Alluri Sitarama Raju District Latest News
-
10లోగా చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా ప్రదేశాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పకడ్బందీగా క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలు చోట్ల ఇంకా సిమెంట్ వర్క్లు జరుగుతుండటంతో ఎన్ని రోజులపాటు చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరమైన పనులు చేయకుండా, భక్తులకు ఉపయోగపడే పనులు చేయాలని ఆదేశించారు. దక్షిణ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు ఏర్పాటు చేసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంపై ఆరా తీశారు. రూ.1500, రూ.1000,రూ.300 క్యూల వద్ద భక్తులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సింహగిరిపై బస్ కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నాటికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని ఆదేశించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో ఇటుకల పండగ సందడి
అరకులోయటౌన్: మన్యంలో ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి నెలకొంది. అన్ని గిరిజన పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మండలంలోని పెదలబుడు, మాడగడ, గన్నెల, లోతేరు ముఠా పరిధిలోని గ్రామాల్లోని గిరిజనులు ఈ పండగ సందర్భంగా సందడి చేస్తున్నారు. రహదారులపై మహిళలు తాళ్లు, వెదురు గడలతో గేట్లను పెట్టి వాహనదారుల నుంచి నుంచి పండగ చందాలు(పజోరు) వసూలు చేస్తున్నారు. గిరిరైతులు వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు చేపట్టే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏజెన్సీలో ఏటా ఈ నెలలో ఇటుకల పండుగ చేసుకోవడం ఆచారం. ఉగాది పండుగనే మన్యంలో గిరిజనులు ఇటుకల పండగగా నిర్వహిస్తుంటారు. ఈ పండగను వారం రోజుల పాటు జరుపుకొంటారు. ఈ పండగ జరిగే వారం రోజులూ ఎవ్వరూ బయటకు వెళ్లి పనులు చేయకూడదనే ఆచారం ఉంది. మహిళలందరూ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రంగు నీళ్లు చేతపట్టుకుని తమకు వరుస అయ్చేవారిపై నీళ్లను పోసి ఆట పట్టిస్తారు. పురుషులు ఆడవిలో వేటాడాల్సిందే.. పురుషులంతా అడవికి వెళ్లి జంతువులను వేటాడాలన్న నిబంధన ఉంది. ఏదైనా జంతువును వేటాడిన వ్యక్తిని గ్రామ పొలిమేర నుంచి మంచం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ గ్రామ దేవత వద్దకు తీసుకువస్తారు. ఒక వేళ వేటకు వెళ్లకపోయినా, బయట పనులకు వెళ్లినా పురుషులకు జరిమానా విధించి కొంత డబ్బులు వసూలు చేస్తారు. గ్రామాల్లోని మహిళలంతా కలిసి గ్రామంలోని ప్రధాన రహదారుల వద్దకు చేరి గేట్లు వేసి పజోర్(డబ్బులు) వసూలు చేస్తారు. ఇటుకల పండగ చివరి రోజు గ్రామ పెద్దలు పూజలు నిర్వహించిన విత్తనాలను గ్రామంలోని రైతులకు పంచిపెడతారు. తొలకరి వర్షం తరువాత గ్రామ పెద్దలు ఇచ్చిన విత్తనాలను ముందుగా పంట పొలాల్లో చల్లి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. ఇందుకోసం ఊరి పొలిమేరలో గేటు పెట్టి, అలా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే వారు. ఈ డబ్బులతో పండుగకు అవసరమైన దినుసులు కొనుగోలు చేసి ఊరంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. సాయంత్రం పూట ఆదివాసీ మహిళలు థింసా నృత్యాలతో అలరిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు గిరిజనులు కూడా తమ ఆచారాలను క్రమేణా విస్మరిస్తున్నారు. అడవుల్లో వణ్యప్రాణులు, క్రూరజంతువులు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికితోడు వన్యప్రాణులను వధిస్తే చట్ట ప్రకారం తీవ్ర శిక్షలు పడే అవకాశం ఉండడంతో అడవుల్లో వేటకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో గేట్లు పెట్టే సంప్రదాయాన్ని వదిలేశారు. రహదారులపై గేట్లు పెట్టి రాకపోకలు సాగించే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రహదారులపై గేట్లు ఏర్పాటు చేసి పండగ చందాలు వసూలు అడవిలో వేటాడితేనే గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదంటే కట్టుబాటు మేరకు జరిమానా -
బైక్ ఢీకొని మహిళకు గాయాలు
డుంబ్రిగుడ: అరకు–పాడేరు జాతీయ రహదారిని దాటుతున్న పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ బుర్రగురువు గ్రామానికి చెందిన కొర్రా కాసులమ్మ బైక్ ఢీకొని గాయాలు పాలైంది. వివరాలిలా ఉన్నాయి. అరకులోయలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాఫీ రైతులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి పలువురు మహిళలు బయలుదేరి వెళ్లారు. కురిడి సమీపంలోని పెద్దబ్రిడ్జి వద్ద జాతీయ రహదారిలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం తోటి మహిళలతో కలిసి కాసులమ్మ దిగి రోడ్డు దాటే క్రమంలో అరకు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొంది. గాయపడిన ఆమెను డుంబ్రిగుడ ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ
గూడెంకొత్తవీధి: మండలంలో శనివారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యటించారు. గూడెంకొత్తవీధిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఎంవీఐ సాయిరమేష్, సీఐ సుధాకర్కు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వాహన చోదకులపై కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. గూడెంకొత్తవీధిలో ఏ, బీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను స్ధానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పరిశీలించారు. మాస్ కాపియింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్బాబు, ఎస్ఐ వీరబాబు, వెంకటరమణ, ఎంఈవో ప్రసాద్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
డుంబ్రిగుడ: మండలంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఇన్చార్జీ ఎంపీడీవో విశ్వనాథ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛరథాన్ని వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్రావు, లలిత అధికారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక వాహనం సమకూర్చిందన్నారు. ముందుగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు, అట్ట పెట్టెలు, తదితర సామాన్లు అందజేస్తే ధరను బట్టి గిరిజనులకు వస్తువులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ● నిధుల కొరతపై సభ్యుల పెదవి విరుపు ● జెడ్పీ సభలో వాడీవేడి చర్చ సాక్షి, అనకాపల్లి/మహారాణిపేట(విశాఖ): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపించి ప్రజలకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విభాగాల్లో సమస్యలు అధికంగా ఉండి, నిధులు మాత్రం శూన్యంగా ఉన్నాయని అధికారులు సభలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. సభ్యులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి ‘నిధుల కొరత’అనే సమాధానమే వినిపించింది. చివరకు ఆర్అండ్బీ రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా నిధుల్లేవని అధికారులు పేర్కొన్నారు. గిరిజన ప్రాంత వాసుల సౌకర్యార్థం మహాప్రస్థానం వాహనాల సేవలను విస్తరిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ కుమార్, జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, జెడ్పీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ, పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● ఏజెన్సీ ప్రాంత జెడ్పీటీసీలు గంగరాజు, బొంజిబాబు, పోతల బాలయ్య, ఎంపీపీలు చేసిన విజ్ఞప్తి మేరకు కేజీహెచ్లో మాదిరిగానే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేసి అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని జెడ్పీ చైర్పర్సన్ కోరారు. పాడేరు నుంచి రిఫరల్ కేసులను కేజీహెచ్కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మృతదేహాల తరలింపునకు సంబంధించి తగినన్ని మహా ప్రస్థానం వాహనాలను సమకూర్చాలని, గిరిజన ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. సమస్యలపై సభ్యుల ఏకరువు ● అల్లూరి జిల్లా డీఎంహెచ్వోను తక్షణం సరెండర్ చేయాలని సభ్యులు గంగరాజు, తదితరులు డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, గిరిజన రోగుల బాగోగులు చూసుకోవడంలో డీఎంహెచ్వో విఫలమయ్యారని ఆరోపించారు. ● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం, ఈర్లె అనురాధ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్గా తీసుకొని త్వరగా పరిష్కార చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. 15 అంబులెన్స్ల కొనుగోలుకు ప్రతిపాదనలు గిరిజన ప్రాంత ప్రజల సౌకర్యార్థం కేంద్ర సంస్థ నిధులతో కొత్తగా 15 అంబులెన్స్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించామని, వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర సంస్థ నుంచి సుమారు కోటిన్నర వరకు ఆర్థిక సాయం అందుతుందని, వాటితో కొత్తవి కొనడంతో పాటు, పాత వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. పాడేరు నుంచి కేజీహెచ్కు రిఫరల్ కేసుల తరలింపు, మృతదేహాల తరలింపులో ఉన్న సమస్యలను అధిగమిస్తామన్నారు. -
జాతీయ సదస్సులో ఏయూ విద్యార్థులకు అవార్డులు
మద్దిలపాలెం: గుజరాత్లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీలో ‘అప్లైడ్ సైకాలజీ ప్రస్తుత సవాళ్లు – భవిష్యత్తు అవకాశాల దార్శనికత’ అనే ఇతివృత్తంతో జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ 61వ జాతీయ, 30వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పలు అవార్డులు సాధించారు. ప్రొఫెసర్ ప్రమోద్కుమార్ యంగ్ సైకాలజిస్ట్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ సైకాలజీ విద్యార్థినులు జె.మనీషా, ముడిదన కారుణ్య అందుకున్నారు. ‘యూనివర్సిటీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత, విద్యాపరమైన జాప్యంపై డిజిటల్ వ్యసనం ప్రభావం’ అనే అంశంపై వారు చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది. నైనా సింగ్ మెమోరియల్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ విద్యార్థిని గౌరీలక్ష్మి కొరిబిల్లి పొందారు. ‘యువతలో ప్రకృతితో అనుబంధం, అది వారి భావోద్వేగ నియంత్రణపై చూపే ప్రభావం’ అనే అంశంపై చేసిన అధ్యయనానికి ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో అభినందించారు. ఏయూ సైకాలజీ విభాగాధిపతి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్యఎం.వి.ఆర్.రాజు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఇద్దరు విద్యార్థినులు
చింతపల్లి: జాతీయ స్థాయి ఖేల్ ఇండియా కుస్తీ పోటీలకు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రం తరఫున ఎంపికయ్యారు. గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో కళాశాల నుంచి పాల్గొన్న బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న బి.భార్గవి, కె.కేసియా ప్రతిభ కనబరిచారు. వీరికి ఆదివారం నుంచి ఛత్తీస్గఢ్లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందిందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు తర్ఫీదునిచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ వెలుగుల్లో సింహగిరి -
ఆదివాసీలను దూషించిన ఎమ్మెల్యే అశోక్పై కఠిన చర్యలకు డిమాండ్
పాడేరు రూరల్: ఆదివాసీలను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామరావుదొర డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతంలోకి వలస వచ్చి ఎస్టీ బెంతు ఒరియాలుగా చెలామణి అవుతూ తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న విషయాన్ని చెప్పుకునేందుకు వెళ్లిన ఆదివాసీలను ‘ఆఫ్ నాలెడ్జీ ఫెలోస్, బ్లేడి బాస్టేట్స్’అంటూ అవమానకరంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే వలసవాదులైన ఇతరులు ఆంధ్రాలో చొరబడి నకిలీ ధ్రువపత్రాలతో ఎస్టీలుగా వివిధ ఉద్యోగాలు సాధించారని ఆరోపించారు. దీంతో నిజమైన ఎస్టీలకు మనుగడ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార అండ దండలతో 27 వేల మంది గిరిజనేతరులను ఎస్టీలో కూడా చేర్పించాలని ఎమ్మెల్యే అశోక్ ప్రయత్నం చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆదివాసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై తక్షణం అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమానికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ మీడియా విభాగం ప్రతినిధి బాబూజీ, తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ పంపు సెట్స్,వాటర్ వీల్స్ పంపిణీ
చింతపల్లి: లంబసింగి పరిసర గ్రామ గిరిజనులకు అవసరమైన సోలార్ పంపు సెట్లు, వాటర్ వీల్స్ను స్థానిక పాఠశాల ఆవరణలో శనివారం ఎస్ఎన్ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రన్ మాట్లాడుతూ గిరిజనుల సౌకర్యార్థం తమ సంస్థ తరఫున 200 మందికి నడిపించుకుని తాగునీటిని తెచ్చుకొనే వీలర్స్, సోలార్ పంపు సెట్లు అందజేశామన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి.వి.రఘుపతి మాట్లాడుతూ గిరిజన రైతులు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు ఆనందదాయకంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఎఫ్ డైరెక్టర్ శశిప్రభ, సిబ్బంది హరిప్రసాద్, కాంతారావు, మధు, వంశీ, నర్సింగరావు పాల్గొన్నారు. -
వరుస కట్టిన గ్యాస్ కష్టాలు
మన్యంలో గ్యాస్ కష్టాల తీవ్రతకు ఈ చిత్రమే నిదర్శనం. అరకులోయ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం గ్యాస్ బండ్ల కోసం ప్రజలు బారులు తీరారు. మైదాన ప్రాంతాలైన ఎస్.కోట, వడ్డాది మాడుగుల నుంచి భారత్, హెచ్పీ ఏజెన్సీల నుంచి గ్యాస్ బండ్లను ఇక్కడి తీసుకువచ్చి సరఫరా చేస్తుంటారు. స్థానికంగా ఇండియన్ గ్యాస్ బండ్లను పంపిణీ చేస్తున్నారు. భారత్ గ్యాస్ వినియోగదారులు తెల్లవారుజాము నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రోజూ ఖాళీ బండ్లతో క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మండు టెండలో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి అపోహాలకు పోవద్దని గ్యాస్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నా.. బుక్ చేసి రోజులు గడుస్తున్నా గ్యాస్ బండ్లు ఇంటికి రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క కమర్షియల్ గ్యాస్ బండ్ల సరఫరా లేకపోవడంతో పలు హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తున్నారు. – అరకులోయటౌన్ -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
● నౌపడలో వైఎస్సార్ సీపీ భారీ బహిరంగ సభ రేపు ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు. -
సందడిగా ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
నాతవరం: పండగలు సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎస్ఐ వై.తారకేశ్వరరావు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నాతవరంలో అండర్ –14 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. నాతవరం హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ విద్యార్థినులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. చోడవరం హైస్కూల్ ద్వితీయ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులతోపాటు షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటి సభ్యుడు కరక అప్పలరాజు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్మాల్
తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు. -
చెక్పోస్ట్ కార్మికుని మృతికి నష్టపరిహారం చెల్లించాలి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం మండలంలో మైనింగ్ను ఏఎంఆర్ సంస్థలకు అప్పగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చెక్పోస్టులు వద్ద కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉండడంతో అనారోగ్యానికి గురై మృత్యవాత పడుతున్నట్లు వాపోయారు. కార్మికుల చట్టాలను ఏఎంఆర్ సంస్థ నీరుగారుస్తుందన్నారు. మండలంలో మామిడిపాలెం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్ట్లో మొబైల్ స్క్వాడ్ విధుల్లో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తాడేపల్లి గూడెంకు చెందిన ముప్పిడి రామిరెడ్డి కుటుంబానికి సదరు సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాదంలో క్షతగాత్రుడైన కూండం గ్రామానికి చెందిన జగదీష్కు పూర్తి వైద్యం అందించాలని కోరారు. మైనింగ్ చెక్ పోస్ట్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రాణాలకు తెగించి రేయంబవళ్లు మైనింగ్ ప్రాంతాలను చెక్ చేయడంతోపాటు నిత్యం ప్రమాదాలు గురవుతున్న వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, పనిగంటలు అదనంగా చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. లేబర్ అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రామాలయాలకు ‘వేద సంకల్ప సేవా ట్రస్ట్’ ఆర్థిక సాయం
కొయ్యూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ’వేద సంకల్ప సేవా ట్రస్ట్’ ఆధ్వర్యంలో పలు రామాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. కొయ్యూరు మండలంలోని రేవళ్లు, కాకరపాడు, శరభన్నపాలెం గ్రామాల్లోని రామాలయాలకు, అవసరమైన వస్తువుల కొనుగోలు నిమిత్తం ఒక్కో ఆలయానికి రూ. 10 వేలు చొప్పున విరాళం అందించారు. ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డీవీడీ ప్రసాద్, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గౌరి పార్వతి చేతుల మీదుగా ఈ సాయాన్ని అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదా పు 63కు పైగా రామాలయాలకు వేద సంకల్ప ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కొయ్యూరు మండలంలోని మూడు ఆలయాలకు ఈ సాయం అందడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. -
కమనీయం సీతారాముల కల్యాణం
పాడేరు : శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పాత పాడేరు వద్ద నిర్వహించిన వేడుకల్లో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తులకు అన్నదానం చేశారు. సుండ్రుపుట్టు రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముంచంగిపుట్టు: మండలంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక రామాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మూర్తి దంపతలు, పలువురు దంపతులు కల్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. సీతారాముల విగ్రహాలను డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో ఊరేగించారు. జోలాపుట్టు, బొండ్రుగూడ, దొడిపుట్టు, కిలగాడ, దార్రెల, పెదగూడ గ్రామాల్లో వేడుకలు, అన్నసమారాధన నిర్వహించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: ఆధ్యాత్మిక జీవనం మానవాళికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం తన స్వగ్రామమైన కొంతిలిలో పర్యటించిన ఆయన, అక్కడ నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భక్తి మార్గంలో నడవడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, స్థానిక సర్పంచ్ రేగం రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, హుకుంపేట సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరావు పాల్గొన్నారు. జి.మాడుగుల: రెండవ భద్రాద్రిగా పేరొందిన జి.మాడుగుల రామకోవెలలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. విశాఖ వేద పండితులు గోపాలశాస్త్రి బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య 100 జంటలతో కలిసి ఈ వేడుకను నిర్వహించారు. మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త మత్స్యరాస బాలరాజు–రూపవతి దంపతులు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు,పద్మ, జెడ్పీటీసీ మత్స్యరాస వెంకటలక్ష్మి, సన్యాసినాయుడు దంపతులు ఈ కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, థింసా నృత్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు సాగింది. అనంతరం దేవుని గెడ్డ వద్ద అనుపు ఉత్సవం నిర్వహించారు. మండలంలోని జీఎం కొత్తూరు, వంజరి, బందవీధి, నుర్మతి, గెమ్మెలి తదితర గ్రామాల్లోనూ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, ఆర్గనైజర్ రామరాజు, సభ్యులు వెంకటరమణ, కొత్తందొర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొయ్యూరు: మండలంలోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రపాలెం, కాకరపాడు, కొయ్యూరు, మంప, రేవళ్లు, ఆడాకుల, శరభన్నపాలెం, మర్రివాడ తదితర రామాలయాల్లో సీతారాముల కల్యాణం శాస్తోక్త్రంగా నిర్వహించారు. రాజేంద్రపాలెంలో నిర్వహించిన అన్నసమారాధనలో వైస్ ఎంపీపీ నూకాలు, సర్పంచ్ సింహాచలం, స్థానికులు పాల్గొన్నారు. చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి, పశువులుబంద, బయిలుకించంగి, గొందిపాకలు, బౌడ, తాజంగి, లంబసింగి, కొత్తపాలెం, అంజలిశనివారం తదితర గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అన్నసమారాధనలు ఏర్పాటుచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీలేరు: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వలస గెడ్డ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం చేపట్టారు. మహిళలు కోలాటం నిర్వహించారు. దుప్పులవాడ, దారకొండ గ్రామాల్లో స్వామివారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముంచంగిపుట్టులో అన్నసమారాధనలో భక్తులు వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు భారీగా తరలివచ్చిన భక్తజనం మార్మోగిన రామనామం భక్తిభావంతో పులకించిన మన్యం -
రామతీర్థానికి అప్పన్న దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: శ్రీరామనవమిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను వైదిక, అధికారులు తీసుకెళ్లారు. రామతీర్థంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గత 11 ఏళ్ల నుంచి అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అక్కడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం ఈవో జె.వెంకటరావు, అర్చకులు, అధికారులు తీసుకెళ్లారు. -
జీవీఎంసీ కమిషనర్తో బళ్లారి మేయర్ భేటీ
జీవీఎంసీ అభివృద్ధిని బళ్లారి ప్రతినిధులకువివరిస్తున్న కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్ఎస్, టోల్ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత
మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అలంకారప్రాయంగా 60 కెమెరాలు హార్బర్లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్వర్క్ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ నిఘా లేకపోవడంతో హార్బర్ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. నిషేధ కాలం వేళ.. పెరగనున్న భయం ఫిషింగ్ హార్బర్లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా), ఫిషింగ్ హార్బర్లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు -
నేడు ‘ఎర్త్ అవర్’
రాత్రి 8.30కు విద్యుత్ దీపాలు ఆఫ్ చేయండి డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
గ్యాస్ సరఫరా చేయాలని గిరిజనుల నిరసన
గ్యాస్ సరఫరా కోసం ఖాళీ కంచాలతో నిరసన తెలుపుతున్న గిరిజనులు రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం కల్యాణపులోవలో ఖాళీ సిలిండర్లతో ఖాళీ కంచాలు పట్టుకుని గిరిజనులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ కొన్ని రోజులు నుంచి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయలేకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని రావికమతం వస్తేనే గ్యాస్ ఇస్తామని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఏజెన్సీ గ్రామాల్లో తరుచూ సిగ్నల్ సమస్య వస్తుందన్నారు. దిగువ గ్రామాలకు వచ్చి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రావికమతం ఏజెన్సీ వద్దకు వెళ్తే నాలుగు రోజులు తర్వాత ఇస్తామని చెప్పుతున్నారని వాపోయారు. గ్యాస్ ఏజెన్సీ వారు గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజల ముంగిటకు వైద్య సేవలు : కలెక్టర్
పాడేరు : జిల్లాలోని గ్రామీణ మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా మంజూరైన అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు రాలేని రోగుల కోసం ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి అధునాతమైన వైద్య సేవలు, మందులను ఉచితంగా అందజేస్తారన్నారు. ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు నాగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం
నక్కపల్లి: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు వీసం రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైఎస్సార్సీపీదేనన్నారు. దీనిపై తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పాయకరావుపేట నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదన్నారు. 30 ఏళ్లపాటు 1983 నుంచి 2009 వరకు, మళ్లీ 2014 – 19 వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి విద్యార్థుల ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు రావాల్సిన తాండవ జలాలను సైతం విడుదల చేయించలేకపోయారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి ఈ ప్రాంత కరువు సమస్యలు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్, పాయకరావుపేటలో దక్కన్ కంపెనీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బహిరంగ వేదికపై చెప్పారన్నారు. విశాఖ – చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురంలో సెజ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనన్నారు. నియోజకవర్గానికి 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారన్నారు. నక్కపల్లి మండలంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు ప్రతిపాదనలను తీసుకొస్తే భూములు కోసం వచ్చే వారిని చెట్లకు కట్టి కొట్టాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారన్నారు. జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత.. దావోస్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఈవో ఆదిత్య మిట్టల్ను కోరగా, నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములను మిట్టల్ ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లిందని వీసం తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన చూపించారు. జూమ్ కాల్లో స్టీల్ ప్లాంట్ తెచ్చేశానని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూమ్ సమావేశంలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలరా? అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమంలో నిర్వాసితులను కనీసం గౌరవించే ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల త్యాగం వల్లే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీసీఐసీఆర్లో నక్కపల్లిని క్లస్టర్గా చేసిన ఘతన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్లు కేటాయించారన్నారు. నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచారన్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులుపై విమర్శలు చేస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే, హోం మంత్రి కూడా స్థానికేతరాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. కంబాల జోగులను విమర్శించే అర్హత టీడీపీ చోటా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల గోవిందరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు యలమంచిలి చందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, వార్డు సభ్యులు పిక్కి అప్పలరాజు, నాయకులు వంకా కృష్ణ, దమ్ము రమణ, ఎస్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. -
రోడ్డెక్కిన కాఫీ రైతులు
● కాఫీని జీసీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ ● లేకుంటే ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరిక చింతపల్లి: సీజన్కు ముందు దళారులను నమ్మవద్దని, గిట్టుబాటు ధర ఇచ్చి మేమే కొంటామని చెప్పిన జీసీసీ.. ఇప్పుడు తీరా సమయం వచ్చాక ముఖం చాటేయడం ఏంటి? అంటూ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఆందోళన చేపట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత చింతపల్లిలోని జీసీసీ డీఎం కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాఫీ గింజల కొనుగోలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన అధికారులు, ఇప్పుడు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం గిరిజన రైతులకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.వెంటనే ఐటీడీఏ, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే, రైతులందరితో కలిసి పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపైనే వంటా–వార్పూ చేపట్టి నిరసన తెలియజేస్తామన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జీసీసీ డీఎం, తహసీల్దార్ శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చిరంజీవి పడాల్, సీపీఎం నాయకులు పాంగి ధనుంజయ్, ఎంపీటీసీ సత్తిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల ప్రణాళికను పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
జల విపత్తుల నుంచి ప్రాణరక్షణే లక్ష్యం
● సుజనకోటలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ ● మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల గిరిజనుల్లో చైతన్యం నింపిన విన్యాసాలు ముంచంగిపుట్టు : మండలంలోని సుజనకోట పంచాయతీ మత్స్యగెడ్డ సాక్షిగా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలిపే అద్భుతమైన విన్యాసం జరిగింది. గెడ్డలు, వాగుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, నీటిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశాలపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గురువారం భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సందడి చేసిన రక్షణ విన్యాసాలు విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న, టీమ్ కమాండెంట్ ప్రదీప్ నేతృత్వంలో 25 మంది సభ్యుల బృందం ఈ మాక్ డ్రిల్లో పాల్గొంది. ప్రవాహంలో బోటు బోల్తా పడితే గల్లంతైన వారిని వెతికే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. సహాయం కోసం నీటిలో ఎదురుచూస్తున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రక్రియను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రమాదాలు జరగకుండా సామాన్యులు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై బృందం సభ్యులు వివరించారు. ముఖ్య అతిథుల సందేశం ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో మత్స్యగెడ్డను దాటడానికి ఎక్కువగా నాటు పడవలను ఉపయోగిస్తుంటారు.. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలోని అన్ని మండలాల్లో నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలి అని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, ఎంపీడీవో ధర్మారావు, తహసీల్దార్ భాస్కర అప్పారావుతో పాటు సీఆర్పీఎఫ్ సీఐ శ్రావణ్కుమార్, ఎస్ఐ నాని, సర్పంచులు రమేష్, సుభాష్, త్రినాథ్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైద్యాధికారి నిఖిల్, వివిధ పార్టీల నేతలు జగబంధు, పద్మారావు, అర్జున్, సన్యాసమ్మ, బలరాం, శ్రీను పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణనష్టం జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ఈ ప్రయత్నంపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. సుజనకోట వద్ద మత్స్యగెడ్డలో మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్డ్రిల్ను తిలకిస్తున్న ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర -
కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు
పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్ఫోన్లు పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
చింతలూరు కొండలను కొల్లాగొడుతున్నారు..
మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు తేలినప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం ఇక్కడంతా ఏమీ జరగలేదని నివేదికలు పంపిస్తుండడం గమనార్హం. నర్సీపట్నంలోని మైనింగ్ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట...పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల ఘనులు చెలరేగిపోతున్నారు. అధికారపార్టీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. రూ. 100 కోట్ల మేర నిరుద్యోగులకు టోపీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ చేపడుతున్న సదరు టీడీపీ నేత గుంటూరు నుంచి వచ్చి మరీ ఇక్కడ దౌర్జన్యం చెలాయిస్తున్నారు. ఇతరులకు చెందిన క్వారీని ఆక్రమించి మరీ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజ్డమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 100 కోట్ల మేర వసూలు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, ఇందులో సీఈవోగా ఉన్న అజయ్ కొల్లా కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేరకు ఈ ముఠా వసూలు చేసింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నిరుద్యోగుల జాబితాను ఇతర కంపెనీలకు విక్రయిస్తుందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా విజ్డమ్ జాబ్స్ పేరుతో స్థాపించిన కంపెనీలోని ఉద్యోగులతోనే నిరుద్యోగులకు ఫోన్ చేయించి మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ కూడా మోసం చేసి ఆయా అభ్యర్థుల నుంచి ఇంత మొత్తం చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎంత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే, అటువంటి ఉద్యోగులకు పర్సంటేజీల రూపంలో చెల్లించే ఏర్పాటు కూడా అజయ్ కొల్లా చేయడం గమనార్హం. -
బొలేరో– స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి
రావికమతం : స్థానిక బీఎన్రోడ్డులో గురువారం ఎదురెదురుగా వస్తున్న బొలేరో, స్కూటీ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ యువకులు మృతి చెందారు. మరో మైనర్ గాయపడ్డాడు. ఈ దుర్ఘటనపై ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చేఽందిన డి.ఉదయ్కుమార్ (16), సిహెచ్.కోటేశ్వరరావు(17), ఐ.బాజ్జి(17) అనే ముగ్గురు గురువారం ఏపీ 39ఎఫ్డబ్ల్యు 4047 నంబర్ గల స్కూటీపై కొత్తకోట వైపు వెళుతుండగా అదే సమయంలో గర్నికం గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీను బొలేరో(ఏపీ39టీఎల్ 3332) వాహనంపై పాడేరు వెళుతుండగా ఎదురెదురుగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉదయ్కుమార్ (పండు), కోటేశ్వరరావుల తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయ్కుమార్, కోటేశ్వరరావులకు తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ (పండు) మరణించగా, కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో యువకుడు బాజ్జి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బొలేరో వాహనం డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. ఇద్దరు మైనర్ యువకులు మృతి చెఽందడంతో రావికమతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన
పాడేరు : జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఐటీడీఎ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అందిన ప్రతికూల ఫీడ్ బ్యాక్కు గల కారణాలను నిశితంగా పరిశీలిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్కు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హెచ్ఎంలు జవాబుదారితనంలో విధులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసన వాతావరణం కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూఓలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయరూ..
రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట కేంద్రంగా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని గురువారం గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి నిరసన తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో గల జెడ్.జోగుంపేటలో ఎంపీపీ స్కూల్ ఉంది. జెడ్.జోగుంపేట గ్రామం చుట్టు కరగెడ్డ, గంగంపేట, రొచ్చుపణుకు,పెద గరువు, రాయపాడు, నేరెడు బంద, బంగారు బందలు, అజేయపురం తదితర గ్రామాల గిరిజన విద్యార్థులు జెడ్.జోగుంపేటలో చదువుకుంటున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల పరిధిలో 70 గ్రామాల గిరిజన విద్యార్థులకు జెడ్.జోగుంపేట కేంద్రంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలని చోడవరం నియోజవర్గంలో ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా లేదని, ఆశ్రమ పాఠశాల ఉంటే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించి జెడ్.జోగుంపేటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య,పాంగి చంపావతి,వంతల ఐలమ్మ పాల్గొన్నారు. -
‘నడక’ వైద్యం
రాజేంద్రపాలెం వైద్యాధికారి జగదీష్ నాయక్ మానవత్వం కొయ్యూరు: అంబులెన్స్ వెళ్లడానికి దారి లేదు.. కనీసం నడవడానికి సరైన బాట లేదు.. కానీ ఆ గిరిజనుల ఆరోగ్యం కోసం ఆ వైద్యుడు వెనకడుగు వేయలేదు. మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ గురువారం మారుమూల గ్రామాల్లో పర్యటించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అడవి బాటలో అడుగులు.. బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని చల్దిగెడ్డ, కొత్తపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆయన తన బృందంతో కలిసి కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. ఆ రెండు గ్రామాల్లోని సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలుషిత నీటిని తాగరాదని, నీటిని కాచి వడపోసి తాగాలని సూచించారు. నిల్వ ఉంచిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సేవా కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కష్టతరమైన బాటలో నడిచి వచ్చి తమకు వైద్యం అందించిన వైద్యాధికారిని గ్రామస్తులు కొనియాడారు. -
కూటమి పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యం
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శ పాడేరు : కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యమని జిల్లాలోని గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. మండలంలోని మారుమూల కించూరు పంచాయతీ వంటివీధుల, గొండెలి పంచాయతీ వంచెడిగొంది గ్రామాలను గురువారం ఆయన సందర్శించారు. ఇంటింటా వెళ్లి గిరిజనులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా రక్షిత తాగునీరు, రహదారి సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వివక్ష చూపుతున్న కూటమీ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పార్టీ మండల అద్యక్షుడు సీదరి రాంబాబు, సర్పంచ్లు వంతాల రాంబాబు, సోమెలి లక్ష్మణరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు గుల్లెల లింగమూర్తి, సీనియర్ నేతలు ముదిలి సత్యనారాయణ, పలాసి రామారావు, సింహాచలం, అల్లాడ అశోక్ పాల్గొన్నారు. -
సీలేరులో సీప్లేన్ సందడి
● ఏప్రిల్ 2న ప్రజాభిప్రాయసేకరణ ● తహసీల్దార్ అన్నాజీరావు గూడెంకొత్తవీధి: పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి వేదిక కానున్న సీలేరు జలాశయం ’సీప్లేన్ ఏరోడ్రోమ్’ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ అన్నాజీరావు గురువారం వెల్లడించారు. ఏరోడ్రోమ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతం పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని, అందులో భాగంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని వివరించారు. ఏప్రిల్ 2న జరిగే ఈ కీలక సమావేశానికి ఇన్చార్జి జేసీ స్వయంగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. సీలేరులో సీప్లేన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఈవీఎం గొడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల: ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్ను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. తాళాలు తీయించి గొడౌన్ లోపల కూడా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్బుక్లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నాయకులతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయిషా, కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, వి.రమేష్, మీసాల సుబ్బన్న, కె.హరినాథ్బాబు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు పంపండి ●గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు ఏజెంట్ను నియమించి వివరాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు కోరారు. ఈవీఎం గొడౌన్ తనిఖీ అనంతరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని కోరారు. -
గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ
మాడుగుల రూరల్: గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని మాడుగుల నియోజకవర్గ పౌర సరఫరాల ఉప తహసీల్దారు(సీఎస్డీటీ) కె.రవిబాబు అన్నారు. మాడుగులలోని సీతారామ భారత్ గ్యాస్ గోదామును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రస్తుతం గోదాంలో 342 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఈ వారంలో ఆయిల్ కంపెనీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు రాకపోవడం వల్ల బ్యాక్లాగ్ ఎక్కువైపోయిందని సీఎస్డీటీ తెలిపారు. దీని వల్ల ఒకేసారి గోదాం వద్ద రద్దీ ఏర్పడిందని, గురువారం 500 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు అందించామన్నారు. రాబోయే రెండు రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంనది ఆయన స్పష్టం చేశారు. ఘాట్రోడ్డు జంక్షన్లో హోటళ్ల తనిఖీ అనంతరం ఘాట్రోడ్డు జంక్షన్లోని పలు హోటళ్లను సీఎస్డీటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోదమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్లో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరాపల్లిలో కూడా హోటళ్లను తనిఖీ చేసి, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు రవిబాబు తెలిపారు. -
జలగలగెడ్డ ‘రహదారి రగడ’ సుఖాంతం
● సమస్య పరిష్కరించిన అధికారులు ● 17 రోజుల దీక్ష విరమించిన ఆదివాసీలు పాడేరు: దశాబ్దాల నిరీక్షణ, 17 రోజుల అలుపెరుగని పోరాటం తర్వాత చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్తుల రహదారి కల సాకారమైంది. జిల్లా యంత్రాంగం చొరవతో ఇన్నాళ్లూ నెలకొన్న వివాదం పరిష్కారం కావడంతో ఆదివాసీలు తమ నిరసనను విరమించారు. వివాద నేపథ్యం..: జలగలగెడ్డ గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు, కొర్రుబయలు నుంచి జలగలగెడ్డ వరకు 650 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 90 లక్షలు మంజూరు చేసింది. అయితే, ఈ రహదారి తమ పట్టా భూములు, కాఫీ తోటల గుండా వెళ్తుందంటూ కొర్రుబయలు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గమధ్యలో ఇనుప కంచెలు వేసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఐటీడీఏ వద్ద సుదీర్ఘ పోరాటం.. : తమ గ్రామానికి వెళ్లే దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ, తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జలగలగెడ్డ ఆదివాసీలు తమ పిల్లపాపలతో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సమస్యపై అఖిలపక్ష బృందం డీఎల్వో ఆధ్వర్యంలో మద్దతు తెలిపింది. ఈ అంశంపై సాక్షిలో ప్రచురితమైన రహదారి రగడ శీర్షికన ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. అధికారుల జోక్యంతో పరిష్కారం: జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం జలగలగెడ్డకు చేరుకున్నారు. వివాదానికి కారణమైన ఇనుప కంచెలను తొలగించి, రక్షణ మధ్య రహదారి పనులను పునఃప్రారంభించారు. సమస్య సద్దుమణగడంతో గురువారం కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీవో, జేసీ తిరుమణి శ్రీపూజకు ఆదివాసీలు వినతిపత్రాలు అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి పనులు మొదలుపెట్టడంతో, ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆదివాసీ మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీంతో 17 రోజులుగా సాగుతున్న నిరసన శిబిరాన్ని గ్రామస్తులు ఎత్తివేశారు. -
యలమంచిలిలో భారీ చోరీ
యలమంచిలి రూరల్ : పట్టణ ఠాణా పరిధి కట్టుపాలెం చెరకు కాటా సమీపంలో కొత్తపాలెం వెళ్లే రహదారి పక్కనున్న ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు కాజేశారు.ఇక్కడ నివాసముంటున్న రైతు బొడ్డేటి సతీష్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం బీరువాలో భధ్రపరిచిన సుమారు 9 తులాల బరువున్న 4 బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడు, ఘటనా స్థలంలో స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రైతు సురేష్ పొలం పని చేసుకోవడానికి వెళ్లారు.అతని భార్య యలమంచిలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పిల్లల చదువుకు సంబంధించి వాకబు చేయడానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కనే ఒక ప్రదేశంలో దాచి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేరని ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భార్య బీరువా తెరిచి ఉండడం చూసి పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. దీంతో బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామెవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోరీ జరగడాన్ని బట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, ఏఎస్ఐ చెల్లారావు, అనకాపల్లి నుంచి క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబీకుల నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చోరీ సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నర్సీపట్నం:రపభుత్వం తక్షణమే స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు.. పిల్లలకు వండి పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట నుంచి స్కూళ్లకు క్యారేజీలు పంపాలని నిర్ణయించాయన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల వల్ల వేలాదిమంది వంట కార్మికులు ఉపాధి కోల్పోతాయరని చెప్పారు. కార్మికులందరూ ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పి కొట్టాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ కిచెన్ పేరుతో అక్షయపాత్ర, ఇస్కాన్, నవ ప్రయాస వంటి సంస్థలకు కట్టబెడితే నాడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించినట్టు గుర్తు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఐక్యంగా పోరాడాం దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా పిల్లలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారన్నారు. సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్కు ప్రభుత్వమే స్థలం ఇచ్చి, రూ.55 లక్షలతో నిర్మిస్తుందన్నారు. మనకు మాత్రం వంట షెడ్లు, పాత్రలకు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్ కార్మిక సంఘం నాయకులు ఒ.నూకరాజు, సత్యవతి, ప్రసన్న, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
అనకాపల్లి: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం చేకూరుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ అన్నారు. మండలంలో ఏఎంఎఎల్ కళాశాల క్రీడామైదానంలో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అనంతరం 100, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, త్రోబాల్, డిస్క్త్రో తదితర పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30,31 గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
మర్యాదపూర్వక కలయిక
దేవరాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, అనకాపల్లి సమన్వయ కర్త మలసాల భరత్కుమార్ బుధవారం వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ముత్యాలనాయుడు చెప్పారు. -
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
దేవరాపల్లి: ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు సూచించారు. మండలంలోని మారేపల్లిలో ఆత్మ పథకం సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్థానిక వ్యవసాయ అధికారి ఎల్.వై.కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రెండో రోజు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిందె దశలో ఉన్న నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు 13.0.45 మల్టీ–కె, 19.19.19 పిచికారి చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడాలని తెలిపారు. రైతులకు జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తర్ణ అధికారి ఎస్. కిరణ్కుమార్ తదితర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
శారదా నదిలో వృద్ధుడు గల్లంతు
ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు కశింకోట: మండలంలోని తేగాడ గ్రామం వద్ద శారదా నదిలో బుధవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తేగాడకు చెందిన గొంతిన లోవరాజు (60) కూలి పని కోసం గ్రామ సమీపంలోని నదిని నడిచి దాటడానికి అవతలకు వెళ్తుతుండగా మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందడంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వృద్ధుడ ఆచూకీ దొరకలేదు. లోవరాజుకు భార్య సూర్యకాంతం, వివాహమైన కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు
అనకాపల్లి: మండలంలోని తగరంపూడిలో ఈనెల 20వ తేదీ రాత్రి మాజీ మంత్రి, దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేయకుండా కేసును నీరుగాచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథరావు పార్టీలకు అతీతంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారని, ఆయన మరణానంతరం తగరంపూడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించిన గ్రామ జనసేన ప్రధాన నాయకుడు భరత్బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26 జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, గురునాథరావు అభిమానులు విగ్రహాన్ని సందర్శించనున్నట్టు చెప్పారు. తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావు ఈనెల 21న విగ్రహం వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించి 15 రోజుల క్రితం గ్రామ జనసేన నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారని తెలిపారని, అదే సర్పంచ్ ఈనెల 24న విగ్రహాన్ని జనసేన నాయకులు తొలగించమని చెప్పలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్ మాటమార్చే విధంగా కూటమి నేతలు ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2004లో ఏఎంఎఎల్ కళాశాలలో దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై పార్టీలకు అతీతంగా అప్పటి వర్తకసంఘం నాయకులు కేసులు నమోదు చేయించారని చెప్పారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కూడా పార్టీలకు ఆతీతంగా కేసు నమోదు చేయించి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించాలన్నారు. దోషులను అరెస్టు చేసేవరకూ పోరాటాలు చేస్తామన్నారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తులను అరెస్టు చేయకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అరెస్టు చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన కూటమి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, తూతూ మంత్రంగా చిన్ననాయకులను అరెస్టు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, 81వ వార్డు ఇన్చార్జి బొడ్డేడశివ, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్యనాయుడు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, పార్టీ నాయకులు బుద్దిరెడ్డి దేముడుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
28 నుంచి అప్పన్న వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి: ఉత్సవాల కార్యక్రమాలు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవాంగీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. ● 29న మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ధ్వజారోహణం, 6:30 నుంచి 7:30 వరకు ఎదురుసన్నాహోత్సవం, రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రథోత్సవం, రాత్రి 10.30 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు. రాత్రి 8.30 నుంచి 10.30 వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ● 30న సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై స్వామివారి తిరువీధి. ● 31న మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు పండిత సభ, సాయంత్రం 6 గంటలకు సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 1న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 2న ఉదయం 6 గంటలకు పూర్ణాహుతి, 7 గంటలకు కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు. రాత్రి దొంగలదోపు ఉత్సవం. ● ఏప్రిల్ 3న ఉదయం 8 నుంచి 10.30 వరకు వినోదోత్సవం, 10.30 నుంచి 11.30 వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం. దర్శనాల సమయాల్లో మార్పులు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. ● 29 నుంచి ఏప్రిల్ 2 వరకు (మార్చి 29 మినహా) రాత్రి 7 గంటల తర్వాత దర్శనం ఉండదు. ● ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. సేవల రద్దు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు, 28 నుంచి ఏప్రిల్ 13 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 29న కల్యాణోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు రాజగోపురం సమీపంలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు. కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పౌరాణిక నాటకాలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు. -
సీలేరును నిర్వాసిత గ్రామంగా ప్రకటించాకే ‘పంప్డ్ స్టోరేజ్’ పనులు
జేఏసీ నేతలు డిమాండ్సీలేరు: ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో సీలేరును నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని కోరుతూ స్థానిక జేఏసీ నాయకులు బుధవారం జెన్కో అధికారులతో చర్చలు జరిపారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు, ఎస్ఈ జాకీర్ హుస్సేన్, డీఈ బాలకృష్ణ, సర్పంచ్ దుర్జో, జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. తొలివిడతగా పార్వతీ నగర్, సాండ్ కోరి, బూసుకొండ గ్రామాల్లో ప్యాకేజీ అమలు చేశాక, సీలేరు యువతకు మెగా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈ హామీ ఇచ్చారు. సీలేరును పూర్తిస్థాయి నిర్వాసిత గ్రామంగా అధికారికంగా ప్రకటించాలని, అప్పటి వరకు పనులు ప్రారంభించవద్దని నాయకులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల దెబ్బతినే ప్రస్తుత స్మశాన వాటికకు బదులుగా, అన్ని సదుపాయాలతో వేరే చోట కొత్తది నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామంగా సీలేరును చేర్చే అంశాన్ని ఎండీ దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే, డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాంబమూర్తి, ఉప సర్పంచ్ వల్లి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ కార్య శ్రీనివాస్, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో ఇటుకల పండగ సందడి
డుంబ్రిగుడ: మండలంలో గిరిజనుల సాంప్రదాయ ఇటుకల పండగ సంబరాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అరకు – పాడేరు జాతీయ రహదారితో పాటు పలు గ్రామాల రోడ్లపై గిరిజన మహిళలు గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి పజోర్లు (చందాలు) వసూలు చేస్తూ సందడి చేశారు. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండుగలో పజోర్ల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని గ్రామంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ వారం రోజుల పాటు గిరిజనులు ఎటువంటి పనులకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ, ఊయలలు కట్టుకుని మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా గడుపుతారు.ఈ పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వేటకు వెళ్తారు. పండుగ ముగింపు రోజున గుడ్డును కొట్టడం లేదా ఏదైనా జంతువును వేటాడటం ద్వారా ఉత్సవాన్ని ముగిస్తారు. -
ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి
● జిల్లా ఆహార భద్రత అధికారి గ్రీష్మ జి.మాడుగుల: గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో వంట గదుల శుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలపై వార్డెన్లు, వంట సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఆహార భద్రతా అధికారి గ్రీష్మ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీకే పరిమళ సూచించారు. బుధవారం స్థానిక ఏటీడబ్ల్యూవో కార్యాలయంలో మండలంలోని వసతి గృహాల వార్డెన్లు, వంట సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో ఆహార పరిరక్షణ, వంట గదిలో పాటించవలసిన పరిశుభ్రత ప్రమా ణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, వంట చేసేటప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు వంట గది పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో నాగ శిరీష, మినీ గురుకులం స్పె షల్ ఆఫీసర్ ఎం. విజయకుమారి, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు, వంట సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యాటకుడి దారుణహత్య
అరకులోయ టౌన్/ తెర్లాం (విజయనగరం జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలం, చినలబుడు పంచాయతీ పరిధిలోని హట్టగుడ సమీపంలోని ‘రూప రిసార్ట్స్’ ప్రధాన రహదారిపై పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగింది?విజయనగరం జిల్లా తెర్లాం మండలం, జన్నివలస గ్రామానికి చెందిన నాగళ్ల సురేష్ (25) రెండేళ్ల కిందట అరకులోని పద్మాపురం వద్ద ఉన్న ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని లలితా జ్యుయలరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం తన స్వగ్రామంలో జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన సురేష్ విజయనగరం వెళ్లివస్తానని ఇంటి వద్ద చెప్పి అరకులోయ వచ్చాడు. ఉషోదయ రిసార్ట్స్లో పనిచేస్తున్న ఓ యువతితో కలిసి అతను రూప రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో లాడ్జిలో పనిచేస్తున్న కొంతమంది యువకులతో సురేష్కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గొడవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన సురేష్ను, రిసార్ట్స్ సమీపంలోని రహదారి వద్ద దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాడేరు డీఎస్పీ అభిషేక్ వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ కేసులో రిసార్ట్స్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి... విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి సమయంలో అరకులోయలో హత్యకు గురైయ్యాడన్న సమాచారం బుధవారం ఉదయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జన్నివలసకు చెందిన నాగళ్ల అప్పలనాయుడు, సూరమ్మలకు ముగ్గురు వివాహితులైన కుమారులు, ఒక అవివాహిత కుమార్తె ఉన్నారు. వారిలో సురేష్ మూడవ కుమారుడు. రెండేళ్ల కిందట సురేష్ అరకులోయ మండలం పద్మాపురంలోని ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. హైదరాబాద్లోని లలిత జ్యూయలరీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. సురేష్కు ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన తులసితో వివా హం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రారంభానికి వచ్చి హత్యకు గురికావడంతో కన్నీరుపెడుతున్నారు. సురేష్ మృతితో జన్నివలస గ్రామంలోని యాదవ వీధిలో విషాదం అలముకుంది.పర్యాటక స్వర్గథామం అరకులోయలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువకుడు రిసార్ట్ సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అరకులోయలో గొంతు కోసినదుండగులు పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో గొడవలే కారణం? అనుమానిస్తున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించిన పాడేరు డీఎస్పీ అభిషేక్ విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతుడి స్వగ్రామం జన్నివలసలో విషాదఛాయలు -
షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల కోసం ‘ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’
జి.మాడుగుల: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని కోరుతూ మండలంలోని పెదలోచలి, గొడుగుమామిడి, వంతాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ఈ యాత్ర నేటితో 136వ రోజుకు చేరుకుంది. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో, సొలభం సర్పంచ్ ఐసరం హనుమంతరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామన్నదొర ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానిక గిరిజనులకే కేటాయించేలా వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని, కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడానికంటే ముందే ఈ నియామక చట్టం ప్రక్రియను పూర్తి చేసి, ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా, వచ్చేనెల 3న (శుక్రవారం) పాడేరులో నిర్వహించబోయే భారీ బహిరంగ ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, జెఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరింది. -
చిన్నారులకు సకాలంలో టీకాలు
● జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పసుపులేటి నారాయణ గూడెంకొత్తవీధి: చిన్నారులకు సకాలంలో టీకాలను వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పసుపులేటి నారాయణ ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పలు పీహెచ్సీల వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాజేంద్రపాలెం, యూ.చీడిపాలెం, ఆర్వీనగర్, జీకేవీధి, సీలేరు, సప్పర్ల, దారకొండ పీహెచ్సీల సిబ్బంది హాజరయ్యారు. మాతృ, శిశుమరణాల నివారణ, వ్యాక్సినేషన్, హెల్త్కార్డులు, ఆర్సీహెచ్ పోర్టల్ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈహెచ్ఆర్ నోడల్ అధికారి హరిప్రియ, పీహెచ్సీ వైద్యాధికారి రుషశ్రీ, డీపీహెచ్ఎన్వో భూలోకమ్మ, ఎంపీహెచ్ఈవో వెంకటేష్, హెచ్ఎస్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
చిల్లిగవ్వే మిగిలేది!
చెమట చిందించినా..వారపు సంతల్లో మద్దతు ధర లేక గిరి రైతు విలవిల● కొనసాగుతున్న దళారుల దోపిడీ ● గిట్టుబాటు కాక నష్టాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాత అడవిని నమ్ముకుని, ఆకాశమే హద్దుగా శ్రమిస్తూ.. రక్తాన్ని చెమటగా మార్చి ఆదివాసీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కరువైంది. వారపు సంతలే వేదికగా సాగుతున్న ఈ ధరల దోపిడీలో దళారులు లాభపడుతుంటే, గిరి రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయట మార్కెట్లో ధరల మంట.. సంతలో మాత్రం గిరిజన పంటల ధరలు పతనం.. ఈ వైరుధ్యాల మధ్య ఆదివాసీ రైతులు విలవిల్లాడుతున్నారు. జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిలకడగా లేకపోవడంతో ఆదివాసీ రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత రైతులు ప్రధానంగా పసుపు, మిరియాలు, పిప్పలి, అల్లం, కాఫీ వంటి వాణిజ్య పంటలను ఎంతో కష్టపడి పండిస్తున్నారు. అయితే, తాము పండించిన పంటను విక్రయించుకోవడానికి వీరికి స్థానిక వారపు సంతలే ప్రధాన దిక్కవుతున్నాయి. రైతుల ఆవేదన సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న ధరలు, గత మూడు వారాలుగా క్రమంగా పడిపోతుండటం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జి.మాడుగుల సంతబయలు మంగళవారం, మద్దిగరువులో గురువారం జరిగే సంతల్లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ధరల వ్యత్యాసమిలా.. మిరియాలు: కిలో రూ. 670 నుంచి రూ. 640, పసుపు: కిలో రూ. 140 నుంచి రూ. 120, పిప్పలి మోడి: కిలో రూ. 300 నుంచి రూ. 260కు తగ్గింది. పాచ్మెంట్ కాఫీ: కిలో రూ. 510 నుంచి రూ. రూ.425కు, కాఫీ గుల్లరకం రూ.270 నుంచి రూ.230కు పతనమైంది. మొత్తంగా కిలోకు రూ. 20 నుంచి రూ. 50 వరకు ధరలు తగ్గడంతో గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతోంది. మోసపోతున్న వైనం మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొండ కోనల నుంచి ఎంతో శ్రమటోడ్చి పంటను సంతకు తీసుకొచ్చిన రైతులు, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, రవాణా ఖర్చుల భారంతో నష్టానికై నా వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. బయట మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, మేము పండించిన పంటలకు మాత్రం ధరలు పడిపోతున్నాయి అని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం వారపు సంతల్లో వాణిజ్య పంటల ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని, తద్వారా దళారుల దోపిడీ నుంచి తమను రక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.కొనుగోలుకు వెనుకాడుతున్నాం మార్కెట్లో వాణిజ్య, వ్యవసాయ పంటలు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల వారపుసంతలో ధరలు తగ్గడంతో రైతులకు కొంత వరకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. గత మూడు వారాల నుంచి ఉత్పత్తుల ధర కిలో రూ. 20 నుంచి 50వరకు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నాం. తెగించి కొనుగోలు చేస్తే నష్ట పోవాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, వ్యాపారి, మాడుగుల ధరలు నిలకడగా లేక నష్టం ఏజెన్సీ ప్రాంతంలోని వారపుసంతల్లో పసుపు, పిప్పలి, కాఫీ, మిరియాలు వంటి వాణిజ్య, వ్యవసాయ పంటలకు ధరలు నిలకడగా ఉండటం లేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. వారపుసంతల్లో ధరలు రానురాను పెరుగుతాయని భావించి నిల్వ చేసుకున్న పంటలు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో అమ్ముకోవాల్సి వస్తోంది. – నాయుడు, పసుపు రైతు, పెదలోచలి, జి.మాడుగుల మండలం -
సచివాలయ వ్యవస్థనుసద్వినియోగం చేసుకోండి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. బుధవారం మండలంలోని సంతరి గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న హయాంలో నిర్మించిన సచివాలయ భవనాలు ‘గ్రామ స్వరాజ్యానికి’ నిలువెత్తు సాక్ష్యాలని, ఇవి ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా మిగిలిపోతాయని కొనియాడారు. ప్రస్తుత కూటమి పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక పంచాయతీ భవనాలకు మోక్షం కలగలేదని, నేటికీ అవి మొండిగోడలతోనే దర్శనమిస్తున్నాయని విమర్శించారు. నిజమైన నాయకుడంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉండాలని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కడం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్, వైస్ ఎంపీపీ గంజాయి సుశీల, సర్పంచ్లు కాసులమ్మ, వెంకట పూర్ణిమ, నాయకులు సంజీవ్, కామేష్, నాగేష్ పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలోనేడు ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
ముంచంగిపుట్టు : మండలంలో గల సుజనకోట మత్స్యగెడ్డలో ఈ నెల 26వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్డ్రిల్ నిర్వహిస్తాయని ఎంపీడీవో ధర్మారావు,తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. బుధవారం సుజనకోట, కొత్తసుజనకోట, కుమ్మరి పుట్టు గ్రామాల గుండా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డను విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నతో కలిసి మండల స్థాయి అధికారులు పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. నాటు పడవలపై గెడ్డ దాటేటప్పుడు జరుగుతున్న ప్రమాదాల వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. మండలంలోని 23 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.సర్పంచ్ రమేష్, పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు వెంటనే అనుమతులు మంజూరు
● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: జిల్లా సమగ్రాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిచ్చే రహదారులు, సెల్ టవర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణానికి తీసుకునే అటవీ భూములకు బదులుగా, రెవెన్యూ భూములను ప్రత్యామ్నాయంగా చూపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలకు లోబడే అభివృద్ధి పనులు జరగాలన్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ లేదా ప్రైవేటు భూములకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులతో బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు, రంపచోడవరం ఆర్డీవో అంబేడ్కర్, పాడేరు, చింతపల్లి డీఎఫ్వోలు ఉమామహేశ్వరి, నర్సింగరావు పాల్గొన్నారు. జనగణనపై ముగిసిన శిక్షణ జనగణన–2027పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు స్థానిక కలెక్టరేట్లో గత మూడు రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లాలోని 11 మండలాల నుంచి శిక్షణ పొందిన 22 మంది ఉపాధ్యాయులకు ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, జనగణన సెన్సెస్ అధికారి త్రినాథరావు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. గిరిజనుల శ్రమదానం
ముంచంగిపుట్టు: అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. నిత్యం ఎదురవుతున్న ప్రయాణ కష్టాలు మరోవైపు.. వెరసి మండలంలోని బరడ పంచాయతీ సోలగంపుట్టు గ్రామ గిరిజనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, మంగళవారం వారే స్వచ్ఛందంగా తరలివచ్చి శ్రమదానం చేశారు. సోలగంపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు పాడై నెలలు గడుస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాడైన కల్వర్టును బాగు చేసేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. రాళ్లు సేకరించి తెచ్చి, గుంతలు పడిన చోట పూడ్చి, మట్టి వేసి రాకపోకలకు వీలుగా కల్వర్టును తాత్కాలికంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామానికి కొత్త కల్వర్టును మంజూరు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన రహదారిని నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని సోలగంపుట్టు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా కల్వర్టును బాగు చేసుకున్న సోలగంపుట్టు గ్రామస్తులు -
కొత్త జోష్
ఉమ్మడి విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలుఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం ఆశావహుల్లోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది. ఓట్ల సంఖ్యను బట్టి విభజన పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ మ్యాప్ కూడా మారే చాన్స్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిమితి మారి.. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీట్లతో రీడిజైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా రావచ్చనే చర్చ నడుస్తోంది. ద్వితీయ శ్రేణి నేతల జోరు సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పునర్విభజనతో మారనున్నఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు 2029 సమరానికి ఇప్పుడే మొదలైన లెక్కలు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. -
సీలేరు పీహెచ్సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు
సీలేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. స్థానిక పీహెచ్సీకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వంజరి శివ, ఫార్మసిస్టు అరుణ, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎం దుచ్చరి దేవి, ఆశా కార్యకర్త జ్యోతి విశిష్ట సేవలకు గానూ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. -
రహదారుల పనులు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకు చేపడుతున్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. బుదవారం తన ఛాంబర్ నుంచి ఎస్పీ అమిత్బర్దర్తో కలిసి గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అనుమతి పొందిన 30 పనుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. పది రోడ్లు పూర్తయ్యాయని మరో పది రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతుల ప్రక్రియలో ఉండగా మరో ఏడు పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో మూడు పనులు అనుమతుల కోసం పంపించామన్నారు. జిల్లాలో జరుగుతున్న పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, ఫారెస్ట్ అనుమతులు, అడ్డకుంలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పలు శాఖల ఇంజనీరింగ్ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
మంచినీటి పరీక్షలుతప్పనిసరిగా నిర్వహణ
● చింతపల్లి ఎంపీడీవో సీతామహలక్ష్మి ఆదేశం చింతపల్లి: రానున్న వేసవి దృష్ట్యా మండలంలోని ప్రతీ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వనరులకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది విధిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అదికారులు, అసిస్టెంట్లతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీరు సేవించేలా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏ గ్రామంలోనైనా తాగునీటిలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శితో పాటు పంచాయతీ అధికారులకు తెలయజేయాలన్నారు.గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో బీఏబీల్ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వర్ణలత పాల్గొన్నారు. -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి
పాడేరు: జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అంకార్డ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.గంజాయి ప్రభావం ఉన్న ప్రతి గ్రామం, మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వల్ల వ్యక్తికి, సమాజానికి కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గంజాయికి బానిసైన వారిలో మార్పు తెచ్చి, వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేసి గిరిజనుల జీవనోపాధికి తోడ్పడాలన్నారు. చట్టవిరుద్ధంగా గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం నిఘా.. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ.. చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి నందు, డీఎల్పీవో కుమార్, డ్వామా పీడీ విద్యా సాగర్, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్ కుమార్ -
రూ.1.50 కోట్లతో 13 కొత్త అంబులెన్స్లకొనుగోలు
పాడేరు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాల మేరకు, రూ.1.50 కోట్ల నీతి ఆయోగ్ నిధులతో 13 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేయనున్నట్లు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ–టెండర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.అర్హత కలిగిన ఏజెన్సీలు, సరఫరాదారులు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల సంస్థలు టెండర్ నిబంధనలు, పూర్తి వివరాల కోసం అల్లూరిసీతారామరాజు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
క్రెడిట్ చోర్ ఘనుడు చంద్రబాబు
నక్కపల్లి: రాష్ట్రానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. దీన్ని తన ఖాతాలో వేసుకుంటూ డప్పా కొట్టుకుంటున్న చంద్రబాబును మించిన క్రెడిట్ చోర్ ఘనుడు లేరన్నారు. మంగళవారం అడ్డురోడ్డులో విలేకరుల సమావేశంలో జోగులు మాట్లాడుతూ 2022లో దావోస్ పర్యటనలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డిని మిట్టల్ గ్రూపు ఇండియా సీఈవో ఆదిత్య మిట్టల్ కలిసి రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నారన్నారు. ఈ విషయం అప్పట్లో పలు జాతీయ ప్రసార మాధ్యమాల్లో వచ్చిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుతూ స్టీల్ ప్లాంట్ ఘనత తమ ప్రభుత్వానిదేనని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను సేకరించి నిర్వాసితులను, రైతులను అనాథలుగా వదిలేశారన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళన చేస్తే, కేవలం రూ.9 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిట్టల్ కంపెనీ వారు స్టీల్ ప్లాంట్ పెడుతుంటే టీడీపీ వాళ్లు నానా హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ చంద్రబాబు కుటుంబం కంపెనీ పెడుతున్నట్లుగా హంగామా చేశారని ఎద్దేవా చేశారు. మిట్టల్ సోమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి జనాలను తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం దారుణమన్నారు. దాంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ఉందన్నారు. భూములు త్యాగం చేసిన నిర్వాసితులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని ఆరోపించారు. బహిరంగ సభ కేవలం టీడీపీ ప్రచార సభగా మార్చేశారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు వీవీఐపీ పాసులు ఇచ్చుకుని వారితోనే సభ మమ అనిపించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సైతం స్టేజ్పైకి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించడం దారుణమన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమానర్ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దత్తుడు సీతబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఎంపీపీ పార్వతి తాతారావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవిందు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, పాయకరావుపేట మండలాధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుందర లత, ఎస్. రాయవరం మండల శాఖ అధ్యక్షుడు మధువర్మ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వంగలపూడి రామారావు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాకర వెంకటరావు, యువజన విభాగం అధ్యక్షుడు పోచిన నాగేశ్వరరావు, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్, నూకినాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందితో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి సంసిద్ధంగా ఉండాలని విశాఖ పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ కె.రోష్ని అపరంజి సూచించారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవం–డాక్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు పోర్టు అథారిటీ పరిపాలన భవనంలోని శ్రీ సాంబమూర్తి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ వారోత్సవాల్లో భాగంగా భద్రతపై అవగాహన, అత్యవసర పరిస్థితుల ఎదుర్కొనే సంసిద్ధతపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పోర్టు చైర్మన్ డా. అంగముత్తు హాజరుకాగా.. సేఫ్టీ కమిటీ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ డాక్ సేఫ్టీ ట్రైనింగ్ పోస్టర్ని ఆవిష్కరించారు. చీఫ్ విజిలెన్స్ అధికారి టి.అరుణ్ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ ఎం.శంకర్బాబు, సీఎంఈ రామ్ప్రసాద్తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, టెర్మినల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్యకలాపాల్లో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు అందరూ తమ సంసిద్ధతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. -
కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి యువకుడి మృతి
రోలుగుంట : కొబ్బరిచెట్టు పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరవోలు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా శ్యామ్(20) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కొబ్బరికాయలు తీసేందుకు చెట్టెక్కి ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు విశాఖ కేజీహెచ్కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్ఐ రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తండ్రి దేముడు, తల్లి రాజేశ్వరి, చెల్లి కుమారి ఉన్నారు. -
ప్రభుత్వోద్యోగులను మోసం చేయడం అన్యాయం
అనకాపల్లి: సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ విమర్శించారు. మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి వాటిపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ తన బాధ్యతలకు రాజీనామా చేసి ఏడాదిన్నర కావస్తున్నా నూతన చైర్మన్ను నియమించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. వీటిని ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఏలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో గగ్గోలు పెట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు నాలుగు డీఏలను చెల్లించకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ఇక పోరాటం తప్పదన్నారు. కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లోనూ అదే నెల 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర రాజధానిలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 28వ తేదీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చి ముట్టడిస్తామన్నారు. అంతకుముందు ఏపీ ఎన్జీవోఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి. శేషుకుమార్, ఖజానా శాఖ సంఘ నాయకులు డి. ఆనంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, వైరాల రమేష్ రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ బైలపూడి దేముడునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ను తొలగించడంతో ధర్నా
డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో చిన్నపాటి రోడ్డు ప్రమాదాలకు శాఖ డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ విధులు నుంచి తొలగించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున డిపోలో డ్రైవర్ కె.శ్రీనుపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహిస్తూ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్ శ్రీనును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 1/2019 సర్క్యులర్కు విరుద్ధంగా డిపో అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు ● కేజీహెచ్కు తరలింపు కొయ్యూరు: మండలంలోని రామరాజుపాలెం వంతెన సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..శరభన్నపాలెంకు చెందిన ఉల్లి హరికృష్ణ, రవితేజతో కలిసి కృష్ణదేవిపేట నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రామరాజుపాలెం వంతెన వద్దకు వచ్చేసరికి, నడింపాలెంకు చెందిన పాంగి బెన్నస్వామి నడుచుకుంటూ వెళ్తుండగా హరికృష్ణ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెన్నస్వామి కాలు విరిగింది. నియంత్రణ కోల్పోయి బైక్ పైనుంచి కింద పడటంతో హరికృష్ణకు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బైక్ వెనుక కూర్చున్న రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యా సామగ్రి పంపిణీ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని పరమసింగవరం గ్రామ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు పవన్ అండగా నిలుస్తున్నారు. మంగళవారం నర్సీపట్నం శ్రీ గణేష్ అకాడమి ఆర్థిక సహకారంతో పాఠశాలలోని 70 మంది గిరిజన విద్యార్థులకు పలకలు, పెన్సిల్ బాక్సులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.పరమసింగవరం పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చిన పవన్, ఇక్కడి గిరిజన పిల్లల దీన స్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్పందించి యలమంచిలిలోని ఒక వస్త్ర దుకాణ యాజమాన్యంతో మాట్లాడి, సుమారు 100 మంది విద్యార్థులకు రెండేసి జతల దుస్తులను అందజేశారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, గ్రామానికి అవసరమైన రహదారి సౌకర్యం, పాఠశాల భవన నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పారదర్శకంగా జనగణన
డాబాగార్డెన్స్(విశాఖ): జనగణన (2027) ప్రక్రియను ఫీల్డ్ ట్రైనర్లు బాధ్యతాయుతంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఆదేశించారు. మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ కళాశాలలో మంగళవారం సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున, డేటా నమోదులో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. తొలి దశలో 2026 మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ కొనసాగుతుందని వివరించారు. సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో శేష శైలజ మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, ఇది ఒక చట్టబద్ధమైన విధి అని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు ఈ గణాంకాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నందున, అన్ని వివరాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, మాస్టర్ ట్రైనర్ జి.నాగార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
లివిటిపుట్టులో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామంలో మంగళవారం స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గృహాన్ని తనిఖీ చేసి, స్థానిక కుటుంబాలతో మాట్లాడారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు.గంజాయి వంటి మత్తు పదార్థాల సాగు, రవాణా వంటి నేరాలకు ఎవరూ పాల్పడకూడదని, అటువంటి వారికి సహకరించవద్దని పోలీసులు హెచ్చరించారు. పాత నేరస్తులు మళ్లీ పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.2018లో లివిటిపుట్టు సమీపంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.లివిటిపుట్టులో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్న పోలీసులు డ్రోన్ నిఘాలో లివిటిపుట్టు గ్రామం గ్రామాన్ని చుట్టముట్టిన పోలీసులు -
పాడేరులో భారీ వర్షం
పాడేరు : ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్టణవాసులకు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షంతో సేదతీరారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా విభిన్న వాతావరణం చోటుచేసుకుంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9గంటల తరువాత ఎండ ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా మొదలైన వర్షం సుమారు గంటపాటు దంచికొట్టింది. పాడేరు పరసర ప్రాంతాల్లో ఒకే రోజు మూడు విభిన్న వాతావరణాన్ని స్థానికులు ఆస్వాదిస్తున్నారు. సీలేరులో ఉరుములు, మెరుపులతో.. సీలేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో వాతావరణం ప్రతిరోజూ విభిన్నంగా మారుతోంది. గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
వాలాబులో జీడి తోటల పరిశీలన
జీడి రైతులతో మాట్లాడుతున్న ఉద్యాన శాఖ అధికారి కిరణ్మయి దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారి కిరణ్మయి, గరిశింగి సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్ శరత్కుమార్ మంగళవారం పర్యటించారు. ఇక్కడ మంచు, తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని సోమవారం గిరిజన రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం విదితమే. దీనిపై ఉద్యానవన శాఖ అధికారులు స్పందించారు. దెబ్బతిన్న జీడి పంటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బీటీ దొర, జీడి రైతులు బలిజ నాగేశ్వరరావు, కధల రాము, కూడ దేముడు, సోమల కృష్ణ, దుప్పి సోమయ్య, పంది రాజు పాల్గొన్నారు. -
సామాన్య భక్తులకే పెద్దపీట
మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ సింహాచలం చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఈ లోగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారి కోసం మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. టికెట్ల అమ్మకం సమయం, ఆన్లైన్ లభ్యత, విక్రయ కేంద్రాల వివరాలను ముందుగానే భక్తులకు తెలియజేయాలన్నారు. నకిలీ టికెట్లు రాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే యంత్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎండ లేదా వాన కురిసినా భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్లు నిర్మించాలని కోరారు. భద్రతపై ప్రత్యేక నిఘా భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్ పేరుతో దగా
అరకులోయటౌన్: సూపర్సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలను బురిడీకొట్టించిందని వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన స్థానిక క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి లోకే ష్లు చేసిన వాఖ్యలను కూటమి పార్టీల్లో ఉన్న బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఖండించారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల కింద రూ. 2లక్షల 80వేల కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించిన ఏకై క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్త విధిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకున్నవారికి భవిష్యత్తులో వారికి పార్టీ గుర్తింపు కార్డుతోపాటు ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు పొందే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అరకులోయ అసెంబ్లీ పరిశీలకుడు బోనాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను నియమిస్తున్నారని, అరకులోయ అసెంబ్లీనియోజకవర్గ పరిధిలో శతశాతం కమిటీల నియామకం వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను సీఎం చేస్తేనే మనందరికీ భవిష్యత్ ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండా బిల్లులు మార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తే తాము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా దానిని ఉపసంహరించుకున్నారన్నారు. అంతకు ముందు గౌరవ అతిథులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు,వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీలు చటారి జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, తడబారికి మిధుల, ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, అనిల్, కొర్రా సూర్యనారాయణ, చంద్రుబాబు, ఉపాధ్యక్షులు పల్టాసింగి విజయ్కుమార్, గుడి వాడ ప్రకాష్, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, సర్పంచ్ రాధిక, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ పరిశీలకుడు సీహెచ్. వెంకటరామయ్య -
మరణంలోనూ నలుగురికి పునర్జన్మ
బీచ్రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో (నం. 95) ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నియమించిన గ్రామ కమిటీలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కార్యకర్తకు భద్రత కల్పించే విధంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు మేలు జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ ఏడువాక సత్యారావులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలు, అన్యాయాలను కార్యకర్తలు ప్రజల్లో తీసుకువెళ్లాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్య దర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండం నాయు డు, కంకిపాటి గిరిప్రసాద్, బిడిజన అప్పారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమో తి, పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయితి రాజులమ్మ, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, ఎస్టీ సెల్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
పవర్ఫుల్
సీలేరుసీలేరు విద్యుత్ కాంప్లెక్స్సీలేరు: రాష్ట్రంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్కు విశిష్టస్థానం ఉంది. ఏడాదిలో 365 రోజులూ నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కాంప్లెక్స్ సొంతం.పుష్కలంగా నీటి నిల్వలు ఉండడంతో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించింది. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ జల విద్యుత్ కేంద్రాలు గడిచిన 10 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. లోడ్ డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాల మేరకు విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం జోరుగా ఉత్పత్తి జరుగుతోంది. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. ఈ కాంప్లెక్స్లో 2025–26 సంవత్సరంలో 2,314 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం కాగా సోమవారం సాయంత్రానికి 2,320 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి, లక్ష్యాన్ని అధిగమించింది. ఇండివిడ్యువల్ లక్ష్యాన్ని కూడా అధిగమించేందుకు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. గోదావరి డెల్టాలో రబీ పంటలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ నుంచి గడిచిన 10 రోజుల్లో రోజుకు 6,900 క్యూసెక్కుల నీరు నేరుగా వెళుతోంది. దీంతో మాచ్ఖండ్, సీలేరు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. 2025–26 సంవత్సరంలో సీలేరు కాంప్లెక్స్ విద్యుత్ కేంద్రాలకు 2,314 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం నిర్ధేశించగా ఇప్పటికే 2,320 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించినట్టు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె.వి. రాజారావు తెలిపారు. మాచ్ఖండ్లో అదనంగా .. ఆంధ్ర,ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం ఇప్పటికే తన టార్గెట్ను పూర్తిచేసుకుని అదనంగా విద్యుత్ ఉత్పత్తిని చేసి, మిగతా జలవిద్యుత్ కేంద్రాలకు భిన్నంగా రికార్డు సృష్టించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది 657 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం ఇవ్వగా జనవరి 22 నాటికే పూర్తి చేసి మార్చి 15 నాటికి 802 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇప్పటికి 145 మిలియన్ యూనిట్లు అధికంగా ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 477 మిలియన్ యూనిట్లు లక్ష్యం ఇవ్వగా సోమవారం సాయంత్రం నాటికి 429 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా ప్రస్తుతం జోరుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది ఇచ్చిన టార్గెట్ 1,084 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటికే 1,020 పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సీలేరు కాంప్లెక్స్లో లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి వేసవిలో విద్యుత్తి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు వేసవిలో విద్యుత్కి అంతరాయం లేకుండా.. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే లక్ష్యాన్ని పూర్తి చేశాం. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం. మరోపక్క గోదావరి డెల్టాలో పంట భూములకు గడిచిన పది రోజులుగా డొంక రాయి మెయిన్ డ్యామ్ ద్వారా నీటిని విడుదల చేస్తూ ఇంజనీర్లు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. –కె.వి రాజారావు, చీఫ్ ఇంజనీర్ పుష్కలంగా నీటి నిల్వలు ఏపీ జెన్ కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో పలు రిజర్వాయర్లలో ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర,ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయంలో ప్రస్తుతం 71.1740 టీఎంసీల నీరు ఉంది. దీంతో పాటు అదనంగా గుంటవాడ, సీలేరు రిజర్వాయర్లలో మరో 12 టీఎంసీలు ఉంది. ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. మరోపక్క గోదావరి డెల్టా పంట భూములకు నీరుఅందిస్తూ.. ఈ వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రానికి నిరంతరం వెలుగులు అందించడంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోందని జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా రైతు కన్నీరు
గొలుగొండ: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా టమాటా రైతుల పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర పతనం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్న తరుణంలో అకాల వర్షాలు ఉన్న పంటను దెబ్బతీశాయి. దాంతో రైతు వద్ద కిలో రెండు రూపాయల ధర లేకపోవడంతో వీటిని సేకరించకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. 300 ఎకరాల్లో సాగు గొలుగొండ మండలంలో లింగంపేట, జోగుంపేట, గొలుగొండ, సాలికమల్లవరం, ఏఎల్పురం ప్రాంతాల్లో 300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ నెలలోనూ ధరలు పతనం కావడం ఇదే తొలిసారిగా రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడలు పెడితే కనీసం ఇప్పుడున్న ధరలు ప్రకారం రూ.5 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో కాయలు మార్కెట్లో 30 కేజీల టమాటా రూ.60కు ధర రావడంతో కనీసం టమాటా ఏరే కూలీల ఖర్చు రావడం లేదని వాపోతున్నారు. దీంతో కష్టపడి సేకరించి మార్కెట్కు తరలించే ప్రయత్నంలో రైతులు విసిగివేసారి కాయలు ఏరకుండానే పొలంలో వదిలేస్తున్నారు. కనీసం వీటి ధరలు పెరుగుతాయని ఆశ కూడా లేదని చెబుతున్నారు. కోసిన కాయలకు ధరలు లేకపోవడంతో కొన్ని చోట్ల పొలం వద్దే పారేస్తున్నారు. మూడు రోజుల నుంచి అకాల వర్షాలు ధరలు లేవని ఆందోళన చెందుతున్న రైతులు అకాల వర్షాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మూడు రోజులుగా వర్షాలు కురవడంతో కాయలకు మచ్చలు రావడంతోపాటు టమాటా పంట కుళ్లిపోయి చనిపోతోందని వాపోతున్నారు. ఒక వైపు ధరలు లేకపోగా, మరోవైపు వర్షాలు పంట నష్టం వాటిల్లిందని తీవ్ర ఆవేదన చెందున్నారు. ఇంత కష్టంలో కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఎంతో కొంతమేలు జరిగేదని చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టమాటా గిట్టుబాటు లేక... మాడుగుల : టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మాడుగుల వారపు సంతకు శంకరం, తాటిపర్తి తదితర గ్రామాలు నుంచి రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకు వచ్చారు. కనీసం కిలో రూ.4 కూడా ధర రాలేదు. దీంతో కొంత మంది రైతులు సంతలో టమాటాలు వదిలి వెళ్లిపోయారు.మూడు నెలలు క్రితం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు ధరలు పలికేవి. ప్రస్తుతం ధరలు కుదేలు అవడంతో టమాటా రైతులు కనీసం కూలి అయినా గిట్టుబాటు లేదని ఆవేదన చెందుతున్నారు. -
ఘాట్ రోడ్డులో అంబులెన్స్ బోల్తా
చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం జెర్రెల ఘాట్రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జెర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణిదీప్ అందించిన వివరాలిలా ఉన్నాయి.జెర్రల పీహెచ్సీ నుంచి లక్ష్మి అనే రోగిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తుండగా జెర్రల ఘాట్రోడ్డులో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న లక్ష్మి, చిన్నారావు, సీతమ్మ, రూప తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరూ జెర్రల ప్రాంతంలో గల పలుగ్రామాలకు చెందిన వారని, వీరందరినీ చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు. -
దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కీలకం
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్ మద్దిలపాలెం: దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కల్పన కీలకమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఐడీఎస్–ఏపీ చైర్మన్ ఆచార్య ఎస్. మహేంద్ర దేవ్ అన్నారు. ఆచార్య రొక్కం రాధాకృష్ణ నాలుగవ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన మహేంద్ర దేవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విలువ ఆధారిత చర్యలు తోడవాలని, ఎగుమతులు పెరిగితేనే జీడీపీ వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మానవ మూలధనం, సాంకేతికత, యువత నైపుణ్యాలు, మహిళల భాగస్వామ్యం దేశ ప్రగతికి దోహదపడతాయని ఆయన వివరించారు. మరో వక్త, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ఆచార్యులు దువ్వూరు నరసింహారెడ్డి ‘భారత వ్యవసాయ స్థితి– సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, పర్యావరణహిత వ్యవసాయం ద్వారానే రైతులకు సరైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐడీఎస్–ఏపీ సంచాలకులు ఆచార్య ఎస్. గాలబ్ సంస్థ పరిశోధనల గురించి వివరించగా, యూపీఎస్సీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎస్.ఆర్. హషీం అధ్యక్షోపన్యాసం చేశారు. చివరగా అతిథులను ఘనంగా సత్కరించారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు మోసం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’ నిరుద్యోగులను మోసం చేయడమేనని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉండగా, కేవలం 10,060 పోస్టులను అక్టోబర్ వరకు విడతల వారీగా భర్తీ చేస్తామనడం యువతను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా, సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.72 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జు దీరజ్ కుమార్, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మువ్వల సంతోష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, జన సముదాయాలు ఉన్న చోట్ల ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమీక్షించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని, పశువులు, మేకలు, మూగ జీవాల కోసం గ్రామాల్లో నీటి కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయానికి సాగుకు నీటి కొరత లేకుండా చెక్ డ్యామ్ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం వైద్యారోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్పా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెండు జిల్లాల పోలీసు, ఐటీడీఏ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, డ్వామా, అగ్రికల్చర్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మోదమ్మ ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
పాడేరు: మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది మే 10,11,12 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. ఉత్సవాల పోస్టర్లను సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పట్టణ ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ జాతర సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు పట్టణమంతా భారీ విద్యుత్దీపాంలకరణ, భారీ సెట్టింగులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అమ్మవారి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు, భక్తులు, అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం
జి.మాడుగుల: జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ ఆరోపించారు. స్థానిక విలేకర్లతో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.72లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,060పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదుల చేసిందన్నారు. తక్కువ ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రచారం మాత్రం ఊదరగొడుతున్నారని విమర్శించారు. ఈ పోస్టులు కూడా నాలుగు విడతల్లో వచ్చే అక్టోబర్లోగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్ల కాలంలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగం ఇచ్చేంతవరకు నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, 22నెలలు కాలంలో నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన విమర్శంచారు.ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, అత్యధిక ఉద్యోగాల కల్పనకు ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహమందిస్తామంటూ ప్రకటించి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని రానున్న కాలంలో ప్రజలు, యువత చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
ఇగో పాలిటిక్స్
’ఇనార్బిట్’ చుట్టూపూర్తిగా జగన్ ముద్రేనని.. ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి ప్రభుత్వం దూరంటీడీపీ ఎమ్మెల్యేలూ హాజరవ్వకూడదంటూ హుకుం చివరికి పోర్టు చైర్మన్ డా.అంగముత్తు చేతుల మీదుగా ప్రారంభోత్సవం 2023 ఆగస్ట్ 1న వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మాల్కు శంకుస్థాపన శరవేగంగా పనులు పూర్తి చేసి అద్భుతంగా నిర్మించిన రహేజా గ్రూప్సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్.. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
సీఎం సభకు బస్సుల మళ్లింపు..
నర్సీపట్నం: ఆర్టీసీ ప్రయాణికులకు 2014 టీడీపీ పాలన నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నక్కపల్లిలో సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేసి, సభకు జనాలను తరించేందుకు మళ్లించారు. డిపోకు చెందిన వంద బస్సుల్లో సగానికి పైగా సీఎం సభకు మళ్లించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలను చేరేందుకు నానా ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రావని ఆర్టీసీ సిబ్బంది మైక్లో చెప్పినప్పటికీ వస్తాయనే ఆశతో కాంప్లెక్స్లో ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షణ చేశారు. విజయవాడ, రాజమండ్రి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు వరుసగా సెలవులు రావడంతో ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు నరకం చూశారు. తల్లిదండ్రులు ప్రైవేటు వాహనాలను పెట్టి కాలేజీలకు పంపించారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. కూలీ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు కాంప్లెక్స్లో దిగారు. బస్సులు లేకపోవడంతో మూటలు మోసుకుని ఆటోల కోసం మెయిన్ రోడ్డుపైకి వచ్చి నిరీక్షణ చేశారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావడంతో సామాన్య ప్రజలు బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు. -
చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ ఉమావతి, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మండలి స్పీకర్ దృష్టికి కూటమి నేతల ఆగడాలు
చోడవరం : అధికార కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను శాసనమండలి స్పీకర్ మోషన్రాజుకి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ చోడవరం సమన్వయకర్త అమర్నాథ్ వివరించారు. వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన అమర్నాఽథ్ ఆ జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో శాసనమండలి స్పీకర్ మోషన్రాజును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆగడాల గురించి స్పీకర్కు వివరించారు. శాసనమండలిలో ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు అమర్నాఽథ్ తెలిపారు. ఆయనతోపాటు సోషల్మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీ బైన ఈశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ జిల్లా బీసీసెల్ ఉపాధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, యూత్ జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, బీసీసెల్ ప్రతినిధి పల్లా మోహన్కృష్ణ, నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, తదితరులున్నారు. మర్యాద పూర్వక కలయిక పాయకరావుపేట: శాసనమండలి సభాపతి కొయ్యే మోషేన్రాజును వైఎస్సార్సీపీ నేతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోషేన్రాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత పైల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘మలబార్’లో శృతిహాసన్ మెరుపులు
బీచ్రోడ్: నగరంలోని వీఐపీ రోడ్డులో ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతనంగా ఏర్పాటు చేసిన భారీ షోరూంను సోమవారం సినీ నటి శృతి హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు, వజ్రాభరణాలకు మలబార్ సంస్థ పెట్టింది పేరన్నారు. విశాఖ వంటి కీలక మార్కెట్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో ఈ అతిపెద్ద షోరూంను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ ఆషీర్ మాట్లాడుతూ.. విశాఖ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రస్తుతం షోరూంలో ‘బిగ్ బ్రిలియంట్ సేల్’ నడుస్తోందని, ఇందులో భాగంగా బంగారం, అన్కట్ రత్నాల ఆభరణాల తరుగుపై 40శాతం, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై ఎటువంటి తరుగు లేకుండా గరిష్ట విలువను అందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మలబార్ ప్రతినిధులు సిరాజ్, రాకేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నార్త్జోన్, సెంట్రల్జోన్ జట్ల విజయం
సౌత్,నార్త్ జోన్ల మధ్య మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తోటాడలో అగ్ని ప్రమాదం
చికెన్ సెంటర్లో మంటలు మునగపాక: మండలంలోని తోటాడలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో చికెన్ షాపు దగ్ధమైంది. తోటాడ సెంటర్లో అనపర్తి లోవరాజు చికెన్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపులోని గ్యాస్ సిలిండల్ లీక్ కావడంతో మంటలు చెలరేగి షాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో విధ్యుత్ మీటర్తో పాటు కాటా, 20 కోళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30వేల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ భూములు అదానీకి కేటాయిస్తే ప్రతిఘటన
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం మద్దిలపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టులను దెబ్బతీసి అదానీకి అప్పగించాలని చూస్తున్నా యని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. ఆదివారం ఏచూరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాల భూమిని అదానీ హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి విక్రయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్లాంట్ భూములను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. అదానీ డేటా సెంటర్ భూములే ఇంకా వినియోగంలోకి రాకముందే, పార్టనర్షిప్ పేరుతో గూగుల్ డేటా సెంటర్ భూములను కూడా అదానీ పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నక్కపల్లిలోని ప్రైవేటు మిట్టల్ స్టీల్కు సొంత గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం నిరాకరించడం విచారకరమన్నారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం ఏప్రిల్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మిక సంఘాల జెఎసితో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు డాక్టర్ బి. గంగారావు, వి. కృష్ణారావు పాల్గొన్నారు. -
పక్షులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాటు చేయాలి
అనకాపల్లి: వేసవి కాలంలో ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.సోమసుందర్ అన్నారు. గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో పలు దేవాలయాల్లో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీరు పాత్రలు, గూళ్లు కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత. ప్రకృతి ఉంటేనే మనిషి జీవనం కొనసాగుతుందన్నారు. గ్రీన్ క్లబ్ గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పక్షుల మనుగడ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షుడు ఆడారి కిషోర్కుమార్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో గ్రీన్ క్లబ్ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. గవరపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రజల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణం, నీటి వనరులు కలుషితం కాకూడదన్నారు. అంతకుముందు గ్రీన్ క్లబ్ సభ్యులు గాంధీనగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయం, వేల్పులవీధి కాశీ విశ్వేశ్వర ఆలయం, గవరపాలెం భోగలింగేశ్వర స్వామి దేవస్థానం, గౌరీ సేవా సంఘం దేవాలయం, సుంకరమెట్ట జంక్షన్లో సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సంతోషి మాత దేవస్థానంలో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్లు ఏర్పాటు చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సత్యనారాయణ, విశ్రాంత అటవీ శాఖ రేంజర్ అధికారి బీర వినోద్ కుమార్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
జిహ్వకో రుచి.. దేశానికో శైలి
సాగర తీరాన ‘ప్రపంచ’ విందు ఏయూలో 40 దేశాల రుచుల హంగామామద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ వంటకాలకు వేదికై ంది. అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఫీస్ట్ ఫెస్ట్’ నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. 40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు 38 స్టాళ్లలో తమ దేశ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయగా, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు మరో 18 స్టాళ్లలో భారతీయ స్వదేశీ రుచులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఇథియోపియా సంప్రదాయ కాఫీ, ఆఫ్గన్ ‘కాబూలి పలావ్’, జోర్డాన్ షవర్మ, నేపాల్ మోమోస్ వంటి వంటకాలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. వీటితో పాటు కొమరూన్ ఇగుసి సూప్, కాంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార రుచులు విదేశీ సంస్కృతిని ప్రతిబింబించాయి. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదంతో విభిన్న దేశాల ఆహారపు అలవాట్లను ఒకే చోట చేర్చడం అభినందనీయమని కెప్టెన్ దివాకర్ కొనియాడారు. ఏయూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంప్రదాయ వస్త్రధారణలో వంటకాలను వడ్డించడం ద్వారా తమ దేశ వారసత్వాన్ని పరిచయం చేశారని తెలిపారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య విజయమోహన్ సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫీస్ట్ఫెస్ట్లో పాల్గొన్న ఏయూ వీసీ -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
● విశేషంగా స్వర్ణపుష్పార్చన ● శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం ● ఘనంగా గరుడసేవసింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలోవేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం: శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. ఘనంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ హవనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
మాకవరపాలెం: మండలంలోని తామరంలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. దువ్వూరి బాలకృష్ణమూర్తి మెమోరియల్ పేరుతో ప్రగతి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తామరం ఇమ్మానుయేలు క్యాంపస్లో ఆదివారం 3వ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్ ప్రథమ, విశాఖ జిల్లాకు చెందిన జె.నాగరాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన ఎం.నూకరాజు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.8,000, ద్వితీయ రూ.5,000, తృతీయ రూ.4,000 నగదుతోపాటు మరో 30 మందికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.60 వేలను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్, హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ డీఈఈ చలపతిరావు, ప్రగతి చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు సుధీర్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు రంగరాజు పాల్గొన్నారు. -
ఆలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే..
మాట్లాడుతున్న సుబ్బరాజు సమావేశానికి హాజరైన హిందువులు అనకాపల్లి : రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు. స్థానిక వివేకానంద పంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్–హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై ఆదివారం అవగాహన కార్యక్రమం వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ నాయకుల పెత్తనం ఉండరాదని, హిందూ దేవాలయాల భూములను కాపాడవలసిన బాధ్యత హిందువులపై ఉందన్నారు. కార్యక్రమంలో స్వామీజీలు నరసింహాచారి, రాళ్లపల్లి పాపీశర్మ, డాక్టర్ విష్ణుమూర్తి, వీహెచ్సీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపేటి రామకొండలరావు, కటకం లక్ష్మణరావు, సహా కార్యదర్శి పీలా హేమ జగదీష్ నాయుడు, కోశాధికారి రమేష్, అనకాపల్లి అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, ప్రాంత తొలి సభ్యుడు శ్రీకాళహస్తి పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తి పూలబాట కాదు
విశాఖ లీగల్ : సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అయితే ఇది పూలబాట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ.. నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడుపును ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ -
14 నుంచి మారెమ్మతల్లి జాతర
సీలేరు: గ్రామ దేవత, భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మారెమ్మ అమ్మవారి 54వ జాతర ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈ సమావేశం ఆలయ కమిటీ అధ్యక్షుడు జైపాల్, గౌరవ అధ్యక్షుడు టక్కరి బుట్టి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. తమిళ సంప్రదాయం ప్రకారం, తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా శ్రీ మారెమ్మ అమ్మవారి జెండా ఆవిష్కరిస్తారు. 15వ తేదీ ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం అమ్మవారి గరగ అలంకరణ అగ్నిగుండం ప్రవేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి 23 వరకు ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతాయి. 24న ఆలయ ప్రాంగణంలో మహిళలతో భారీ ఎత్తున కుంకుమార్చన జరుగుతుంది. 25న అమ్మవారి గ్రామోత్సవం, 26న అమ్మవారి ప్రధాన పండగ, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసమారాధన, 27న అమ్మ వారి చల్లనీటి ఉత్సవం, 29న అమ్మవారి మరు పూజ అనంతరం అన్నసంతర్పణ జరుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలన్నీ తమిళ క్యాలెండర్ ప్రకారం తమిళ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. -
క్రికెట్ టోర్నీ విజేత కండ్రుమ్ జట్టు
డుంబ్రిగుడ: ఇక్కడికి సమీపంలోని ఒడిశా రాష్ట్ర చటువలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో కండ్రుమ్కు చెందిన హర్ష లెవెన్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. రూ.70 వేల నగదు బహుమతితోపాటు కప్పును స్వాధీనం చేసుకుంది. వీటిని విజేత జట్టు సర్పంచ్ కె.హరి, వైస్ఎంపీపీ శెట్టి ఆనందరావు చేతులమీదుగా అందుకుంది. ఒడిశాకు చెందిన పాడువబంజోలాపుట్ జట్టు రన్నర్గా నిలిచింది. జట్టు సభ్యులకు రూ.50 వేల నగదు, కప్పును అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గిరిజన యువత రాణించడం ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. క్రీడల్లో నిమగ్నమవుతున్న యువతకు ప్రోత్సహించడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కండ్రుమ్ జట్టు కెప్టెన్ శెట్టి సురేష్, వార్డు సభ్యుడు దాసు పాల్గొన్నారు. -
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ఎక్స్రే కష్టాలు
చింతపల్లి: స్థానిక వంద పడకల ఏరియా ఆస్పత్రిలో ఎక్స్రే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఎక్స్రే సేవలు కేవలం ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అత్యవసర సమయంలో అగచాట్లు ఎముకల వ్యాధిగ్రస్తులకు లేదా అత్యవసర కేసుల్లో వైద్యులు ఎక్స్రే తీయాలని సూచించినా, సాయంత్రం 4 గంటల తరువాత సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోతున్నాయి. ఒకవేళ పరిస్థితి మరీ విషమంగా ఉంటే, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఇతర సిబ్బంది తమకున్న కొద్దిపాటి అనుభవంతో ఎక్స్రే తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఆదివారం వంటి సెలవు దినాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఎక్స్రే తీసే వారు ఎవరూ లేకపోవడంతో, బాధితులకు ఏ అవయవానికి దెబ్బ తగిలిందో గుర్తించడం వైద్యులకు కూడా కష్టతరమవుతోంది. వైద్యులు ఉన్నా.. వసతులు సున్నా : తాజాగా ఆదివారం నాడు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ తేజ నారాయణ విధుల్లో ఉండి, పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. అయితే, మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన ఎక్స్రే తీసే సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. అటు మైదాన ప్రాంతాలకు వెళ్లలేక, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్స్రే తీయించుకునే ఆర్థిక స్థోమత లేక పేద రోగులు సతమతమవుతున్నారు. ఆస్పత్రిలో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా, అన్ని వేళల్లో ఎక్స్రే సేవలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. సమయపాలన లేక రోగుల అవస్థలు -
వేసవిలో మంచు పలకరింపు
డుంబ్రిగుడ: సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే భానుడి భగభగలు మొదలవ్వాలి. కానీ, మన్యం పర్యాటక ప్రాంతమైన డుంబ్రిగుడలో మాత్రం ప్రకృతి వింతగా స్పందించింది. గత పదిహేను రోజులుగా ఎండలు ముదురుతున్న తరుణంలో, ఆదివారం ఉదయం ఒక్కసారిగా కమ్మేసిన దట్టమైన పొగమంచు స్థానికులను ఆశ్చర్యపరిచింది. కనిపించని రహదారులు.. వెలుగుల ప్రయాణం ఆదివారం తెల్లవారుజాము నుంచి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలను పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దీని ప్రభావంతో అరకు – పాడేరు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని రీతిలో మంచు కురవడంతో, డ్రైవర్లు హెడ్లైట్లు వేసుకుని అతి జాగ్రత్తగా ప్రయాణించారు. చలికి వణికిన గిరిజనం వేసవి కాలం ప్రారంభమైందని భావిస్తున్న తరుణంలో, ఈ అకాల పొగమంచుకు తోడు శీతల గాలులు వీయడంతో గిరిజనులు చలికి వణికిపోయారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు మళ్లీ స్వెట్టర్లు, రగ్గులు బయటకు తీశారు. వేసవిలో ఇలాంటి దట్టమైన మంచు కురవడం ఇక్కడి ప్రత్యేకతను చాటుతోందని పర్యాటకులు, స్థానికులు చర్చించుకుంటున్నారు. డుంబ్రిగుడలో శీతల గాలులు వాహనదారుల ఇబ్బందులు -
బాలుడి ప్రాణాలను బలిగొన్న నిద్రమత్తు
● కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ● ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొట్టడంతో మృతి గూడెంకొత్తవీధి: ఆ చిన్నారి పేరు వంతల లోకేష్.. వయసు కేవలం మూడేళ్లు. రేపటి గురించి తెలి యని ఆ పసివాడు, తన ఇంటి ముంగిట ఆడుకుంటూ గలగలా నవ్వుతున్నాడు. కానీ, విధి వెనుక నుంచి మృత్యువు రూపంలో దూసుకొస్తుందని ఆ చిన్నారి గానీ, ఆ కన్నవారు గానీ ఊహించలేదు. ఒక చిన్న నిద్రమత్తు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. రింతాడ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెదవలసకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రసాద్, తన బంధువుల వివాహ విందుకు హాజరై కారులో తిరిగి వస్తున్నారు. అయితే, ప్రయాణంలో ఒక్క క్షణం ఆవరించిన నిద్రమత్తు కారు అదుపు తప్పేలా చేసింది. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకువెళ్లింది. దురదృష్టవశాత్తూ, సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారి లోకేష్ను బలంగా ఢీకొట్టింది. ఆస్పత్రికి వెళ్లేలోపే ఆగిన శ్వాస: తీవ్రంగా గాయపడిన లోకేష్ను కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ పసివాడి ప్రాణాలు అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వైద్యులు లోకేష్ మరణించినట్లు ధ్రువీకరించడంతో, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కళ్లముందే ఆడుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ సురేష్ పూర్తి వివరాలను సేకరించారు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ అనర్థం జరిగిందని ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేశారు. -
మౌన రోదన
ఒకప్పుడు పచ్చని చెట్లతో, ఏడాదంతా కురిసే చిరుజల్లులతో, ప్రకృతి ఒడిలో పరవశించే జిల్లా.. ఇప్పుడు భూతాపం గుప్పిట్లో చిక్కుకుంది. మంచు దుప్పటి కప్పుకోవాల్సిన కొండలు, మంటల వేడికి సెగలు గక్కుతున్నాయి. అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, కాంక్రీట్ రహదారుల విస్తరణ మన్యం పచ్చదనాన్ని మాయం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం అడుగంటుతుండటంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. వెరసి, అల్లం, పసుపు, కాఫీ వంటి ప్రధాన పంటలు ప్రమాదంలో పడ్డాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మన్యం తన సహజ స్వభావాన్ని కోల్పోతోంది. అడవులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ముప్పు తప్పదని అటవీ శాఖ హెచ్చరిస్తోంది. అడవి పెరగాల్సిన చోట, గడిచిన కొన్నేళ్లలో జిల్లాలో 101 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. పోడు వ్యవసాయం, రహదారుల విస్తరణ, వేసవిలో అడవి మంటలు మన్యం పచ్చదనాన్ని హరిస్తున్నాయి. మన్యం తన పచ్చని పట్టువస్త్రాన్ని కోల్పోకముందే మేల్కొనాలి. నిప్పుల కొలిమిగా మారుతున్న చల్లని కోన చెట్లు పిలిస్తే వచ్చేది, మనిషి పిలిస్తే రానిది వర్షం ఒక్కటే. అడవుల శాతం పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటం ఆందోళనకరం. ప్రభుత్వం తక్షణమే అడవుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే, మన్యం తన సహజ సిద్ధమైన శీతల స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కొయ్యూరు: జిల్లాపై భూతాపం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు చల్లగా ఉండే మన్యం ప్రాంతం ఇప్పుడు వేడెక్కుతోంది. అడవుల క్షీణత.. ప్రధాన కారణాలు భారత అటవీ సర్వే అంచనా ప్రకారం, జిల్లాలో 101 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణాలివే.. పోడు వ్యవసాయం: అడవులను నరికి సాగు భూములుగా మార్చడం. అభివృద్ధి పనులు: రహదారుల విస్తరణ కోసం పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించడం. అడవి మంటలు: వేసవి కాలంలో అడవులు తగలబడటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వర్షపాతంలో మార్పులు.. నేల కోత జిల్లా సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి కొండలు 25 నుంచి 40 డిగ్రీల ఏటవాలుగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం: గతంలో ఏడాదికి సగటున 200 రోజుల పాటు వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపు రోజుల సంఖ్య 40–45 రోజులు తగ్గిపోయింది. తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షపాతం సుమారు 1100 మిల్లీమీటర్లు నమోదవుతోంది. దీనివల్ల ఏటవాలు ప్రాంతాల నుంచి నీటితో పాటు భూమిలోని విలువైన లవణాలు, పోషకాలు కొట్టుకుపోతున్నాయి. వ్యవసాయంపై ప్రభావం.. మారుతున్న వర్షపాత విలువల వల్ల పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. అల్లం, పసుపు: ముందస్తు వర్షాలు తగ్గడం, కురిసినప్పుడు అతిగా కురవడం వల్ల ఈ పంటలు దెబ్బతింటున్నాయి. కాఫీ తోటలు: భవిష్యత్తులో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కాఫీ సాగుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. తుపాను ప్రభావం.. ప్రస్తుతం కేవలం తుపాన్ల సమయంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది క్రమబద్ధమైన సాగుకు ఏమాత్రం అనుకూలం కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం మారుతున్న వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పడిపోతున్న వర్షపాతం భూతాపంతో వేడెక్కుతున్న జిల్లా అడవులను పరిరక్షిస్తేనే క్షేమంఅంటున్న అటవీశాఖ అధికారులు చెట్లు లేని చోట మేఘాలు ఆగవు.. మేఘాలు ఆగని చోట వానలు పడవు. ఏడాదిలో సగటున 200 రోజుల పాటు చిరుజల్లులతో వర్షాలు పలకరించేవి. ఇప్పుడు వర్షం కురిసే రోజుల సంఖ్య 40 నుంచి 45 రోజులకు పడిపోయింది. కురిసినా.. తక్కువ సమయంలోనే అతి భారీ వర్షం కురుస్తోంది. అడవులు నరకడం వల్ల వర్షం పడినప్పుడు నీటిని ఆపే శక్తి నేలకు లేకుండా పోతోంది.వర్షపు నీటితో పాటు భూమిలోని విలువైన ఖనిజాలు, పోషక లవణాలు కొట్టుకుపోయి నేల నిస్సారమవుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్నాయి. పోడు వ్యవసాయం కోసం బూడిదవుతున్న అటవీ ప్రాంతంమోడువారిన చెట్టుజాతీయ రహదారి నిర్మాణంలో నరికివేతకు గురైన మారుజాతి చెట్ల కలప -
కష్టానికే కన్నీళ్లొస్తే..
కట్టబట్టలతో మిగిలిన బాధిత కుటుంబం, రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తున్న ఎస్ఐ కిషోర్వర్మకొయ్యూరు: విధి ఆ కుటుంబాన్ని ఇప్పటికే అనారోగ్యంతో పరీక్షిస్తోంది. వారానికి మూడు సార్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని డయాలసిస్ కోసం ఆస్పత్రి గడప తొక్కే ఆ గృహయజమానికి, ఇప్పుడు అగ్నిప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్న ఒక్క ఆసరా... ఆ చిన్న తాటాకిల్లు కాస్తా కళ్లముందే బూడిదవ్వడంతో, ఆ కుటుంబం ఇప్పుడు ఆకాశమే పైకప్పుగా మిగిలిపోయింది. ప్రాణభయం మధ్య ఆ రాత్రి... సింగవరం గ్రామానికి చెందిన పాము రాజు కుటుంబం శనివారం రాత్రి గాఢ నిద్రలో ఉండగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లంతా వ్యాపించిన మంటల నుంచి భార్యను, ఇద్దరు చిన్నారులను రాజు ప్రాణాలకు తెగించి బయటకు తీసుకువచ్చారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెను ప్రమాదం సంభవించినా, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. కానీ, ఆ ఇంట్లో దాచుకున్న కొద్దిపాటి నగదు, నిత్యావసర వస్తువులు, చివరకు పిల్లల సర్టిఫికెట్లు కూడా మంటలకు ఆహుతయ్యాయి. నిలువనీడలేక దీనస్థితి పాము రాజు కిడ్నీ వ్యాధితో పోరాడుతున్నారు. బతకడం కోసం వారానికి మూడు రోజులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. చికిత్సకు సంబంధించిన కీలక పత్రాలు కూడా కాలిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు నిలువ నీడ లేని పరిస్థితి.. మా బతుకులు తెగిన గాలిపటాలయ్యాయి.. అంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అండగా నిలిచిన మానవత్వం బాధిత కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఎస్ఐ కిషోర్వర్మ తక్షణమే స్పందించారు. స్వయంగా వెళ్లి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా, తన వంతుగా రూ.10 వేల నగదు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే స్థానిక నేత ఎంవీఎస్ ప్రసాద్ రూ.5 వేల నగదు, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిబోయిన చిన్న, గోవింద్, రాజు తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలిచారు.కట్టుబట్టలతో మిగిలిన ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సీలేరు పీడీ ప్రతిభ
● కాంస్య పతకం సాధన సీలేరు: మహారాష్ట్రలోని పూణేలో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఈ జట్టు విజయంలో జిల్లాకు చెందిన గూడెం కొత్తవీధి మండలం సీలేరు జెడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జి. చిన్ని కీలక పాత్ర పోషించారు. ఐదు నెలల క్రితం విజయవాడలో జరిగిన ఎంపిక పోటీల్లో తన ప్రతిభను చాటుకుని ఆల్ ఇండియా స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఇప్పుడు పూణేలో జరిగిన ప్రధాన పోటీల్లో అత్యంత ప్రతిభావంతమైన ఆటను ప్రదర్శించి జట్టు గెలుపునకు కృషి చేశారు. ఇటీవలే డీఎస్సీ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికై న చిన్ని, విధుల్లో చేరిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో పతకం సాధించి అరుదైన గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, తోటి ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా అభినందించారు. -
2047 నాటికి విశాఖ నీటి అవసరం 726 మిలియన్ లీటర్లు
డాబాగార్డెన్స్: వేసవి కాలంలో నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ నగర పరిపాలనకు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉండగా, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి ఈ అవసరం 726 మిలియన్ లీటర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, పీయూబీ (సింగపూర్), ఐఎస్ఎఫ్ (ఆస్ట్రేలియా) వంటి సంస్థల సాంకేతిక సహకారంతో సమగ్ర వాటర్ సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా నీటి వనరులను శాసీ్త్రయంగా అంచనా వేయడమే కాకుండా, వినియోగించిన నీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల సంరక్షణ, ఆధునిక సాంకేతికతతో నీటి వృథాను అరికట్టడం వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వివరించారు. -
కాకానినగర్ జంక్షన్లో లారీ బీభత్సం
గోపాలపట్నం: నగరంలోని కాకానినగర్ జంక్షన్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్టు పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం 7.45 గంటల సమయంలో ఎన్ఏడీ నుంచి గాజువాక వైపు వెళ్తున్న ఓ లారీ, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను, మరో లారీని ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాటిచెట్లపాలేనికి చెందిన పెంటకోట మోహన విష్ణుప్రియ పాదం చితికిపోగా, కరాసాకు చెందిన ఆటో డ్రైవర్ మైలపల్లి ఢిల్లీరావు కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గణేష్ రామ్ గోపాల్ (ఛత్తీస్గఢ్) కూడా క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు, కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు భావిస్తుండగా.. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే డ్రైవర్ లారీని ఆపలేకపోయాడని మరికొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆటో డ్రైవర్ ఢిల్లీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో నుజ్జునుజ్జు..ముగ్గురికి తీవ్ర గాయాలు -
నూకాంబిక ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తు
అనకాపల్లి: అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు విశాఖ రేంజ్ పోలీసు ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. గరవపాలెం నూకాంబిక అమ్మవారిని శనివారం గోపినాథ్ జట్టి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సమీపంలో పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలన్నారు. ఐజీ దంపతులను ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ సత్కరించారు. -
ముగింపు దశకు ఆపరేషన్ కగార్
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గతేడాది చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. చాలా మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణించారు. పలువురు స్వచ్ఛందంగా లొంగిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించే పోలిట్ బ్యూరో నుంచి కేంద్ర కమిటీ నేతలు సైతం హతమయ్యారు. కగార్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రజా భద్రత కోసం కేంద్రం తాజాగా ఆపరేషన్ వజ్ర ప్రహార్కు శ్రీకారం చుట్టింది. కొయ్యూరు: ఆపరేషన్ కగార్తో నాలుగు దశాబ్దాల పాటు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. మన్యంలో తుపాకుల మోత, మందుపాతర్ల పేల్లుళ్లు, ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను హతమార్చడం వంటి ఘటనలు ప్ర స్తుతం ఆగిపో యాయి. అదే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే గిరిజను లు నిత్యం భ యం నీడలో గడిపిన రోజులవి. రాత్రయితే ఎవరు ఎటువైపు నుంచి వచ్చి ఏమి చేస్తారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. మావోయిస్టులకు ఆశ్రయమిస్తే పోలీసులతో సమస్యలు.. అలా అని మావోయిస్టుల మాట వినకుంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మావోయిస్టులు రా(లే)క పోవడంతో మారుమూల గ్రామాల్లో గిరిజనులు సైతం సంతోషంగా జీవితాలు గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. విస్తృతంగా కార్డెన్ సెర్చ్లు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆపరేషన్ వజ్ర ప్రహార్కు పోలీసులు శ్రీకారం చుట్టారు. నేరస్తులను ముందుగానే గుర్తించడం, నేరం జరగకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అల్లూరి జిల్లాలో గడచిన కొద్ది రోజుల నుంచి పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్ను అమల్లోకి తీసుకువ చ్చారు. జిల్లాలో గంజాయి రవాణా అతిపెద్ద సవాల్గా మారింది. దీనిని పూర్తిగా నిర్మూలన చేసేందుకు వీలుగా గ్రామాల్లో కార్డె న్ సెర్చ్ చేస్తు న్నారు. గంజాయిని పండించి, రవాణా చేసిన గిరిజన గ్రామాలపై పోలీసులు కొద్ది రోజులుగా కార్డెన్ సెర్చ్లు చేపట్టారు. ఒకే సారి గ్రామాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టి తనిఖీలు చేస్తున్నారు. బయట వ్యక్తు లు ఆ సమయంలో ఉంటే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే విచారిస్తున్నారు. ఇక రికార్డులు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీని మూలంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలు చేయాలనుకునే వారు భయపడుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బూదరాళ్ల పంచాయతీలో గరిమండ, కన్నవరం, అన్నవరం, మర్రివాడ పంచాయతీలో నిమ్మలగొందిలో కార్డెన్సెర్చ్లను నిర్వహించారు. గూడెం, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు గిరిజనుల భయానక జీవితం ఈ నెలాఖరుతో ముగియనున్న మావోయిస్టుల గడువు తాజా ఆపరేషన్ వజ్ర ప్రహార్ ప్రారంభం -
22కిలోల గంజాయి స్వాధీనం
రావికమతం: మండలంలో దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయిని తరిలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులు రెండు బ్యాగులు వదిలి పారిపోతుండగా సిబ్బందితో వారిని వెంబడించినట్టు ఎస్ఐ తెలిపారు. ఒక్క వ్యక్తిని పట్టుకున్నామని, మరో నిందితుడు పరారయ్యాడని చెప్పారు. రెండు లగేజీ బ్యాగ్ల్లో తనిఖీ చేసి 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి నుంచి రెండు జతల బంగారం ఆభరణాలు,రూ. 1000 నగదు,రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చెందిన వ్యక్తి అని, ఇప్పటికే అల్లూరి జిల్లా సీలేరు,నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసు స్టేషన్లలో గంజాయి కేసులు,రోలుగుంట పోలీస్ స్టేషన్లో బంగారం చోరీ కేసు ఉన్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ తరలించామని, పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ చెప్పారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
నిత్యకల్యాణంలో స్వామికి యజ్ఞోపవీతధారణ చేస్తున్న అర్చకుడు సింహాచలం : సింహాచల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి శనివారం ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకే ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపు చేసి, 1001 నామాలతో సహస్రనామార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష హారతులు సమర్పించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం వంటి ఘట్టాల అనంతరం జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను అర్చకులు వేదమంత్రాల సాక్షిగా పూర్తి చేశారు. ఈ పవిత్ర క్రతువులో పాల్గొన్న ఉభయదాతలకు ఆలయ అధికారులు శేషవస్త్రం, కల్యాణ అక్షింతలు ప్రసాదాలను అందజేశారు. -
బీజేపీలో చేరిన వ్యాపారవేత్త ఎంవీఆర్
ఎంవీపీకాలనీ : అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. శనివారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంవీఆర్తో పాటు మరో 100 మందికి పైగా ఆయని అనుచరులు శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వ్యాపారవేత్తగా ఎంవీఆర్కు మంచి గుర్తింపు ఉందని, ఆయన పార్టీలో చేరడం జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని ఈ సందర్భంగా మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన పాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా ఎంవీఆర్ , ఆయన అనుచరులు కృషిచేయాలని, పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని సూచించారు. ఎంవీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంతో పాటు ఆయన ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితుడై బీజేపీలో చేరినట్టు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అడవులతో పర్యావరణ సమతుల్యత
అరకులోయ టౌన్: అడవులు జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు అత్యంత అవసరమని అరకులోయ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బొర్రా కోటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అటవీ శాఖ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలన్నారు. ప్రతి ఏటా ఒక ప్రత్యేక అంశం(థీం)తో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. అడవుల పెంపకం, పునరుద్ధరణ, స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడం 2025–26 నాటి థీంగా అయన పేర్కొన్నారు. అనంతరం అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో పలు మొక్కలు నాటారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.రామారావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పాచిపెంట ఉద్దంగి, రామచంద్రుడు, అభిలాష్, వెంకటతేజ్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
విలువలకు నిలువుటద్దం పద్మనాభరెడ్డి
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అల్లిపురం: న్యాయవాద వృత్తిలో విలువలకు, నిబద్ధతకు నిలువుటద్దం దివంగత సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ కొనియాడారు. వర్ధమాన న్యాయవాదులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ జిల్లా, సిటీ కమిటీల ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మనాభరెడ్డి గారు ఒక ధ్రువతారలా వెలిగారని, ఆయన వాదనా పటిమ, చట్టంపై ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమని గుర్తుచేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక ప్రసంగిస్తూ.. పద్మనాభరెడ్డి గారు కేవలం గొప్ప న్యాయవాదే కాకుండా, ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారని ప్రశంసించారు. రిటైర్డ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ (పద్మనాభరెడ్డి కుమారుడు) తన తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ లాలం పార్వతినాయుడు, ఐఏఎల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చలసాని అజయ్కుమార్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు వి.చంద్రశేఖరరెడ్డి, కె.ఎస్.సురేష్ కుమార్, ఎం.ఎస్.ఎం.భగవతీ, డి.మంజులత, ఎ.వి.లెనిన్, జహారా, అజయ్కుమార్, పీర్ల నూకరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నక్కపల్లి : ఈనెల 23న నక్కపల్లి మండలం తమ్మయ్యపేటలో జరిగే స్టీల్ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనే బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి శనివారం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్మ్యాప్, ట్రయల్రన్ హెలీప్యాడ్ నిర్మాణం, వీవీఐపిలు ప్రయాణించే రూట్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు చేసిన బందోబస్తు గురించి వివరించారు. బందోబస్తు కోసం వచ్చిన సిబ్బందికి తగు సూచనలు చేశారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లపై హోంమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ శాఖల మంత్రితోపాటు, కేంద్రమంత్రులు, రామ్మోహన్నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ , హెచ్డి కుమార స్వామి గౌడ తదితరులు పాల్గొంటారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో గిరిజనులకు మేలు
● మానవ హక్కుల సంఘం నేత సూర్యనారాయణ ● పాడేరు జిల్లా ఆస్పత్రి సందర్శన సాక్షి, పాడేరు: వాతావరణ మార్పులు, అధిక వర్షాలతో గిరిజనులు విష జ్వరాలు బారిన పడుతున్నారని, అన్ని గ్రామాల్లోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సల్లంగి సూర్యనారాయణ కోరారు. పాడేరు జిల్లా ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హుకుంపేట మండలం గనిక గ్రామానికి చెందిన బాలన్నతో పాటు పలువురు రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు విజృంభించక ముందే ప్రభుత్వం ఏజెన్సీలో వైద్య బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య బృందాలు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికి వెళ్లి గిరిజనులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందించారని గుర్తు చేశారు. స్పెషలిస్టు వైద్యులు కూడా గ్రామాల్లో తిరగడంతో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందన్నారు. అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేయాలన్నారు. గత రెండేళ్లుగా గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయకపోవడంతో మలేరియా కేసులు అధికమయ్యాయని చెప్పారు. గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీతో పాటు దోమతెరలను వెంటనే పంపిణీ చేయాలని ఆయన కోరారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతో పాటు కేజీహెచ్కు అంబులె న్స్ సౌకర్యం నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు. -
ఏపీజేఏసీ తాలూకా కమిటీ కార్యవర్గం ఎన్నిక
చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, కర్షక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి చింతపల్లి తాలూకా చైర్మన్గా బుక్క చిట్టిబాబు, జనరల్ కార్యదర్శిగా దేపూరి శశికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక గిరిజన్ భవన్లో రాష్ట్ర, జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా జేఏసీ జనరల్ సెక్రటరీ యు.వి.గిరి, కో చైర్మన్ కుడుములు వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సేవా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కో చైర్మన్లుగా జి.తిరుపతిబాబు, కె.సత్తిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.వెంకటేష్, కోశాధికారిగా కె.బాబూరావు, వైస్ చైర్మన్లుగా వీరయ్యదొర, పి.వి.రమణ, సురేష్కుమార్, కృష్ణమూర్తితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టిబాబు, శశికుమార్ మాట్లాడుతూ చింతపల్లి తాలూకాలో సమస్యలపై కార్యవర్గ సభ్యులు సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన అన్ని సంఘాల క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. -
ఈద్ ముబారక్
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు శనివార ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు రంజాన్ సందర్భంగా ఉదయాన్నే మసీదుల్లో ప్రత్యేక నమాజ్ చేశారు. పాడేరులోని పురాతన జక్రీ ఇలాహి జామియా మసీదులో గురువు ఎస్.కె.అలీ ఆధ్వర్యంలో ప్రార్థనలు అనంతరం పాడేరు మెయిన్ రోడ్డులో శాంతి ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, వర్తకులకు ముస్లిం పెద్దలు స్వీట్లు పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా ముస్లీం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సుండ్రుపుట్టులోని దర్గా ప్రాంతంలో ముీస్లింలు లోక కల్యాణార్థం నమాజ్ చేశారు. తమిళనాడు ముస్లిం కుటుంబాలు కూడా స్థానిక జమాత్, గుత్తులపుట్టు మసీదుల్లో నమాజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వేసవి సవాళ్లకు వాల్తేర్ డివిజన్ సిద్ధం
తాటిచెట్లపాలెం: ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం వాల్తేర్ డివిజన్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శనివారం డీఆర్ఎం కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్రా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ, కోరాపుట్, జగదల్పూర్ వంటి చోట్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం ప్రత్యేక మంచినీటి బూత్లను ఏర్పాటు చేయాలన్నారు. సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రయాణికులకు నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. రైల్వే స్టేషన్లలోని మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు చేరవేయాలని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే కమర్షియల్ సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆపద వేళల్లో ప్రయాణికులను ఎలా రక్షించాలో వివరిస్తూ రైల్వే సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. -
● కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు ● వైఎస్సార్ లాన్, వ్యూ పాయింట్ వద్ద ధ్వంసరచన ● తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి ● తీవ్రంగా స్పందించిన వైఎస్సార్సీపీ ● 48 గంటల్లో దోషులను శిక్షించాలని
అనకాపల్లి మండలం తగరంపూడిలో గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగలుఉమ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్నగర్ క్లబ్లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ లాన్ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్ వ్యూ పాయింట్ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది. -
ఆర్కే బీచ్ వద్ద నటి కాజల్ సందడి
కొమ్మాది: ఆర్కె బీచ్ సమీపంలోని హవా మహల్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శనివారం జరిగిన షూటింగ్లో కాజల్ అగర్వాల్తో పాటు ప్రముఖ నటులు అజయ్ ఘోష్, అజయ్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన నటిని చూ సేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హవా మహల్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. -
వైద్యం కోసం నిరీక్షణ
ముంచంగిపుట్టు : మండల కేంద్రం ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవల కోసం రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం వారపు సంత కావడంతో అధిక సంఖ్యలో రోగులు సీహెచ్సీకి వచ్చారు. ఒక్కరే వైద్యాధికారి ఉండడంతో వైద్య సేవల కోసం గంటల తరబడి రోగులు క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు రోగులు క్యూలైన్లలో కూర్చుని వేచి ఉన్నారు. సీహెచ్సీలో ఏడుగురు వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరు సెలవులో ఉండడంతో ఒక్క డాక్టర్ మాత్రమే రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా వైద్య విధాన పరిషత్ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని రోగులు కోరుతున్నారు. -
వాట్సాప్ గొడవలే ప్రాణం తీశాయి
ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో జరిగిన బొచ్చు వెంకటేష్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి శుక్రవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలు, వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం వంటి కారణాలే ఈ హత్యకు దారితీసినట్లు ఆయన తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) పల్లా అనిల్కుమార్ది హెచ్బీ కాలనీ. గతంలో ఆటోమోటివ్ కూడలి వద్ద జరిగిన హత్య కేసుతో పాటు మరో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. అనిల్ గత కొంతకాలంగా రణస్థలంలో నివాసముంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అయితే, అప్పుడప్పుడు నగరానికి వస్తూ స్థానిక యువకులతో గ్రూపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హత్యకు గురైన వెంకటేష్, గాయపడిన సంతోష్లతో అనిల్కు తగాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరిని అంతం చేసేందుకు అనిల్ ఇద్దరు మైనర్లతో పాటు వెంకటేష్ (ఏ2), నాగేంద్ర (ఏ3), రాజేష్ (ఏ4), చరణ్ (ఏ5), నిశాంత్ (ఏ6)లతో కలిసి పథకం రచించాడు. ఇసుకతోట కూడలి దరిలో పథక రచన చేసిన అనంతరం.. బొచ్చు వెంకటేష్ రామాలయం వద్ద ఉన్నాడని తెలుసుకొని మారణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బాకి సంతోష్ ఇంటికి వెళ్లారు. సంతోష్ భార్య వరలక్ష్మి, స్నేహితుడు చందులను కొందరు అడ్డుకోగా, అనిల్, ఏ2 వెంకటేష్ సంతోష్పై కత్తి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. సంతోష్ భార్య, స్నేహితుడు పెనుగులాటలో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పారిపోయారు. పసల చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, 10 బృందాలుగా ఏర్పడి నిందితులందరినీ పట్టుకొని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎంవీపీ సీఐ ప్రసాద్, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు అసిరి తాత, డీడీ నాయుడు, భవ్య, సీతారాం, ఏఎస్ఐ ఆదిరాజు పాల్గొన్నారు. పోలీసుల చొరవ అభినందనీయం ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుపై ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు. సీఐ ప్రసాద్తో పాటు ఎస్ఐలు నాయుడు, సీతారాం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా, పెట్రోలింగ్ జీప్లో వెంకటేష్ను, సీఐ ప్రసాద్ తన జీప్లో సంతోష్ను ఎక్కించుకొని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. సంతోష్కు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, అతనికి అవసరమైన ‘ఓ పాజిటివ్’ రక్తాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వారి చొరవ కారణంగానే సంతోష్కు ప్రాణాపాయం తప్పిందని ఏసీపీ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని సంతోష్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సంతోష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఎంవీపీ పోలీసుల చొరవ అభినందనీయమని నరసింహమూర్తి వెల్లడించారు. తప్పుడు స్నేహాలతో జీవితాలు నాశనం మొదటి నుంచీ నేరచరిత్ర ఉన్న పల్లా అనిల్ గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే నిందితుల్లో పలువురు యువకులు ఈ హత్యకేసులో ఇరుక్కున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది నిందితుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కేవలం ఆధిపత్య పోరు కోసం అనిల్ వారిని రెచ్చగొట్టి, ఈ దారుణానికి ప్రేరేపించాడనే అభిప్రాయం కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి రౌడీషీటర్లతో స్నేహం చేసే విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షణికావేశం, అనవసర ఉత్సాహం వల్ల నేరాల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ నరసింహమూర్తి హితవు పలికారు. హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ -
ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి
పాడేరు: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు ప్రత్యేక చొరవతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి పలు సమస్యలపై 43 వినతులను, రెవెన్యూ క్లినిక్లో 9 వినతులను కలెక్టర్ దినేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్ఛార్జ్ డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు కలిసి స్వీకరించారు. అర్జీదారుల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రతి శుక్రవారం మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కచ్చితంగా నిర్వహించాలన్నారు మండల స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే, ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజలు ’1100’ కాల్ సెంటర్ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు. టీడబ్ల్యూ డీడీ పరిమళ, గృహ నిర్మాణ శాఖ పీడీ బాబు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్, డీఎల్పీవో కుమార్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్ బాబు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
గేట్ ఫలితాల్లో మత్స్యకార విద్యార్థిని ప్రతిభ
● ఆలిండియా స్థాయిలో 1940వ ర్యాంకు కై వసం ర్యాంకు సాధించిన పవిత్రను అభినందిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఎస్.రాయవరం: చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకార కుటుంబానికి చెందిన చోడిపల్లి పవిత్ర గేట్ ఆలిండియా 1940 ర్యాంకు సాధించింది. ఎస్.రాయవరం మండలం వాకపాడు పంచాయతీ బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు కోటయ్య, సోమేరు దంపతులు కుమార్తె పవిత్ర ప్రభుత్వ హాస్టల్ ఉంటూ పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం గాయత్రీ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలీయర్ చదువుతున్న సదరు విద్యార్థిని ఈ ర్యాంకు సాధించింది. సర్పంచ్ మైలపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు నాయకులు కోదండరావు, నారాయణ, పోతురాజు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెతోపాటు తల్లిదండ్రులను దుశ్శాలువాతో సత్కరించారు. పేదరికంలో పెద్ద చదువులు వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. -
చింతపల్లిలో భారీ వర్షం
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తూనే ఉంది. దాంతో ప్రదాన రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు: ఈ ప్రాంతంలో వరుసగా రెండో రోజూ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐదు నిమిషాలు కురవడం, మరో ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వడం.. ఇలా విడతల వారీగా వర్షం కురుస్తూనే ఉంది. రైతుల్లో ఆందోళన : నిత్యం వర్షాలు కురుస్తుండటంతో జీడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల జీడి తోటలు పూత దశ నుంచి పిందె దశకు మారినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత దశలోనే ఉన్నాయి. ప్రస్తుత మేఘావృత వాతావరణం, వర్షాల వల్ల పూత మాడిపోయే (నల్లబడే) ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. -
చట్టాపల్లి బాధితులకు అందని భరోసా
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని చట్టాపల్లి గ్రామంలో 2024, డిసెంబర్ 8న సంభవించిన పెను తుఫాను సృష్టించిన బీభత్సం మనందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో గ్రామం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం స్పందించి గ్రామంలో 36 ఇళ్లతో కూడిన ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ప్రమాదం జరిగి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇళ్ల స్థలాల కేటాయింపు కానీ, కాలనీ నిర్మాణ పనులు కానీ ప్రారంభం కాలేదని శుక్రవారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత నిధులతో ఇల్లు నిర్మించుకుందామన్నా ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మోడల్ కాలనీ వెంటనే నిర్మించాలి, లేనిపక్షంలో ‘ప్రధానమంత్రి జన్–మన్’ పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. తుఫానులో ప్రాణాలు కోల్పోయిన కొర్ర కుమారి కుటుంబానికి, అలాగే కాళ్లు చేతులు కోల్పోయిన కొర్ర రామన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని ఎంపీటీసీ నిర్మల రాజేశ్వరి డిమాండ్ చేశారు. బాధితుల పట్ల ప్రభుత్వ ఉదాసీనత తగదని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. రెండేళ్లు గడిచినా పూర్తికాని మోడల్ కాలనీ హామీ -
ఉద్యోగాల పేరుతో టోకరా: మహిళ అరెస్ట్
అల్లిపురం : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి నగదు వసూలు చేస్తున్న ముఠా గుట్టును మహారాణిపేట పోలీసులు రట్టు చేశారు. బాధితుడు సాయిసూర్య ఫిర్యాదుతో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి నిరుద్యోగులకు నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. నగరంలోని నోవాటెల్ సమీపంలో ఉన్న ’బ్లాక్ అండ్ వైట్’ హోటల్లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. నిరుద్యోగుల నుంచి ముందుగా రూ. 5 వేల చొప్పున వసూలు చేశారు. అయితే అదనంగా మరో రూ. 2,500 చెల్లించాలని నిందితులు ఒత్తిడి చేయడంతో బాధితుడు సాయిసూర్యకు అనుమానం వచ్చింది. వెంటనే అతను మహారాణిపేట పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సదరు హోటల్పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
చోడవరం: గంజాయి కేసులో ఓ నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారా శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిందని ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. వివరాల్లోకి వెళితే...గంజాయి రవాణా చేస్తుండగా 2015 జులై 16వతేదీన చోడవరం సమీపంలో విజయనగరం జిల్లాకు చెందిన కోరుకొండ అప్పలపాత్రుడు ఎలియాస్ రాజు (32)ను పట్టుకుని, 175 కిలోలను, రవాణాకు వినియోగించిన లారీ, మోటారు సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి చోడవరం ఎస్ఐ రమణయ్య కేసు నమోదు చేశారు. చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ ఈ కేసులో వాదనలు విని, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో రెండేళ్లపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా ఎ 2గా ఉన్న కిల్లో బాబూరావు ఇప్పటికీ పరారీలో ఉండటంతో ఎన్బీడబ్ల్యూ అమలు చేసి ఆ నిందితునిపై వేరే కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మిగతా నిందితులపై వాదనలు జరిగాయి. ఇందులో ఎ1గా ఉన్న కోరుకొండ రాజుకి శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పినట్టు ఎస్పీ తెలిపారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన వారందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాలు రవాణా, వినియోగం చేసే వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదని ఎస్పీ హెచ్చరించారు. ప్రత్యేక నిఘా వ్యవస్థతో నేరస్తులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. -
డుంబ్రిగుడ వాసికి డాక్టరేట్
● గణాంక శాస్త్రంలో శెట్టి శ్రీను పరిశోధన డుంబ్రిగుడ: మండల కేంద్రానికి చెందిన శెట్టి శ్రీను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. స్టాటిస్టిక్స్ (గణాంక శాస్త్రం) విభాగంలో ప్రొఫెసర్ బి. మునిస్వామి మార్గదర్శకత్వంలో ‘ఫెర్టిలిటీ ప్యాటర్న్’ అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఏయూ ఈ పీహెచ్డీని ప్రదానం చేసింది. శ్రీను తన పరిశోధనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాల తీరును విశ్లేషించారు. ప్రస్తుతం సిజేరియన్ ప్రసవాలు 21 శాతం పెరిగాయని, ఇదే ధోరణి కొనసాగితే 2030 నాటికి ఇవి 29 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తన పరిశోధనా వ్యాసంలో వెల్లడించారు. కృషి ఉంటే.. విజయం సాధ్యం.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీను, అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అరకులోయలోని సెయింట్ జోసెప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన, విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి, నేడు డాక్టరేట్ సాధించారు. అత్యున్నత పట్టా పొందిన శ్రీనును మండల కేంద్రంలోని గ్రామస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు. -
ప్రాణాపాయ స్థితిలోనూ మొండితనం
సీలేరు: మారుమూల గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, ఆసుపత్రుల పట్ల భయం నేటికీ గిరిజనుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లబోమని ఓ గిరిజన కుటుంబం మొండికేసిన ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రష్యాగూడ గ్రామానికి చెందిన పాంగి కుసుల అనే మహిళ ప్రసవ వేదనతో బుధవారం సీలేరు ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ,బిడ్డ క్షేమంగానే ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో తల్లికి హిమోగ్లోబిన్ శాతం కేవలం 4.5 మాత్రమే ఉన్నట్లు తేలింది. రక్తహీనత తీవ్రంగా ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని గుర్తించిన స్టాఫ్ నర్స్ హైమ, మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బందితో వాగ్వాదం విశాఖ వెళ్లాలని సూచించినప్పటి నుంచి బాలింత భర్త గోపాలరావు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మేము ఎక్కడికీ వెళ్లం, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం’ అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బాధితురాలి రక్త గ్రూపు ఏబీ పాజిటివ్ కావడంతో, ఆ రక్తం చింతపల్లి లేదా నర్సీపట్నంలో దొరకదని, కేజీహెచ్లోనే అందుబాటులో ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బాధ్యత మాదేనని లేఖ.. మూడు రోజుల పాటు పోలీసులు, వైద్య సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చినా ఆ కుటుంబం ససేమిరా అంది. చివరికి ‘నా భార్య బిడ్డలకు ఏమైనా జరిగితే నాదే బాధ్యత, వైద్య సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు’ అని బాలింత భర్త గోపాలరావు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తన భార్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రక్తహీనతతో బాధపడుతున్న బాలింత కేజీహెచ్కు వెళ్లాలని సూచించినా పట్టించుకోని వైనం వైద్యసిబ్బందితో వాగ్వాదం కౌన్సెలింగ్ చేసినా ప్రయోజనం శూన్యం భార్య, బిడ్డకు ఏమైనా తమదే బాధ్యత అంటూ లేఖ రాసిచ్చిన భర్త -
14 నుంచి ముత్యాలమ్మ జాతర
ఉత్సవ కమిటీ ఏర్పాటుచింతపల్లి: స్థానిక గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దలు, వివిధ సంఘాల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శిగా దురియా హేమంత్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పెదరెడ్ల బేతాళుడు, సభ్యులుగా జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ తదితరులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ కోరాబు అనూషదేవి, వైఎస్సార్సీపీ నేతలు జల్లి సుదాకర్,బూసరి కృష్ణారావు,గంగన్న పడాల్, ముత్యాలమ్మ వారి అనువంశిక ధర్మకర్తలు, సుర్ల వంశీయులు అప్పారావు, వీరేంద్ర, మాదల తిరుపతిరావు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు యూవీ గిరి, కుడుములు వెంకటరమణ, దేపూరి శశికుమార్, కిట్లంగి ప్రసాద్, వర్తక సంఘ ప్రతినిధులు తాటిపాకల నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
అరకులోయటౌన్: మానవుని యొక్క సర్వతోముఖాభివృద్ధి అడవులతోనే ముడిపడి ఉందని అరకులోయ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బొర్రా కోటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ ఆదేశాల మేరకు వృక్షశాస్త విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకుడు పి.నాగబాబు అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ రేంజ్ ఆఫీసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అటవీ శాఖ ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా అటవీ సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఫారెస్ట్ సెక్షెన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు మాట్లాడుతూ మొక్కలను నాటి అడవులను అభివృద్ది చేయాలన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి.ఉద్దంగి అడవుల సంరక్షణపై విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. వృక్ష శాస్త్ర అధ్యాపకుడు బి. లచ్చన్న థీమ్, అడవులు, ఆర్థిక వ్యవస్థలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ఆవరణలో యూజీనియా అలంకరణ మొక్క లు నాటారు. ఎన్ఎస్ఎస్ పీవోలు విజయలక్ష్మి, అనిత కుమారి, అధ్యాపకులు కృష్ణమోహన్, సుందరిరాణి, వి.కామేశ్వరరావు, రాజు, సోంబాబు పాల్గొన్నారు. -
50 కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరి అరెస్టు పాడేరు: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమంలో భాగంగా గంజాయి రవాణాను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.దీనిలో భాగంగా గురువారం సాయంత్రం ముంచంగిపుట్టు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఈ సమయంలో బైక్పై వచ్చిన నర్సింగ్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా, సిబ్బంది అతడిని చాకచక్యంగా పట్టుకున్నారన్నారు.అతను ఇచ్చిన సమాచారంతో జోలాపుట్టు సమీపంలో భీమా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 50 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్టు ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో కఠిన చర్యలు ఒడిశాలోని పనసపుట్టు, జనభ, జంత్రి, తాబేరు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి, జోలాపుట్టు కేంద్రంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు గానీ, నిల్వలు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఒడిశా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జి.మాడుగుల, పాడేరు సీఐలు శ్రీనివాసరావు, దీనబంధు పాల్గొన్నారు. -
దారాలమ్మ అమ్మవారికి బంగారు ముక్కుపుడక వితరణ
సీలేరు: దారకొండ గ్రామంలో వెలసిన గ్రామ దేవత దారాలమ్మ అమ్మవారికి శుక్రవారం బంగారు ముక్కుపుడకను వితరణగా అందజేశారు. దారకొండ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి పైలా చిన్నబాబు, కొండమ్మ దంపతుల కుమారుడు రవికిరణ్, అనూష దంపతులు ఈ కానుకను సమర్పించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రవికిరణ్, ప్రతి ఏటా అమ్మవారి పండుగకు విచ్చేసి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి చేయించిన బంగారు ముక్కుపుడకను ఆలయ అర్చకుడు ప్రసాద్కు అందజేశారు. దాతల భక్తిశ్రద్ధలను ఆలయ కమిటీ, స్థానికులు అభినందించారు. -
పంటల సస్యరక్షణపై దృష్టి సారించాలి
దేవరాపల్లి: పంటల సస్యరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి చెరకు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టరు ఉమామహేశ్వరరావు, డాక్టరు చంద్రశేఖర్ రైతులకు సూచించారు. మండలంలోని మారేపల్లి, తెనుగుపూడి, దేవరాపల్లి గ్రామాల్లో పంటలను ఏవో ఎల్.వై. కాంతమ్మతో కలిసి శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. పూత దశలో నువ్వు పంటకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలమా..కాదా అని స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ, కార్షి దశలో ఉన్న చెరకు పంటను సైతం పరిశీలించారు. వేరుశనగ పంటలో మొక్కలు చనిపోవడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎక్సోకొనజోల్ 2 మిల్లీ లీటర్లను ఒక లీటరు నీటిలోను, ప్రొపి కొనజోల్ ఒక మిల్లీ లీటరను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు మొదలు భాగం తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్రంగా వివరించారు. మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్. కిరణ్కుమార్, స్థానిక అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
చోరీ సొత్తు రికవరీ
గొలుగొండ: దొంగతనం జరిగిన కొద్ది రోజుల్లో కేసును ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసినట్టు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. వివరాలు... గొలుగొండ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రొంగల దేముడు ఇంటిలో ఈనెల 13న ఇంటిలో ఎవరూ లేని సమయంలో రెండున్నర తులాల బంగారం, వెండిపట్టీలు చోరీ జరిగాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్ఐ రామారావు, సిబ్బంది సభ్యులు విచారణ నిర్వహించారు. నిందితుడు ఓ బాలుడు(17)గా గుర్తించారు. ఈ బాలుడుపై చోడవరం, పరవాడ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులున్నాయని సీఐ తెలిపారు. బాలుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలు రికవరీ చేసి, కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ కేసు తక్కువ సమయంలో ఛేదించిన ఎస్ఐ రామారావుతో పాటు సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామారావు తదతరులు పాల్గొన్నారు. -
నర్సీపట్నం పెద్ద చెరువు కబ్జాకు యత్నం
● పరిరక్షించాలంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తెచ్చిన రైతులునర్సీపట్నం: కబ్జాకు గురవుతున్న నర్సీపట్నం పెద్ద చెరువును పరిరక్షించాలంటూ ఆయకట్టు రైతులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను కలిసి మొర పెట్టుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని సర్వే నంబరు 271లో వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని ఆయకట్టు రైతులు సబ్బవరపు సూరిబాబు, శెట్టి కన్నయ్యనాయుడు, శెట్టి శ్రీను, తాతాలు, అప్పలనాయుడు, కృష్ణమ్మ మల్లేశ్వరరావు, సుర్ల రమణ, సుర్ల అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం, బలిఘట్టం, జోగునాధునిపాలెం, ధర్మసాగరం, దుగ్గాడ గ్రామాల పరిధిలో 500 ఎకరాలు చెరువు కింద సాగువుతోందన్నారు. సాగు, తాగునీటి జీవనాధారంగా ఉన్న చెరువును కొందరు వ్యక్తులు రాజకీయ నేతల అండతో కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. రాత్రికి రాత్రే లారీలతో మట్టికప్పి చెరువును ఆక్రమించి స్వప్రయోజనాలు కోసం రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా చుక్కనీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారన్నారు. నర్సీపట్నంలో అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు వినడం లేదన్నారు. చెరువును ఆక్రమణదారుల నుంచి కాపాడాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని గణేష్ హామీ ఇచ్చారు. -
యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు
మునిగి యువకుడికోసం గాలిస్తున్న పోలీసులు (ఇన్సెట్) సురక్షితం ఒడ్డుకు చేర్చిన యువకుడుతో మైరెన్ పోలీసులు ఎస్.రాయవరం: రేవుపోలవరం వద్ద సముద్రంలోకి దిగి మునిగిపోతున్న ఓ యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.ఈ మేరకు పెంటకోట మైరెన్ సీఐ వై. మురళీ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.తిరుపతి జిల్లా తిరుపతి మండలం కోర్లగుంట గ్రామానికి చెందిన సీహెచ్ తేజ ఐదుగురు స్నేహితులతో కలిసి నర్సీపట్నంలో ఉంటున్న స్నేహితుడు మహేష్ ఇంటికి వచ్చాడు.వీరంతా కలిసి శుక్రవారం రేవుపోలవరం తీరానికి వెళ్లారు.స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు.ఈ సమయంలో పెద్దఅల రావడంతో తేజ మునిగిపోయాడు.తోటి స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మైరెన్ సీఐ మురళి, ఎస్ఐ వి.వి.ఎం. దొర,కానిస్టేబుల్ చిన్నబాబు,హెచ్జీఎస్ పి.అప్పలరాజు,వి.గోపి రక్షించి తేజాను ఒడ్డుకు చేర్చారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.తేజస్నేహితులు , కుటుంబ సభ్యులు మైరెన్ పోలీసులుకు కృతజ్ఞతలు తెలిపారు. -
వీరుల త్యాగాలకు సజీవ సాక్ష్యం
మన్యం వీరుల పోరాట పటిమను, వారు చిందించిన రక్తపు చుక్కల విలువను నేటి తరానికి చాటిచెప్పేలా తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ ప్రతిష్టాత్మక కట్టడం, అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మితమవుతోంది. అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో నడిచిన వీరుల చరిత్రను కళ్లకు కట్టబోతోంది. పర్యాటక సీజన్నాటికి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ● తాజంగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ● వారి సేవలు నేటి తరానికి తెలిసేలా సంకల్పించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ● నిధుల కొరత వల్ల కొన్నాళ్లు నత్తనడకన పనులు ● కేంద్ర ప్రభుత్వం చొరవతో ఊపందుకున్న నిర్మాణాలు ● పర్యాటక సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తామంటున్న అధికారులు చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగికి సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు ఊపందుకున్నాయి. ప్రారంభంలో ఈ పనులు వేగంగా జరిగినప్పటికీ, మధ్యలో కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినా పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే, మూడవసారి టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనులపై దృష్టి సారించారు. దీని నిర్మాణానికి రూ.35 కోట్లు (కేంద్రం వాటా రూ.15 కోట్లు, రాష్ట్ర వాటా రూ.20కోట్లు వెచ్చించాయి. తాజంగిలోని వ్యవసాయ శాఖకు చెందిన 22 ఎకరాల్లో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులోని 11 ఎకరాల్లో మ్యూజియం నిర్మిస్తున్నారు. మిగిలిన 11 ఎకరాల్లో పర్యాటకరంగానికి సంబంధించి కట్టడాలకు కేటాయిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 8న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మ్యూజియం ప్రత్యేకతలు.. దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. గిరిజన వీరుల పోరాట పటిమను భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయి. ● మొదటి విభాగం: అమరవీరుల విగ్రహాలు, వారు వాడిన ఆయుధాల ప్రదర్శన కోసం నాలుగు బ్లాకులు. ● రెండవ విభాగం: టికెట్ కౌంటర్, ఓపెన్ థియేటర్, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు. ● మూడవ విభాగం: ల్యాండ్ లెవలింగ్, సిమెంట్ రోడ్లు, ప్రహరీ తదితర మౌలిక సదుపాయాలు. ప్రస్తుత స్థితి.. ప్రస్తుతం మొదటి రెండు విభాగాలకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉండటంతో, వచ్చే పర్యాటక సీజన్ నాటికి ఈ మ్యూజియం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.ఇది అందుబాటులోకి వస్తే, కేవలం సీజన్లోనే కాకుండా ఏడాది పొడవునా పర్యాటకుల రద్దీ ఉంటుందని, తద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. శరవేగంగా పూర్తిచేస్తాం ఈ ఏడాది పర్యాటక సీజన్ నాటికి అన్ని సౌకర్యాలతో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన అన్ని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – యాద కిషోర్, జేఈ, గిరిజన సంక్షేమశాఖ, చింతపల్లివేగవంతం చేయాలి తాజంగిలో నిర్మిస్తు న్న స్వాతంత్య్ర సమరయోధుల గిరిజన మ్యూజి యం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. ఇది అందుబాటులోకి వస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. – కోరాబు అనూషదేవి, ఎంపీపీ, చింతపల్లి -
జీసీసీ తీరుపై 23న ఆందోళన
గూడెంకొత్తవీధి: కాఫీ కొనుగోళ్ల విషయంలో జీసీసీ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల 23న కాఫీ రైతులతో కలసి జీసీసీ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాఫీ రైతులకు ఈ ఏడాది జీసీసీ తీరని అన్యాయం చేసిందన్నారు. సరియైన సమయంలో రైతుల నుంచి కాఫీ కొనుగోలు చేయకుండా చేతులెత్తేసిందన్నారు. చివరికి గిరిజనులకు దళారులే దిక్కయ్యారన్నారు. కాఫీ రైతులకు అన్యాయం చేసిన జీసీసీ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియ జేస్తామని బుజ్జిబాబు అన్నారు. -
పిచ్చుకలను రక్షించుకుందాం
అనకాపల్లి: భావితరాలను దృష్టిలో పెట్టుకుని పిచ్చుకలను రక్షించుకునేందుకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని వృక్షమిత్ర, ఏపీ జీవైవిధ్య సంరక్షణ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కణతాల ఫణిభూషన్ శ్రీధర్ అన్నారు. స్థానిక జీవీఎంసీ విలీనగ్రామైన ఎరుకువానిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం కొన్ని వేల సంవత్సరాల నాటిదని చెప్పారు. ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో పిచ్చుకలు చేరిపోతున్నాయన్నారు. సెల్ టవర్ల రేడియో ధార్మికత పిచ్చుకలకు ప్రాణసంకటంగా మారిందని, ఈ చిన్నారి పిచ్చుక జాతిని కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దానికో గూడు కట్టి, గింజలు, తాగునీరు పెట్టాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ధాన్యపు కుంచులను, తాగునీటి కోసం మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.ఎన్.మూర్తి, బి.వై.వి.ఎస్.కృష్ణారావు, ఈ.శ్రీలత, ఎ.ఉమా, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అరిగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలులతో కూడిన వర్షం
దేవరాపల్లి: మండలంంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి దేవరాపల్లిలోని మహేశ్వరి థియేటర్ సమీపంలో విద్యుత్ తీగలపై చెట్టు విరిగిపడింది. దీంతో విద్యుత్ సరఫరాకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఈదురు గాలుల ధాటికి దెబ్బతింది. స్థానిక ఎలక్ట్రికల్ ఏఈఈ కె. శంకరరావు ఆదేశాలతో లైన్మన్ బి. రాము సిబ్బంది సహకారంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మోస్తరు వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. నేలకొరిగిన చెట్లు మాడుగుల రూరల్: ఆకాశంలో ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులతో కూడిన వర్షం గురువారం సాయంత్రం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత, ఎండ తీవ్రతకు విలవిలలాడిన ప్రజలు ఉపశమనం పొందారు. ఈ వర్షం వల్ల కోసిన మినప పంట తడిసి ముద్దయిందని రైతులు వాపోయారు. ఈదురు గాలులతో చిన్న వృక్షాలు నేలకొరిగాయి. -
గంజాయి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
రూ. లక్ష జరిమానా తుమ్మపాల/మాడుగుల రూరల్: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అఽధికారి ఎం.సుధీర్ గురువారం మీడియాకు వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి చెందిన మండా జీవన్(27) గంజాయి అక్రమ రవాణా చేస్తూ వి.మాడుగుల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డాడు. అతడి నుంచి 440 కిలోల గంజాయి, ఒక బొలేరో వ్యాన్(ఏపీ31 టీసీ 700) అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు అనంతరం చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం. హరినారాయణ బుధవారం తీర్చునిచ్చారు. పక్కా ఆధారాలతో పట్టుకుని చార్జ్ షీట్ దాఖలు చేసిన అప్పటి ఇన్స్పెక్టర్లు పి.శ్రీనివాసరావు, టి.నాగేశ్వరరావు వారి సిబ్బందితో పాటు ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్ష్యాధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్.సూర్యనారాయణ, ప్రస్తుత వి.మాడుగుల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర, కోర్టు మోనిటరింగ్ సెల్ సిబ్బందిని ఎకై ్సజ్ అధికారి సుధీర్ అభినందించారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా వంటి చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజలందరూ డిపార్ట్మెంట్కు సహకరించాలని కోరారు. పాత కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడేలా నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. -
కేజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
మహారాణిపేట: తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గర్భిణీకి కేజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. పలు విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందించి తల్లి, బిడ్డను క్షేమంగా డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన అనిత (20) గర్భిణీగా ఉండగా తీవ్రమైన రక్తహీనత (హీమోగ్లోబిన్ కేవలం 5 గ్రాములు)తో ఈ నెల 27న కేజిహెచ్ గైనకాలజీ విభాగాన్ని సంప్రదించింది. యూనిట్ చీఫ్ డాక్టర్ సౌమిని ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్. గీతావందన పర్యవేక్షణలో అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అనితకు తీవ్రమైన కామెర్లు, చిన్న రక్తకణాల లోపం, జ్వరం, అలాగే గర్భాశయంలో ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్) చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మలేరియా, ఆటో ఇమ్యూన్ హీమోలిటిక్ అనీమియా కూడా ఉన్నట్లు తేలింది. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో సుమారు 50–60 యూనిట్ల రక్తాన్ని క్రాస్మ్యాచ్ చేసినప్పటికీ సరిపోలకపోవడంతో జనరల్ మెడిసిన్ సహా పలు విభాగాల వైద్యులు కలిసి ప్రత్యేక చికిత్స అందించారు. అనంతరం ఈ నెల 11న 6.4 గ్రాముల హీమోగ్లోబిన్ స్థాయిలోనే, తక్కువ ఉమ్మనీరుతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా చికిత్సలో పాల్గొన్న గైనకాలజీ, ఇతర విభాగాల వైద్యులను ఆమె అభినందించారు.


