breaking news
Alluri Sitarama Raju District Latest News
-
మా రైలు ఎప్పుడొచ్చేనో!
సమయపాలనలో గాడితప్పిన విశాఖపట్నం రైల్వే డివిజన్ 63.21 శాతంతో 62వ స్థానానికి పతనం గతంలో 80–85 శాతంతో మెరుగైన పనితీరు ప్రతి పది రైళ్లలో నాలుగు ఆలస్యమే టెర్మినల్ స్టేషన్ కావడంతో లోకో రివర్సల్తో ఇబ్బందులు గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యంతో ప్రయాణికులకు తిప్పలుమాదకద్రవ్యాలకుదూరంగా ఉండాలి గూడెంకొత్తవీధి: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ తిరుమలరావు సూచించారు. గూడెంకాలనీలో గల గురుకుల బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. సైబర్ క్రైమ్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద మెసేజ్లను క్లిక్ చేయరాదన్నారు. బాలికలు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. అనంతరం వాలీబాల్ కిట్ను అందజేశారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన డీఎస్పీ ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు. సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.సాక్షి, విశాఖపట్నం: ‘ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ప్లాట్ఫారమ్పైకి రావాల్సిన రైలు నిర్ణీత సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గమనించగలరు..’ రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడూ వినిపించే ఈ ప్రకటనలు ఇప్పుడు విశాఖపట్నం డివిజన్లో సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు సమయపాలనలో ‘సూపర్ఫాస్ట్’గా దూసుకెళ్లిన డివిజన్.. ఇప్పుడు ‘ప్యాసింజర్’ రైలు కంటే నెమ్మదించింది. తాజాగా రైల్వే బోర్డు విడుదల చేసిన దేశవ్యాప్త రైళ్ల సమయపాలన ర్యాంకింగ్స్లో టాప్–70 డివిజన్లలో విశాఖ 62వ స్థానానికి పడిపోయింది. కేవలం 63.21 శాతం పంక్చువాలిటీ నమోదైంది. ప్రతిరోజూ రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను రూపొందించారు. సాధారణంగా 80–85 శాతానికి పైగా పంక్చువాలిటీతో ఉండే విశాఖ.. ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంటే ప్రతి పది రైళ్లలో దాదాపు నాలుగు నిర్ణీత సమయానికి చేరడం లేదన్నమాట. కళ్లు చెదిరే ఆదాయం ఆర్జించే డివిజన్.. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఎందుకు విఫలమవుతోంది? గూడ్స్ రైళ్లకు ఉన్న ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకు దక్కడం లేదా? టెర్మినల్ స్టేషన్ కావడం కూడా ఇందుకు కారణమా? పొరుగు డివిజన్ల స్పీడ్.. మనకెందుకు లేదు? రాష్ట్రంలోని ఇతర డివిజన్ల పనితీరుతో పోలిస్తే విశాఖ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. గుంతకల్లు 99.33 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు 94.03 శాతంతో 17, విజయవాడ 88.30 శాతంతో 26వ స్థానంలో ఉన్నాయి. విశాఖ మాత్రం 63.21 శాతంతో 62వ స్థానంలో నిలిచింది. ట్రాక్ల ఆధునీకరణ, బైపాస్ లైన్లు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇతర డివిజన్లు ముందుకు సాగుతుండగా.. విశాఖలో కీలక పనులు నత్తనడకన సాగుతుండటం వ్యత్యాసానికి ఓ కారణంగా కనిపిస్తోంది. టెర్మినల్ స్టేషన్తో తిప్పలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెర్మినల్ కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి రైలుకు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకో రివర్సల్కు 20–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికితోడు ప్లాట్ఫారమ్ల కొరత ఉంది. ఒక రైలు లోపలికి రావాలంటే మరోటి దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం ఔటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్క రైలు ఆలస్యం ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడుతోంది. గూడ్స్కే పెద్దపీట? దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సరకు రవాణా కీలక ఆదాయ వనరు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి నిత్యం భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పోర్టు సరకు రవాణాకు మార్గం కల్పించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయాల్సి వస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రీమియం రైళ్లకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇక వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్ణీత సమయానికి నడిపించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. రెగ్యులర్ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. వేగవంతమైన రైళ్లకు మార్గం కల్పించేందుకు ఇతర సర్వీసులను నిలిపివేయాల్సి వస్తుండటంతో ఆలస్యాల పరంపర కొనసాగుతోంది. అభివృద్ధి పనుల్లో జాప్యం రైళ్ల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో జాప్యం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. విశాఖపట్నం స్టేషన్ రీడెవలప్మెంట్, ప్లాట్ఫారమ్ల విస్తరణ, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రోజుకు 5–6 రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పుడే పట్టాలెక్కేనా? విశాఖ డివిజన్ పనితీరు మెరుగుపడాలంటే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు థర్డ్, ఫోర్త్ లైన్ పనులను వేగవంతం చేయాలి. దువ్వాడ బైపాస్ లైన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. లోకో రివర్సల్తో పడుతున్న సమయభారాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ట్రాక్లపై రద్దీని సమర్థంగా నిర్వహించగలిగితేనే.. ఒకప్పుడు సమయపాలనలో ముందున్న విశాఖ డివిజన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలదు. త్వరితగతిన రీసర్వే ● సర్వేశాఖ ఆర్జేడీ కుమార్ సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వేశాఖ ఆర్జేడీ వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా సుమారు 1400 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలోని 493 గ్రామాల్లో సర్వే ప్రారంభించామని, ఇప్పటి వరకు 96 గ్రామాల్లో 24,640 ఎకరాలలో రీసర్వే పూర్తి చేశామన్నారు. రెండవ విడతలో 454, మూడవ విడతలో 450 గ్రామాల్లో రీసర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ,సర్వేయర్ల బృందాలు భూముల రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో సర్వే డీడీ హరికృష్ణ.జిల్లా సర్వే అఽధికారి ఈశ్వరదొర, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఇన్చార్జి డీఎంహెచ్వోగా రియాజ్బైగ్ సాక్షి,పాడేరు: ఇన్చార్జి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ రియాజ్ బైగ్ ను నియమిస్తూ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలోని ఎన్పీసీబీ అండ్ వీఐ విభాగంలో డీపీఎంగా పనిచేస్తున్న ఆయనను పూర్తి అదనపు బాధ్యతలపై నియమించారు.గతంలో ఇక్కడ డీఎంహెచ్వోగా పనిచేసిన కృష్ణమూర్తినాయక్ అవినీతి ఆరోపణలపై సస్పెండయ్యారు. ఆయన స్థానంలో మొదటిగా విశాఖపట్నం ఏఎంసీలో పనిచేస్తున్న రామారెడ్డిని ఇన్చార్జి డీఎంహెచ్వోగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించకుండా సెలవులో వెళ్లారు. దీంతో డాక్టర్ రియాజ్బైగ్ను నియమించారు. -
ఆకలి కేకలు
గిరిజన విద్యార్థులకు బోధన అందిస్తూ.. విద్యాభివృద్ధికి శ్రమిస్తున్న సీఆర్టీల కుటుంబాల్లో మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెలనెలా రావాల్సిన వేతనాలు ఆరు నెలలుగా అందకపోవడంతో రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. వేతన బకాయిలు చెల్లించాలి ఆరు నెలలుగా ప్రభుత్వం సీఆర్టీలకు బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం, గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలను చెల్లించాలి. – దళపతి మోహన్, జిల్లా అధ్యక్షుడు, సీఆర్టీల సంఘం సాక్షి, పాడేరు: రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,284 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి సీఆర్టీల వేతనాల కోసం నిధులు విడుదల కాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాకు సంబంధించి 284 మంది సీఆర్టీల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ● గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు రూ.44,460, ఎస్జీటీలు రూ.32,670 వేతనంతో సీఆర్టీలుగా విధులు నిర్వహిస్తున్నారు. గిరిజన విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వేతనాలు బకాయి పడటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులే ఈ ఏడాది మార్చి నుంచి వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసరాల ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఆర్టీలు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చలేకపోగా.. కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గత రెండు నెలలుగా పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లల అడ్మిషన్ల ఫీజుల కోసం వడ్డీకి అప్పులు తెచ్చుకున్నామని, వాటిని తిరిగి చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామని సీఆర్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం తమ వ్యక్తిగత జీవితంతో పాటు పాఠశాలల్లో విధులపైనా పడుతోందని చెబుతున్నారు. ఎస్టీ కమిషన్కు విన్నవించినా.. ఆరు నెలలుగా వేతనాలు అందని సమస్యపై సీఆర్టీ యూనియన్ నాయకులు రెండుసార్లు ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని సీఆర్టీలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు.అప్పులు పుట్టని పరిస్థితి వేతనాలు అందక సీఆర్టీ కుటుంబాలు జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోజువారీ నిత్యావసర ఖర్చులకు కూడా అవస్థలు తప్పడం లేదు. అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. బకాయి వేతనాల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోతోంది. – బాలకృష్ణ, కార్యదర్శి, సీఆర్టీ ఉపాధ్యాయ సంఘం, పాడేరు సీఆర్టీల ఆరు నెలలుగా అందని వేతనాలు భారంగా కుటుంబ పోషణ జీతాల కోసం ఎదురుచూపులు అప్పులు చేసి నెట్టుకొస్తున్న కుటుంబాలు ఇంటి అద్దెలు.. పిల్లల చదువుల ఫీజులకూ తప్పని ఆర్థిక కష్టాలు రెండుసార్లు ఎస్టీ కమిషన్కు విన్నవించినా.. పరిష్కారం కాని సమస్య 1,284 మంది సీఆర్టీలకు తప్పని వేతన వెతలు పట్టించుకోని ప్రభుత్వం -
ఏటీఎం మోసగాడు అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఏటీఎంలో సహాయం చేస్తానంటూ వృద్ధుడిని నమ్మించి ఏటీఎం కార్డు, పిన్ విరాలు సేకరించి రూ.10 వేలు కాజేసిన అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న మెయిన్రోడ్ మాణిక్య లాడ్జి కింద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 76 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి లావాదేవీ నిర్వహిస్తుండగా నిందితుడు ప్రత్తి రాజేష్ సహాయం చేస్తానని నమ్మించి, ఆయన ఏటీఎం, పిన్ వివరాలను తెలుసుకొని బాధితుడికి తెలియకుండా ఖాతా నుంచి రూ.10 వేలు విత్డ్రా చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాఽధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, గూడ్స్ రోడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిందితుడిపై ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలలో 12 దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
హైపవర్ కమిటీలో ఉద్యోగులను నియమించవద్దు
సాక్షి,పాడేరు: జీవో నంబర్3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో ప్రకటన, 1/70 చట్టం పరిరక్షణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైపవర్ కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించవద్దని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ నేతలు హెచ్చరించారు. హైపవర్ కమిటీలో ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారిని నియమిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్లో వారు నిరసన వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి, కూటమి ప్రభుత్వ కుట్రలు, అధికారుల తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన సంఘం కార్యాలయంలో నూరుశాతం ఉద్యోగాల సాధన కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ జీవో నంబర్ 3 సాధన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు ద్రోహం చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని, ఆదివాసీ జేఏసీ నాయకులు,ఉద్యోగ సంఘాలు ప్రలోభాల వలలో పడవద్దన్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులను హైపవర్ కమిటీలో నియమించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కాంగు శుభ, హై మావతి, వంతాల నాగేశ్వరరావు, సత్యారావు,కిల్లో రాజారావు, వై.కుమార్, భాను, కార్తీక్ శ్రీను, పాంగి చిన్నారావు పాల్గొన్నారు.అనుకూల వ్యక్తుల నియామకంపై గిరిజన సంఘాల నిరసన -
ఏదీ ఎత్తిపోతల?
నాతవరం: తాండవ రిజర్వాయరు ఏలేరు కాలువ అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో పోలవరం కాలువ నుంచి తాండవకు ఎత్తిపోతల పథకం తెస్తానంటూ అయ్యన్న పాత్రుడు హామీచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో అయ్యన్న హామీ రైతులను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తాండవ కాలువలు రూ. 65కోట్లతో సిమెంట్ లైనింగ్ పనలు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. ఆయన తనయుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా చేసేందుకు ఏలేరు కాలువ తాండవ ప్రాజెక్టు అనుసంధానం చేసేందుకు రూ. 470 కోట్లు 5లక్షలు మంజూరు చేసి ఆయనే స్వయంగా 2022లో డిసెంబరులో నర్సీపట్నంలో అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. అనుసంధానానికి నిధులు మంజూరు చేయడంతో రూ.10 కోట్ల మేర పనులకు ఖర్చు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజక్టు నుంచి అదనపు నీటిని ఏలేరు కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరించారు. మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు తాండవ కాలువలను రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నార్త్కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. అనుసంధానం పనులకు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.ఎం.కె కంపెనీ సంస్థ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తే రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పనుల్లో జాప్యం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ ఏలేరు అసునంధానం పనులు 25 శాతం కూడా పూర్తి చేయలేదంటూ రద్దు చేసింది. ఈ పనులు రద్దు పై రెండు జిల్లాల్లో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవకు నీరు తెస్తానంటూ 2024 అక్టోబరులో మండల పర్యటనకు వచ్చినపుడు సభలో హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం నా జీవిత ఆశయమని..గొప్పగా చేప్పేశారు. పోలవరం కాలువ నీటిని తుని మండలం రేఖవానిపాలెం గ్రామం నుంచి తాండవకు తీసుకురావాలని దీనికి రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేటికీ పోలవరం తాండవ ఎత్తిపోతల పధకం ప్రతిపాదనలే ఇరిగేషన్ శాఖలో లేకపోవడం గమనార్హం. క్యాబినెట్లో ప్రస్తావన ఏదీ... రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చించి కొన్ని ప్రాంతాలకు కొత్తవి మంజూరు చేశారు. పోలవరం తాండవ ఎత్తిపోతల పథకంపై కనీసం చర్చకు రాకపోవడం విశేషం. ఖరీఫ్ సాగుకు మంగళవారం తాండవ రిజర్వాయరు నుంచి ఆయకట్టుకు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఏలేరు తాండవ అనుసంధానం పనులు రద్దు చేయకుండా కొనసాగిేస్తే పనులు పూర్తి అయ్యేవని రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా పూడిక తీత పనులు ఆయకట్టుకు నీరు ప్రవహించే కాలువలో పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. గత నెలలో మన్యపురట్ల తాండవ నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువలో ఉన్న పూడికను స్వయంగా అధికారులను తీసుకెళ్లి చూపించారు. పూడిక తీశాకే నీరు విడుదల చేస్తే నీరు ప్రవహిస్తుందని తెలిపారు. అయితే ఆ కాలువలో పూడిక నేటికీ తీయలేదు. తాండవ ప్రధానగేట్లకు రూ.లక్షలు వ్యయంతో మరమ్మతులు చేసినా లీకేజీ అరికట్టలేదు. 2024లో పోలవరం–తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ సభలో హామీ ఇస్తున్న స్పీకర్ అయ్యన్న (ఫైల్) హామీ నెరవేర్చాలి.. స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం కోసం బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మా ప్రభుత్వం హయంలో మంజూరు చేసిన ఏలేరు తాండవ అనుసంధానం పనులు రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులు పడే సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమిస్తున్నారు. –పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదన లేదు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం తాండవ ప్రాజెక్టు పరిధిలో కాలువలో పూడికతీత మరమ్మతు పనులు చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఈఏడాది బాగా చేశాం. –ఆనురాధ, డీఈ తాండవ ప్రాజెక్టు -
ఓపీలకు బ్రేక్.. రోగులకు నిరీక్షణ
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మెతో కేజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో భాగంగా బుధవారం రెండో రోజు కూడా జూనియర్ వైద్యులు ఓపీలను బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో కేజీహెచ్లోని 26 ఓపీల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఓపీల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వార్డుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. బుధ వారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా జూనియర్ వైద్యులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. విశాఖలోని కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీ వైద్యులు, 500 మంది జూనియర్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. -
పాముకాటుకు గురైన మహిళ మృతి
చీడికాడ: పాముకాటుకు గురైన వివాహిత విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు మండలంలోని వరాహపురం తాజామాజీ సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిబోయిన ఘాఠీలు(29)ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి బయట ఉన్న సమయంలో విష సర్పం కాటు వేసింది. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న భర్త అర్జునకు ఘాఠీలు చెప్పడంతో హుటాహుటినా చోడవరం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఘాఠీలు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిదన్నారు. ఘాఠీలకు పార్ధు(12),షణ్ముకం(9),దీక్షిత(6) వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారు. భర్త అర్జున ఫిర్యాదు మేరకు చీడికాడ ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘాఠీలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణాభివృద్ధి
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. కిండంగి పంచాయతీ కార్యాలయం ఆవరణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా బుధవారం మహిళలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్,డిజిటల్ చెల్లింపులు,బీమా,పెన్షన్లు తదితర ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి, డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో 29 బ్యాంకుల శాఖలు, 21 ఏటీఎంలున్నాయని, 2,643 మంది బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో 13వేల మంది రైతులకు వ్యవసాయ రుణాలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కిండంగి,అడ్డుమండ,సంగోడి గ్రామాలు 100 శాతం డిజిటల్,ఆర్థిక సంతృప్తి గ్రామాలుగా ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ ఎస్.రత్నకుమారి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ మాధురి,ఎల్డీఎం మాతునాయుడు,అదనపు ఎంపీడీవో రమేష్,తహసీల్దార్ శ్రీనివాసరావు,సీఎఫ్ఐ కో ఆర్డినేటర్ బాలకృష్ణ,పలుశాఖల యూబీఐ మేనేజర్లు భానుశేఖర్,నారాయణరావు,మాజీ ఎంపీపీ బి.విజయరాణి పాల్గొన్నారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి సాక్షి,పాడేరు: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ టి.నిశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన ప్రచార పోస్టర్లను జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. డీఆర్వో లోకేశ్వరరావు,ఆర్డీవో భుజంగరావు,వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం తొలివిడతలో జిల్లాకు కేటాయించిన 13 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ టి.నిశాంతి బుధవారం ప్రారంభించారు.రెండవ దశలో మరో 10 వాహనాలు జిల్లాకు వస్తాయని కలెక్టర్ తెలిపారు. -
‘పోస్టాఫీస్’ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
సాక్షి, పాడేరు: స్థానికంగా సంచలనం సృష్టించిన తపాలా శాఖలో జరిగిన చోరీ కేసును పాడేరు పోలీసులు 24 గంటలు గడవకముందే ఛేదించారు. ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి పాడేరు తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైంది. 11వ తేదీ ఉదయం ఉద్యోగులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పాడేరు సీఐ రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. తపాలా శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేసి, నిందితుడిని గుర్తించారు. హుకుంపేటకు చెందిన పాత నేరస్తుడు కిల్లో సిద్ధు(22)ను బుధవారం అరెస్టు చేసి, రూ.1,46,560 నగదు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ రామారావు విలేకరులకు తెలిపారు. సిద్ధుకు గతంలో 17 కేసుల్లో ప్రమేయముందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పాడేరు ఎస్ఐ పాపినాయుడు, క్రైమ్ సిబ్బంది, ఇతర పోలీసులను సీఐ రామారావు అభినందించారు.రూ.1.46 లక్షల రికవరీ -
గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కొమ్మాది: గిరిజన విద్య, సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం సూచించారు. రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా మిషన్ (టీసీఆర్టీఎం) కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ చేపడుతున్న అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన భాషల ప్రైమర్లు, చిత్రకోశాలను ఆశ్రమ పాఠశాలల లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, విలువ పెంపు కోసం ఐఐఎం విశాఖపట్నంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సమిధా సింగ్, టీసీఆర్టీఎం డైరెక్టర్ రాణి మందా తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ మాఫియా నుంచి కొండల్ని కాపాడండి
నక్కపల్లి: మండలంలో గ్రావల్ మాఫియానుంచి కొండలను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ విజయ్కృష్ణన్ను కోరారు. బుధవారం నక్కపల్లి మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ వేంపాడులో పాలకొండను కొల్లగొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అనధికార లేఅవుట్లకు ఈ గ్రావల్ తవ్వి తరలించేందుకు సిద్దపడుతున్నారన్నారు. పాలకొండను మరో పంచదార్ల కొండలా చేయొద్దని కోరారు. ఉద్దండపురం, బోదిగల్లంలో ఉన్న కొండలను కూడా కొల్లగొడుతున్నారన్నారు. నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావల్ను ట్రిప్పర్లలో తరలించుకుపోతున్నారని, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తునికి చెందిన ఒక టీడీపీ నాయకుడికి వేంపాడు పాలకొండలో గ్రావల్ తవ్వి లేఅవుట్లోకి తరలించేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇప్పటికే కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. పాలకొండలో గ్రావల్ తవ్వకాలకు అనుమతిస్తే వైఎస్సార్సీసీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కలిసి ఉద్యమ బాటపట్టాల్సి వస్తుందన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఉన్న కొండల్లో గ్రావల్ను కూడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఽ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తళ్ల భార్గవ్ పాల్గొన్నారు. సాగునీటి వనరులు స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దు మండలంలో కాగితలో చెరువులు, గెడ్డలు, వాగులను స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దని గ్రామానికి చెదందిన పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సిపి నేత వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టర్ విజయ్కృష్ణను కలిసారు. గ్రామంలో సుమారు 17 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, గొల్ల చెరువు, గెడ్డలను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ప్రధాన సాగునీటి వనరులను స్టీల్ప్లాంట్కు కేటాయిస్తే ఆయకట్టు భూములపై ఆధారపడ్డ వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములు సాగునీరు అందక బీడు వారతాయన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతులు దేవవరపు శివ,పోతంశెట్టి బాబ్జి, గుమ్మిళ్ల గోవిందరావు,పోతంశెట్టి వీరబాబు, దేవవరపు గోవిందరావు,పోతంశెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు,గంగేశ్వరరావు ఉన్నారు.కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల వినతి -
ఆటోప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆటోకి తగిలి గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఏఎస్ఐ వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోన రాజు(38) మంగళవారం అడ్డురోడ్డు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి సడన్బ్రేక్ వేయడంతో తన ఆటోకి ముందు భాగం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ రాజుని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆపై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. -
తుప్పు పడుతున్న స్కూటీలు
● పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సాక్షి,పాడేరు: జిల్లాలోని దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన మూడు చక్రాల స్కూటీలు పాడేరు జూనియర్ కళాశాల ఆవరణలో తుప్పుపడుతున్నాయి. రెండు నెలలుగా 20 స్కూటీలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతుండడంతో పాడవుతున్నాయి. కొన్ని భాగాలకు తుప్పు పట్టడంతో దివ్యాంగులకు పంపిణీ చేయకుండానే పాడయ్యే పరిస్థితి నెలకొంది.సురక్షిత ప్రాంతాల్లో స్కూటీలను భద్రపరచాల్సిన దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారులు కళాశాల ఆవరణలో ఆరు బయట ఉంచడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలిపారు. లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘పాత పెన్షన్’ కోసం 1న చలో విజయవాడ
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
నర్సీపట్నం: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల విద్యార్థిని సింధు జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ 800 మీటర్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, పీడీ, ఇన్ఛార్జి హెచ్ఎం నూకరాజు, ఉపాధ్యాయు లు బద్రీనారాయణ, లక్షణరావు, ధర్మరాజు అభినందించారు. నర్సీపట్నం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరినీ ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. జిల్లాస్థాయి అమరావతి చాంఫియన్షిప్ పోటీల్లో కబడ్డీ కె.ఆశోక్, ఎ.లోకేష్, వాలీబాల్ పి.ప్రసాద్, వెయిట్ లిప్టింగ్ ఎ.రోహిత్, లాంగ్జంప్ టి.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతంగా రాణించిన విద్యార్థులు, తర్ఫీదు ఇచ్చిన పీడీ వినోద్ను ప్రిన్సిపాల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 9 మంది ఎంపిక మాకవరపాలెం: అమరావతి ఛాంపియన్ షిప్ పోటీ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీడీవో చాయిసుధ, ఎంఈవోలు మూర్తి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ అభినందించారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ లో కబ డ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్ పోటీల్లో మాక వరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈవో మూర్తి మంగళవారం తెలిపారు. వీరిని ఆయనతోపాటు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు. మాకవరపాలెం: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు 32 మంది అవంతి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అనకాపల్లిలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అయితే బాక్సింగ ఖోఖో, యోగా, బాడ్మింటన్, కబడ్డీ, వాటీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపి 32 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. -
పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్కు ఊరట
నర్సీపట్నం: పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులకు ఊరట లభించింది. విశాఖ ఎయిర్పోర్టులో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన కోడి కత్తితో హత్యాయత్నం ఘటనపై ఆందోళన చేయడంపై 2018లో మాజీ ఎమ్మెల్యే గణేష్, మరికొంత మందిపై నర్సీపట్నం టౌన్ పోలీసు అక్రమ కేసు పెట్టారు. అదే సంవత్సరంలో ఓటరు లిస్ట్లో ఓటర్లను తొలగించడంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు బనాయించారు. తన వాదనలు విన్న కోర్టు ఈ రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని లాయర్ మాకిరెడ్డి బుల్లిదొర తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, సీనియర్ నాయకులు ఏకా రాజుబాబుకు ఊరట లభించింది. -
రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు, ఒకరు పరార్కశింకోట: కశింకోటలో పోలీసులు సుమారు రూ.30 లక్షలు విలువైన అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని నలుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సీఐ అల్లు స్వామినాయుడుతో కలిపి అనకాపల్లి ఇన్ఛార్జి డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు ఆటోలో ఇద్దరు బైక్ల ఎస్కార్ట్తో వెళుతుండగా అనుమానించి కశింకోట వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గోనె సంచుల్లో 30 ప్యాకెట్ల గంజాయిని నింపి ఆటో వెనుక ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయి తరలిస్తున్న కాకినాడకు చెందినగాడి సత్యంరాజు (28), రాజమండ్రికి చెందిన చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్కు చెందిన గుంత హిమాన్సు శేఖర్(27), కారా కేసరి(32) పోలీసులను చూసి పరార్ అవుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. మరో నిందితుడు మర్రి ఘాషి అలియాస్ రవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. గంజాయి పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మణరావు, చాకచక్యం ప్రదర్శించిన ఏఎస్ఐ శ్యామ్ సుందర్, హోంగార్డు డి.ఎస్ బాబుల పీసీలకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ ప్రత్యేక నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కేసులో ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది సహకారం అందించారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం
చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్లో మండల పార్టీ కార్యదర్శి పెట్ట పోతురాజు అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, పరీక్షా వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వీటి వల్ల ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తూ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి నిరుద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో నంబర్ 3పై కూటమి ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విధంగా బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆది నుంచి అలుపెరగని పోరాటం చేస్తోందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ గిరిజనులను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 1న ఢిల్లీలో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.విమల, జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లి సత్యనారాయణ, కూడ రాధాకృష్ణ, సూరిబాబు, సింహాచలం, రాజుబాబు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి -
పోస్టాఫీసులో దొంగల బీభత్సం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీసుస్టేషన్కు సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన పోస్టాఫీస్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్లో ఉన్న పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు నిల్వ చేసే బాక్సులను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోస్టల్ అధికారి సింహాచలం తెలిపారు. మంగళవారం ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకోగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పాడేరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్టీం సిబ్బంది పోస్టాఫీసుకు చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన నగదు బాక్సులతో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను క్లూస్టీం పరిశీలించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రామారావు తెలిపారు. పోలీసుస్టేషన్కు అత్యంత సమీపంలోనే పోస్టాఫీస్లో చోరీ జరగడంతో పాడేరు వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి..లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు బాక్సులు ధ్వంసం..రూ.1.70 లక్షల చోరీ ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు రాగా వెలుగులోకి ఘటన రంగంలోకి క్లూస్టీం..సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన పోలీసుస్టేషన్కు సమీపంలోనే చోరీతో అవాకై ్కన పాడేరు వాసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ రామారావు -
‘నీత్ ఆయోగ్’ క్షేత్ర పరిశీలన
సాక్షి, పాడేరు: నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్.సుబ్రమణ్యమ్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతగిరి కాఫీ హబ్, పీహెచ్సీని సందర్శించి వైద్య సేవలు, కాఫీ అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ మండలం చొంపిలో హోంస్టేలను పరిశీలించారు. అక్కడ గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేసి, గిరిజనుల ఆచార, సంప్రదాయాలను తెలుసుకున్నారు. హుకుంపేట మండలం జామిగూడలో పీఎం జన్మన్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లను, పాడేరు మండలం గుత్తులపుట్టులో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. పాడేరు ఐటీడీఏలో ఏఐ, విలువిద్య శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విల్లు ఎక్కుపెట్టి ఉత్సాహంగా గడిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ సమిధాసింగ్ ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. సుబ్రమణ్యమ్ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికను కలెక్టర్ నిశాంతి ఆయనకు అందజేశారు. సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివరాలు తెలుసుకున్న సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యమ్ -
మారికవలస గురుకులంలో తరగతులు కొనసాగించాలి
పాడేరు: విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతులను యథావిధిగా కొనసాగించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులను వెనక్కి పంపే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు చేపడుతున్న రిలే దీక్షలను మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నామనే కారణంతో పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతుల విద్యార్థులను అర్ధంతరంగా వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. గిరిజన విద్యార్థులను ప్రాథమిక విద్యకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మారికవలసలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను వెళ్లిపోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా హక్కును జిల్లా ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు. విద్యార్థులను వేరే ప్రాంతానికి తరలించాలని జారీ చేసిన జీఓ నంబర్ 69ను తక్షణమే ఉపసంహరించుకుని, వారిని అదే పాఠశాలలో యథావిధిగా కొనసాగిస్తూ మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూల్ నివాస్ సంఘం రాష్ట్ర నాయకులు కేవై కుమార్, విద్యా కమిటీ చైర్మన్ రాజేష్, నాయకులు రాజేష్, భారతీ, త్రినాథ్, వి.రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
ఆశ్రమ పాఠశాలలోవిద్యార్థిపై కత్తితో దాడి
● దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి, పాడేరు: గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి పాంగి దుర్గపై పదో తరగతి విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. దుర్గా మెడపై తీవ్ర గాయమైంది. గాయపడిన దుర్గాను ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ఎదురుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. మెడపై గాయం తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం దుర్గాను నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై కత్తితో దాడి ఘటనపై స్పందించిన ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి జర్రెల ఆశ్రమ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఉపాధ్యాయులు గూడెంకొత్తవీధి పోలీసులకు సమాచారం అందించారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు. -
గజ రాజసం
పొద్దున లేస్తే పావు టన్ను ఆహారం.. 150 లీటర్ల మంచి నీళ్లు! ఒక్కో గజరాజు ఏటా తిని, తాగేందుకే ఏకంగా రూ.4.30 లక్షల ఖర్చవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా సరే.. ఆ లెక్కలను పక్కనపెట్టి ప్రేమానురాగాలతో వాటి పొట్ట నింపుతున్నారు విశాఖ జూ అధికారులు, దాతలు. ఒకప్పుడు అడవుల్లో రాజసంగా తిరిగిన ఏనుగుల అడుగుల చప్పుడు.. కాలంతో పాటు క్రమంగా తగ్గుతోంది. ఆక్రమణల నడుమ గజరాజుల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నాలుగు ఏనుగులకు సురక్షిత అభయారణ్యంగా మారింది. నేడు ‘ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం’ వేళ విశాఖ ‘గజ’నేస్తాల ముచ్చట ఇదీ.. ఆరిలోవ: అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంరక్షణ కూడా సవాలుగా మారింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న గజరాజులు.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటి సంఖ్య 250 లోపే ఉండటం గమనార్హం. ఇవి ఎక్కువగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూ రు జిల్లాల అడవులలో సంచరిస్తున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం ఇవి గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడి భయపెడుతున్నాయి. కానీ విశాఖవాసులకు మాత్రం ఈ గజరాజులు నేస్తాలుగా మారిపోయాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయి. విశాఖ జూలో ప్రత్యేక సంరక్షణ విశాఖ జూ పార్కులో లక్ష్మి, సరస్వతి అనే రెండు ఆడ ఏనుగులు, కృష్ణ, రాజు అనే రెండు మగ ఏనుగులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు మావటీలు, ఇద్దరు యానిమల్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. మావటీలు మాట్లాడే భాషను ఏనుగులు గుర్తుపట్టి, వారు చెప్పినట్లు వింటాయి. వీటి కోసం జూలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ‘మోట్’ ఉంది. అందులో రాత్రి వేళల్లో నిద్రించడానికి ‘నైట్ క్రాళ్లు’ నిర్మించారు. ఆరేళ్ల క్రితం వీటి స్నానం కోసం ప్రత్యేకంగా ఒక కొలనును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా అనారోగ్యం వస్తే జూ వెటర్నరీ వైద్యులు మావటీల సమక్షంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ‘కృష్ణ’ ● జూలో ఉన్న ఏనుగులలో 48 ఏళ్ల వయసు గల ‘కృష్ణ’ సుమారు 39 ఏళ్లుగా ఇక్కడే పెరుగుతోంది. అయితే ఇది ఒక్కోసారి మతిస్థిమితం కోల్పోయి మావటీల మాట కూడా వినదు. అందుబాటులో ఉన్న రాళ్లను తొండంతో తీసి విసురుతుంటుంది. అందుకే దీనిని సందర్శకులకు దూరంగా నైట్ క్రాల్కే పరిమితం చేసి సంరక్షిస్తున్నారు. ● 26 ఏళ్ల ‘రాజు’ అనే మగ ఏనుగును 2015 మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ అడవుల నుంచి పట్టుకుని జూకి తరలించారు. ● 61 ఏళ్ల సరస్వతి, దాని పిల్ల 25 ఏళ్ల లక్ష్మిలను చిత్తూరులోని కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి తీసుకొచ్చారు. ఇవి సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. రోజుకి 265 కిలోల ‘ఆహార’ విందు! జూలో ఒక్కో ఏనుగుకు రోజుకి సుమారు 265 కిలోల వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అలాగే రోజుకు కనీసం 150 లీటర్ల నీరు తాగుతాయి. ఒక్కో ఏనుగు రోజువారీ మెనూ.. అరటి దవ్వ 125 కిలోలు పచ్చి గడ్డి 75 కిలోలు చెరకు 40 కిలోలు పుచ్చకాయ 10 కిలోలు రాగి తోప 6 కిలోలు క్యాటిల్ ఫీడ్ 4 కిలోలు అరటి పండ్లు 6 కిలోలు ఆకుకూరలు 4 కిలోలు కొబ్బరికాయలు 2 బెల్లం పావు కిలో (తవుడు, ఇతర పదార్థాలతో కలిపి) ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ ఆహారాన్ని అందిస్తారు. జూలో అన్ని జంతువుల కంటే ఏనుగుల పోషణకే అత్యధికంగా ఖర్చవుతుంది. ఒక్కో ఏనుగు ఆహారం, పోషణ నిమిత్తం ఏడాదికి రూ.4.30 లక్షలు ఖర్చవుతోంది. ఇది పెద్ద మొత్తం కావడంతో దాతలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏనుగులను బాధ్యతగా సంరక్షిస్తున్నాం విశాఖ జూ పార్కులో ప్రతి ఏటా ఆగస్టు 12న ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాం. ఇక్కడున్న నాలుగు ఏనుగులకు పూర్తిస్థాయి రక్షణ, వైద్య సేవలు అందిస్తున్నాం. వాటి ఆహారానికి ఎక్కువ ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం. మరికొందరు కూడా ఈ సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. – డాక్టర్ జి.మంగమ్మ, జూ క్యూరేటర్, విశాఖపట్నం -
కొత్త సాఫ్ట్వేర్తో అదనపు భారం
విద్యుత్ వినియోగదారుల ఆందోళననర్సీపట్నం: విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వినియోగదారులకు గుదిబండగా మారింది. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు సరైన సాంకేతిక అవగాహన, పర్యవేక్షణ లేకుండా రీడింగ్ నమోదు చేసే మిషన్లలో జియో ఫెన్సింగ్(జీపీఆర్ఎస్) సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రీడింగ్ సిబ్బంది స్వయంగా విద్యుత్ మీటర్ వద్దకు వెళ్తేనే తప్ప రీడింగ్ రాదు. మీటర్ల రీడింగ్ నమోదులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా జియోఫెన్సింగ్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా 12వ తేదీలోపు మీటర్ రీడింగులు నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవటం వల్ల 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీటర్ వద్దకు వెళ్లినప్పటికీ రీడింగ్ నమోదు కాకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి అదనపు ఆర్థిక భారం పడుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎలక్ట్రికల్ ఏఈఈ త్రినాథరావును వివరణ కోరగా, కొత్త సాఫ్ట్వేర్ వల్ల మొదటిలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో రీడింగ్ నమోదు కానందున వినియోగదారులపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. -
వెలుగులు పంచే కార్మికులకే భద్రత కరువు!
విద్యుత్ వెలుగులు పంచుతున్న ఆ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకుంటున్నాయి. కష్టపడి పనిచేస్తే కుటుంబం గడుస్తుందన్న ఆశతో ఏళ్ల తరబడి ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ పరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ వెలుగులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారులు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటూ దశాబ్దాలుగా విద్యుత్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది, సహాయకులుగా విధుల్లో చేరిన వారితో ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడంతో, తగిన భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మోతుగూడెంలో కార్మికుడి మృతి.. తరచూ ప్రమాదాలు.. ప్రశ్నార్థకంగా భద్రత సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మోతుగూడెంలో మంగళవారం ముత్తయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. 33 కేవీ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. మోతుగూడెంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మృతుడికి రూ. 27లక్షల నష్టపరిహారం. అలాగే కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు హామీ ఇచ్చారు. ఆరు నెలల క్రితం గణేష్ మృతి సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్యార్డులో 220 కేవీ ఫీడర్, రెండో యూనిట్కు సంబంధించి సాంకేతిక మరమ్మతులు జరుగుతున్న సమయంలో గణేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలు సుమారు ఎనిమిది నెలల క్రితం మోతుగూడెంలో ఓ పనిలో భాగంగా నిచ్చెన పట్టుకుని వెళ్తున్న సమయంలో రవి అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు. తుప్పలు తొలగించే క్రమంలో నిచ్చెన తగిలి సంఘటనలో కాంట్రాక్టర్ కార్మికుడు రవి తోపాటు... పలక నానాజీ.. ఎస్ రామచంద్ర మరో ఇద్దరూ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు జెన్ కో సంస్థ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో సంబంధిత అధికారులే డబ్బులు ఇచ్చి వైద్యం అందించారు 15 ఏళ్ల క్రితం మరో ప్రమాదం సుమారు 15 ఏళ్ల క్రితం ఇదే సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. నడుముకు గాయమై సుమారు ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్లు కార్మికులు తెలిపారు. కుటుంబానికి జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా.. సీలేరు డిస్ట్రిబ్యూషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సాయి అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఓ ఇంట్లో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా రేకులపై నుంచి కిందపడిపోయి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడని కార్మికులు తెలిపారు. మాచ్ఖండ్లో.. 2019లో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోనూ ఇదే తరహాలో కుర్ర బాణమల్లి అనే గిరిజన కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకున్నట్లు కార్మికులు గుర్తుచేశారు. ● తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా విద్యుత్ పనులు చేయించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదకర పనులను అర్హత, శిక్షణ ఉన్న సిబ్బందితోనే చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణానికి రూ.10 లక్షల పరిహారమేనా? సీలేరు కాంప్లెక్స్లో ప్రమాదాల్లో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం అందించడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ● తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయిస్తూ కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అనేక కుటుంబాలు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ కార్మికుల భద్రతపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యుత్ వెలుగుల వెనుకచీకటి బతుకులు తగ్గిపోతున్న పర్మినెంట్ ఉద్యోగులు గతంలో జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండేది. అయితే కాలక్రమేణా ఉద్యోగుల పదవీ విరమణ, విధుల్లో ఉండగానే మరణించడం, గత 15 ఏళ్లుగా కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పర్మినెంట్ ఉద్యోగులు నిర్వహించాల్సిన కొన్ని పనులను కూడా కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగిన శిక్షణ, భద్రతా ప్రమాణాలు లేకుండా ప్రమాదకర పనులు అప్పగించడమే తరచూ ప్రమాదాలకు కారణమవుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంఘటనపై విచారణ చేపడతాం మోతుగూడెం లో కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం బాధాకరం. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన ఘటనపై రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తాం అని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కాంటాక్ట్ కార్మికులకు భరోసా ఇచ్చినట్లు చీఫ్ ఇంజనీర్ ఏవీ రాజారావు తెలిపారు అన్స్కిల్డ్ కార్మికులతో ప్రమాదకర పనులు? ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో పలువురు దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. తొలుత అన్స్కిల్డ్ కేటగిరీలో విధుల్లో చేరిన వారితో ప్రస్తుతం పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో స్కిల్డ్ కేటగిరీకి సంబంధించిన ప్రమాదకర పనులు కూడా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు మోతుగూడెం : 210 డొంకరాయి : 60 సీలేరు : 41 వేతనం : రూ.21 వేలు ప్రమాదకర పనులు.. తరచూ ప్రమాదాలు! ప్రాణాలు పోతున్నా.. పరిహారంతోనే సరి? చాలీచాలని జీతాలు..ప్రాణాలకు మాత్రం విలువ ఎంత? దశాబ్దాలుగా పనిచేస్తున్నా..భద్రతపై నిర్లక్ష్యమేనా? 400 మంది కాంట్రాక్ట్ కార్మికుల భద్రత ప్రశ్నార్థకం! ప్రమాదం జరిగినప్పుడే పరిహారం.. నివారణ చర్యలు ఎక్కడ? కుటుంబాలను రోడ్డున పడేస్తున్నవరుస ప్రమాదాలు! -
మాచ్ఖండ్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు సీలేరు: ఆంధ్ర–ఒడిశా ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నాటికి అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రాజారావు తెలిపారు. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి గురైన మాచ్ఖండ్ కేంద్రంలో యూనిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 8న రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. మూడో యూనిట్ మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో, ఐదో యూనిట్ను రెండో వారంలో, నాలుగో యూనిట్ను సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆరో యూనిట్ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దశల్లో అనుమతులు వచ్చాయని, మిగిలిన అనుమతులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని సీఈ తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే వరకు మెగా ఇంజినీరింగ్ కంపెనీలో, అనంతరం జలవిద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికులుగా ఉపాధి కల్పిస్తామన్నారు. నిర్వాసితుల ఉపాధి బాధ్యతను ప్రభుత్వం, ఏపీ జెన్కో తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిసరాలను గ్రీన్బెల్ట్గా అభివృద్ధి చేసేందుకు 10 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించే చెట్ల కొమ్మలతో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఈ వెంట ఎస్సీ జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు. -
దీక్షకు దక్కిన ఫలితం
● గింజర్తిలో 3, 4, 5 తరగతులనిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు ● కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు కొయ్యూరు: రెండేళ్లుగా తమను వెంటాడుతున్న సమస్య పరిష్కారం కోసం గింజర్తి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన పోరాటం ఫలించింది. పాఠశాలలో 3, 4, 5 తరగతుల నిర్వహణను తిరిగి కొనసాగించేందుకు కలెక్టర్ నిశాంతి ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో సమావేశమైన వారు కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు కృతజ్ఞతలు తెలిపారు. తరగతుల నిర్వహణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటీవల గ్రామస్తులు, విద్యార్థులు స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఐదు రోజులపాటు రిలే దీక్షలు చేపట్టారు. సమస్యను పరిష్కరిస్తామని తొలుత ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ హామీ ఇచ్చినా వారు దీక్షలు కొనసాగించారు. అనంతరం కలెక్టర్ నిశాంతి హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించారు.తాజాగా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలో 3, 4, 5 తరగతుల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండేళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను కలెక్టర్ పరిష్కరించారని విద్యా కమిటీ చైర్మన్ అప్పారావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్పందించిన కలెక్టర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఆమె చేసిన మేలును మరువలేమని అన్నారు. -
‘మలేరియా’కు మందుల కొరత
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారడం, దోమలు విజృంభించడంతో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా బాధితులకు ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ, ఉమాదేవి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని, ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో మలేరియా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మలేరియా బాధితులకు అవసరమైన మందులు కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా గ్రామాల్లో చెత్తాచెదారం తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరారు. నాణ్యమైన ఆహారం అందించాలి కేజీబీవీ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని జెడ్పీటీసీ సభ్యులు ఉమాదేవి, గిరిబాబు, సత్యం కోరారు. పెదబయలు, ఇతర ప్రాంతాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పాఠశాలల అప్గ్రేడేషన్, క్రీడా మైదానాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆక్రమించుకున్న బీసీ హాస్టల్ భవనాలను తక్షణమే ఖాళీ చేయించి విద్యార్థుల వసతికి కేటాయించాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులపై చర్చ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న తాగునీటి సరఫరా పథకాలు, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై సభ్యులు ప్రస్తావించిన అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సీఈవో నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్సుభద్ర ఆవేదన జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలుతీసుకోవాలని సూచన ఆమె అధ్యక్షతన పలు సాయీ సంఘాల సమావేశాలు -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్స్టాప్ సెంటర్కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
మాకవరపాలెం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై మంగళవారం స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై వివరించారు. రక్షణ అధికారి మనోహర్ మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగితే 1098, 181 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, రూప పాల్గొన్నారు. -
బంగారు ఆభరణాల చోరీ
పాయకరావుపేట: పట్టణంలో గల రాజుగారిబీడులో ఆదివారం రాత్రి 88 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. రాజుగారిబీడుకు చెందిన రామోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి తిరిగి 10 వ తేదీన సోమవారం ఇంటికి వచ్చారు. ఇంటి మెయిన్గేటు, ఇంటి లోపల తలుపులు తెరిచి ఉండి, బెడ్రూమ్లో వున్న బీరువా తాళాలు పగులగొట్టి 88 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇంటి వరండాలో ఉన్న యాక్టివా మోటారు బైక్ను కూడా దుండగులు ఎత్తుకుపోయారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టులమ్ముకున్నారు
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా అంటూ ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ అమ్ముకున్నారని ఆరోపించారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొన్ని రోజులుగా తమ పార్టీ పోరాటం సాగిస్తోందని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలు జరగడం వల్ల ఎంతో మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన వారిని కాదని అనర్హులకు, పచ్చ కండువా ముసుగులో ఉన్న వారికి ఎలా ఉద్యోగాలిస్తారని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ సీబీఐతో విచారణ జరపాలని, అప్పుడే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగుల భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ర్యాలీని అడ్డుకోవడంతో పాటు, మధ్యాహ్నానికి వాయిదా వేయించాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అరకులోయ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, బాణాల శ్రీనివాస్, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ నాగభూషణ్, నియోజకవర్గం గ్రీవెన్స్సెల్ అధ్య క్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వెంకట పూర్ణిమ, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్ కుమార్, జయవర్ధిని, స్వాభి రామచందర్, శత్రుఘ్న, నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల అధ్యక్షులు స్వాభి రామ్మూర్తి, పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, పాంగి అనిల్ కుమార్ మజ్జి చంద్రుబాబు, పాంగి పద్మారావు, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, జి.ప్రకాష్రావు, జిల్లా కార్యదర్శి బాక సింహాచలం, జనరల్ సెక్రటరీ పాంగి నర్శింగరావు, బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, బూర్జ సుందర్రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎం.టి.ఆర్. సాంబయ్య, బి.బి.కామేశ్వరరావు, నరసింహమూర్తి, పాంగి నాగేశ్వరరావు, పట్టాసి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన మన్యం
ఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు కదం తొక్కారు. వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పాడేరు, అరకులోయలో సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. అరకులోయలో ర్యాలీని అడ్డుకోడానికి పోలీసులు యత్నించినప్పటికీ నిర్బంధాలను, ఆంక్షలను తెంచుకుంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. వందలాది మంది పోలీసులను మోహరించినా లెక్కచేయకుండా ముందుకు సాగారు. పాడేరు, అరకులోయలో భారీ ర్యాలీలు టీచర్ పోస్టులు అమ్ముకోవడం దారుణం మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి డీసాక్షి, పాడేరు: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపడంతో పాటు, స్పోర్ట్స్, ఇతర కోటాల పేరుతో అక్రమంగా టీచర్ పోస్టులు అమ్ముకోవడంలో భాగస్వామి అయిన మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన పాడేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన ర్యాలీని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు మాజీ ఎంపీ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్ అక్రమాలను సాక్ష్యాలతో సహా వైఎస్సార్సీపీ వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు. అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఆందోళనలు చేపట్టారని, లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై మాత్రం మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. లోకేష్కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, గిరిజన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు తప్పుడు హామీలిచ్చి నిరంకుశంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిరంతరం వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీవో నంబర్ 3న అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరకు మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నిరూపించిందని చెప్పారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ కళ్లు తెరిచి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి,విద్యా దీవెన పథకాలను కూడా నిలిపివేసి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. పాడేరులో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎంపీ మాధవి, పరిశీలకుడు సత్యారావు,వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కశింకోట: అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేసి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ టి చైతన్య కల్యాణ జయ భరత్రాజ్ ఆదేశించారు. మండలలోని స్వర్ణ గ్రామ పంచాయతీగా ఎంపికై న జి.భీమవరం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పాలనా పరమైన చర్యలు చేపట్టి కొనసాగించాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర సేవలను మెరుగుపర్చడం, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలు, ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకత ఉండాలన్నారు. స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. గ్రామాన్ని జాతీయ పురస్కారం పొందడం కోసం పలు సూచనలు చేశారు. ఎంపీడీవో చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి
దేవరాపల్లి : జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవరాపల్లిలో సోమవారం ‘జైల్ భరో’ కార్యక్రమం జరిగింది. రైవాడ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర, ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, గాడి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. -
సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యం
మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నిశాంతి అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): గిరిజనుల ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని జిల్లా ఇన్చార్జి, గిరిజన సంక్షేమ, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీలు ఏ రంగంలోనూ ఎవరికీ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లే సామర్థ్యం వారికి ఉందన్నారు. ఆదివాసీల హక్కులు, గౌరవం, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పీజీఆర్ఎస్కు వచ్చే ప్రజలకు ప్రతి శుక్రవారం ఉచిత పోషకాహార భోజనం అందించే ఫుడ్ ఇన్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఖేత్బచావ్ అభియాన్–రుణ మేళాల ద్వారా 11 మండలాల్లో 130 మేళాలు నిర్వహిస్తున్నామని, గ్రామస్థాయిలోనే రుణ ప్రక్రియను సులభతరం చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాల కోసం ఏఎస్ఆర్ లక్ష్యం–జిల్లా ఉపాధి సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా జిల్లాలో మహిళలకు రూ.24.23 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. 11 పైలెట్ పీహెచ్సీల్లో 1,427 మంది గర్భిణులను డిజిటల్గా ట్రాక్ చేస్తున్నామని ఏప్రిల్,జూలై నెలల మధ్య పైలట్ పీహెచ్సీల్లో మాతృ మరణాలు నమోదు కాలేదని తెలిపారు. పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కింద 5,103 మంది గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. జలధార–జలహారతి ద్వారా 11 గిరిజన మండలాల్లో రూ.529.64 కోట్లతో 9,386 పనులు చేపట్టామని సుమారు 84.35 కిలోమీటర్ల ఫీడర్ చానళ్లను పునరుద్ధరించామని చెప్పారు. తల్లికి వందనం ద్వారా 1,33,984 మంది విద్యార్థులకు రూ.174.17 కోట్ల ప్రయోజనం అందించామని తెలిపారు. 13,461 మంది రైతులకు రూ 135.21 కోట్ల రుణాలు అందించామని, 45 కొత్త ఎఫ్పీవోలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్చార్జి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేసేందుకే ఆమె అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆదివాసీ వేషధారణలో జిల్లా అధికారులు కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో పాటు జిల్లా అధికారులు సంప్రదాయ ఆదివాసీ దుస్తుల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
వైజాగ్ మారథాన్కు ఏఐఎంఎస్ గుర్తింపు
మహారాణిపేట: వైజాగ్ మారథాన్కు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్ (ఏఐఎంఎస్) ధ్రువీకరణ లభించింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 29న నిర్వహించనున్న ‘సంధ్యా మైరెన్స్ వైజాగ్ మారథాన్’ ఐదో ఎడిషన్ వివరాలను నిర్వాహకులు సోమవారం బీచ్రోడ్డులోని ఓ హోటల్లో వెల్లడించారు. నాలుగు కేటగిరీల్లో మారథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రన్నర్లు వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొత్తం రూ.12 లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంధ్యా మైరెన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కొరగ్రుంట, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అరిలోవ అపోలో హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా, శ్రీకన్య ఐరన్–స్టీల్స్ చైర్మన్ శ్రీనివాస్ దుద్దుపూడి, జ్యువెలరీ హౌస్ చైర్మన్ శ్యామ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధులు, వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ కంచెటి, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 55 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు సోమవారం 55 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీదారుల ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత హామీలు, ఆర్థిక నేరాలు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాటిపై ఆర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ సిబ్బంది రిలేదీక్షలు
కశింకోట : కశింకోటలోని ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టి నిర్వహించారు. ముందుగా కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది నిరాహార దీక్షలు చేపట్టారు. కుదించిన జీతాలను పునరుద్ధరించాలని, వేతన సవరణ ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాజీనామా చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలు కొనసాగిస్తుండగా మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్ ప్రతినిధులతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు పిలిచి ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీఈపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ వనజ, సీఈవో రామకృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ సాల్మాన్రాజు, విజిలెన్స్ ఎస్పీ కింజరపు శ్రీనివాసరావు, ఎపీఈపీడీసీఎల్ అనకాపల్లి సూపరింటిండెంటింగ్ ఇంజనీర్, ఆర్ఈసీఎస్ ఎండీ కూడా అయిన జి.ప్రసాద్ తదితరులు పాల్గొని చర్చించిన అనంతరం ఈ నెల 20లోగా సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. అలాగే రెండు మూడు రోజుల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీని కలిసే ఏర్పాట్లు కూడా చేస్తామని, దీక్షలు విరమించాలని కోరారు. దీంతో దీక్షలను తాత్కాలికంగా వరమిస్తున్నట్టు కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు హేమంత్, కార్యదర్శి నగేష్, అధ్యాపక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్లో ప్రవేశాలకు 14న తుది కౌన్సెలింగ్
చింతపల్లి: స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 14న తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 14న గుంటూరు లాం ఫారంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్కు టెన్త్ ఉత్తీర్ణులైన, ఇంటర్ ఉత్తీర్ణులైన, ఫెయిల్ విద్యార్థులు అయిన హాజరుకావచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఆర్ తెలిపారు. -
ఎంపీ రమేష్ గనుల దోపిడీపై ఢిల్లీలో తేల్చుకుంటాం
● మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్జిల్లాలో మైనింగ్ చోడవరం : జిల్లాలో మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచేస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంగతి ఢిల్లీలో తేలుస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్ అన్నారు. చోడవరంలో వైఎస్సార్సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో అమర్నాఽథ్ మాట్లాడుతూ దోచుకోవడానికి సీఎం రమేష్ అనకాపల్లి వచ్చారని ఆరోపించారు. పచ్చని పొలాలను ఆనుకొని ఉన్న పచ్చని కొండలను పిండి చేసి మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచుకొని అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ధ్వజమెత్తారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండతో పాటు జిల్లాలో గ్రానైట్, నల్లరాయి, మెటల్, మట్టి వంటి గనులను అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. ఆయన దోపిడీ నుంచి ఈ ప్రాంతాలన్నీ పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
పెందుర్తి: పదుల సంఖ్యలో దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం విభాగం డీసీపీ లతామాధురి వివరాలు వెల్లడించారు. సుజాతనగర్ సీ–2 జోన్లో నివాసం ఉంటున్న ఇలపండ షణ్ముఖ శ్రీధర్ ఒక ప్రైవేటు కళాశాలలో మెడిసిన్ పీజీ చదువుతున్నాడు. గత నెల 22న శ్రీధర్ తన కుటుంబంతో కలిసి గుంటూరు వెళ్లి, తిరిగి 31న ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 6 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి వస్తువులను దుండగులు ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి క్రైం విభాగం ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన కట్టా శివశంకర్ అలియాస్ లడ్డు (87 దొంగతనం కేసులు), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మండెలా నాగభాస్కర్ అలియాస్ బాబీ (82 దొంగతనం కేసులు), కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన మడగల విజయ్కుమార్ (86 దొంగతనం కేసులు) అని తేల్చారు. నిందితుల కోసం గాలిస్తుండగా సోమవారం మధ్యాహ్నం సరిపల్లి వద్ద వారు పట్టుబడినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో ఏడీసీపీ రమ్య, ఏసీపీ వెంకటరావు, సీఐ తిరుమలరావు, ఎస్ఐలు డి.సూరిబాబు, తేజేశ్వరరావు, సూర్యప్రకాషరావుతో పాటు సిబ్బంది శ్రీనివాసరావు, మురళి, పేరయ్యనాయుడు, గణేశ్వరరావు, శివప్రసాద్, జానకిరామ్, శివకృష్ణ, శ్యాంసుందరరెడ్డి, శ్రీనివాసరావు, మహేష్, రామకృష్ణ, దేముడునాయుడు, తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సంక్షేమమే యూటీఎఫ్ లక్ష్యం
ముంచంగిపుట్టు: ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా యూటీఎఫ్ పనిచేస్తోందని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి మొశ్యా ధర్మారావు అన్నారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ జెండాను మండల గౌరవ అధ్యక్షుడు చిన్నయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ 53ఏళ్ల యూటీఎఫ్ ఉద్యమ ప్రస్థానంలో అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయులకు అండగా నిలిచినట్టు చెప్పారు. అమరజీవి చెన్నుపాటి ఆశయాల సాధన బాటలో పయనిస్తూ రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఏర్పడిందని తెలిపారు. సీపీఎస్ రద్దుకు యూటీఎఫ్ నిరంతరం పోరాడుతూనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రాజు, గోపి, సహాధ్యక్షురాలు ముక్తమ్మ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు సూర్యనారాయణ, గోవింద్,మోహన్, సిద్ధేశ్వరరావు, ధనుపతి,రఘుమణి, మత్స్యలింగం,లీలావతి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు అరెస్టు
ఎస్.రాయవరం : మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ మోటర్లు, వాటి వైర్లు చోరీ గురి కావడంతో రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. ఈ సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు మాకవరపాలెం : జిల్లాస్థాయి ఆటల పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మూడు రోజులుగా అనకాపల్లిలో జిల్లాస్థాయిలో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.సింధుజ, కె.ఇందు, వి.పూజిత, అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఎస్.తులసీరాజ్, అండర్–17 చెస్ పోటీల్లో వి.చరణ్ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం వి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. వీరిని పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. -
పీజీఆర్ఎస్పై తగ్గుతున్న నమ్మకం
తుమ్మపాల : సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఆశతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు వ్యయప్రయాసల కోర్చి వచ్చారు. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ, అర్జీ పరిష్కారం మాత్రం కింది స్థాయి అధికారుల పరిధిలోకి వెళ్లడంతో అక్కడే సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అర్జీదారులు చెబుతున్నారు. పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. దీంతో పీజీఆర్ఎస్పై ప్రజల్లో క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కలెక్టరేట్కు వచ్చే అర్జీదారుల కోసం ఇటీవల కొన్ని వారాలుగా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్జీదారులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, ఎండ నుంచి రక్షణ కల్పించే టెంట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 306 అర్జీలు ననమోదు కాగా వాటిలో 170 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. పీజీఆర్ఎస్, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, పలు శాఖల అధికారులు గోపాల్ రాజా, ఆశా దేవి పాల్గొన్నారు. నూరుశాతం వైకల్యం..పింఛను అందించరూ.. వైద్య అధికారుల నమోదు చేసిన వివరాల్లో జరిగిన తప్పిదం కారణంగా 100 శాతం దివ్యాంగుడైన తన కుమారుడికి ప్రభుత్వం అందించాల్సిన పూర్తి పింఛన్ అందడం లేదని అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కొత్తతలారివానిపాలెం గ్రామానికి చెందిన గంతకోరు సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో దివ్యాంగుడైన తన కుమారుడి జశ్వంత్ సదరం సర్టిఫికెట్లో దివ్యాంగత్వాన్ని తప్పుగా నమోదు చేయడంతో నెలకు రూ.6 వేల పింఛన్ మాత్రమే వస్తోందని, దీనిని సరిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.15 వేల పింఛన్ అందించాలని కోరింది. ఏఎంఆర్ అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఏఎంఆర్ సంస్ధ చెక్పోస్టులను తొలగించి ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఓనర్స్,డ్రైవర్స్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సీనరేజ్ పేరుతో ప్రతి గ్రామంలో చెక్పోస్టులు పెట్టి మైనింగ్ లారీల నుంచి సరుకు టన్నుల లెక్కన లెక్కింపు చేసి వసూళ్లు చేసిన సోమ్మును ప్రభుత్వానికి చెల్లింపులు చేయకుండా అక్రమ బిల్లులతో ఏఎంఆర్ సంస్ధ దోచుకుంటుందని ఆరోపించారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. భూ నిర్వాసితుల హామీలు నెరవేర్చండి.. పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి, ఆర్అండ్ఆర్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈమేరకు స్పష్టమైన రాత పూర్వక హమీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలని పీజీఆర్ఎస్లో వినతి అందించారు. పాస్టర్ల నిరసన క్రైస్తవులను కూడా షెడ్యూల్డ్ కులాలుగా గుర్తిస్తూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేసి వేధింపులు, దాడులు, అఘాయిత్యాల నుంచి క్రైస్తవ మైనారిటీ సమాజాన్ని రక్షించాలంటూ పాస్టర్లు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. షెడ్యూల్డ్ కులాల మూలానికి చెందిన క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల హోదా నుంచి మినహాయించడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, వైస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జోసెఫ్, క్రిస్టియన్ సంఘ పెద్దలు ఫాదర్స్ జోసఫ్ ప్రభాకర్, రవీంద్ర, రత్నాకర్, ప్రసాధ్, బాలరాజు పాల్గొన్నారు. -
మాచ్ఖండ్లో వినియోగంలోకి వచ్చిన మరో జనరేటర్
రెండు జనరేటర్లతో 34 మెగావాట్ల ఉత్పత్తిముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మరో జనరేటర్ వినియోగంలోకి వచ్చింది. ఈ ఏడాది మే నెలలో ప్రాజెక్టులో అగ్నిప్రమాదం సంభవించి, భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది విద్యుత్ ఉత్పత్తిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత నెల 29న ఒకటో నంబర్ జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభించారు. ఇప్పుడు రెండో నంబర్ జనరేటర్ను సైతం వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో రెండు జనరేటర్ల సాయంతో ప్రతి గంటకు 34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు నెలల్లో మిగిలిన నాలుగు జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చి శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటామని, నాలుగు జనరేటర్లకు చెందిన ప్రొటెక్షన్ ప్యానెల్ బోర్డులు రావాల్సి ఉందని ప్రాజెక్టు ఎస్ఈ సీహెచ్.అప్పాజీ తెలిపారు. -
డెఫ్ టీ20 క్రికెట్ చాంపియన్షిప్ విజేత అనకాపల్లి
విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందిస్తున్న జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: దివ్యాంగులమని వెనుకంజ వేయకుండా అద్భుత ప్రతిభ కనబరిచిన జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు ఫైనల్ పోటీలో విజయం సాధించి చాంపియనషిప్ ట్రోఫీని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని జేసీ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో క్రీడాకారులకు ఆయన మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2 తేదీల్లో విశాఖలోని నిర్వహించిన 4వ జోనల్–1 డెఫ్ టీ–20 క్రికెట్ చాంపియషిప్–2026 పోటీల్లో అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్లు పాల్గొన్నాయి. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన డెఫ్ క్రికెట్ జట్టు సభ్యులను అధికారులు అభినందించారు. -
టైరు పేలి డివైడర్ను ఢీకొన్న కారు
ముగ్గురికి గాయాలు ఎస్.రాయవరం: మండలంలోని గోకులపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డురోడ్డు వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుతున్న కారు టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడం, ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. ప్రథమ చికిత్స అనంతరం మరో వాహనంలో వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
వరి నాట్లకు సాగునీటి కష్టాలు
మోటార్తో నీటిని పంట భూములకుమళ్లిస్తున్న దృశ్యంవరినాట్లు వేస్తున్న గిరిజన మహిళలుసాక్షి, పాడేరు: ఏజెన్సీలో వర్షపాతం తక్కువగా ఉండటంతో మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. వర్షాలు కురుస్తున్నా.. సరిపడా నీరు అందక వరినాట్లు ఆలస్యమవుతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరుకు సమీపంలోని సేరిబయలు, నక్కలపుట్టు, కిండంగి గ్రామాల్లోని ఖరీఫ్ వ్యవసాయ భూముల్లో వరినాట్లకు నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఎకరాలో నారు ముదిరిపోతుండటంతో సేరిబయలు రైతులు మోటార్ సాయంతో చెరువు నుంచి నీటిని పొలాలకు మళ్లించారు. ఆ నీటితో దమ్ము చేపట్టి నాట్లు పూర్తి చేశారు. వర్షాలు జల్లులుగా కురుస్తున్నా సాగునీటికి ఇబ్బదులు పడుతున్నారు.ఇబ్బందులు పడుతున్న రైతులు -
ఆదివాసీ హక్కుల కోసంఐక్య పోరాటం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పిలుపు ● ముంచంగిపుట్టులో ఘనంగాఆదివాసీ దినోత్సవం ● గిరిజన పోరాట యోధులవిగ్రహాల ఆవిష్కరణ ● నృత్యాలు చేస్తూ సందడి ముంచంగిపుట్టు: రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆదివాసీలు ఐక్యంగా పోరాటాలు చేయాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబులు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కొంతమంది మహిళలు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్రతో పాటు మాజీ ఎంపీ గోడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి దింసా నృత్యాలు చేశారు. ‘జై ఆదివాసీ’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన పోరాట యోధులు కొమరం భీమ్, బిర్సా ముండా, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలేల విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని అన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, సంక్షేమమే అందరి లక్ష్యం కావాలని ఆయన అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల కోసం ఆదివాసీ బిడ్డలు పాటుపడాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఆదివాసీలకే దక్కుతాయని, ఇక్కడి ఖనిజ సంపద, అటవీ సంపద, ఆస్తులన్నింటిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నాయని అన్నారు. నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా జీవోను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం గుర్తించి, సమావేశాలతో కాలక్షేపం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన అన్నారు. అరకు మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 రద్దుతో గిరిజనులు భారీగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని అన్నారు. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆమె అన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. గిరిజన భూములను బడాబాబులకు అప్పగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం రోజునైనా జీవో నంబర్ 3పై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, కానీ లేనిపోని సాకులతో గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్ ఎంపీపీలు సత్యనారాయణ, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, వివిధ పార్టీల నేతలు రమేష్, బాబురావు, సూరయ్య, సన్యాసిరావు, త్రినాథ్, మూర్తి, గాసిరావు, అప్పాలు, రఘునాథ్, నానిబాబు, సుభాష్, అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజనులు పాల్గొన్నారు. -
ఘనంగా మోదమాంబ అమ్మవారి జాతర
మాడుగుల రూరల్: కె.జె.పురం మోదమాంబ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఘాటాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. సాయంత్రం నుంచి నేల వేషాలు, శక్తి వేషాలు, తీనుమార్, తప్పెటగుళ్లు, జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రికి గ్రామంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాతల సహకారంతో పులిహోర, మజ్జిగ, ప్రూటు సలాడు, స్వీటు భక్తులకు అందజేశారు. అరుణా కేటరింగ్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు, చిరు వ్యాపారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సాహంగా ఎడ్ల పరుగు పోటీలు జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పోటీలను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జాతరలో ఆకర్షణీయంగా ఆడారి కుటుంబీకులు అయిన ఆడారి కామునాయుడు కుటుంబ సభ్యులు ప్లాస్టిక్తో తయారు చేసిన ఏలిఏనుగు మీద ఎక్కి గ్రామంలో తిరిగారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ
● పద్మనాభం సంతాప సభలో బొత్స,కన్నబాబు, అమర్నాథ్ ● పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్, ఉత్తరాంధ్ర కాపు నేతలు సాక్షి, విశాఖపట్నం: దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన ఆశయం, ఆలోచన, స్ఫూర్తితో కాపులంతా ఒక్కటై అదే బాటలో పోరాటం సాగించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ ఎరేనాలో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాపునాడు నాయకుడు తోట రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీలకతీతంగా కాపు నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాపు జాతికి ముద్రగడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ముద్రగడ చిత్రపటానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తోట రాజీవ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్, కాపునాడు జేఏసీ నాయకులు సాయిసుధాకర్ నాయుడు, చందు జనార్దన్, ఆకుల రామకృష్ణ, ఏసుదాస్, ఆరేటి ప్రకాష్, తోట రామకృష్ణ, అడ్వకేట్ బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ముద్రగడ సంతాప సభ మాత్రమే కాదని, కాపు జాతికి ఒక సందేశ సభ అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు నాటి ప్రభుత్వం జీవో నంబరు30 ఇచ్చినప్పటికీ, అది ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదన్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరూ తమ సొంత జాతికి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని కోరారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలోని కాపు నాయకులు ముద్రగడ సంతాప సభకు వెళ్లకూడదని ఆదేశించడం ఆయన శైలికి, రాజకీయ పరిపక్వతకు తగదు’’ అని విమర్శించారు. సవాల్కు కట్టుబడిన నిబద్ధత:కురసాల కన్నబాబు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరో నాయకులను చూశామని, కానీ కాపు జాతి కోసం ముద్రగడ వేసిన ముద్ర చెరగనిదని కొనియాడారు. చాలామంది రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గాల ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, కానీ ముద్రగడ మాత్రం జాతి ప్రయోజనాల కోసం పదవులను, రాజకీయాలను సైతం త్యాగం చేశారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో విసిరిన సవాల్కు కట్టుబడి, అధికారిక గెజిట్లో కూడా తన పేరు మార్చుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేశారు. కాపు యువత, మేధావులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషి చేయాలే తప్ప, అనవసర ట్రోలింగ్లతో నష్టం కలిగించవద్దని హితవు పలికారు. ఆస్తులను కరిగించుకున్న త్యాగశీలి: గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంతో తమ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉందని తెలిపారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తుది శ్వాస వరకు ఆయన ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక బాధ్యతలు నిర్వర్తించినా తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదన్నారు. రాజకీయ అధిష్టానాలు చెప్పినట్లు నడుచుకుని ఉంటే ఆయన ఉన్నత పదవుల్లో కొనసాగేవారని, కానీ జాతి కోసం పోరాడి వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. ఆత్మగౌరవానికి వేసే ముద్రే ముద్రగడ: కాపు రాష్ట్ర జేఏసీ నాయకుడు తోట రాజీవ్ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు చిరకాల మిత్రుడని, ఆయన మన మధ్య లేరనే వార్త కాపు జాతి అభ్యున్నతకే అడ్డుపడినట్లేనన్నారు. కాపు జాతి కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలకతీతంగా ఈ సంతాప సభకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషకరమన్నారు. అందరినీ ఆదరించిన గొప్ప మనసు: గొల్ల బాబూరావు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచే ముద్రగడతో పరిచయం ఉందని, తనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు. సొంత ఆస్తిని ప్రజలకు పంచిన నేత: తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ముద్రగడ వందలాది ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆర్థికంగా ఎదగలేదని, పైగా సొంత ఆస్తులనే ప్రజల కోసం ఖర్చు చేశారని కొనియాడారు. 1994లో కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన చేసిన ఉద్యమం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, కాపు నేతలు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్గాంధీ, పీలా ఉమారాణి, గూటూరు నరసింహమూర్తి, పీవీ సురేష్, కోరాడ రాజుబాబు, కోడిగుడ్ల ఫూర్ణిమ శ్రీధర్, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మా భూములు మాకిచ్చేయండి!
అగనంపూడి: ఉపాధి కల్పిస్తామనే హామీతో రీఫ్రాక్టరీస్ సంస్థ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రీఫ్రాక్టరీస్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంస్థకు చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి జాతీయ రహదారి జంక్షన్లో నిరసన చేపట్టారు. అనంతరం నిర్వాసితులు జాతీయ రహదారి కూడలి నుంచి బొర్రమాంబ వనం మీదుగా రీఫ్రాక్టరీస్ సంస్థ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు గవర నరసింగరావు, పెదిరెడ్ల హరనాథ్ మాట్లాడుతూ.. రీఫ్రాక్టరీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించకముందే మూతపడిందన్నారు. సంస్థ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న యాజమాన్యం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఐటీ హబ్ పేరుతో మరోసారి నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్కరాజు గోవిందరాజులు, కొలపర్తి శ్రీనివాసరావు, పెదిరెడ్ల నీలకంఠం, చిత్తా అబ్బాయి, న్యాయవాది ప్రభాకరరావు, మంచాల కన్నారావు పాల్గొన్నారు. -
బాబు మార్క్ మోసం!
సీఎం చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు.. ఇక మా బతుకులు మారతాయని ఆశపడ్డాం. ఏడాది గడిచిపోయింది.. కానీ ఇల్లు రాలేదు.. దుకాణం నిర్మించలేదు. ఎవరిని అడగాలో.. ఎవరిని కలవాలో తెలియడం లేదు. ముఖ్యమంత్రి హామీతో కొత్త జీవితంపై ఆశలు పెట్టుకున్న వంజంగి ఆదివాసీ మహిళలు వంతాల కొండమ్మ, కొమరం మణి ఆవేదన ఇది. పేదరికం నుంచి బయటపడతామని ఎదురుచూసిన వారి ఆశలు ఏడాది తర్వాత కూడా నెరవేరలేదు. హామీ ఇచ్చిన ఇల్లు, దుకాణం కోసం ఇప్పటికీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.సాక్షి, పాడేరు: మండలంలో వంజంగి గ్రామంలో గత ఏడాది ఆగస్టు 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. గిరిజనులతో మమేకమయ్యారు. వంతాల కొండమ్మ అనే వ్యవసాయ కూలీ ఇంటికి చంద్రబాబు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం స్వయంగా తమ ఇంటికి రావడంతో కొండమ్మ సంబరపడింది. ఆయనకు కొండమ్మ రాఖీ కట్టింది. ఆ సమయంలో కొండమ్మ పేదరికం, కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు ఆమెకు పలు హామీలు ఇచ్చారు. పాత రేకుల ఇంటిలో ఉన్న కొండమ్మకు శ్లాబ్ ఇంటిని నిర్మించడంతో పాటు జిల్లా కేంద్రం పాడేరులో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేలా దుకాణ నిర్మాణం చేపట్టి అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా తమకు మంచి జీవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కొండమ్మ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వంజంగిలోని తోటి గిరిజనులు కూడా సంతోషించారు. ఏడాదైనా పాత ఇల్లే గతి వంతాల కొండమ్మకు సీఎం చంద్రబాబు ఇచ్చిన పక్కా ఇల్లు, దుకాణం హామీ నెరవేరలేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగి ఏడాది అవుతున్నా ఇంటి నిర్మాణం, పాడేరులో దుకాణ నిర్మాణం జరగలేదని ఆదివాసీ మహిళ కొండమ్మ వాపోతోంది. ఏడాది నుంచి సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నా ఫలితం లేదని, కనీసం ఇల్లు మంజూరు పత్రం కూడా అధికారులు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నెల 4న వెలుగు అధికారులు ఆకస్మికంగా వచ్చి బ్యాంకు రుణం ఇస్తామని, పాడేరులో కొట్టు సొంతంగా కట్టుకుంటారా అని అడిగారని కొండమ్మ తెలిపింది. రుణం ఇస్తే.. సీఎం చంద్రబాబు ఆదుకుంటానన్న హామీకి ఫలితం ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. ఇల్లు, దుకాణం రెండింటి నిర్మాణానికి సీఎం ఇచ్చిన హామీలు తమ కుటుంబానికి అమలుకాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరో కుటుంబానిదీ అదే పరిస్థితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వంజంగి గ్రామంలో జరిగిన సదస్సులో ఆదివాసీ మహిళ కొమరం మణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పక్కనే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఇతర అధికారులు ఉన్నారు. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి సొంత ఇల్లు కూడా లేని మణి కుటుంబ పరిస్థితిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ కుటుంబానికి కూడా పక్కా ఇల్లు, మణి టైలరింగ్ వృత్తికి సంబంధించి దుకాణం నిర్మాణం చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న ఓ అధికారి గిరిజాకు ఆయా బాధ్యతలు అప్పగించారు. సీఎం హామీతో తమ బతుకులు బాగుపడతాయని పేదరికంతో మగ్గిపోతున్న మణి ఆశపడింది. కానీ ఏడాది అయినా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. పరాయి పంచన జీవనం కొమరం మణి జీవన పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ముగ్గురు పిల్లలు, మద్యానికి బానిసైన భర్తతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉండటానికి సొంత ఇల్లు లేకపోవడంతో తన పెదనాన్న ఇంట్లో కుటుంబమంతా తలదాచుకుంటోంది. అదే ఇంటి వరండాలో టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనోపాధి పొందుతోంది. సీఎం చంద్రబాబు తనకు ఇచ్చిన ఇల్లు, దుకాణం నిర్మాణాల హామీ అమలుకాలేదని, ఏడాది పూర్తయినా న్యాయం జరగలేదని మణి ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దత్తత తీసుకున్నానని, అన్నీ తానే చూసుకుంటానని ఆ రోజు చెప్పిన గిరిజా అనే అధికారి రూ.10 వేలు మాత్రమే తన బ్యాంకు ఖాతాకు పంపారని, ఆ తర్వాత పట్టించుకోలేదని వాపోయింది. ఇల్లు, దుకాణం కోసం అనేకసార్లు ఫోన్ చేసినా ఆ అధికారి నుంచి స్పందన లేదని, ఇక ఎవరిని కలవాలో తెలియక మౌనంగా ఉండిపోయామని తెలిపింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన ఇల్లు, దుకాణం నిర్మాణాల హామీ ఏడాదిగా అమలుకాకపోవడం బాధగా ఉందని మణి ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాదైనా అమలుకు నోచుకోని సీఎం ఆదివాసీ దినోత్సవ హామీ గాలిలో కలిసిపోయిన వాగ్దానం నిరాశకు గురైన ఆదివాసీ మహిళలు కొండమ్మ, మణి -
పాముకాటుకు రెండు పాడి ఆవులు మృతి
రావికమతం: మండలంలో మరుపాక శివారు దాసరయ్యపాలెంలో ఆదివారం పాముకాటుకు గురై రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దాసరయ్యపాలెం గ్రామానికి చెందిన వేపాడ సత్తిబాబు రెండు పాడి ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. సత్తిబాబు ఆదివారం కూలీ పనికి వేరే ప్రాంతానికి వెళ్లగా భార్య కొండమ్మ ఆవులను మేతకు తోలుకెళ్లింది. మధ్యాహ్నం ఆవులను పశువుల పాక వద్దకు తోలుకొచ్చి దాణా పెట్టి ఇంటికి వెళ్లింది. సాయంత్రం కొండమ్మ పశువుల పాక వద్దకు రాగా అప్పటికే రెండు ఆవులు మృతి చెందడంతో కొండమ్మ ఏడుస్తూ కేకలు వేసింది. పాకకు సమీపంలో ఉన్న రైతులు పాక దగ్గరకు వచ్చి చూడగా పాము కరవడం వల్లనే ఆవులు చనిపోయి ఉండవచ్చు ఆని రైతులు తెలిపారు. ఆవుల మృతి చెందిన సమాచారం గ్రామ సచివాలయం పశువైధ్యాధికారి సత్యనారాయణకు తెలియపర్చగా ఆయన వచ్చి ఆవులను పరీశీలంచగా పాము కాటుకు మృతి చెందాయని నిర్ధారించారు. జీవనాధారమైన రెండు ఆవులు రూ.1లక్ష 40 వేలు విలువ చేస్తాయని, అప్పులు చేసి ఆవులు కొని జీవనం సాగిస్తున్నామని రైతు సత్తిబాబు, భార్య కొండమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఇదేం దోపిడీ ఆచార్యా..!
విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్ స్కాలర్స్ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏయూ నిధులను అడ్డదారిలో మళ్లించేందుకు లక్షల విలువైన దొంగ బిల్లులను వైస్ చాన్సలర్ టేబుల్ వద్దకు చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. పలు విభాగాల్లో పీహెచ్డీ స్కాలర్లను టెంపరరీ టీచింగ్ అరేంజ్మెంట్స్ కింద పనిచేస్తున్నట్లు చూపించి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలు దోపిడీ ఇలా... సాధారణంగా ఏయూలో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి టీటీఏలుగా అవకాశం కల్పించి విద్యార్థులకు బోధన చేయిస్తారు. వీరికి సెమిస్టర్ చొప్పున ఏయూ రూ.లక్షల్లో ఫీజు చెల్లిస్తుంది. అయితే పీహెచ్డీ స్కాలర్స్తో ఉచితంగా టీచింగ్ సేవలు వినియోగించుకోవాలని యూజీసీ నిబంధన ఉంది. దానికి అనుగుణంగా వైస్ చాన్సలర్లు ప్రొసీడింగ్స్ ఇస్తుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు విభాగాధిపతులు స్కాలర్లతో ఉచితంగా పాఠాలు చెప్పిస్తూ, వారిని టీటీఏలుగా చూపుతూ దొంగ బిల్లులు పెట్టి వర్సిటీ సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి టీటీఏలుగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కానీ కొందరు విభాగాధిపతులు వర్సిటీ యాజమాన్య మెతక వైఖరిని అవకాశంగా తీసుకుని, స్కాలర్లనే టీటీఏలుగా చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వైస్ చాన్సలర్ కళ్లుగప్పి ఈ దొంగ బిల్లుల వ్యవహారమంతా వైస్ చాన్సలర్ కళ్లుగప్పి నడుస్తున్నట్లు ఏయూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీ పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకుని కొందరు ఆచార్యులు ఈ కక్కుర్తికి పాల్పడుతున్నట్లు సమాచారం. పీహెచ్డీ స్కాలర్లకు జరుగుతున్న అన్యాయంపై వైస్ చాన్సలర్కు ఫిర్యాదు వెళ్లడంతో, ఆయన విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి ఆరా తీశారు. డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకువచ్చారా లేదా అని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు వీసీని నమ్మించి, డీఆర్సీ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసేందుకు కూడా కొందరు దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఇలా పరిపాలన రంగాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయల దొంగ బిల్లులను పంపగా, అవన్నీ ప్రస్తుతం వీసీ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలి: ఉద్యోగ సంఘాలు పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతూ, స్కాలర్లను వాడుకుంటూ దొంగ బిల్లులతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్న విభాగాధిపతులపై తక్షణమే విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి అవకాశం దక్కకుండా చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నుంచి వర్సిటీని కాపాడాలని కోరుతున్నారు. వర్సిటీ పాలనపై వీసీ పూర్తిస్థాయి దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. నిత్య పూజలు.. సమయాలు నెల రోజుల పాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజలు జరుగుతాయి. అలాగే విశేష దినాలైన గురు, శుక్రవారాల్లో రెండు విడతలుగా ఉదయం 8 నుంచి 9 వరకు, 9.30 నుంచి 10.30 వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పూజలో భాగంగా సంకల్పం, లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం మరియు వేదాశీర్వచనం చేపడతారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది. టికెట్ రుసుము ఈ సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలచే భక్తులు (దంపతులు) రూ.516 టికెట్ రుసుము చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, పావు కేజీ పులిహోర, పావు కేజీ చక్కెర పొంగలి, రాగి శ్రీచక్రయంత్రాన్ని మహాప్రసాదంగా అందజేస్తారు. ముఖ్యమైన పర్వదినాలు శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 21) వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించనున్నారు. మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో (ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11) విశేష కార్యక్రమాలు ఉంటాయి. 13న పూజల ప్రారంభం ఈ నెల 13న ఉదయం 8.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజలను అధికారికంగా ప్రారంభించనున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో కోరారు. పరోక్ష/ఆన్లైన్ సేవల వివరాలు: ఆలయానికి నేరుగా రాలేని స్థానికేతర భక్తుల గోత్రనామాలతో పూజ నిర్వహించి, లక్ష్మీ యంత్రం, కుంకుమ, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతారు. బ్యాంక్ ఖాతా వివరాలు: 060810011006691 (ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0806081), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్. ఫోన్ నంబర్లు: 0891–2568645, 2566515, 2731250 వెబ్సైట్: www.aptemples.org ఆన్లైన్ పూజల సమాచారం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్లో కూడా సంప్రదించాలని ఈవో సుజాత పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థలో అడ్వకేట్ గుమాస్తాల పాత్ర కీలకం
అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన సీనియర్ అడ్వకేట్ క్లర్క్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సుదీర్ఘంగా 53 సంవత్సరాల పాటు గుమస్తాగా అందించిన సేవలను కొనియాడారు. అలాగే న్యాయవాదులు, అడ్వకేట్ క్లార్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం.కె. శ్రీనివాసరావు, ఎస్. నాగేశ్ కుమార్ మాట్లాడుతూ.. అడ్వకేట్ క్లర్కుల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లర్కుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో క్లార్కుల సంక్షేమం, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, సీనియర్ న్యాయవాదులు బెవర సత్యనారాయణ, కే. సురేష్ కుమార్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు పిల్ల బంగారు నాయుడు, కార్యదర్శి నల్ల భాస్కర రావు, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సభ్యులు జి. శివకృష్ణ, గొర్లి కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు పాల్గొని నివాళులర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు -
విత్తన బంతులతో అడవుల పునరుజ్జీవనం
సీలేరు: ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అడవులు ప్రకృతికి పెట్టింది పేరుగా ఉండేవి. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష, జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. కాలక్రమేణా పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ● అడవుల నరికివేతతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అటవీశాఖ అడవుల పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విత్తన బంతులతో పచ్చదనం జిల్లాలోని ఏజెన్సీలో అటవీ విస్తరణను పెంచేందుకు ఈ ఏడాది విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. పాడేరు, చింతపల్లి అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్లలో విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో నాటే కార్యక్రమం చేపట్టారు. ● సాంప్రదాయ పద్ధతిలో గోతులు తీసి మొక్కలు నాటడంతో పాటు.. మారుమూల, కొండ ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డ్రోన్ల ద్వారా విత్తన బంతులను అడవుల్లో వెదజల్లారు. ప్రతి హెక్టారులో నిర్ణీత సంఖ్యలో విత్తన బంతులు నాటేలా చర్యలు చేపట్టారు. గ్రామ సభలతో అవగాహన ● డ్రోన్ల ద్వారా విత్తన బంతులు వెదజల్లడంతో పాటు.. అటవీశాఖ సిబ్బంది గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అడవుల నరికివేత, వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, గిరిజనులకు విత్తన బంతులను అందజేసి వారి భూముల్లో వాటిని నాటించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ● చింత, రావి, నేరేడు, తురకవేప, మామిడి, నల్లమద్ది తదితర మొక్కలకు సంబంధించిన విత్తనాలను విత్తన బంతుల రూపంలో తయారు చేసి నాటుతున్నారు. అటవీ అభివృద్ధికి కృషి ఏజెన్సీలో అడవులు అంతరించిపోతున్న తరుణంలో.. అటవీశాఖ చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులు, గిరిజనులు సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటి అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపడతాం. గిరిజనులు ఎవరూ చెట్లు నరకవద్దని, అడవులను కాపాడుకోవాలని కోరుతున్నాం. అడవులను కాపాడితేనే మానవాళికి ఎదురయ్యే ముప్పును తగ్గించగలుగుతాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
గిరిజన హక్కులకు భంగం కలిగిస్తే ఉద్యమం
● గిరిజన ఉద్యోగుల సంఘం హెచ్చరిక ● చింతపల్లిలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం చింతపల్లి: ఆదివాసీ ప్రాంతంలో అడవి బిడ్డల హక్కులకు భంగం కలిగిస్తే ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తామని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, గంగరాజు, యువిగిరి, వెంకటరమణ హెచ్చరించారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్అండ్బీ కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కిట్లంగి ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో గిరిజన హక్కులకు భంగం కలిగిస్తే గిరిజనుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మన్యంలో జీవో నంబర్ 3, భూబదలాయింపు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. ఈ ప్రాంతంలోని బాకై ్సట్, లేటరైట్తో పాటు హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరిట దొడ్డిదారిన విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గిరిజన హక్కుల జోలికి వస్తే ఉద్యమాలు జరిగే పరిస్థితులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కళ్లారా చూసిందన్నారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవోను పునరుద్ధరించకుంటే కూటమి ప్రభుత్వానికి గిరిజన నిరుద్యోగుల సత్తా చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, జీకే మండల అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్, ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు బౌడు గంగరాజు, దేపూరి శశికుమార్, గెమ్మిలి మో హన్, కుడుములు వెంకటరమణ, చింతర్ల సతీష్, మాజీ ఎంపీపీ కవడం మచ్చమ్మ, మాజీ సర్పంచ్ వీరన్నపడాల్, డీఎల్ఓ ప్రతినిధులు కాసులమ్మ, వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వీకెండ్ సందడి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి, అరకు ఫైనరీలో ఆదివారం సందడి నెలకొంది. శనివారం బంద్ కారణంగా పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయిలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. అరకు ఫైనరీ వద్ద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలంలో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. పర్యాటక ప్రదేశాల్లో గిరిజనులు విక్రయించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీకి ప్రత్యేక ఆదరణ లభించింది. -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో ఆదివారం బీఎస్ఎఫ్ 103వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. బీఎస్ఎఫ్ కమాండెంట్ నీరజ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బీఎస్ఎఫ్ జవాన్లు, విద్యార్థులు, స్థానికులు క్యాంప్ నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ సందర్భంగా కమాండెంట్ నీరజ్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. -
బంద్..నిర్బంధం
జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ డిమాండ్తో మన్యంలో చేపట్టిన బంద్ పాడేరులో ఉద్రిక్తతకు దారితీసింది. బంద్కు మద్దతుగా రోడ్డెక్కిన గిరిజన సంఘాల నేతలను పోలీసులు పలుమార్లు అడ్డుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల రాకపోకలను కొనసాగించారు. పోలీసుల నిర్బంధ చర్యలను వైఎస్సార్సీపీ నేతలు, ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఎన్నికల హామీ మేరకు జీవో నంబరు 3ను పునరుద్ధరించి 100 శాతం ఉద్యోగాల కల్పనకు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే తీసుకురావాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు. హక్కుల సాధనకోసం రోడ్డెక్కిన గిరిజన సంఘాలు●పాడేరులో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు ●పలువురిని అదుపులోకి తీసుకున్న బలగాలు ●పోలీసుల చర్యలను వ్యతిరేకించిన గిరిజనం ●చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందే .. ●పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు డిమాండ్ ●గిరిజన చట్టాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిక సాక్షి, పాడేరు: గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. జీఓ–3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం గిరిజన సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, పాత బస్టాండ్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. జీఓ–3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోరుతూ నినాదాలు చేశారు. విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా గిరిజనులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. 100 శాతం ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. గిరిజన సంఘాలు శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసుల నిర్బంధం ద్వారా అడ్డుకోవడం దారుణమన్నారు. ఆదివాసీలతో కూటమి ఆటలు : ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు అన్యాయం చేసే చర్యలకు పాల్పడుతూ వారి జీవితాలతో ఆటలాడటం అన్యాయమని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. గతంలో జీవో నంబర్ 97ను దుర్మార్గంగా తీసుకువచ్చి గిరిజనుల బాకై ్సట్ సంపదను తవ్వుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి గిరిజన చట్టాల జోలికి రావడం దారుణమన్నారు. నూరు శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవోను సీఎం చంద్రబాబు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కుడా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్సీపీ జిల్లా, స్థానిక నాయకులు లకే రామసత్యవతి, పాంగి నాగరాజు, పాంగి సత్తిబాబు, వనుగు బసవన్నదొర, సిరగం దశమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రశాంతంగా.. జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ డిమాండ్తో గిరిజన సంఘాలు చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆందోళనకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు గిరిజన సంఘాల నేతలు అప్పలనరస, పాలికి లక్కు, సుందర్రావు, రాధాకృష్ణ, కాంగు చిన్నిలు ప్రయత్నించారు. పోలీసులు వారిని పలుమార్లు అడ్డుకున్నారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల రాకపోకలను కొనసాగించారు. ప్రైవేట్ వాహనాల సర్వీసులు మాత్రం నిలిచిపోయాయి. పాడేరు పట్టణంతో పాటు మండలంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. 100 శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవోను వెంటనే ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధ చర్యలను నిరసించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనరస హెచ్చరించారు. జీవో నంబరు 3పై సీఎం హామీ అమలు చేయాలి : అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ అరకులోయ టౌన్: గిరిజన చట్టాల పరిరక్షణ, గిరిజనులకు 100 శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబర్–3ను పునరుద్ధరించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. జీవో–3పై సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. శనివారం అరకులోయలో నిర్వహించిన మన్యం బంద్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్నారు. మైదాన ప్రాంతానికి చెందిన చేబోలు లీలాప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జీవో–3 రద్దయిందని పేర్కొన్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాల ప్రయోజనం గిరిజనులకు దూరమైందన్నారు. 1/70 చట్టం, ఎల్టీఆర్ నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. అరకులోయ, పాడేరు, చింతపల్లి వంటి పర్యాటక ప్రాంతాల్లో గిరిజనేతరులు రోడ్ల పక్కన దుకాణాలు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు గిరిజనేతరులు గిరిజనుల ఉద్యోగాలను పొందుతున్నారని ఆరోపించారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ●మన్యం బంద్ సందర్భంగా అరకులోయలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్సీపీ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి వాహన రాకపోకలను నియంత్రించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్టాసింగ్ విజయ్కుమార్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, సీపీఎం నేతలు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, రామారావు, ఉమామహేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. మూతపడిన పర్యాటక ప్రాంతాలు.. ఇబ్బందులు పడ్డ సందర్శకులుగిరిజన హక్కుల జోలికొస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
వైఎస్సార్సీపీలోకి రిటైర్డ్ ఉద్యోగుల క్యూ
పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్సీపీలో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం రిటైర్డ్ కాఫీ ఉద్యోగి రూఢీ అప్పారావు వైఎస్సార్సీపీలో చేరగా.. తాజాగా శనివారం మరో రిటైర్డ్ ఉద్యోగి పార్టీలో చేరారు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామానికి చెందిన నేమాని సింహాద్రి ఎల్ఐసీలో హైగ్రేడ్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన శనివారం పాడేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ.. అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు జరిగిందన్నారు. భవిష్యత్లోనూ వైఎస్సార్సీపీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, కొయ్యూరు మండల పార్టీ నాయకులు వారా నూకరాజు, దేపూరి రాజు, పొట్ల సింహాచలం, సంపరి రమణ, బిత్తరి కళ్యాణం, గుదాలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
అడవే ఇల్లు ప్రకృతే జీవితం
●తరతరాలుగా అదే బంధం ●వ్యవసాయం నుంచి కాఫీ సాగు వరకు.. ●ప్రపంచం గుర్తించిన పంటలు ●మారుతున్న గిరిజన జీవితంప్రకృతిని వదలకుండా.. కాలంతో పాటు అడుగులు వేస్తున్న ఈ జీవితం వెనుక ఎన్నో ఆశలు, ఎన్నో కష్టాలు, ఎన్నో తరాల జ్ఞాపకాలు దాగున్నాయి. అడవిని కాపాడుకుంటూ.. అదే అడవితో తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఆదివాసీల జీవితం ఆందరికీ ఆదర్శం. – సాక్షి, పాడేరు కాలం మారుతున్నా.. అడవితో ఆదివాసీల అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. సంప్రదాయ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న వారి జీవితం.. ఇప్పుడు క్రమంగా కొత్త మార్గాలను అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు తమ అవసరాల కోసం సాగు చేసిన పంటలే.. నేడు వారి కుటుంబాలకు ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. కాఫీ తోటల్లో కష్టపడుతున్న రైతు చేతులు.. మిరియాల తీగలను అల్లుకుంటున్న కుటుంబాలు.. పసుపు, పిప్పలమోడి పంటలతో భరోసా వెతుక్కుంటున్న గిరిజన రైతులు.. మారుతున్న ఆదివాసీ జీవనానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు. అడవిని చాలామంది ప్రకృతి సంపదగా చూస్తారు.. కానీ ఆదివాసీలకు మాత్రం అదే ఇల్లు.. అదే జీవనాధారం.. అదే బతుకుదెరువు. తరతరాలుగా అడవి తల్లితో మమేకమై జీవిస్తున్న వారి జీవితంలో చెట్టు, కొండ, వాగు, నేల.. ప్రతిదానికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అడవిలో దొరికే ప్రతి వనరుతోనూ వారి బతుకు ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి అడవిని చూస్తూ పెరిగే పిల్లల నుంచి.. ఆ నేలపై చెమటోడ్చే రైతుల వరకు.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకృతి ఓ కుటుంబ సభ్యురాలిలానే మారిపోయింది. -
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర హెచ్చరిక ● మన్యం బంద్కు విశేష స్పందన ● స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అన్నివర్గాల ప్రజలు
ముంచంగిపుట్టు: గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర హెచ్చరించారు. గిరిజన ప్రజా సంఘాల పిలుపు మేరకు శనివారం ముంచంగిపుట్టులో నిర్వహించిన మన్యం బంద్లో ఆమె పాల్గొన్నారు. ఉదయం నుంచే గిరిజన ప్రజా సంఘాల నేతలు బంద్లో పాల్గొనగా.. వర్తక సంఘాలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు తెలిపాయి. వారపు సంత రద్దయింది. ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుజభంగి, కిలగాడ, డేగలపుట్టు, ఆసరాడ, పోలీపుట్టు జంక్షన్ల వద్ద గిరిజనులు నిరసనలు చేపట్టారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి గిరిజన హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అరకు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో నంబర్3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకువచ్చి గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం గిరిజనులను మోసం చేయడమేనని విమర్శించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గిరిజనేతరులు గిరిజన చట్టాల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టాన్ని తొలగించాలని 1,670 మంది గిరిజనేతరులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే జీవో నంబర్3 అమలు చేసి గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ నాని ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణతో పాటు గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాల నేతలు, ఎంఎంశ్రీను,కె.త్రినాధ్,పి.పద్మారావు, ఎ.జగబంధు, నర్సయ్య, నీలకంఠం, అనిల్కుమార్, కొండలరావు, కొండపడాల్, బాబురావు,అధిక సంఖ్యల్లో గిరిజనులు పాల్గొన్నారు. మూతపడిన పర్యాటక ప్రాంతాలు డుంబ్రిగుడ: మన్యం వ్యాప్తంగా శనివారం నిర్వహించిన బంద్ ప్రభావం పర్యాటక రంగంపైనా పడింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన చాపరాయి జలపాతం, అరకు పరిసరాల్లోని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా, తెలంగాణ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మన్యానికి వస్తుంటారు. అయితే ముందస్తుగా బంద్కు పిలుపునివ్వడంతో కొంతమంది పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరికొందరు పర్యాటకులు జాతీయ రహదారి మీదుగా మన్యానికి చేరుకున్నప్పటికీ.. బంద్ కారణంగా పర్యాటక కేంద్రాలతో పాటు హోటళ్లు కూడా మూతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొయ్యూరులో రహదారిపై బైఠాయింపు కొయ్యూరు: 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతంలోని ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు చేపట్టిన బంద్ శనివారం విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. ఉదయం రెండు బస్సులు తిరిగిన అనంతరం వాటిని నిలిపివేశారు. రాజేంద్రపాలెంలో బంద్ పటిష్టంగా నిర్వహించారు. మర్రిపాలెం జంక్షన్లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేయడంతో చింతపల్లి–నర్సీపట్నం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీపీఎం నేత ఎస్. సూరిబాబు, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు నర్సి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెదబయలు: మన్యం బంద్ మండలంలో సంపూర్ణంగా జరిగింది. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడ్డాయి. పెదబయలు అంబేడ్కర్ కూడలిలో గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపై నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీలేరు: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పాక్షికంగా జరిగింది. దారకొండలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. గిరిజన సంఘాల నాయకులు ముందుగా దుకాణాలను మూసివేయించి.. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ యాసిన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జి.మాడుగుల: మన్యం బంద్ మండలంలో సంపూర్ణంగా జరిగింది.జి.మాడుగుల–పాడేరు–చింతపల్లి ప్రధాన రహదారిలోని మూడు రోడ్ల జీపుల స్టాండ్ వద్ద ఆందోళనకారులు వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. జి.మాడుగుల, బంధవీధి, సంతబయలు, నిట్టాపుట్టు తదితర గ్రామాల్లో దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిరసనకారులు జీవో3పై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలి.. అంటూ నినాదాలు చేశారు. ఆదివాసీ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో స్థానిక ఎస్ఐ సాయిరాంపడాల్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురభంగి రామకృష్ణ, మాజీ సర్పంచ్ ఐసరం హనుమంతరావు, కిముడు రాంబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సిర్మా పండన్న, జీఓ–3 సాధన కమిటీ జిల్లా కార్యదర్శి మత్స్యరాస నారాయణరాజు, ఉపాధ్యక్షుడు కోటిబాబు, పెసా కమిటీ మండల అధ్యక్షుడు లకె రామకృష్ణ, ఉపాధ్యక్షుడు కిముడు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మన్యం బంద్ సంపూర్ణం చింతపల్లి: మన్యంలో జీవో నంబర్–3కు ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకురావడంతో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ హెచ్చరించారు. ప్రజా సంఘాల పిలుపు మేరకు వైఎస్సార్సీపీ మద్దతుతో శనివారం నిర్వహించిన మన్యం బంద్ చింతపల్లిలో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు, సీపీఐ, సీపీఎం నాయకులు మండలంలోని పలు కూడళ్ల వద్ద బంద్ నిర్వహించారు. మండల కేంద్రంలో హనుమాన్ జంక్షన్ నుంచి సంత మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి సమావేశం నిర్వహించారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనూషదేవి, జల్లి సుధాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు జీఓ–3కు ప్రత్యామ్నాయ జీఓ తీసుకువచ్చి గిరిజన నిరుద్యోగ యువతకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కాపాడుతూ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనలను విరమించుకోవాలని, బాకై ్సట్, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్, సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు ధనంజయ్, పెట్ల పోతురాజు, డీఎల్వో ప్రతినిధులు వెంకయ్యమ్మ తదితరులు ప్రసంగించారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సాగిన గంగన్నపడాల్, జీకేవీధి మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కరుణానిధి, బేరా రమణ, చింతర్ల రాంకీ పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన బంద్కు వ్యాపారులు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలోని కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంక్ను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బంద్లో జాతీయ రహదారిపై మూడు రోడ్ల జంక్షన్ వద్ద గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాలు, భూముల జోలికొస్తే ఖబడ్దార్’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్ నుంచి బీఎస్ఎన్ఎల్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన్యంలో హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి జారీ చేసిన జీఓలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పోతురాజు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు పి. సురేష్కుమార్, మాజీ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, కె.హరి, ఎంపీటీసీ రామారావు, మండల వైఎస్సార్సీపీ కార్యదర్శి మఠం శంకర్రావు, బాకా సింహాచలం, జి. చిరంజీవి, విజయదశమి, పి. సత్యనారాయణ పాల్గొన్నారు. హుకుంపేట: మండల కేంద్రంతో పాటు ప్రధాన ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శనివారం ప్రశాంతంగా బంద్ నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు బంద్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్, రేగం రమేష్, సమిడ వెంకటపూర్ణిమ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. గూడెంకొత్తవీధి: గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణలో భాగంగా శనివారం నిర్వహించిన అరణ్య గిరిజన బంద్ మండల కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. వైఎస్సార్సీపీ, గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మన్యం బంద్లో నాయకులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పలుచోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వంతల అరుణ్, ఎంపీటీసీ బుజ్జిబాబు, నారాయణ, ఎల్లారావు, రామారావు, బలరాం పాల్గొన్నారు. గిరిజన హక్కుల జోలికొస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు -
బాల్య వివాహాలతో అనర్థాలు
చింతపల్లి: బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ సుబ్బారావు అన్నారు. శనివారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి మేడూరు, రామారావుపాలెం గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. బాల్య వివాహాల కారణంగా బాలికలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామాల్లో బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంబాబు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అరకులోయలో ఆదివాసీ దినోత్సవం
అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 10వ తేదీ సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరై వేడుకలను ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల విజయవంతానికి వేదిక ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, భద్రత, ప్రజల సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. -
నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి
రావికమతం: నాన్ షెడ్యూల్లో గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కల్యాణపులోవ నుంచి జెడ్.బెన్నవరం వరకు గిరిజనులు బైక్లపై ప్రచారం చేశారు . ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు,గలబర్తి రాజు,గెమ్మిల రాజు,పి.బెన్నన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు కల్యాణపులోవ జలాశయంలో జల దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణపులోవ జలశయాన్ని భూ కబ్జదారుల నుంచి రక్షించాలని కోరారు. -
బీఎన్ రోడ్డుకో దండం..!
● పెద్దపెద్ద గోతులతో దర్శనం ● ప్రమాదకరంగా ప్రయాణాలు ● బెంబేలెత్తిపోతున్న వాహనదారులు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం చోడవరం: రోడ్డును బాగుచేయండి మహాప్రభో అంటూ ప్రజలంతా వేడుకుంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో అన్న ప్రధాన నగరాలతోపాటు మూడు జిల్లాలను అనుసంధానం చేస్తున్న భీమిలి–నర్సీపట్నం రోడ్డు దుస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు చోడవరం నియోజకర్గంలో ప్రధాన మెయిన్రోడ్డుగా ఉండటంతో 53 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులతో రోడ్డంతా చాలా ప్రమాదకరంగా మారింది. దీనిపై ఇప్పటికే రోడ్డు పొడవునా అనేక సార్లు ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యాయవాదులు రోడ్డెక్కినా... ఈ రోడ్డును బాగుచేయకపోవడంతో చివరికి న్యాయవాదులు, ఆర్క్ సంస్థ ప్రతినిధులు కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి, సదరు రోడ్డు టెండరు తీసుకున్న సీఎస్ఆర్ కనస్ట్రక్షన్కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఆర్అండ్బి అధికారులైతే ప్రజలకు, కోర్టుకి ఏవో కుంటి షాకులు చెబుతూ ఎందుకూ పనికిరాని శాఖగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట, రోలుగుంట మీదుగా మెయిన్రోడ్డు(బీఎన్రోడ్డు) పెద్దపెద్ద గోతులు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. 20 యేళ్లుగా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో వేయకుండా వదిలేశారు. దీనితో ఇప్పుడు పూర్తిగా దెబ్బతిని చాలా పెద్దపెద్ద గోతులతో వాహనానలు రాకపోకలు సాగించడానికి వీలులేకుండా చాలా ప్రమాదకరంగా అధ్వానంగా తయారైంది. అదేవిధంగా అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం ఆర్అండ్బీ రోడ్డు కూడా చాలా మేర పూర్తి దెబ్బతిని గోతులతో నిండిపోయింది. ప్రభుత్వం ఈ రెండు రోడ్లుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ఈ గోతుల్లో పడి అనేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రధాన వంతెనలు కూలడంతో నిలిచిన రాకపోకలు ఇప్పటికే వడ్డాది, విజయరామరాజుపేట వద్ద ఈ రోడ్డుపై రెండు ప్రధాన వంతెనలు కూలిపోవడం, వాటికి వేసిన అప్రోచ్ రోడ్లు సైతం గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. ఇంతకాలంగా రోడ్డు బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ప్రజలంతా తమ ప్రయాణాలను సైతం మానుకొని ఇళ్లలో కూర్చొవలసని పరిస్థితి ఏర్పండింది. మరీ అత్యవసర ప్రయాణాలు, ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే తప్పనసరి పరిస్థితుల్లో ఈరోడ్లలో ప్రయాణం చేస్తున్నారు. అంబులెన్స్లో ఆస్పత్రికి వెళ్లే రోగులు మధ్యలోనే ఇబ్బందులు, ప్రాణాలు కోల్పోయే అత్యంత దయనీయ స్థితిలో ఈ రోడ్లు ఉన్నాయి. పాడేరు ఏజెన్సీకి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి వంటి పట్టణాలకు ఇదే ప్రధాన రహదారి. రోజూ వందలాది వాహనాలు రాకపోలకు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ రోడ్డు పెద్దపెద్ద గోతులతో పూర్తిగా శిథిలమైపోయి ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్త ంచేస్తున్నారు. ఈ రోడ్డు బాగోలేదంటూ అనేక సార్లు మీడియా, పత్రికల్లో వచ్చినా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో వర్షాలకు ఈ రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతుల్లో వర్షం నీరుచేరి చెరువులను తలపిస్తున్నాయి. ఏ గోతులో పడి ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందోనని భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి శివారు బండారు వీధిలో ఈ నెల 4న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులు, ఒక బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లిలోని బంగారమ్మపాలెం వెళ్లే రహదారిలో ఉన్న చొక్కాకుల దేముడమ్మ ఇంటిలో ఈ నెల 4న చోరీ జరిగింది. వీరి ఇల్లు శివారున ఉండటంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిలో ఎవరూ ఉండరని గుర్తించిన అదే గ్రామానికి చెందిన నిందితులు వేమల తరుణ్, బండారు దేముడునాయుడుతో పాటు మరో బాలుడు నెల రోజుల నుంచి చోరీకి పక్కా ప్లాన్ వేశారు. ఇంటి వెనుక బాత్రూమ్ గోడపై నుంచి మేడపైకి ఎక్కి మెట్ల ద్వారా ఇంటిలోకి ప్రవేశించారు. ఇనుప రాడ్డుతో బెడ్ రూమ్లోని బీరువాను పగలగొట్టి రెండు పుస్తెలతో కూడిన బంగారు మంగళసూత్రం తదితర మూడు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు అపహరించారు. చోరీ చేసిన బంగారం, వెండి వస్తువులను కాలేజీ వెనుక భాగంలోని ఆయిల్పామ్ తోటలో పాతి పెట్టారు. నగదును ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. ఈ ముగ్గురిని కాశీపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. తమ విచారణలో నేరం అంగీకరించడంతో వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ నేతృత్వంలో పోలీసులు 36 గంటల వ్యవధిలోనే చోరీ కేసును ఛేదించారు. బంగారం, వెండి, నగదు స్వాధీనం -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
పాయకరావుపేట : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రత్యామ్నాయ పంట లను సాగుచేయడం మేలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టణంలోని వీవర్స్ సొసైటీ భవనంలో శుక్రవారం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం–రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పండించవలసిన పంటలపై ముద్రించిన పోస్టర్ను కలెక్టర్తో కలిసి మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు. నాట్లు వేసిన కలెక్టర్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ అరట్లకోట గ్రామంలో పర్యటించి, వరినాట్లను పరిశీలించారు. పొలంలో దిగి నాట్లు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డీపీ ఎం.లచ్చన్న మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేయవలసిన పంటలు, తీసుకోవలసిన జాగ్రత్తల పై సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ అప్పలస్వామి, డాక్టర్ భవానీ, డాక్టర్ రవి కుమార్ తదితరులు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఏ పీడీ సత్యదేవి, జేడీఏ ఆశాదేవి, ఏవో లు ఉమాప్రసాద్, ఆదినారాయణ, ఏఈవో లు, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. -
9 నుంచి గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవాలు
మునగపాక: రాష్ట్రంలోనే పేరుగాంచిన మునగపాక గ్రామీణ యువజన మందిరం 62వ వార్షికోత్సవాల ను ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 9వ తేదీ నుంచి జిల్లా స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు, 11వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర ఆహ్వాన వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 14వ తేదీ రాత్రి 7గంటలకు నందీశ్వర కళా తులసీ ప్రాంగణంలో అమ్మ చెక్కిన బొమ్మ, చీకటి బాట నాటక ప్రదర్శనలు, 15వ తేదీన కూచిపూడి నృత్యం, భరతనాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర ఉపాధ్యక్షులు డాక్టర్ మళ్ల జోగారావు, మళ్ల రామ జగన్నాథం, కోశాధికారి ఆడారి లక్ష్మణరావు, కల్చరల్ కన్వీనర్ ఆడారి రమణబాబు, కార్యదర్శి ఆడారి సూరిబాబు, సహాయ కార్యదర్శి దాడి అరుణ్కుమార్, డైరెక్టెర్లు బుద్ద నాగు, పెంటకోట జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
జైలు భరోను విజయవంతం చేయాలి
నర్సీపట్నం: ఈ నెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జైలు భరో కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనం రూ.31 వేలు చెల్లించాలని, అన్ని పంటలకు పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధర చెల్లించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించడంతో పాటు రోజుకు రూ.700 కూలి చెల్లించాలని. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంకంరెడ్డి చిన్నంనాయుడు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఆకుమడుల్లో పాయ తెగులు
నర్సీపట్నం: ఆకుమడుల్లో అక్కడక్కడ పాయ తెగులు వ్యాపించిందని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొండెంపూడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజుకుమార్ రైతులకు సూచించారు. కేవీకే కొండెంపూడి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ సంయుక్తంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆకుమడులను పరిశీలించారు. పాయ తెగులు వ్యాపించినందున ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వరి నాట్లు వేసే పరిస్థితి కనబడటం లేనందున ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు తదితర పంటలను వేసుకోవాలన్నారు. డీఆర్సీ ఏవో పి.విజేత మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతులు విధిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ఒక వేళ వరి వేసే పరిస్థితి ఉంటే తేలిక రకాలు వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలన్నారు. ఉద్యానశాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ ఉద్యాన వన పంటలకు తగు మోతాదులో నీరు అందించడం అనివార్యమన్నారు. ఉద్యాన పంటలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించడం, మొక్కలు వేరు భాగంలో మల్చింగ్ చేయడం మంచిదన్నారు. ఈకార్యక్రమంలో ఏవో విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, వ్యవసాయ యాంత్రీకరణ శాస్త్రవేత్త ఎస్.కె.బాబు, రైతు సేవాకేంద్రం అధికారి కె.భవాని, రైతు సేవా కేంద్రం అధికారి ఎల్.ఉష, రైతులు పాల్గొన్నారు. -
వచ్చేనెల 12న జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: వచ్చేనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్మన్ చిన్నంశెట్టి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రాజీ కాగల కేసులను గుర్తించి, కక్షిదారులు, న్యాయవాదులతో చర్చలు జరపాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మంది న్యాయమూర్తులతో ఆయన వర్చువల్గా మాట్లాడారు. అలాగే 30 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం గురించి ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
అమ్మవారికి ఆషాఢం సారె
పరవాడ: గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ద్వారా హిందూ సనాతన ధర్మం, సంప్రదాయాలను పరిరక్షించవచ్చని సమరసత సేవా ఫౌండేషన్ ఉత్తరాంధ్ర ధర్మ ప్రచారక్ ఆడారి గంగాధర్ అన్నారు. స్టీల్ప్లాంట్ సమీపంలోని కణితి కాలనీలో కొలువుదీరిన పరదేశిమాంబ అమ్మవారికి గ్రామ మహిళలు, పెద్దలు శుక్రవారం ఊరేగింపుగా వెళ్లి ఆషాఢ మాస సారె సమర్పించారు. జిల్లా మహిళా కన్వీనర్ పెదపాటి కృష్ణవేణి, మండల కన్వీనర్ బొద్దపు నూకరత్నం, పూర్ణ, పి. మంగ, చౌదరి రోజా, ధనలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి పరివార్ సభ్యుల పాల్గొన్నారు. -
పాడేరులో భారీ వర్షం
● జిల్లాలో 60.8 ఎంఎంవర్షపాతం నమోదు సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పాడేరు వారపు సంతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివాసీ గర్జన సభకు హాజరయ్యేందుకు వచ్చిన గిరిజనులు సైతం వర్షంతో అవస్థలు పడ్డారు. జిల్లాలో శుక్రవారం 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కేంద్ర నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి
పాడేరు రూరల్: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టికి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పాడేరులో ‘చలో ఢిల్లీ’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని, ప్రజారోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు పెద్దపీట వేయాలని కోరారు. కార్మికుల హక్కులు, చట్టాలను వందశాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న అక్రమ దాడులను అరికట్టాలని అన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. ప్రజా హక్కుల పరిరక్షణలో భాగంగా భవిష్యత్ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు రాధాకృష్ణ, జల్లి రాజాబాబు, సింహాచలం, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టికి సత్యనారాయణ -
దిశ చట్టం బిల్లు ఉపసంహరణ అన్యాయం
● మహిళల రక్షణకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు ● వైఎస్సార్సీపీ మహిళా నేతల ఆగ్రహం సాక్షి, పాడేరు: దిశ చట్టం బిల్లును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మహిళల రక్షణకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మహిళా నేత, విజయనగరం మాజీ జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి శుక్రవారం పాడేరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ బాలికపై జరిగిన అమానుష ఘటనతో చలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టారని వారు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల బాలికలు, మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందారని పేర్కొన్నారు. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు దిశ చట్టం ద్వారా పోలీసులు సత్వరం స్పందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత బాలికలు, యువతులు, మహిళలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో 12 మహిళా కోర్టులు, 13 దిశ కోర్టులను ఏర్పాటు చేశారని వారు గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ ఉండేదని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు. మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం.. మహిళలకు మేలు చేసే దిశ చట్టాన్ని రద్దు చేయడం సమంజసం కాదని విమర్శించారు. దిశ చట్టం కారణంగా మహిళల్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆదరణ పెరుగుతుందనే భయంతోనే సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో దిశ చట్టం బిల్లును ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. దిశ చట్టం రద్దు చర్యలను మహిళా లోకం మొత్తం నిరసిస్తుందని, కూటమి ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అరకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పూర్ణిమాదేవి, మహిళా విభాగం మండల కార్యదర్శి లకే రామసత్యవతి, ఎంపీటీసీ కిలగాడ సింహాచలం పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
● జిల్లా వ్యవసాయశాఖాధికారి నందు ముంచంగిపుట్టు: వర్షాభావ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్బీఎస్ఎన్ నందు సూచించారు. మండలంలోని ఏనుగురాయి పంచాయ తీ కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైతు కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయశాఖాధికారి నందు మాట్లాడుతూ.. గిరిజన రైతులు అధిక లాభాలు వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తక్కువ కాలపరిమితి కలిగిన రకాలను సాగు చేయా లని తెలిపారు. వరి పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎకరాకు రూ.640 ప్రీమియం చెల్లించి బీమా చేసుకుంటే పంట నష్టం సంభవించినప్పుడు రూ.42 వేల వరకు పరిహారం పొందవచ్చని వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాగులు, కందులు, సామలు, జొన్నలు, గంతెలు వంటి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. డీపీఎం భాస్కర్, ఏవో మురళీకృష్ణ, ఎంపీటీసీ సుబ్బ లక్ష్మి, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
పసుపు పసిడి
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో పసుపు సువాసన వెదజల్లుతోంది. గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపునకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. గ్రామాలకు సమీపంలోని కొండ, పోడు భూములతో పాటు పల్లంగా ఉన్న భూముల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో పసుపు సాగుపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాలుగు మండలాల్లో పసుపును అధికంగా సాగు చేస్తున్నారు. అంతర పంటగా సాగు.. పెట్టుబడి తక్కువగా ఉండి ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో గిరిజన రైతులు పసుపును అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో 10 కావిళ్ల వరకు పసుపు నాటితే 20 నుంచి 25 కావిళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పసుపు ధర కూడా ఆశాజనకంగా ఉందని, బహిరంగ మార్కెట్లో కిలో పసుపు రూ.100 నుంచి రూ.140 వరకు పలుకుతోందని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.8 వేల పెట్టుబడి పెడితే రూ.15 వేలకు పైగా లాభం వస్తోందని రైతులు పేర్కొన్నారు. వర్షాలు కూడా ఆశాజనకంగా కురుస్తుండటంతో దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ● ముంచంగిపుట్టు మండలంలో 1,845 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. డుంబ్రిగూడలో 1,250 ఎకరాలు, పెదబయలులో 3,815 ఎకరాలు, హుకుంపేటలో 2,556 ఎకరాల్లో పసుపు సాగవుతోంది. సేంద్రియ పద్ధతిలో సాగు.. గిరిజన ప్రాంతాల్లో రైతులు సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తుండటంతో పసుపులో కర్కుమిన్ శాతం 5 వరకు ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపుకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ● గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వారపు సంతలకు వడ్డాది, మాడుగుల, అనకాపల్లి, కాకినాడ, తుని తదితర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంత వ్యాపారులు వచ్చి పసుపును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మంచి డిమాండ్ ఉన్న పసుపు సాగుకు ప్రభుత్వం, ఐటీడీఏ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుందని గిరిజన రైతులు కోరుతున్నారు.ఒకప్పుడు సంప్రదాయ పంటగా మాత్రమే కనిపించిన పసుపు.. ఇప్పుడు గిరిజన రైతుల చేతుల్లో ఆదాయ పంటగా మారుతోంది.కొండలు, పోడు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పండుతున్న ఏజెన్సీ పసుపునకుమార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు పసుపు సాగు వైపు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏజెన్సీ పసుపునకు గిరాకీ లాభదాయకంగా ఆదాయం సేంద్రియ విధానంలో పండించడం వల్ల మంచి డిమాండ్ సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు -
బీజేపీ విధానాలను నిరసిస్తూ పాదయాత్ర
జి.మాడుగుల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు అవసరం) అనే నినాదంతో ఈనెల 15 వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిగి సత్యనారాయణ తెలిపారు. జి.మాడుగులలో సీపీఐ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ – మార్పు అవసరం ర్యాలీ పోస్టర్లను శుక్రవారం కార్మిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న ధరలను తక్షణమే నియంత్రించాలని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సార్వత్రిక విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలకు పార్లమెంట్, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు ప్రజలందరూ పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏఎస్సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంతాల పండుబాబు, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు ప్రసాద్, సత్తిబాబు, బాబూరావు, జి. శ్రీనుబాబు, వి. శంకర్, కె. శ్రీను, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. -
జీవో నంబరు 3 ఎక్కడ? చంద్రబాబు హామీ ఏమైంది?
● తక్షణం అమలు చేయల్సిందే ● పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం డిమాండ్ సాక్షి, పాడేరు: ఎన్నికలకు ముందు అరకు సభలో ఇచ్చిన హామీ మేరకు జీవో నంబరు 3ను పునరుద్ధరించి, ప్రత్యామ్నాయ జీవో ద్వారా గిరిజనులకు వందశాతం ఉద్యోగాలు కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. ఆదివాసీ అరణ్య గర్జనకు మద్దతుగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శుక్రవారం పాడేరులో ర్యాలీ నిర్వహించారు. గిరిజన చట్టాల పరిరక్షణ, వందశాతం ఉద్యోగాల జీవో పునరుద్ధరణ డిమాండ్తో ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వందశాతం ఉద్యోగాల జీవోను అమలు చేసే బాధ్యత సీఎం చంద్రబాబుపైనే ఉందన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గిరిజనుల పక్షాన పోరాటాలు తప్పవు : జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర జీవో నంబరు3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం గిరిజనుల పక్షాన పోరాటాలు తప్పవని ఉమ్మడి ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వందశాతం ఉద్యోగాలు లేకపోవడంతో ఆదివాసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిరుద్యోగ సమస్య అధికమైందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ జీవో నంబరు3ను పునరుద్ధరించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిందని ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సీఎం చంద్రబాబు జీవో నెం.3పై ఇచ్చిన హామీని నిలబెట్టుకుని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మాజీ జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, ఎస్టీ సెల్ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు కమ్మిడి అశోక్, సందాడి కొండబాబు, పాడేరు, అరకు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. -
భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం
● సిలిండర్కు అదనంగా రూ.80 వసూలు ● మాడుగుల నుంచి ఎస్.కోట గ్యాస్ఏజెన్సీకి మార్చాలని గిరిజనుల విన్నపం డుంబ్రిగుడ: భారత్ గ్యాస్ వినియోగదారుల కష్టాలు ఇంకా తీరడం లేదు. మండలంలోని వి. మాడుగుల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసిన నెల, రెండు నెలలకు సిలిండర్ అందజేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం భారత్ గ్యాస్ సిలిండర్ ధర రూ.950 ఉండగా, మాడుగుల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.1,030 వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కో సిలిండర్పై రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానికులు ప్రశ్నించగా.. మీ ఇష్టం.. మీరు ఎవరికి ఫిర్యాదు చేసినా మాకు ఏమీ కాదు. మేము అందించే గ్యాస్కు రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నాం.. అని ఏజెన్సీ నిర్వాహకులు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎస్.కోటలోని లక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వారు రూ.950 మాత్రమే తీసుకుంటుండగా, మాడుగుల గ్యాస్ ఏజెన్సీ వారు రూ.1,030 వసూలు చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్యాస్ కనెక్షన్లను ఎస్.కోట ఏజెన్సీకి మార్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మాడుగుల గ్యాస్ వాహనాన్ని డుంబ్రిగుడ వైపు రానివ్వబోమని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, గ్యాస్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆకర్షణీయమైన చాయ
గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపుకు మంచి నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన చాయ ఉంటుంది. దీంతో మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వారపు సంతలకు వచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నారు. పసుపు సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం గిరిజన రైతులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలి. దీనివల్ల గిరిజన రైతులు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ కల్పించాలి. – కిల్లో లక్కు, పసుపు రైతు, పనస, ముంచంగిపుట్టు మండలం -
డీఈవో హామీతో గింజర్తిలో దీక్షలు విరమణ
కొయ్యూరు: కలెక్టర్ ఆదేశాలతో డీఈవో భానుమూర్తిరాజు హామీ మేరకు శుక్రవారం సాయంత్రం గింజర్తి గ్రామస్తులు, విద్యార్థులు దీక్షలను విరమించారు. సోమవారం నాటికి 3, 4, 5 తరగతులను గింజర్తిలోనే కొనసాగించే విధంగా రాతపూర్వక ఆదేశాలు రాకుంటే తిరిగి దీక్షలు ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. గింజర్తిలోనే పై తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, విద్యార్థులు వారం రోజులుగా ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశాంతి గురువారం రాత్రి 3, 4, 5 తరగతులను గింజర్తిలోనే యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించినట్లు గ్రామస్తులకు తెలిపారు. అయితే దీనిపై రాతపూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం కూడా దీక్ష కొనసాగించారు. దీంతో డీఈవో భానుమూర్తిరాజు ఎంఈవో సింహాచలానికి ఫోన్ చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో రాతపూర్వక ఆదేశాలు వస్తాయని, విద్యాశాఖ కమిషనర్ తరగతులను గింజర్తిలో కొనసాగించేందుకు అంగీకరించారని గ్రామస్తులకు వివరించారు. రెండు రోజుల్లో ఆదేశాలు పంపిస్తామని హామీ ఇచ్చారు.దీంతో గ్రామస్తులు సోమవారం వరకు ఆదేశాల కోసం వేచి చూస్తామని తెలిపారు. అప్పటిలోగా రాతపూర్వక ఆదేశాలు రాకుంటే తిరిగి దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాతపూర్వక ఆదేశాలు రాకుంటే మళ్లీ దీక్షలు -
వర్తకుల సంక్షేమానికి ప్రాధాన్యం
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: జిల్లాలో వర్తకుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన దుకాణదారుల ప్రత్యేక ఫిర్యాదుల కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు, రుణాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో బ్యాంకుల సహకారంతో రుణ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. అరకు, చింతపల్లిలోని ఎంఎస్ఎంఈ షాపింగ్ కాంప్లెక్స్ల్లో అర్హులైన ఔత్సాహికులకు దుకాణాలు కేటాయిస్తామని చెప్పారు. దుకాణదారులు, వీధి వ్యాపారులు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలని, గడువు ముగిసిన సామగ్రిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలో వీధి దీపాల పునరుద్ధరణ, పాడేరు శ్మశానవాటికలో మౌలిక వసతుల కల్పనపై వర్తకుల వినతులకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏఎస్పీ శృతి మాట్లాడుతూ వ్యాపారులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, పోలీసుశాఖతో సమన్వయం పెంచుకుని భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఆర్డీవో భుజంగరావు, డీపీవో చంద్రశేఖర్, సచివాలయాల నోడల్ అధికారి పీఎస్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్యమే ముఖ్యం..సాధనే ఆయుధం!
● విద్యార్థినులకు ఎస్పీ అమిత్ బర్దర్విలువైన సూచనలు చింతపల్లి: కష్టాన్ని ఇష్టంగా మలచుకుని చదివితే ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతరం సాధన చేయాలని సూచించారు. గురువారం చింతపల్లిలోని అమరావతి వృత్తి విద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఎస్పీ సందర్శించారు. విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించి, వారితో మాట్లాడారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
హెల్ప్లైన్ కోఆర్డినేటర్గా జానకిరావు
పాడేరు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్గా డాక్టర్ పి. జానకిరావు బాధ్యతలు స్వీకరించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జిల్లా పేర్లు, ఇతర వివరాలు కనిపించకపోయినా విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించి పూర్తిస్థాయి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. అందరి సహకారంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని జానకిరావు పేర్కొన్నారు. -
డ్రోన్తో విత్తన బంతులు!
● నాలుగు వేలు వెదజల్లిన అటవీశాఖ చింతపల్లి: లోతుగెడ్డ రేంజ్ పరిధిలో సామాజిక అడవుల పెంపకానికి డ్రోన్ ద్వారా విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డీఎఫ్వో నరసింహారావు ఆదేశాల మేరకు గురువారం చెరుకుంపాకలు, లోతుగెడ్డ బీట్ అటవీ ప్రాంతాల్లో వెదురు, కానుగ, చింత తదితర మొక్కల 4 వేల విత్తన బంతులను డ్రోన్ ద్వారా వెదజల్లారు. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో అప్పారావు, ఎఫ్బీవో లక్ష్మీనారాయణ, ఏబీవో విజయనాగరత్నం, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీలో మన్యం సత్తా!
● మాతోట స్టాల్కు విశేష ఆదరణ ● గిరిజన ఉత్పత్తులకు ప్రశంసలు చింతపల్లి: మాతోట ట్రైబుల్ ఫార్మింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్, నేచురల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోలో గిరిజన ఉత్పత్తుల స్టాల్కు విశేష ఆదరణ లభించిందని గిరిజన వికాస్ సొసైటీ కార్యదర్శి నెల్లూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపారు. మాతోట స్టాల్ను భారత సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్పర్సన్ సంగీతా విశ్వనాథన్, సీఈవో ఎం.ఎస్. మణివన్ సందర్శించారు. స్టాల్లో గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పసుపు, మిరియాలు, కాఫీ, రాజ్మా తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. విశాఖ మన్యంలో కాఫీ, పసుపును అధికంగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నామని మాతోట సీఈఓ చిన్నారావు వివరించారు. గిరిజన ప్రాంత ఉత్పత్తులపై ఆసక్తి చూపిన అధికారులు మాతోట సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రా–ఒడిశా స్పైస్ బోర్డు ప్రతినిధి కళ్యాణి పాల్గొన్నారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్టు
ముంచంగిపుట్టు: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద ఎస్పీ నాని ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ బ్లాక్ నుంచి 1,373.72 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్ మలిసాహి గ్రామానికి చెందిన మాధబును గురువారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎస్పీ అమిత్ బర్థర్ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. గంజాయి రవాణా, సాగులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎస్ఐ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
గిరిజన సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జిరెడ్డి ఆదేశించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు సునీత, మల్లేశ్వరరావు, కృష్ణారావు, కిల్లో సాయిరామ్ గురువారం కలెక్టరేట్లో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ తెలిపారు. ఆయా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని, అటవీ హక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, ఏఎస్పీ శృతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో భుజంగరావు, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి -
జనావాసాల్లోకి అడవి గొర్రె
దేవరాపల్లి: దేవరాపల్లిలో గురువారం సాయంత్రం జనావాసాల్లోకి అడవి గొర్రె ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అటవీ ప్రాంతంలో సంచరించే అడవి గొర్రె జనావాసాల్లోకి రావడంతో వీధి కుక్కలు తరుముతుండగా స్థానిక వైఎన్ కాంప్లెక్స్లో ప్రజలు చూసి దానిని రక్షించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జీనబాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్.రాజుబాబు నేతృత్వంలో జీనబాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి. శివకుమార్, బీట్ ఆఫీసర్ పి. సాయి ప్రణీత్తోపాటు బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు జె. సత్యనారాయణ, పి.దుర్గారావు దేవరాపల్లి చేరుకొని అటవీ గొర్రెను స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దానిని విడిచి పెట్టారు. -
క్లాసుల్లేని క్యాంపస్!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధనా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వర్సిటీ యాజమాన్య నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక సంస్థపై విజిలెన్స్ విచారణ మకిలి అంటించి, ఉన్నత విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని మేధావులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ యాక్ట్ 91 ప్రకారం గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వర్సిటీ ప్రతిష్ట కోర్టు మెట్లెక్కినా వెనక్కి తగ్గకుండా యాజమాన్యం దూకుడుగా వ్యవహరించడంపై గవర్నర్ కార్యాలయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఏయూలో చర్చ జరుగుతోంది. నాక్ కోసం వాడుకుని.. నడిరోడ్డున పడేశారు! గతంలో ఏయూలో అధ్యాపకుల కొరత వేధిస్తున్న సమయంలో, నాక్ ప్రమాణాలను కాపాడుకోవడంతో పాటు విద్యార్థులకు బోధనా లోపం రాకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదంతో 2022, 2023లలో అడ్హాక్ అధ్యాపకులను నియమించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల ద్వారా పారదర్శకంగా వీరందరినీ ఎంపిక చేశారు. ఇంజినీరింగ్, లా, జియాలజీ, పర్యావరణ శాస్త్రం, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి సెల్ఫ్ సపోర్ట్ కోర్సులకు వీరే ప్రధాన బోధకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకున్నా, సాధారణ సిబ్బంది జీతాలతో సంబంధం లేకుండా.. వీరు నిర్వహించే కోర్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల లాగా వీరికి ఎలాంటి రీసెర్చ్ ఫండ్స్ కానీ, కాన్ఫరెన్స్ అలవెన్సులు కానీ ఉండవు. అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడేళ్లకు పైగా నిబద్ధతతో పనిచేసిన 25 మందికి పైగా అధ్యాపకులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఉన్నపళంగా పక్కనబెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఒకరికి రెన్యువల్.. మరొకరిపై కక్షసాధింపా? ఇటీవల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సేవల రెన్యువల్ ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం, సుమారు 40 మంది వరకు ఉన్న అడ్హాక్, అడ్జంక్ట్ అధ్యాపకులకు మాత్రం రెన్యువల్ నిలిపివేసింది. ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధిత అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 29న అడ్హాక్ అధ్యాపకులకు, జులై 31న అడ్జంక్ట్ అధ్యాపకులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మనీష్ గుప్తా వర్సెస్ అదర్స్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రస్తావిస్తూ ‘ఒక కాంట్రాక్టు లేదా అడ్హాక్ ఉద్యోగి స్థానంలో మరో కాంట్రాక్టు, అడ్హాక్ ఉద్యోగిని భర్తీ చేయకూడదు. ఆ ఖాళీలను శాశ్వత పోస్టుల ద్వారా మాత్రమే నింపాలి’ అని స్పష్టం చేస్తూ, వీరిని తక్షణమే విధుల్లో కొనసాగించాలని ఆదేశించింది. అయినప్పటికీ, వర్సిటీ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను అమలు చేయకపోతే వర్సిటీ ఉన్నతాధికారులను నేరుగా కోర్టుకు పిలిపిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? అధికారుల పంతాలు, పట్టింపుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన నెల రోజులుగా సంబంధిత విభాగాల్లో బోధన పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ఏయూ క్యాంపస్కు వస్తున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సిలబస్ పూర్తికాక, మరోవైపు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభసాటిగా నడుస్తున్న స్వయం ఆర్థిక కోర్సులను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఏయూ అధికారుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
సింహగిరిపై వరుణ జపాలు
సింహాచలం: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు శ్రీ త్రిపురాంతకస్వామి ఆలయంలో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుణ జపాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, త్రిశూలార్చన, రుష్యశృంగ ఆవాహన, దీక్షాధారణ, వేద పారాయణాలు, రుత్విగ్వరణం, వరుణ జపాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణం, వేద పారాయణాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చూర్ణికా పఠనం, ఆలయ బలిహరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొని వేద పండితులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. దేవస్థానం వేద పండితుడు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గ్రామాల్లో బురదనీరు సరఫరా
గొలుగొండ: కొత్తజోగుంపేటతోపాటు పలు గ్రామాల్లో గురువారం బురదనీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తజోగుంపేట, శ్రీరాంపురం, గొలుగొండ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా బురదతో తాగునీరు సరఫరా అయింది. పైపులు లీకేజు వల్ల ఇలా వచ్చినట్టు ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులు నుంచి ఇదే పరిస్థితి ఉందని పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. బురదనీరు తాగడానికి ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే!
పాడేరు : డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన స్కాంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ లీకేజీ, ఇతర అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం పాడేరు పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు దీక్షల్లో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు పసుపులేటి బాలరాజు, పాడేరు, జి.మాడుగుల మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు నల్ల కండువాలు ధరించి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరితమైన హామీలతో కాలయాపన చేసే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు శాంతియుత ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. అదే విధంగా 2025 డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో భాగంగా ఈ నెల 7న పాడేరులో నిర్వహించే అరణ్య గర్జన, 8న చేపట్టనున్న రాష్ట్ర మన్యం బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొంటుందని తెలిపారు. ఆదివాసీల ప్రయోజనాల కోసం ఎవరైనా చేపట్టే ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో సహా వివరాలను ప్రజల ముందుంచారని తెలిపారు. అయినప్పటికీ బాధ్యులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో 16 వేల ఉద్యోగాల భర్తీలోనే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారని బాలరాజు ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకంగా 1.50లక్షల శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశారని ఆనాడు ఒక్క తప్పటడుగు కూడా వేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దక్కేలా సక్రమంగా నిర్వహించారన్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతంలో 80 మందికి మంచి ఉపాధ్యాయ ఉద్యోగాలు రాలేదని కానీ మంత్రి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్ గిరిజనులకు ఏకంగా 2వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని పదేపదే అబద్దాలు చెబుతున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేల మంది గిరిజన అభ్యర్థులకు శతశాతం ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందేనన్నారు. డీఎస్సీలో అర్హత గల అభ్యర్థులకు న్యాయం జరిగింతే వరకు వైఎస్సార్సీపీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు,జి. మాడుగుల వైఎస్సార్సీపీ మండల అద్యక్షులు సీదరి రాంబాబు, నుర్మానీ మత్య్సకొండం నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా కార్యదర్శి వి. సీతారం నాయుడు, వైస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, కుంతూరు కనకాలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాంగి అంద్రయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పండన్న, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పాడేరు, జి. మాడుగుల మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీ, తాజా మాజీ సర్పంచ్లు, పార్టీలోని అన్ని అనుబంధ విభాగాల నాయకులు, పలువురు నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలిరిలే దీక్షలు విజయవంతంసాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలపై సీబీఐతో విచారణ, మంత్రి లోకేష్ పదవికి రాజీనామా డిమాండ్లతో గురువారం జిల్లాలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరహార దీక్షలు విజయంతం అయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం పాడేరులోను,అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో నియోజకవర్గం కేంద్రం అరకులోయలోను రిలే దీక్షలు చేపట్టారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో కాలయాపన చేస్తోందని ధ్వజం పాడేరులో రిలే నిరాహార దీక్షలుప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిరసన అరకులోయ టౌన్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గురువారం అరకులోయలోని వైఎస్సార్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. 2025 డీఎస్సీలో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులకు రాత పరీక్ష లేకుండా అనర్హులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టారని ఆరోపిస్తూ, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ 2025 డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తోందన్నారు. నారాయణ కళాశాల, లోకేష్కు చెందిన బంధువుల కళాశాల నుంచి నకిలీ ధ్రువపత్రాలు పొందిన వారికి స్పోర్ట్స్ కోటా సృష్టించి పోస్టులు కట్టబెట్టారన్నారు. చేతకాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.భోగాపురం విమానాశ్రయంలో గిన్నిస్ రికార్డు సాధించడంలో కీలకమైన గిరిజన విద్యార్థులు, మహిళలకు ధ్రువపత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. దీనికి మంత్రి సంధ్యారాణి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పదవులకు రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్, రాష్ట్ర విద్యార్ధి విభాగం జనరల్ సెక్రటరీ నాగభూషణ్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్కుమార్, నియోజకవర్గం గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు వెంకట పూర్ణిమ, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, జయవర్ధిని, శత్రుఘ్న, స్వాభి రామచందర్, నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, పాంగి అనిల్ కుమార్ మజ్జి చంద్రుబాబు, మండల ఉపాద్యాక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, జి. ప్రకాష్రావు, పార్టీ జిల్లా కార్యదర్శి బాక సింహాచలం, జిల్లా జనరల్ సెక్రటరీ పాంగి నర్శింగరావు, మాజీ సర్పంచ్లు కిముడు హరి, దురియా భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేగ బోయిన స్వామి, పార్టీ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, మాజీ ఎంపీటీసీ బూర్జ సుందర్రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎల్బీ కిరణ్ కుమార్, ఎంటీఆర్ సాంబయ్య, నర్సింహమూర్తి, బాలరాజు, పాంగి నాగేశ్వ రరావు, కొండలరావు పాల్గొన్నారు. -
గిరిజన గురువుకు డాక్టరేట్!
● ఆదివాసీ సాహిత్యంపై పరిశోధన.. భూషణం కథలపై పీహెచ్డీ ముంచంగిపుట్టు: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి న ఓ ఉపాధ్యాయుడు పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీకి చెందిన వంతినిభ బాలాజీ ప్రస్తుతం హుకుంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల ఆదివాసీ సాహిత్యంపై అధ్యయనం చేశారు. అనంతరం ఆచార్య జర్రా అప్పారావు ఆధ్వర్యంలో భూషణం కథలు–ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పూర్తి చేశారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పరిశోధన కొనసాగించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన బాలాజీని కిలగాడ గ్రామ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే మేలు
జి.మాడుగుల : మండలంలోని పలు గ్రామాల్లో సాగుపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు గురువారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకురాలు డాక్టర్ డి. ఆదిలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలహుస్సేన్రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి గాయత్రి సంయుక్తంగా గొడ్డువలస, ఎం.నిట్టాపుట్టు గ్రామాల్లో పర్యటించారు. వర్షాల పరిస్థితులను బట్టి రైతులు పంటల ఎంపిక, సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ నెల మొదటి పక్షంలోపు వర్షాలు కురిసి నీరు అందుబాటులోకి వస్తే 40–45 రోజుల వయస్సున్న ముదురు నారును దగ్గరగా నాటుకోవాలని తెలిపారు. ఎరువులు వినియోగించే రైతులు ఎకరాకు ఒక బస్తా డీఏపీని నాటే ముందు దమ్మలో వేయాలని, 20 రోజుల తర్వాత మరో 20 కిలోల యూరియా వేయాలని సూచించారు. వర్షాలు ఆలస్యమైతే వరి సాగును నిలిపివేసి రాగిని నేరుగా వెదజల్లడం లేదా నారు పోసుకుని సాళ్లలో నాటుకోవాలని సూచించారు. రాగిలో అంతర పంటగా కంది సాగు చేయాలనుకునే రైతులు ప్రతి ఐదు సాళ్ల రాగికి ఒక సాలు కంది చొప్పున 5:1 నిష్పత్తిలో వేసుకోవచ్చన్నారు. పెసర, మినుములు వంటి ఆరుతడి పంటలను కూడా సాగు చేయవచ్చని తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. -
డిఫెన్స్ మద్యం పట్టివేత
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలెం సమీపంలో గురువారం రూ.3లక్షల విలువైన డిఫెన్స్ మద్యాన్ని తరలిస్తున్న కారు సీజ్ చేశామని జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.ఈశ్వరరావు వెల్లడించారు. మద్యం కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ముందస్తు సమాచారం మేరకు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ కిరణ్కుమార్, సిబ్బంది అప్రమత్తమై మద్యం తరలిస్తున్న కారు పట్టుకున్నారని తెలిపారు. మాకవరపాలెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని కారులోతరలిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులను గమనించి కారు దిగి పరారయ్యాడు. కారుడ్రైవర్ జెర్రిపోతుల గోవిందరావును అదుపులోకి తీసుకున్నారు. కారులో ఎనిమిది రకాల బ్రాండ్లకు సంబంధించిన 44 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పలనాయుడు కోసం గాలిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సారా తయారీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలో ఎనిమిది మందిని బైండోవర్ చేసి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించామన్నారు. -
రైలు, రోడ్డు, పోర్టు అనుసంధానమే కీలకం
మహారాణిపేట: ఓడరేవులు, లాజిస్టిక్స్ ఒకే నాణేనికి రెండు వైపులని, సముద్ర మార్గాలు, పారిశ్రామిక కేంద్రాలు, అంతర్గత మార్కెట్ల మధ్య సరుకు రవాణాను సమర్థవంతంగా అనుసంధానించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యులు దేవేంద్ర కుమార్ అన్నారు. సీఐఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నోవోటెల్లో నిర్వహించిన సీఐఐ కాన్ఫరెన్స్ ఆన్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్–2వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ అనేక సంస్కరణలు చేపట్టిందని, వాటి వల్ల ఓడరేవులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశాఖలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు వల్ల నిర్ణయాల ప్రక్రియ వేగవంతమై, స్థానిక లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్లో కంటైనరైజేషన్, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఓడరేవులు–రైల్వేలు–రోడ్ల సమన్వయమే సరుకు రవాణా అభివృద్ధికి కీలకమని చెప్పారు. సీఐఐ విశాఖ జోన్ చైర్మన్ జి.కృష్ణమోహన్, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు, ఏపీ మారిటైమ్ బోర్డు రైల్వే–లాజిస్టిక్స్ సలహాదారు ఆర్.ధనంజయులు, విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రధాన, ఐదు చిన్న ఓడరేవులు కలిసి ఏటా సుమారు 30 కోట్ల టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నాయని ధనంజయులు తెలిపారు. కార్యక్రమంలో సీఐఐ విశాఖపట్నం జోన్ వైస్ చైర్మన్ నిలేష్ అగర్వాల్, భద్రతా కార్యకలాపాల సలహాదారు శ్రీనివాస్ నందూరి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎ. నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సీజీఎస్టీ అదనపు కమిషనర్ బలరామ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెప్టెన్ ఎస్. దివాకర్, స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజశేఖర్, జీఎంఆర్ గ్రూప్ రీజినల్ కార్గో బిజినెస్ సీఈఓ ప్రసాద్, విజయనగరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఐఐ సదస్సులో రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యులు దేవేంద్ర కుమార్ -
నేను కూడా అవయవదానం చేస్తా...
నర్సీపట్నం: నా అవయవాలను దానం చేసి..ఎనిమిది మందికి పునర్జన్మనిస్తానని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. జాతీయ అవయవదాన పక్షోత్సవాల్లో భాగంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవయవ దానం చేయాలనుకుంటున్నానని భార్య, కుమార్తెకు చెప్పడంతో అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. అవయ దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ లాంటి మత్తుకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని కోరారు. రక్తదానం, నేత్రదానం, అవయవ దానం లాంటి సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అవయవ దానం ట్రస్ట్ ప్రతినిధులు శివాజీ, బేరా బాబ్జి, బాబీ మాస్టర్ పాల్గొన్నారు. -
గింజర్తిలో వంటా వార్పు..!
కొయ్యూరు: గింజర్తిలోనే 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షా శిబిరం వద్ద వంట వార్పు నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఆదర్శ పాఠశాలల పేరుతో గింజర్తిలో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను తొలుత చింతలపూడికి, అనంతరం లొద్దిపాకలకు తరలించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం గత ఏడాది నుంచి కలెక్టర్కు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో రిలే దీక్షలకు దిగారు. రెండు రోజుల క్రితం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఎంఈవో ద్వారా గింజర్తి గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడారు. 3, 4, 5 తరగతులను గింజర్తిలో కొనసాగించేలా విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తాయని, కమిషనర్తో మాట్లాడినట్లు తెలిపారు. దీక్షలు విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. గింజర్తి గ్రామస్తులు, విద్యార్థులు చేస్తున్న దీక్షలకు గురువారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇలావుండగా 3,4,5 తరగతు లు కొనసాగించేలా కలెక్టర్ నిశాంతి ఉత్తర్వులు ఇచ్చారని ఎంఈవో సింహాచలం తెలిపారు. తరగతుల కోసం తల్లిదండ్రుల పోరుబాట -
బస్ కాంప్లెక్స్ స్థలం పంచాయతీకి కేటాయించాలి
ఎస్.రాయవరం: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బస్కాంప్లెక్స్ స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలని గ్రామానికి చెందిన సోమిరెడ్డి రాజు హైకోర్టులో కేసు వేసినట్టు చెప్పారు. నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న 25 సెంట్లు స్థలాన్ని అప్పటి రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పంచాయతీ నుంచి 25 ఏళ్ల క్రితం స్థలం కేటాయించారు. ఆ తరువాత ఆర్టీసీ యాజమాన్యం బస్కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు బస్కాంప్లెక్స్, స్థలం ప్రయాణికులకు ఉపయోగపడలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయోజనాలకు అవసరం లేనందున తిరిగి ఈ స్థలం పంచాయతీ కేటాయించాలని పలుమార్లు అనకాపల్లి డిపో అధికారులకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ స్థలాన్ని తిరిగి గ్రామానికి కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోర్టు వారిని కోరుతున్నట్టు సోమిరెడ్డి రాజు చెప్పారు. రేపు మెగా జాబ్ మేళామహారాణిపేట(విశాఖ): జిల్లా ఉపాధి కార్యాలయం (టెక్నికల్–క్లరికల్), నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. కంచరపాలెంలోని గర్ల్స్ ఐటీఐ క్యాంపస్లోని జిల్లా ఉపాధి కార్యాల య ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. టీసీఐ, ఇన్నో వ్ సోర్స్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్కార్ట్, డీమార్ట్, ఫాక్స్కాన్, గ్లోరీ వెండర్, శుభగృహ, వరుణ్ మోటార్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపిటోరియా తదితర సంస్థలు ఇందు లో పాల్గొంటాయి. అసిస్టెంట్ సూపర్వైజర్, సేల్స్మేనేజర్, క్యాషియర్,లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటి వ్, ఫార్మసిస్ట్, టెలికాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఐఫోన్ అసెంబ్లింగ్ ఆపరేటర్, జూనియర్ కెమిస్ట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. -
దేవరాపల్లిలో పట్టపగలే భారీ చోరీ
దేవరాపల్లి: దేవరాపల్లిలో పట్టపగలే దొంగతనం జరిగింది. దేవరాపల్లి నుంచి బంగారమ్మ వెళ్లే రోడ్డుకు సమీపంలోని చొక్కాకుల ఎరుకునాయుడు ఇంటిలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ బుధవారం దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల కథనం మేరకు చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి చెందిన చొక్కాకుల ఎరుకునాయుడు దంపతులు కూలి పనికి, పిల్లలకు స్కూల్కి వెళ్లిపోవడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగలకొట్టి అందులో భద్రపరిచిన సుమారు 4 తులాల బంగారు అభరణాలు, సుమారు 20 తులాల వెండి పట్టీలు, సుమారు రూ.30 వేలు నగదును అపహరించుకుపోయారు. బాధితుడి చిన్న కుమార్తె యామిని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్లింది. ఇంట్లో బీరువా తలుపులు తీసి ఉండడాన్ని గమనించి కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే వాళ్లు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో దాచుకున్న బంగారు, వెండి అభరణాలు లేక పోవడంతో బోరున విలపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఎరుకునాయుడు, భార్య దేముళ్లమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ఇంటిని బుధవారం కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసర ప్రాంతంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలను సేకరించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
స్టీల్ప్లాంట్ టౌన్షిప్కు భూములిచ్చేది లేదు
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు గునిపూడి లక్ష్మీదేవి కొండపై భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ఈ భూములు సాగు చేసుకుంటున్న సాగుదారులు స్పష్టం చేశారు. టౌన్షిప్కు భూములు కేటాయించడాన్ని నిరసిస్తూ సాగుదారులు చేస్తున్న నిరసన వంటావార్పు కార్యక్రమం ఆరోరోజు కొనసాగింది. బుధవారం ఈ దీక్షలో పాల్గొన్న సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో పేదలకు ఈ భూములు తప్ప వేరే దారిలేదన్నారు. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. స్టీల్ప్లాంట్ కోసం ఈ భూములు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పట్టాలు ఇస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం పొందే అవకాశం ఉందని లబ్ధిదారులు పట్టాలు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిబంధనలు ఒప్పుకోవంటూ తిరస్కరించిందన్నారు. ఇవే భూములు టౌన్షిప్ కోసం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎట్టిపరిస్దితుల్లో ఈ భూములను స్టీల్ప్లాంట్ టౌన్షిప్కొరకు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సాయంతో ఏదైనా చేయొచ్చనే మొండి వైఖరితో ప్రభుత్వం ఉందన్నారు. సాగుదారులు ప్రాణాలకు తెగించి ఈ భూములను కాపాడుకుంటారని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతు సంఘనాయకులు ఎం.రాజేష్, డి.కృష్ణ, బి.బాబ్జి, ముసలయ్య, బి.నాయుడు, చంటిబాబు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో జేసీ ఆకస్మిక తనిఖీ
జి.మాడుగుల: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలతో పాటు బందవీధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల చదువు తీరు, ఆరోగ్య పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడిన జేసీ.. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరవుతున్నారా? లేదా? అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల ఫేషియల్ అటెండెన్స్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు రగ్గులు, పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది. -
గిడ్డి ఈశ్వరికి గండం.!
● ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలంటూ సంతకాల సేకరణ ● చేతులు కలిపిన మాజీ మంత్రి మణికుమారి, కిల్లో రమేష్, ప్రసాద్ ● ఆమెని కొనసాగిస్తే.. పార్టీ మనుగడ కష్టమంటున్న నేతలు ● గిడ్డిని తొలగించి.. ఎవరికి ఇచ్చినా.. పనిచేస్తామంటూ అల్టిమేటం ● గతంలో రాష్ట్ర కార్యదర్శి పదవిని కొట్టగుళ్లి సుబ్బారావుకు ఇవ్వాలని భావించిన అధిష్టానం ● ఆయనకు ఇవ్వొద్దంటూ సంతకాలు సేకరణ చేపట్టి నిలిపేసిన గిడ్డి ● ఇప్పుడు అదే అస్త్రాన్ని గిడ్డిపై సంధిస్తున్న తిరుగుబావుటా నేతలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాడేరు టీడీపీలో ముసలం మొదలైంది. ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి గిడ్డి ఈశ్వరిపై అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ‘ఈమె మాకొద్దు’ అంటూ సొంత పార్టీ నేతలే కుంపటి రాజేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని, ఇన్చార్జిల బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలంటూ తిరుగుబావుటా ఎగురవేశారు. సుదీర్ఘకాలంగా రగులుతున్న వర్గపోరు ఇప్పుడు బాహాటంగా రచ్చకెక్కింది. ప్రస్తుత ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష వ్యవహారశైలితో విసిగిపోయిన అసమ్మతి వర్గం ఏకంగా ఆమెని తప్పించాలంటూ గిడ్డి ఈశ్వరి మొదలుపెట్టిన సంతకాల సేకరణ అస్త్రాన్ని.. తిరిగి ఆమైపెనే సంధిస్తున్నారు. ‘గిడ్డి ఈశ్వరి నాయకత్వం మాకొద్దు.. ఆమెను ఇన్చార్జిగా కొనసాగిస్తే ఏజెన్సీలో పార్టీ మనుగడకే ముప్పు’ అంటూ సీనియర్ నేతలంతా ఏకతాటిపైకి రావడం పాడేరు టీడీపీలో కలకలం రేపుతోంది. ఎన్నాళ్లుగానో నివురుగప్పినట్లున్న అసంతృప్తి ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలైంది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న వర్గాలను ఏకం చేయాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, తానే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విమర్శలు గిడ్డిపై తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న పాడేరు రాజకీయాల్లో.. ఏకంగా ఇన్చార్జిని తప్పించాలంటూ పోరుబాట పట్టారు. రేగుతున్న అసమ్మతి జ్వాలలు.! పాడేరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్న ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతోంది. తాజాగా ఇన్చార్జి గిడ్డి ఈశ్వరికి వ్యతిరేకంగా పార్టీలోని కీలక నేతలంతా ఏకమయ్యారు. మాజీ మంత్రి మణికుమారి, సీనియర్ నేతలు కిల్లో రమేష్ నాయుడు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు చేతులు కలిపారు. ఈశ్వరిని బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఏకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న అసమ్మతి నేతలు, క్యాడర్ నుంచి మద్దతు కూడగడుతూ అధిష్టానానికి పంపేందుకు ఈ సంతకాలు ముమ్మరంగా సేకరిస్తున్నారు. ఆమె వాడిన అస్త్రాన్నే.. ఆమైపె ప్రయోగం.! రాజకీయాల్లో ఎవరికి ఎదురైన అనుభవం వారికే తిరిగి రాకమానదన్న చందంగా ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పరిస్థితి తయారైంది. గతంలో రాష్ట్ర కార్యదర్శి పదవిని అధిష్టానం కొట్టగుళ్లి సుబ్బారావుకు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఆ సమయంలో సుబ్బారావుకు ఆ పదవి ఇవ్వొద్దంటూ గిడ్డి ఈశ్వరి ఇదే తరహాలో సంతకాల సేకరణ చేపట్టారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఆయనకి ఆ పదవి రాకుండా చెయ్యడంలో అప్పట్లో ఆమె సఫలమయ్యారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని అస మ్మతి నేతలు ఆమైపెనే సంధించడం గమనార్హం. నా డు సుబ్బారావుపై ప్రయోగించిన ‘సంతకాల’ అస్త్రమే, నేడు గిడ్డి ఈశ్వరికి ఇబ్బందికరంగా మారిందని స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమెను కొనసాగిస్తే కష్టమే.. అధిష్టానానికి అల్టిమేటం.! గిడ్డి ఈశ్వరి నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ మనుగడ కష్టమని ఈ అసమ్మతి వర్గం కుండబద్దలు కొడుతోంది. ఆమె ఏకపక్ష నిర్ణయాలు, క్యాడర్తో సఖ్యత లేని ఒంటెద్దు పోకడల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోతోందని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘గిడ్డి ఈశ్వరిని తక్షణమే ఇంచార్జి పదవి నుంచి తొలగించాలి. ఆ స్థానంలో పార్టీలోని మరెవరికి బాధ్యతలు అప్పగించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కానీ, ఆమెను మాత్రం కొనసాగిస్తే సహించేది లేదు’ అంటూ అధిష్టానానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. దీంతో పాడేరులో వర్గ విభేదాలు రచ్చకెక్కినట్లయింది. -
వానొస్తే నరకయాతనే
నర్సీపట్నం: వానొస్తే పట్టణం జలమయమవుతోంది. పల్లపు ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునగడంతో మరమ్మతులకు గురువుతున్నాయి. దీంతో నర్సీపట్నం వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నా పరిష్కార మార్గంపై అధికార యంత్రాంగం దృష్టిసారించకపోవడంతో ముంపు తప్పడం లేదు. డ్రైనేజీలు అధ్వానంగా ఉండడంతో మురుగునీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. డ్రైనేజీలు రహదారి కంటే ఎత్తుగా ఉన్నాయి. కొన్నిచోట్ల మురుగు కాలువకు, రహదారికి పొంతన లేకుండా ఉంది. డ్రైనేజీలు దాటి రహదారిపైకి వచ్చి దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీల ఆనవాళ్లే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో చిన్నపాటి వాన కురిసినా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. సుమారు 65 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇది 45 కిలో మీటర్లు మాత్రమే డ్రైనేజీలు ఉన్నాయి. ఇంకా 137 కిలో మీటర్ల మేర డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రైనేజీల నిర్మాణానికి రూ.77 కోట్లు అవసరమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు పదేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. చిన్నపాటి వర్షానికే.. కె.కోటపాడు : చిన్నపాటి వర్షానికే మండలంలోని వారాడ ప్రధాన వీధిలో వర్షం వర్షపునీరు నిలిచిపోతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్రోడ్డు నుంచి రామాలయానికి వెళ్లే మార్గం లోతట్టుగా ఉండడంతో వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బాధ్యతగా పనిచేయండి
● అధికారులు, సిబ్బందికికలెక్టర్ నిశాంతి ఆదేశం ● లక్ష్యసాధనపై సమీక్ష పాడేరు: జిల్లాలోని అన్ని శాఖల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా విధులకు హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా పనితీరు, లక్ష్యాల సాధన, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ఆమె సమీక్షించారు. గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వారం రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం గ్రామ సచివాలయాల హాజరు నివేదికను జాయింట్ కలెక్టర్కు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఏడీఎంహెచ్ఓలను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల్లో పురోగతి తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక నివేదికతో పాటు కార్యాచరణ ప్రణాళికను అందజేయాలని సూచించారు. జిల్లా అధికారులు తమ శాఖల సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లక్ష్యాలు, పురోగతి, పెండింగ్ అంశాలపై సమీక్షించాలని, సమావేశాల ఫొటోలను జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఏపీవో (పీవీటీజీ) వెంకటేశ్వరరావు, ఏవో హేమలతతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గెడ్డ ఆక్రమణలకు అడ్డేది?
నాతవరం: మండలంలోని పెదగొలుగొండ గ్రామం మధ్యలో ఉన్న వెర్రిగెడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారింది. కూటమి నాయకుల అండదండలతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వర్షం కురిసినప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా ఈ గెడ్డ ద్వారా బట్రాజు నీల చెరువులోకి చేరుతుంది. ఈ గెడ్డ గ్రామం మధ్యలో అర్అండ్బీ రోడ్డును ఆనుకుని ఉండడంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది భారీ భవనాలు నిర్మిస్తుండగా, మరికొంతమంది రేకులు షెడ్డు వేసుకుని, తర్వాత సిమెంట్ పిల్లర్లతో భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామం మధ్యలో ఉన్న ఈ స్థలానికి విపరీతమైన గిరాకీ ఉంది. గెడ్డను యథేచ్ఛగా కప్పేస్తుండడంతో చెరువులోకి ప్రవహించవలసిన నీరు నిలిచిపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గెడ్డను పూర్తిగా ఆక్రమిస్తే నీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణ ఆరికట్టాలని కోరుతున్నారు. ఆక్రమణదారుల మధ్య ఘర్షణ గెడ్డ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న సమయంలో ఆక్రమణదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం ఇద్దరి మధ్య స్థలం విషయంలో తీవ్ర వివాదం జరిగింది. దీంతో ఆర్అండ్బీ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలో సచివాలయంలో ఉన్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. -
ఇక మూడు జెడ్పీలు
మహారాణిపేట (విశాఖ): సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. గతంలో చేపట్టిన ఉమ్మడి జిల్లాల పునర్విభజన ఆధారంగా విశాఖ జెడ్పీని మూడు కొత్త జిల్లా పరిషత్తులుగా విభజిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్ 25 తర్వాత విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ల స్థాయిల్లో అధికారుల సంఖ్యను ఖరారు చేయడంతో పాటు, సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు. సుదీర్ఘ చరిత్రకు ముగింపు విశాఖ జిల్లా పరిషత్కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బ్లాక్ బోర్డుల ఆధారంగా జిల్లా పరిషత్ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్ 25న జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జె.సుభద్ర చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్కు తెరపడనుండగా.. మూడు కొత్త జిల్లా పరిషత్తులు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి. జిల్లాల విభజనతో కొత్త జెడ్పీలు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాను విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లా పరిషత్తుల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేసింది. ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్లో ప్రస్తుతం 63 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లా పరిషత్లో 65 మంది చొప్పున అధికారులు, సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో 13 మంది సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీని కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర పంచాయతీరాజ్ సంస్థల్లో కలిపి మొత్తం 876 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 39 మండల పరిషత్తులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, డ్రైవర్లు, నైట్ వాచ్మెన్లు తదితర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితాల తయారీ జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, ఇతర పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హతలు, కేడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్తులకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మూడు ముక్కలవ్వనున్న‘విశాఖ’ జిల్లా పరిషత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ఆహ్వానం 15 రోజుల్లో కొత్త జిల్లా పరిషత్తులకు కేటాయింపులు విశాఖపట్నం, అనకాపల్లి,అల్లూరి జెడ్పీల కోసం ప్రతిపాదనలు ప్రతి జెడ్పీకి 65 మంది, ప్రతి ఎంపీపీకి 13 మంది సిబ్బంది -
ఆన్లైన్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: అధిక లాభాల ఆశ చూపించి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ కంపెనీలో పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని కీలక నిందితుడిని తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధి కోసం దుబాయికి వెళ్లొచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రమణ తండాకు చెందిన భుక్యా నవీన్ అక్కడ తాను పనిచేసిన ఓ ఆన్లైన్ గేమింగ్ కంపెనీతో కుమ్మక్కయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన తమ్ముడు ప్రవీణ్తో కలిసి రామారెడ్డి ప్రాంత ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా అనేకమంది అమాయకులను టార్గెట్ చేశారు. వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి అధిక లాభాల ఆశ చూపిస్తూ లింకులను పంపి 7,636 మందితో రూ.కోట్లల్లో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. రామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గతనెల 31న నవీన్తో పాటు ప్రవీణ్లను రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు అలియాస్ రొంగలి ముత్యాలు నాయుడుగా గుర్తించారు. అతడిని డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు వాట్సాప్లో లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు. ఈ ముఠా బాధితుల పేర్లపై యూజర్ ఐడీలు సృష్టించి బ్యాంకు ఖాతాలు, క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు స్వీకరించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ద్వారా సాట్స్పోర్ట్స్, ఫ్యూచర్9.కామ్ వెబ్సైట్లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు లభించాయని వెల్లడించారు. ఈ ముఠాలోని మిగిలిన నిందితులు, వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని సైతం అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. -
పశువుల్లో బొబ్బలవ్యాధికి టీకాలు
మునగపాక: రైతులు సీజన్లో పశువులకు అంటు వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు వంవర్దక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కేఎల్ఎన్ స్వామి కోరారు. మండలంలోని ఒంపోలు గ్రామంలో జరుగుతున్న లంపీ స్కిన్ డిసీజ్(పశువుల బొబ్బల వ్యాధి) టీకాల కార్యక్రమాన్ని బుదవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు తీవ్రమైన జ్వరం , శరీరమంతా బొబ్బలు, మచ్చలు ఏర్పడడం, పొల దిగుబడులు గణనీయంగా తగ్గినట్టయితే వ్యాధి లక్షణాలుగా గుర్తుంచుకోవాలన్నారు. ఒక పశువు నుంచి వేరే పశువుకు వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఆవుజాతి పశువులన్నింటికీ టీకాలు వేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆవుజాతి పశువులకు ఎల్ఎస్డీ టీకాలు వేయించాలన్నారు. పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.గణేష్,పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ జ్యోత్స ్నతో పాటు పలువురు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విత్తన బంతులతో అటవీ అభివృద్ధి
సీలేరు: అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని సీలేరు రేంజ్ అధికారి ఎస్.వెంకటరావు తెలిపారు. సీలేరు రేంజ్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో బుధవారం డ్రోన్ ద్వారా 20 వేల విత్తన బంతులను వెదజల్లినట్లు ఆయన వెల్లడించారు. సీలేరు అటవీ పరిధిలోని ధర్మాపురం, నిమ్మలగొంది, తొకరాయి, బంధవీధి, కొమ్ములువాడ పరిసర అటవీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 1.20 లక్షల విత్తన బంతులను జాఫ్రా, చింత, నేరేడు, రావి, మర్రి, కానుగ, తురకవేప తదితర వృక్షాల విత్తనాలతో తయారు చేసి అటవీ ప్రాంతాల్లో వెదజల్లాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే జూలై నెలలో సిబ్బంది, ప్రజల సహకారంతో వివిధ అటవీ ప్రాంతాలు, రైతుల పొలాల్లో లక్ష విత్తన బంతులను విజయవంతంగా వెదజల్లినట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన 20 వేల విత్తన బంతులను డ్రోన్ సాయంతో వెదజల్లినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీలేరు రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు, ట్రైనీ రేంజ్ అధికారి మణికృష్ణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. రమణమ్మ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె. సతీష్తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చని పల్లెల్లో ధ్వంసరచన
దేవరాపల్లి: మండలంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాల విధ్వంసకాండ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు గ్రామాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎం.అలమండలో గాడి వారి కల్లాలకు వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో దాడి వారి కల్లాలకు సీసీ రోడ్డు నిర్మించి దశాబ్దాల రహదారి సమస్యను పరిష్కరించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఓ మూలన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽఉద్దేశ్య పూర్వకంగా ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన సంక్షేమాభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో ఉద్దేశ్య పూర్వకంగా ఽప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని గ్రామస్తులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై స్థానిక తాజా మాజీ సర్పంచ్ దాడి జగన్నాథరావు(జగన్) మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా గతంలో ఇదేవిధంగా దేవరాపల్లి సంతతోట వద్ద దేవరాపల్లి–చిననందిపల్లి తారు రోడ్డు నుంచి చేనులపాలేనికి రూ.1.21 కోట్లతో నిర్మించిన తారు రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽగత ఏడాది మార్చిలో దుండగులు ధ్వంసం చేశారు. పెదనందిపల్లి కాలనీలో సైతం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆయా ఘటనలపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శిలా ఫలకాల ధ్వంసం చేసే విష సంస్కృతిని తీసుకురావడం పట్ల మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేసి గ్రామాలలో తమ పేర్లతో నూతనంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసే చర్యలు తగదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కాలువ వివాదానికి తెర
వంతెన ప్రతిపాదనకు అధికారుల హామీకశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామం వద్ద పోలవరం కాలువలో మట్టి రహదారి తొలగింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి బుధవారం తెరపడింది. కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు కొద్ది రోజులుగా చేపట్టిన ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు నమ్మి గణేష్, నమ్మి నరసింగరావు, ఇతర స్థానిక నాయకులు పోలవరం ఈఈకి వినతిపత్రం అందజేశారు. ఆందోళన విరమించడంతో కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారిని పొక్లెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు. -
9 వరకూ తేలిక పాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయ ని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థా నం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకూ అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో వర్షపాతం 7.2 నుంచి 8.9 మిల్లీమీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 32.5 నుంచి 33.3 డిగ్రీల మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 22.3 నుంచి 23.0 డిగ్రీల మధ్య ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 71 నుంచి 85 శాతం, మధ్యాహ్న సమయాల్లో 80 నుంచి 85 శాతం మధ్యలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గాలి గంటకు 5–6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు పంటలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు. -
అమృత తుల్యం.. బిడ్డకు వరం
తల్లిపాలే పిల్లలకు శ్రీరామ రక్ష పుట్టిన మొదటి గంట నుంచి ఆరు నెలలు ఇవ్వాలి దీర్ఘకాల వ్యాధులకు దూరం తల్లికీ ప్రయోజనమే.. పిల్లలకు పాలివ్వడం వల్ల పిల్లలతో పాటు తల్లికీ ప్రయోజనముంది. పాలివ్వడం వల్ల గర్భాశయం పూర్వ స్థితికి చేరుకుంటుంది. అలాగే ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది. అదనపు కేలరీలు ఖర్చు అవడం వల్ల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు సహజంగా తగ్గుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తల్లిపాలలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల తల్లిలో ఒత్తిడి తగ్గి, బిడ్డతో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. అనకాపల్లి టౌన్: శిశువు జన్మించిన వెంటనే అందించే తల్లిపాలు జీవితాంతం శిశువుకు శ్రీరామ రక్షగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల ప్రకారం పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరం. తొలి ఆరు నెలల వరకు నీరు కూడా ఇవ్వకుండా తల్లి పాలే అందించాలి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మెదడు ఎదుగుదలతో పాటు శారీర వక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి దగ్గు, డయేరియా, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఈ తల్లిపాలు త్వరగా అరిగిపోయి జీర్ణమవుతాయి. త్వరగా అరిగిపోవడం వలన కడుపునొప్పి, మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవ్వవు. అలాగే భవిష్యత్లో ఆస్తమా, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అమూల్య ఆహారం తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమ్యూలమైన ఆహారం. వైద్యుల సూచనలు పాటిస్తూ తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి. ఈ దశలో నీరు, తేనె, ఇతర ఆహారాలు అవసరం ఉండదు. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువుకు శిశువును అనేక అంటువ్యాధుల నుంచి కాపాడతాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా త్వరగా కోలుకుంటుంది. –డాక్టర్ బి. సౌజన్య, గైనకాలజిస్ట్, ఎన్టీఆర్ ఆసుపత్రి, అనకాపల్లి -
ఆదివాసీల హక్కుల నిర్వీర్యానికి సర్కారు కుట్ర
పాడేరు: ఆదివాసీల హక్కులు, రక్షణ చట్టాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే నిర్బంధాలు చేయడం ఏమిటని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం పాడేరులోని గిరిజన సంఘ కార్యాలయంలో ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఈ నెల 8న చేపట్టనున్న మన్యం బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. గిరిజనులను ఇబ్బంది పెట్టేందుకు బంద్ నిర్వహించడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే చేపడుతున్నామని తెలిపారు. జీవో నంబర్ 3 ద్వారా శతశాతం ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్ సాధన, 1/70 చట్టం పరిరక్షణ కోసం చేపడుతున్న బంద్ను విఫలం చేసేందుకు పోలీసులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. బంద్ను విరమింపజేసేందుకు శాంతియుత మార్గాలు ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ ద్వారా అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. బంద్ నేపథ్యంలో గిరిజన విద్యార్థులను ఇళ్లకు పంపించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లపై పోలీసులు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. విద్యార్థులు తమ సమస్యలపై బంద్లు, నిరసనలు చేపడితే అడ్డుకుంటున్న పోలీసులు, ప్రధాని, ముఖ్యమంత్రి సభలకు విద్యార్థులను తరలించే సమయంలో మాత్రం మైనర్ల భద్రత గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 7లోపు శతశాతం ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్, 1/70 చట్టం పరిరక్షణకు కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే మన్యం బంద్ను స్వచ్ఛందంగా విరమిస్తామని తెలిపారు. నిర్ణయాధికారం లేని హైపవర్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్, ఆదివాసీ సేన జిల్లా ప్రతినిధి రాజు, నిరుద్యోగుల సంఘం ప్రతినిధి భాను, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ శ్రీను, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, సీఐటీయూ నాయకులు సుందర్రావు, గిరిజన సంఘ నాయకులు గంగాధరం, చిన్నారావు పాల్గొన్నారు. పోలీసుల హెచ్చరికలు.. ముంచంగిపుట్టు: గిరిజన హక్కులు, చట్టాల అమలు, జీఓ నంబర్ 3కు చట్టబద్ధత, 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనే డిమాండ్లతో ఈ నెల 8న గిరిజన ప్రజా సంఘాలు రాష్ట్ర మన్యం బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్ సందర్భంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదని, రాస్తారోకోలు నిర్వహించరాదని స్థానిక ఎస్ఐ పి.నాని గిరిజన ప్రజా సంఘాల నేతలను హెచ్చరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ముందస్తు పోలీసు అనుమతి లేకుండా బంద్ నిర్వహించడం చట్టవ్యతిరేకమని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, అత్యవసర సేవల వాహనాలు, సాధారణ ప్రజల రాకపోకలను అడ్డుకోరాదని, రోడ్లు, ఘాట్ రోడ్లు, చెక్పోస్టులను దిగ్బంధించడం నేరమని పేర్కొన్నారు. వర్తక, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలను బలవంతంగా మూసివేయించరాదని, బంద్ సందర్భంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పని సరి అని ఎస్ఐ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, రాకపోకలకు ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా బీఎన్ఎస్ సెక్షన్లు 189, 126, 223తో పాటు పీడీపీపీ చట్టం కింద నిర్వాహకులు, పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గిరిజన ప్రజా సంఘాల నేతలకు నోటీసులు అందించారు. అయితే గిరిజన చట్టాలు, హక్కులు, జీవో నంబర్ 3కు చట్టబద్ధత, 1/70 చట్టం అమలుపై న్యాయపోరాటం చేస్తున్న తమను ముందస్తు హెచ్చరికలు, నోటీసులతో పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని గిరిజన ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 8న మన్యం బంద్ విఫలయత్నానికి కూటమి కుయుక్తులు సీఎం ఇచ్చిన హామీ అమలు కోరితే నిర్బంధమా! మన్యం బంద్ చేపట్టి తీరుతాం అన్ని వర్గాలు స్వచ్ఛందంగాసహకరించాలి ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థిసంఘాల ప్రతినిధులతో కలిసి మన్యం బంద్ పోస్టర్ల ఆవిష్కరణ -
కేజీబీవీలో కుళ్లిన కూరగాయలు
కొయ్యూరు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కుళ్లిపోయిన ఉల్లిపాయలు, పాడైన గోంగూర కట్టలు, పచ్చిమిరపకాయలను చూసి ఎస్టీ శాసనసభా పక్షం కమిటీ చైర్మన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, కమిటీ సభ్యుడు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కూరగాయలను బాలికలకు వడ్డిస్తే వారి ఆరోగ్యం ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వారు స్థానిక కేజీబీవీని సందర్శించి స్టోర్ గదిని పరిశీలించారు. అక్కడ పాడైన గోంగూర కట్టలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను గుర్తించారు. ‘‘ఇలాంటి కూరగాయలను కూడా బాలికలకు పెడుతున్నారా?’’ అంటూ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఏపీసీ స్వామినాయుడితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. అనంతరం వంట చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పదో తరగతి బాలికలతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. పదిలో ఆరు సబ్జెక్టుల్లో 600 మార్కులు సాధించే లక్ష్యంతో కష్టపడి చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని అన్నారు. అనంతరం కేజీబీవీ ఎదురుగా ఉన్న రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడ బాలికలతో మాట్లాడి ఉత్సాహంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో వంట సిబ్బంది కొరతను అక్కడి సిబ్బంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య వివరించిన గింజర్తి విద్యార్థులు గింజర్తిలో 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి ఎంఈవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యేలకు తమ సమస్యను వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం పాడేరులో మరోసారి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించాలని సూచించారు. అభివృద్ధి పనులకు వినతి కొయ్యూరులో గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేయాలని, కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని, అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించాలని ఎంపీపీ బడుగు రమేష్బాబు ఎమ్మెల్యేలను కోరారు. దీనిపై శిరీషాదేవి స్పందిస్తూ.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాడైన ఉల్లిపాయలు.. గోంగూర కట్టలు బాలికల ఆరోగ్యంపై ఎస్టీ శాసనసభా పక్షం కమిటీ ఆందోళన వంటగదిలో అపరిశుభ్రతపై అసంతృప్తి ఏపీసీకి ఫోన్.. పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశం -
భోగాపురంలో అస్మిత అండర్–15 జిల్లా బాలికల రగ్బీ పోటీలు
అచ్యుతాపురం రూరల్: రగ్బీ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సహకారంతో అనకాపల్లి జిల్లా రగ్బీ అసోషియేషన్ ఆధ్వర్యంలో అస్మిత అండర్–15 బాలికల జిల్లా అంతర్ పాఠశాల రగ్బీ పోటీలు ఈ నెల 10న భోగాపురం క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రగ్బీ ఇండియా కోచ్ వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 నుంచి 2014 మధ్య జన్మించిన విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే ప్రతి క్రీడాకారిణి తప్పనిసరిగా ఎన్ఎస్ఆర్ ఐడీ నమోదు చేసుకుని ఖేలో ఇండియా పోర్టల్లో రిజిష్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నేతలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టౌన్హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్సీలో అక్రమాలు, స్పోర్ట్స్ కోటా సహా ఇతర కోటాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలు, బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ చేపడుతున్న ఉద్యమాలపై చర్చించారు. భవిష్యత్ పోరాటాల కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. స్పోర్ట్స్, ఇతర కోటాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి తప్పుడు జీవోలు జారీ చేయడం అన్యాయమన్నారు. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యా య పోస్టులను రూ.లక్షల్లో అక్రమంగా విక్రయించారంటూ ఆయన ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా అన్యాయం జరిగిందన్నారు. ఆందోళనలు చేస్తున్నా.. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విశ్వేశ్వరరాజు అన్నారు. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. ఏపీలో మెగా డీఎస్సీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లోకేష్ కూడా బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధిత నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నెల 6న పాడేరులో, 8న చింతపల్లి, కొయ్యూరు మండల కేంద్రాల్లో రిలే నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ నెల 10న పాడేరు నియోజకవర్గ కేంద్రంలో ఐదు మండలాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.మండలాల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్స్యకొండంనాయుడు, బి.అప్పారావు, కంకిపాటి గిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొడుగు అచ్యుత్, జి.మాడుగుల వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మణ్, జిల్లా నేత చిట్టిబాబు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కె.ఉర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణపాత్రుడు, నరసింహమూర్తి, సీనియర్ మహిళా నేతలు గల్లోంగి లక్ష్మికొండమ్మ, కోడా సుశీల, లకే రామసత్యవతి, లోతా దేవుడు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టీకరణ -
భోజనం కోసం విద్యార్థుల పాట్లు
డుంబ్రిగుడ: మండలంలోని దిగువ కొల్లాపుట్టు గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న గొల్లూరివలస గ్రామ విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గొల్లూరివలస నుంచి విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్న భోజనంతోపాటు పుస్తకాల బ్యాగులు, వాటర్ బాటిళ్లు, క్యారేజీలను మోసుకుంటూ కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. గత రెండు రోజులుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద భోజనం సిద్ధం చేసుకుని క్యారేజీల్లో తీసుకువెళ్తున్నారు. దీంతో పుస్తకాల బ్యాగులతోపాటు భోజనం, వాటర్ బాటిళ్లు మోసుకుంటూ సుమారు రెండు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలలకు సెంటర్ పాయింట్గా ఉండటంతో ఈ పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గత రెండు రోజులుగా భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాల బ్యాగులు, క్యారేజీలు, వాటర్ బాటిళ్లు మోసుకుంటూ దూరం నడవాల్సిన పరిస్థితికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నర్సీపట్నంలో భారీ వర్షం
నర్సీపట్నం: పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. అనంతరం వర్షం ప్రారంభమైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మెయిన్ రోడ్డుపై నీరు భారీగా ప్రవహించింది. అబిద్సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి, బ్యాంక్ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డు, శారదానగర్ మంగ్లీలాల్ స్వీట్స్టాల్, సత్యసాయి బాబా వీధి, శారదా నగర్ రెండవ లైన్ మెయిన్ రోడ్డు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు. శారదానగర్లో అంధకారం చిన్నపాటి వర్షం పడితే పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. శారదనగర్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు ఫోన్లు చేసినా స్పందించని పరిస్థితి నెలకొంది. -
‘మండలి’ జీవితం ఆదర్శనీయం
తుమ్మపాల: మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జీవితం ఆదర్శనీయమని, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో పీజీఆర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1977 లో దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు ఆయన అందించిన పునరావాస సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా గ్రామీణాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ జెన్కో ప్రాజెక్ట్ విస్తరణపై గ్రామసభలు
గూడెంకొత్తవీధి: ఏపీ జెన్కో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి పునరావాసం, ఆర్అండ్ఆర్ అంశాలపై రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశాల మేరకు బూసుకొండ, శండికోటి, పార్వతినగర్ గ్రామాల్లో ఈ గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతా ల్లో పునరావాసం, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన అంశాలపై అధికారులు గ్రామస్తులతో చర్చించారు. గ్రామసభల్లో ఏపీ జెన్కో అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాల నిగ్గుతేల్చాలి
నక్కపల్లి: ఈ ఏడాది కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన డీఎస్సీలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని మంగళవారం నక్కపల్లిలో జరిగిన టౌన్హాల్ సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ అధ్యక్షతన టౌన్హాల్(రౌండ్ టేబుల్) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాలుగు మండలాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా హాజరైన సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, పార్టీ కార్యదర్శి వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు మాట్లాడుతూ డీఎస్సీలో పలు అక్రమాలు జరిగాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ పెద్దలు అమ్మేసుకున్నారని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఓట్ల కోసం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చిందని విమర్శించారు. సూపర్సిక్స్ పథకాలు అటకెక్కించిందన్నారు. విద్యార్థులకు ఫీజురియింబర్స్మెంట్ ఇవ్వలేదని, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కరికి కూడా భృతి ఇవ్వలేదని, ఇలా అన్నివర్గాలను మోసం చేసారని అన్నారు. రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఆశపడ్డ వారందరిని మోసం చేసారన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఈ సమావేశంలోపాల్గొన్నవారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని అన్నారు. వారి తరపున వైఎస్సార్సీపీ చేసే పోరాటాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై గత నెల 31న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, 4వ తేదీన టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల6,7,8,9 తేదీల్లో పాయకరావుపేటలో మండలాలవారిగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీన బాధితులందరితో పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి నిరాహరదీక్షలకు, నిరసన కార్యక్రమానికి డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులు, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులను తీసుకువచ్చి ఆందోళన విజయవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు గొర్ల గోవిందు, మధువర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు, పైలా రమేష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి, యువజన విబాగం నియోజకవర్గ అధ్యక్షుడు పోచిన నరేష్, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యలమంచిలి చందు, పార్టీ రాష్ట్రకార్యదర్శి దత్తుడు సీతబాబు, జెడ్పీటీసీలు, గోసల కాసులమ్మ, సిద్దాబత్తుల సత్తిబాబు, లంక సూరిబాబు, వైస్ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, జిల్లాఅధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వై. సత్తిబాబు, యువజన విభాగం మండల అధ్యక్షుడు బచ్చలరాజు, పీఏసీస్ మాజీ అధ్యక్షుడు రాజేష్ఖన్నా, పొడగట్ల పాపారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సుందరలత, రోజారాణి, పాల్గొన్నారు. -
ఆర్అండ్ఆర్ అమలయ్యాకే పనులు
సీలేరు: సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని పార్వతినగర్, బూసుకొండ, శాండ్ క్వారీ గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో రెవెన్యూ, ఏపీ జెన్కో అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠం గతంలో నిర్వహించిన ఆర్థిక, సామాజిక స్థితిగతుల సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాసితుల సర్వే వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. సర్వేలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై అధికారులు పలుమార్లు గ్రామసభలు, సమావేశాలు నిర్వహించినప్పటికీ.. ఇప్పటివరకు హామీలు అమలుకు నోచుకోలేదని నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠం స్పందిస్తూ.. గతంలో అధికారులు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఏపీ జెన్కోలో ఉద్యోగాలు ఇవ్వాలి మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాకుండా ఏపీ జెన్కోలో నేరుగా కాంట్రాక్టు కార్మికులుగా నియమించాలని నిర్వాసితులు కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ముందుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, అర్హత ఉన్న వారికి అనంతరం ఏపీ జెన్కో కార్పొరేషన్లో కాంట్రాక్టు కార్మికులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బూసుకొండ, శాండ్ క్వారీ గ్రామాల్లో నిర్వాసితులతో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. డిమాండ్లు నెరవేర్చాకే పనులు తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తరువాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతూ నిర్వాసితులు తహసీల్దార్ అన్నాజీరావుకు వినతిపత్రం అందించారు. నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఐదు సంవత్సరాల పాటు మెగా ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన తరువాత ఏపీ జెన్కోలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, భూమికి బదులు భూమి ఇచ్చిన తరువాతే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ అన్నాజీరావు స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికి ఏ ప్రయోజనం వర్తిస్తుందో వారికి తప్పకుండా అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ అపోహలకు గురికావద్దని తెలిపారు. కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్ఈ సీతారామ్, ఎస్ఈ (సివిల్) జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీఈ నాగార్జున పాల్గొన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్వాసితుల డిమాండ్ -
మన్యం బంద్కు అనుమతి లేదు
పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డిపాడేరు: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8న మన్యం బంద్ నిర్వహించనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే బంద్కు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి తెలిపారు. బంద్ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం పాడేరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8న కొన్ని సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చినట్లు సమాచారం అందిందన్నారు. ఈ నెల 5 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నందున జిల్లాలోని పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాలలు కూడా యథావిధిగా కొనసాగుతా యని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం పోలీసుల బాధ్యత అన్నారు. బంద్ పేరుతో రహదారులను దిగ్బంధించడం, ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉద్యమకారులు లేవనెత్తుతున్న అంశాలపై గత నెలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించి హైపవర్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారని తెలిపారు. ఆ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. -
వాగులు ధ్వంసం చేసి రోడ్డు నిర్మించడం తగదు
తుమ్మపాల: క్వారీ లారీలు రాకపోకలు సాగించేందుకు గెడ్డలు, వాగులను ధ్వంసం చేసి, ప్రత్యేక నిధులతో రోడ్డు నిర్మించడం తగదని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా కాలనీకి ఆనుకుని లారీల రాకపోకల కోసం ప్రత్యేక రోడ్డు వేయడం దారుణమన్నారు. గ్రామానికి శివారున ఉన్న తమ కాలనీ ప్రజల బాగోగుల గురించి స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ లారీలు మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించేవరకూ రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోని భూలోకేశ్వరరావు, పాతపాటి బాబులు, బోని రాంబాబు, బచ్చలి శేఖర్, బచ్చలి గంగరాజు, మహిళలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. దళితులు, రైతుల నిరసన -
● రామన్నపాలెంలో దుండగుల దుశ్చర్య ● పోలీసులకు ఫిర్యాదు చేసిన నాతవరం ఎంపీపీ లక్ష్మణమూర్తి
నాతవరం: దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గ్రామంలో గిరిజనులు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో సొంత ఖర్చుతో 2013లో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుంచి ఏటా వైఎస్సార్ జయంతి, వర్థంతి వేడుకలు గిరిజనులు జరుపుకొంటున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహంతో పాటు దిమ్మను ధ్వంసం చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎంపీపీ లక్ష్మణమూర్తి రామన్నపాలెంలో దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం స్వయంగా పరిశీలించారు. జరిగిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఎంపీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి నేతల కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగి ఉండొచ్చని ఎంపీపీ లక్ష్మణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ అయన్నపాత్రుడు ప్రాతినిద్యం వహించే నియోజకవర్గంలో తమ ప్రియతమ దివంగత నేత వైఎస్సార్ విగ్రహం ధ్వంసం జరగడం బాధాకరమని ఎంపీపీ లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహం చేతివేళ్లు -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాల్సిందే
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి దేవరాపల్లి: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. మండలంలోని తారువలో నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా మహానేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ తదితర పార్టీ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముత్యాలనాయుడు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన భారీ కుంభకోణం వల్ల ఎందరో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. బాధితులంతా వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడిన్డి కలిసి, వారికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో వారి తరఫున పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. మెగా డీఎస్సీలో దగా పడ్డ నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలిచి రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉగ్రరూపం దాల్చి నిరుద్యోగ యువతీయువకుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి అవినీతి అక్రమాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 6 నుంచి మాడుగులలో రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గ కేంద్రం మాడుగులలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు బూడి తెలిపారు. 6న మాడుగుల మండలం, 7న చీడికాడ మండలం, 8న కె.కోటపాడు మండలం, 9న దేవరాపల్లి మండలానికి చెందిన డీఎస్సీ బాధితలతో పాటు నిరుద్యోగ యువతీయువకులు, పార్టీ నాయకులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, దేవరాపల్లి, చీడికాడ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు బూరె బాబూరావు, గొల్లవిల్లి రాజుబాబు, సీడీసీ చైర్మన్ సుంకరి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, రొంగలి సూర్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాసరావు, మండల యువజన అధ్యక్షులు కర్రి సూరినాయుడు, గొర్రుపోటు వెంకటరావు, గొల్లవిల్లి స్వామినాయుడు, మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కురచా నారాయణమూర్తి, ఆదిరెడ్డి త్రినాథ స్వామి, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, ఏటుకూరి రాజేష్, ఆకుల సాయి, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాసరి సంతోష్కుమార్, రొంగలి నారాయణమ్మ, బండారు దేముడునాయుడు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి: డీఎస్సీ జరిగినలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల రౌండ్టేబుల్ సమావేశం మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భరత్కుమార్ మాట్లాడుతూ డీఎస్సీలో అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. 6 నుంచి రిలే నిరాహార దీక్షలు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలన్న డిమాండ్లతో ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు భరత్కుమార్ చెప్పారు. 10వ తేదీన పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. సుంకరమెట్ట జంక్షన్ నుంచి రింగ్రోడ్డు, పెరుగబజారు, వేల్పులవీధి జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా రామచంద్ర థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 6న కశింకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తరువాత వాటిని విస్మరించిందని విమర్శించారు. డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు.అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు పి.సతీష్వర్మ, దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, గతంలోను నిరుద్యోగు భృతి నెలకు రూ.వెయ్యి అందజేస్తామని, సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు అమలు చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై రాష్ట్రంలో కొంత మంది టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైస్ ఎంపీపీ అయితా రాము, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, 80,84వార్డు ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, కె.రాఘవ, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్యనాయుడు, వైఎస్సార్సీపీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మండల, పట్టణ అధ్యక్షులు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, తగరంపూడి నూకరత్నం, వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు దండా సిద్ధార్థ, జిల్లా నాయకులు మళ్ల బుల్లిబాబు, మర్రిపల్లి శోభ, నీటిపల్లి లక్ష్మీ, కుండల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ విగ్రహం ధ్వంసం -
క్రీడల్లో విద్యార్థుల సత్తా
పెదబయలు: స్థానిక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అరకులోయలో ఇటీవల నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటారని పీడీ పి.సురేష్కుమార్ తెలిపారు. కళాశాల నుంచి వివిధ క్రీడా విభాగాల్లో 24 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. 23 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. విద్యార్థుల ప్రతిభపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో పాడేరులో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్ బాకూరు పాండురాజు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో శిక్షణ అందిస్తూ వారి క్రీడా ప్రతిభను వెలికితీసిన పీడీ సురేష్కుమార్ను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. -
సీలేరుకు నీటిగండం
సీలేరు: ఉత్తరాంధ్రకు ప్రసిద్ధి చెందిన సీలేరు జలాలు దశాబ్దాలుగా ప్రతి ఏటా పుష్కలంగా నీటితో కళకళలాడుతూ.. రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం, ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, అందుబాటులో ఉన్న నీటిని ఇతర అవసరాలకు మళ్లించడం వంటి కారణాలతో బలిమెల, జోలాపుట్, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో సీలేరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. మూతపడిన ఒడిశా ఓహెచ్పీసీ పవర్ హౌస్ ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలో సీలేరు నదిపై నిర్మించిన ఓహెచ్పీసీ విద్యుత్ కేంద్రానికి ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు. ఎనిమిది యూనిట్ల ద్వారా 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ కేంద్రం ప్రస్తుతం మూతపడింది. బలిమెల జలాశయంలో ఒడిశాకు కేటాయించిన నీటి వాటా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడంతో సుమారు 20 రోజులుగా ఓహెచ్పీసీ పవర్ హౌస్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఒడిశా వాటాలో సుమారు రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ఆ నీటిని సాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. వర్షాలపైనే ఆశలు ప్రస్తుత పరిస్థితుల్లో బలిమెల, సీలేరు కాంప్లెక్స్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ఆగస్టులోకి ప్రవేశించినా పూర్తి స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలో నీటి కొరత తీవ్రతరమవుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే జలాశయాల్లోకి భారీగా నీరు చేరి నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది. లేకుంటే రానున్న రోజుల్లో జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన విద్యుత్ డిమాండ్ ఏపీ జెన్కోకు చెందిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని సీలేరు, డొంకరాయి, పొల్లూరు, సరిహద్దులోని మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం రోజువారీ విద్యుత్ ఉత్పత్తి వేసవితో పోలిస్తే తక్కువగా జరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరగడంతో సీలేరు కాంప్లెక్స్పై విద్యుత్ డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్లో 34.9545 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అందుబాటులో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. – కేవీ రాజారావు, చీఫ్ ఇంజినీర్, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ సీలేరు జలవిద్యుత్ కేంద్రంనీటి మట్టాలు ఇలా.. జోలాపుట్టు: పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులు. మంగళవారం నాటికి 2719.66 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున 2740.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. బలిమెల: పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు. ప్రస్తుతం 1460.00 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున 1467.20 అడుగుల నీటిమట్టం ఉంది. గుంటవాడ: పూర్తిస్థాయి నీటిమట్టం 1360 అడుగులు. ప్రస్తుతం 1343.70 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే రోజున నీటి నిల్వ ఒక టీఎంసీ కంటే తక్కువగా ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. డొంకరాయి: పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. ప్రస్తుతం 1022.30 అడుగుల వద్ద నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 8.9957 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భారీగా తగ్గిన బలిమెల నీటి నిల్వలు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల జలాశయంలో ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఆగస్టు 4న 46.1262 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం మంగళవారం నాటికి 26.7773 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పటికే జూన్ నాటికి ఒడిశా తన వాటా నుంచి 22.6865 టీఎంసీల నీటిని వినియోగించింది. దీంతో ఒడిశా వాటాలో ప్రస్తుతం సుమారు రెండు టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఫలితంగా అక్కడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. బలిమెల, జోలాపుట్టు నీటిలో ఒడిశా వాటా రెండు టీఎంసీలను మినహాయిస్తే ప్రస్తుతం ఏపీ వాటాగా 24.7320 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని గుంటవాడ, డొంకరాయి రిజర్వాయర్లలో కలిపి 10.2225 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం బలిమెలలో నిల్వ ఉన్న నీటిని ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించడం లేదు. సీలేరు కాంప్లెక్స్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ద్వారా వస్తున్న ప్రవాహంతోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఉత్తరాంధ్రకు విద్యుత్ వెలుగులు అందించే సీలేరు జలాశయాలకు నీటి గండం ఏర్పడింది. ఏటా పుష్కలంగా నీటితో కళకళలాడే బలిమెల, జోలాపుట్టు, గుంటవాడ, డొంకరాయి రిజర్వాయర్లలో ఈసారి నీటి నిల్వలు భారీగా తగ్గాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే బలిమెలలో నీటి కొరత కారణంగా ఒడిశా విద్యుత్ కేంద్రం మూతపడగా.. రానున్న రోజుల్లో సీలేరు జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
బంద్ విజయవంతం చేయాలి
పాడేరు రూరల్: ఈ నెల 8న నిర్వహించనున్న రాష్ట్ర మన్యం బంద్ను విజయవంతం చేయా లని ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పాడేరు పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు రాధాకృష్ణ, సుందర్రావు, దాసు, చిట్టిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలకు హక్కులు కల్పించే 1/70 చట్టం, 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్, జీవో నంబర్ 3 తదితర అంశాలపై భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల ద్వారానే ఆదివాసీల హక్కులు, చట్టాలను పరిరక్షించుకోగలమన్నారు. ప్రతి ఆదివాసీ బిడ్డ ఈ నెల 8న జరిగే మన్యం బంద్కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనుపాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్ కారు దగ్ధం
చోడవరం: మండలంలో శీమునాపల్లి గ్రామ సమీపంలో కోటపాడు రోడ్డులో మంగళవారం ఓ ఎలక్ట్రికల్ కారు దగ్ధమైంది. అంబేరుపురానికి చెందిన భక్తాంజనేయస్వీట్స్ యజమాని సత్యనారాయణ కుమారుడు కొండెంపూడి పూర్ణ సందీప్ తన స్నేహితుడు సతీష్తో కలిసి తన ఎలక్ట్రికల్ కారులో కె.కోటపాడు వెళుతుండగా శీమునాపల్లి సమీపంలోకి వచ్చేసరికి కారు వెనుక భాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలివేశారు. ఆ వెంటనే మంటలు వ్యాపించి, కారు దగ్ధమైంది. చోడవరం అగ్నిప్రమాక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు బాధితులను సహకారం అందజేశారు. -
ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి
చింతపల్లి: సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరికీ పనికల్పించే విధంగా ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.విద్యాసాగర్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి,గూడెం కొత్తవీధి,కొయ్యూరు మండలాలకు చెందిన వీబీ జీరాంజీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్వల్ప కాలంలో ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగుపై గిరిజనులు దృష్టి సారించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి శ్రామికులకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ పవన్కుమార్, అదనపు డీఆర్వో షణ్ముఖరావు, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల ఏపీవోలు రాం ప్రసాద్,అప్పలరాజు,జూనియర్ ఇంజినీర్లు రమణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు ఎకరాల్లోసీతాఫలాల తోట
మెట్ట భూమిలో ఐదు ఎకరాల వరకు సీతాఫలాల తోటలను సాగు చేస్తున్నాను. ప్రతి ఏడాది సీతాఫలాల అమ్మకాలతో మా కుటుంబానికి రూ. లక్షకు పైగానే ఆదాయం వస్తోంది. సీతాఫలాల తోటలు మా ప్రాంతానికి వరంగా మారాయి. – గుల్లె రాము, చోడిపల్లి, పాడేరు మండలం ఈ ఏడాది కాపు బాగుంది మా తోటల్లో ఈ ఏడాది కూడా కాపు బాగుంది. ఈ మూడు వారాల వ్యవధిలో ఇప్పటివరకు 20 బుట్టల సీతాఫలాలను విక్రయించాను. రూ. 12 వేల ఆదాయం లభించింది. మరో రెండు నెలల వరకు కాపు వస్తుంది. – సోమెలి మత్స్యకొండమ్మ, మెట్టలపాడు, జి.మాడుగుల మండలం -
దుకాణాల తొలగింపునకు ఆదేశాలు
రావికమతం: స్థానిక మండల పరిషత్ స్థలంలో రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అనధికారకంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఆర్ఐ రమణబాబు సోమవారం పరిశీలించారు. ఇక్కడ 15 మంది అక్రమంగా షాపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని రావికమతం గ్రామానికి చెందిన గెంజి వెంకటరమణ గత సోమ వారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్ఐ పరిశీలించి మాట్లాడుతూ ఇక్కడ సర్వే నంబరు 103–2లో 15 మంది నిర్మించుకున్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వీఆర్వోలు నాగరాజు, శంకర్, వీఆర్ఏ లోవ పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంపై అసంతృప్తి
తుమ్మపాల: వివిధ మండలాలు, గ్రామాల నుంచి తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యయప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకున్న వీరికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గంటల తరబడి చెట్ల కిందే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు దగ్గర నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్ల కారణంగా సగం రోజంతా వేచి ఉండాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నుంచే వినతుల విభాగానికి ఒక లైన్, అర్జీల ఆన్లైన్ నమోదు కోసం మరో లైన్, అనంతరం పీజీఆర్ఎస్ వేదిక వద్దకు వెళ్లేందుకు మరో రెండు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఒక్క వినతిని సమర్పించేందుకు మూడు గంటల సమయం పడుతోందని, తీరా జిల్లా అధికారులు వద్దకు వెళ్లేసరికి అర్జీని తీసుకుని సంబంధిత శాఖ అధికారికి అందించి చేతులు దులుపుకుంటున్నారని అర్జీదారులు చెబుతున్నారు. జిల్లా స్థాయి అధికారుల ఎదుట తమ సమస్యలను వివరించినప్పటికీ, అనేక వినతులు పరిష్కారం కాకుండానే ముగుస్తున్నాయని, ఒకే సమస్యపై పలుమార్లు కలెక్టరేట్కు వచ్చినా క్షేత్రస్థాయి విచారణ లేకుండానే అర్జీలను ముగించడం పరిపాటిగా మారిందంటున్నారు. పునరావృత అర్జీలపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. టూరిజం, దేవాదాయ శాఖ అధికారుల కలెక్టర్ ఆగ్రహం అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా, అర్జీలను పెండింగ్లో పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పురోగతి లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ప్ అందించిన అర్జీల పరిష్కార వేగాన్ని పెంచి, అన్ని అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజలను తిప్పించుకునే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్– 170, రెవెన్యూ క్లినిక్– 145 అర్జీలు మొత్తం – 315 అర్జీలు నమోదయ్యాయి. -
కుటుంబ సభ్యులకు తప్పని ఇబ్బందులు
కలెక్టరేట్లోకి అర్జీదారునికి మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల ఆయనతో వచ్చిన కుటుంబ సభ్యులు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు తోడుగా వచ్చిన వారికి కూర్చునేందుకు టెంట్లు, కుర్చీలు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో చెట్ల కిందే నేలపై కూర్చొని గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో అందుబాటులో ఉన్న టెంట్లు, కుర్చీలు, మంచినీటి సౌకర్యాలు ప్రస్తుతం లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీసం సోమవారం రోజైన టెంట్లు, కుర్చీలు కొనసాగించాలని కోరుతున్నారు. -
లేఅవుట్లో మట్టి తవ్వకాలపై ఆందోళన
అచ్చుతాపురం మండలం దొప్పెర్లలో ఎల్పీ నంబరు 38/2004, 4/2005 అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో కొనుగోలు చేసిన ప్లాట్ స్థలాల్లో మట్టి తవ్వకాలతో అక్రమ మైనింగ్ చేపడుతూ తమను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్లాట్ల యాజమానులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అక్రమ తవ్వకాల నిలిపివేసి బాధ్యులపై చర్యలు కోరుతూ సాయిప్రియా కన్స్ట్రక్షన్స్ తరపున ఇప్పటికే తహసీల్దార్, పోలీలసుకు ఫిర్యాదులు చేశామన్నారు. అక్రమంగా తమ ప్లాట్లలోకి చొరబడి భారీగా మట్టి తవ్వకాలు జరుపుతూ క్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్
ముంచంగిపుట్టు: గిరిజనుల హక్కులు, చట్టాల జోలికి వస్తే సహించేది లేదని గిరిజనులు హెచ్చరించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం కదం తొక్కారు. ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 23 పంచాయతీల నుంచి భారీగా తరలివచ్చిన గిరిజనులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక జెడ్పీ అతిథిగృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేడ్కర్ పార్కుకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి. బాలదేవ్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి. బాబూరావు, ఎంపీపీ అరిసెల సీతమ్మ మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు అరకు సభలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం దారుణమన్నారు. గిరిజన యువతీయువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచే విధంగా గిరిజనేతరులు కోర్టులను ఆశ్రయించడంతో పూర్తిగా రద్దు చేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం అన్యాయమన్నారు. 1/70 చట్టం జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్లో అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిరసన ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జి. మాడుగుల సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ నాని, సీఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. ఎం. శ్రీను, నర్సయ్య, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, మేసీ్త్రల సంఘం మండల అధ్యక్షుడు రవి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు, యువతీయువకులు పాల్గొన్నారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణ,1/70 చట్టం పరిరక్షణకు భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు 8న మన్యం బంద్ విజయవంతం చేయాలి : గిరిజన సంఘం నాయకులు -
భక్తిశ్రద్ధలతో బోల్ బామ్ యాత్ర
● ఘనంగా గుప్తేశ్వరం శివుని మాలధారణ ● కాలినడకన శివాలయాల సందర్శనసీలేరు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పచ్చని కొండలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. గుప్తేశ్వర స్వామి భక్తులు అడవి మార్గంలో కాలినడకన వెళ్లి కనిపించిన ప్రతి శివాలయాన్ని సందర్శించి, అభిషేకాలు చేస్తూ బోల్ బామ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరం... ఇక్కడ ఓ గుహలో శివలింగం ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ భక్తులు గుప్తేశ్వర స్వామివారి మాల ధరించి ఈ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు కాలినడకన కావడితో నీటిని తీసుకెళ్లి, శివలింగాలకు అభిషేకం చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. బోల్ బామ్ అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఈ యాత్రను సాగిస్తారు. ఈ యాత్రలో భాగంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్ పరిధిలోని 11 వ నంబర్ గ్రామానికి చెందిన శివ భక్తులు కాలినడకన సీలేరు సరిహద్దు గుంటవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఒడిశాలో శ్రావణ మాసం సందర్భంగా ఆ రాష్ట్ర భక్తులు శివ మాలలు ధరిస్తారు. దీన్ని కావడి యాత్ర అని కూడా పిలుస్తారు. నెల రోజుల పాటు కొనసాగించే దీక్షలో ప్రతి సోమవారం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే శివాలయాలకు నదిలో లభ్యమయ్యే నీటిని కావిళ్లతో వెళ్లి అభిషేకాలు చేస్తారు. చివరిగా ఓ సోమవారం ఒడిశాలో ప్రసిద్ధి చెందిన గుప్తేశ్వర్ శివాలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. -
గంజాయి రహిత రాష్ట్ర నిర్మాణమే లక్ష్యం
స్పీకర్ అయ్యన్నపాత్రుడునర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం, పోలీసుశాఖ పని చేస్తోందని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్పం 2.0 మెగా గంజాయి అవగాహన కార్యక్రమాన్ని స్టార్ హోమ్స్ ఫంక్షన్ హాల్లో సోమారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు మీడియా, విద్యార్థులు, తల్లిదండ్రులు బాధ్యతయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి నిర్మూలనకు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ గత కొద్ది కాలంగా గంజాయి సాగు, అక్రమ రవాణాను 90 శాతంకు పైగా అరికట్టగలిగామన్నారు. చెక్పోస్టులు, నిఘా కెమెరాలు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. గంజాయి వినియోగాన్ని తుడిచిపెట్టాలంటే ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. మత్తుకు బానిసలైన వారిని నేరస్తులుగా చూడకుండా డి–ఎడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి చికిత్స అందించి పునరావసం కల్పిస్తామన్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాల వైపు పయనించాలి తప్ప వ్యసనాల బారినపడి తల్లిదండ్రులు కన్న కలలను తుంచవద్దన్నారు. పోలీసుల ఈ సంకల్పం 2.0 ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం 112, గంజాయి సమాచారం అందించడానికి 1972 టోల్ ఫ్రీ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామన్నారు. మత్తు పదార్ధాల దుష్ఫరిణామాలపై విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో సీఐలు గపూర్, రేవతమ్మ, మురళి, రామకృష్ణ, సతీష్, పిల్లా రమేష్, ఈగల్ ఇన్స్పెక్టర్లు దేవుళ్లు, నాగరాజు, ఎస్సైలు రాజారావు, ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగు పడి రైతు మృతి
దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండలో సోమవారం సాయంత్రం పిడుగు పడి గ్రామానికి చెందిన సిరపరపు నాయుడు (51) మృతి చెందారు. మరో రైతు ఆళ్ల సన్యాసినాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎం.అలమండకు చెందిన సిరపరపు నాయుడు కుటుంబంతో కలిసి సుజాతనగర్లో నివాసం ఉంటున్నారు. పొలం పనులు చేయించేందుకు సోమవారం ఉదయం స్వగ్రామం ఎం.అలమండకు వచ్చారు. కూలీలతో పనులు చేయిస్తుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో భారీ శబ్ధంతో కూడిన పిడుగు నేరుగా నాయుడుతో పాటు ప్రక్కనే ఉన్న సన్యాశినాయుడుపై పడింది. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్నవారంతా స్పృహ తప్పి పడిపోయిన వారిద్దరినీ కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి సిరపరపు నాయుడు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న సన్యాసినాయుడును మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్కు తరలించారు. మృతుడికి భార్య శిరీషతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలం పనులు చేయించేందుకు వచ్చిన నాయుడు పిడుగుపాటుకు గురై మృతిచెందడంతో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నాయుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక మాజీ సర్పంచ్ పోతల లక్ష్మీ భర్త, వీఆర్వో పోతల శంకరావుకు నాయుడు స్వయాన మేనల్లుడు. దీంతో ఎం.అలమండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై బాధిత కుటుంబీకులు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి సంతాపం సిరపరపు నాయుడు మృతికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితర నాయుకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం వెలిబుచ్చారు.


