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని అంబేడ్కర్ పార్కు సమీపంలో ఉన్న చెరువు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం జిల్లా వైఎస్సార్సీపీ నేత జేవీవీఎన్ మూర్తి (జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర భర్త) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెడ్పీ నిధులతో అంబేడ్కర్ పార్కు, చెరువు అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. మండల కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, చెరువును చూడముచ్చటగా తీర్చిదిద్ది, అక్కడ మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గత కొద్దిరోజులుగా పనులు చేస్తున్నామన్నారు. త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జెడ్పీ నిధుల ద్వారా మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నేతలు సన్యాసిరావు, పాపారావు, తిరుపతిరావు పాల్గొన్నారు. -
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు
పాడేరు: మహిళలపై నిస్సిగ్గుగా, సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మహిళా లోకాన్ని కించపరుస్తూ ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆ యనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్ర వారం వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ దీనబంధుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం విశ్వేశ్వరరాజు విలేకరులతో మాట్లాడారు. ఏబీఎన్లో ‘కొత్త పలుకు’ పేరుతో ప్రసారమైన కథనంలో మహిళల పట్ల అసభ్యకరంగా, చెప్పలేని రీతిలో వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు మహిళలను చులకన చేసి మాట్లాడటం దారుణమన్నారు. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని మహిళలపై అసభ్య దూషణలు, దాడులకు పాల్పడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, మా పార్టీ ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్ కుమార్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు కూడ సుబ్రమణ్యం, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణ పాత్రుడు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, సీనియర్ నేతలు కిల్లు కోటిబాబు నాయుడు, మినుముల కన్నాపాత్రుడు, మోదా బాబురావు, బూర మహేష్ పాల్గొన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేయాలని డిమాండ్ మహిళా లోకాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రమాదానికి గురైన బలోరా, ద్విచక్ర వాహనాలు, క్షతగాత్రులు చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం రింతాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గిరిజనుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కూర్మన్నపాకలు గ్రామానికి చెందిన కొర్రా కోటిబాబు, పాంగి అప్పారావు వ్యక్తిగత పనులపై గూడెంకొత్తవీధి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో రింతాడ, ముల్లుమెట్ట గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న అంబులెన్సును తప్పించబోయి ఆగిఉన్న బొలారో వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి వైద్యాధికారి చందన వైద్యసేవలు అందించారు. చికిత్స పొందుతూ పాంగి అప్పారావు (28) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కోటిబాబును మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వానొస్తే బురద.. ఎండ కాస్తే ధూళి
బుచ్చెయ్యపేట: ఎండ కాస్తే దుమ్ము, ధూళి లేచిపోయి కళ్ల మంటలతో ప్రయాణం.. వానొస్తే గోతుల్లో చేరిన వర్షం నీరు, బురదతో ఇబ్బందులు. ఇది భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో ప్రయాణికులు పడుతున్న నిత్య కష్టాలు.. బీఎన్ రోడ్డులో మరలా బురద కష్టాలు ప్రయాణికులకు ఎదురయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వాహనదారులకు కీలకమైన ప్రధాన రహదారి అభివృద్ధిపై పాలకులు, అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన బీఎన్ రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారుడు నత్తనడకన చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోతులుగా ఉన్న బీఎన్ రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు చేరి బురదమయంగా మారింది. ఎండ కాస్తే రాయి బుగ్గి లేచిపోయి వాహనదారులతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితుల వారు అవస్థలు పడుతున్నారు. ఎండలో రాకపోకలు సాగించేటప్పుడు వాహనదారుల దుమ్ము పడి కళ్ల మంటలతో తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధికి చర్యలు గత వైఎస్సార్సీపీ హయాంలోనే బీఎన్ రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అప్పటి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా బీఎన్ రోడ్డు విస్తరణకు రూ. 87 కోట్లు మంజూరు చేయించారు. ఐదేళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టిన గుత్తేదారుడు నత్తనడకన పనులు సాగిస్తున్నాడు. గోతులు వల్ల పలు ప్రమాదాలు జరిగి వాహనాలు రోడ్డు గోతుల్లో కూరుకుపోయి జేసీబీలతో లాగిన బీఎన్ రోడ్డు పనులపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. కూటమి నేతల హామీ ఏమైంది? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీఎన్ రోడ్డును బాగు చేయలేకపోయారు, రవాణా సౌకర్యం కల్పించలేకపోయారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా బీఎన్ రోడ్డును బాగు చేస్తామన్న కూటమి నేతల హామీ రెండేళ్లయినా నెరవేరలేదు. బీఎన్ రోడ్డు దుస్థితిని చూసి చోడవరం న్యాయవాదులు రోడ్డు మరమ్మతులు చేయకపోవడంపై కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు కేసుతో అధికారులు, గుత్తేదారులు నాలుగు నెలల క్రితం ప్రారంభించిన నత్తనడకన సాగిస్తున్నారు. రోలుగుంట మండలం నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు పెద్ద పెద్ద గోతులు పడి రవాణాకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానరాని కొత్త వంతెనలు విజయరామరాజుపేటలో తాచేరు, వడ్డాదిలో పెద్దేరు వంతెనలు కూలిపోగా, వీటి స్థానంలో కొత్తవి నిర్మాణ పనులు జరగలేదు. వడ్డాది, విజయరామరాజుపేటలో తాత్కలికంగా వేసిన డైవర్షన్ రోడ్లు వర్షాలు ఎక్కువైతే మరలా కొట్టుకుపోయేలా ఉన్నాయి. బీఎన్ రోడ్డులో అసంపూర్తి పనులు వల్ల వర్షాలు ఎక్కువైతే గోతుల్లో నీరు చేరి బురదలో వాహనాలు కూరుకుపోయి జేసీబీలతో లాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ఆర్అండ్బీ అధికారులు బీఎన్ రోడ్డు పనులుపై దృష్టి సారించి రవాణా కష్టాలు తీర్చాలని మూడు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. -
ఏఎంఆర్ సంస్థ అక్రమ సీనరేజ్ వసూళ్లపై ఫిర్యాదు
దేవరాపల్లి: మండలంలో ఏఎంఆర్ సంస్థ పేరిట అక్రమంగా సీనరేజ్ వసూళ్లు చేస్తున్నారని గురువారం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్లల మెట్ట క్వారీ నుంచి ఇళ్ల నిర్మాణానికి రాయిని తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల నుంచి అధిక సీనరేజ్ వసూలు చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సంస్థ పేరిట వసూళ్లు చేస్తున్న వ్యక్తుల వద్ద కనీసం గుర్తింపు కార్డు లేకపోగా, రసీదులు చూపించకపోవడంతో ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదు చేశారు. సీనరేజ్ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతున్న ఏఎంఆర్ సంస్థ దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. గ్రామాల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటే గతంలో ట్రాక్టర్ మట్టికి రూ. 200 తీసుకునే వారని, ఏఎంఆర్ సంస్థ అక్రమంగా ట్రాక్టర్ మట్టికి రూ. 800 నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తుందని ఆగ్రహించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ట్రాక్టర్లను వెంబడించి ఇష్టానుషారంగా వసూళ్లు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తక్షణమే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ట్రాక్టర్ల యజమానులు, భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో గొర్లె దేముళ్లు, నమ్మి దేముళ్లు, సిహెచ్. అప్పారావు తదితరులు ఉన్నారు. -
పదేళ్ల క్రితం పరారైన గంజాయి నిందితుడు అరెస్ట్
పట్టుబడ్డ నిందితుడుతో పోలీసులు నర్సీపట్నం: పదేళ్ల క్రితం పరారైన గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ పి.రాజారావు తెలిపారు. 2016లో రూరల్ పోలీసు స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో అల్లూరి జిల్లా, జి.కె.వీధి మండలం, జెర్రిలా గ్రామానికి చెందిన సయ్యద్ సినీబ్రహ్మషా ఆలియాస్ జెర్రిల శ్రీను(40) ఎ–2 నిందితుడిగా ఉన్నాడు. పదేళ్లుగా పరారీలో ఉన్నాడు. తమ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అదుపులోకి తీసుకుని మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ తెలిపారు. -
పంచదార్ల దళిత రైతుల వినూత్న నిరసన
నోట్లో ఆకులు పెట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం రాంబిల్లి(అచ్యుతాపురం): న్యాయం కోసం పోరాడుతున్న రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు ప్రారంభించిన దీక్ష గురువారం నాటికి 65వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బాధిత రైతులతో పాటు సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. నోట్లో ఆకులు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వేరొక గ్రామ నిర్వాసితుల కోసం తమ భూముల్ని ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయమంటూ బాధిత రైతులు వాపోయారు. తుఫాన్ పరిహారం, రైతు భరోసా పొందిన భూముల్ని బలవంతంగా లాక్కోవాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణంగా సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమునాయుడు అభివర్ణించారు. కార్యక్రమంలో గూటాల నాగఅప్పారావు, గుడబండి అప్పారావు, నాగప్పారావు, అబద్ధం, కనకరత్నం, లక్ష్మి, చిరంజీవి, రవి, అర్జున్రావు, నూకాలు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ మూల్యాంకనం పరిశీలన
సాక్షి, పాడేరు: స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ టి. నిశాంతి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు కేటాయించిన 1,07,581 జవాబు పత్రాలలో ఇప్పటివరకు 36,892 పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ ప్రక్రియను వేగంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందాలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నెట్వర్క్ సమస్యలపై సమీక్ష కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్/సెల్ టవర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. -
టి.అర్జాపురంలో ఘనంగా దుర్గమ్మ పండగ
రావికమతం : మండలంలో టి.అర్జాపురం గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ రాష్ట్ర స్పోర్ట్స్ అధారటీ (శాప్) చైర్మన్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిెడెంట్ బైరెడ్డి సిద్దార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదీప్రాజ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజాన రామునాయుడు, వైస్ ఎంపీపీ భవానీప్రసాద్, రాజాన అప్పలనాయుడు, మత్సా రామునాయుడు, యిల్లపు రాము, ఎల్లపు ఎర్రినాయుడు, మరిశా రమణ, మత్సా అర్జున్, చిరంజీవి, రమణ తదితరులు అమర్నాఽథ్కు, బైరెడ్డి సిద్దార్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ పైల రాజు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కంచిపాటి జగ్గారావు, సీనియర్ నాయకులు మహాలక్ష్మినాయడు, తలారి అదిమూర్తి, మాజీ జెడ్ప్టీసీ ఆసరి వాస్ గోవింద్, గుమ్ముడు సత్యదేవ, గుమ్మాలపాడు సర్పంచ్ బంటు సన్యాసినాయుడు, ఎంపీటీసీలు రమణబాబు, పూడి దేవా, నాయకులు గట్డ్రెడ్డి తాతబాబు, కొత్తకోట ఉప సర్పంచ్ పందల దేవా, మండల వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు చిరంజీవి, సోషల్ మీడియా ఇన్ఛార్జి వెల్లంకి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రికి పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. -
డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
అరకులోయ టౌన్: నియోజకవర్గ పరిధిలో డిజిటలైజేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, అతి త్వరగా పూర్తి చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు, సభ్యులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను, వెరిఫికేషన్ను తగు జాగ్రత్తలు పాటిస్తూ సక్రమంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఎంపిక చేసిన వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల ఫొటోలు, ఇతర పూర్తి వివరాలను సోషల్ మీడియా ప్రతినిధులకు వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డులు జారీ చేస్తారని, అలాగే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారని వెల్లడించారు. పంచాయతీ స్థాయి వివరాల సేకరణలో ఏవైనా సందేహాలు ఉంటే 9381558327, 9347094001 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ కొర్రా రామ్, అరకులోయ, డుంబ్రిగుడ యువజన విభాగం అధ్యక్షులు బోయి కిరణ్ కుమార్, కమ్మిడి విజయదశమి పాల్గొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్రతినిధులు పాంగి నర్సింగరావు, సెంబి సుందర్రావు, జన్ని అర్జున్, వంతాల నాగేశ్వరరావు, పాంగి అజయ్ తదితరులు హాజరయ్యారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
వివిధ విభాగాలకు వైఎస్సార్సీపీ నియామకాలు
నక్కపల్లి : వైఎస్సార్సీపీ నక్కపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ, సీనియర్ నాయకుడు గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నక్కపల్లి మండల నూతన కమిటీతో పాటు, పలువురిని రాష్ట్ర, జిల్లా బీసీ విభాగంలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మండల శాఖ అధ్యక్షుడిగా గొర్ల గోవిందు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా దేవవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొర్ల నర్సింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ విభాగం కార్యదర్శిగా బుచ్చిరాజుపేటకు చెందిన గొర్ల బాబూరావు, పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు లోడగల చంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కార్యదర్శిగా బొడ్డపాటి అనిల్కుమార్, వలంటీర్ల విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సుర్ల వరలక్ష్మి నియమితుల య్యారు. ఇక నక్కపల్లి పార్టీ మండల ఉపాధ్యక్షులుగా సాదిరెడ్డి శ్రీనివాస్, జుల్లూరి లక్ష్మిపతిరాజు, ప్రధాన కార్యదర్సులుగా అల్లురమణ, కొల్నాటి దుర్గాప్రసాద్, ఎరిపల్లి నాగేశు, దమ్ము అప్పారావు, కార్యదర్శులుగా గంటా తిరుపతిరావు, గొర్ల రమణ, అనపర్తి పాండు, కొవిరి కొండబాబు, పక్కుర్తి రమణ, కార్యవర్గ సభ్యులుగా కొర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి రమేష్, వీదికన్నారావు, యలమంచిలి అప్పలరాజు, యజ్జల అప్పలరాజు, మేరుగ చిన గంగరాజు, కోడ లక్ష్మణ్, కండెల్ల బాబ్జి, అల్లుబోయిన గోవిందు, మహ్మద్ హుస్సేన్, కోశెట్టి గోవిందు, కర్రి రాముడు, రావి ఈశ్వరరావు, కురందాసు నానాజీ, కురందాసు గోవిందు, దుంగల కృష్ణారావు, చుక్కల హరి, కోమర్తి చిట్టిబాబు, సఖిరెడ్డి వెంకటరమణ నియమితులయ్యారు. -
పన్నుల వసూళ్లలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం
పాడేరు రూరల్: సమిష్టి కృషితోనే పన్నుల వసూళ్లలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని డీపీవో పూర్ణచంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు గురువారం జిల్లా కార్యాలయంలో వివిధ మండలాల పీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు ఆయనను ఘనంగా సన్మానించారు.జిల్లాలోని 244 గ్రామ పంచాయతీలకు గాను 240 పంచాయతీల్లో నూరు శాతం పన్నులు వసూలయ్యాయని, ఇది ఒక రికార్డు అని డీపీవో పేర్కొన్నారు.ఈ విజయం తన ఒక్కరిది కాదని, జిల్లాలోని 3,461 ఆవాస ప్రాంతాల్లో నిరంతరం శ్రమించిన ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అందరిదని ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన సంబంధిత సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్, వివిధ మండలాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడాది దాటినా పెద్దపాడుకు ఒరిగింది శూన్యం
● ఆరు నెలల్లో గ్రామం రూపురేఖలు మార్చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ● నీటి మూటలా హామీ ● ఎగుడుదిగుడుగా రూ.కోట్లతో నిర్మించిన రోడ్డు ● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ● నిప్పులు చెరుగుతున్న గ్రామ గిరిజనులు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతంనాణ్యత పాటించలేదు రోడ్డు నాణ్యత లేకపోవడంతో భారీ వర్షం కురిస్తే కొట్టుకుపోయే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నప్పుడు కాంట్రాక్టర్ నిర్మించారు. వర్షాలు తగ్గిన తరువాత నిర్మించాలని గ్రామస్తులం ఎంత చెప్పనా వినిపించుకోలేదు. ఏమాత్రం నాణ్యత పాటించలేదు. దీనిపై అధికారులు దృష్టి సారించలేదు. – కొర్రా రూప్ప, పెద్దపాడు డుంబ్రిగుడ: సరిగ్గా ఏడాది క్రితం.. ఏప్రిల్ 7వ తేదీ. పోతంగి పంచాయతీలోని పెద్దపాడు గ్రామం జనసంద్రమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రామానికి విచ్చేసి, ఇక్కడి పీవీటీజీ గిరిజనులతో ముచ్చటించారు. ఆరు నెలల్లోనే పెద్దపాడు రూపురేఖలు మార్చేస్తాం.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’ అంటూ కొండంత ఆశలు కల్పించారు. కానీ, కాలం గిర్రున ఏడాది తిరిగినా.. అవి ఇప్పటికీ హామీలుగానే మిగిలిపోయాయి. అస్తవ్యస్తంగా తారు రోడ్డు డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా చాపరాయి జలపాతం నుంచి పెద్దపాడు వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి పీఎం జన్మన్ కింద రూ. 1.85 కోట్లు కేటాయించారు. ఏడు కల్వర్టులు నిర్మించారు. అయితే, వర్షాకాలంలో కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు చేయడంతో రోడ్డు ఎగుడుదిగుడుగా తయారైంది. ఖర్చు చేసిన రూ.కోట్లు గాలిలో కలిశాయే తప్ప, గిరిజనుల ప్రయాణ కష్టాలు మాత్రం తీరలేదు. స్తంభించిన గృహ నిర్మాణం.. పిల్లర్లకే పరిమితం! జన్మన్ పథకం కింద గ్రామానికి 36 ఇళ్లు కేటాయించారు. కేవలం బేస్మెంట్ వరకు మాత్రమే బిల్లులు మంజూరు కావడంతో ఇళ్లన్నీ పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. మొత్తం 36 ఇళ్లలో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే పూర్తయింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు రాకపోవడంతో, గూడు లేని గిరిజనులు గాలిలో దీపాల్లా మిగిలారు. వంతెన లేని ప్రయాణం వాగు అవతలి వరకు తారు రోడ్డు వేసిన అధికారులు, వాగుపై వంతెన నిర్మించడాన్ని విస్మరించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ వంతెన నిర్మిస్తే పెద్దపాడుతో పాటు కోసంగి, వర్రా, చొంపి గ్రామాలకు రవాణా సులభమవుతుంది. అరకులోయ, మాడగడ వ్యూ పాయింట్, సుంకరమెట్ట మీదుగా విశాఖకు దూరం తగ్గుతుంది. పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుంది. వర్షం కురిస్తే ఇబ్బందులే.. పెద్దపాడులో బీటీ రోడ్డు నుంచి గ్రామం వెలుపలకు సీసీ రోడ్డు వేయకపోవడంతో బురదమయం అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి బావి నుంచి కుళాయిల ద్వారా అందిస్తున్నారు. వర్షాకాలంలో బావి పూర్తిగా కలుషితమవుతోంది. ఈ నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని గ్రామ గిరిజనులు వాపోతున్నారు. బావి స్థానంలో బోరు ఏర్పాటుచేస్తే కలుషితం సమస్య పరిష్కారం అవుతుందని వారు పేర్కొన్నారు. చదువుకు దూరం.. అంధకారంలో గ్రామం గ్రామంలో శాశ్వత పాఠశాల భవనం ఉన్నా అది ప్రారంభానికి నోచుకోలేదు. అంగన్వాడీ భవనం అసంపూర్తిగా వెక్కిరిస్తోంది. వాగు పొంగినప్పుడు ఉపాధ్యాయులు రాలేకపోతుండటంతో పిల్లల చదువు అర్థంతరంగా ఆగిపోతోంది. మరోవైపు పాతబడిన ట్రాన్స్ఫార్మర్తో విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ లేక మురుగునీటి కంపు మధ్య గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దపాడులో ప్రగతి పరుగులు పెడుతుందని ఆశించిన గిరిజనులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకుంటారా? లేక పెద్దపాడు ప్రగతిని సెల్ఫీలకే పరిమితం చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వంతెన లేక ఇబ్బందులు గెడ్డకు అవతల నుంచి తారురోడ్డు నిర్మించారు. గెడ్డపై వంతెన నిర్మించకపోతే రాకపోకలు ఎలా సాగిస్తాం. వంతెన లేక గృహ నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. – కొర్రా మలతిరావు, పెద్దపాడు డిప్యూటీ సీఎం మాటలపై నమ్మకం పోయింది! ఆరు నెలల్లో మార్చేస్తామన్న మాటలు నమ్మి మోసపోయాం. పవన్ కళ్యాణ్ కేవలం రోడ్ల శంకుస్థాపనల కోసమే గ్రామానికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం మా గ్రామం అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టదని అర్థమైపోయింది. –స్థానిక గిరిజనుల ఆవేదన -
ఆన్లైన్లో చందనోత్సవం టికెట్లు
సింహాచలం: సింహగిరిపై ఈ నెల 20న జరగనున్న చందనోత్సవాన్ని పురస్కరించుకుని.. టికెట్ల విక్రయాలను ఈ నెల 17వ తేదీలోపే ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను గురువారం కలెక్టర్ పరిశీలించగలరు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చందనోత్సవం టికెట్లను ఈ నెల 11 లేదా 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టికెట్ల విక్రయాలను 17వ తేదీ నాటికే పూర్తి చేసి, మిగిలిన రెండు రోజులు కేవలం ఏర్పాట్లపైనే దృష్టి సారించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతేడాది ఏర్పాట్లతో పోలిస్తే.. ఈసారి భక్తుల సౌకర్యార్థం శాశ్వత షెడ్లను అధికంగా అందుబాటులోకి తీసుకువచ్చామని, తాత్కాలిక కట్టడాలను తగ్గించామని కలెక్టర్ వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని.. అందుకు తగ్గట్టుగా తాగునీరు, మరుగుదొడ్లు, క్యూల్లో రద్దీ నియంత్రణ వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల ప్రత్యేక ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరో మూడు రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేసినా, భక్తుల సహకారం అవసరమన్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 దర్శన క్యూలను పరిశీలించారు. అన్నప్రసాద భవనం నుంచి పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల వద్దకు వెళ్లేందుకు ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవంపై ఈ నెల 11న కలెక్టరేట్లో మంత్రులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈలు హరి, తాతాజీ, ఏఈలు రవిరాజు, తిరుపతిరావు, పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ ● పోలీసుస్టేషన్లో ఫిర్యాదు అరకులోయ టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ నేతల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కూటమి ప్రభుత్వం సమర్థించడం సరికాదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. రాధాకృష్ణపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మత్స్యలింగం స్థానిక పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బుధవారం విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించినట్లే, భవిష్యత్తులో రాధాకృష్ణ ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. రాధాకృష్ణ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, పద్ధతి మార్చుకోకపోతే గిరిజన మహిళల తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి అనిల్, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు సందడి కొండబాబు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్లు కిముడు హరి, వెంకటపూర్ణిమ, సెంబి సన్యాశిరావు, రేగం రమేష్, గుడివాడ ప్రకాష్, కిల్లో జగన్, టి. వెంకటరావు, నాయకులు విజయదశమి, గుంజిడి ప్రసాద్, చిట్టిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ 2.0లో యువతకు ప్రాధాన్యం
ఎస్.రాయవరం: వైఎస్సార్సీపీ 2.0 లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థరెడ్డిని పాయకరావుపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పోచిన నరేష్ గురువారం గాజువాకలో మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న రోజుల్లో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలు రూపొందిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విజయవంతానికి యువత నడుం బిగించాలని సూచించారన్నారు. -
కేజీహెచ్ ఎస్టీ సెల్ సిబ్బంది బదిలీల రద్దు
మహారాణిపేట: కేజీహెచ్ ఎస్టీ సెల్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర కోరడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. ఇటీవల ఈ నలుగురు సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయగా, దీనివల్ల కేజీహెచ్కు వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. అప్పలరాజు, కార్యదర్శి కటారి శోభన్ కుమార్ గురువారం చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసీ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం వచ్చే అమాయక ప్రజలకు ఈ సిబ్బంది ఎంతో చేదోడువాదోడుగా ఉంటారని వారు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన చైర్పర్సన్ సుభద్ర, ఏఎస్ఆర్ కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఈ నలుగురు సిబ్బందిని అక్కడే కొనసాగించడం అత్యవసరమని ఆమె కోరారు. చైర్పర్సన్ విజ్ఞప్తి మేరకు ఆ నలుగురు ఉద్యోగులను తిరిగి కేజీహెచ్లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు అప్పలరాజు, శోభన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్కు, ఏఎస్ఆర్ కలెక్టర్కు, ఇతర అధికారులకు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైఎస్సార్ పాదయాత్ర ఒక చరిత్ర
అరకు ఎంపీ తనూజ రాణిఎంవీపీకాలనీ (విశాఖ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర.. రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని అరకు ఎంపీ తనూజ రాణి అన్నారు. మహానేత చేసిన పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఎంవీపీ కాలనీలోని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు తదితరులతో కలిసి ఎంపీ తనూజరాణి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పనిచేసిన కాలం ఒక స్వర్ణయుగమని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ఆయన జనం మధ్యకు వెళ్లి, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక ప్రజారంజక పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు వైఎస్సార్ పాదయాత్ర ద్వారా పుట్టినవేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చేశాయని, ముఖ్యంగా గిరిజనులకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. -
స్నానాల సరదా.. ప్రాణాలు తీసింది
త్రిష, పవిత్ర, రత్నకుమారి మృతదేహాలుసాక్షి, పాడేరు: ఆ ఇంట ఇటుకల పండుగ సంబరం నెలకొంది. పరీక్షలు ముగించుకుని వచ్చిన ఆడబిడ్డలతో ఆ ఇల్లు కళకళలాడింది.. కానీ, ఒక్క క్షణం జరిగిన అజాగ్రత్త ఆ కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. స్నానాల సరదా, సెల్ఫోన్ వీడియోల ముచ్చట ముగ్గురు గిరిజన యువతులను మృత్యుఒడికి చేర్చింది. హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దుల్లోని ములగుమ్మి జలపాతం వద్ద గురువారం జరిగిన ఈ విషాద ఘటన మన్యాన్ని కలిచివేసింది. ● హుకుంపేట మండలం జంబువలస గ్రామంలో అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి (16), మరో యువతి అంజలితో కలిసి సరదాగా గడిపేందుకు సమీపంలోని ములగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. ముగ్గురు యువతులు నీటిలో దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి గట్టు మీద నిలబడి వారిని సెల్ఫోన్లో వీడియో తీస్తోంది. ఈ క్రమంలోనే లోతు తెలియక ఆ ముగ్గురూ జలపాతంలో మునిగిపోయారు. వారిని రక్షించే ప్రయత్నంలో అంజలి కూడా రాయిపై నుంచి జారిపడి గాయపడింది. అస్తమించిన ఆశలు మృతి చెందిన వారిలో ఇద్దరు విద్యార్థులు కావడం అందరినీ మరింత వేదనకు గురిచేస్తోంది. సాలెపు త్రిష హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసింది. సాలెపు రత్నకుమారి టెన్త్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం వేచి చూస్తోంది. సెలవుల్లో తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుదామని ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు, ఇలా విగతజీవులుగా మారడంతో జంబువలస గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మా బిడ్డలు మళ్లీ వస్తారనుకున్నాం.. ఇలా విగతజీవులై వస్తారని ఊహించలేదు.. అంటూ తండ్రులు దేముడు, కొండ, చంద్ర గుండెలవిసేలా రోధించడం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కేసు నమోదు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుకుంపేట సీఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. యువతుల మృతదేహాలను వెలికితీసి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వేసవి సెలవుల్లో జలపాతాలు, నదుల వద్దకు వెళ్లే యువత, విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతు తెలియని చోట సాహసాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ములగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి తీవ్రంగా గాయపడిన మరో యువతి స్నానాలు చేస్తుండగా ప్రమాదం మృతులు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో జంబువలస పండగ వేళ విషాదం -
ప్రకృతి ఒడిలో పురాతన పండగ
● ఆకట్టుకుంటున్న గిరిజన సంప్రదాయం ముంచంగిపుట్టు: మన్యంలోని గిరిజన గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి మొదలైంది. తమ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గిరిజనులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కించాయిపుట్టు పంచాయతీ దారపల్లి గ్రామంలో జరుగుతున్న వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ పండుగలో భాగంగా చిన్నారుల శరీరం అంతా మామిడి ఆకులతో కట్టి, నుదుట బొట్టు పెట్టి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వీరికి ప్రత్యేక పూజలు చేయించి, పల్లకలో వైభవంగా ఊరేగించారు. తరతరాలుగా వస్తున్న పూర్వీకుల పద్ధతులను నేటికీ తూచా తప్పకుండా పాటిస్తూ గిరిజనులు తమ ఆచారాలపై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటున్నారు. -
మహిళల గౌరవానికి భంగం
–మాజీ ఎంపీ బి.సత్యవతి రాధాకృష్ణ వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన వెంటనే మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదే పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతా ముక్తకంఠంతో ఖండించాలి –వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ వేమూరి రాధాకృష్ణ చేస్తున్న రాతలు పూర్తిగా అసత్యాలతో కూడినవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మీడియా తన బాధ్యతను గుర్తుంచుకుని వ్యవహరించాలి. ఇలాంటి బాధ్యతారాహిత్య రాతలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొనసాగితే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది. -
మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే..
మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించాయి. వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని పార్టీ నేతలు ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు. -
నింగిలో విహారం..
మన్యం పర్యాటకంలో సరికొత్త అధ్యాయం ● ముంచంగిపుట్టు, సీలేరు కేంద్రంగా వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులు ● సుమారు రూ.16.45 కోట్ల వ్యయంతో నిర్మాణం ● ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి ● అందుబాటులోకి వస్తే మరోస్థాయికి చేరనున్న పర్యాటక రంగం సీలేరు: పచ్చని అడవులు, ఎత్తయిన కొండలు, జాలువారే జలపాతాలు.. సముద్ర మట్టానికి 1350 అడుగుల ఎత్తులో కొండల మధ్య ఒంపుసొంపులు తిరిగే ప్రయాణం.. తూర్పు కనుమల నుంచి వందల కిలోమీటర్ల మేర ప్రవహించే జలసిరి.. రాష్ట్రానికి వెలుగులు నింపే విద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లు.. వీటికి తోడు గిరిజన సంప్రదాయాలు, వారి కట్టుబొట్టు.. అరకు అందాలు, మంచు కురిసే లంబసింగి, ప్రాచీన ఆలయాలు.. ఇలా ఎన్నో విశిష్టతలకు ఈ జిల్లా నెలవు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఇప్పుడు ప్రపంచ స్థాయి పర్యాటక వేదికగా అభివృద్ధి చెందబోతోంది. ● ప్రస్తుతం దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంత అందాలను తిలకించేందుకు కేవలం వాహనాలపైనే ఆధారపడుతున్నారు. అయితే, త్వరలో జిల్లాలో అందుబాటులోకి రానున్న వాటర్ ఏరోడ్రోమ్ (సీ ప్లేన్) ప్రాజెక్టులతో పర్యాటక రంగం మరో స్థాయికి చేరనుంది. జిల్లాలో రెండు ప్రాజెక్టులు ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. దీనికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. ప్రయాణ మార్గమిలా.. పర్యాటకులు మొదట విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సీ ప్లేన్ ద్వారా నేరుగా ముంచంగిపుట్టు చేరుకోవచ్చు. అక్కడికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు, దాని పరిసర ప్రాంతాలను సులభంగా సందర్శించవచ్చు. సీలేరు కనెక్టివిటీ.. లంబసింగితో పాటు ఇతర ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా, సీలేరు గుంటవాడ రిజర్వాయర్ వద్ద మరో వాటర్ ఏరోడ్రోమ్ నిర్మించనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం జిల్లాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయి. వీటి వల్ల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, స్థానిక గిరిజన ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాపారాలు వృద్ధి చెంది, స్థానిక యువతకు ఈ ఎయిర్పోర్టుల నిర్వహణలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. –తిరుమణి శ్రీపూజ, జాయింట్ కలెక్టర్, పాడేరు -
మహిళలను కించపరిస్తే సహించం
పాడేరు: మహిళా లోకాన్ని కించపరుస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా ‘కొత్త పలుకులు’ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. బుధవారం పాడేరులోని తన నివాసంలో పార్టీ మహిళా నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నారని, కేవలం చంద్రబాబు నాయుడి మెప్పు కోసమే వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లను ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ విలువలు, ఇప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గుర్తుకు వస్తున్నాయా? అని ఆమె ప్రశ్నించారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (విశాఖ–విజయవాడ–గుంటూరు కారిడార్) అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, కేవలం రూ. 20 వేల కోట్లతో 110 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకే మహిళలపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం రాధాకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్పర్సన్ ఎం. సరస్వతి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్కిచెన్ నిర్ణయం విరమించాలి
దేవరాపల్లి: స్మార్ట్ కిచెన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి మిడ్డే మీల్స్ కార్మికుల పొట్ట కొట్టొదని ఏపీ వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు డి. వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బి.టి. దొర కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మద్దతు ప్రకటించారు. బిల్లులు, వేతనాలు సక్రమంగా సకాలంలో ఇవ్వక పోయినా అప్పులు చేసి మరీ భోజనం అందిస్తున్న కార్మికులను తొలగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఏళ్ల తరబడి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న నిర్వహకులకు మెనూ చార్జీలు, వేతనాలు పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంఈవో ఈశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలా మేరీరత్నం, పల్లి రాములమ్మ, సింగంపల్లి మహాలక్ష్మీ, రాయి సన్యాసమ్మ, గాలి గంగమ్మ, దాసరి రాము, పులిగా రమణమ్మ, కంచి మహాలక్ష్మీ తదితర మిడ్డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఎంఈవో ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులు దేవరాపల్లి ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మీడ్డే మీల్స్ నిర్వాహకులు -
గిరిజనులకు దోమతెరల పంపిణీ
సాక్షి, పాడేరు: ఎట్టకేలకు దోమతెరలు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్లుగా పంపిణీకి నోచుకోని దోమతెరలతో మన్యంలో మలేరియా జ్వరాలు విజృంభణపై మలేరియా పంజా శీర్షికన ఈనెల 7న సాక్షిలో ప్రచురించిన కథనానికి కలెక్టర్ టి.నిశాంతి, జిల్లా మలేరియాశాఖ అధికారులు స్పందించారు. మొదటి విడతగా అందుబాటులోకి వచ్చిన 69వేల దోమతెరలను మలేరియా ప్రభావిత గ్రామాల్లో పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా మండలంలో కందమామిడి గ్రామాన్ని కలెక్టర్ టి.నిశాంతి బుధవారం సందర్శించారు. గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా జ్వరాల నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుబాటులోకి వచ్చిన దోమతెరలను పంపిణీ చేస్తున్నామని, ఈనెల 15వతేదీ నుంచి మలేరియా పీడిత గ్రామాల్లో దోమల నివారణ మందు మొదట విడత పిచికారి పనులు ప్రారంభిస్తామన్నారు. మలేరియా జ్వరాలపై వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
గిరిజన రైతులకు ఆర్థిక భద్రతే లక్ష్యం
మహారాణిపేట(విశాఖ): గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కార్యకలాపాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు, డి.ఆర్.డిపోలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల వద్ద సేకరించిన ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా నగదు జమ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, కాఫీ కొనుగోళ్లు పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెంచే దిశగా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జీసీసీలో పనిచేస్తున్న 33 మంది సేల్స్మెన్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ, వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్, మేనేజింగ్ డైరెక్టర్ శోభిక, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
కలెక్టర్ నిశాంతి సాక్షి, పాడేరు: జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారంతో పాటు,జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులు,సిబ్బందితో సమావేశం నిర్వహించారు.గత 22నెలల కాలంలో పరిష్కరించిన రెవెన్యూ సమస్యలు,పెండింగ్లో ఉన్న పనులు తదితర 25 ఆంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారులంతా మండల స్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. మండల, గ్రామ కార్యాలయాల్లో ప్రభుత్వ, అటవీ, జిరాయతీ భూముల సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. న్యాయస్థానాల ద్వారా వచ్చే ఆదేశాలను కూడా తప్పకుండా పాటించాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీకి సంబంధించి గ్రామస్థాయిలో కులం వివరాలపై సమగ్ర విచారణ చేయాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని, నూతన గృహ లబ్ధిదారులకు పట్టాలు అందించేందుకు లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి డీఆర్వో నీలకంఠరావు, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ రాతలు అత్యంత నీచం –మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి. అది బూతుల కరపత్రం –మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాధాకృష్ణ తనకు తోచినట్లు రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాలో ఆయన ఒక ’ఎల్లో టెర్రరిస్ట్’. ఆంధ్రజ్యోతి అనేది ఒక బూతుల కరపత్రంలా మారింది. కేవలం చిల్లర కోసం రాధాకృష్ణ ఇన్ని వేషాలు వేస్తున్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
పెదబయలు: సొంత నిధులతో తాగునీటి పథకాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టరును బిల్లు కోసం ముప్పతిప్పలు పెట్టి, లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి చివరకు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ ఏసీబీ డీఎస్పీలు ఎస్ఆర్ హర్షిత, బీవీఎస్ఎస్ రమణమూర్తి ఈ కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే? బొండాపల్లి గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో, బూరుగువీధి గ్రామంలో రూ.2.27 లక్షల అంచనా వ్యయంతో తాగునీటి ట్యాంకులు, పైపులైన్ల పనులను కాంట్రాక్టర్ దొర మల్లేశ్వరరావు పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎం–బుక్ రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. అయితే, బిల్లు మంజూరు (చెక్ మెజర్మెంట్) కోసం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–3 కాండ్రేగుల లక్ష్మీనారాయణ వద్దకు కాంట్రాక్టర్ మల్లేశ్వరరావు వెళ్లగా, ఆయన కేవలం రూ.1.30 లక్షలకు మాత్రమే చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.97 వేల బిల్లు మంజూరు చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాల్సిందేనని కార్యదర్శి భీష్మించి కూర్చున్నారు. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ కోరినా వినకపోవడంతో, బాధితుడు ఈనెల 7వ తేదీన విశాఖ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు బుధవారం పథకం ప్రకారం వల పన్నారు. పెదబయలులోని తన నివాసంలో కాంట్రాక్టరు నుంచి రూ.30 వేల నగదును లంచంగా తీసుకుంటుండగా లక్ష్మీనారాయణను ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఆయన నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీలు తెలిపారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం. ప్రభుత్వ సేవల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించండి. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో విశాఖ ఏసీబీ సీఐలు సుప్రియ, శ్రీనివాసరావు, వెంకట్రావు, లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి -
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
అరకులోయ టౌన్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేక కథనాలపై నిరసన బుధవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. రాధాకృష్ణ ప్రసారం చేసిన కథనాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతూ, ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కాదు.. చెత్త పలుకులు! ఈ సందర్భంగా రేగం చాణక్య మాట్లాడుతూ.. రాధాకృష్ణ చెప్పేవి ‘కొత్త పలుకులు’ కావని, అవి ‘చెత్త పలుకులు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలను ఎవరు దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత.. రాధాకృష్ణ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి గుంజిడి ప్రసాద్, సుంకరమెట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు కొర్రా అర్జున్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టు ప్రత్యేకతలు
పర్యావరణ పరిరక్షణ: ఈ ప్రాజెక్టుల వల్ల అటవీ సంపదకు, వన్యప్రాణులు, పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్వహణ: రోజుకు నాలుగు సార్లు విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విమానాలు నీటిపై ల్యాండ్ అయిన తర్వాత, సుమారు అర కిలోమీటరు మేర నీటిలోనే ప్రయాణించి ఒడ్డుకు చేరుకుంటాయి. మౌలిక సదుపాయాలు: సుమారు 16.45 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ఏరోడ్రోమ్ ఒక్కో విడతలో 19 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. సౌకర్యాలు: రోజుకు 152 మంది పర్యాటకులకు అవసరమైన భవనాలు, రెస్టారెంట్లు, భద్రతా గదులు, ఇతర వసతులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సుమారు 50 మంది సిబ్బంది ఇక్కడ విధుల్లో ఉంటారు. అనుసంధానం: ఏరోడ్రోమ్ నుంచి సమీప పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు వేగంగా చేరుకునేందుకు వీలుగా అత్యాధునిక డబుల్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ఈ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులు పూర్తయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ అద్భుతమైన గిరిజన ప్రాంత అందాలను తిలకించే అవకాశం సులభతరం అవుతుంది. -
4,900 గృహాలకు సోలార్ రూప్ టాప్
చింతపల్లి ఈపీడీసీఎల్ ఏడీఈ రాంబాబు కొయ్యూరు: చింతపల్లి సబ్ డివిజన్లో 4,900 గృహాలకు సోలార్ రూప్ టాప్ వేసేందుకు నిర్ణయించామని ఈపీడీసీఎల్ చింతపల్లి ఏడీఈ కేఎస్ రాంబాబు వెల్లడించారు. ఈ మేరకు చింతపల్లిలో పనులు చేపట్టామన్నారు. కొయ్యూరులోను త్వరలో పనులు చేపడతామన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కాకరపాడు సబ్స్టేషన్లో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేరుకుపోయిన బకాయిలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. ఎస్టీ, ఎస్సీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమైనా వారిలో చాలా మంది అర్హులు కాదన్నారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ఉండడంతో అది వర్తించదన్నారు. దీంతో చాలా కాలం నుంచి వాటి బకాయిలు పేరుకుపోయాయన్నారు. సోలార్ ఆప్లైన్ మాత్రమే ప్రస్తుతానికి ఉందన్నారు .దీనిని ఆన్లైన్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోలార్ వేసుకున్న గిరిజనులకు యథావిధిగా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందన్నారు. శ్లాబ్ కలిగిన గృమాలకు మాత్రమే సోలార్ వేస్తామని తెలిపారు.ముందుగా కేటగిరి–2 విబాగంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.దీని మూలంగా కలిగే లాభాలను ఆయన వివరించారు.పాడైన స్తంబాల స్థానంలో కొత్త స్తంబాలను వేస్తున్న ప్రక్రియ కొద్ది రోజుల కిందట ప్రారంభమైందన్నారు. -
వివరాల సేకరణలో కచ్చితత్వం ముఖ్యం
అధికారులకు సూచనలిస్తున్న కేంద్ర కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ మహారాణిపేట(విశాఖ): భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం నగరంలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న నేషనల్ హౌస్హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సర్వే అమలు విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహణలో కచ్చితత్వం, సమగ్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ సర్వే విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ సర్వేలో పాల్గొని, నిక్కచ్చిగా సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్, జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
సింహాచలం: చందనోత్సవం సందర్భంగా భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, పోలీసులు, జీవీఎంసీ హెల్త్ విభాగం అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం పరిపాలన కార్యాలయంలో బుధవారం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ.. క్యూల్లో భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు పంపిణీ చేసేటప్పుడు క్యూలను స్తంభింపజేయకూడదని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత సంస్థదేనని.. ఏమాత్రం చెత్త పేరుకుపోయినా వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు సంస్థలను అక్కడి నుంచి పంపించివేస్తామన్నారు. చందనోత్సవం ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ.. భక్తులకు అందించే ఆహారం నాణ్యంగా, వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వలంటీర్లు తప్పనిసరిగా చేతి గ్లౌజులు ధరించాలన్నారు. జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ.. ఆహార పంపిణీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, కేవలం పర్యావరణహిత వస్తువులనే వినియోగించాలని తెలిపారు. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే జాబితా ప్రకారం స్టాళ్ల వద్దకు అనుమతిస్తామని, వాహన పాసులను కూడా రికార్డులు పరిశీలించిన తర్వాతే జారీ చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడవివరం ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి, దేవస్థానం ఎస్డీసీ మధులత, సూపరింటెండెంట్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
బుచ్చెయ్యపేట: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఏబీఎన్లో కొత్త పలుకు పేరుతో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యేను బుచ్చెయ్యపేటలో పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీసీ మండల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి,పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సోషల్ మీడియా,వైఎస్సార్ కాంగ్రెస్సీపీ కార్యకర్తలు,నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలు,దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులకు, పచ్చ మీడియాకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు,జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీ గొంపా చినబాబు,మాజీ సర్పంచ్లు పెదిరెడ్ల మాణిక్యం,సుంకరి గాంధీ,గొంపా అప్పారావు,కోవెల ఈశ్వరరావు,జెర్రిపోతుల రామారావు,రాము తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సమావేశం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాలకు చెందిన అధ్యక్షులు, కమిటీ సభ్యుల సమావేశం ఈనెల 9వ తేదిదీ గురువారం ఉదయం 10 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామ, వార్డు, కోర్ కమిటీలు, అనుబంధ విభాగాల ఎంపిక, డిజిటైలేషన్ కార్యక్రమాలు పూర్తయిందన్నారు. ప్రస్తుతం సభ్యుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొంత మంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల డిజిటైలేజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. అందువల్ల సోషల్ మీడియా విభాగాలకు చెందిన అధ్యక్షులు, కమిటి సభ్యులు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు. -
అడ్డుకోవడం అన్యాయం
అనకాపల్లి: మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బుధవారం విశాఖ వెళుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి నాయకులను పట్టణ పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అన్నారు. స్థానిక ఉడ్పేట నుంచి వైఎస్సార్సీపీ నాయకులు విశాఖకు వెళుతున్న సమయంలో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, వెళితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసన తెలపకుండా పోలీసులతో అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జె.రమేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్చార్జి కె.రాఘవ, 82వ వార్డు ఇన్చార్జి అల్లు త్రినాథ్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిన అప్పారావు, కోన ఉమా, లక్కోజు రాంబాబు, తంగేళ్ల రామకృష్ణ, చింతా రాంజీ, రేబాక స్వామి, సత్తిబాబు, కొంకీ శ్రీరాంమ్మూర్తి,గుండా రమేష్ గుప్తా, కాండ్రేకుల శ్రీనివాసరావు,సతీష్ రెడ్డి, దేశెట్టి బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
● నేల కొరిగిన హోర్డింగ్.. ● నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
అనకాపల్లి టౌన్: పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో వీచిన ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా హోర్డింగ్, కటౌట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గవరపాలెం పార్స్ సెంటర్, విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి, శారదానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షం బీభత్సంతో నాలుగురోడ్ల జంక్షన్లో బస్టాప్ ముందర ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్, జీవీఎంసీ కార్యాలయం మేడపైన ఉన్న కటౌట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రదేశంలో నిత్యం బస్లు, ఆటోల కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. వర్షం వల్ల జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక వర్షం కారణంతో రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
డుంబ్రిగుడలో గంజాయి కలకలం
డుంబ్రిగుడ: మండలంలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు కురిడి పంచాయితీ పరిధిలోని గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్ఐ ఎస్. సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఒడిశాలోని చటువ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి తెలంగాణకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు కలిసి గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రవాణా చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు దాడి చేసి, వారి నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా, నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి సరఫరా చేసిన ఒడిశా రాష్ట్రం చటువ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గంజాయి సాగు చేసినా లేదా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువత ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. -
విశాఖ చేరుకున్న జయపతాక స్వామీజీ
నేడు 550 మందితో అప్పన్న దర్శనం కొమ్మాది/ఏయూక్యాంపస్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ప్రపంచవ్యాప్తంగా భక్తియోగం, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్న పరమపూజ్య జయపతాక స్వామి మహారాజ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయపతాక స్వామీజీ 550 మంది సన్యాసులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇస్కాన్ భక్తులతో కలిసి భారీ ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఆర్.కె. బీచ్ నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఎంజీఎం పార్క్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత విభావరి, భజన, కీర్తన కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారు. అలాగే ఇస్కాన్లో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ లీలలపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరవాసులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ కోరారు. -
పాడేరులో ఐఏఎస్ల ‘ఆదర్శ’ జంట
ఒకే చోట విధులు నిర్వహించనున్న దంపతులు ఆదిత్యవర్మ, తిరుమణి శ్రీపూజ సాక్షి, పాడేరు: యువ ఐఏఎస్ల ఆదర్శ జంటకు జిల్లాలో ఒకే చోట విధులు నిర్వహించే అరుదైన అవకాశం లభించింది. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి. తిరుమణి శ్రీపూజ, ఆమె భర్త ఆదిత్య వర్మ ఇకపై జిల్లాలోనే కీలక పదవుల్లో కొనసాగనున్నారు. 2022 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆదిత్య వర్మ తొలుత అస్సాం క్యాడర్లో నియమితులయ్యారు. ఇటీవల ఢిల్లీలో తిరుమణి శ్రీపూజ, ఆదిత్య వర్మలు నిరాడంబరంగా ఆదర్శ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆదిత్య వర్మ అస్సాం రాష్ట్రం నుంచి రిలీవ్ అయి, ఏపీ క్యాడర్కు బదిలీపై వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం మంగళవారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం.. ఇప్పటివరకు పాడేరు ఐటీడీఏ పీవోగా ఉన్న తిరుమణి శ్రీపూజను జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో పాడేరు ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మను నియమించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భార్యాభర్తలిద్దరూ పాడేరు కేంద్రంగానే జిల్లా పాలనలో భాగస్వాములు కానున్నారు. భార్య జాయింట్ కలెక్టర్గా, భర్త ఐటీడీఏ పీవోగా ఒకే చోట విధులు నిర్వహించనుండడం విశేషం. -
హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సస్పెండ్ చేయాలి
అనకాపల్లి: దేవరాపల్లి పీహెచ్సీ పరిధిలో గర్సింగి గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి ఆత్మహత్యా యత్నానికి కారకులైన హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను వెంటనే అరెస్టు చేసి విధులు నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడారు. డబ్బు మదంతో పుష్పరాజు బెదిరింపులు చేసి తోటి ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడటంతోపాటు మహిళా ఉద్యోగులపై శారీరకంగా మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగించటానికి వీలులేదన్నారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, గిరిజన సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుడు రాధాకృష్ణ, శ్రామిక మహిళా నాయకురాలు నారాయణమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఇతర ఆరోగ్య సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజుపై మండల అభివృద్ధి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మరింత మితిమీరుతున్నాయని ఆరోపించారు. గిరిజనురాలైన రాజ్యలక్ష్మిని కులదూషణతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆత్మహత్యకు యత్నించి పాడేరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వాపోయారు. ఘటనపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా అనారోగ్యం పేరుతో హాస్పిటల్లో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
తాగునీటి సమస్య పరిష్కరించకుంటే ఇళ్లకు తీసుకుపోతాం
లబ్బూరు ఏకలవ్య విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిక ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ, లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, విద్యార్థుల కష్టాలను తీర్చాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారం లబ్బూరు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా పాఠశాలలో సమస్యల కారణంగా తమ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయమై అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన లేదని, అధికారులు కేవలం హామీలతో కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని, సమస్యలతోనే తమ పిల్లలు సహవాసం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, ఈ నెల 11వ తేదీన తమ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్లిపోతామని వారు హెచ్చరించారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చి చూస్తామని, అప్పటికి కూడా సమస్యలు అలాగే ఉంటే తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రామదాసు, తల్లిదండ్రులు రోథోన్, నర్సింగ్, పరశురామ్, శ్రీనివాసరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
పాడేరు రూరల్: ఆదివాసీల సంక్షేమం, నిరుద్యోగ యువత సమస్యలపై ఎన్నడూ స్పందించని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘానికి, ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక బాధ్యత లేదని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామరావుదొర విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూటీఎఫ్ తీరు ..దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.ఈ నెల 12న రంపచోడవరంలోని పీఆర్ ఫంక్షన్ హాల్లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందన్నారు. దీనిలో ఆదివాసీల హక్కులు, చట్టాలు, నిరుద్యోగ సమస్యలు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. జీవో నంబర్ 3 రద్దుకు కారణమైన వారికి పరోక్షంగా సహకరించిన చరిత్ర యూటీఎఫ్కు ఉందని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా గిరిజనేతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి జీటీఎఫ్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో మంది యువత చదువుకుని ఉద్యోగాలు లేక వలసలు పోతుంటే, ఆ సమస్యలపై యూటీఎఫ్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రాజ్యాంగ హక్కులు నిర్వీర్యమవుతున్నా పట్టించుకోని నాయకత్వం, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబుజీ, జిల్లా కార్యదర్శి బూడిద మాధవరావు పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర -
వింత వ్యాధి కలకలం
పెదబయలు: మండలంలోని బొంగరం పంచాయతీ మొట్టలగుమ్మి గ్రామంలో వింత వ్యాధి సోకి ఆరు దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుటారి లక్ష్మయ్యకు చెందిన రెండు ఎద్దులు, తల్లె లక్ష్మీపతికి చెందిన ఒకటి, తల్లె చిన్నయ్యకు చెందిన ఒకటి, కె. బుజ్జిబాబుకు చెందిన ఒక ఎద్దుతో పాటు మొత్తం ఆరు పశువులు మరణించాయి. పశువుల నోటి నుంచి నురగ రావడం, గుర్రు పెట్టడం, ఊపిరి అందక నాలుక బయటకు చాచి మృతి చెందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని మిగిలిన పశువులకు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. మృతి చెందిన ఒక్కో ఎద్దు విలువ సుమారు రూ. 25 వేల వరకు ఉంటుందని, పెట్టుబడి పోయి తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. గత నెలలో ఇంజరి పంచాయతీలో కూడా ఇలాగే పశువులు మృతి చెందాయని, ఇప్పుడు బొంగరం పంచాయతీలో వ్యాధి ప్రబలుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించాలని అత్యవసరంగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నష్టపోయిన పాడి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఆరు దుక్కిటెద్దుల మృతి


