Alluri Sitarama Raju District Latest News
-
కూటమి మాస్టర్ ప్లాన్
విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ప్లాన్పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు, చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ప్లాన్ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్–2041లో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? -
ప్రాజెక్టుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలందిస్తామని సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. ఇటీవలే డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. డిస్కమ్ పరిధిలోని పలు సర్కిళ్లలో పర్యటించి, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లోని అన్ని విభాగాల్లో 37 ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం తనకుందన్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్లో జరుగుతున్న పనులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానని, చేపట్టిన పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగర పరిధిలో రెండో దశలో భాగంగా రూ.909 కోట్ల వ్యయంతో 1,876 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 120 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ఎంఈఎస్, డీటీఆర్స్ మొదలైన వాటిపై కసరత్తు జరుగుతోందని, ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే తవ్వకాల కోసం జీవీఎంసీ నుంచి అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్ల కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విభజన పనులపై సమీక్ష నిర్వహించామని, ఫీడర్ బైఫరకేషన్ పనుల్లో ప్యాకేజీ–1 గత నెలాఖరు చివరి నాటికి 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇండోర్, అవుట్డోర్ సబ్స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. ముందుగానే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం జుగా’(ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద ఎస్టీ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ వనజ వివరించారు. ఆగస్ట్ 15 నాటికి రెండో దశ భూగర్భ విద్యుత్ పూర్తి చేస్తాం ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వనజ -
నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ అన్నారు. ఇటీవల డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. డిస్కమ్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రస్తుతం డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు సూర్యప్రకాష్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు వెల్లడించారు. సర్కిళ్ల వారీగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సరఫరాలో లోపాలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ మూడు ఫేజుల విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ కోటా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, రోజూ 18 నుంచి 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. గాలి, వర్షాల కారణంగా వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు మినహా, మిగతా సమయాల్లో ఈపీడీసీఎల్ పరిధిలో అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉన్నందున.. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రతి లైన్ను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుతున్నామని.. వర్షాకాలంలో సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తామని సూర్యప్రకాష్ వివరించారు. ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ -
రెగ్యులర్ vs ఎయిడెడ్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు మళ్లీ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్సిటీలోని కొంతమంది ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి, పాలనలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసుపై ఏయూకు వచ్చిన అధ్యాపకుల పట్ల వర్సిటీలోని ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. 1000 మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం 140 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే కాలేజీల్లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను వినియోగించుకోవాల్సింది పోయి.. తామేదో పరాయి దేశం నుంచి వచ్చినట్లుగా, వెళ్లిపోండంటూ కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎయిడెడ్ అధ్యాపకులు మదన పడుతున్నారు. క్యాంపస్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లలతో మంగళవారం జరిగిన వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఓ వర్గం ఇదే అంశంపై పట్టుబట్టడం.. ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్గా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో మల్లగుల్లాలు ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నందున ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఇందుకు అనుమతించారు. కాగా.. ఎయిడెడ్ అధ్యాపకుల రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నచ్చక దాదాపు 40 మంది వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృ సంస్థకు వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. క్యాంపస్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో తరగతుల నిర్వహణలో వీరంతా కీలకంగా పనిచేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాలని ఓ వర్గం పట్టు వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఇదే చర్చ పాఠాలు పక్కన పెట్టి.. పెత్తనంపై ఆరాటం ఏయూలో అధ్యాపకుల తీరుపై విమర్శలు తెరపైకి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేలా ఓ వర్గం ఒత్తిడిచేస్తూనే ఉంది. కానీ ఫారిన్ సర్వీసుపై వచ్చినందున 2026 జూన్ వరకు వారికి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. వర్సిటీనే వేతనాలు చెల్లిస్తున్నందున, వారి సేవలను కొనసాగించాలనుకుంటున్నారా లేదా అంటూ మార్చిలో హయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఇక్కడి అధికారులకు లేఖ రాశారు. వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని వర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన వర్సిటీలోని ఓ వర్గం ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాల్సిందేనని ప్రస్తుత వైస్ చాన్సలర్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఖాళీల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? రాష్ట్రంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో టీచింగ్ 10 మంది, నాన్ టీచింగ్ 20 మంది అవసరం ఉందని, ఆన్ డ్యూటీ బేసిస్/ఫారిన్ సర్వీసు కింద పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాలేజీ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చే విషయమేనని ఏయూలో ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు అంటున్నారు. అయితే ఆయా యూనివర్సిటీలు 2025–26 విద్యా సంవత్సరానికి తమ అవసరాల మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం బట్టి, ఇప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఆలోచనలో లేదని తెలుస్తోంది. -
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన ఈ అదాలత్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నిరాధరణకు గురైన చెక్కులు కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశాఖలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్లో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో, మండల న్యాయ సేవా సంఘాల్లో సంప్రదించాలన్నారు. రాష్ట్ర, జాతీయ క్రెడాయ్ కమిటీల్లో విశాఖకు పెద్దపీట విశాఖ సిటీ: విశాఖకు చెందిన పలువురు ప్రముఖులు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్)లో రాష్ట్ర, జాతీయ స్థాయి కీలక పదవులకు ఎంపికయ్యారు. ఈ నియామకాలతో విశాఖ ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత పెరిగిందని క్రెడాయ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బయన శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా కె.ఎస్.ఆర్.కె.రాజు బాధ్యతలు స్వీకరించారు. మరో కార్యక్రమంలో.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సమక్షంలో క్రెడాయ్ జాతీయ స్థాయి పదవుల్లోనూ విశాఖ ప్రతినిధులు స్థానం సంపాదించారు. నేషనల్ ఎమర్జింగ్ సిటీస్ కన్వీనర్గా బొప్పన రాజా శ్రీనివాస్, సివిల్ ఏవియేషన్ కో–కన్వీనర్గా అశోక్కుమార్ ఎరడాల, క్రెడాయ్ యూత్ వింగ్ (సౌత్) జాయింట్ సెక్రటరీగా గొంప కార్తీక్ నియమితులయ్యారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష మహారాణిపేట(విశాఖ): జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. జూన్ 21న ఉదయం 6 నుంచి 8 మధ్య 45 నిమిషాలు పాటు కార్యక్రమం జరగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నిర్దేశించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా ఏయూ కన్వెన్షన్ హాలు, మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్ లేదా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రధాన వేదికల వద్ద భాగస్వామ్యం అయ్యే వారికి ముందస్తు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ప్రత్యేకాధికారులు సత్తిబాబు, సుధాసాగర్, శేషశైలజ, మధుసూదన్ రావు, డీఈవో ప్రేమకుమార్, ఆర్ఐవో, ఇతర విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
గతుకుల రోడ్డుపై ఆటో బోల్తా
ఎస్.రాయవరం: మండలంలోని నీలాద్రిపురం సమీపంలో అడ్డురోడ్డు – నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై గురువారం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన శానాపతి లక్ష్మీవరప్రసాద్(32) భార్యాపిల్లలతో తన స్వగ్రామం నుంచి చినగుమ్ములూరు వెళ్తుండగా, రోడ్డుపై గతుకులు కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో కింద పడిపోయిన లక్ష్మీవరప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అడ్డురోడ్డు సన్షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతడు నాలుగేళ్లుగా తిమ్మాపురం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చినగుమ్ములూరులో వివాహానికి వెళ్లేందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. డ్రైవర్ మృతి -
మలేరియా పట్ల అప్రమత్తత అవసరం
● డీఎంవో తులసి చింతపల్లి: ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అదికారి తులసి అన్నారు. గురువారం ఆమె కిటుముల శివారు నిమ్మలపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మలేరియా పాజిటివ్ కేసు నమోదైన ఇంటిని, రోగిని పరిశీలించారు. దోమల వల్ల వచ్చే వ్యాదులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. రక్త పరీక్ష కిట్లు ఆశా కార్యకర్తలు వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. మలేరియా వ్యాధి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ముందుగా గుర్తించిన గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారి చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మందు పిచికారి చేయుంచుకోవాలన్నారు. జూన్ 15 వరకూ జిల్లా వ్యాప్తంగా పిచికారి కొనసాగుతుందన్నారు. సబ్ యూనిట్ అదికారులు బుక్కా చిట్టిబాబు, సత్యనారాయణ, ఏఎంవో యుగంధర్ పాల్గొన్నారు. -
రూ.400 కోట్లతో440 ప్రాజెక్టులు
● నాబార్డు డీడీఎం గౌరీశంకర్ చింతపల్లి: జిల్లాలో నాబార్డు ద్వారా రూ.400 కోట్లతో 440 ప్రాజెక్టులు చేపడుతున్నట్టు నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ (డీడీఎం) వి.గౌరీశంకర్ తెలిపారు. గురువారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన మన్యసీమ, గిరిజన్ వికాస్ ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతాంగం ఆర్థికాభివృద్ధి సాధనకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏడు ప్రాజెక్ట్లు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఆదాయాన్నిచ్చే ఐదు వేల ఎకరాలకు అవసరమైన పండ్ల మొక్కల పెంపకాన్ని ఆర్థికంగా చేయూత అందిస్తామన్నారు. గిరిజన యవత సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే వారి ఆర్థికాబివృద్ధికి నాబార్డు సాయం అందిస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో మన్యసీమ, సుగుణ, మాతోట సీఈవోలు శ్రీనివాసరావు, రాజేష్, చిన్నారావు,సిబ్బంది పాల్గొన్నారు. -
ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో వర్షాలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నం నుంచి పాడేరుతో పాటు అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షం కురిసింది.పాడేరు పట్టణం.సమీప ప్రాంతాలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎకదాటిగా కురిసిన కుండపోత వర్షంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఖరీఫ్తోపాటు, రబీ పంటలకు మేలు చేస్తాయని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్బీఎస్ నందు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా కూలిన వృక్షం అడ్డతీగల: మండలంలో గురువారం వీచిన ఈదురుగాలులకు అడ్డతీగల–వై.రామవరం మార్గంలో వెదురునగరం వద్ద భారీ వృక్షం కూలింది. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, స్థానికులు ఎట్టకేలకు భారీ వృక్షాన్ని రోడ్డుకు అడ్డంగా లేకుండా తొలగించారు. ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు భారీగా ప్రవహించింది. సంతబయలు, ఇందిరాకాలనీల్లో వరదనీరు ఇళ్లముందు నిలిచిపోయింది. పెనుగాలులు జీడిమామిడికి నష్టం కలిగించాయి. రాజవొమ్మంగి: మండలంలో గురువారం ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
నిష్ఫలం
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదన జరగడం లేదు. గతేడాది కన్నా నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నా జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవడంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోతోంది. ఆరింటిలో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. పాత యంత్రాలు కావడంతో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నీళ్లున్నాజనరేటర్లు : 6 ఉత్పాదన: 120 మెగావాట్లు పనిస్తున్నవి: 4 ఉత్పత్తి: 80 మెగావాట్లు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోవడంలో ఆంధ్రా–ఒడిశా అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఏజెన్సీలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వరద నీరు అధికంగా వచ్చి చేరింది. దీంతో నీటి మట్టం క్రమేపీ పెరిగింది. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2730.55 అడుగులుగా నమోదయింది. గత ఏడాది ఇదే రోజుకు 2697.95 అడుగులు నీటి నిల్వ ఉంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2575 అడుగులుగా ఉంది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువున ఉన్న డుడుమ జలాశయానికి రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేస్తున్నారు. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉందని జలాశయ అధికారులు చెబుతున్నారు. 120కు 80 మెగావాట్లు మాత్రమే ఉత్పాదన మాచ్ఖండ్లో ఆరు యూనిట్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. నాలుగు యూనిట్లలో 80 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. రెండు యూనిట్లు మరమ్మతుల్లోనే ఉన్నాయి. ఈ జలవిద్యుత్ కేంద్రంలో గత కొన్నేళ్లుగా జనరేటర్ల మరమ్మతులకు గురవుతుండటం వల్ల పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. వీటిలో 2,3,5,6 జనరేటర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 1,4 నంబరు జనరేటర్లు మరమ్మతుల దశలో ఉన్నాయి. ● జలవిద్యుత్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూలింగ్ వాటర్ పంపుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవడంతో ప్రస్తుతం 80 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. మరమ్మతుల వైపే మొగ్గు? ప్రాజెక్టు అధికారులు పాతబడిపోయిన జనరేటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. వీరు మరమ్మతులవైపే మొగ్గుచూపుతున్నారన్న విమర్శలున్నాయి. మరమ్మతుల వల్ల నిధులు వృధా తప్ప జలవిద్యుత్ కేంద్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు జనరేటర్లు మరమ్మతులకు పరిమితం అవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పాదన సాధ్యం కావడం లేదు. ఇప్పటికై నా జలవిద్యుత్ కేంద్రం ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించాలని సరిహద్దు ప్రాంతీయులు కోరుతున్నారు.మాచ్ఖండ్ సామర్థ్యం నిండుగా డుడుమ, జోలాపుట్టు జలాశయాలు తరచూ మరమ్మతుల్లో జనరేటర్లు ఆరింటిలో నాలుగు మాత్రమే వినియోగం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మెరుగుపడని ఉత్పాదన ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం (అడుగుల్లో) ప్రస్తుతం జోలాపుట్టు 2,750 2730 డుడుమ 2590 2575 పూర్తిస్థాయి ఉత్పాదనకు చర్యలు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మరమ్మతులకు గురైన 1,4 నంబరర్ల జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు. డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిల్వలు ఉన్నందున నీటి సమస్య లేదు. – ఏవీ సుబ్రమణ్యేశ్యరరావు, ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
విశాఖ వెళ్లేందుకు నరకయాతన
● ప్రత్యేక సర్వీసులు నిలిపివేయడంతో ఇబ్బందులు సాక్షి,పాడేరు: పాడేరు నుంచి చోడవరం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గురువారం నరకయాతన పడ్డారు. మోదకొండమ్మ జాతర సందర్భంగా మైదాన ప్రాంతాలకు నడిపిన 18 ప్రత్యేక సర్వీసులు బుధవారం రాత్రితో నిలిపివేశారు. గురువారం ఉదయం నుంచి పాడేరు–విశాఖ మధ్య రెగ్యులర్ బస్ సర్వీసులు నడిచాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల రద్దీ అధికమైంది. విశాఖ వెళ్లే బస్సు సర్వీసులు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ పాడేరు డిపో యాజమాన్యం మైదాన ప్రాంతాలకు అదనంగా బస్సు సర్వీసులు నడపకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెరుగైన వైద్యం అందించాలి
చింతూరు: ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆమె తెలుసుకున్నారు. రోగుల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ, డయాలసిస్ సెంటర్, చిన్నపిల్లల వైద్య విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందించాలని సూచించారు. అన్నిరకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్యసేవలు మెరుగు పరచాలని ఆమె ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి వ్యాధి మూలాలను కనుగొని దానికి తదనుగుణంగా త్వరితగతిన వైద్యసేవలు అందించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ.కోటిరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి -
ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
చింతూరు: గిరిజన సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోరుతూ చింతూరు డివిజన్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలో ఉద్యోగ నియామకాల కోసం చట్టం చేయాలని, మెగా డీఎస్సీలో ఏజన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించి స్థానిక ఆదివాసీ యువతతో పోస్టులను భర్తీచేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలనే డిమాండ్ల సాధన కోసం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సెంట్రల్ కమిటీ నాయకుడు మడివి నెహూర, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు పూసం శ్రీను, తుష్టి జోగారావు, సోడె నారాయణ, కాక రాజు, కుంజా అనిల్, జల్లి నరేష్, మల్లయ్య, రాంప్రసాద్, ముత్తయ్య, రామారావు, రాజశేఖర్, రవి, లావణ్య, శివ పాల్గొన్నారు. -
మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశం చింతపల్లి: తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశించారు. గురువారం ఆయన పాడేరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ డాక్టర్ అభిషేక్ గౌడతో కలిసి మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మాణ పనులు జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్ను తొలగించి టెండర్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రెండో విడత టెండర్లు ప్రక్రియ పూర్తి అయిందన్నారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లతో సకాలంలో నిర్మాణ పనులను పూర్తిచేసేలా ఇంజనీరింగ్ అదికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పనులను నవంబర్ నాటికి పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ మ్యూజియం నిర్మాణానికి 22 ఎకరాలు కేటాయించగా 11 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.35 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.3 ఖర్చు చేయడం జరిగిందన్నారు. వీటికి నిధుల కొరత లేదన్నారు. ఈ మ్యూజియం ప్రారంభానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారన్నారు. అనంతరం రాజుబందలో నిర్మించిన మల్టీపర్పస్ కేంద్ర భవనంతోపాటు గిరిజనులు నిర్మించుకుంటున్న పక్కా ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసు, పాడేరు ఈఈ డేవిడ్ రాజు, డీఈ రఘునాథ్ పాల్గొన్నారు. -
నాటుసారాను నిర్మూలించాల్సిందే
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంరంపచోడవరం: ఏజెన్సీలో నాటుసారా నిర్మూలించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. గురువారం ఆయన మారేడుమిల్లి పీహెచ్సీ, మండల పరిషత్ కార్యాలయంతోపాటు ఏపీఆర్ బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో నాటుసారా తాగడం వల్ల అనేక మంది అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నాటుసారా తయారీ, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈమేరకు రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పీహెచ్సీల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మారేడుమిల్లి పీహెచ్సీలో ఓపీకి వచ్చే రోగులు, గర్భిణులు, బాలింతల వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు ఏపీఆర్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ విశ్వనాథ్, తహసీల్దార్ బాలాజీ, వైద్యాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు ధర్మ పోరాటం
సాక్షి,పాడేరు: గిరిజన డీఎస్సీతో నూరుశాతం గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏల ఎదుట రిలే దీక్షలతో ధర్మపోరాటం చేస్తామని,ఆదివాసీ జేఏసీ నేతలు తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట జేఏసీ నేతలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి మాట్లాడుతూ ఏజెన్సీలో నూరుశాతం ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, సీఎం చంద్రబాబు హమీ ఇవ్వడాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. ఆదివాసీలకు న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం తక్షణమే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మెగా డీఎస్సీ–2025లో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు,హక్కులు ఉన్నాయని,వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ చట్టాలు అమలుజేస్తే ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు శాంతియుతమైన ధర్మపోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపడంతో పాటు,అన్ని ఐటీడీఏల వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు బోయపల్లి సింహాచలం, మినుముల ప్రసాద్, పలాసి తిరుపతిరావు, కిరసాని కిషోర్, తామర సురేష్, నాగరాజు, సోంబాబు, సురేష్, శంకర్,అనిల్ పాల్గొన్నారు. గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి గిరిజన డీఎస్సీకి ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకటించాలి ఆదివాసీ జేఏసీ నేతల డిమాండ్ -
సరిహద్దులో ముమ్మర తనిఖీలు
అప్రమత్తమైన పోలీసులుముంచంగిపుట్టు: మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయన్న సమాచారంతో సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ పోలీసులు బలగాలు పహారా కాస్తూ రాకపోకలపై నిఘాను పెంచారు. ముఖ్యంగా మారుమూల బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, కుమడ, కుజభంగి మార్గాల్లో కల్వర్టులు, వంతెనలను డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన ఒనకడిల్లీ, మాచ్ఖండ్, జోలాపుట్టు గ్రామాల్లో సైతం బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు రాకపోకలపై నిఘా పెంచాయి. ప్రయాణికుల బ్యాగులు,లగేజీలు పరిశీలించి విడిచి పెట్టారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులతో గస్తీ ఏర్పాటుచేశారు. -
త్వరితగతిన సమస్యలపరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలకు సంబంధించి 73 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో పోలవరం ఆర్అండ్ఆర్కు సంబంధించి 48, భూ సమస్యలకు సంబంధించి 7 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఏపీవో సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గర్భిణిని గెడ్డ దాటించి ఆస్పత్రికి తరలింపు
డుంబ్రిగుడ: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని కోసంగి గ్రామానికి చెందిన వంతల అఖిల బుధవారం ఉదయం నుంచి పురిటినొప్పులతో బాధపడుతోంది. ఈ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు, వంతెన సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 108 అంబులెన్సు గ్రామానికి వచ్చే అవకాశం లేకపోవడంతో సర్పంచ్ వంతల వెంకటరావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు గర్భిణిని గెడ్డను దాటించి ఆస్పత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం స్పందించి గ్రామానికి రోడ్డు, వంతెన మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. -
ఏజెన్సీ డీఎస్సీ వెంటనే ప్రకటించాలి
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులను మినహాయించి, ఈనెల 20న జరిగే క్యాబినేట్ సమావేశంలో ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం కమిటీ ప్రతినిధులు పి.అప్పలనరసయ్య, కిల్లో సురేంద్ర, సమిరెడ్డి మాణిక్యం, కుడుముల కాంతారావు మాట్లాడుతూ అడ్వకేట్ జనరల్ ఫైనల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పటికీ నూరుశాతం టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేయకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఏజెన్సీలో నూరుశాతం టీచర్ పోస్టులను కేటాయిస్తూ ఈ నెల 15వ తేదీ నాటికి ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా క్యాబినేట్ సమావేశంలోను తగిన నిర్ణయం తీసుకుని గిరిజనులకు న్యాయం చేసేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ జీవో తెచ్చింది మేమే, ఇచ్చేది మేమే అంటూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణకు సంబంధించి ఈనెల 16న పాడేరులో రాష్ట్రస్థాయి ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సాధన కమిటీ నాయకులు సలీం, కూడా రాధాకృష్ణ, కోటి, జయప్రసాద్, వంతాల నాగేశ్వరరావు, ధర్మన్నపడాల్, బాలదేవ్, భాను పాల్గొన్నారు. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ భవిష్యత్తు కార్యాచరణపై పాడేరులో రేపు రాష్ట్రస్థాయి సమావేశం -
రూ.200 వ్యయం
బియ్యం ఉచితం..గతేడాది అక్టోబర్లో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహన సిబ్బంది (ఫైల్)కొయ్యూరు: మంప పంచాయతీ.. దీని పరిధిలో ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాలు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపుగా వందమంది కార్డుదారులు ఉన్నారు. వీరంతా రేషన్ పొందేందుకు మంప డీఆర్ డిపోకు వెళ్లాలి. దగ్గరమార్గం ఉన్నా రెండు పెద్ద కొండలు ఎక్కి దిగాలి. వర్షాకాలంలో ఈ మార్గంలో వెళ్లి రావడం సాధ్యం కాదు. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదు. దీంతో వీరంతా వీరవరం, దుచ్చర్తి, దాకోడు, బందమామిళ్ల మీదుగా 50 కిలోమీటర్ల దూరంలోని మంప డిపోకు వచ్చి రేషన్ తీసుకువెళ్తున్నారు. ఇందుకు రవాణా చార్జీలు రెండు పక్కలా సుమారు రూ.150 వరకు ఖర్చవుతోంది. రేషన్ తెచ్చుకునేందుకు ఒక రోజు కేటాయించాలి. మంపలో సరియైన హోటళ్లు లేకపోవడంతో టిఫిన్ తిని రోజంతా అర్ధాకలితో ఉంటున్నారు. ఆర్.దొడ్డవరంలో డీఆర్ డిపో ఏర్పాటుచేస్తే అవస్థలు తప్పుతాయని ప్రాధేయపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చినా.. ఇదే సమస్యపై గతేడాది అక్టోబర్లో సీపీఐ నేతలు అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో నవంబర్లో ఎండీయూ వాహనం ఆయా గ్రామాలకు వెళ్లి రేషన్ పంపిణీ చేసింది. ఆ తరువాత నుంచి పరిస్థితి మళ్లీ మామూలే. సీఎం ఆదేశాలను మండల స్థాయి అధికారులు పట్టించుకోలేదు. అప్పటి నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రేషన్ తెచ్చుకుంటున్నారు. డీజిల్ ఖర్చులిస్తే మీ గ్రామాలకు రేషన్ తెచ్చి ఇస్తామని ఎండీయూ నిర్వాహకులు చెబుతున్నారని వారు వాపోతున్నారు. ఇలాంటి గ్రామాలెన్నో.. ● మఠం భీమవరం పంచాయతీలో పెదలంక కొత్తూరు, బుగ్గిరాయి, పుట్టకోట, కాకుల మామిడి, జ్యోతుల మామిడి గ్రామాల గిరిజనులు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని పలకజీడి డీఆర్డిపోకు వచ్చి రేషన్ తీసుకోవాలి. ఈ మార్గంలో ప్రైవేట్ వాహనాలు తిరిగే అవకాశం లేనందున కాలినడకే శరణ్యం. ● యూ.చీడిపాలెం పంచాయతీలో మర్రిపాకల, జెర్రిగంది, గంగవరం, నీలవరం, తీగలమెట్ట, ఎర్రగొంద గ్రామాల గిరిజనులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని యూ.చీడిపాలెం డీఆర్ డిపోకు రావాలి. సరియైన రహదారి సౌకర్యం లేనందున వర్షాకాలంలో వీరు రేషన్ పొందే పరిస్థితి ఉండదు. చర్యలు తీసుకుంటాం ఆర్.దొడ్డవరం గ్రామానికి దివ్యాంగుల కోటాలో డీఆర్ సబ్డిపో మంజూరైంది. అయితే ఆర్హత లేని వారు దీనికి దరఖాస్తు చేయడంతో పోస్టు భర్తీ చేయలేదు. డీలర్ల నియామకాలు జరిగితే వెంటనే అక్కడ ఒకరిని నియమించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – ప్రశాంత్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ, కొయ్యూరు సబ్ డిపో ఏర్పాటుతో మేలు సబ్డిపో ఏర్పాటు చేసే అధికారం, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు మాత్రమే ఉంది. సబ్డిపో ఏర్పాటుకు వారు చర్యలు తీసుకుంటే ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాల గిరిజనులకు ఏదొకవిధంగా రేషన్ పంపిణీ చేస్తాం. రేషన్ తెచ్చుకునేందుకు ఆయా గ్రామాల గిరిజనులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. – విజయకుమార్, బీఎం, జీసీసీ, కొయ్యూరు -
వివాహానికి ముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజన యువత వివాహానికి ముందే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలని రంపచోడవరం పీవో కట్టా సింహాచలం సూచించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతులు పెళ్లి చేసుకునే ముందు తప్పని సరిగా వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దీనిపై పంచాయతీస్థాయిలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సాహించాలని కోరారు. కొంత మంది అబ్బాయిలు ఇతర గ్రామాల నుంచి వచ్చి పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత వెళ్లిపోతున్నారని, ఇసుకపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. ఏజెన్సీలో బాల్య వివాహాలను నిర్మూలించాలన్నారు. ప్రతి గ్రామంలో సకాలంలో ఇంటి పన్నులు కట్టించాలని సూచించారు. త్వరలో కొంత మంది ఐఏఎస్ ఽఅధికారులు గిరిజన గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో కోటేశ్వరరావు, డీఎల్పీవో పద్మజ, ఏవో రమణి, ఈవోపీఆర్డీ శివకుమార్ పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి
సాక్షి, పాడేరు : పాడేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు భార్య గంగాభవానీ (70) మంగళవారం రాత్రి కేజీహెచ్లో వైద్యసేవలు పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి గంగాభవాని మాతృమూర్తి. సమాచారం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారంతా పాడేరులోని గుడివాడ గ్రామానికి చేరుకుని గంగాభవానీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులంతా గంగాభవానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సూచకంగా మధ్యాహ్నం వరకు పట్టణంలోని వర్తకులు దుకాణాలను మూసివేశారు. -
ఆటో, బైక్ ఢీ – ఒకరి మృతి
హుకుంపేట: ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–అరుకు ప్రధాన రహదారి రంగశీల గ్రామ సమీపంలో డుంబ్రిగుడ మండలం కితలంగి గ్రామానికి చెందిన తాంగుల సత్యనారాయణ(40) బైక్పై మంగళవారం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, తనతో ఉన్న రంగశీల గ్రామానికి చెందిన కొర్ర బలరామ్ అనే వ్యక్తి తీవ్ర గాయలు పాలైయ్యాడు. గాయాలతో ఉన్న వ్యక్తిని పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైజాగ్ కేజీహెచ్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పొలీసులు ఘటన స్థలానికి చెరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్పై విశాఖ జోన్, రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కి రూ.170 కోట్లు మాత్రమే.. రాయగడ డివిజన్కు ప్రత్యేకంగా రూ.110 కోట్లు కేటాయింపుకన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. -
నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్కు రివార్డు
కోటవురట్ల : కె.వెంకటాపురంలో 2010లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేష్ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. పోలీసు డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న పాంగి అప్పారావు 2010లో కె.వెంకటాపురంలో తుపాకీతో ఒకరిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముద్దాయి అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి సమయం ముగిసినా సరెండర్ కాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్లో అతని కదలికలు ఉన్నట్టు గుర్తించిన కానిస్టేబుల్ నరేష్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశాడు. వెంటనే ఎస్ఐ రమేష్ సిబ్బంది కలిసి నిందితుడు పాంగి అప్పారావును పట్టుకుని నర్సీపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతనిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నరేష్కు డిపార్ట్మెంట్ తరపున రివార్డును అందజేశారు. నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ రమేష్ అభినందించారు. -
వుషు స్టేట్ టోర్నమెంట్లో 12 మెడల్స్
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో నింజాస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 12 పతకాలు సాధించారు. కర్నూల్ జిల్లా శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన స్టేట్ వుషు చాంపియన్షిప్ పోటీల్లో వీరు పాల్గొన్నారు. అక్షయ రాణి–సీనియర్ వుమెన్.. శ్రీరామ్ నిహాల్, పి.ప్రణీత–సబ్ జూనియర్.. వై.దివాకర్ మెన్ సీనియర్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. జి.సాయి ఉమెన్ సీనియర్, యు.రవికుమార్ సీనియర్ మెన్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో టి.జగదీష్, వై.సాత్విక్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.హర్ష, ఎం.సాయి సందీప్, కె.విజయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ ప్రియాంక్ ఆధ్వర్యంలో క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను మోహన్ ముత్యాల, నేషనల్ రిఫరీ వెంకటేష్ అభినందించారు. 600 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారుల్లో నింజాస్ క్రీడాకారులు పోటీ పడి మెడల్స్ సాధించారన్నారు. -
ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి
● హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో అతిథుల వివరాల నమోదు ● నేర చరితులు, అనుమానితులుంటే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ● ప్రస్తుతం జిల్లాలో 79 చోట్ల యాప్ డౌన్లోడ్ ● దశలవారీగా పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి.. ఇలా చేస్తారు. సందర్శకుల వివరాలను ఆధార్ కార్డు ద్వారా ‘సేఫ్ స్టే’ మొబైల్ యాప్లో నమోదు చేయాలి. వారిలో నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్కు పూర్తి వివరాలు తెలుస్తాయి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తారు. అక్కడకు పోలీసులు వెళ్లి అనుమానితుల పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇది నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి దశగా జిల్లాలో 79 హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌస్లలో యాప్ను డౌన్లోడ్ చేయించారు. దశలవారీగా మిగిలిన చిన్నచిన్న హోటళ్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పోలీస్ శాఖ చెబుతోంది. అనకాపల్లి: అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన నిఘా ద్వారా పౌరులను రక్షించడానికి అనకాపల్లి పోలీసులు ‘సేఫ్ స్టే’ యాప్ను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలలో బస చేసే అతిథుల వివరాలను.. క్రిమినల్ వివరాల డేటాబేస్తో సరిపోల్చి నేరస్తులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీలు, హోటళ్లలో ఈ యాప్ను పొందుపరిచారు. అక్కడ ఎవరు చెక్ ఇన్ చేసినా వారి వివరాలను ఈ ఆన్లైన్ యాప్లో పొందుపరిచి వెంటనే పోలీసులకు పంపిస్తారు. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులెవరైనా ఉంటే తక్షణమే పోలీసులు సులభంగా వారిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఈనెల 8 నుంచి అమల్లోకి.. నేరస్తులను నిలువరించేందుకు సాధారణంగా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమానముంటే అదుపులోకి తీసుకుంటారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతంలో స్టే చేసే వారి వివరాలను సైతం విశ్లేషిస్తే అనుమానితులను ముందే కట్టడి చేయవచ్చు.. లేదా నేరం జరిగాక త్వరగా నిందితులను గుర్తించవచ్చు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేఫ్ స్టే యాప్. ఈనెల 8న జిల్లా పోలీస్ శాఖ ఈ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఈ యాప్ను జిల్లాలోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో డౌన్లోడ్ చేయించారు. మిగతావారు కూడా ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత మరింత పటిష్టం చేసేందుకే.. ‘సేఫ్ స్టే‘ యాప్ ద్వారా నేరస్తులను ముందుగానే గుర్తించవచ్చు. నేరాలను తగ్గించవచ్చు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికి వీలుంటుంది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుంది. దశలవారీగా జిల్లాలో యాప్ డౌన్లోడ్ చేయిస్తాం. త్వరలో రెండో దశలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – తుహిన్ సిన్హా, ఎస్పీ ‘సేఫ్ స్టే‘ యాప్ను అందుబాటులోకి తెచ్చిన అనకాపల్లి జిల్లా పోలీసులు -
12 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి: జాతీయరహదారిపై వేంపాడు టోల్ప్లాజా వద్ద తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి నక్కపల్లి పోలీసులు 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమార స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరుకు చెందిన మునివెంకటప్ప అంజనప్ప, తమిళనాడుకు చెందిన కుప్పా ముత్తులు స్కూలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోతుండగా ఎస్ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద రూ.50 వేలు విలువగల 12 కిలోల గంజాయి లభించిందన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరె స్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. అంజనప్పపై గతంలో హత్య కేసు నమోదయిందని, కుప్పా ముత్తపై గంజాయి కేసు నమోదైనట్టు తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధంగా పీసీ కమిటీ ఎన్నికలు
అడ్డతీగల: మండలంలోని డి.భీమవరంలో పీసా గ్రామకమిటీ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు మోడిద నూకరాజు, కార్యదర్శి పీఠ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్ధానిక తహసీల్దార్ సూర్యారావుకు ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పీసా గ్రామసభలో గిరిజనేతరులు కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని అలాగే ఓటు ఉపయోగించుకోవాలన్నారు. కానీ ఓటింగ్ విషయంలో వారు ఒక అభ్యర్థిని నిలబెట్టి వారికి మాత్రమే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి సీక్రెట్ ఓటింగ్ వేయించారని ఆయన వివరించారు. చట్ట ప్రకారం చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరగాలన్నారు. దీనికి భిన్నంగా ఎన్నికలు జరగడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధుల ఆరోపణ తహసీల్దార్కు ఫిర్యాదు -
భారీగా గంజాయి స్వాధీనం
అల్లిపురం: గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆనందపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, ఒక బొలేరో వాహనం (ఓడీ10 కే 1279), ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి బోయపాలెం, పైడా కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన గంజాయి స్మగ్లర్లు బొలేరో వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో 200 కేజీల గంజాయి లభ్యమైంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువ పంచాయతీ జమ్మూగూడ గ్రామం నుంచి గంజాయి సేకరించి విశాఖలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రఘు హంతల్, నరేంద్ర పాంగీ, బినాయ్ మండల్ , రబీంద్ర కిలాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. -
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందనాన్ని మంగళవారం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ పది రూపాయలు చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్లో ప్రవేశానికిదరఖాస్తుల ఆహ్వానం పెదబయలు: ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో 2025–2026 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, టెన్త్ మార్కుల మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలతో ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల(పెదబయలు)లో లేదా పాడేరు గురుకులం సెల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ తెగల విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన వివరించారు. -
జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి కల్పిస్తాం
సీలేరు: ఉద్యమం పేరుతో అడవిలో తిరుగుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే తమ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తామని చింతపల్లి ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందన్నారు. జీకే వీధి, చింతపల్లిలో మావోయిస్టులకు సహకరించే మిలీషియా లొంగుబాట్లు భారీగా జరిగాయన్నారు. ఎదురు కాల్పుల్లో కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మరికొంత మంది మావోయిస్టుల కోసం గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు జిల్లా పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై కూడా ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. గిరిజనులు ఎక్కడైనా రహస్యంగా గంజాయి సాగు చేసినా డ్రోన్లు ద్వారా వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జీకే వీధి సీఐ వరప్రసాద్ పాల్గొన్నారుమావోయిస్టులకు చింతపల్లి ఏఎస్పీ నవజోతిమిశ్రా సూచన -
జీపు బోల్తా– ఒకరు మృతి
జి.మాడుగుల: పాడేరు రోడ్డు మార్గంలో మంగళవారం మిట్టమామిడి జంక్షన్ వద్ద జీపు బోల్తా పడిన సంఘటనలో గిరిజన మహిళ మృతి చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ షణ్ముఖరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోదకొండమ్మ పండగకు వెళ్లి ప్రయాణికులతో వస్తున్న జీపు మంగళవారం తెల్లవారుజామున కె.కోడాపల్లి పంచాయతీ మిట్టమామిడి జంక్షన్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాద సంఘటనలో చింతపల్లి మండలం బయలుకించంగి పంచాయతీ పినకొత్తూరు గ్రామానికి చెందిన కొర్ర లక్ష్మి(27) తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో కొర్ర నందిని, పద్మకు గాయలైనట్టు చెప్పారు. గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై మృతురాలి భర్త రంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. -
శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు
మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన రూ.31 కోట్ల నిధులతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జల జీవన్ మిషన్ పనులు కూడా జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించినట్టు ఆమె తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కోదానికి సుమారు రూ.74 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.దోమల బెడద నివారించండి: అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఏజెన్సీలో 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశాల్లో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించారు. సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
థియేటర్లలో నవ్వులే నవ్వులు
డాబాగార్డెన్స్ : యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో మీడియామీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ : నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. దర్శకుడు కార్తీక్రాజు సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి ప్రేక్షకులను నవ్వించారని, ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం : హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని వారు కొనియాడారు. సింగిల్.. అలరించే కామెడీ ఎంటర్టైనర్ విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్ -
ప్రమోదం.. ప్రభంజనం
ఉత్సవాల వేళ ప్రభంజనంలా తరలివచ్చిన భక్తజనం అమ్మవారి దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయారు.ఉత్సవాల చివరి రోజు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అమ్మవారి నామసర్మణ మారుమోగింది. ఉత్సవ కమిటీ, అధికారులు అమ్మవారి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి గిరిజన ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశా యి. ఉత్సవాల చివరిరోజు మంగళవారం ఉదయం నుంచే భక్తులు వేలాదిగా పాడేరుకు తరలివచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జీకేవీధి జెడ్పీటీసీ శివరత్నం దంపతులు,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిముడు కోటిబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని భక్తులంతా ఇంటిలో కొలువుదీర్చిన మట్టి, ఇత్తడి ఘటాలను మోదకొండమ్మ ప్రధాన ఆలయం వరకు మోసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సతకంపట్టు వద్ద మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మోదమ్మను దర్శించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, వి.మాడుగుల మాజీ ఎంపీపీ పెదబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా అనుపోత్సవం అమ్మవారి అనుపు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. సతకంపట్టు వద్ద ఉత్సవ విగ్రహం, పాదాలు,ఇతర ఘటాలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,శివరత్నం దంపతులు, ఇన్చార్జి కలెక్టర్, జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహం, పాదాలను ఎమ్మెల్యే దంపతులు బయటకు మోసుకువచ్చి ఊరేగింపు సంబరాన్ని ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలు,పాదాలను మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనలు సంబరంలో శక్తివేషాలు, రాక్షస వేషాలు, కోలాటాలు, కేరళ, తీన్మార్ డప్పు వాయిద్యాలు హోరెత్తాయి.ఽథింసా,కాంగో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన రోడ్డు నుంచి ఆలయం వరకు సంబరం అ త్యంత వైభవంగా జరిగింది. వేలాది సంఖ్యలో భక్తు లు తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఊరేగింపు అనంతరం ఉత్సవ విగ్రహాలు, పాదాలను ప్రధాన ఆలయంలో కొలువుదీర్చారు. ఎస్పీ అమిత్బర్దర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఘనంగా ముగిసిన మోదకొండమ్మ ఉత్సవాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగిన పాడేరు భారీగా తరలివచ్చిన భక్తజనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలుభక్తులకు భోజనాలు వడ్డిస్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
రానున్న వారం రోజుల్లో తేలిక పాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న వారం రోజు ల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్థా నిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వెల్లడించారు. ఈ వారం రోజులు గరిష్ణ ఉష్ణోగ్రతలు 36.8 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 26 డిగ్రీలు మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 75 నుంచి 82 శాతం మధ్యాహ్న వేళల్లో 40 నుంచి 65 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలి గంటకు ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. పంటలు వేసుకున్న ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.గిరిజన హక్కులు,చట్టాలను కాపాడాలి ● మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): గిరిజన హక్కులు, చట్టాలను కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ను అమలుచేసి శతశాతం ఉద్యోగాలు గిరిజన అభ్యర్థులకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు గిరిజన చట్టాలు అమలు చేసి, హక్కులు కాపాడాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గంజాయి, గంజాయి లిక్విడ్ రవాణా నివారణకు అధికారులు అడ్డుకట్టవేయాలని కోరారు. -
ఇసుక తోడేళ్లు
ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. గోదావరి నదీతీరంలో అనధికార ర్యాంపులు నిర్వహిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్లేవారిపై దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ తవ్వకాలు జరిగే ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు సాహసించలేకపోతున్నారు.గోదావరి తీరంలోఎటపాక: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం గోదావరి నది నుంచి ట్రాక్టర్లలో తెలంగాణ ప్రాంతానికి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు శాఖలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● అర్ధరాత్రి వేళ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఎటపాక, చంద్రంపాలెం, కన్నాయిగూడెం, గుండాల, రాయనపేట, గోగుబాక, తోటపల్లి గ్రామాలకు సమీప గోదావరి నదిలో అనుమతులు లేకుండా ర్యాంపులు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం, గుండాల, కొల్లుగూడెంలో అధికారిక ఇసుక ర్యాంపులు మూతపడటం ఇసుక మాఫియాకు కాసుల పంటగా మారింది. ● భద్రాచలం పట్టణంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. రాత్రివేళ విధులు నిర్వహించే అధికారులపై ఇసుక మాఫియా దాడులకు తెగపడుతోంది. దీనివల్ల కూడా అధికారులు, సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ● ఇసుక అక్రమార్కులు రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇసుక లోడింగ్కు యువకులు, మైనర్లను తీసుకు వస్తున్నారు. ట్రాక్టర్లు నడిపే వారిలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్సులు లేనట్టు తెలుస్తోంది. తెల్లవార్లు ఇసుక వాహనాలను అతివేగంగా నడుపుతుండటం ప్రమాదాలకు దారి తీస్తోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఇద్దరు మృత్యువాత పడ్డారు. జేసీబీ అదుపుతప్పడంతో.. ఎటపాక మండల కేంద్రంలో టిప్పర్లోని ఇసుకను మేడువాయి సమీపంలో అన్లోడ్ చేస్తుండగా టిప్పర్ గుంతలో దిగుబడింది. దీనిని బయటకు తీసే క్రమంలో జేసీబీ అదుపుతప్పి తగలడంతో వాహనాల యజమాని వాసు ప్రాణాలు కోల్పోయాడు.బాలుడి ప్రాణాలు బలి ● ఇసుక ట్రాక్టర్ బోల్తా ● ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్ ఎటపాక: ఇసుక అక్రమ రవాణాకు బాలుడు బల య్యాడు.రాయనపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈఘటన చోటు చేసుకుంది. ఎటపాక గ్రా మానికి చెందిన ఓవ్యక్తి రాయనపేట సమీపంలో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ పంపించాడు. ఈ క్రమంలో ఇసుకను భద్రాచలంలో అన్లోడ్ చేసి మళ్లీ లోడ్ చేసుకునేందుకు డ్రైవర్తో పాటు కోడి చరణ్ అనే బాలుడు కలిసి రాయనపేట ర్యాంపుకు వస్తున్నారు. ఈక్రమంలో గుండాల,రాయనపేట మధ్యలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బాలుడు చరణ్(16) ట్రాక్టర్ కిందపడి చనిపోగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ కన్నపరాజు తెలిపారు. అర్ధరాత్రి వేళ అక్రమ రవాణా ట్రాక్టర్ లోడు రూ.4 వేలకు విక్రయంర్యాంపులకు నేరుగా రహదారుల ఏర్పాటు తెలంగాణ ప్రాంతానికి యథేచ్ఛగా తరలింపు రాత్రివేళ నిఘాకు సిబ్బంది కొరత రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక, పోలీసుల బందోబస్తు లేక రాత్రి వేళ నిఘా ఏర్పాటు చేయలేకపోతున్నాం. రాత్రి వేళల్లో వారు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఫిర్యాదులు వచ్చిన సమయాల్లో కూడా భయపడాల్సి వస్తోంది. అయినప్పటికీ ఈ ఆరు నెలల్లో ఐదు కేసులు నమోదుచేసి వాహనాలను అదుపులోకి తీసుకున్నాం. – సుబ్బారావు, తహసీల్దార్, ఎటపాకఅక్రమార్కులు రెచ్చిపోతున్నారు రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తూ కూలీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిని అరికట్టడంలో అధికారులు విఫలమవడంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మరిన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. – ఐ.వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యుడు, సీపీఎం అడ్డుకునేందుకు వెళ్లే అధికారులకు దాడుల భయం -
ఉచిత పథకాల పేరిట ‘కూటమి’ మోసం
వీఆర్పురం: ఉచిత పథకాల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.రమణి ఆరోపించారు. ఐద్వా శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేసిందన్నారు. నిధుల కొరత పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. తల్లికి వందనం, ఫ్రీగ్యాస్, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి రూ.3వేలు, గృహణిలకు నెలకు రూ.1500 ఇస్తానని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ప్రభుత్వ విధానాలపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ఆదివాసీ హక్కులు, చట్టాల అమలును పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఐద్వా జిల్లా ప్రతినిధులు పద్మ, నున్నం పార్వతి, ముర్రం రంగమ్మ, వీరమ్మ, సుబ్బమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వీఆర్ పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల మహిళా సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.నూరు శాతం ఫలితాల సాధన పెదబయలు: ముంంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. 2024–2025 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్లస్–2లో 76 మంది పరీక్షలు రాస్తే 76 మంది ఉత్తీర్ణత సాధించారని, టెన్త్లో 57 మందికి 57 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. టెన్త్లో వరుసగా నాలుగేళ్ల పాటు శాతశాతం ఉత్తీర్ణత, ఇంటర్ ప్లస్–2లో రెండేళ్ల పాటు శతశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు. -
బొడ్డేడ ప్రసాద్కు సన్మానం
సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డెడ ప్రసాద్ సోమవారం పాడేరులో పర్యటించారు.అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ,వైఎస్సార్సీసీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్లు ఘన స్వాగతం పలికారు.అనంతరం దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. పెళ్లిరోజు జరుపుకొంటున్న అరకు ఎంపీ తనూజరాణి,చెట్టి వినయ్ దంపతులకు పార్టీ పరిశీలకులు ప్రసాద్,పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజులు అభినందనలు తెలిపారు.పూలమాలలతో సత్కరించారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకులోయలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అరకులోయ పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీకి, వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించనున్నట్టు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అంతకుముందు పరిశీలకుడి హోదాలో మొదటి సారి అరకులోయ వచ్చిన బొడ్డేడ ప్రసాద్కు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాతో సత్కరించి, స్వాగతం పలికారు. అనంతరం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగంను పరిశీలకుడు ప్రసాద్ సన్మానించారు. ఈకార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చాటరీ జానికమ్మ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు పాంగి చిన్నరావు, నియోజవర్గం ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ -
పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు
హుకుంపేట: జర్నలిస్టులను వేధించడం సరికాదని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం దారుణమని డాక్టర్ వైఎస్సార్, టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెడబారికి సురేష్కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రం హుకుంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని చెప్పారు. తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్కు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి కాని, ఇంటికి పోలీసులను పంపించడం తగదన్నారు. నిజాలు ప్రచురించే పత్రికలపై అధికారం ఉందని కక్షసాధింపు చర్యలు తగవని హెచ్చరించారు. కూటమి నాయకులు రెడ్బుక్ పాలన అమలు చేసున్నారని ఆరోపించారు. -
మాజీ మంత్రి రజినిపై సీఐ తీరు సరికాదు
కూనవరం: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పాలన కొనసాగిస్తుందని, మహిళలను సైతం విడిచిపెట్టడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల మరియాదాస్ మండిపడ్డారు. చిలకలూరి పేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని మర్చిపోయి పోలీస్ జులుం చూపిస్తూ మాజీ మంత్రి, బీసీ మహిళ విడదల రజినిపై ప్రవర్తించిన తీరును నిరసిస్తూ టేకులబోరు సెంటర్లో సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి, అనేక విధాలుగా వేధిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులుపెట్టి, చిత్రహింసలకు గురిచేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, సర్పంచ్లు కారం పార్వతి, సున్నం అభిరాం, కట్టం లక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు డి.గంగాధర్, భరతమూర్తి, కొండలరావు, వెంకన్న, సత్యనారాయణ, మధు, పాపారావు, లక్ష్మణరావు, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు. -
డుంబ్రిగుడలో భారీ వర్షం
డుంబ్రిగుడ: మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు చోట్ల చెట్లకొమ్ములు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డుంబ్రిగుడలోని ఓ శుభకార్యంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డుతో పాటు టెంట్లు పడిపోయాయి. నేడు మోదమ్మ అనుపోత్సవం సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజు మోదకొండమ్మతల్లి అనుపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మధ్యాహ్నం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ విగ్రహం,పాదాలు,ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు.సాంస్కృతిక కళాప్రదర్శనలు, నేల వేషాలు, డప్పు వాయిద్యాలతో అనుపోత్సవం జరుగుతుందన్నారు.అన్ని వర్గాల భక్తులు ఈ ఉత్సవానికి భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కోరారు. -
బ్యాలెట్ విధానంపైనా అనాసక్తి
అడ్డతీగల: అడ్డతీగల గ్రామ పీసా కమిటీ ఎన్నిక బ్యాలెట్ విధానంలో సోమవారం నిర్వహించినా ఓట్లు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపలేదు. తరచూ కోరం లేక వాయిదా పడుతున్న నేపథ్యంలో చేతులు ఎత్తే విధానంలో కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టారు. దీంతో సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వహించారు. అడ్డతీగల పంచాయతీలోని డొక్కపాలెం, అనిగేరు, అడ్డతీగల గ్రామాల్లో కలిపి 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం నాటి బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికకు 257 ఓట్లు పోలయ్యాయి. దీంతో పీసా ఎన్నికపై సందిగ్ధత తొలగలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపు ఉన్నతాధికార్ల సమక్షంలో జరిపి ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికను తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్స్ని ప్రత్యేక గదిలో ఉంచి తాళాలు వేసి పోలీసులకు అప్పగించారు. అడ్డతీగల గ్రామ పీసా ఎన్నికపై తొలగని సందిగ్ధత -
సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలి
రంపచోడవరం: దేవీపట్నం మండలం వెలగపల్లి–గుంపెనపల్లి గ్రామాల మధ్యలో సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీవో కట్టా సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు–చింతలపూడి గ్రామాల మధ్య 16 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయిందని, ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయాలని సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి, సిరిమల్లిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని కోరారు. వై.రామవరం మండలం పూతిగుంట నుంచి తోటకూర పాలెం వరకు 170 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, చింతకొయ్య ఎంపీపీ స్కూల్ నుంచి 180 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ఎంపీపీ ఆనంద్ అర్జీ అందజేశారు. రాజవొమ్మంగి మండలం కొండపల్లి రిజర్వాయర్ పూడిక తీతకు చర్యలు తీసుకోవాలని పీసా ఉపాధ్యక్షుడు వీరబోయిన బాలరాజు వినతి పత్రం అందజేశారు. రంపచోడవరం మండలం ఇసుకపట్ల గ్రామంలో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని విండెల రామారావు, చెదల రాజారెడ్డి కోరారు. గ్రీవెన్స్లో 30 అర్జీలు వచ్చినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్వీ రమణ, ఎస్డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
క్యారవాన్ టూరిజానికి స్థలాల పరిశీలన
చింతపల్లి: మండలంలోని తాజంగి,లంబసింగి జాతీయ రహదారికి సమీపంలో క్యారవాన్ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించినట్టు స్థానిక తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం తాజంగి,లంబసింగి పంచాయతీల పరిధిలో గల పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించినట్టు చెప్పారు. కేరళ ప్రాంతంలో ఈ క్యారవాన్ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పర్యాటకుల కోసం క్యారవాన్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేకంగా ఎటువంటి గదులు ఏర్పాటు చేయబోమని తెలిపారు.అయితే కనీస అవసరాలైన మరుగుదొడ్లు, తాగునీరు,క్యాంటీన్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. తాజంగి పంచాయతీలో ఒక స్థలం, లంబసింగి పంచాయతీ పరిధిలో గల భీమనాపల్లి గ్రామ సమీపంలో ఒక స్థలం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతులకు క్యారవాన్ కేంద్రాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. వివరాలను కలెక్టర్కు నివేదించనున్నట్టు తహసీల్దారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్,వీఆర్వో సదానంద్, సిబ్బంది పాల్గొన్నారు. సుజనకోటలో.. వుుంచంగిపుట్టు: సుజనకోట పంచాయతీ కేంద్రంలో రెవెన్యూ అధికారులు క్యారవాన్ టూరిజం కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలతో తహసీల్దార్ నర్సమ్మ ఆధ్వర్యంలో సోమవారం సుజనకోటలో మత్స్యగెడ్డ ఒడ్డున గల స్థలాన్ని రెవెన్యూ,ఐటీడీఏ టూరిజం అధికారులు పరిశీలించి, వివరాలు ఉన్నతాధికారులకు పంపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్,వీఆర్వో భాస్కర్,సర్వేయర్లు పాల్గొన్నారు. -
అన్నదాతల మోములో ఆశలమోసులు
సాక్షి,పాడేరు: ఈ ఏడాది రబీలో రెండవ పంటగా గిరిజనులు సాగు చేసిన వరి పొట్టదశలో కళకళాడుతోంది. దీంతో అన్నదాతల మోములో ఆశలు మోసులెత్తుతున్నాయి. గత నెలతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రబీ పంటకు ఎంతో మేలు చేశాయి. వేసవిలో అధిక వర్షాలు కురవడం ఇదే మొదటిసారి కావడంతో జిల్లా వ్యాప్తంగా రబీ పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయింది. ప్రస్తుతం వరిపంట ఆశాజనకంగా ఎదుగుతుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో 2,361 హెక్టార్లలో వరిపంటను సాగు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే రబీ సాగుకు వినియోగించారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి వస్తుంది.వర్షాలు,వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడులు అధికంగా ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు తెలిపారు. కలిసిరానున్న రబీ మేలు చేసిన వర్షాలు జిల్లాలో 2,361 హెక్టార్లలో వరి సాగు -
పురోగతి లేని సచివాలయ భవనాలు.!
● మధ్యలో నిలిచిన నిర్మాణాలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● నీరుగారుతున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యం గూడెంకొత్తవీధి: ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చకచకా సాగాయి. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. గూడెంలో సగమే పూర్తి గూడెం కొత్తవీధి మండలంలో 18 సచివాలయాల నిర్మాణాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో ప్రస్తుతానికి 9 మాత్రమే పూర్తయ్యాయి. పేరుకు మండల కేంద్రం అయినా గూడెంకొత్తవీధిలో సచివాలయం అసంపూర్తిగానే ఉండిపోయింది. పాత పంచాయతీ భవనంలోనే సచివాలయం కొనసాగుతోంది. ఆర్వీ నగర్లోనూ ఇదే పరిస్థితి. అసంపూర్తిగా భవనం మొండిగోడలతో దర్శనమిస్తోంది. ఇక రైతు భరోసా కేంద్రాలు 18కి 10 మాత్రమే పూర్తయ్యాయి. 8 పూర్తి కావల్సి ఉంది. భవనాలున్నా వినియోగించని తీరు మండల కేంద్రంలో కొన్ని శాఖలకు సొంత భవనాలు లేకపోగా.. మరికొన్ని శాఖలకు సొంత భవనాలున్నా వాటిని వినియోగించని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి కోసం గతంలో ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ పోస్టే లేకుండా పోవడంతో ఈ భవనం నిరుపయోగంగా ఉంది. కనీసం ఇతర శాఖల అవసరాలకు అయినా ఈ భవనాన్ని వినియోగించడంలేదు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారుల కోసం ఇక్కడ మరో భవనం నిర్మించారు. దాన్ని కూడా ఆ శాఖ అధికారులు వినియోగించడం లేదు. దీంతో అది తుప్పల మధ్య నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అసంపూర్తి భవనాలను పూర్తి చేయకపోవడంపై స్థాఽనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన సచివాలయ భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు. భవనాల పూర్తికి చర్యలు మండలంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిధులు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – జ్యోతిబాబు, పీఆర్ మండల ఇంజినీరింగ్ అధికారి -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని 18 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రం పాడేరులోని జూనియర్ కళాశాల సెంటర్తో కలిపి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు సంబంధించి 3,075మంది విద్యార్థులకు గాను 31మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.ఒకేషనల్ కోర్సుల్లో 515 మందికిగాను 9 మంది పరీక్ష రాయలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ కోర్సుల్లో 1,564 మందికి గాను 14 మంది గైర్హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి సొంటేన భీమశంకరరావు మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లోను సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.విద్యార్థులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. రాజవొమ్మంగి : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు నలుగురు, ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ముగ్గురు గైర్హాజరైనట్టు ఆయన చెప్పారు. -
తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల చెంతకు
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.కంకిపాటి వైశాలి అనే బాలిక మోదకొండమ్మతల్లి ఆలయం రోడ్డులో సోమవారం సాయంత్రం తప్పి పోయింది.బాలిక తండ్రి ఈశ్వరరావు అక్కడ విధుల్లో ఉన్న హుకుంపేట ఎస్ఐ ఎల్.సురేష్కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు.డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో గాలించారు.కొంతదూరంలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ బాలిక గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు.తప్పి పోయిన బాలికను సకాలంలో గుర్తించి,తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ సురేష్ను ఎస్పీ అమిత్బర్దర్ అభినందించారు. సకాలంలో స్పందించిన హుకుంపేట ఎస్ఐ సురేష్ -
అ
ద్వితీయం... మ్మ సంబరంఆకర్షణీయంగా శక్తి, రాక్షస వేషాలు అంగరంగ వైభవంగా ఘటాల ఊరేగింపు డప్పుల దరువులు.. థింసా నృత్యాలు సాక్షి,పాడేరు: ఉత్తరాంఽధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి రాష్ట్ర గిరిజన జాతరను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో రెండో రోజైన సోమవారం అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ ఘటాలను పాడేరు వీధుల్లో ఘనంగా ఊరేగించి, పూజలు చేశారు. రాత్రి వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మహిళలు ఘటాలను దర్శించుకున్నారు. శక్తి,రాక్షస వేషాలు,గరగల నృత్యాలు,కేరళా బ్యాండ్, డప్పు వాయిద్యాల నడుమ ఘటాల ఊరేగింపు సాగింది. థింసా నృత్యాలతో గిరిజన యువతులు సందడి చేశారు. అనంతరం ఈ ఘటాలను సతకంపట్టు ఉత్సవ విగ్రహం వద్ద కొలువుదీర్చారు. కేజే పురం మహిళలు సతకంపట్టు స్టేజీపై ప్రదర్శించిన కోలాటం భక్తులను అలరించింది. ప్రత్యేక పూజలు సోమవారం మోదకొండమ్మతల్లి పుట్టినరోజు కావడంతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, చెట్టి వినయ్ దంపతులతో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మూర్తి దంపతులతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అరకు ఎంపీ,ఎమ్మెల్యే,జెడ్పీ చైర్పర్సన్లకు ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో సన్మానించారు. మోదమ్మ చిత్రపటాలను,ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా సురేష్కుమార్, కొణతాల ప్రశాంత్,కూడి వలసంనాయుడు, కేజీయారాణి,కొణతాల సతీష్, బోనంగి వెంకటరమణ,సల్ల రామకృష్ణ,కాంగు చిన్ని,మోద స్వరూప,మోరి స్వర్ణ, డి.పి.రాంబాబు,రాధాకృష్ణ,చంద్రమోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: ఆస్పత్రులో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఆదివారం స్థానిక సీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లోని రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. చర్మవ్యాధులతో బాధపడుతున్న రంగబయలు పంచాయితీ గొబ్బరపడకు చెందిన ఐదుగురు చిన్నారులను పరిశీలించారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.తక్షణమే గొబ్బరపడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పటు చేయాలని వైద్యులకు ఆయన సూచించారు.అనంతరం ఆస్పత్రిలో సమస్యలను వైద్యాధికారిణి గీతాంజలి నుంచి తెలుసుకున్నారు. మందులు,సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఆస్పత్రిలో మందులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, మండల ప్రధాన కార్యదర్శి ముక్కి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశం ముంచంగిపుట్టు సీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
కవి నూనె రమేష్కు జాతీయ యువకీర్తి పురస్కారం
వీఆర్పురం: ఏలూరులోని మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో మన్యం కవి నూనె రమేష్కు జాతీయ యువకీర్తి ప్రతిభా పురస్కారం లభించింది. సాహితీ సంబరాల్లో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ను ప్రసిద్ధ గాయకుడు గజల్ శ్రీనివాస్, కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం. చిట్టె లలిత, సాహితీ సంబరాల కన్వీనర్, పార్థసారధి, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు సత్కరించారు. ఆయనను పలువురు అభినందించారు. -
ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట
రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత పంచాయతీ వెంకటనగరంలో ఆదివారం జరిగిన శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ట మహోత్సవాన్ని పురోహితులు ఈమని సత్యన్నారాయణ, నరశింహామూర్తి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం స్వామి వారిని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ల సూరిబాబు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, కమిటీ సభ్యులు అబ్బాయిరెడ్డి, శ్రీను, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఎటపాక: ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కరరావు(62) భద్రాచలంలో గృహనిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత రెండు నెలల నుంచి భద్రాచలంలోని తన కుమార్తె వద్ద ఉంటూ పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం పనిలేకపోవడంతో స్వగ్రామం సీతాపురం వచ్చాడు. ద్విచక్రవాహనంపై తిరిగి భద్రాచలం బయలుదేరాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిపేట సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్రావు రహదారిపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అప్పలరాజు తెలిపారు.ఘటన స్థలంలోనే గృహ నిర్మాణ కార్మికుడి మృతి -
సింహాచలం ఈవోగాసుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): ఈనెల 20 నుంచి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ అరకులోయ పరిధిలోని ఐటీడీఏ టూరిజం కార్మికులు గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి, కొత్తపల్లి జలపాతం కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈమేరకు స్థానిక మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు ఆయన వివరించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలని, కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా కనీస వేతన చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలకు నోచుకోవడం లేదన్నారు. ఈనెల 20న అన్ని యూనిట్లు మూసి వేసి విధులు బహిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంతల రాజు, జయరాజు, రాంబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు -
ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన
రంపచోడవరం: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఆదివారం సిరిగిందలపాడులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి పరిజ్ఞేయనందజీ మహారాజ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో 64 మంది రక్త పరీక్షలు నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు.45 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15 మందికి కళ్లజోళ్లు అందజేశారు. కంటి ఆపరేషన్ల నిమిత్తం నలుగురిని వేమగిరి కంటి ఆస్పత్రికి తరలించారు. వైద్యశిబిరంలో వైద్యులు తలారి సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమమహేష్ 200 మందికి వైద్య సేవలందించారు. క్యాంప్ ఇన్చార్జి లోకమయనందజీ మహారాజ్, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్గా బొజ్జిరెడ్డి
రంపచోడవరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రంపచోడవరానికి చెందిన చోళ్ల బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొండ రెడ్డి గిరిజన తెగకు చెందిన బొజ్జిరెడ్డి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ 2009లో రంపచోడవరం నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. పదవీ విరమణ తరువాత పూర్తి సమయాన్ని పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఆయన నియామకంపై బీజేపీ నాయకులు కారం సీతారామన్నదొర, ప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
పెళ్లయిన మూడు రోజులకే..
● స్నేహితులతో స్నానానికి వెళ్లి నవ వరుడు దుర్మణం రావికమతం : మండలంలో టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లి గ్రామానికి చెందిన ఆసరి జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ(22)తో గిరిజన సంప్రదాయంలో ఈ నెల 8 న గురువారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇవ్వడానికి వెళ్లిన జగదీష్ అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. గ్రానైట్ క్వారీ వద్ద భారీ గొయ్యిలో ఈతకు దిగి దుర్మరణం పొందాడు. ఈ సంఘటన పాత కొట్నాబిల్లిలో చోటు చేసుకొంది. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాల మేరకు ఐదుగురు మిత్రులకు పెళ్లి పార్టీ శనివారం గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వద్ద ఇచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. జగదీష్ మాత్రం తవ్వకాల వల్ల ఏర్పడిన గోతిలో ఈతకు దిగాడు. మిగిలిన స్నేహితులకు ఓపిక లేక ఒడ్డునే ఉన్నారు. జగదీష్ ఈతకు దిగి మునిగి పోయిన సంగతి స్నేహితులు గమనించలేదు. స్నేహితులకు మద్యం మత్తు వదిలాక జగదీష్ అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి ఊర్లోకి వచ్చేశారు. శనివారం రాత్రి జగదీష్ రాకపోవడంతో బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆదివారం క్వారీ వద్ద గోతిలో శవమై తేలాడు. ఘటనపై మృతుడి తండ్రి సీతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
3
శతాబ్దాలుగా.. 300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్నాయక్ దాస్ (రుషికేష్నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్నాయక్దాస్ ఏడేళ్ల వయస్సు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తుల ఆశ్రయం దాస సత్రం రుషికేష్నాయక్దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్నాయక్దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మహరాణిపేట: పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఏమండి సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామిరెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోబింద్ బోధాపు, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రంభ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.మురళీ నాయక్కు వైఎస్సార్ సీపీ నేతల నివాళి -
ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..
● ఒడిశాలోని తమ స్వగృహంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సింహాచల క్షేత్రంలో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలన్నీ ఆచరిస్తుంటారు. ● సింహాచలం క్షేత్రంలో లక్ష్మీకాంత్నాయక్దాస్ ఉన్న మూడు నెలల్లో స్వామికి ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఏటా నృసింహ హోమాన్ని నిర్వహిస్తుంటారు. ● దాసుడి దగ్గర తమకున్న మానసిక, ఆరోగ్య రుగ్మతలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. దానికనుగుణంగానే సింహగిరిపై ఉన్న దాస సదనంలో తమను ఆశ్రయించేవారికి దాసుడు వైద్య సేవలందిస్తారు. ● స్వామికి అంతరాలయంలో ప్రతి రోజు పూజ అనంతరం దాసుడు భక్తులకు తులసి ప్రసాదాన్ని, గంగమ్మతల్లి సన్నిధిలో దీపం వెలగించిన నూనును ఇస్తారు. ఆ తులసి ప్రసాదం తిన్నా, నూనెను శరీరానికి, తలకు పట్టించుకున్నా రోగాలు నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. ● 2008లో సింహగిరి దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా దాస సత్రాన్ని దేవస్థానం తొలగించింది. ప్రత్యామ్నాయంగా జఠల్సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇవ్వడంతో అక్కడే లక్ష్మీకాంత్నాయక్దాస్ సత్రాన్ని నిర్మించారు. ఆ సత్రంలోనే ఈ మూడు మాసాలూ బసచేస్తుంటారు. -
మాతృమూర్తులే సమాజానికి దిక్సూచి
మహారాణిపేట(విశాఖ): స్థానిక ప్రకృతి చికిత్సాలయంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం సంయుక్త నిర్వహణలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ మాతృమూర్తులు సమాజానికి దిక్సూచిలాంటివారని, పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది వారేనన్నారు. ఈ సందర్శంగా దేశంలో భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందిన మొదటి వనిత ఆచార్య చిలుకూరి శాంతమ్మను ఘనంగా సత్కరించారు. ఈ వయసులో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతూ, 20 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలు పొందడం శాంతమ్మ ఘనతకు నిదర్శనాలని కొనియాడారు. సన్మాన గ్రహీత శాంతమ్మ మాట్లాడుతూ యువత విద్యలో, క్రీడల్లో కృషిచేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ఎస్.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీలక్ష్మి, ఏవీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సింగరాజు కృష్ణకుమారి, సింగరాజు సతీష్ కుమార్, ఏయూ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పుల్లారావు, తలాడ గిరిజ మాతృమూర్తుల త్యాగాలను, వారి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రూపాకుల రవికుమార్, చొక్కాకుల రాంబాబు, పల్లా చలపతిరావు, దేవర చంద్రశేఖర్, సీహెచ్ రాజబాబు, ఎర్నింటి లక్ష్మి, ఎర్నింటి వెంకటలక్ష్మి, బొట్ట రమణమ్మ , గేదెల శ్రీహరి , రాహుల్, ఎ.రాధ తదితరులు పాల్గొన్నారు. మాతృదినోత్సవంలో ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి -
అప్రమత్తంగా ఉండండి
కొమ్మాది: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. రుషికొండ బీచ్లో ఆదివారం ఆయన పర్యటించారు. తీరం వెంబడి అనుమానిత వ్యక్తులు కనిపించినా.. అనుమానంగా బోట్లు పయనించినా తమకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. రుషికొండ బీచ్కు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారని.. జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. -
నీ తోడే నా కనుచూపుగా...
● దాతల దీవెనలతో ఒక్కటైన అంధ జంట ● అతిథులు రాకతో కళకళలాడిన ప్రేమ సమాజం డాబాగార్డెన్స్: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది. డాబాగార్డెన్స్లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు. అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అండగా నిలిచిన దాతలు ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్, అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు(25) అనే యువకుడు మనస్తాపంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉన్న మృతుడికి ఆ కారణంతోనే వివాహం కాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా పని చేస్తున్న తాతారావు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1.30 సమయంలో సమీపంలోని అమ్మమ్మవారి ఇంటి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి అమ్మానాన్న అప్పలకొండ, నారాయణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
పాడేరు రూరల్: పట్టణంలో పలుచోట్ల నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేశారు. పట్టణంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోదమాంబ కాలనీ, పీఎంఆర్సీ కాలనీ, లోచలికపుట్టు, సుండ్రుపుట్టు రామాలయం కాలనీ, గోల్డెన్నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను జిల్లా సర్కిల్ ఎస్ఈ జి.ఎన్.ప్రసాద్, డివిజనల్ ఈఈ ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడేరు మోదమాంబ అమ్మవారి పండుగలో భాగంగా విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ, జేఈ శ్రీనివాస్,సిబ్బంధి త్రీమూర్తులు,తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఉత్సవ మూర్తుల ఊరేగింపు
● అరకులో ముగిసిన వెంకన్నకల్యాణోత్సవాలు అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో గత మూడు రోజులుగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గిరిజన థింసా నృత్యాల నడుమ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రధాన రహదారి, యండపల్లివలస మీదుగా అరకు సంత బయలు వరకు సాగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు బాల గణేష్, ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్లు దాసుబాబు, సివేరి బాలకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సింగరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కాపుగంటి కృష్ణారావు, అప్పలరామ్, చందూ, సత్యనారాయణ, లకే బొంజుబాబు, రంగరాజు పాల్గొన్నారు. -
బెల్ట్షాపుపై పోలీసుల దాడి
కూనవరం: కూల్డ్రింక్ షాపు ముసుగులో బెల్ట్షాప్ (మద్యం) నిర్వహిస్తున్న దుకాణంపై పోలీసులు దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని భీమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఎస్: లతాశ్రీ అందించిన వివరాల ప్రకారం భీమవరం గ్రామంలో బావినేని ప్రేమ్కుమార్ దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం రావడంతో షాపుపై తన సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా 97–బీర్లు, 180 ఎం.ఎల్.– 40 బ్రాందీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్న బావినేని ప్రేమ్కుమార్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
పది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
రాజవొమ్మంగి: మండలంలోని గడుఓకుర్తి, బూసులపాలెం, అనంతగిరి గ్రామాల్లో కంటి శస్త్రచికిత్సలు అసరమైన పదిమంది వృద్ధులను గుర్తించినట్టు రాజవొమ్మంగి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుష్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో పుష్పగిరి కంటి ఆస్పత్రి(విజయనగరం) సౌజన్యంతో శనివారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు చెప్పారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేసి, కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి, విజయనగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి తరలించామన్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని, రోగులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆప్తాలమిక్ అసిస్టెంట్ రమణ, ఆశ వర్కర్ సుభద్ర, వెంకటలక్ష్మి, సత్యవతి, చంటమ్మ తదితర పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు
రంపచోడవరం: రంపచోడవరం డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో పీసా గ్రామ సభ తీర్మానాలు లేకుండా మద్యం షాపులు నడుస్తున్నాయని ఆదివాసీ సంఘాల కూటమి ప్రతినిధులు, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబురావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా పోలీస్, ఎకై ్సజ్ శాఖలు పట్టించుకోవడం లేదన్నారు. ఏజెన్సీలో పేదలు కూలికి వెళ్తే రోజుకు రూ.300 వస్తుందని, వాటిని మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. బెల్టు షాపుల నిర్వహణకు మద్యం వ్యాపారులు, పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రంపచోడవరం డీఎస్పీ స్పందించి ఏజెన్సీలో బెల్టు షాపులు లేకుండా నిరోధించాలని కోరారు. కొన్ని చోట్ల బెల్టు షాపుల నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసులు కూడా పెట్టలేదన్నారు. బెల్టు షాపుల్లో విక్రయించే మద్యం ఏ షాపుల నుంచి వస్తుందో విచారణ జరిపి వాటి అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండలస్థాయిలో పోలీసు అధికారుల సహకారంతో నిర్వహణ పీసా గ్రామ సభ తీర్మానం లేకుండా గ్రామాల్లో దుకాణాల ఏర్పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విమర్శ -
శతశాతం ఉత్తీర్ణతసాధించేలా చర్యలు
● చింతపల్లి ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి చింతపల్లి: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో గిరిజన విద్యార్థులు ఽశతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చింతపల్లి ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు స్థానిక గిరిజన సంక్షమ బాలబాలికల ఆశ్రమోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను శనివారం ఏటీడబ్ల్యూవో పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కొండలరావు, పండన్న, పలువురు టీచర్లు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు రెట్టింపు ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతులు వ్యవసాయ పంటలకు దీటుగా ఉద్యాన పంటలను సాగుచేయడం వల్ల మంచి ఆదాయం పొందవచ్చని చింతపల్లి మండల ఉద్యాన అధికారి కంటా బాలకర్ణ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఆర్ఏఆర్ఎస్ మార్టేరు, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయన్నారు. ఈ భూముల్లో సేంద్రియ విధానంలో అన్ని రకాల పంటలను పండించడంతో పాటు సుస్థిర సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించాలని కోరారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ విధానాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పెదబరడ మాజీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, లంబసింగి ఆర్గానిక్ ఎఫ్ఫీఓ డైరెక్టర్లు సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు. -
చల్లని తల్లి మోదకొండమ్మ
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 11వతేదీ నుంచి 13వతేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు శ్రమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్గౌడ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ● అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని రోడ్లను కలుపుకుని ఐదు కిలోమీటర్ల వరకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధాన జంక్షన్లలో దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● మోదకొండమ్మతల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మోదకొండమ్మతల్లి మూలవిరాట్ విగ్రహాన్ని బంగారు అభరణాలతో అలంకరించారు. రూ.2లక్షల వ్యయంతో పూల అలంకరణ చేపట్టారు. మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ● ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర అధికారులు తొలిపూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఇత్తడి ఘటాలను ఆలయం నుంచి తోడ్కోని మెయిన్రోడ్డు వరకు ఉరేగిస్తారు. ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తిశ్రద్ధలతో సతకంపట్టు వరకు మోయడం ఉత్సవాల ప్రారంభంలో ప్రధాన ఘట్టం. అమ్మవారి పాదాలు, ఇత్తడి ఘటాలను గుడివాడ మహిళలు శనివారం శుద్ధి చేశారు. ● ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు,ఇతర సిబ్బంది మొత్తం వెయ్యి మందితో ఎస్పీ అమిత్ బర్దర్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందితో ఏఎస్పీ అడ్మిన్ ధీరజ్ శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు: జేసీ అభిషేక్ గౌడమోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. జెయింట్ వీల్, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి భద్రతా చర్యలను అఽధికారులతో సమీక్షించారు. అలాగే మోదకొండమ్మతల్లి ఆలయం, మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు. బందోబస్తుపై ఎస్పీ సమీక్ష ఉత్సవాల మూడు రోజులు పాడేరు పట్టణంలో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు, ఇతర తనిఖీలు, సీసీ,డ్రోన్ కెమెరాల నిఘాపైె ఎస్పీ అమిత్బర్దర్ ఽశనివారం సమీక్షించారు. మోదకొండమ్మతల్లి ఆలయం, శతకంపట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భద్రత ఏర్పాట్ల వివరాలను ఏఎస్పీ (అడ్మిన్) ధీరజ్ తదితర అధికారుల నుంచి తెలుసుకున్నారు. నేటి నుంచి పాడేరులో ఉత్సవాలు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరణ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు -
14వ పోప్గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్: రోమన్ క్యాథలిక్ మిషన్కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిల్లో వారం రోజుల పాటు దేవునికి కృతజ్ఞత బలిపూజలు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫాదర్స్ బాలశౌరీ, జాన్ ప్రకాష్, కె.జయరాజు, రవితేజ పాల్గొన్నారు. -
అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
● చింతపల్లి రేంజ్ అధికారి అప్పారావు చింతపల్లి: స్థానిక రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రేంజ్ అధికారి అప్పారావు తెలిపారు. అటవీశాఖ డివిజన్ అధికారి వైవీ నరసింహరావు ఆదేశాల మేరకు సికనాపల్లి, గుర్రాలగొంది క్వారీల్లో అక్రమ తవ్వకాలను అరికట్టడంలో భాగంగా డిప్యూటీ రేంజ్ అధికారి వెంకటరామరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు.అటవీ సంపద తరలిపోకుండా ఉండేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సును ఏర్పాటుచేశామన్నారు. -
కలపకు శాపం
కుదరని బేరం..కాకరపాడు డిపోలో కలపను పరిశీలిస్తున్న డీఎఫ్వో నరసింగరావు, (ఇన్సెట్) చెదకు పాడవుతున్న కలపకొయ్యూరు: మండలంలో అటవీశాఖకు చెందిన కాకరపాడు కలప డిపోలో ప్రస్తుతం 900 సీఎంటీ మేర కలప ఉంది. అంచనా ప్రకారం దీని విలువ రూ.కోటిన్నర మేర ఉంటుంది. జాతీయ రహదారి 516ఈ ఏర్పాటుతో చింతాలమ్మ ఘాట్రోడ్డులో నరికిన చెట్లను తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేశారు. అక్కడ ఎక్కువగా మారుజాతి మొక్కలున్నాయి. వీటిలో కొన్ని విలువ లేనివి కావడంతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు.రెండేళ్లుగా కలప అలాగే ఉండడంతో కొంత వరకు పాడైపోయింది. మిగతాది కూడా పాడై చెదలు పట్టే పరిస్థితి నెలకొంది. వేగిస, బండారు రకాల లాంటి కలపను మాత్రమే వ్యాపారు లు వేలంలో పాడు కుని తీసుకెళ్తున్నారు. మిగతా కలప ఉండిపోతోంది. అటవీశాఖ ధర రూ.550.. వ్యాపారుల ధర రూ.400 వేలం పాటకు వచ్చే కలప వ్యాపారులు అడుగుకు రూ.400 ఇస్తామని చెబుతు న్నారు. దీనికి అటవీ శాఖ అంగీకరించడం లేదు. తమ శాఖ నిర్ణయించిన ధర ప్రకారం అడుగుకు రూ.550 చెల్లించాలని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో బేరం కుదరక వ్యాపారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇటు వ్యాపారులు అడుగుతున్న దానికి అటు అటవీ శాఖ చెబుతున్న దానికి మధ్య వ్యత్యాసం అడుగుకు రూ.150 ఉంది. రానున్నది వర్షాకాలం కావడంతో కలప విక్రయంలో జాప్యం జరిగితే పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.కాకరపాడు డిపోలోఅడుగుకు రూ.400ఇస్తామంటున్న వ్యాపారులు రూ.550 చెల్లించాలంటున్న అటవీశాఖ ఉన్నతాధికారులకు లేఖ కలపను తక్కువ ధరకు వ్యాపారులు అడుగుతున్నారు. అలా తగ్గించి ఇవ్వడం తమ పరిధిలోది కాదు. వారు అడిగే ధరకు తాము చెబుతున్న దానికి మధ్య అడుగుకు రూ.150 వరకు వ్యత్యాసం ఉంది. ధర తగ్గించాలని వ్యాపారులు అడుగుతుండటంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నాం. ధర తగ్గిస్తే చాలా వరకు కలప విక్రయం జరుగుతుంది. లేకుంటే కలప పాడైపోయే ప్రమాదం ఉంది. త్వరలో అధికారులు తీసుకునే నిర్ణయాన్ని తదుపరి చర్యలు తీసుకుంటాం. – నరసింగరావు, డీఎఫ్వో, చింతపల్లి విక్రయంలో జాప్యం వల్ల చెదలు పట్టే అవకాశం రూ.కోటిన్నర ఆదాయంపై ప్రభావం అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య -
వంద కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న 100కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కుజభంగి జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం 5గంటలకు తనిఖీలు చేస్తుండగా పట్టుబడిందన్నారు. ఒడిశా వైపు నుంచి కారులో వస్తున్న ఐదుగురు వ్యక్తులు తమ సిబ్బందిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే వీరిలో ముగ్గురు పట్టుకోగా, మిగతా ఇద్దరు పరారీ అయినట్టు చెప్పారు. కారును తనిఖీ చేయగా గంజాయి బస్తాలతో పట్టుబడిందన్నారు. పట్టుబడిన ముగ్గురిని రిమాండ్కు తరలించామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన రవి మున్నాలాల్ జైస్వాల్, స్వప్నిల్ జయప్రకాష్, మండలంలోని బరడ గ్రామానికి చెందిన కిలో లక్ష్మణ్దాసులుగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. పరారైన వారు జిల్లాకు చెందిన సీసా బిస్నాద్, కిలో రవికుమార్గా గుర్తించామని చెప్పారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. తనిఖీల్లో ఏఎస్ఐ తిరుపతిరావు, పంచాయతీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ● విలువ రూ.5 లక్షలు ● ముగ్గురు అరెస్టు, ఇద్దరు పరారీ -
వీర జవాన్ మురళీనాయక్కు ఘన నివాళి
పాడేరు రూరల్: పాకిస్తాన్తో యుద్ధంలో భాగంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూరులో మరణించిన వీర జవాన్ మురళీనాయక్కు పలుచోట్ల ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వీర జవాన్ మురళీనాయక్ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాటం చేస్తు వీరమరణం పొందడం దేశానికి తీరనిలోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంక్షిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. నాయకులు పాంగి రాజారావు, ఉమామహేశ్వరావు, గోపాలపాత్రుడు, కొండబాబు, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందిస్తే.. సచివాలయ కార్యదర్శుల ద్వారా టీడీపీ నేతలు దరఖాస్తుదారులను బెదిరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో రైల్వేస్టేషన్ ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. సభలో జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయు లు, ఎ.జె.స్టాలిన్, సిహెచ్ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, నాయుడు, నాగభూషణం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదు సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు -
దార్రెల మహిళల ఔదార్యం
ముంచంగిపుట్టు: వేసవిలో మండుటెండలో పయనించే బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఆ గ్రామ మహిళలు తమ వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. తమ సొంత నిధులతో మజ్జిగ, నిమ్మరసం అందించి ఔదార్యం చాటుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో కిలగాడ జంక్షన్ వద్ద ప్రయాణికులకు వేసవి కాలం నాలుగు నెలల పాటు చల్లటి మజ్జిగ, నిమ్మరసం ఉచితంగా అందిస్తున్నారు. దార్రెల పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన మహిళలు. ప్రతి శనివారం 30 మంది స్థానిక గిరిజన మహిళలు సొంత డబ్బులతో మజ్జిగ, నిమ్మరసం తయారు చేసుకుని కిలగాడ జంక్షన్ వద్ద సిద్ధంగా ఉంటున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, జీపులు, ద్విచక్రవాహనాలను ఆపి మజ్జిగ, నిమ్మరసాన్ని ఉచితంగా అందిస్తూ ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. దార్రెల మహిళలు చేస్తున్న సేవలపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా మహిళలను ఎస్ఐ రామకృష్ణ అభినందించారు. శనివారం రోజు ముంచంగిపుట్టు వారపు సంత కావడం ఆ రోజు అధిక శాతం మంది ప్రయాణికులు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మేరకు ప్రయాణికుల దాహం తీర్చాలనే ఉద్దేశంతో చందా రూపంలో డబ్బులు వేసుకొని, ప్రతి ఏడాది వేసవిలో తమ వంతు సేవా కార్యక్రమం చేస్తున్నామని దార్రెల గ్రామానికి చెందిన మహిళలు శాంతమ్మ, రత్నమ్మ, నీలమ్మ, పుష్పవతి, లక్ష్మీ, శ్రీదేవి, మచ్చులమ్మ, వెంకటలక్ష్మి, మీనాక్షి, దుర్గాదేవి,విజయలక్ష్మి, తిరుమలమ్మ, నీలమలు తెలిపారు. బాటసారుల దాహార్తి తీరుస్తున్న స్థానికులు ఉచితంగా మజ్జిగ, నిమ్మరసం అందజేత -
సాక్షి ఎడిటర్పై కక్ష సాధింపు సరికాదు
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అనేక సమస్యలను వెలికితీసి పత్రికల్లో ప్రస్తావిస్తారని, వాటి పరిష్కారానికి ప్రశ్నిస్తారని, ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డికి ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కక్షతో ఇంట్లో సోదాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంపై ప్రశ్నించే వారిని, సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. ఎన్నికల సమయంలో జీవో నంబరు 3ను పునరుద్ధరించి, ప్రత్యేక డీఎస్సీ ద్వారా గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు కేవలం 24 పోస్టులు మాత్రమే కేటాయించారన్నారు. గిరిజనేతరులకు 724 పోస్టులా అని ప్రశ్నించారు. గిరిజన స్పెషల్ డీఎస్సీకి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం తీసుకువచ్చి, గిరిజన అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని, అమ్మ ఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు సర్వీసు తదితర హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శ -
ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు. -
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
కొమ్మాది: రుషికొండ బీచ్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శుక్రవారం వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శాప్ చైర్మన్ రవినాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విశాఖను వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి వేదికగా మారుస్తామన్నారు. ఇందుకోసం అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చెరువు గర్భంలో రోడ్డు తొలగింపు
రోలుగుంట: క్వారీ నుంచి రాయి తరలింపు కోసం మండలంలోని రాజన్నపేట పొలాలకు సాగునీరు అందిస్తున్న చెరువు గర్భంలో నిర్మించిన రహదారిని రోలుగుంట తహసీల్దార్ ఎస్.నాగమ్మ శుక్రవారం తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజన్నపేట గ్రామానికి చెందిన పొలాలకు 57/2 సర్వే నంబరులోని భూపతి చెరువు నుంచి సాగునీరు అందుతుంది. గతేడాది రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని కొండ ప్రాంతంలో క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అక్కడి నుంచి రాయిని తరలించడానికి మార్గం లేక చెరువు గర్భంలో రహదారి ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా లారీలతో రాయి తరలింపునకు శ్రీకారం చుట్టాడు. భారీ బండ రాళ్లను రాంబల్లి మండలంలో తలపెట్టిన నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు తమ భూములకు జరుగుతున్న నష్టాన్ని నిర్వాహకుడికి పలు దఫాలు మొరపెట్టుకున్నారు. చెరువును ఆక్రమించి రోడ్డు వేయడం తగదని అడ్డగించినా ఫలితం లేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో రమణ ఈ ప్రాంతాన్ని గత వారం తహసీల్దార్ నాగమ్మతో కలిసి సందర్శించి వాస్తవాలపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసిన రహదారిని తొలగించి, క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మండల సర్వేయర్ నాయుడు, ఆర్.రామమూర్తి, వీర్వో శ్రీనివాస్తో కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి మెటల్, రాతి బుగ్గితో ఏర్పాటు చేసిన రోడ్డును పొక్లెయిన్తో తొలగించి, ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే క్వారీ నిర్వహణ ఉండాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీ నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ హెచ్చరిక -
కుక్క దాడిలో ఉపాధి కూలీకి గాయాలు
చీడికాడ: మండలంలోని జె.బి.పురంలో పిచ్చికుక్క దాడిలో ఓ ఉపాధి కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి దేముడమ్మ ఓ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన పిచ్చికుక్క దాడి చేసింది. దేముడమ్మ చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా గాయపరిచింది. పక్కనే ఉన్న తోటి కూలీలు కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు పెదగోగాడ పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు చోడవరం సీహెచ్సీ మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు తెలిపారు. -
భారత్ విజయాన్ని కాంక్షిస్తూ గాయత్రీ హోమం
డాబాగార్డెన్స్: ఆపరేషన్ సింధూర్–2 విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీకి మనోధైర్యం కలగాలని భారతమాతను ప్రార్థిస్తూ శుక్రవారం పాతనగరంలోని స్వామి వివేకానంద సంస్థలో గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు మాట్లాడుతూ తెలుగు తేజం వీర జవాన్ మురళీ నాయక్కు, ఈ పోరాటంలో వీర మరణం పొందిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ విజయంతో ముందుకు దూసుకుపోతున్న భారతదేశ సైన్యానికి వందనాలు తెలిపారు. మన సైనికులకు మరింత మనోధైర్యం కలగాలని కాంక్షిస్తూ కుల, మతాలకు అతీతంగా గాయత్రి హోమం నిర్వహించామని తెలిపారు. జయహో ఆర్మీ సైన్యమంటూ ట్యూషన్ విద్యార్థులు నినదించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సీహెచ్ పైడిరాజు, వి. నల్లరాజు, ట్యూషన్ పిల్లలు, ఆశ్రమ వాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఏవోబీలో పోలీసుల మోహరింపు
సాక్షి,పాడేరు: దేశవ్యాప్తంగా పాకిస్తాన్, భారత్ల మధ్య యుద్దవాతావరణంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, దండకారణ్యంలో మాత్రం మావోయిస్టు పార్టీ అణిచివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులపై ముప్పేట దాడులు విస్తృతమయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్లో కేంద్ర పోలీసు బలగాలన్నీ నిమగ్నమై మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ను కొనసాగుతోంది. ఇదే పరిస్థితి ఏవోబీలోను నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దులో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలోని అడవులన్నీ కలిసి ఉన్న ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలుస్తుంటారు. ఈ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ నిర్వీర్యం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆమలుజేస్తుంది నిరంతరం గాలింపు ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో పోలీసులు–మావోయిస్టుల మద్య ఎదురుకాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 22 మంది మావోయిస్టులు మృతిచెందగా, అల్లూరి జిల్లా పరిధిలోని వై.రామవరం మండలం అటవీ ప్రాంతంలో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే మరి కొంతమంది మావోయిస్టులు దండకారణ్యంలో మకాం వేసినట్టు సమాచారంతో కేంద్ర పోలీసు నిఘా వ్యవస్థ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిఽశా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు బలగాల బూటు చప్పుళ్లతో దండకారణ్య అటవీ ప్రాంతాలు హోరెత్తుతున్నాయి. ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్ వై.రామవరం మండలంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కాకూరి పండన్న అలియాస్ జగన్, డీసీఎం రమేష్లు మరణించారు. అయితే మరి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే అనుమానంతో పోలీసు బలగాలు రంపచోడవరం, చింతపల్లి పోలీసు సబ్డివిజన్ పరిధిలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. అలాగే మరోవైపు చింతూరు ప్రాంతంలోని పోలీసు బలగాలు సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పాడేరు పోలీసు సబ్డివిజన్కు సంబంధించి జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లోను పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దులోని ఒడిశా అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు నిరంతరం సంచరిస్తున్నాయి. మరోవైపు ఒడిశా పోలీసు బలగాలు కూడా జిల్లాలోని పోలీసు యంత్రాంగానికి సహకరిస్తున్నాయి. గాజర్ల రవి, అరుణక్కలే టార్గెట్ ఏవోబీలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలకనేతలు గాజర్ల రవి, అలియాస్ ఉదయ్, అరుణక్కలు టార్గెట్గా ఏవోబీలో పోలీసు బలగాలు గాలింపు చర్యలను విస్తృతం చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కాకూరి పండన్న, రమేష్ల కిట్బ్యాగ్లు, ఇతర సామగ్రి ద్వారా ఏవోబీలో సంచరిస్తున్న మావోయిస్టు కీలకనేతల సమాచారం కూడా లభ్యమైనట్టు నిఘా వర్గాల భోగట్టా. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాలకు గాజర్ల రవి,అరుణక్క,కాకూరి పండన్న అలియాస్ జగన్లు కీలకంగా ఉన్నారు. కీలక నేతలను టార్గెట్గా చేసుకుని మావోయిస్టు పార్టీని ఏవోబీలో పూర్తిగా అణిచివేత లక్ష్యంగా కూంబింగ్ అపరేషన్ జరుగుతోంది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మాకవరపాలెం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలేనికి చెందిన లంక గణేష్(26) ఆరేళ్ల క్రితం తూటిపాలకు చెందిన శీరంరెడ్డి సుధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గణేష్ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా గణేష్ అత్తగారిల్లు అయిన తూటిపాలలోనే ఉంటున్నాడు. గురువారం మాకవరపాలెం వచ్చి మళ్లీ సాయంత్రం తూటిపాల వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీప జీడితోటలో ఉరివేసుకుని మరణించి కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఎస్ఐ దామోదర్నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఐదేళ్ల ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
అడ్డొచ్చింది.. కూల్చేశాం
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మండలంలోని గొరపల్లిలో పాత మంచినీటి పథకం ట్యాంక్ను జనసేన, టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారు. తమ సొంత అవసరాలకు ఈ ట్యాంక్ అడ్డు వస్తుందన్న కారణంతో, పంచాయతీ, మండల పరిషత్ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యకాండకు దిగారు. సొంత నిధులతో జేసీబీని సమకూర్చి ట్యాంక్ను కూలగొట్టారు. అర్ధరాత్రి వరకు ఆ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదెక్కడి దౌర్జన్యం? సాధారణంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఏ పాత భవనం, మంచినీటి పథకం, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను కూలగొట్టాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీ తీర్మానం తప్పనిసరి. అదే సమయంలో మండల పరిషత్ అనుమతి కూడా ఉండాలి. కానీ, ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం జెర్రిపోతులపాలెంలో కల్యాణ మండపం నిర్మించడానికి ఏకంగా అంగన్వాడీ కేంద్రం భవనాన్నే కూల్చేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించారు. తాజాగా గొరపల్లిలో స్థానిక జనసేన, టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి మరీ మంచినీటి పథకం ట్యాంక్ను కూల్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇన్ఛార్జ్ ఎంపీడీవో కొల్లి వెంకట్రావును వివరణ కోరగా, గొరపల్లిలో మంచినీటి పథకం ట్యాంక్ కూల్చివేతకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పంచాయతీ నుంచి సదరు ట్యాంక్ కూల్చివేతకు ప్రతిపాదన లేదని సర్పంచ్ గొరపల్లి శ్రీను తెలిపారు. పెచ్చుమీరుతున్న కూటమి నేతల ఆగడాలు మంచినీటి ట్యాంక్ కూల్చివేత -
ప్రజాప్రతినిధుల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు
ఎమ్మెల్సీ అనంతబాబుఅడ్డతీగల: స్ధానిక ప్రజాప్రతినిధుల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్సీ అనంత బాబు అన్నారు. అడ్డతీగల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీటీసీలు, సర్పంచ్ల తీర్మాణాలు చేయడం అవసరమన్నారు. అధికారులు ప్రతి పథంకంలోనూ కేటాయించిన నిధులు చేపట్టాల్సిన పనులు గురించి ప్రజాప్రతినిధులకు వివరించి ప్రజల అభీష్టం మేరకు వారు తీర్మానించిన విధంగానే పనులు చేపట్టాలన్నారు. ప్రోటోకాల్ను తప్పక పాటించాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు చేపట్టిన గ్రామసభలో ప్రజాప్రతినిధుల నిర్ణయానికే ప్రాధాన్యమన్నారు. గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినపుడు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఎటువంటి పనులు చేపట్టినా తగిన సమాచారం ఇవ్వడం లేదని సభ్యులు అధికారుల వైఖరిని తప్పుపట్టారు. శాఖాపరంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆమోదించారు. 15 వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టనున్న పనులను ప్రతిపాదించారు. ఎంపీడీవో కె.ఆర్.విజయ, జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, వైస్ ఎంపీపీ కరణం వీర వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎస్ఎల్కుప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తా న్ షిప్యా ర్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్ఎస్ఎల్కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు. -
ఐటీడీఏ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
పాడేరు రూరల్: విద్యరంగాన్ని పరిరక్షించి, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు, శుక్రవారం స్థానిక ఐటీడీఏ ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కమిటి ప్రతినిధులు సన్యాసిరావు, రామారావు, చిట్టిబాబు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమం అవసరమన్నారు. ప్రతీ గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో మోడల్ ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలన్నారు. పాఠశాలకు సంఖ్యతో సంబంధం లేకుండా ఎస్జీటీ పోస్టులు కేటాయించాలన్నారు. 6,7 తరగతులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలని కోరారు. తెలుగు,అంగ్ల మాద్యమాలను కొన్నసాగించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 3డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే దశలవారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు పోతురాజు, సత్యారావు, కన్నారావు, మంజునాథ, అద్దు, ఈశ్వరరావు, కొండబాబు, రమ్యప్రియ, స్వప్న రత్నకుమారి, పార్వతి, రాజేశ్వరి పాల్గొన్నారు. విద్యారంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరిక -
యాంత్రీకరుణ ఏదీ?
జిల్లాలో కూలీల కొరత నేపథ్యంలో సాగు పనుల్లో యంత్రాల వినియోగానికి గిరిజన రైతులు అలవాటు పడ్డారు. ఇలాంటి తరుణంలో అన్నదాతకు ప్రభుత్వాలు అండదండగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ జరగకపోవడంతో యాంత్రీకరణను పక్కన బెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి,పాడేరు: యంత్రాలతో వ్యవసాయ పనులకు గిరిజన రైతులు అలవాటు పడ్డారు. పవర్ టిల్లర్లు, వీడర్లతో దుక్కి, దమ్ము పనులు చేస్తున్నారు. అయితే గిరిజన గ్రామాల్లో రైతులందరికీ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని అద్దెకు తెచ్చుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వరకు పవర్ టిల్లర్లు, వీడర్లను 50శాతం రాయితీపై గిరిజన రైతులకు పంపిణీ చేసింది. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రాయితీపై పంపిణీ చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. దీంతో గిరిజన రైతులంతా దుక్కి పశువులతో సాగు పనులకు స్వస్తి పలికి యంత్రాలతోనే వ్యవసాయ పనులు చేస్తున్నారు. తోటి గిరిజనులు కూడా అద్దె ప్రాతిపదికన వీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం 60 శాతం మేర గిరిజన రైతులంతా వ్యవసాయంలో యాంత్రీకరణపై వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఆది నుంచి నిర్లక్ష్యమే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ యంత్రాలు,పరికరాలు పంపిణీ జరగలేదు. పవర్ టిల్లర్లు, వీడర్లు,ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని గిరిజన రైతులు ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొంతమంది గిరిజన రైతులు పవర్ టిల్లర్లు, వీడర్లను అద్దెకు తీసుకువచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు. మిగతా రైతులు గతంలో మాదిరిగానే పశువులతో దుక్కి, దమ్ము పనులు చేసుకున్నారు. ఆ ఊసేదీ? ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కూటమి ప్రభుత్వం టిల్లర్లు, వీడర్లు, ఇతర యంత్రాల పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్ట లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో దుక్కి పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన టిల్లర్లు, వీడర్లే వీరికి ఆధారమయ్యాయి. సొంతంగా కొనుగోలు గిరిజన రైతులు ప్రైవేట్ మార్కెట్లోనే పవర్ టిల్లర్లు, వీడర్లను సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. మైదాన ప్రాంతాలతో పాటు పాడేరు, హుకుంపేట, చింతపల్లి, అరకులోయలో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉండడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాఫీ, మిరియాల అమ్మకాలతో ఆదాయం పొందిన రైతులంతా రూ.లక్ష వరకు ఖర్చుపెట్టి వీడర్లు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రైతులు పశువులను అమ్మి యంత్ర పరికరాలను కొంటున్నారు. వీడర్లు రూ.80వేల నుంచి రూ.లక్ష, పవర్ టిల్లర్లు రూ.2లక్షల వరకు ధరలు ఉన్నాయి. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసి ఉంటే కొంతమేర లబ్ధి చేకూరేదని రైతులు వాపోతున్నారు.రాయితీపై పంపిణీకి నోచుకోనివ్యవసాయ యంత్ర పరికరాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన గిరిజన రైతులు నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గిరిజన రైతుల్లో నిరాశ రూ.80 వేలతో వీడర్కొనుక్కున్నా గత ఖరీఫ్లో వ్యవసాయశాఖ పవర్ వీడర్ పంపిణీ చేస్తుందని ఆశపడ్డా. ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సొంత నిధులు రూ.80 వేలు వెచ్చించి ఓ స్వచ్ఛందసంస్థ సహకారంతో సొంతంగా వీడర్ను గతేడాది కొనుగోలు చేశా. వ్యవసాయ పనులకు వీడర్పైనే ఆధారపడ్డా. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తే గిరిజన రైతులకు మేలు చేకూరుతుంది. – జన్ని రామారావు, రైతు, పాడేరు -
మీకోసంలో 55 వినతుల స్వీకరణ
పాడేరు రూరల్: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 55 వినతులు స్వీకరించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్ తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగవెంకట సాహిత్, డీఆర్వో కె పద్మలత, ఎస్సీఎంవీఎస్ లోకేశ్వరరావులో కలిసి అర్జీలు స్వీకరించారు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండలరావు వినతిపత్రం అందజేశారు. భూపట్టాలో తప్పుగా నమోదైన ఇంటి పేరును సవరించాలని పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ కరనకపుట్టు గ్రామనికి చెందిన రాంబాబు అర్జీ అందజేశారు. అటవీ హక్కు పత్రాలు మంజురు చేయాలని హుకుంపేటకు చెందిన పాడి బాలన్న, తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ బొడంగిపాడుకు చెందిన వంతాల లక్ష్మయ్య, గొల్లోరి శ్రీను, కొర్రా సత్యరావు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్కుమార్, ఐటీడీఏ పరిపాలనాధికారి ఎం.హేమలత, తహసీల్దార్ త్రినాథరావు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అధిక ఉష్ణోగ్రతలతో విలవిల
సాక్షి,పాడేరు: జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శుక్రవారం భానుడు ప్రతాపం చూపడంతో జనం విలవిలలాడారు. పాడేరు, అరకు వారపు సంతలు వెలవెలబోయాయి. సంతలకు వచ్చిన గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వేకువజామున చల్లదనం నెలకొంటున్నప్పటికీ సూర్యోదయం తరువాత ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయానికి తీవ్రత మరింత పెరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా కూనవరంలో 39.1డిగ్రీలు, చింతూరులో 38.9డిగ్రీల ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.ఎటపాకలో 37.4, వై.రామవరంలో 37.3, మారేడుమిల్లిలో 36.4, గంగవరంలో 36, రంపచోడవరంలో 35.9, రాజవొమ్మంగిలో 35.9, పాడేరులో 35.7, కొయ్యూరులో 35.3, అడ్డతీగలలో 35, అరకులోయలో 34.5, డుంబ్రిగుడలో 33.8, ముంచంగిపుట్టులో 32.7, పెదబయలులో 32.7, చింతపల్లిలో 32, హుకుంపేటలో 31.6, అనంతగిరిలో 31.3, జి.మాడుగులలో 30.1, జీకేవీధిలో 29.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.కూనవరంలో 39.1 డిగ్రీల నమోదు -
మలేరియా నివారణకు చర్యలు
జిల్లా అధికారి తులసిచింతపల్లి: జిల్లాలో మలేరియా నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తులసి తెలిపారు. శుక్రవారం ఆమె చింతపల్లి, సీలేరు మలేరియా సబ్ యూనిట్ల పరిధిలో పర్యటించారు. దోమల నివారణ మందు స్ప్రేయింగ్ పనులను పరిశీలించారు. పెదవలసలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్ప్రేయింగ్ ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఇంట్లో కచ్చితంగా స్ప్రేయింగ్ చేయించుకుని తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించిన ఆమె మలేరియా రోగులతో మాట్లాడారు. మలేరియా కేసులు వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా ప్రియ నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మలేరియా కేసు నమోదైన వెంటనే రికార్డు చేసి జిల్లా కేంద్రానికి నివేదించేలా వైద్యాధికారులను ఆదేశించామన్నారు. ఏఎంవోలు సత్యనారాయణ, నీలకంఠంనాయుడు, సబ్ యూనిట్ అదికారులు కన్నబాబు, చిట్టిబాబు, హెచ్వీ శ్రీనివాస్, శ్రావణి, యుగంధర్ పాల్గొన్నారు. -
కలమెత్తిన పాత్రికేయులు
సాక్షి,పాడేరు: ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం అన్యాయమని జర్నలిస్టు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలోకి పోలీసులు చొరబడి భయానక వాతావరణం సృష్టించడంపై పలువురు జర్నలిస్టులు శుక్రవారం పాడేరులో నిరసన చేపట్టారు. అక్రమ సోదాలను ఖండిస్తూ స్థానిక తహసీల్దార్ వంజంగి త్రినాథరావునాయుడుకు వినతిపత్రం అందజేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. పత్రికలు, మీడియా వ్యవస్థ సంపాదకులు, జర్నలిస్ట్లపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తాంగుల మహేశ్వరరావు, పాడేరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు,సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఎన్.ఎం.కొండబాబు, ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి, ఆర్సీ ఇన్చార్జి కె.దుర్గారావు, రూరల్ విలేకరి శెట్టి కోటేశ్వరరావు, పలు పత్రికల విలేకరులు దిలీప్, భీమరాజు పాల్గొన్నారు. రంపచోడవరం: సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమ సోదాలు నిర్వహించి భయానక వాతావరణం సృష్టించడంపై శుక్రవారం రంపచోడవరంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో రమణి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఆర్సీ ఇన్చార్జి జి.నారాయణరావు, విలేకరులు బి.సత్యనారాయణ, పి రాంబాబు, ప్రసన్నకుమార్, డీవీ కిరణ్, పువ్వడ బాలనారాయణ, పండు, నాగేంద్ర, డి. శ్రీను, జగన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో అక్రమ సోదాలపై మండిపాటు కూటమి ప్రభుత్వం తీరుపై సర్వత్రా నిరసన -
పోలవరం నిర్వాసితులకు భూసేకరణపై అభిప్రాయసేకరణ
రాజవొమ్మంగి: పోలవరం నిర్వాసితుల కోసం భూ సేకరణలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అభిప్రాయ సేకరణ జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ( పోలవరం) వీరాంజనేయుడు, తహసీల్దార్ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, జడ్డంగి రైతులతో సమావేశం అయిన అధికారులు భూమి అమ్మేందుకు సుముఖంగా ఉన్న వారు తెలియజేయాలని వారు కోరారు. కొనుగోలు చేసిన భూమికి సముచితమైన ధర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. అనంతరం స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడారు. రైతులనుంచి అభిప్రాయాలు సేకరించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. -
క్రీడల అభివృద్ధికి చర్యలు
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడుఅరకులోయ టౌన్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. డుంబ్రిగుడ మండలం అంజోడాలో ట్రైబల్ స్పోర్ట్స్ ఏర్పాటుకు కేటాయించిన 26.34 ఎకరాల స్థలంతోపాటు అరకులోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ను డీఎస్డీవో జగన్మోహన్రావు, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్స్పాల్ పీఎస్ఎన్ మూర్తితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ గిరిజన క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో స్పోర్ట్స్స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. క్రీడాకారులు ప్రాధాన్యమిచ్చే క్రీడలకు సంబంధించి అత్యున్నతంగా క్రీడా వసతులు కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటి ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి దాతల సహకారం అవసరమన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, క్రీడా ఔత్సహికులు గిరిజన ప్రాంతంలో క్రీడా సదుపాయాల కల్పనకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొట్యాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
విస్తృతంగా వాహన తనిఖీలు
చింతూరు: జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన చింతూరు పోలీసులు గురువారం విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. బుధవారం జిల్లాలోని వై.రామవరం మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కూడా భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో చింతూరు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలసి వా హనాల తనిఖీలు నిర్వహించారు. దూరప్రాంతాలకు చెందిన వాహనాలను నిలిపి విస్తృతంగా సోదాలు చేపట్టారు. అనుమానితుల వివరాలు సేకరించి విడిచిపెట్టారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు
పాడేరు రూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి రుణాలు అందిస్తున్నామని డీఆర్డీఏ పీడీ మురళి తెలిపారు. గురువారం స్థానిక కాఫీ హౌస్లో నిర్వహించిన అగ్రి అవుట్ రీచ్ క్యాంపులో ఆయన యూబీఐ విజయనగరం రీజనల్ హెడ్ జితేంద్రశర్మతో కలిసి డ్వాక్రా మహిళ సంఘాలకు రూ.5 కోట్ల విలువైన రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పీడీ మురళి మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న రుణాలను డ్వాక్రా సంఘాల సభ్యులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలతో వివిద రకాల వ్యాపారాలు చేపట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. రుణాలు పొందిన సభ్యులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి మరింత రుణాలు తిరిగి పొందేలా ఉండాలన్నారు, యూబీఐ రీజనల్ హెడ్ జితేంద్రశర్మ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ఆర్థిక తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ హెడ్ నగేష్, డిప్యూటీ హెడ్ ఆర్హెచ్ రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాయుడు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ భాను తదితరులు పాల్గొన్నారు. -
బోటు షికారు ఏర్పాటుకు వినతి
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట, దార్రెల, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు, మాకవరం, దొడిపుట్టు పంచాయితీల పరిధిలో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డపై బోటు షికారు ఏర్పాటుచేయాలని చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. సుజనకోట పంచాయతీ కేంద్రం నుంచి మర్రిపుట్టు వెళ్లే మార్గంలో మత్స్యగెడ్డ దీవులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానికుల నాటు పడవలపై షికారు చేస్తూ మత్స్యగెడ్డ అందాలను తిలకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవోలు, కలెక్టర్లు సుజనకోటలో మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గతంలో పలుసార్లు ప్రకటించినా ఈ దిశగా చర్యలు లేవు. ఇప్పటికై నా వారు స్పందించి సుజనకోట వద్ద మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా బోటు షికారు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు కోరుతున్నారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు. -
గళమెత్తిన జర్నలిస్టు సంఘాలు
అరకులోయ టౌన్: నోటీసులు జారీ చేయకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడంపై జర్నలిస్టు సంఘాలు గళమెత్తాయి. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని ఏపీయూడబ్ల్యూజే అరకు అధ్యక్ష, కార్యదర్శులు ఎల్బీ వెంకటేశ్వరరావు, ఆర్. రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ ఎంవీవీ ఎంవీవీ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. పత్రికలు నిజాలు రాస్తే రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఇటువంటి చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కాపుగంటి హరిబాబు, బి. అనిల్, బి. కొండ, సుంకరి ఆనందరావు, జగదీష్, ఈశ్వరరావు, రాజు, భీమన్న, ఎస్. సోమేశ్వరరావు, పాల్గొన్నారు. గంగవరం : సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడపై విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై గంగవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వాడపల్లి శేషాచార్యులు, గంగవరం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు జయకృష్ణ పట్నాయక్, వివిధ పత్రికల విలేకరులు వైఆర్కే ప్రసాద్, నాగేశ్వరరావు, ప్రభాకర్, ఉదయ్, రత్నం తదితరులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ స్పందనను కలిసి వినతిపత్రం అందజేశారు. చింతూరు : సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని ఖండిస్తూ చింతూరు, మోతుగూడెం విలేకరులు అలీ, శ్రీరామచంద్రమూర్తి స్థానిక తహసీల్దార్ సీహెచ్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసు సోదాలపై ఖండన పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ఆవేదన వినతిపత్రాలు అందజేసి నిరసన -
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కాలినడకన..
రంపచోడవరం: వై.రామవరం పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు పండన్న, రమేష్ మృతదేహాలను గురువారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శేషరాయి అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. సంఘటన స్థలం నుంచి వారి మృతదేహాలను తీసుకురావడానికి పోలీసులకు సుమారు 28 గంటల సమయం పట్టింది. మృతదేహాలను కర్రకు కట్టి దట్టమైన అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర కాలినడకన మోసుకువచ్చి శేషరాయి చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్సులో వై.రామవరం మీదుగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. నేడు స్వగ్రామానికి పండన్న మృతదేహం..తీసుకువచ్చేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు సీలేరు: వై.రామవరం పోలిస్స్టేషన్ పరిధి శేషరాయి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు కాకూరి పండన్న మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామం కొమ్ములవాడ తీసుకురానున్నారు. ఈ మేరకు అతని తమ్ముడు అప్పన్న, మరదలు వరహాలమ్మ, అల్లుడు వెంకట్రావు, దుప్పులవాడ సర్పంచ్ కుమారి, మరో ఆరుగురు గురువారం ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను మోసుకువచ్చిన పోలీసు బలగాలు -
దివ్యాంగులకుఉపకరణాల పంపిణీ
పాడేరు: సమాజంలో దివ్యాంగులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సర్వశిక్షా విద్యాశాఖ ఆధ్వర్యంలో 80 మంది దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు, బ్రెయిలీ లిపి కిట్లు, మూడు చక్రాల సైకిళ్లు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు భవిత కేంద్రాలు సందర్శిఽంచి అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకోవాలన్నారు. దివ్యాంగ పిల్లలు రోజు వారీ పనులు ఎలా చేయాలో వారికి నేర్పాలని సూచించారు. చిన్నారులకు బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ వీఏ డాక్టర్ స్వామి నాయుడు, ఐఈ కోర్డినేటర్ కె.భాస్కరరావు, విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పూర్తిగా పట్టు కోల్పోయిన మావోయిస్టులు
రంపచోడవరం: సరెండర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. వై.రామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శేషరాయి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్తున్న పోలీసులను చూసిన 15 మంది మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసు బలగాలు కూడా కాల్పులు జరిపిన క్రమంలో మావోయిస్టులు కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందారన్నారు. పండన్నపై 400 వరకు కేసులు ఉన్నాయన్నారు. అతనిపై రూ.20 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. మల్కన్గిరి జిల్లా కలిమెలకు చెందిన రమేష్పై 30 క్రిమినల్ కేసులు నమోదు కాగా రూ.8 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. సంఘటన స్థలంలో రెండు ఏకే 47, 303 రైఫిల్, నాలుగు మ్యాగ్జన్స్, ఏకే 47 మ్యాగ్జన్స్ 3, కిట్ బ్యాగ్ల్లో విప్లవ సాహిత్యం, రూ.98వేల నగదు, మందులు, ఆలివ్ గ్రీన్ యూనిఫాం లభ్యమయ్యాయన్నారు. ఛత్తీస్గడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ తరువాత ఏవోబీ సుమారు 30 మావోయిస్టులు జిల్లాలోకి వచ్చినట్టు సమాచారం ఉందన్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై గట్టి నిఘా, కూంబింగ్ చేపట్టిందన్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలు అరుణ, ఉదయ్ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్నారు. ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టుల సంఖ్య 13కు తగ్గిపోయిందన్నారు. ఆరు నెలలుగా గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై వారి నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా మావోయిస్టులు, సానుభూతి పరులు లొంగిపోవాలని ఎస్పీ సూచించారు. ఎవరైఆన వారికి సహకరించినా, వారిని ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోందన్నారు. పోస్టుమార్టం అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. చత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. ఈ సమావేశంలో చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా, అడిషనల్ ఎస్పీ కె.ధీరజ్, రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ పాల్గొన్నారు. పండన్నపై 400, రమేష్పై 30 కేసులు ఇప్పటికై నా మిగతావారు, సానుభూతిపరులు లొంగిపోవాలి ఎస్పీ అమిత్బర్దర్ -
రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం
● కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్పాడేరు: రెడ్క్రాస్ సేవలు మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. గురువారం ప్రపంచ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్ ఏఎస్దినేష్కుమార్ జిల్లా చైర్మన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జీన్హేన్రి దునాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 22 మండలాల్లో రెడ్క్రాస్ సేవలు కార్యవర్గం నిర్విరామంగా కొనసాగిస్తుందన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత వేగవంతం చేసి అన్ని శాఖల ఉద్యోగులు రెడ్క్రాస్ సొసైటీకి సహకరించాలని కోరారు. సొసైటీ భవన నిర్మాణానికి 10సెంట్లు స్థలం కేటాయించామన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు కృషి చేయాలన్నారు. వృద్ధులు, పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, డాక్టర్ రాఘవేంద్ర, రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరిశంకర్, కోశాధికారి సూర్యారావు, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, లైఫ్ మెంబర్లు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
చింతూరు: యుద్ధ సన్నద్ధత, విపత్తు నిర్వహణలో భాగంగా గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో మాక్డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి మాక్డ్రిల్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించేందుకు మాక్డ్రిల్ ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ రమణారావు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాయికిషోర్రెడ్డి, ఆర్ధోపెడిక్ డాక్టర్ కౌశిక్రెడ్డి, డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో.. మోతుగూడెం: లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం వద్ద జెన్కో సెక్యూరిటీ విభాగం, ఉద్యోగులు, అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు. ప్రతిస్పందన, సంసిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను అంచనా వేసేందుకు జెన్కో సెక్యూరిటీ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో జెన్కో ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
ముంచంగిపుట్టు: మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మాకవరం శివారు అరబీరు జంక్షన్ వద్ద ఉన్న చందు, నాగేష్లకు చెందిన సిమెంటు దుకాణాల పైకప్పులు గురువారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. దీంతో సిమెంటు బస్తాలతోపాటు నిల్వ చేసిన బియ్యం బస్తాలు తడిచిపోవడంతో పాడై పోయాయి. సుమారు 45 సిమెంటు బస్తాలు పాడయ్యాయని, రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ గంగాధర్, రెవెన్యూ అధికారులు అరబీరు గ్రామానికి వెళ్లి పాడైన దుకాణాలను పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే ఆర్అండ్బీ ప్రధాన మార్గంలో కుజభంగి జంక్షన్ వద్ద నాలుగు చెట్లు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. దీంతో కొన్ని గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు శ్రమించి చెట్ల కొమ్మలను నరికి రాకపోకలకు అడ్డంగా లేకుండా తొలగించారు. భారీ వర్షంతో పలు చోట్ల రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని గత రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మండల కేంద్రమైన డుంబ్రిగుడలోని మామిడిచెట్లు వీధిలో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అరకులో భారీ వర్షం కురిసింది. డ్రైనేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీలేరు: సీలేరులో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటన్నర సేపు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ధారకొండ ,దుప్ఫులవాడలో కూడా మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. కొయ్యూరు: ఈదురుగాలుల ప్రభావానికి కొయ్యూరు–రాజేంద్రపాలెం రహదారిలో బాలుర ఆశ్రమ పాఠశాల–2 వద్ద చెట్టు గురువారం సాయంత్రం రోడ్డుపై కూలింది. స్థానికులు చెట్టును తొలగించారు. అరబీరులో దుకాణాల పైకప్పు ధ్వంసం రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు -
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గాసూర్యప్రకాష్ బాధ్యతలు
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.వి.సూర్యప్రకాష్ గురువారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఏపీఎస్ఈబీ కేటీపీఎస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన ఆయన పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో 2021లో పదవీ విరమణ పొందారు. ఆయన తాజాగా ఈపీడీసీఎల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు 24/7 3–ఫేజ్ విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యప్రకాష్ను సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ అభినందించారు. -
స్నేహితుడి ఇంట్లో చోరీ..నిందితుడి అరెస్టు
పెదగంట్యాడ: మండలంలోని దయాల్నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీ చేసిన నిందితుడు కాంబలి దిలీప్ను న్యూపోర్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హార్బర్ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు గురువారం న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాల్నగర్కు చెందిన బేర రాజు ఈ నెల 4న తన కుటుంబంతో కలిసి స్వగ్రామమైన పాడేరు మండలం సలుగు వెళ్లారు. రాజు కుటుంబం ఊరిలో లేని విషయాన్ని అతని స్నేహితుడైన కంచరపాలెం బర్మా క్యాంప్కు చెందిన దిలీప్ తెలుసుకున్నాడు. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో రాజు ఇంటికి చొరబడి, బీరువాలో ఉంచిన బంగారు పుస్తెలతాడు, రెండు చెయిన్లు, ఒక గొలుసు, ఒక బ్రేస్లెట్, ఒక చిన్న ఉంగరం, ఒక లాకెట్తో పాటు రూ. 20 వేల నగదును దొంగిలించాడు. ఈ నెల 6న తిరిగి వచ్చిన రాజు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం డీసీపీ పర్యవేక్షణలో క్రైం సీఐ జి. శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని సర్వీస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ లక్ష్మణరావు మాట్లాడుతూ, నిందితుడు చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, జల్సాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. నిందితుడిపై గతంలో అనకాపల్లి జిల్లా చీడికాడ, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లలో కూడా చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అప్పలరాజు చెప్పారు. -
సర్టిఫికేషన్తో కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర
జి.మాడుగుల: శ్రీ మత్స్యదేవత రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పీవో)మాక్స్ లిమిటెడ్ రైతులకు ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేయడం ద్వారా బయట మార్కెట్లో కాఫీ, మిరియాలు ఇతర ఉత్పత్తులకు మంచి ధర పొందుతారని సీఎస్ఎం సంస్థ సీఈవో అభిషేక్ జానీ తెలిపారు. మండలంలోని పెదలోచలి గ్రామంలో గురువారం మత్స్యదేవత రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పీవో)మాక్స్ లిమిటెడ్ సీఈవో ఐసరం హనుమంతరావు, చైర్మన్ ఎం.కొండబాబు, సెంట్రల్ ఫర్ సోషల్ మార్కెట్స్ సంస్ధ(సీఎస్ఎం) ఆధ్వర్యంలో రెండోవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎ్ఫ్పీవో ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేయటం ద్వారా గిట్టుబాటు ధరలు పొందవచ్చన్నారు. ఎఫ్పీవో ఫెయిర్ ట్రేడ్ ప్రీమియం కూడా పొందుతుందని సభ్యులందరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉద్యానవన శాఖ అధికారి రమేష్కుమార్ రావు, భారతీయ చిరుధాన్యాల సంస్థ (ఐఐఎంఆర్)సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస్బాబు, పాడేరు కాఫీ బొర్డు ఎస్.ఎల్.వో.రమేష్, స్పైసెస్ బోర్డు ప్రతినిధి మహిమ, ఎస్వీడీఎస్ కార్యదర్శి జోగినాయుడు, ఎఫ్పీవో రైతు సభ్యులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గిరిజన రైతులకు డ్రమ్లను వారు పంపిణీ చేశారు. ఎన్ఎంఐ అయోగ్ ప్రతినిధి చైతన్యరెడ్డి, ఐఐఎంఆర్ రిప్రజేంటివ్ కె.శ్రీనివాస్, సీఎస్ఎం ఫైనాన్స్ అడ్మినిస్టేటివ్ జీఎం హరిబాబు, ఉద్యానవన శాఖ అధికారి కె.బి.కర్ణ, వీహెచ్ఎలు మాణిక్యాలరావు, బేబిరత్నం, ఎంపీఈవో మణికంఠ, పంచాయతీ కార్యదర్శి వెంకట్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.4.26 లక్షల సాయం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డు సేవలు అభినందనీయమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు అర్లబు నారాయణ భార్య పార్వతమ్మకు హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో తుహిన్ సిన్హా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో నారాయణ ఇటీవల మృతి చెందారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఒక రోజు వేతనం రూ.4,26,385 చెక్కును మృతుడి భార్యకు అందజేశారన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు మిగతా హోంగార్డులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో ఏవో రామ్కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్, పాల్గొన్నారు. -
కిరండూల్ రైల్వే లైన్లోడీఆర్ఎం తనిఖీలు
సాక్షి,పాడేరు: బచెలి–కిరండూల్ రైల్వే లైన్లో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్ర బుధవారం తనిఖీలు చేపట్టారు.ఈ రైల్వే లైన్లో డబ్లింగ్,మలుపుల వద్ద ట్రాక్ పనులు,వంతెనల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కనస్ట్రక్షన్స్ చీఫ్ ఇంజనీర్ గౌరీశంకరరావు,ఇతర వాల్తేరు బ్రాంచ్ అధికారులతో కలిసి బచేలి–కిరండోల్ రైల్వే లైన్లో విండో టైలింగ్ తనిఖీలు జరిపారు.అనంతరం డీఆర్ఎం ఎన్ఎండీసీ అఽధికారులతో సమీక్షించారు.బచెలి,కిరండూల్ రైల్వే స్టేషన్లను డీఆర్ఎం తనిఖీ చేసి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. -
కుటీర పరిశ్రమలతోఆర్థిక తోడ్పాటు
● కలెక్టర్ దినేష్కుమార్ డుంబ్రిగుడ: కుటీర పరిశ్రమలతో గిరిజన యువతకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. అరకు పంచాయతీలో రూ.9.80 కోట్లతో ఐదు ఎకరాల్లో 36 యూనిట్లతో నిర్మిస్తున్న కుటీర పరిశ్రమకు విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొరతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అరకు ప్రాంతం మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ జి. శారద, సాగర ఎంపీటీసీ దేవదాసు, ఎంపీడీవో ప్రేమ్సాగర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అల్లూరి త్యాగం చిరస్మరణీయం
● కలెక్టర్ దినేష్కుమార్ ● వర్థంతి సందర్భంగా ఘన నివాళి సాక్షి,పాడేరు: పీడిత గిరిజన ప్రజల పక్షాన బ్రిటీషు వారిని ఎదురించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. ఆయన వర్థంతిని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. దీనిలో భాగంగా అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో మన్యంలో గిరిజనుల జీవితాలు దుర్భరంగా ఉండేవని, అటువంటి సమయంలో మన్యం ప్రజల కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొనేందుకు గిరిజనులకు అండగా అల్లూరి సీతారామరాజు పోరాటాలు చేశారన్నారు. ఆయనకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. రంపచోడవరం, చింతపల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాలలో పోలీసుస్టేషన్లపై అల్లూరి దాడి ఘటనలు చరిత్రలో నిలిచాయన్నారు. మహనీయుడు అల్లూరి పేరుతో ఏర్పడిన జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, ట్రైనీ కలెక్టర్ నాగ వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత తదితరులు పాల్గొన్నారు. అరకులోయలో.. అరకులోయ టౌన్: అల్లూరి గొప్ప పోరాట యోధుడు అని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీ, ఎంపీపీలు చటారి జానకమ్మ, బాక ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం: అల్లూరి పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సూచించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్వీ రమణ, డీఈ చైతన్య, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యం పెంచేలా..
ఉద్రిక్తతల వేళఆకట్టుకున్న మాక్ డ్రిల్అవగాహన కార్యక్రమానికి సహకరించిన ప్రజలు యుద్ధ నాదంతో జనం బెంబేలురంగంలోకి విపత్తు నిర్వహణ దళాలు మోగిన సైరన్.. బాంబుల మోత పాడేరు : ప్రశాంతంగా ఉండటమే కాకుండా నిత్యం రద్దీగా ఉండే పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పాకిస్తాన్ యుద్ధ విమానం నుంచి బాంబులు వేయడంతో స్థానికులు, ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపు కొంత నష్టం జరిగిపోయింది. అయితే జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించడంతో నష్టం తీవ్రత తగ్గింది. యుద్ధం వస్తుందనే కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్, అధికార యంత్రంగం జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ ముందుగా ఊహించినట్టే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాంబు వేశారు. తేరుకున్న కొంతమంది ప్రజలకు పరుగెత్తుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వైద్య, పారా మెడికల్, ఫైర్, పోలీస్, ఇంజినీరింగ్ సిబ్బంది క్షణల్లో సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్ల్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపు చేసి భవనాల పైఅంతస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించి సపరర్యలు చేశారు. ఇంజనీరింగ్ సిబ్బంది బాంబు దాడి వల్ల ధ్వంసమైన గోతులను పూడ్చడం, శకలాలు తొలగించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం సాయంత్రం అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఈ ప్రాంత ప్రజలకు ఓ పీడ కలలా మిగిలింది... ఇదంతా నిజం అనుకుంటున్నారా కాదు కాదు ఒకసారి ఇది కూడా చదివేయండి. పహల్గామ్లో భారత పర్యాటకులపై ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒక వేళ పాకిస్తాన్ మనపై యుద్ధం చేస్తే ఆ దేశ ఆగడాలను చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన మాక్డ్రిల్లో ఇదంతా ఓ భాగం మాత్రమే. ఇదంతా నిజమే అనుకొని ఊపిరి బిగపట్టి ఈ దృశ్యాలను చూస్తున్న జనం అంతా ఇది మాక్డ్రీల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. సైరన్లు మోగించినప్పుడు, దాడుల సమయంలో ఎలా స్పందించాలో అనేదానిపై అవగాహన కల్పించారు. అవగాహన కల్పించేందుకే..: కలెక్టర్ దినేష్కుమార్ భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనే విధానం, రక్షణ బాధ్యతలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మాక్డ్రిల్ నిర్వహించామని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. అనధికార, ఫేక్ వార్తలపై ప్రజలంతా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుద్ధం వస్తే పక్కా కట్టడాలు, ట్రెంచ్లు, కొండలు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు. రాత్రిపూట ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడితే వెంటనే లైట్లు ఆఫ్ చేయాలన్నారు. ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత మాత్రమే లైట్లు వెలిగించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ మాక్డ్రిల్ను నిర్వహించామన్నారు. సహనం, సహకారం అవసరం: ఎస్పీ అమిత్బర్దర్ అంతర్గతంగా, బహిర్గతంగా ఇటువంటి సమస్యలు ఎదురైతే ప్రజల సహనం, సహకారం ఎంతో అవసరమని ఎస్పీ అమిత్బర్దర్ అన్నారు. ప్రజలంతా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి సందర్భాల్లో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా సమష్టిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ట్రైనీ కలెక్టర్ కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్, చింతూరు, చింతపల్లి ఏఎస్పీలు పంకజ్కుమార్ మీనా, నవజ్యోతీ మిశ్రా, సీఐ ధీనమంధు, స్పెషల్ బ్రాంచి సీఐ అప్పలనాయుడు, ఏఆర్ ఇన్స్పెక్టర్ శేషాద్రి, స్పెషల్ పార్టీ పోలీసులు, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది, జిల్లా అధికారులు, విద్యార్థులు, 108 సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా మోదమ్మ ఉత్సవాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తులు ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. బుధవారం ఆయన మోదకొండమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11,12,13తేదీలో మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు.ఉత్సవాల మూడు రోజులు మోదమ్మకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామననఆరు.పాడేరు పట్టణమంతా విద్యుదీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు, ఆర్.నాగభూషణం, వంజంగి కాంతమ్మ, కొణతాల ప్రశాంత్, కూడా సురేష్కుమార్, కేజియారాణి, సల్లా రామకృష్ణ, లకే రత్నాబాయి, మోద స్వరూప పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు విజయవంతం చేయాలి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి రంపచోడవరం: రైతులను అదుకోవడంతో కూటమి ప్రభుత్వ విఫలమైందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆరోపించారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నదాత దేశానికి వెన్నుముక అని భావించి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకం అమలు చేసి అన్ని విధాలుగా అన్నదాతను ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రైతు లకు పెట్టుబడి సాయం అందించలేదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రైతుల ధాన్యం కల్లాల్లో ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. రోడ్డులపై అరబెట్టుకుంటుంటే వారి పరిస్ధితి చూసి బాధేస్తోందన్నారు. గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయండి అని రైతులు ఆందోళన చేస్తుంటే వారి రోడ్డున పడేసే పరిస్థితి వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలుపై అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు స్పందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, పెట్టుబడి సాయం అందించి అన్నదాతను ఆదుకోవాలన్నారు. -
తుపాకుల మోత
పచ్చని కొండల్లోరంపచోడవరం: అల్లూరి మన్యంలో పోలీసు తుపాకులు గర్జించాయి. పచ్చని కొండలు కాల్పులతో దద్దరిల్లాయి. వై రామవరం మండలం శేషరాయి వద్ద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్ ఉన్నారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఇటీవల పాతకోట, గుర్తేడు పరిసర ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మావోయిస్టు జగన్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబరుగా, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇతనిపై రూ. 20 లక్షల పోలీసు రివార్డు ఉంది. మృతి చెందిన మరో మావోయిస్టు రమేష్ డీసీఎం క్యాడర్లో పనిచేస్తున్నారు. గాలిస్తున్న బలగాలు ఎదురు కాల్పుల్లో ఇద్దరితోపాటు మరికొందరు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్న పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టులపై అణచివేత ఎక్కువ కావడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)ను సేఫ్ జోన్గా భావించిన మావోయిస్టుల సంచారం అల్లూరి జిల్లా సరిహద్దులో ఎక్కువైంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పట్టు కోల్పోవడంతో తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు గట్టి సమాచార వ్యవస్థతో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి అప్రమత్తమవుతూ కూంబింగ్ను ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా మారేడుమిల్లిలో నిర్వహిస్తున్న గుర్తేడు పోలీసుస్టేషన్ను గుర్తేడులో ఏర్పాటు చేసి అక్కడ నుంచి పోలీసులు తమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎంతో కాలంగా పూర్తికాని కొన్ని కీలకమైన రోడ్లను పూర్తి చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే పాతకోట– మంగంపాడు, పోతవరం– వై రామవరం, బొడ్డగండి– డొంకరాయి తదితర రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి... సీలేరు: కాకూరి పండన్న అలియాస్ జగన్. అలియాస్ అండు.. అలియాస్ బీరును. అలియాస్ బీమ ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి మావోయిస్టు పార్టీలో కీలక నేత. పాఠశాలలో చదువుకుంటున్న తరుణంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగాడు. ఆయనది గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములవాడ. తల్లి పేరు సీతమ్మ. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు సోమన్న ఇప్పటికే మృతి చెందగా రెండవ కొడుకు కాకూరి పండన్న అలియాస్ జగన్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉంటూ ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మూడో కొడుకు అప్పన్న ప్రస్తుతం స్వగ్రామం కొమ్ములువాడలో ఉంటున్నారు. తల్లి వేడుకున్నా.. ఏడాది క్రితం తల్లి సీతమ్మ మృతి చెందింది. ఆమెకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఎన్నోసార్లు కొడుకుని చూడాలని.. ఉద్యమాన్ని వీడి రావాలని వేడుకున్నా జగన్ రాలేదు. పోలీస్ శాఖ పలుమార్లు లొంగిపోవాలని, పునరావాసం కల్పిస్తామని ప్రకటన చేసినా ఆయన ఉద్యమం నుంచి బయటకు రాలేదు. ఆయన వయసు 65 సంవత్సరాలు పైబడి ఉంటుందని పోలీసులు గతంలోరే నిర్థారించారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్న పండన్న పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. 2021లో తీగల మెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో అతను తప్పించుకున్నట్లు పోలీస్ రికార్డులో నమోదయింది. తల్లి మృతి చెందాక.. ఐదు నెలల క్రితం పండన్న తన అనుచరులతో స్వగ్రామమైన కొమ్ములవాడ గ్రామానికి వచ్చి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి భోజనం చేసి వెళ్లాడు. ఇది తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టి నప్పటికీ వారి కంట పడకుండా తప్పించుకున్నాడు. అప్పట్నుంచి కాకూరి పండన్నను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈనేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పండన్న ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఎన్కౌంటర్ కలకలం ఇద్దరు మావోయిస్టుల మృతితో ఉద్రిక్త వాతావరణం అడవిని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు అగ్రనేతలే లక్ష్యంగా..సాక్షి, పాడేరు: మావోయిస్టులు ఏజెన్సీలో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. దీనిలో భాగంగా కొయ్యూరు, వై.రామవరం, గూడెంకొత్తవీది మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి పోలీసు బలగాలు మోహరించాయి. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు టార్గెట్గా కూంబింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వై.రామవరం మండలం శేషరాయి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కాకూరి పండన్న అలియాస్ జగన్, ఒడిశాకు చెందిన వాగా పాడియామి అలియాస్ నాగన్న అలియాస్ రమేష్ మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్ర నేతలు గాజర్ల రవి, అరుణక్క తదితర 15మంది వరకు కీలక నేతలు ఇదే అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్టు పోలీసుశాఖకు పక్కా సమాచారం అందడంతోనే గాలింపు చర్యలను బలగాలు విస్తృతం చేసినట్టు సమాచారం. గత నెల 28న కొయ్యూరు మండలం కాకులమామిడి, వై.రామవరం మండలం సరిహద్దులోని కాంటవరం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు రెండు సార్లు పోలీసు కంట పడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే 15మంది వరకు మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ సామగ్రిని మాత్రం వదిలిపెట్టారు. మావోయిస్టులకు చెందిన ఎనిమిది రకాల సామగ్రిని పోలీసులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు. కిట్ బ్యాగుల ద్వారా మావోయిస్టుల సమాచారం సేకరించిన పోలీసు బలగాలు గాలింపు చర్యలను కొనసాగించి పట్టు సాధించాయి. -
చింతూరు పీవో ఆదేశాలు బేఖాతర్
ఎటపాక: మాగ్రామానికి వచ్చి వారంలో సమస్యలు పరిష్కరిస్తామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ హామీ ఇచ్చి ఐదు వారాలు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండలంలోని జగ్గవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేసినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత మార్చి 29న చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ తమ గ్రామాన్ని సందర్శించారని తెలిపారు. తమకు తాగునీరు, రహదారి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన విన్నవించామన్నారు. దీనిపై స్పందించిన పీవో అక్కడే ఉన్న అధికారులను పిలిచి వారం రోజుల్లో కొన్ని సమస్యలునైనా పరిష్కరించాలని ఆదేశించారన్నారు. అయితే ఐదు వారాలు గడిచినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పీవోను కలిసేందుకు ఐటీడీఏకు వెళ్లామన్నారు. ఆయన లేకపోవడంతో పీవోకు ఫోన్లో పరిస్థితిని వివరించి, గ్రీవెన్స్లో మళ్లీ వినతిపత్రం అందజేశామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు ఐవి, రవి, దేవా, శ్రీను పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించని అధికారులు జగ్గవరం గ్రామస్తుల ఆవేదన చింతూరు ఐటీడీఏ గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేత -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బలిమెల జలాశయంలో నీటి వినియోగంపై ఇరురాష్ట్రాలకు చెందిన అధికారులు బుధవారం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం అతిథి గృహంలో సమావేశం అయ్యారు. మొదటగా ఇరురాష్ట్రాల జలవిద్యుత్ శాఖలతో పాటు ఒడిశా వాటర్ బోర్డు అధికారులు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, జోలాపుట్టు జలాశయం, వించ్హౌస్లను సందర్శించారు.అనంతరం అతిథి గృహంలో సమావేశం అయ్యారు. ఇరురాష్ట్రాలకు చెందిన మొత్తం 36.8589 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా వాటిలో ఆంధ్ర భాగంలో 18.4945 టీఎంసీలు వాటా కాగా ఒడిశాకు 18.3644 టీఎంసీలుగా నిర్ణయించారు.గత ఏడాదిలో నీటిని ఒడిశా అదనంగా 0.1302 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. ఒడిశా వినియోగించుకున్న అదనపు నీటిని దృష్టిలో ఉంచుకొని ఇరు రాష్టాలు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదల మే నెల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. జూన్ 11వ తేదీన వాటర్ బోర్డు సమావేశాన్ని చిత్రకొండలో నిర్వహించాలని ఇరురాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో నుంచి ఎస్ఈ సివిల్ బి.చంద్రశేఖర్రెడ్డి,ఈఈ సివిల్ వి.రాజేంద్రప్రసాద్,ఒడిశా నీటిపారుదలశాఖ ఛీప్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్ పితబాస్శెట్టి, ఏఈ సివిల్ గధర్ప్రధాన్, ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ బలిమెల సీనియర్ జనరల్ మేనేజర్ దిలిప్కుమార్ స్వయిన్, ఏఈ ప్రశాంత్కుమార్ అయిచ్, మాచ్ఖండ్ ప్రాజెక్టు ఈఈ జనరేషన్ గోవింద్రాజులు,ఈఈ సివిల్ కురేశ్ప్రధాన్ పాల్గొన్నారు.సమావేశమైన ఆంధ్రా ఒడిశా అధికారులు -
నేటి నుంచి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు
అరకులోయ టౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 8వ తేదీ సాయంత్రం శ్రీ స్వామి వారి కల్యాణం, 9న పండిత గోష్టి, వేదపఠనం, 10న ఉత్సవ మూర్తుల ఊరేగింపు, 17న అన్నసమారాధన (నారాయణ సేవ) ఉంటుందని వారు పేర్కొన్నారు. 8నుంచి 10వ తేదీ వరకు మూడురోజుల పాటు స్టేజ్–1, స్టేజ్–2లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్టు వారు పేర్కొన్నారు. ఏర్పాట్లు పూర్తి పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మత్స్యలింగం, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు -
నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునుకు గురవుతున్న ఫేజ్–1బీలో ఉన్న 32 గ్రామాల్లో ఆర్అండ్ఆర్ గ్రామసభలు పూర్తయినట్లు ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. బుధవారం చింతూరులో జరిగిన గ్రామసభలో పాల్గొన్న పీవో మాట్లాడుతూ 32 గ్రామాలకు సంబంధించి మొత్తం 13,807 పీడీఎఫ్లు ఉండగా వాటిలో 12,468 మందిని అర్హులుగా, 1,339 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అనర్హుల జాబితాలో ఉన్న వారి నుంచి స్వీకరించిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిశీలించి వారు అర్హులని తేలితే వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామసభల్లో అర్హులుగా గుర్తించిన వారంతా తదుపరి డ్రాఫ్ట్ అవార్డు నిమిత్తం కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను త్వరితగతిన సంబంధిత అధికారులకు అందచేయాలని పీవో సూచించారు. ఇకపై గృహాల విలువ, ఆర్అండ్ఆర్ కాలనీల కోసం భూసేకరణ, గిరిజనులకు భూమికి భూమి వంటి అంశాలపై దృష్టిసారించడం జరగుతుందన్నారు. దీనికోసం ఇరిగేషన్, వ్యవసాయ, హార్టీకల్చర్, ఆర్డబ్ల్యుఎస్ శాఖల ద్వారా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. వరద ముంపునకు గురవుతున్న మరికొన్ని గ్రామాలను కూడా త్వరలోనే టెక్నికల్ బృందంతో సర్వే చేయించి ఆయా గ్రామాలను కూడా 41.15 కాంటూరులో చేర్చి నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం అందేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫేజ్–1ఏలో ఉన్న గ్రామాలకు సంబంధించిన ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిధ్థం చేస్తున్నామని, అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని, నిర్వాసితులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పీవో సూచించారు. గ్రామసభలో దరఖాస్తుల స్వీకరణ చింతూరులో బుధవారం జరిగిన గ్రామసభలో అనర్హుల జాబితాకు సంబంధించిన ప్రజల నుంచి ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అభ్యంతరాలు, ధ్రవపత్రాలతో కూడిన దరఖాస్తులను స్వీకరించారు. చింతూరుకు సంబంధించి 1,808 పీడీఎఫ్లకు గాను 1,641 మందిని అర్హులుగా, 167 మందిని అనర్హులుగా గుర్తించారు. అర్హుల జాబితాను అధికారులు గ్రామసభలో వెల్లడించిన అనంతరం పీవో అనర్హులుగా తేలిన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అర్హులు, అనర్హుల జాబితాలో పేర్లులేని వారి దరఖాస్తులను కూడా పరిశీలించి కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన వారికి పరిహారం అందించేందుకు చర్యలు చేపడతామని పీవో తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీపతి, బాలకృష్ణారెడ్డి, నజరయ్య, ఆంజనేయులు, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ, ఆర్ఐ విఘ్నేష్, కార్యదర్శి ప్రసాదరావు, సర్పంచ్ కారం కన్నారావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, పీసా కమిటీ సభ్యులు కారం వాసు, సోడె శ్రీనివాసరావు పాల్గొన్నారు. 32 గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ గ్రామసభలు పూర్తి 12,468 మంది అర్హులు, 1,339 అనర్హులు ముంపు గ్రామాల్లో మరోమారు సర్వే ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
శత్రుదుర్భేద్యంగా విశాఖ
● భారత్ వినియోగిస్తున్న అత్యాధునిక క్షిపణులన్నీ విశాఖలోనే తయారీ ● ఘాజీని డాల్ఫిన్ నోస్ సమీపంలో మట్టి కరిపించిన తూర్పు నౌకాదళం ● ఎన్ఏడీ, ఐఎన్ఎస్ వర్ష, డేగా బేస్ల వద్ద నిరంతర పహారా ● పాక్తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అప్రమత్తత సాక్షి, విశాఖపట్నం : భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య రోజు రోజుకూ యుద్ధ వాతావరణం భీకరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని శాఖలకు అలెర్ట్ ప్రకటించింది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ క్షణంలోనైనా.. అనే నినాదంతో భారత రక్షణ రంగం త్రివిధ దళాల్ని అప్రమత్తం చేసింది. అందుకే విశాఖలోనూ కేటగిరి–2 అలెర్ట్ ప్రకటించారు. భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. సముద్రజలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు సాగించే కీలకమైన భద్రతకు అవసరమైన షిప్లు, జలాంతర్గాములు, సర్వే వెసెల్స్.. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో కేంద్రీకృతమయ్యాయి. తూర్పు తీరం వెంబడి 2,562 కి.మీల విస్తీర్ణంలో స్థావరాల్ని ఏర్పాటు చేస్తూ.. తీర పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తోంది. దేశంలోని అన్ని సాయుధ దళాల కమాండ్లలో భౌగోళిక పరంగా ‘ది లార్జెస్ట్ కమాండ్’గా విస్తరించి ఉంది. ఈఎన్సీలో ప్రస్తుతం 37,000 మంది సిబ్బంది ఉండగా.. ఇందులో 2,895 మంది అధికారులు, 21,085 మంది నావికులు, 3,695 డీఎస్సీ సిబ్బంది, 9,689 మంది రక్షణ పౌరులున్నారు. ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటూ రక్షణ రంగంలో రారాజుగా మారింది. ఇప్పటికే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్ఎస్టీఎల్), నేవల్ ఆర్మ్డ్ డిపో(ఎన్ఏడీ)తో పాటు ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా.. ఇలా ప్రతి అంశంలోనూ విశాఖ నగరం కేంద్రంగా మారింది. శక్తివంతమైన క్షిపణులు ఇక్కడి నుంచే..! భారత నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన క్షిపణుల తయారీ కూడా విశాఖ నుంచే జరుగుతున్నాయి. డీఆర్డీవో నేతృత్వంలో పనిచేస్తున్న నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్(ఎన్ఎస్టీఎల్) ఆధ్వర్యంలో 50 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ని మట్టుబెట్టే వరుణారస్త్ర టార్పెడోకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అదేవిధంగా రెండు రోజుల క్రితం అరేబియా సముద్రంలో పాక్కు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయోగించిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్(ఎంఐజీఎం) కూడా ఇక్కడే తయారైంది. దీంతో పాటు సబ్మైరెన్ లాంచ్డ్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, ఎయిర్టూ ఎయిర్, యాంటీ ట్యాంక్, అండర్ వాటర్ వెహికల్స్, యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్ ఇలా.. శత్రుదేశాన్ని గడగడలాడించే ఆయుధ సంపత్తి విశాఖలోనే రూపుదిద్దుకుంది. అందుకే వైజాగ్ అంటేనే పాక్కు భయం కలుగుతుంటుంది. తిరుగులేని ఆయుధ సంపత్తి ప్రపంచ రక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరించేలా తూర్పు నౌకాదళం ఆయుధ సంపత్తి విషయంలోనూ బలోపేతమవుతోంది. ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్ యుద్ధ నౌకలు విశాఖ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2037 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న మరో 20 నుంచి 25 యుద్ధ నౌకలు తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయి. అదేవిధంగా మల్టీ–రోల్ 60ఆర్ 60ఆర్. అప్గ్రేడ్ చేసిన యాంటీ సబ్మైరెన్ కమోవ్ 28 హెలికాప్టర్లు, మీడియం లిఫ్ట్ ఇ–295 ఎయిర్క్రాఫ్ట్లు కూడా విశాఖలో ఒక్కొక్కటిగా కేంద్రీకృతమవుతున్నాయి. వీటన్నింటితో రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం.. దేశ రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తోంది. -
ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎటపాక: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన మండల సరిహద్దు ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల ప్రాంతం నుంచి టిప్పర్లో ఇసుక రవాణా చేయించుకుని ఎటపాక మండలం మేడువాయి ప్రాంతంలో లూప్స్ ఇండస్ట్రీస్ వద్ద ఇసుకను అన్లోడ్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో లారీ గుంతలో దిగబడడంతో దానికి బయటికి తీసేందుకు భద్రాచలం నుంచి పొక్లెయినర్ను తీసుకువచ్చారు. దాని సాయంతో లారీని గుంత నుంచి పైకి లేపించే క్రమంలో పొక్లెయినర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో పొక్లెయినర్ వెనక ఉన్న వాహన యజమాని పగడాల శ్రీనివాస్ అలియాస్ అంబిక వాసుకు(47) తగలడంతో అతడు జేసీబీ, గోడకు మధ్య ఇరుకున్నాడు. ఈ ప్రమాదంలో వాసుకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబీకులు ఎటపాక పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. -
ఉత్తమ సేవలకు పురస్కారం
రంపచోడవరం : ఏజెన్సీ ప్రాంతంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రామకృష్ణ మఠం గిరిజన సంచార వైద్యశాల కో–ఆర్డినేటర్ కానుమోను శ్రీనివాసరావు, గంగవరం గ్రామానికి చెందిన విశ్రాంత హెచ్ఎం, రచయిత, కళాకారుడు నరసింహమూర్తి పట్నాయక్ మాస్టారు శోభిత్ వర్మ స్మారక పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో ఎస్.వి.కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చల్లగాలి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా పురస్కారాలను కానుమోను శ్రీనివాసరావు, నరసింహమూర్తి పట్నాయక్ తదితరులకు రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అందజేశారు. వారిని పలువురు అభినందించారు. సుబ్బారావు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, శిష్టకరణ సంఘం నాయకులు సూర్యప్రకాశరావు, సాయిబాబా, శ్రీనివాసరావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు హెడ్ నర్సులకు పదోన్నతులు
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. హెడ్ నర్సులుగా పని చేస్తున్న ముగ్గురికి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతులు లభించాయి. డి.కవిత (రీజినల్ కంటి ఆస్పత్రి), జి.చంద్రిక (పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి), ఎం.ఇందిర (పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి)లకు పోస్టింగులు ఇస్తూ వైద్యారోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు భవానీ తదితరులు పాల్గొన్నారు. -
నర్సుల పోస్టులకు పైరవీలు!
● నర్సు పోస్టుల భర్తీలో అక్రమాలు? ● రంగంలోకి దిగిన దళారులు ● అభ్యర్థులకు ఫోన్ల మీద ఫోన్లు ● రూ.3లక్షల నుంచి 5 లక్షల వరకు డిమాండ్ ● అధికారులపై కూటమి నేతల ఒత్తిడి మహారాణిపేట(విశాఖ): ‘హలో మేము విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు స్టాఫ్నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి.’అంటూ కొందరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో దళారుల బెడద ఎక్కువైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ఫైనల్ జాబితా విడుదల కాగా.. తుది ఎంపిక జాబితా వెలువడనున్న తరుణంలో కొందరు అభ్యర్థులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఒక ముఠా అభ్యర్థుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మబలుకుతోంది. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తూ బేరసారాలకు దిగుతోంది. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అటువంటి మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ పైరవీలు.. అధికారులపై ఒత్తిడి నర్సుల పోస్టుల భర్తీ చివరి దశకు చేరుకోవడంతో కొందరు కూటమి నేతలు ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు పెద్ద మొత్తంలో ధర నిర్ణయించి.. డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ పైరవీలకు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో సిఫార్సు లేఖలు వస్తున్నట్లు సమాచారం. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టుల భర్తీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ)పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సిఫార్సు లేఖలతో పాటు, వారి వ్యక్తిగత సహాయకుల నుంచి కూడా ఆర్డీకి నిరంతరం ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటంతో కొంతమంది బేరసారాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దళారులను నమ్మవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది., మెరిట్ ప్రాతిపదికన పారదర్శకంగా జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ వంటి కొన్ని అంశాలపై ప్రభుత్వ వివరణ కోసం లేఖ రాశాం. అనుమతి రాగానే పోస్టింగ్ ప్రక్రియ చేపతాం. దళారుల మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు. అర్హత, మెరిట్, రోస్టర్ ప్రకారమే మెరిట్ జాబితా తయారు చేస్తున్నాం. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ, విశాఖపట్నం వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ ఆఫీసుపెరిగిన పోస్టులు.. తీవ్రమైన పోటీ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో ఈసారి పోస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం గిరాకీకి కారణమైంది. ప్రారంభంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 నర్సు పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ తర్వాత మరో 264 పోస్టులు ఈ ప్రక్రియలో చేరాయి. దీంతో మొత్తం 370 పోస్టుల(ఒక సంవత్సరం ఒప్పంద ప్రతిపదికన) భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి మొత్తం 8,309 దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు పోటీ తీవ్రంగా నెలకొంది. -
డొక్కు బస్సులతో ఇక్కట్లు
సాక్షి,పాడేరు: ఆర్టీసీ డొక్కు బస్సులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడంలేదు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు సర్వీసు చేస్తున్న కొన్ని ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులతో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ,పాడేరు డిపోలకు చెందిన పలు బస్సులు పాతవి కావడంతో ఘాట్రోడ్డులో ప్రయాణ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బస్సులు నిలిచిపోతుండడంతో వెనుక వచ్చే మరో ఆర్టీసీ బస్సు కోసం ప్రయాణికులు రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం పాడేరు నుంచి అనకాపల్లి వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు మినుములూరు డౌన్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరో బస్సు కోసం చాలా సమయం నిరీక్షించారు. పాడేరులో ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయి కండీషన్లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఉక్కు పీఎఫ్ ట్రస్ట్కు బకాయిలు చెల్లింపు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టుకు యాజమాన్యం బకాయిలు చెల్లించిందని పీఎఫ్ ట్రస్టీలు చీకటి శ్రీనివాసరావు, రామచంద్రరాజు, సైనుబాబు తెలిపారు. ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేసే పీఎఫ్ అమౌంట్తోపాటు యాజమాన్యం వాటాను ప్రతీ నెలా ట్రస్ట్కు చెల్లించాలన్నారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపులు నిలిచి పోయాయన్నారు. దాంతో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు అప్డేట్ చేయలేక పోతున్నామన్నారు. ఈ అంశంపై పీఎఫ్ కమిషనర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారన్నారు. తాము పీఎఫ్ ట్రస్ట్ ప్రతినిధులుగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం మార్చి 31న మొదట విడతగా రూ. 429 కోట్లు, మంగళవారం రెండో విడతగా రూ. 244 కోట్లు వడ్డీతో సహా చెల్లించినట్టు వారు తెలిపారు. అదే విధంగా ఎస్బీఎఫ్ ట్రస్ట్కు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. దీంతో యాజమాన్యం పూర్తి బకాయిలు చెల్లించినట్లయిందని పేర్కొన్నారు. ట్రస్ట్కు చెల్లింపులు చేయడానికి సహకరించిన ట్రస్ట్ చైర్మన్ హేమంత్ కుమార్ ఝా, కార్యదర్శి ఎస్.రామప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా అమ్మవార్ల ఉత్సవాలు
సాక్షి,పాడేరు: మండలంలోని మినుములూరు, గుర్రగరువు గ్రామాల్లో మోదకొండమ్మతల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మినుములూరులో సర్పంచ్ లంకెల చిట్టమ్మ ఆధ్వర్యంలో భక్తులకు భోజన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మోదకొండమ్మతల్లి ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కోలాటం, ఒడిశా బ్యాండ్ల మధ్య మోదమ్మ ఉత్సవ విగ్రహం, ఘటాలను ఘాట్లోని మోదకొండమ్మతల్లి పాదాల గుడి వరకు ఊరేగించారు. మోదమ్మకు ఘటాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గుర్రగరువు గిరిజనులు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో జాంకారమ్మ తల్లి ఉత్సవాలు కమిటీ అధ్యక్షుడు డోకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. హుకుంపేట: గిరిజనుల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు భక్తులు ఊరేగింపు తరలివచ్చారు. సర్పంచ్ సమిడా వెంకటపూర్ణిమ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
వీఆర్పురం: పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ తెలిపారు. మండల కేంద్రం వీఆర్ పురంలో మంగళవారం నిర్వహించిన ఆర్అండ్ ఆర్ గ్రామ సభలో వారు మాట్లాడారు. ఈ సభలో అర్హులు, అనర్హుల జాబితాను నిర్వాసితుల సమక్షంలో చదివి వినిపించారు. వీఆర్పురం మండల కేంద్రంలో మొత్తం 1,704 పీడీఎఫ్లను గుర్తించగా వారిలో 1,481 మందిని అర్హులుగా, 223 మందిని అనర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. గ్రామసభ జరిగిన నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో అనర్హులు పూర్తి ఆధారాలతో దరఖాస్తు చేస్తే విచారణ జరుపుతామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల వద్దనుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు వివరణ ఇవ్వనున్నట్టు చెప్పారు. నిర్వాసితులకు ఏమైనా అభ్యంతరాలు దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీకలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సీహెచ్డబ్ల్యూలను ఆశావర్కర్లుగా గుర్తించాలి
చింతపల్లి: మన్యంలో విధులు నిర్వహిస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలను(సీహెచ్డబ్ల్యూ)ఆశా కార్యకర్తలుగా గుర్తించాలని సీఐటీయూ మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. మంగళవారం లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్డబ్ల్యూలతో కలసిధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో దశాబ్దాలుగా గ్రామాల్లో వైద్య పరమైన సేవలు అందజేస్తున్న వారు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీరిని ఆశా కార్యకర్తలుగా గుర్తించడమే కాకుండా ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి రూ.26 వేలు వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా వారికి అందవలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని కోరారు.ఈ సందర్భంగా పది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి అందజేశారు. సీఐటీయూ నాయకులు మజ్జి రాంబాబు, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి,రమణమ్మ,స్రవంతి పాల్గొన్నారు. -
సింహాచలంలో సమన్వయలోపం?
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. అయితే ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్ చేసి మంగళవారం గరుడ సేవ నిర్వహిస్తారా అని వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఆమె మంగళవారం ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్నారు. ఈ క్రమంలో పీఆర్వో కార్యాలయం వద్ద ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. సోమవారం ఫోన్ చేసి అడిగితే సేవలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు లేవని ఎలా అంటారని ప్రశ్నిస్తూ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని సమాచారం. అంతేకాకుండా.. ఆర్జిత సేవలు ఉండవన్న విషయాన్ని మీడియాకు కూడా తెలియజేయలేదు. ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం -
కేటుగాళ్లు కొత్త ఎత్తులు
● ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అంటూ రెస్టారెంట్ ఓనర్లకు ఫోన్లు ● నోటీసు ఇవ్వాలా? గూగుల్ పే చేస్తావా అంటూ బెదిరింపులు ● రాణాచౌదరి పేరుతో నెంబర్ షేర్ చేస్తున్న మాయగాళ్లు ● విశాఖ, అరకు యజమానుల నుంచి వసూళ్లు? విశాఖ సిటీ : హలో.. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీ రెస్టారెంట్పై ఫిర్యాదులు వచ్చాయి. రైడ్కు వస్తున్నాం. సీజ్ చేయమంటారా? లేదంటే గూగుల్ పే నెంబర్ ఇస్తా.. డబ్బులు పంపిస్తారా? అంటూ ఉమ్మడి విశాఖలో కేటుగాళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. రెస్టారెంట్ యజమానులకు ఫోన్లు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూగుల్ పే నెంబర్కు డబ్బులు పంపించాలని, లేదంటే తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విశాఖలోనే కాకుండా అరకు రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. రాణాచౌదరి పేరుతో ఫోన్లు విశాఖ, అరకుకు చెందిన హోటల్, రెస్టారెంట్ వ్యాపారులకు ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాణా చౌదరి అనే పేరుతో వరుసగా ఫోన్లు వస్తున్నాయి. లైసెన్సులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారని, రెస్టారెంట్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. తమ వద్ద ఫుడ్ లైసెన్సు ఉందని చెప్పినప్పటికీ.. ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందని, లేబర్ లైసెన్సు లేదని ఫోన్లో గదమాయించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారికి ఫుడ్ లైసెన్సు, ఆహార పదార్థాల నాణ్యత వంటి అంశాలపై మాత్రమే తనిఖీ చేసే అధికారముంది. కానీ సంబంధం లేని లైసెన్సులు అడుగుతుండడంతో పలువురు వ్యాపారులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి వారి నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారు. గూగుల్ పే చేయాలని డిమాండ్ తనిఖీలు, నోటీసుల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గూగుల్ పేకు రూ.20 వేలు పంపించాలని సదరు నకిలీ అధికారి డిమాండ్ చేస్తున్నారు. పలువురు వ్యాపారులు మాత్రం వారిని ఫుడ్ సేఫ్టీ అధికారిగా నమ్మి వారు ఇచ్చిన గూగుల్ పే నెంబర్కు డబ్బులు పంపించినట్లు తెలుస్తోంది. ఇలా పదుల సంఖ్యలో వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విషయం మాత్రం పలువురు వ్యాపారులు ఫుడ్ సెఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని, ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు వ్యాపారులకు సూచించారు. -
మోదమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం
సాక్షి,పాడేరు: ఈనెల 11,12,13 తేదీల్లో జరగనున్న పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ముందస్తు చర్యలతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో తొక్కిసలాట లేకుండా భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేలా అఽధికార బృందం, కమిటీ సభ్యులు సహకరించాలని ఆయన సూచించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, 24గంటలూ విద్యుత్ సరఫరా జరగాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. అశ్లీలతకు తావు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీవీఐపీల సందర్శన ముందుగానే తెలుసుకుని ప్రొటోకాల్ ప్రకారం దర్శనం కల్పించాలన్నారు. సీ్త్ర,శిశు రక్షణతో పాటు సెంట్రల్ కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యూ, నీటి సరఫరా, పంచాయతీ, ఐఅండ్ పీఆర్,తదితర శాఖలను డిప్యూట్ చేయాలని ఆదేశించారు. ఉత్సవాల మూడు రోజు లు పట్టణానికి బయట పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వలంటీర్లుగా హాజరై పోలీసుశాఖ, ఆలయ కమిటీకి సహకరించాలని ఆయన కోరారు. ఈనెల 10వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే 13వ తేదీ వరకు పట్టణంలోని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల్లోను రవాణాకు సంబంధించి అన్ని భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యాపారులంతా అవసరమైన సరుకులను ముందుగానే తెప్పించుకోవాలన్నారు. ఇంటిముందు దుకాణాలు వేసే వ్యాపారులకు గృహ విద్యుత్ను సరఫరా చేస్తే సంబంధిత యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్బర్దర్, జేసీ డాక్టర్ ఎం.జే.అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత, ఎస్డీసీ లోకేశ్వరరావు, డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొణతాల ప్రశాంత్, కూడా సురేష్కుమార్, కేజీయారాణి, సల్లా రామకృష్ణ, బేరా నాని, తమర్భ ప్రసాద్నాయుడు, మత్స్యకొండబాబు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం -
ఏవోబీలో టెన్షన్ టెన్షన్
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఇటీవల జిల్లాలోని కాకులమామిడి, కాంటవరం అటవీ ప్రాంతంలో రెండు సార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం తెలిసిందే. అప్పటినుంచి ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు తలదాచుకుంటున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఏవోబీ సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు కుణ్ణంగా పరిశీలించి, విడిచి పెట్టారు.మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ పోలీసులు, బలగాలు గస్తీ నిర్వహించాయి.అనుమానితులను ప్రశ్నించి, వివరాలు సేకరించి విడిచి పెడుతున్నాయి. ఒడిశా పోలీసు బలగాలు.. ఒడిశా పోలీసు బలగాలు సైతం మాచ్ఖండ్, ఒనకఢిల్లీ, పాడువ, జోలాపుట్టు గ్రామాల్లో అడుగడుగునా తనఖీలు చేస్తున్నాయి. ఏవోబీలోని గుర్రసేత్, రూడకోట, జోడం గ్రామాల్లో గ్రామాల్లోని అవుట్ పోస్టుల పరిధిలో పోలీసు బలగాలు సరిహద్దు గ్రామాల్లోని అటవీ ప్రాంతం వైపు కదులుతూ జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఏ సంఘటన జరుగుతుందో అంటూ మారుమూల గ్రామాల గిరిజనులు భయం భయంగా ఉంటూ గ్రామాలకే పరిమితం అయ్యారు. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. తనిఖీలతో పాటు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలకు పోలీసు అలెర్ట్ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఈ మద్య కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం నిషేధిత మావోయిస్టు సభ్యులు గ్రూపులుగా ఏర్పడ్డారు. వీరు ఏజెన్సీ ప్రాంతం మొత్తం విస్తరించి, ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలు చేయుటకు అవకాశం ఉంది. అందువల్ల మావోయిస్టు పార్టీ హిట్ లిస్టు ఉన్న లేదా పొలిటికల్ లీడర్ అయిన మీరు పోలీసు వారి అనుమతి లేకుండా లోపల ఉన్న గ్రామాలకు వెళ్లరాదు. మీరు సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని నోటీసు ద్వారా తెలియజేయడమైనదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల సంచారంపై నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు -
స్తంభించిన వైద్యసేవలు
● సీహెచ్వోల ఆందోళనతో మూతపడిన విలేజ్ క్లినిక్లు ● తొమ్మిది రోజులుగా పాడేరు ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు ● సమ్మె సాకుతో ఏప్రిల్ వేతనాలు నిలిపివేయడంపై ఆవేదన ● గ్రామీణ వైద్యసేవలు నిలిచిపోయినా స్పందించని ప్రభుత్వం పాడేరు : గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ క్లినిక్)ల సీహెచ్వో (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లు సమ్మె బాట పట్టడంతో గ్రామస్థాయిలో వైద్యసేవలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని 64 పీహెచ్సీల పరిధిలో 297 విలేజ్ క్లినిక్ల్లో పనిచేస్తున్న 297 మంది సీహెచ్వోలు స్థానిక ఐటీడీఏ ఎదుట తొమ్మిది రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. దీంతో విలేజ్ క్లినిక్లు మూతపడ్డాయి. పాడేరులో భారీ ర్యాలీ ఆందోళన ఉధృతంలో భాగంగా మంగళవారం వారంతా స్థానిక ఐటీడీఏ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. అక్కడ సుమారు గంట సేపు నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఇలావుండగా సీహెచ్వోలు సమ్మె చేస్తున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించకుండా హోల్డ్లో పెట్టింది. దీంతో వారు జీతాలు అందక ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ● జిల్లా వ్యాప్తంగా ఉన్న 297 విలేజ్ క్లినిక్ల్లో 148 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి ఏడాదికి అద్దె, విద్యుత్ బిల్లులకు సంబంధించి సుమారు రూ.25 వేల వరకు తమ జీతాల నుంచి చెల్లించడం భారంగా మారిందని సీహెచ్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు ఇవీ.. ● ఆరేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ చేయాలి. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి. నిర్దిష్టమైన జాబ్ చార్జ్ అందించాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేపట్టాలి. విలేజ్ హెల్త్ క్లినిక్లకు అద్దె బకాయిలు చెల్లించాలి. ఎఫ్ఆర్ఎస్ హాజరు నుంచి సీహెచ్వోలను మినహాయించాలి. పని అధారిత ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్లు, ఎక్స్గ్రేషియా అమలు చేయాలి.అద్దె మేమే చెల్లిస్తున్నాం అద్దె భవనాల్లో విలేజ్ క్లినిక్లకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అద్దెతోపాటు విద్యుత్ బిల్లులను తామే చెల్లిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. వెంటనే చెల్లించాలి. – కె.బాలకృష్ణ, సీహెచ్వో, డుంబ్రిగుడ, పీహెచ్సీ రెగ్యులర్ చేయాలి ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్వోలను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి. ఆగస్టు 2022న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ పోస్టు రెగ్యులర్ అని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమ సర్వీస్ను క్రమబద్ధీకరించాలి. – ఎన్. సుశీల, సీహెచ్వో, మినుములూరు, పాడేరు మండలం -
సహకార సంఘాలపురోగతికి చర్యలు
● జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాడేరు : జిల్లాలో సహకార సంఘాల పురోగతికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సహకార అధికారి ఎంవీ రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా సహకార సంఘ కార్యాలయంలో జిల్లాలోని 22 మండలాల పీఏసీఎస్ సీఈవోలు, సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పీఏసీఎస్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ సహకార సంఘం వ్యాపార అభివృద్ధికి ప్రణాళిక పరమైన చర్యలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ (రాజమండ్రి) ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, రిటైర్డ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
మావోయిస్టులకుసహకరించవద్దు
మోతుగూడెం: రాష్ట్ర సరిహద్దు పరిసర ప్రాంతా ల్లో మావోయిస్టుల సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు సీఐ తెల్లం దుర్గాప్రసాద్ అన్నారు. డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టగూడెం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రజలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని కోరారు. మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామస్తులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సీ కె.కల్యాణ్, మొహిద్దిన్, పోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీ 15 శాతం పెరుగుదలకు కృషి
సాక్షి,పాడేరు: జీడీపీ 15శాతం పెరుగుదలకు ప్రైమరీ సెక్టార్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశమందిరంలో వ్యవసాయ, అనుబంధశాఖలు, ఎస్ఎంఐ పరిశ్రమలు,స్పైస్బోర్డు అధికారులతో సోమవారం నిర్వహించిన వర్కుషాప్లో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ప్రైమరీ సెక్టార్లో రూ.15వేల కోట్ల వాటా ఉందని, దానిని మరో 15 శాతం పెంచేందుకు గల అవకాశాలపై చర్చిస్తున్నామన్నారు.జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు గిరిజనులను ప్రోత్సహించాలని తెలిపారు. రైతులు సాగుచేస్తున్న పంటల విస్తీర్ణం,మార్కెటింగ్ సదుపాయాలు పెంచడం,అదనపు పంటల విస్తరణ, గ్రేడింగ్, ప్యాకింగ్లతో అదనపు విలువలు జోడించడం,నాణ్యత పెంచడం వంటి అంశాల ద్వారా 15 శాతం ఉత్పాదకతను పెంచా లని సూచించారు. నీటి పారుదలశాఖ, మైక్రో ఇరిగేషన్, పరిశ్రమలశాఖల 15శాతం ఉత్పాదతకు సహకరించాలని తెలిపారు. సచివాలయ స్థాయిలో అధికారులు రైతులకు సరైన మార్గదర్శకం చూపాలని సూచించారు. మరో ఐదేళ్లలో ఆర్గానిక్ జిల్లాగా మారనున్న నేపథ్యంలో సంఘాలు,ఎఫ్పీవోలుగా ఏర్పడి రైతులు అధిక లబ్ధి పొందాలన్నారు.ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,సీపీవో పట్నాయక్, వ్యవసాయ, ఉద్యానవన, స్పైసెస్బోర్డు, కాఫీ అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్కుమార్రావు, కల్యాణి, అప్పలనాయుడు, నీతిఆయోగ్ ప్రతినిధులు చైతన్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్కు ట్రైబల్ ఈకామ్ జిల్లాలో రైతులు సంఘాలుగా ఏర్పడి అటవీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించే విధంగా ట్రైబల్ ఈకామ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులకు సూచించారు. తన కార్యాలయం నుంచి జీసీసీ, వివిధ సంస్థల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ట్రైబల్ ఈకామ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో కాఫీ,మిరియాలకు అత్యధిక డిమాండ్ ఉందని,వాటిని బ్రాండింగ్,గ్రేడింగ్ చేయడంపై శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ట్రైబల్ ఈకామ్ ద్వారా మార్కెటింగ్ జరిపితే గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయ,అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
గతంలో పొగాకు కొనుగోలు ఇలా..
శబరి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పండే లంకపొగాకు(నాటుపొగాకు)కు ఇతర రాష్ట్రాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. నదీ పరీవాహక లంకల్లో పండించిన పొగాకుతో తయారుచేసిన చుట్టలను కాల్చేందుకు పలువురు ధూమపాన ప్రియులు అమితంగా ఇష్టపడతారు. గతంలో ఈ ప్రాంతంలో లంకపొగాకు పండించిన రైతులు పక్వానికి వచ్చిన తరువాత వాటిని కాండంతో సహాకోసి కిత్తనారతో కుట్టి పాకలపై ఆరబెట్టేవారు. పొగాకు పూర్తిగా ఎండిన తరువాత తాటాకు బుట్టల్లో 30 కిలోల చొప్పున కట్టేవారు. మూడు బుట్టలను పుట్టిగా, ఎనిమిది పుట్లను( 24 బుట్టలు) గరిసెగా పిలుస్తారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు.. రైతుల వద్దకు వచ్చి సరకును పరిశీలించి కొనుగోలు చేసేవారు. నగదు కాస్త ఆలస్యంగా ఇచ్చినా చేసేదిలేక రైతులు తీసుకునేవారు. -
పొగబారిన ఆశలు.. దగా పడిన రైతులు
విలీన మండలాల్లో పొగాకు రైతుల ఆశలు అడియాసలయ్యాయి. సాగుకు ముందు పొగాకు కొనుగోలుకు హామీ ఇచ్చి, ప్రోత్సహించిన కంపెనీ దిగుబడి వచ్చాక కొనుగోలు చేయడానికి అడ్డగోలు నిబంధనలు పెట్టి నట్టేట ముంచింది. గత ఏడాది పొగాకు రైతులకు లాభాలు కురిపించడంతో ఈ ఏడాది మరింత ఆశతో విస్తారంగా సాగు చేశారు. వారంతా పూర్తిగా తమ గుప్పిట్లో ఇరుక్కోగానే ఆ కంపెనీ బురిడీ కొట్టించింది. దీంతో రైతులు లబో దిబోమంటున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం పొగాకును కంపెనీకి విక్రయిస్తున్న రైతులు కొనుగోలు సమయంలో కొర్రీలు కంపెనీ మాటలు నమ్మి పొగాకు పండించిన రైతులు బయటకు చెబితే సరకు కొనబోమని బెదిరింపులు చింతూరు: విలీన మండలాలైన కూనవరం, వీఆర్పురం, ఎటపాక, చింతూరుకు చెందిన పొగాకు రైతులు ఓ కార్పొరేట్ కంపెనీ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. గత ఏడాది తాము పండించిన లంక పొగాకును అధిక ధరకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ ఈ ఏడాది మాత్రం కొర్రీలు పెట్టి మరీ తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఈ విషయాన్ని బయటకు చెబితే మీ సరుకు కొనుగోలు చేయబోమంటూ కంపెనీకి చెందిన ప్రతినిధులు బెదిరింపులకు దిగడంతో సదరు రైతులు తమపేర్లు చెప్పేందుకు కూడా ముందుకు రావడంలేదు. కంపెనీ రాకతో ఆశలు గత ఏడాది ఈ ప్రాంతంలోకి ఓ కార్పొరేట్ కంపెనీ అడుగుపెట్టి తాము అధిక రేటుకు పొగాకు కొనుగోలు చేస్తామని, గతంలో లంక వ్యాపారులు ఎలా కొనుగోలు చేస్తే .. అలాగే కొనుగోలు చేస్తామని, సొమ్ము కూడా వెంటనే చెల్లిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కాగా గతంలో మాదిరిగా పొగాకును బుట్టల్లో కాకుండా వర్జీనియా పొగాకు మాదిరిగా బేళ్లలో కట్టాలని కంపెనీ ప్రతినిధులు తెలపడంతో రైతులు ఆ మాదిరిగానే ఒక్కో బేలులో 50 నుంచి 80 కిలోల వరకు సరకును నింపారు. దీంతో గత ఏడాది తమ వద్దనుంచి కాడలతో(లింకుకోత) సహా కిలో రూ.160 నుంచి రూ.180 వరకు కంపెనీ కొనుగోలు చేయడంతో మంచిగా లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు. ఈ ఏడాది కొర్రీలు గత ఏడాది లాభాలు రావడంతో ఈ ఏడాది రైతులు మరింత అధికంగా పొగాకును పండించారు. నాలుగు మండలాలకు చెందిన సుమారు వెయ్యిమంది రైతులు సుమారు నాలుగు వేల ఎకరాల్లో లంకపొగాకును పండించారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టడంతో ఎకరాకు 10 బేళ్ల వరకు దిగుబడి వచ్చింది. కాగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సదరు కంపెనీ తమవద్ద కాడలతో(లింకుకోత) సహా కోసిన పొగాకును కొనుగోలు చేస్తుందని భావించినట్లు రైతులు తెలిపారు. తీరా కాడలతో పొగాకు కోసిన అనంతరం ఈ ఏడాది తాము కాడలతో సరకును కొనుగోలు చేయలేమని కేవలం ఆకులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆ విధంగానే బేళ్లను నింపాలని కంపెనీ ప్రతినిధులు తెగేసి చెప్పారని రైతులు వాపోయారు. ఇప్పటికే తాము కోతకోసి ఆరబెట్టడం జరిగిందని ఈ సమయంలో కాడతో కొనుగోలు చేయబోమనడం సరికాదని ప్రాథేయపడినా కాడతో ఉంటే సరకు కొనేది లేదంటూ తెగేసి చెప్పారని రైతులు తెలిపారు. దీంతో చేసేదిలేక ఎకరాకు రూ 10 వేల నుంచి రూ. 13 వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టి కాడలు తొలగించాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. ధర తగ్గించి.. కంపెనీ షరతు మేరకు అదనపు పెట్టుబడితో కాడలు తొలగించినా సరకు కొనుగోలులో సైతం అనేక ఇబ్బందులు పెట్టినట్లు రైతులు తెలిపారు. గత ఏడాది కాడలతో కిలో రూ.160 నుంచి రూ.180 వరకు కొనుగోలు చేసిన కంపెనీ ఈ ఏడాది కాడలు లేకుండా కేవలం ఆకులతో రూ.180 నుంచి రూ. 200 వరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. కాడలతో కొనుగోలు చేయకపోవడంతో బరువుతగ్గి తూకంలో తమకు నష్టం వాటిల్లడంతో పాటు కాడలు తీసేందుకు అదనపు పెట్టుబడి కూడా అయిందని వారు వాపోయారు. ఈ ఏడాది సదరు కంపెనీ కంటే గతంలోని లంక వ్యాపారులే కాడలతో సహా అధిక ధరకు సరకు కొనుగోలు చేశారని, తాము కంపెనీతో ఒప్పందం చేసుకోవడంతో వారి షరతు మేరకు కాడల ను తొలగించాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. కాగా కాడలు తీసిన సరకును లంక వ్యాపారులు కొనుగోలు చేయరని దీంతో చేసేదిలేక కంపెనీకే విక్రయించవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశా రు. ఈ ఏడాది కొంతమందికి లాభాలు తక్కువ రాగా, మరి కొంతమందికి ఎకరాకు రూ. 30వేల వరకు నష్టంవచ్చినట్టు రైతులు వాపోయారు.