breaking news
Alluri Sitarama Raju District Latest News
-
ప్రారంభోత్సవం సరే... సిబ్బంది ఏరీ?
బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వంలో ప్రచార యావ తప్ప, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ధ్యాస కనిపించట్లేదు. ఇందుకు ఉదాహరణే ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్(అకడమిక్) భవనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి విలేజ్ క్లినిక్స్ నుంచి రాష్ట్ర స్థాయి ఆస్పత్రిల వరకు బలోపేతం చేశారు. అందులో భాగంగానే పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో నూతన విభాగాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.28.60 కోట్లు వెచ్చించి అకడమిక్ విభాగాన్ని పూర్తి వసతులతో నిర్మించారు. ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎట్టకేలకు మంగళవారం ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. అయితే సిబ్బందిని మాత్రం ఇంకా కేటాయించలేదు. సిబ్బంది లేకుండానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీటిని ప్రారంభించనుండటం గమనార్హం. ప్రారంభోత్సవానికి ఏడాది కాలం తీసుకున్న కూటమి ప్రభుత్వం, సిబ్బంది నియామకానికి ఇంకెంత సమయం తీసుకుంటుందో చూడాలి. సెంటర్ ఫర్ ఎక్స్లెన్సీ భవనం ప్రారంభం నేడు సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. దీంతో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక విభాగాలతోపాటు, డి–అడిక్షన్ సెంటర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
అడ్డతీగల: అడ్డతీగల మండలం వంగలమడుగులో భార్యను హత్య చేసిన భర్త మడకం జోగిదొరని సోమవారం అరెస్ట్ చేసినట్టు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి సోమవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9 న రాత్రి సమయంలో మడకం జోగిదొర వంగలమడుగు శివారులో అతని పొలంలోని చేనుమకాంలో భార్య విజయకుమారిపై అనుమానంతో కావాలనే గొడవపడి కర్రతో కొట్టి, కత్తితో నరికాడన్నారు. చనిపోయిన తరువాత భార్య శవాన్ని మంచంపై పడుకోబెట్టి ఆ రాత్రికి అదే మకాంలో నిద్రించి మరునాడు పారిపోయాడన్నారు. దీనిపై దుశ్చర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నిందితుడిని అడ్డతీగల మండలం వేటమామిడి సెంటర్లో సోమవారం పట్టుకుని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపర్చుకున్నామన్నారు. నిందితుడిని రంపచోడవరం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. సమావేశంలో ఎస్ఐ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరం పంచాయితీలోని దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన సత్యాల వెంకట కిషోర్ కుమార్ (24) దుర్మరణం చెందాడు. జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం, మారికవలసలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిషోర్ కుమార్, ప్రతిరోజూ తన గ్రామం నుంచి కుటుంబ సభ్యులు, ఇతరులను కూరగాయల మార్కెట్లో దించి, ఆటో సర్వీస్ చేస్తూ విధులకు వెళ్తుంటాడు. ఉదయం 4:10 గంటల సమయంలో వేములవలస వద్ద ఆగి ఉన్న ఒక వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కిషోర్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో మృతదేహాన్ని భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్ కుమార్కు రెండేళ్ల పావనితో వివాహం జరిగింది. అతని మృతితో దుక్కవానిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
అధైర్య పడకండి... అండగా ఉంటాం
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి వినయ్చింతపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు,నాయకులకు ఎటువంటి ఇబ్బందుల వచ్చినా తాము అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని పాడేరు శాసన సభ్యులు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి గుణబాబు అధ్యక్షతన సోమవారం చింతపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాయమాటలతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రజల తిరస్కారానికి గురైందన్నారు. అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గలేదని చెప్పారు. జిల్లాలో సర్పంచ్,ఎంపీపీ,జెడ్పీటీసీ ఎమ్మెల్యే,ఎంపీ పదవి వరకూ మన నాయకులే అధికారంలో ఉన్న విషయాన్ని పార్టీ నాయకులు,కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా తాము ఎప్పడూ అందుబాటులో ఉంటామని చెప్పారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యకర్తలు సమష్టిగా సన్నద్ధం కావాలని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శెట్టి వినయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది మన ప్రభుత్వమేనన్నారు. కార్యకర్తలు చిత్తశుద్ధితో కష్టించి పనిచేయాలన్నారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి,జీకే వీధి ఎంపీపీలు కోరాబు అనూషదేవి,బోయిన కుమారి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత,రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్,సర్పంచ్లు,ఎంపీటీల,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి
విశాఖ సిటీ : రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేయాలని సోలార్ వెండర్లు, బ్యాంకులు, అధికారులకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సూచించారు. సోమవారం విశాఖ సర్కిల్ కార్యాలయంలో వెండర్లు, బ్యాంకులు, ఈపీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డులు, గ్రామ పంచాయతీల్లో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించాలన్నారు. నగరంలో 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ను వినియోగిస్తున్నవారు 1.83 లక్షలకు పైగా ఉన్నప్పటికీ.. నగరంలో కేవలం 2,200 మాత్రమే రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అపార్టమెంట్ల కామన్ సర్వీసులకు రూఫ్ టాప్ కచ్చితంగా ఏర్పాటు చేయించడంతో పాటు, వర్చువల్ నెట్ మీటరింగ్ పద్ధతిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వినియోగదారులు తమ ఇంటి మిద్దైపె సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని సున్నా విద్యుత్ బిల్లులను పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, బీసీలకు అదనంగా రూ.20 వేలు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకానికి బ్యాంకులు ఏడు శాతం వడ్డీతో 90 శాతం రుణం ఇస్తున్నాయన్నారు. ఒక్కసారి పెట్టుబడితో 20 ఏళ్ల వరకు ఇంటికి సరిపడా విద్యుత్ వినియోగించడంతో పాటు, వాడుకోగా మిగిలిన అదనపు విద్యుత్ను విద్యుత్ సంస్థకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి.సూర్యప్రకాష్, సీజీఎం బి.సులేఖరాణి, ఎస్ఈ జి.శ్యాంబాబు, ఎస్బీఐ లీడ్ మేనేజర్ శ్రీనివాస్, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ చిరంజీవి, ఈఈలు, సోలార్ వెండర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి -
బంగాళాఖాతం నీటి తీరు బాగోదు.. అందుకే క్రూయిజ్ రాదు.!
● విశాఖ ఎంపీ భరత్ వింత వాదన ● బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా రఫ్ సీ ● క్రూయిజ్ మార్గానికి ఈ ప్రాంతం అనువైనదే.. ● ఈ విషయం తెలియకుండానే అంతర్జాతీయ టెర్మినల్ నిర్మించామా.? ● విశాఖ పోర్టు వర్గాలు గుసగుసలుసాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతం, అరేబియా సముద్రం.. ఈ రెండింటిలో రఫ్ సీ(అలజడి) ఏదని అంటే.. అరేబియా సముద్రమేనని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ విశాఖ ఎంపీ భరత్ మాత్రం వింత వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రూయిజ్ టెర్మినల్ దగ్గర సోమవారం జరిగిన ప్రెస్మీట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీ భరత్ సమాధానాలిచ్చారు. ‘రూ.100 కోట్లు వెచ్చించి క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. కానీ దానికి రెగ్యులర్గా క్రూయిజ్ షిప్లు రావడం లేదెందుకు..?’ మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘బంగాళాఖాతం కాస్తా రఫ్ సీ గా ఉంటుంది. ఇక్కడ నీటి కదలికలు ఈ తరహా షిప్స్ ప్రయాణాలకు అనుకూలంగా ఉండవు. అందుకే రెగ్యులర్గా రావడం లేదు’.. అని ఎంపీ భరత్ సమాధామిచ్చారు. ఇది విన్న విశాఖ పోర్టు వర్గాలు ఆశ్చర్యపోయాయి. వాస్తవానికి పక్కనే ఉన్న అరేబియా సముద్రంతో పోలిస్తే.. బంగాళాఖాతం చాలా వరకూ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది నిత్యం అలజడిగా ఉండే అరేబియా సముద్ర పరిధిలో ఉన్న ముంబై, గోవా, లక్షద్వీప్ మొదలైన ప్రాంతాలకు క్రూయిజ్ సర్వీసులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. కానీ విశాఖకు క్రూయిజ్ రాకపోవడం బంగాళాఖాతం అలజడిగా ఉండటమేనని ఎంపీ చెప్పడంపై అక్కడే ఉన్న పోర్టు వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి సముద్ర నీటి అలల స్థితిగతులు, డిమాండ్, వాతావరణ పరిస్థితులు మొదలైన అంశాలపై దాదాపు ఏడాది పాటు అధ్యయనం చేసి.. నివేదిక ఇచ్చిన తర్వాతే అడుగు పడింది. క్రూయిజ్ షిప్స్ తిరిగేందుకు బంగాళాఖాతం అనువైనదని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతే.. టెర్మినల్ నిర్మాణ పనులకు చేపట్టారు. కానీ ఇప్పుడు ఎంపీ ఇలా మాట్లాడడంపై పోర్టు వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి. రూ.100 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మించినప్పుడు ఇవన్నీ తెలుసుకోకుండానే జరుగుతుందా? అని అవాక్కయ్యారు. -
ప్రజాప్రతినిధులను అధికారులు విస్మరిస్తే ఉపేక్షించేదిలేదు
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరిక చింతపల్లి: మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులను విస్మరిస్తే ఉపేక్షించేదిలేదని పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు.మండల కేంద్రంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సీతామహాలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. అరుకు ఎంపీ గుమ్మ తనూజారాణి నిధులతో పంచాయతీలకు వీధి దీపాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజలతో ఎన్నుకోబడిన తామంతా అధికారంలో ఉన్నామని, ఆ విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. పంచాయతీల్లో పెన్షన్లు. రేషన్ కార్డులు, కుల ఆదాయ, మరణ ధ్రువపత్రాల మంజూరులో జాప్యం చేస్తున్నట్టు తనకు ఫిర్యాదు వస్తున్నాయని, అటువంటిది జరగకుండా చూసుకోవాలన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జీకే విధిలో 22 పాఠశాలలు మూతపడ్డాయని , దీంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 17 పంచాయతీల సర్పంచులకు వీధి దీపాలను పంపిణీ చేశారు. అనంతరం డైరీ ఫారం ప్రాంగణంలో అరుకు ఎంపీ అభివృద్ధి నిదులు రూ.40 లక్షలతో చేపడుతున్న కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శెట్టి వినయ్, ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి సభ్యుడు పోతురాజు బాలయ్య పడాల్, సర్పంచ్ దురియా పుష్పలత, రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి గుణబాబు, ససర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రహిత మన్యం అందరి లక్ష్యం
పాడేరు: గంజాయి మహమ్మారిని మన్యం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాల్సిన బాధ్యత నేటి ఆదివాసీ యువతపై ఉందని పాడేరు సిఐ ధీనబంధు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సోమవారం స్థానిక కాఫీ హౌస్లో ఆదివాసీ విద్యార్ధిని మేలు కొలుపుదాం–బంగారు భవిష్యత్కు పునాదులు వేద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ధీనబంధు మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించటానికి, పోటీ పరీక్షల్లో సన్నద్ధమయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి రహిత మన్యం అందరి లక్ష్యంగా పనిచేయాలన్నారు. కళాశాలల్లో, వసతి గృహాల్లో ఎక్కడైన గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి బారిన పడి బంగారు భవిష్యత్ను పాడు చేసుకోవద్దని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్శర్మ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల గంజాయి స్మగ్లర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలన్నారు. ఆదివాసీల మధ్య ఐక్యను దెబ్బతీసేందుకు చాలామంది కుట్రపూరితంగా వ్యవహారించే అవకాశం ఉందన్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ఐటీడీఏ స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధులు ధర్మన్న పడాల్, బాల్దేవ్, కార్తిక్, జీవన్, విద్యార్ధులు పాల్గొన్నారు. -
దిగజారిన ధరలు.. రైతుల దిగాలు
● వారపు సంత మార్కెట్లో వేరుశనగకు తగ్గిన రేటు ● గత వారం కంటే సగానికి పైబడి పడిపోయిన ధర పెదబయలు: గిరిజన రైతులు వాణిజ్య పంటల్లో లాభదాయక పంటల్లో వేరుశనగ పంట ప్రధానంగా పండిస్తున్నారు. మత్స్యగెడ్డ గెడ్డ పరివాహక ప్రాంతాలు. ఇతర గెడ్డలను ఆనుకున్న పంచాయతీల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే పండిస్తున్న పంట కావడంతో మన్యం వేరుశనగకు మంచి గిరాకీ ఉంది. గతంలో కాసుల వర్షం కురిపించిన ఈ పంట కూటమి ప్రభుత్వంలో అధికారులు, జీసీసీ సహాయ సహకారాలు లేక వారపు సంత మార్కెట్లో కొనేవారు లేక గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే కేంద్రాలు, జీసీసీ, మార్కెట్ కమిటీ, స్వచ్ఛంద మార్కెట్ ద్వారా బస్తా వేరుశనగ రూ.2700 నుంచి రూ.2800 వరకు ధర పలికితే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వేరుశనగ ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత ఏడాది ఈ సీజన్లో రూ.1800 నుంచి రూ.2000 వరకు ధర పలికింది. ఈ ఏడాది వేరుశనగ సీజన్లో రూ.1400 నుంచి 1800 వరకు పలికింది. అయిత గత వారం కూడ రూ.1600 వరకు ధరపలికిన వేరుశనగ ఈ వారం రూ.700 నుంచి రూ.800 వరకు ధరతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వారపు సంతలో రోజంతా నిరీక్షణ చేసి తక్కువ ధరకు అమ్ముకుని వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారుల సిండికేట్ గిరిజన రైతులు పండించిన వేరుశనగ రాజమండ్రి, అనకాపల్లి, తుని, నర్సీపట్నం, విజయనగరం తదితరు ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి సంతల్లో కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు సిండికేట్గా మారడంతో వారు నిర్ణయించిన ధరలకే విక్రయించుకోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారపు సంత మార్కెట్కు అమ్మకానికి తెచ్చి మరలా రైతు తిరిగి తీసుకుని వెల్లే పరిస్థితి లేకపోవడం, మరో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో సిండికేట్ వ్యాపారులకు అనుకూలంగా మారుతోందని రైతులు చెబుతున్నారు. గత్యంతరం లేక తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుకు ఏర్పడుతుందని వాపోతున్నారు. వారపు సంతకు రవాణా చార్జీలు, కూలీ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతు కష్టాలు పట్టని ప్రభుత్వం గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వారపు సంత మార్కెట్లోనే పండించిన పంటలు అమ్మకం చేస్తాము. అన్ని పంటలు పసుపు, పిప్పళ్లు, ఇతర పంటలు మాదిరిగానే వ్యాపారుల సిండికేట్ వేరుశనగ పంటపై కూడా పడింది. సంతలో ధరలు వారం వారం మార్పు చెందుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సంతలో జరిగే మోసాలు అరికట్టడానికి ప్రభుత్వం,అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా స్పందించి రైతులను ఆదుకోవాలి. – దడియా రామచందర్, రైతు, పెదబయలు గ్రామం, పెదబయలు మండలం గిట్టుబాటు ధర కల్పించాలి గత వారం పెదబయలు వారపు సంతలో బస్తా రూ.1600 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ వారం రూ. 800లకు కూడా కొనుగోలు చేయడం లేదు. పంట పెట్టుబడి, కూలీ రేట్లు కూడా రావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేరుశనగ పంట కొనుగోలులో ఆర్బీకేలు, మార్కెట్ కమిటీ సహకారంతో వ్యాపారులు గ్రామాలకు వచ్చి మంచి ధరలు ఉండేవి. నేడు అధికారుల పర్యవేక్షణ లేదు. సిండికేట్ వ్యాపారుల బెడద ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రెండు రెండు ఎకరాల్లో సాగు చేశాను. ధర లేదు. ప్రభుత్వం గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాబు ధర కల్పించాలి. – కిముడు సన్యాసి, రైతు, తమరడ గ్రామం, పెదబయలు మండలం -
ఫిట్స్తో విద్యార్థికి తీవ్ర అస్వస్థత
● కేజీహెచ్కు తరలింపు ● మెరుగైన వైద్యం అందిస్తాం: ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ చీడిపల్లికి చెందిన విద్యార్థి మర్రిశెట్టి సత్తిబాబు(12) తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం రాజేంద్రపాలెం ఆస్పత్రి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్యుల సూచనల మేరకు విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఆదివార మధ్యాహ్నం సత్తిబాబుకు జ్వరం వచ్చి పడిపోయాడని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తక్షణమే 108 సమాచారం అందించారు. గ్రామానికి సరైన దారి లేకపోవడంతో 108 చేరుకోలేకపోయిందని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో సోమవారం ఉదయం పిడుగురాయికి చెందిన ఓ ప్రైవేట్ జీపు ద్వారా సత్తిబాబును రాజేంద్రపాలెం పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం వైద్యుల సూచనల మేరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్కు తరలించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ మాట్లాడుతూ కేజీహెచ్లోని ట్రైబల్ సెల్ నిర్వాహకులతో మాట్లాడి సత్తిబాబుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
వాగు దాటితేనే చదువులు
ముంచంగిపుట్టు: చదువు కోసం గిరిజన విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ మెట్టగూడ గ్రామానికి చెందిన 21 మంది గిరిజన విద్యార్థులు సోమవారం రెండు కిలో మీటర్లు కాలినడక ప్రయాణించి, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి,లక్ష్మీపురం పాఠశాలకు వచ్చారు.ప్రతి రోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,భారీ వర్షాలు కురిసి వాగు పొంగితే చదువుకు ఆ రోజు దూరం కావాల్సిందేనని గ్రామస్తులు తెలిపారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి, వచ్చేంత వరకు తల్లిదండ్రులు భయం భయంగా ఉంటున్నారు. చదువు కోసం పిల్లలు పడుతున్న అవస్థలను అధికారులు గుర్తించి,మెట్టగూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని,లక్ష్మీపురం వాగుపై వంతెన నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. -
రేషన్ సరుకుల కోసం నడక యాతన
ముంచంగిపుట్టు: గత ప్రభుత్వ హయాంలో ఇంటి ముందే రేషన్ సరుకులు పొందే గిరిజనులు ఇప్పుడు వాటికోసం నడక యాతన పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలం సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామ రేషన్కార్డుదారులు రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్తే గానీ రేషన్ బియ్యం పొందలేని పరిస్థితి నెలకొంది. సోమవారం కుమ్మరిపుట్టు రేషన్దారులు కాలినడకన సుజనపేట డీఆర్ డిపోకు వచ్చి రేషన్ సరుకులు మోసుకుని వెళ్లారు. రేషన్ వాహనాలను నిలిపివేయడంతో అవస్థలకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీ పటిష్టతకు ప్రభుత్వానికి సిఫార్సు -
హామీ ఇచ్చి మోసం చేశారు
● చంద్రబాబుపై నిరుద్యోగ యువత ఆగ్రహం ● డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం ● గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని డిమాండ్ ● పాడేరులో భారీగా ఆదివాసీ నిరుద్యోగ గర్జన ● ఐటీడీఏ వద్ద ధర్నా పాడేరు: జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తామని, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించి, మోసం చేశారని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర, పలువురు ఆదివాసీ నిరుద్యోగ యువ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేసి, గిరిజన ప్రాంత ఉద్యోగాలన్నీ అర్హత కలిగిన స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాడేరు పట్టణంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆదివాసీ గర్జన కార్యక్రమం నిర్వహించారు. మోదకొండమ్మ ఆలయం నుంచి పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్లకార్డుల తో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర, పలువురు ఆదివాసీ నిరుద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య రోజు,రోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని చెప్పారు. వేలాది మంది ఆదివాసీలు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే గిరిజన యువత పెడదారిన పట్టే అవకాశం ఉందని తెలిపారు. అరకులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తామని, ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ నెరవేర్చకుండా ఆదివాసీ నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఇప్పటికై న స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలచట్టం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ అధికా రులకు వినతిపత్రాన్ని అందజేశారు. 11మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు. -
వలజంగిలో వణికిస్తున్న జ్వరాలు
చిన్నారి మృతిముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ వలజంగి గ్రామ గిరిజనులను జ్వరాలు వణికిస్తున్నాయి. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా పలువురు జ్వరం,శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. జ్వరంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న గ్రామానికి చెందిన వంతాల తులసి(4) ఆదివారం మృతి చెందింది.ప్రసుత్తం గ్రామంలో వంతాల కనుమ,వంతాల రాధ,వంతాల మీనా,వంతాల సుశాంత్ అనే చిన్నారులతో పాటు 10మంది జ్వరం,కురుపులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నారుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. జ్వరంతో నాలుగు ఏళ్ల చిన్నారి మృతి చెందడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి వలజంగిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైస్ఎంపీపీ సిరగం భాగ్యవతి, గ్రామస్తులు కోరారు. -
ఘనంగా రాజరాజేశ్వరి శాకంబరి ఉత్సవం
శివనామస్మరణతో నడిచి వెళుతున్న భక్తులుమత్స్యగెడ్డ నుంచి బోల్ భం కావడి యాత్ర ప్రారంభించిన భక్తులు పెదబయలు: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర భక్తులు బోల్ భం కావడి యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై,ఆగస్టు నెలల్లో శివ భక్తులు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టి, కావడి యాత్రలో పాల్గొంటారు. దీక్షలో భాగంగా పెదబయలు సమీపంలోని ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో గల మత్స్యగెడ్డ తీరానికి సోమవారం సూర్యోదయానికి ముందే కాషాయ రంగు దుస్తులు ధరించిన భక్తులు చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మత్స్యగెడ్డ నుంచి జలాన్ని కలశాలలోకి సేకరించారు. వాటిని కావడిలో పెట్టి భుజాన వేసుకుని శివ నామస్మరణతో పెదబయలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడువ శివాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా బోల్ భం నామస్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది. కావడిని నేలపై మోపకుండా యాత్ర కొనసాగిస్తామని భక్తులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న అనంతరం భక్తిశ్రద్ధలతో ఈ జలాలతో శివుడికి అభిషేకం చేస్తామని పాడువకు చెందిన బోల్ భమ్ భక్తులు సాక్షికి తెలిపారు.ప్రతి ఏడాది ఒడిశా క్యాలెండర్ ప్రకారం ప్రతి శ్రావణ మాసం కావడి యాత్ర ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తామని చెప్పారు. సాక్షి,పాడేరు: స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో రాజరాజేశ్వరిదేవి శాకంబరి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహంతో పాటు ఉమానీలకంఠేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పలు కూరగాయలు,ఆకుకూరలతో అందంగా అలంకరించారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు,రమాదేవి,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం,వైదేహి దంపతులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏడాది శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకుడు రామం పంతులు లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు జరిపారు.వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి వచ్చి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమరాధన నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ తమర్భ నరసింగరావు,మాజీ జెడ్పీచైర్పర్సన్ వంజంగి కాంతమ్మ,టూరిజంశాఖ డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు,పాడేరు ఉప సర్పంచ్ బూరెడ్డి రాంనాయుడు, వర్తకసంఘం,ఆలయ కమిటీ ప్రతినిధులు,గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
● ఇరుకు రహదారితో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ● తరచూ నిలిచిపోతున్న భారీ వాహనాలు ● తీవ్ర అవస్థలకు గురవుతున్నప్రయాణికులు
సాక్షి,పాడేరు: జిల్లాలో పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఆర్అండ్బీ ఘాట్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. 34 కిలోమీటర్ల పొడవు ఉన్న పాడేరు ఘాట్రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.పాడేరు జిల్లా కేంద్రమైన తరువాత ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. విశాఖపట్నం,గాజువాక ప్రాంతాల నుంచి సరుకులు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు కూడా పాడేరు ఘాట్రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత ప్రాధాన్యత గల ఈరోడ్డు అభివృద్ధికి నోచుకోకపోవడంతో వాహన చోదకులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలే పాడేరు ఘాట్రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మలుపులతో రోడ్డంతా ఇరుకుగా ఉండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ వాహనాలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోతే గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. పాడేరు ఘాట్రోడ్డులోని గరికిబంద నుంచి మోదకొండమ్మతల్లి పాదాల వరకు గల పలు ప్రమాదకర మలుపుల వద్ద ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయి.మలుపుల వద్ద ఏ వాహనమైనా ఆగిపోతే ఈ రోడ్డులో ప్రయాణించే వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోతుండడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మరో గత్యంతరం లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యేంతవరకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఘాట్రోడ్డులో ప్రమాదకర మలుపుల వద్దఅయినా రోడ్డును విస్తరించేందుకు ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కోమాలమ్మతల్లి గుడి,యేసుప్రభువు విగ్రహం,ఏనుగురాయి ప్రాంతాల్లోని మలుపుల వద్ద తరచూ భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉంది. అటవీశాఖ అనుమతులు లేవు పాడేరు ఘాట్రోడ్డును మరో ఐదు అడుగుల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు ఉన్నా అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంది.అటవీశాఖ నుంచి అనుమతులు రాగానే రోడ్డును అభివృద్ధి చేస్తాం. – బాలసుందర బాబు, ఆర్అండ్బీ ఈఈ పాడేరు యేసుప్రభువు విగ్రహం మలుపులో నిలిచిన వాహనాలు -
టీడీపీకి రాజీనామా చేస్తాం
కొయ్యూరు: మండల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా తలెత్తిన వర్గ విభేదాలు టీడీపీలో రోజురోజుకూ రాజుకుంటున్నాయి. కాకూరి చంద్రరావును టీడీపీ కొయ్యూ రు మండల అధ్యక్షుడిగా ప్రకటించకుంటే రాజీనామాలు చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు.వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 12న ఎన్నిక నిర్వహించారని, సాంబశివరావు, చంద్రరావు పోటీపడ్డారని చెప్పారు. అయితే ఓటమి పాలైన సాంబశివరావుకు పదవిని కట్టబెట్టేందుకు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, నియోజక పరిశీలకుడు బుద్ద జగదీశ్వరరావు ప్రయత్నించారని వారు ఆరోపించారు.దీనిలో భాగంగా దొంగ ఓట్ల నాటకం ఆడారని దుయ్యబట్టారు.చంద్రరావుకు ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పారు.అయితే సాంబశివరావును గెలిపించాలను కోవడం దారుణమన్నారు. అధిష్టానం దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే 300 మంది రాజీనామాలు చేసేందుకు వెనుకాడబోరని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిగా మరొకరిని నియమించాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ గొలిసింగి సత్యనారాయణ,రాష్ట్ర కార్యదర్శి కొర్రు రామ్మూర్తి,బాలరాజు, ఎస్.కె. బషీర్ఖాన్, సీనియర్ నేతలు వరహలబాబు,కిముడు శ్రీరాములు, కె. భాస్కరరావు,సన్యాసిరావు,రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. కొయ్యూరు నాయకుల హెచ్చరిక 300 మంది పార్టీ వీడుతారని విలేకరుల సమావేశంలో ప్రకటన చంద్రరావుకు పదవి ఇవ్వకుంటేసహించబోమని తేల్చిచెప్పిన నేతలు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిని మార్చాలని డిమాండ్ -
రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ శిక్షణ తరగతులు ప్రారంభం
తగరపువలస: చిట్టివలస బంతాట మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ బాలుర జట్టుకు ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సూచనల మేరకు, అనంతపురానికి చెందిన దాదా ఖలంధర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఉపాధ్యక్షుడు రాజారావు, కోల చంద్రశేఖర్ 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిక్షణ అనంతరం జట్టు ఈ నెల 26న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగే ఆల్ ఇండియా అండర్–16 టోర్నమెంట్లో పాల్గొననుంది. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన జరిపారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచి, ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని ఘనంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఘనంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడవాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. భక్తులను గరుడవాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. స్వామివారి శేషవస్త్త్రాలు, ప్రసాదం అందించారు. -
పోగొట్టుకున్న కెమెరా అప్పగింత
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం వద్ద పోగొట్టుకున్న రూ.లక్ష విలువ చేసే కెమెరాను జలపాతం నిర్వాహకులు... సందర్శకులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాదికొత్తగూడెం నుంచి కొంతమంది యువకులు ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు.ఈ ప్రాంతంలో గల ప్రకృతి అందాలు ఆస్వాదించి, ఆనందంగా గడిపి తమతో తెచ్చిన రూ. లక్ష విలువ చేసే కెమెరా మరిచిపోయి వెళ్లిపోయారు. మార్గ మధ్యంలో కెమెరా విషయం గుర్తుకురావడంతో వారు కొత్తపల్లి జలపాతం వద్దకు చేరుకుని వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ విషయాన్ని జలపాత నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాహకులు జలపాతం పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా వెతకడంతో లభించిన ఆ కెమెరాను సందర్శకులకు అందజేశారు. దీంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేసి సూపర్వైజర్ అభికి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘కోట’మెచ్చిన విశాఖ
కొమ్మాది: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు కోట శ్రీనివాసరావు. విలన్గా, విలక్షణ నటుడిగా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్గా యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కోటకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతిఘటన సినిమాతో విలన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు, విశాఖలో చిత్రీకరించిన ఈ సినిమాతోనే విలన్ పాత్రలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ చిత్రం ఆయనను ‘విలన్ అంటే కోట శ్రీనివాసరావు’ అనే స్థాయికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అనేక సినిమాలు విశాఖలో చిత్రీకరించారు. విశాఖలో ఆయన నటించిన చిత్రాలలో ప్రతిఘటన, ఆలీ బాబా అరడజను దొంగలు, జంబలకిడిపంబ, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, దొరబాబు, పోలీస్ బ్రదర్స్, లాఠీచార్జ్, రాజధాని, ఛత్రపతి, యోగి, బుజ్జిగాడు, గణేష్ వంటివి ఎన్నో ఉన్నాయి. విశాఖ అంటే ఎంతో ఇష్టం నగరానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా దసపల్లా, మేఘాలయ హోటళ్లలో బస చేసేవారని ఆయన సన్నిహితులు తెలిపారు. విశాఖ నగరం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని, షూటింగ్ విరామ సమయాల్లో బీచ్కు వెళ్లి సేదతీరేవారని సినీ మిత్రులు గుర్తు చేసుకున్నారు. విశాఖ, అరకు ప్రాంతాల్లో ఆయన సినిమాలు షూటింగ్ జరిగాయి. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సంతాపం తాటిచెట్లపాలెం: విలక్షణ నటుడు, సుదీర్ఘకాలం తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించి, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైజాగ్ ఫిలిం సొసైటీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సొసైటీ సెక్రటరీ నరవ ప్రకాశరావు, అధ్యక్షుడు కాశీ విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బి.చిన్నారావు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు తెలుగు సినీ పరిశ్రమ ఓ మహానటుడిని కోల్పోయింది. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు న్యాయం చేసే ఏకై క నటుడు కోట శ్రీనివాసరావు. ఎస్.వీ రంగారావు, కై కాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి దిగ్గజాల తర్వాత సినీ పరిశ్రమలో అంతటి లోటును తీర్చింది కోట శ్రీనివాసరావే. విశాఖలో సినిమా చిత్రీకరణ అంటే కోట ఎంతో ఉత్సాహంగా వచ్చేవారు. ఆయనతో పలు సినిమాల్లో నటించా. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. – ప్రసన్న కుమార్, సినీ నటుడు, వైజాగ్ విలన్గా ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలు బీచ్ అంటే చాలా ఇష్టం విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఎన్నో చిత్రాల షూటింగ్ -
నేడు చింతపల్లిలో ఎంపీ,ఎమ్మెల్యే పర్యటన
చింతపల్లి: మండలంలో సోమవారం అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మ తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యటించనున్నట్లు స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి తెలిపారు.ఈ సందర్భంగా మండలంలో గల 17 పంచాయతీలకు మండల పరిషత్ కార్యాలయంలో వీధి దీపాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.అనంతరం స్థానిక డెయిరీ ఫారం ప్రాంగణంలో రూ.40 లక్షలతో నిర్మించనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు ,ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షలు, నాయకులు హాజరు కావాలని ఎంపీపీ కోరారు. -
ఉపాధి @ ఐటీఐ
కంచరపాలెం: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు త్వరగా ఉపాధి పొందే కోర్సుల్లో ఐటీఐ ఒకటి. వీరికి వృత్తి పరమైన ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ప్రధానంగా జిల్లా విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్తోపాటు ఐటీఐ చదివేందుకు అధిక ప్రాధాన్యమిస్తారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటీస్ తర్వాత 18 ఏళ్లు నిండాక పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. డాక్యార్డ్, ఆర్టీసీ, షిప్యార్డ్, రైల్వే, విద్యుత్, రక్షణ శాఖ వంటి వాటిల్లో సైతం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. చదువులో ఒత్తిడి ఉండదు. ఆయా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులకు సాంకేతిక రంగంపై స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నైపుణ్యం ఉన్న వారికి తప్పకుండా ఉపాధి లభిస్తుంది. మరోవైపు స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగం, ఉపాధితోపాటు స్వయం ఉపాధికి సైతం ఈ కోర్సులు ఎంతగానో దోహదపడతాయి. 22 ట్రేడ్ల్లో శిక్షణ: విశాఖ జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ, 31 ప్రైవేట్ ఐటీఐల్లో 3,286 సీట్లు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల వ్యవధి ఉన్న 22 ట్రేడ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. కొన్ని ట్రేడ్ల్లో 8వ తరగతి విద్యార్హతతో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐల్లోని పలు ట్రేడ్ల్లో సీట్ల సంఖ్య పెరిగితే అధికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు. ఏడాది కోర్సులు ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా), కార్పెంటర్, మెకానికల్ డీజిల్, పీపీవో, స్టెనోగ్రఫీ, వెల్డర్. రెండేళ్ల కోర్సులు ఏవో కెమికల్, డీఎం సివిల్, డీఎం మెకానికల్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్, మెకనిస్ట్, ఐసీ అండ్ టీఎస్ఎం, టర్నర్, ఆర్ అండ్ ఏసీ మెకానిక్, ఎంఎంటీఎం, పెయింటర్(జి), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఐఎం కెమికల్, మెషినిస్ట్ మెకానిక్(ఎంఎం). 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. మిగులు సీట్ల కోసం ఈ నెల 15 నుంచి ప్రభుత్వ ఐటీఐల్లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సమీపంలోని ఐటీఐకు వెళ్లి పలు ట్రేడ్ల్లో చేరవచ్చు. జూలై నెలాఖరు తేదీ లోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సంప్రదించాల్సిన ఐటీఐలు పాత ఐటీఐ, కంచరపాలెం న్యూ ఐటీఐ, గాజువాక ఐటీఐ, నరవ బాలికల ఐటీ, కంచరపాలెం ఇండస్ట్రియల్ ఏరియా ఏడాది కోర్సులు 7 రెండేళ్ల కోర్సులు 15 ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లు 1,648 ప్రైవేట్ ఐటీఐల్లో సీట్లు 1,638 మొత్తం 35 ఐటీఐల్లో సీట్లు 3,286 వైబ్సైట్ iti.ap.gov.in పారిశ్రామిక వృత్తి విద్య శిక్షణతో మెండుగా ఉపాధి అవకాశాలు ఐటీఐల్లో చురుగ్గా ప్రవేశాలు పలు ట్రేడుల్లో అభ్యర్థుల చేరిక అందుబాటులో మిగులు సీట్లు -
రోడ్డెక్కిన జిమ్నాస్ట్లు
విశాఖ స్పోర్ట్స్: ఆదివారం బీచ్ రోడ్డులో జరిగిన ఒలింపిక్ డే రన్.. జిమ్నాస్ట్లు, వారి తల్లిదండ్రుల నిరసనలకు వేదికై ంది. పాండురంగాపురంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) హాలులో కొన్నేళ్లుగా సాధన చేస్తూ.. పతకాలు సాధిస్తున్న జిమ్నాస్ట్లను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి స్థానంలో వెటరన్ క్రీడాకారులకు బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి ఆ ప్రాంగణాన్ని కేటాయించాలనే ప్రతిపాదన ఈ ఆందోళనకు కారణమైంది. తమకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని నిరసిస్తూ.. చిన్నారులు ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్న పెద్దల ఎదుటే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మా హాలును మాకే ఇవ్వండి’.. కలెక్టర్ గారూ స్పందించండి అంటూ నినాదాలు చేశారు. అయితే జిల్లా ఒలింపిక్ సంఘానికి పెద్దగా వ్యవహరిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న నాయకుడు ఈ నిరసనను చూసీ చూడనట్టు ముందుకు సాగడం విమర్శలకు తావిస్తోంది. క్రీడలను బతికిస్తున్నామని చెప్పుకునే నాయకుల కళ్ల ముందే క్రీడాకారులు రోడ్డెక్కడంతో.. ఇంతకంటే దారుణం ఏముంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుతున్న పరిస్థితులు వాస్తవానికి విశాఖలో క్రీడల పరిస్థితి దయనీయంగా మారింది. టోర్నమెంట్లు నిర్వహించడం, సర్టిఫికెట్లు పంచుకోవడం, సత్కారాలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. క్షేత్రస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడంపై లేదన్నది బహిరంగ రహస్యం. జిల్లా నుంచి ఎంత మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారో కూడా జిల్లా క్రీడాసంస్థ వద్ద వివరాలు లేకపోవడం ఇక్కడి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఒలింపిక్ పతకాలు సాధించడం మాట అటుంచి.. ఆ స్థాయికి చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు కొరవడ్డాయి. ఒలింపిక్ స్థాయికి స్వశక్తితో వెళ్లిన స్థానిక అథ్లెట్ జ్యోతి సైతం స్థానికంగా ప్రోత్సాహం లేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ఇక జిల్లా ఒలింపిక్ సంఘం కేవలం రన్లు నిర్వహించి, తమకు నచ్చిన వారికి సత్కారాలు చేసుకోవడానికే పరిమితమైంది. క్రీడా సంఘాల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జిమ్నాస్ట్లకు మద్దతు ఇవ్వండి ఒకప్పుడు డీఎస్ఏ కార్యాలయం ఉన్న స్థలం చేజారిపోయి, ప్రస్తుతం ఒక హాలు మాత్రమే మిగిలింది. ఇక్కడ కొన్నేళ్లుగా చిన్నారులు జిమ్నాస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పతకాలు సాధిస్తున్న జిమ్నాస్ట్లకు అండగా నిలవాల్సింది పోయి.. వారి సాధనకే ఆటంకం కలిగించడం పట్ల క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన ఈ జిమ్నాస్ట్లు.. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెబుతున్నారు. ఒలింపిక్స్లో పతకాల గురించి ప్రగల్భాలు పలికే ముందు.. ఉన్న క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. ఒMýS OÐðlç³# {MîSyé çÜ*¹Ç¢° ò³…´÷…¨…^é-ÌS…r* JÍ…-í³MŠS yól Æý‡¯Œl õ³Æý‡$™ø Art-à-çÜ…V> M>Æý‡Å-{MýSÐ]l$… fÆý‡$-VýS$™ø…-¨. Ð]l$Æø-OÐðlç³# Ķæ¬Ð]l {MîSyé-M>-Æý‡$Ë$ ™èlÐ]l$MýS$ {´ëMîSt‹Ü ^ólçÜ$-MýS$-¯ól…-§ýl$MýS$ E¯]l² ஒJMýSP ^ør$¯]l$ M>´ë-yýl-Ð]l$…r* ç³ÏM>-Æý‡$zÌS™ø °Æý‡çܯ]l ™ðlË$-ç³#-™èl$-¯é²Æý‡$. {MîSyé-À-Ð]l–-¨®MìS ´ër$-ç³-yé-ÍÞ¯]l ò³§ýlªË$ ÐéÇ BÐól§ýl-¯]l¯]l$ ç³sìæt…^èl$-Mø-MýS$…yé ¯]lÐ]l#Ó™èl* Æ>ÅÎÌZ Ð]l¬…§ýl$MýS$ ÝëVýS$-™èl$-¯é²Æý‡$. D _{™èl… ÑÔ>Q {MîSyé-Æý‡…VýS…ÌZ ¯ðlÌS-Mö¯]l² §ýlĶæ$-±Ä¶æ$ ç³Çíܦ-™èl$-ÌSMýS$ A§ýlª… ç³yýl$-™ø…-¨. ఒలింపిక్ రన్ వేళ ప్లకార్డులతో నిరసన సాధన చేసుకునే హాలును ఇతరులకు ఇవ్వొద్దని నినాదాలు కలెక్టర్ స్పందించాలని వినతి -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి: అనకాపల్లి–కశింకోట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు వయస్సుగల వ్యక్తి మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ లక్ష్మి ఆదివారం చెప్పారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, జుట్టు నలుపు రంగు కలరింగ్, తల నుజ్జునుజ్జు అయ్యి గుర్తు పట్టలేని విధంగా మృతి చెందినట్టు ఎస్ఐ చెప్పారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలని కోరారు. -
నిండు గర్భిణికి తప్పని డోలిమోత
● ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్ ● మార్గంలో తుప్పల్లోనే ప్రసవించిన గర్భిణి రోలుగుంట : మండలంలో గిరిజన గ్రామాలకు రహదారి సమస్య తీరక రవాణా సమస్యతో అర్ల గ్రామం నుంచి దిగువకు ఆస్పత్రికి డోలిమోతతో తీసుకొస్తున్న గర్భిణి మార్గంలోనే ప్రసవించిన సంఘటన ఆదివారం జరిగింది. అర్ల గ్రామానికి చెందిన పాంగి సాయికి నెలలు నిండి నొప్పులు రావడంతో ఆమె భర్త సుందర్రావు అంబులెన్స్కు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కొండ డిగువకు డోలిమోతతో నాలుగు కిలోమీటర్లు వై.బీ.పట్నం రోడ్డు వరకూ మోసుకుని వచ్చారు. అంబులెన్సు రావడం ఆలస్యం కావడంతో తోటి మహిళలు మార్గంలో తుప్పల్లోకి తీసుకెళ్లగా అక్కడే ప్రసవం జరిగింది. తరువాత అంబులెన్సు రావడంతో ఆమె బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ గిరిజనుల సమస్య పరిష్కారంలో తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లోసింగి, పెదగరువు , పీత్రుగెడ్డ తదితర గ్రామాల్లో పీవీటీజీ తెగకు చెందిన గిరిజనుల నివాస గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం, విద్య, రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు, డీఈవో అప్పారావు నాయుడికి, పీవోకి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీఈవో అప్పారావునాయుడు ఫిబ్రవరిలో ఆయా గ్రామాలు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారని, ఆశా వర్కర్ని, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే రోడ్డు సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి వెళ్లారని తెలిపారు. అయితే సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. పాడేరు పీవో ఈ గ్రామాలు ఎందుకు సందర్శించడం లేదో అర్థం కావడం లేదని విమర్శించారు, ఇప్పటికై నా ఈ గ్రామాల రవాణా సదుపాయాలు మెరుగుపరిచి, గుర్తించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండు చేశారు. -
అక్రమంగా మట్టి తరలింపు..
● ట్రాక్టర్లు సీజ్ కోటవురట్ల : అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి..పాత గొట్టివాడ ప్రాంతం నుంచి మట్టి తరలిపోతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఆదివారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక పొక్లయిన్, మూడు ట్రాక్టర్లు పట్టుబడగా వాటిని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. మట్టి తరలింపునకు సంబంధించి రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేనట్టు గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దారుకు సమాచారం ఇచ్చినట్టు ఎస్ఐ తెలిపారు. -
మత్స్యగెడ్డకు భారీగా వరదనీరు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మత్స్యగెడ్డలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సుజనకోట,పనసపుట్టు,పెదగూడ,దారెల,జోలాపుట్టు,మాకవరం,వనుగుమ్మ,దొడిపుట్టు పంచాయతీల్లో పూర్తి స్థాయి నీటితో మత్స్యగెడ్డ పాయలు దర్శనం ఇస్తున్నాయి. దీనికితోడు జోలాపుట్టు జలాశయం గేట్లు మూసి ఉండడంతో క్రమేపి జలాశయం,మత్స్యగెడ్డలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మత్స్యగెడ్డలో నీరు ఎక్కువగా ఉండడంతో గిరిజన మత్స్యకారులు నాటు పడవలపై వెళ్లి జోరుగా చేపలవేట సాగిస్తున్నారు. -
సముద్ర వాణిజ్యానికి చిరునామా బంగాళాఖాతం
● నేటి నుంచి విశాఖ నగరంలో బిమ్స్ టెక్ సమ్మిట్ ● విశాఖ పోర్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహణ ● బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణ భాగస్వామ్యం థీమ్ తో సదస్సు సాక్షి, విశాఖపట్నం: భారత దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంగా బంగాళాఖాతం రూపాంతరం చెందుతున్న తరుణంలో.. సముద్ర వాణిజ్యానికి చిరునామాగా ఈ అఖాతాన్ని మార్చేందుకు దక్షిణాసియా దేశాలు మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నాయి. అంతర్జాతీయ వ్యాపారానికి, చమురు, ఖనిజ రవాణాకు ప్రత్యేక వాణిజ్య కేంద్రంగానూ, భద్రత పరంగానూ భౌగోళికంగా అభివృద్ధి చెందింది. దక్షిణాసియా దేశాలన్నీ ప్రాంతీయ శక్తిగా ఎదిగేందుకు దౌత్య, వాణిజ్య, పర్యాటకం, సాంకేతికత, జలరవాణా రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు రెండో సారి విశాఖ వేదికగా బిమ్స్టెక్ కాంక్లేవ్ జరగనుంది. బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణల భాగస్వామ్యం అనే థీమ్తో జరిగే సదస్సులో దక్షిణాసియాకు చెందిన ఏడు దేశాల ప్రతినిధులు హాజరవుతుండగా.. విశాఖఫట్నం పోర్టు ఆతిథ్యమివ్వనుంది. బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి, నౌకాశ్రయ సహకారం, బ్లూ ఎకానమీలో పెట్టుబడులు వంటి అంశాల్లో బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) కీలకంగా మారింది. ఈ సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు విశాఖ పట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఆధ్వర్యంలో సోమ,మంగళవారాల్లో నగరంలో బిమ్స్టెక్ కాంక్లేవ్–2025 రెండో ఎడిషన్ జరగనుంది. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పోర్టుల అధికారులు, షిప్పింగ్ నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. బంగాళాఖాతం కేవలం సముద్ర ప్రాంతం మాత్రమే కాదనీ.. ఆసియా – దక్షిణాసియా దేశాల వ్యూహాత్మక సంబంధాల మార్గమని చాటిచెప్పేలా బిమ్స్టెక్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ.. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై దృష్టి సదస్సులో భాగంగా సభ్య దేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం, మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ ను వేగవంతం చేయడం, తీరప్రాంత పర్యాటక మార్గాలు, వారసత్వ క్రూయిజ్ల అభివృద్ధి, పోర్ట్ మానవ వనరుల పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా.. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా బ్లూ ఎకానమీని ముందుకు తీసుకెళ్లడం ఎలా అనే అంశాలపై దక్షిణాసియా దేశాలు కీలకంగా చర్చించనున్నాయి. రెండు రోజుల సదస్సు అనంతరం తీర్మానాలతో పాటు వివిధ దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం ఎంవోయూలు జరగనున్నాయి. సదస్సులో సభ్య దేశాల రవాణా, జలరవాణా, పోర్టుల శాఖ మంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, షిప్పింగ్ సంస్థలు, పోర్ట్ ట్రస్టులు, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్రమంత్రి శర్బానందని ఆహ్వానిస్తున్న పోర్టు చైర్మన్ అంగమత్తు -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’ను కొనసాగించాలని ఉద్యమం
చింతపల్లి: స్థానిక సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడతామని రాష్ట్ర గిరి జన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు ముర్ల వెంకటరమణ అన్నారు.ఆదివారం చింతపల్లి గిరిజన ఉద్యోగులు భవన్లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యం కలిగిన సేంద్రి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేయడమంటే మన్యం ప్రాంతానికి అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అనూషదేవి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎత్తివేత ఉత్తర్వులు ఉపసంహరించుకోకుంటే అన్ని పక్షాలతో కలసి పోరాటం చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ బాలయ్య పడాల్,జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్,కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రీమల జయభారత్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకుల జోష్
జి.మాడుగుల/డుంబ్రిగుడ: జిల్లా లోని పలు టూరిస్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొత్తపల్లి జలపాతం, చాపరాయి జలవిహారి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. కొత్తపల్లి జలపాతం వద్ద వ్యూపాయింట్, మెట్ల మార్గంతో పాటు గార్డెన్లో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. పెద్దపెద్ద బండరాళ్లపై నుంచి పడుతున్న నీటి ప్రవాహంలో అన్ని వయసుల వారు కేరింతలతో జలకాలాడారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చాపరాయి గెడ్డ పొంగి ప్రవహించింది. దీంతో గత రెండు వారాలు పర్యాటకులను జలవిహారి లోపలికి అనుమతించలేదు. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులు హోటల్ గదుల్లోనే సేదతీరి, నిరాశతో వెనుతిరిగారు. ఈ వారం అనుమతించడంతో నీటిలో దిగి జలకాలాడుతూ సందడి చేశారు. రోజంతా ఉత్సాహంగా గడిపారు. -
ఇద్దరు అటవీ ఉద్యోగులు సస్పెన్షన్
8లోఅడ్డతీగల: రైతు వారీ టేకుచెట్ల అక్రమ నరికివేతకు సహకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే కారణంతో అడ్డతీగల అటవీ క్షేత్రం పరిధిలో పనిచేస్తున్న ఒక డిప్యూటీ రేంజ్ అధికారితో పాటు బీటు ఆఫీసర్ని సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డతీగల అటవీ క్షేత్రం పరిధిలోని పెద్దమునకనగడ్డలో కలప రవాణాదారులు ఓ రైతు వద్ద కొనుగోలు చేసిన 25 టేకుచెట్ల నరికివేత వ్యవహారం ఈ సస్పెన్షన్లకు దారితీసింది.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. సేకరించిన టేకు కలపను రవాణాదారులు రాజమహేంద్రవరంలోని ఓ సా మిల్లుకు తరలించారు.కలప రవాణా జరిగిందని స్క్వాడ్ డీఎఫ్వో ఎం.వి. ప్రసాదరావుకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి, రూ.3.60 లక్షలు జరిమానా విధించారు.జరిమానా చెల్లించకపోగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి అధిమొత్తంలో నగదు ఇచ్చామని కలప రవానాదారులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది.కలప నరికి వేత నుంచి రవాణా వరకూ క్షేత్రస్థాయి సిబ్బంది నిబంధనలు అనుసరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్క్వాడ్ డీఎఫ్వో ప్రసాదరావు రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బి.ఎన్.ఎన్. మూర్తికి నివేదిక సమర్పించారు.దీనిపై అడ్డతీగల డీఆర్వో రాజారావు,వేటమామిడి బీటు ఆఫీసర్ బసవయ్యని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఈ వ్యవహారంలో పర్యవేక్షణ చేయవలసిన అధికారుల నిర్లక్ష్యం వెల్లడి కావడంతో మరికొందరిపైనా శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.దీనిపై అడ్డతీగల సబ్ డీఎఫ్వో సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఇద్దరు అటవీ ఉద్యోగు లు సస్పెన్షన్ విషయం వాస్తవమేనని, తన వద్దకు ఫైల్ వచ్చిన తరువాత పూర్తివివరాలుతెలియజేస్తానన్నారు. -
కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
చింతూరు: విశ్వ కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడె మురళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గురుకుల పాఠశాలలో పరిషత్, కోయత్తోర్బాట ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో కోయ పద్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లా డుతూ ఈనెల 21న జరిగే కోయభాష దినో త్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారం కోయభాషకు జాతీయ భాషగా గుర్తింపు కల్పించాలని, ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషలో విద్యాబోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో కోయభాష బోధించేందుకు వలంటీర్లను నియమించాలని, ఆదివాసీ పూజారు లకు గౌరవవేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శీలం కృష్ణ, మినప నాగేశ్వరరావు, సోడె వెంకటేశ్వర్లు, రాఘవయ్య, లోకేష్, వరణ్సందీప్, సంతోష్ పాల్గొన్నారు. -
బిల్లులు, వేతనాలు అందకే అసంతృప్తి
● మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం ● జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి ● మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మహారాణిపేట: జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుంచి గత 12 నెలలుగా అభివృద్ధి పనుల బిల్లులు విడుదల కాకపోవడం, అలాగే జెడ్పీటీసీలకు చాలా నెలల నుంచి గౌరవ వేతనం రాకపోవడం వంటి సమస్యలపై జెడ్పీటీసీలు అసంతృప్తితో ఉన్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం జెడ్పీ బంగ్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది నుంచి దాదాపు రూ. 8.5 కోట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్ ద్వారా విడుదల కావాల్సి ఉందని చైర్పర్సన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు పూర్తయిన పనులకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేదన్నారు. ఈ బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి ఉండడంతో సభ్యులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. జెడ్పీటీసీల గౌరవ వేతనం కూడా పెండింగ్లో ఉండటం అసంతృప్తికి మరో ప్రధాన కారణమని వివరించారు. అపోహలు తొలగాయి.. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులందరూ కలిసి చర్చించుకున్నామని, తమలో ఎలాంటి అసంతృప్తులు లేవని జె. సుభద్ర స్పష్టం చేశారు. వారంతా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు. సమన్వయ లోపం వల్ల చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమైనా, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమస్యల గురించి పార్టీ నాయకులకు అన్ని విషయాలను కూలంకషంగా వివరించినట్లు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సుభద్ర పేర్కొన్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉందని జెడ్పీటీసీలకు వివరించడంతో వారిలో ఉన్న అపోహలు తొలగాయని ఆమె చెప్పారు. పార్టీ సూచనల మేరకు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి జెడ్పీటీసీతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం పూర్తి సహకారం అందిస్తామని జెడ్పీటీసీలు హామీ ఇచ్చినట్టు సుభద్ర పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న విషయాలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. -
పాడేరులో ఇగ్నో అధ్యయన కేంద్రానికి సన్నాహాలు
ఎంవీపీ కాలనీ (విశాఖ) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఇగ్నో డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.చిట్టబ్బాయి ప్రతిపాదన మేరకు త్వరలోనే కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం ఉషోదయ కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కార్యాలయంలో కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మారావు మాట్లాడుతూ ఇగ్నో ద్వారా లక్షల మంది యువత ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారన్నారు. పాడేరులో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తే గిరిజన యువతీ యువకుల ఉన్నత చదువుకు బాటలు పడతాయన్నారు. కేంద్రం ఏర్పాటుకు ప్రిన్సిపల్ చిట్టబ్బాయి ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
రాజవొమ్మంగి: మండలంలోని ఎర్రంపాడు జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాకరాయి గ్రామానికి చెందిన అచ్చిబాబు, సూరిబాబు, లోవరాజు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే రంపచోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వట్టిగెడ్డ వద్ద ఎదురుగా వస్తున్న మోటారుబైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటారుబైక్పై ప్రయాణిస్తున్న మండలంలోని దాకరాయి గ్రామానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వీరు తాపీ పనికి దాకరాయి నుంచి వట్టిగెడ్డ గ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని వైద్యులు నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజవొమ్మంగి ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. -
దయచేసి వినండి.. విశాఖ రైళ్లకు పేర్లు
మళ్లీ తెరపైకి ప్రతిపాదన ●● 2022లో వాల్తేరు డివిజన్లోని 17 రైళ్లకు పేర్లు మార్చాలని విజ్ఞప్తి ● మూడేళ్లయినా స్పందించని జోన్ అధికారులు ● జోన్కు జీఎం నియామకంతో మరోసారి తెరపైకి పేర్ల మార్పు అంశం ● వాల్తేరు ఎక్స్ప్రెస్, రుషికొండ, సింహాచలం, వంశధార, ఉక్కునగర్ తదితర పేర్ల ప్రతిపాదనసాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా.. చారిత్రక ప్రశస్థి కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన అందరిలోనూ కొనసాగుతూనే ఉంది. జోన్ సరిహద్దుల డీపీఆర్లో స్వల్ప మార్పులు ఉండే సూచనలున్నాయని రైల్వేవర్గాలు చెబుతున్నా.. ఆ పరిస్థితులేమీ కనిపించడం లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వాల్తేరు డివిజన్ వైభవాన్ని చాటి చెప్పేలా కొన్ని రైళ్లకు ఇక్కడి చారిత్రక పేర్లు పెట్టాలనే మూడేళ్ల క్రితం నాటి ప్రతిపాదన మరోసారి వినిపిస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న వివిధ రైళ్లకు ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నదులు, ప్రాంతాల పేర్లు పెట్టాలంటూ 2022లో అప్పటి వాల్తేరు డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులకు లేఖ రాశారు. మొత్తం 17 రైళ్లకు మంచి పేర్లు సూచిస్తూ వాటిని మార్చే అంశంపై ఆలోచన చేయాలని కోరారు. సామాన్యులు సైతం గుర్తించేలా.. ప్రస్తుతం నడుస్తున్న ఈ 17 రైళ్లకు సరైన పేర్లు లేవు. దీంతో ప్రయాణికులు ట్రైన్ నంబర్లు గుర్తు పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్ పరిధిలోని వారసత్వ ప్రాంతాలు, చారిత్రక ఆనవాళ్లను ఈ రైళ్లకు పేర్లుగా పెడితే.. సామాన్య ప్రయాణికులు కూడా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే మూడేళ్ల క్రితం నాటి ఈ ప్రతిపాదనను అప్పటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు బుట్టదాఖలు చేశారు. కొత్త జోన్ ఏర్పడేందుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో వాల్తేరు చారిత్రక ఆనవాళ్లని కొనసాగించేందుకు ఈ 17 రైళ్లకు ప్రతిపాదించిన పేర్లు పెట్టాలంటూ రైల్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. జీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రతిపాదనను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. పేర్లు పెట్టాలని ప్రతిపాదిస్తున్న రైళ్లివే.. ట్రైన్ నం నుంచి– వరకూ ప్రతిపాదిత పేరు 12861/62 విశాఖ–కాచిగూడ–విశాఖ ఎక్స్ప్రెస్ వాల్తేరు ఎక్స్ప్రెస్ 18519/20 విశాఖ–ఎల్టీటీ–విశాఖ ఎక్స్ప్రెస్ రుషికొండ ఎక్స్ప్రెస్ 18551/52 విశాఖ–కిరండూల్–విశాఖ ఎక్స్ప్రెస్ దంతేశ్వరి ఎక్స్ప్రెస్ 18514/13 విశాఖ–కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్ప్రెస్ దండకారణ్య ఎక్స్ప్రెస్ 22820/19 విశాఖ–భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ వంశధార ఎక్స్ప్రెస్ 18518/17 విశాఖ–కోర్బా రైల్వే స్టేషన్ సింహాచలం ఎక్స్ప్రెస్ 20811/12 విశాఖ–నాందేడ్ ఎక్స్ప్రెస్ మత్స్యకుండ్ ఎక్స్ప్రెస్ 18512/11 విశాఖ–కోరాపుట్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కోలాబ్ ఎక్స్ప్రెస్ 18573/74 విశాఖ–భగత్కీ కోఠీ ఎక్స్ప్రెస్ కురుసుర ఎక్స్ప్రెస్ 18567/68 విశాఖ–కొల్లాం ఎక్స్ప్రెస్ సాగరకన్య ఎక్స్ప్రెస్ 20816/15 విశాఖ–టాటా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉక్కునగర్ ఎక్స్ప్రెస్ 22869/70 విశాఖ–చైన్నె సెంట్రల్ (ఎంఏఎస్) సూ.ఫా ఎక్స్ప్రెస్ సువర్ణరేఖ ఎక్స్ప్రెస్ 18503/04 విశాఖ–సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ ఎల్లోరా ఎక్స్ప్రెస్ 22874/73 విశాఖ–దిఘా ఎక్స్ప్రెస్ గోస్తనీ ఎక్స్ప్రెస్ 22847/48 విశాఖ–ఎల్టీటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఛత్రపతి ఎక్స్ప్రెస్ 20803/04 విశాఖ–గాంధీధామ్ ఎక్స్ప్రెస్ కచ్ ఆంధ్ర ఎక్స్ప్రెస్ 22801/02 విశాఖ–చైన్నె సెంట్రల్ (ఎంఏఎస్) సూ.ఫా ఎక్స్ప్రెస్ సౌత్ కోస్ట్ ఎక్స్ప్రెస్ -
ముగ్గురు యువకులను కాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్లో ముగ్గురు యువ కులు కొట్టుకుని పోతుండగా లైఫ్గార్డ్స్ ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన ఐదుగురు యువకులు శనివారం సాయంత్రం రుషికొండ బీచ్కు వచ్చారు. కాసేపు సరదాగా గడిపిన అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరిలో బి.శ్రీనివాసరావు, ఎం.రామ్, ఎ.శివ కొట్టుకుని పోతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు చిన్నప్పన్న, గురుమూర్తి, జి.దేవ గుర్తించారు. వారిని రక్షించి, తీరానికి తీసుకువచ్చారు. వారికి మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. లైఫ్గార్డ్స్ ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. -
మేలు జాతి పశువుల కోసం..
● గుజరాత్ ఎన్డీబీ సహకారంతో లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధి ● 15 నుంచి 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో వీర్యం పంపిణీ ● ఈ ఇంజక్షన్ ద్వారా 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం సాక్షి, అనకాపల్లి: మేలు జాతి పశువులు వృద్ధి చెందేలా లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధికి కేంద్ర పశుసంవర్థక శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలో పాడి పశువుల సంఖ్యను పెంచి అన్నదాతకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే గుజరాత్లో గల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సహకారంతో మేలు జాతి వీర్యం తక్కువ ధరకు అందించి అన్నీ పెయ్యదూడలు పుట్టేలా వీర్యం పంపిణీ చేస్తోంది. రూ.150కే లింగ నిర్ధారిత పశు వీర్యం ఇంజక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 4,330 డోసులను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 50 వేల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల పంపిణీని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. గేదెలు, ఆవులకు ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చేయడమే దీని ఉద్దేశం. దీనివల్ల 90 శాతం అధిక పాలసార గల పెయ్యదూడలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పెయ్యదూడ పెరిగి మూడున్నరేళ్లకు గర్భం దాల్చేనాటికి దాని విలువ రూ.లక్షకు చేరుతుంది. అప్పట్నుంచి ఏటా ఒక్కో పెయ్యదూడను ఈనుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈనెల 15న 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో లింగ నిర్ధారిత వీర్యం పంపిణీ ప్రారంభించనున్నామని పశుగణాభివృద్ధి జిల్లా కార్యనిర్వాహణాధికారి బెహరా ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
వైభవంగా నిత్యకల్యాణం
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి శనివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30గంటల నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. భక్తులతో సింహగిరి కిటకిట సింహాచలం (విశాఖ) : సింహగిరి శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. రెండవ శనివారం సెలవురోజు కావడంతో పలుపాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణరోజు 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి, సింహగిరిపైకి వెళ్లని పలువురు భక్తులు కూడా వచ్చారు. భక్తులతో దర్శన క్యూలు, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల, బస్సులు, అన్నప్రసాద భవనం కిటకిటలాడాయి. -
ఉపాధి పనుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలం
మోతుగూడెం: వై రామవరం మండలం డొంకరాయి గ్రామంలో శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి లోకనా థం పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామస్తులు డేవిడ్, మగాళ్డాన్, లైకన్,ముక్తా తదితరులు పలు సమస్యలు విన్నవించారు. గ్రామంలో జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పని చూపించడం లేదన్నారు. ఉన్నత విద్య చదినప్పటికి ఉపాధి చూపించడంలో జెన్కో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గిరిజన సొసైటీలు ఉన్నప్పటికి జెన్కోలో చిన్న చిన్న పపనులను కూడా టెండర్ విధానంలో ఇస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న పట్టాలు మంజూరు చేయడం లేదన్నారు.ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో కనీసం జాబ్ కార్ుడ్స ఉన్నప్పటికి ఉపాధి చూపించలేకపోతుందన్నారు. జెన్కో గిరిజన సొసైటీలకు పనులు అప్పగించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు వీటిపై దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో గిరిజనులతో కలిసి పోరాడతామన్నారు.నాయకులు కిరణ్, రాంబాబు, రమణ, న్యాయవాది లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో క్రికెట్ పండగ
విశాఖ స్పోర్ట్స్: విశాఖ క్రికెట్ అభిమానులకు పండగే పండగ. రాబోయే కొద్ది నెలల పాటు నగరం క్రికెట్ జాతరతో హోరెత్తనుంది. స్థానిక ప్రతిభకు పట్టం కట్టే ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నుంచి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్ల వరకు.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం అంతులేని ఉత్సాహానికి వేదిక కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్తో ఈ క్రికెట్ సందడి మొదలుకానుంది. ఈ సీజన్ అనేక మార్పులతో అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్లకు ప్రాతినిధ్యం వహించిన ఆరు జట్ల స్థానంలో ఏసారి ఏడు సరికొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ సీజన్లో మ్యాచ్ల సంఖ్య 15 నుంచి 25కి(నాలుగు ప్లేఆఫ్లతో సహా) పెరిగింది. ఇది టోర్నీలో మరింత పోటీని, ఉత్కంఠను నింపనుంది. ఈ సారి ఏపీఎల్ వేలంలో అండర్–16 ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించడం ఒక విశేషం. ఐపీఎల్లో సూర్యవంశీ వంటి యువకులు రాణించడంతో.. స్థానిక ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జట్టులో ఇద్దరు అండర్–19 ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. అండర్–16 విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. ఈ నెల 14న 520 మంది ఆటగాళ్లతో భారీ వేలం జరగనుంది. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లను ‘ప్రత్యేక కేటగిరీ’లో, మిగిలిన వారిని వారి స్థాయిని బట్టి ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఆగస్టు 8న టోర్నీ ప్రారంభమవుతుందని ఏపీఎల్ నిర్వాహక కమిటీ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ కార్యదర్శి సతీష్బాబు తెలిపారు. కాగా.. ఏపీఎల్ ప్రారంభానికి ముందే, రాష్ట్ర స్థాయి క్రీడాకారిణులతో మూడు జట్లుగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా ఐదు మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్–అక్టోబర్ మాసాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఏపీఎల్, మహిళల క్రికెట్ టోర్నీల తర్వాత కూడా విశాఖలో క్రికెట్ సందడి కొనసాగనుంది. డిసెంబర్ 6న భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్లో తలపడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో టీ–20 మ్యాచ్ జరగనుంది. ఏపీఎల్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్ల వరకు ఆతిథ్యం ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ అక్టోబర్లో మహిళల వరల్డ్ కప్ డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో వన్డే -
108లో ప్రసవం
రంపచోడవరం: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న గర్భిణికి మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది ప్రసవం చేశారు. గర్భిణి కె.మల్లేశ్వరి కాన్పు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చేరింది. ప్రసవం కష్టతరంగా మారే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన వైద్యసిబ్బంది శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఆమెను 108 అంబులెన్సులో తరలిస్తుండగా రాత్రి ఏడుగంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే సిబ్బంది సీతపల్లి వద్ద రోడ్డుపక్కన వాహనాన్ని నిలిపి సీతపల్లి పీహెచ్సీ సిబ్బంది ప్రసవం చేశారు. అనంతరం తల్లీశిశువులను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ట్రాలీ..ఆటో ఢీ
● ముగ్గురికి తీవ్ర గాయాలు జి.మాడుగుల: చింతపల్లి రోడ్డు మార్గంలో రచ్చపల్లి గ్రామ సమీపాన ట్రాలీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జేసీబీతో చింతపల్లి వైపు వెళ్తున్న ట్రాలీ, ఎదురుగా జి.మాడుగుల వైపు వస్తున్న ఆటో శనివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మండలంలోని బూరుగువీధి గ్రామానికి చెందిన గొల్లోరి భానుమతి, గొల్లోరి కృష్ణ, వినయ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు దైవ దర్శన నిమిత్తం లోతుగెడ్డ జంక్షన్కు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పాడేరు జిలాఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. -
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు
చింతూరు: కూనవరం మండలం కోతులగుట్టలో గిరిజన పోరాటయోధుడు కొమరం భీం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చింతూరులో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల విగ్రహాలపై దాడులుచేసి ఆదివాసీలను భయపెట్టలేరని, ఇలాంటి ఘటనలకు పాల్పడటం ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఆదివాసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ నాయకులు మెయిన్రోడ్ సెంటర్లోని కొమరం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శీలం తమ్మయ్య, మండల కార్యదర్శి కాక సీతారామయ్య, బొడ్డు బలరాం, కణితి గణేష్, సోడె నారాయణ, తోడెం దేశయ్య, మడివి రాజు, కారం చందు, రాఘవయ్య, చంద్రయ్య, లక్ష్మణ్, అర్జున్, సురేష్ పాల్గొన్నారు.ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్జల్లి నరేష్ డిమాండ్ -
వైఎస్సార్సీపీ మరింత పటిష్టతకు కృషి
● అరకు వైఎస్సార్సీపీ నేతలకు శాసనమండలి ప్రతిపక్ష నేతబొత్స సత్యనారాయణ సూచన బీచ్రోడ్డు (విశాఖ): వైఎస్సార్సీపీ మరింత పటిష్టతకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచించారు. శనివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు పార్టీలోని పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనాన్ని ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బొత్సను కలసిన వారిలో అరకు నియోజకవర్గ మాజీ సమన్వయకర్త అరుణ కుమారి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, అరకు వేలి ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు ఎస్ సోమేష్, వంతల రాంబాబు ఉన్నారు. -
దక్కేది రూ.1500
దిండు రూ.4 వేలు..సాక్షి,పాడేరు: అడవిపై ఆధారపడి అడ్డాకులు సేకరిస్తున్న గిరిజనుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అడ్డాకుల వినియోగం బాగా పెరిగింది. ఇలా ఆదరణ ఉన్నా గిట్టుబాటు ధర దక్కడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అడవుల్లో సేకరించిన అడ్డాకులను గిరిజనులు బాగా ఆరబెట్టి, ఎండిన తరువాత కట్టలు కట్టి కావిడలతో సమీపంలోని వారపు సంతకు తీసుకువస్తుంటారు. అడవి జంతువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి తీసుకువచ్చి అమ్ముకునే గిరిజనులకు ధర విషయంలో అన్యాయం జరుగుతోంది. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు మాత్రం తక్కువ ధర చెల్లిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ● ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ నెలకొంది. హోటళ్లలో అడ్డాకులను అధికంగా వినియోగిస్తున్నారు. నగర ప్రాంతాల్లో హోటళ్ల యాజమానులు వ్యాపారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా డిమాండ్ ఉన్నప్పటికీ అమ్ముకునే గిరిజనులకు కష్టమే మిగులుతుంది. ● ఏజెన్సీలోని వంట్లమామిడి, హుకుంపేట, అరకు, సుంకరమెట్ట, డముకు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, ధారకొండ వారపుసంతల్లో ప్రతి వారం రూ.లక్షల్లో అడ్డాకుల వ్యాపారం జరుగుతోంది. లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు భారీగానే వ్యాపారులు తరలిస్తున్నారు. దిండు అడ్డాకులకు మైదాన ప్రాంతంలో రూ.4వేల వరకు ధర ఉంది. అయితే ఎస్.కోట, గాజువాక, కొత్తకోట, నర్సీపట్నం వ్యాపారులు మాత్రం కేవలం రూ.1500కు మించి కొనుగోలు చేయడం లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు. జీసీసీ చోద్యం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ చోద్యం చూస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత 15ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. అప్పటిలో అడ్డాకులకు అంత డిమాండ్ ఉండేది కాదు. అప్పటినుంచి ఈ కారణం చూపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. గిరిజనుల నుంచి అడ్డాకులు కొనుగోలు చేసిన వ్యాపారులు రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. గిట్టుబాటు కావడంతో లేదంటూ జీసీసీ ప్రేక్షక పాత్ర పోషించడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిండికేట్గా ఏర్పడి ధర నిర్ణయించి గిరిజనుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు.ఎంతో కష్టపడి సేకరించిన అడ్డాకులకు సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఎంతో నిరాశచెందుతున్నారు. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఉన్నా దళారులు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలు పడి అడ్డాకులను సేకరించి ఆరబెట్టి కట్టలుగా కట్టి సంతకు తీసుకువచ్చినా ధర విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. సిండికేట్గా ఏర్పడిన వ్యాపారులు పోటీలేకపోవడంతో వారు చెప్పిందే ధర తీవ్రంగా నష్టపోతున్న గిరిజనులు పట్టించుకోని గిరిజన సహకార సంస్థ అడ్డాకుల అమ్మకాల్లో గిరిజనుల ఆదాయం దళారుల పాలుజీసీసీ కొనుగోలు చేయాలి దళారుల వల్ల సంతల్లో అడ్డాకులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అడవిలో సేకరించిన అడ్డాకులను ఎండబెట్టి వారపు సంతకు తీసుకువచ్చేందుకు ఇంటిల్లపాది ఎంతో కష్టపడాలి. జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్లో పోటీ లేకుండా పోయింది. – మర్రి నాగేష్, ఓలుబెడ్డ, హుకుంపేట మండలం నష్టపోతున్నాం వ్యాపారులకు విక్రయించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. మార్కెట్లో పోటీలేకపోవడం వల్ల వారు నిర్ణయించిన ధరకు అమ్మాల్సి వస్తోంది. అడ్డాకుల దిండును రూ.1500కు మంచి కొనుగోలు చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పాంగి కొండన్న, కామయ్యపేట, హుకుంపేట మండలం -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
కొయ్యూరు: టీడీపీ మండల అధ్యక్ష ఎన్నిక విషయంలో పార్టీ శ్రేణుల మధ్య తలెత్తిన వర్గ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. వివరాలిలా ఉన్నాయి. శనివారం రాజేంద్రపాలెంలోని జెడ్పీ అతిథి గృహంలో మండల టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పదవికి గొరిసింగి సత్యనారాయణ, ఎస్.చంద్రరావు, ఎన్.సాంబశివరావు పోటీపడ్డారు. వీరిలో గొరిసింగి సత్యనారాయణకు నియోజకవర్గ, మండల ఎన్నికల పరిశీలకులు బుద్ధ జగదీశ్వరరావు, శెట్టి బాబూరావు, టీడీపీ నియోజకరవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి నచ్చజెప్పడంతో పోటీనుంచి తప్పుకున్నారు. ఎస్.చంద్రరావు, ఎన్.సాంబశివరావు పోటీపడటంతో ఎన్నిక (పోలింగ్) నిర్వహించారు. మండలంలోని 33 పంచాయతీలు ఉండగా ఒకొక్క పంచాయతీ నుంచి టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి ఓటు వేయాల్సి ఉంది. వీరిలో మూడు పంచాయతీలకు చెందిన వారు రాలేదు. మిగతా వారితో పోలింగ్ నిర్వహించారు. 30 పంచాయతీలకు సంబంధించి 60 ఓట్లు పోల్ అవ్వాల్సి ఉంది. అయితే అదనంగా 8 ఓట్లు పోలవడం వివాదానికి దారి తీసింది. దొంగ ఓట్లు పోలయ్యాయని చెబుతూ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ఎన్నిక ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన ఆయనపై ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తల్లో చంద్రరావు వర్గం ఆందోళనకు దిగింది. ఆయనను నిలదీయడమే కాకుండా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారులో వెళ్లిపోతుండగా అడ్డుకున్నారు. ఇక్కడి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యాయి. జెడ్పీ అతిథి గృహం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన గిడ్డి ఈశ్వరికి నిరసన సెగ తప్పలేదు. ఆమె వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. ఎన్నికల పరిశీలకులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రరావు ఐదు ఓట్ల తేడాతో గెలిచారని, అయితే దీనిని ప్రకటించడం ఇష్టంలేకనే దొంగ ఓట్లు సృష్టించి నాటకీయ పరిణామానికి తెరలేపడం సరికాదని మాజీ ఎంపీపీ సత్యనారాయణ,పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దుచ్చరి చిట్టిబాబు ధ్వజమెత్తారు. ఈ సమయంలో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని పక్కకు పంపించేయడంతో గిడ్డి ఈశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను అడ్డగించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎలాంటి సమాచారం చెప్పకుండా ఎన్నిక ఫలితాలు ప్రకటించని నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బుద్ధా నాగజగదీశ్వరరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మండల పరిశీలకుడు శెట్టి బాబూరావు తెలిపారు. కొయ్యూరు మండల అధ్యక్ష పార్టీ పదవి ఎన్నిక నిర్వహణలో ఉద్రిక్తత దొంగ ఓట్లు పోలయ్యాయంటూ ఫలితం నిలిపివేసిన నియోజకవర్గ పరిశీలకుడు బుద్ధ జగదీశ్వరరావు ఆగ్రహానికి గురైన ఓ వర్గం శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఆయనను అడ్డగించి నిరసన గిడ్డి ఈశ్వరికి తప్పని నిరసన సెగ పోలీసులు, పచ్చ తమ్ముళ్ల మధ్య తోపులాట -
ఓఎన్జీసీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం
రాజవొమ్మంగి: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓఎన్జీసీ నిర్మించిన ఆర్వోప్లాంట్ను ఆ సంస్థ ఈడీ సంతానుదాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో హెచ్ఎం ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుతున్న దాదాపు 500 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. బోర్వెల్, షెడ్డు, ఆర్వోప్లాంట్ నిర్మాణానికి రూ. 10 లక్షల సీఎస్సార్ నిధులు వెచ్చించినట్లు సంస్థ జీఎం రూణా మజుందర్ వెల్లడించారు. పాఠశాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేశామన్నారు. సర్పంచ్ గొల్లపూడి రమణి, సంస్థ ప్రతినిధులు ఆర్ఎస్. రామారావు, కొమ్ము సత్యనారాయణ, సంజుక్త దాస్, విద్యాకమిటీ చైర్మన్న్ శ్రీనివాస్, ఎంఈవో సూరయ్యరెడ్డి, ఉపాధ్యాయులు బొజ్జయ్య, కొండబాబు, శివకృష్ణ, పాల్బాబు పాల్గొన్నారు. -
మన్యంలో ప్రకృతి సాగు బాగు
పాడేరు : జిల్లాలో గిరిజన రైతులు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం ఎంతో బాగుందని తమకు బాగా నచ్చిందని మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహిళా రైతు ప్రతినిధుల బృందం ప్రతినిధులు కితాబిచ్చారు. పదిరోజుల జిల్లా పర్యటన, శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని బిరిమిశాల, గుర్రం పనుకు గ్రామాల్లో స్థానిక గిరిజనులు సాగు చేస్తున్న ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న వివిధ పంటలను పరిశీలించారు. వరితో పాటు మోడల్ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. క్షేత్ర సందర్శన ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల సంరక్షణ, తక్కువ ఖర్చుతో వ్యవసాయ సాగు నైపుణ్యాలు, స్వయం సాధికారిత అంశాలపై అవగాహన పొందారు. స్థానిక గిరిజన రైతులతో కలిసి శ్రీవరి విధానంలో నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రీజనల్ టీం, సైన్స్ ఆండ్ రీసెర్చ్ టీం, ప్రకృతి రైతులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.మేఘాలయ మహిళా రైతు ప్రతినిధుల బృందం కితాబు -
వరద ప్రభావిత ప్రాంతాల్లో పీవో సుడిగాలి పర్యటన
కూనవరం: గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. వరద ప్రభావిత గ్రామాలైన చినార్కూరు, పైదిగూడెంలో ప్రజలు ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటున్న రిలీఫ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కూటూరు పీహెచ్సీ, కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సందర్శించారు. పైదిగూడెం సమీపంలో ఉన్న రిలీప్ కేంద్రంలో మూడవ బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ జేఈ భానుప్రకాష్ను ఆదేశించారు. కూటూరు పీహెచ్సీలో జనరేటర్ ఏర్పాటు చేయడమే కాకుండా మందులు అందుబాటులో ఉంచాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్యను ఆదేశించారు. కోతులగుట్ట సీహెచ్సీలో అవసరమైన సౌకర్యాల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. అడ్డతీగల, చింతూరు నుంచి ఇద్దరు డాక్టర్లను నియమించి వైద్యుల కొరత లేకుండా చేస్తామన్నారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నాటు పడవల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల సమయంలో ప్రతీ బోటులో లైప్జాకెట్లు ఉండాలని సూచించారు. అలాగే బోటు యజమానులకు రైన్ కోటు, టోపీ, టార్చిలైట్లను ఐటీడీఏ ద్వారా అందిస్తామని తెలిపారు. ఆయన వెంట రంపచోడవరం ఎస్డీసీ అంబేద్కర్, ఎటపాక ఎస్డీసీ బాల కృష్ణారెడ్డి, ట్రైబల్వెల్ఫేర్ ఈఈ మురళి, తహసీల్దార్ కె శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాధం, ఎస్ఐ లతశ్రీ పాల్గొన్నారు. వీఆర్పురం: వరద ఉధృతి కారణంగా మండలంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుష్టివారిగూడెం– అడవివెంకన్నగూడెం, చింతరేగుపల్లి– కన్నాయిగూడెం, పోచవరం– ఇప్పూరు గ్రామాల మధ్య నీటమునిగాయి. దీంతో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● వరద ప్రభావిత ప్రాతాల్లో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ పర్యటించారు. దీనిలో భాగంగా ముందుగా ఆయన ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు. చింతూరు ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ బాలకృష్ణారెడ్డి, డీఎంహెచ్వో పుల్లయ్య తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానియేల్, ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. -
ఆక్రమణలు తొలగించి.. మాట నిలుపుకోండి
పాడేరు : ఏజెన్సీ ప్రధాన కేంద్రాలతోపాటు పాడేరు పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను తొలగించడంలో ఇచ్చిన మాటను కలెక్టర్ దినేష్కుమార్ నిలుపుకోవాలని గిరిజన సంఘ నేత డాక్టర్ తెడబారికి సురేష్కుమార్ కోరారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రధాన కేంద్రాల్లో ఆక్రమణలను తొలగిస్తామని, పట్టణంలో వంద అడుగుల మేర రోడ్డును విస్తరిస్తామని, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కలెక్టర్ దినేష్కుమార్ ఆరు వారాల క్రితం పాడేరు పాత బస్టాండ్లో అంబేడ్కర్ సెంటర్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎనిమిది వారాల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారని కానీ ఒక్క వారం మాత్రమే హడావుడి చేసి ఆ తరువాత నుంచి కాలయాపన చేశారన్నారు. కూటమి నాయకులు, వర్తకుల దుకాణాలు పోతాయనే కారణంతోనే ఆక్రమణల తొలగింపు నిలిపివేశారని ఆరోపించారు. ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు గత ఐదు వారాలుగా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా స్వయంగా వెళ్లిన కలెక్టర్ గత సోమవారం కోర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగిస్తామని చెప్పి తప్పించుకున్నారన్నారు. పాడేరు ఏజెన్సీ 11 మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ కార్యాలయంలో ఎనిమిది నెలలుగా పూర్తి స్థాయి పీవో, టీడబ్ల్యూ డీడీ పోస్టులను భర్తీ చేయకపోవడం సరికాదన్నారు. ఆదివాసీ సమాజానికి సేవ చేసి గిరిజనుల మన్ననలు పొందాల్సిన కలెక్టర్ వైఖరి పట్ల గిరిజనులంతా అసంతృప్తిగా ఉన్నారన్నారు. గిరిజనుల అభ్యున్నతికి పాడుపడే ఐఏఎస్ అధికారులను కలెక్టర్, ఐటీడీఏ పీవోలుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.గిరిజన సంఘ నేత డాక్టర్ తెడబారికి సురేష్కుమార్ -
గంజాయి రహిత మన్యమే లక్ష్యం
పోక్సో కేసులో యువకుడి అరెస్ట్ సబ్బవరం: బాలిక అదృశ్యం కేసులో స్థానిక పోలీసులు ఓ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు. సీఐ జి.రామచంద్రరావు తెలిపిన వివరాలు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బుడారిసింగ్ గ్రామానికి చెందిన పసుపులేటి హరిబాబు కుటుంబ సభ్యులతో సబ్బవరంలోని సాయినగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ, అసకపల్లి ప్రాంతంలో నర్సరీ నడుపుతున్నాడు. అతని కుమారుడు తేజ(19) తాము అద్దెకు ఉంటున్న యజమాని కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. మే నెలలో ఎవరికీ తెలియకుండా బాలికను అపహరించుకు పోవడంతో బాలిక తండ్రి సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒడిశా రాష్ట్రంలో ఉన్న తేజను గురువారం పట్టుకుని, బాలిక స్టేట్మెంట్ మేరకు అరెస్ట్ చేశారు. అతనితో పాటు పట్టుబడిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరెస్టు చేసిన యువకుడిని రిమాండ్కు తరలించారు. పాడేరు : గంజాయి రహిత మన్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికే జిల్లాలో పోలీసులు, ఈగల్ సిబ్బంది గంజాయిని సమూలంగా నిర్మూలించడం ఆనందంగా ఉందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్యం–2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల నుంచి రూ.3కోట్ల 73 లక్షల 80వేల ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 25వేల కుటుంబాలకు 35వేల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో ఉపాధి హామీ పథకం ద్వారా పసుపు సాగును ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ చైతన్యం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల మొక్కలు పెంచుతామన్నారు. అరకు అర్గానిక్ కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, డిమాండ్ ఉన్నందున వాటిని రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి వంద గోకులాలు మంజూరు అయ్యాయని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి లింకులున్న 4700 మందిని గుర్తించామన్నారు. గంజాయి లింకులుంటే 20 ఏళ్ల జైలు శిక్ష ఖాయమన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో రూ.54కోట్లతో వాణిజ్య పంటల సాగు చేపడుతున్నామన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలించామన్నారు. గత ఏడాది సుమారు 93 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశామన్నారు. రైతులకు మొక్కలను, రాగి, వరి విత్తనాలను పంపిణీ చేశారు. స్వచ్ఛ సంకల్పం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర, ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఈగల్ ఎస్పీ నగేష్బాబు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని గిరిజన,సీ్త్రశిశు సంక్షేమం, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అభివృద్ధిపై శుక్రవారం అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగిరిజన ఉత్పత్తులను టీటీడీ కొనుగోలు చేసేలా ఆ సంస్థతో మాట్లాడడం జరిగిందన్నారు. పర్యాటకుల సౌకర్యాలు నిమిత్తం పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ 2029 నాటికి 15శాతం వృద్ధి సాఽధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిచామన్నారు. అనంతరం ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యంకు సంబంధించిన పీ–4 గోడపత్రికలను మంత్రితో పాటు అఽధికారులు ఆవిష్కరించారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మద్దిలపాలెం(విశాఖ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపక(గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మజ్జి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మద్దిలపాలెంలోని డా.వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అగనంపూడి, ఇస్లాంపేట, పెందుర్తి కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన విశ్రాంత అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్లు, కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిన ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, బయోడేటా, సంబంధిత ఒరిజినల్, నెటివిటీ ధ్రువపత్రాలను పిఠాపురం కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటల్లోగా సమర్పించాలి. మరిన్ని వివరాలకు 0891–2713791 ఫోన్ నంబర్కు సంప్రదించవచ్చని వృత్తి విద్యాశాఖాధికారి తెలిపారు. భౌతికశాస్త్రం–1, జంతుశాస్త్రం–1, వృక్షశాస్త్రం–1, ఫిజియోథెరపీ–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత -
సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కొనసాగించేలా చర్యలు
చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ను యథావిధిగా కొనసాగించేలా సంబంధిత అదికారుల చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సంధర్శించారు. ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి,శాస్త్రవేత్తలు,పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 2011లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కళాశాలను మంజూరు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా చింతపల్లిలో 3బ్రాంచ్లతో 60 మంది విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చామన్నారు. అదేవిధంగా ఈ కళాశాలకు 12 ఎకరాలు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన సౌకర్యాలు లేనందున చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని కుంటుసాకులు చూపుతూ ప్రవేశాలు నిలిపివేయడం దారుణమన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగితే వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక్కడ వ్యవసాయ పాలిటెక్నిక్ లేనప్పుడు ఈ ప్రాంత విద్యార్థులు తిరుపతి, నైరా, బాపట్ల, జగిత్యాల తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారన్నారు. ఈ పరిస్థితుల్లో ఎత్తివేయడం ఎంతో బాధాకరమన్నారు. ఇప్పటికే చింతపల్లిలో డెయిరీ ఫారం, పట్టుపరిశ్రమ కార్యాలయాన్ని ఎత్తివేశారని అన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు పునరాలోచించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విజ్ఞప్తి -
జీసీసీ అధికారులపైకలెక్టర్ ఫిర్యాదు
● కాఫీ కొనుగోలు సొమ్ము జమచేసేలా చర్యలు తీసుకోవాలని వినతి గూడెంకొత్తవీది: కాఫీని విక్రయించి నెలలు గడుస్తోన్నా జీసీసీ అధికారులు ఇంత వరకు ఖాతాల్లో నగదు జమ చేయలేదని గూడెం పంచాయతీ కొత్తపల్లికి చెందిన రైతులు శుక్రవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితం 6,200 కిలోల కాఫీని జీసీసీకి విక్రయించామన్నారు. ఇందుకు సంబంధించి రూ.20 లక్షలు తమ ఖాతాల్లో వేయాల్సి ఉందన్నారు. 24 గంటల్లో డబ్బులు వేసేస్తామని చెప్పిన జీసీసీ అధికారులు ఇంత వరకు జమచేయలేదన్నారు. దీనిపై స్పందించి వెంటనే నగదుకు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీసీసీ అధికారులపై చర్యలు చేపట్టాలని వారు కలెక్టర్ను కోరారు. -
గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి
అడ్డతీగల: త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా గృహ ప్రవేశాలు చేసేందుకు ల బ్ధిదారులు సిద్ధం కావాలని గృహనిర్మాణశాఖ రాష్ట్ర ప్రత్యేకాధికారి పి.వెంకటరమణ సూచించారు.అడ్డతీగల మండలం కొత్తపాలెం,గొండోలు గ్రామాల్లో పీఎంఎవై గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని ప్రతి నిరుపేదలకు సొంత గృహం ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులందరూ ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.రంపచోడవరం డివిజన్ ఈఈ ఎ.రవికుమార్,డీఈఈ శ్రీరామచంద్రమూర్తి, ఏఈ రాజశేఖర్,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రత్యేకాధికారి వెంకటరమణ -
మీకోసంలో 128 వినతుల స్వీకరణ
పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 128 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఇంచార్జీ డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జనార్దనరావు, జిల్లా ట్రెజరీ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమేష్కుమారరావు, డీఎల్పీవో కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసన
ఆర్ఏఆర్ఎస్లోని సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించిన ఈ కళాశాల తమలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. – చింతపల్లి పేదబిడ్డలకు ఎంతో నష్టం చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేస్తే మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మాది బీసీ వర్గానికి చెందిన చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. మాకున్నటువంటి మూడు ఎకరాల మెట్ట భూమిలో వేరుశనగ, మిర్చి పంటలను మాతల్లిదండ్రులు కష్టపడి పండించి నన్ను చదివించారు. మా కుటుంబ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని సేంద్రియ వ్యవసాయ విద్యపై మక్కువ పెంచుకుని సుదూర ప్రాంతమైన చింతపల్లి వచ్చి చదువుకుంటున్నా. ఇపు్పుడు కళాశాలను మూసివేస్తున్నారని తెలిసేసరికి మాలాంటి పేద విద్యార్థులు ఇలాంటి విద్యను అభ్యసించే అవకాశం దూరం అవుతుంది. – ఎ.అక్షయ, తొర్రివేమల, మైలవరం మండలం, వైఎస్సార్ కడప జిల్లాఉచితంగా అభ్యసించేవీలు లేనట్టే వ్యవసాయ విద్యను ఉచితంగా అభ్యసించే అవకాశం లేకుండా పోయినట్టే. మాది చిన్న పాటి కుటుంబం. మా తండ్రి మెకానిక్గా పనిచేస్తూ మరోపక్క అర ఎకరాలో వ్యవసాయం చేస్తూ వచ్చే ఆదాయంతో నన్ను చదివించారు. వ్యవసాయ విద్యలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అందరూ చెబుతుండటంతో ఇక్కడ జాయిన్ అయ్యా. ఉచితంగా చదువుకుంటున్నా. ఇక్కడ ఎంతో బాగా చెబుతున్నారు. ప్రాక్టికల్గా కూడా చేయిస్తున్నారు. ఇటువంటి కళాశాలను ఎత్తివేస్తే మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్నో అవస్థలు పడాలి. దీనివల్ల పేద విద్యార్థులకు వ్యయసాయ విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది. – వి.రూప, భీమవరం, అడ్డతీగల మండలం, ఏఎస్సార్ జిల్లా గిరిజన విద్యార్థులకే ఎక్కువ అన్యాయం కళాశాలను మూసివేస్తే ఈ ప్రాంత గిరిజన విద్యార్థులకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. గతంలో ఈ వ్యవసాయ విద్యపై ఏజెన్సీ ప్రాంతంలో అంతగా అవగాహన లేదు. మాకున్న ఎకరా భూమిలో చేపట్టాల్సిన పంటలకు సంబంధించి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వచ్చి మా తండ్రికి వ్యవసాయ సూచనలు ఇచ్చేవారు. నన్ను కూడా వ్యవసాయ విద్యలో చేర్చాలని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేవారు. ఎంతో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ చదివి సీటు సంపాదించా. వ్యవసాయ విద్యను మన ప్రాంతంలోనే ఉచితంగా అన్ని సౌకర్యాలతో పొందుతున్నా. ఇటువంటి కళాశాలను ఎత్తివేస్తే గిరిజన విద్యార్థులకు తీరని అన్యాయం చేసినట్టే. – కె. స్పందన, లోతుగెడ్డ, చింతపల్లి మండలం -
38 దేవాలయాల్లో బాలవికాస్ కేంద్రాలు
సీలేరు: జిల్లాలో 38 దేవాలయాల్లో బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించినట్టు సమరతసేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ గొర్లె గణేశ్వరరాజు తెలిపారు. జీకే వీధి మండలం దారకొండ కాలనీలో ఏర్పాటు చేసిన బాలవికాస్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లాలో 51 దేవాలయాలను నిర్మించిట్టు చెప్పారు. వీటిలో 38 ఆలయాల్లో బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు నీతి పద్యాలు ,భగవద్గీత శ్లోకాలు ,అభినయ గీతాలు,శనివారం భజన,ఆదివారం ఆటలు నేర్పిస్తారని చెప్పారు. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పెద్దలను గౌరవించడం,క్రమశిక్షణ అలవడుతాయన్నారు. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బాలవికాస్ కేంద్రాలకు పంపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు సుంకరి కృష్ణమూర్తి,అర్చకుడు సాగిన భూపతి ,మాతాజీ తగ్గి వసంతదేవి, ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ముంచంగిపుట్టు: పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దరి చేరవని జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి అన్నారు.మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీ లంగాబపోదోర్ గ్రామానికి చెందిన కొర్ర రంజిత(6) ఈ నెల 8న మలేరియాతో మృతి చెందడంతో శుక్రవారం జిల్లా మలేరియా అధికారి లంగాబపోదోర్ గ్రామాన్ని సందర్శించారు.రంజిత తల్లిదండ్రులు శంకర్రావు,బుధోయ్లతో మాట్లాడి మృతి చెందకముందు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.12 రోజుల పాటు జ్వరం బాధపడినట్టు తల్లిదండ్రులు తెలియజేశారు. రంజితకు అందిన వైద్య సేవలు,అందించిన మందులు తదితర వివరాలు సేకరించారు.అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గిరిజనులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.గ్రామంలో పలుచోట్ల మురుగునీరు నీల్వ ఉండడం,పారిశుధ్యం లోపించడంతో గ్రామస్తులతో శుభ్రం చేయించారు.రంగబయలు పంచాయతీలో ఆశా కార్యకర్తలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వస్తున్న అనారోగ్య సమస్యలపై తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి గ్రామస్తులతో మాట్లాడుతూ వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,దోమ తెరలు వినియోగించాలని,అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను,సిబ్బందిని సంప్రదించి,వైద్య సేవలు పొందాలని,నాటు వైద్యం జోలికి పోకూడదని సూచించారు.అనంతరం లబ్బూరు పీహెచ్సీ,ముంచంగిపుట్టు సీహెచ్సీలను తనిఖీ చేశారు. సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్న లంగాబపోదోర్ గ్రామానికి చెందిన జ్వర బాధితులతో మాట్లాడి ప్రస్తుత అరోగ్య పరిస్థితి,అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్యాంప్రసాద్,వివేక్,ఎంపీహెచ్వో సుబ్రహ్మణ్యం,హెల్త్ అసిస్టెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.జిల్లా మలేరియా అధికారి తులసి -
ఇద్దరు గంజాయి నిందితుల అరెస్ట్
అనకాపల్లిటౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి రైలు మార్గంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ఎస్ఐ డి.ఈశ్వరరావు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ ఎస్ఐ డి.ఈశ్వరరావుకు అందిన సమాచారం మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ రోడ్ జంక్షన్ వద్ద ఇద్దరూ అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి బయటపడింది. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు సీఐ చెప్పారు. ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
గోదావరి గుబులు
● క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం ● భద్రాచలం వద్ద 37.60 అడుగులు ● 6.61 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల ● ఉదయానికి మరింత పెరిగే అవకాశం ● కేంద్ర జలసంఘం హెచ్చరిక ● విలీన మండలాల్లో ఆందోళనఎటపాక: గోదావరికి వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి శుక్రవారం సాయంత్రం 7గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 37.60 అడుగులకు చేరుకుంది. దీంతో 6.61లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు ఎగువన ఉన్న మేడిగడ్డ ,ఇతర ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి మరింత వరద చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. శనివారం ఉదయానికి 40 అడుగులు దాటవచ్చని వెల్లడించారు. వరద ఉధృతి ఇదేవిధంగా కొనసాగితే మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగువ అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు పోటెత్తడంతో పొలాల్లోకి నీరు చేరింది. భద్రాచలంలో 43 అడుగులకు చేరుకోగానే మొదటి, 48 అడుగులకు చేరితే రెండవ, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కూనవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. కొండ్రాజుపేట సప్టాపైకి వరద నీరు చేరడంతో టేకులబోరు, కోడ్రాజుపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక తహసీల్దార్ కె.శ్రీనివాసరావు ఎంపీడీవో జగన్నాథరావు, ఎస్సై లతశ్రీ కోడ్రాజుపేట చప్టా వద్ద వరద ప్రవాహన్ని పరిశీలించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తహసీల్దార్ కె. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అధైర్య పడవద్దని సూచించారు. కూనవరం బ్రిడ్జి వద్ద శబరి, గోదావరి నదులు ఉధృతికి తగ్గట్టుగా లాంచీలను సిద్ధం చేయాలని వాటి యజమానులను అప్రమత్తం చేశామన్నారు. కాగా కూనవరం వద్ద సాయంత్రం 6గంటలకు 13.60 మీటర్ల (26.5 అడుగులు)కు నీటిమట్టం చేరిందని అధికారవర్గాలు తెలిపాయి. వరదపై చింతూరు ఐటీడీఏ పీవో సమీక్ష చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో పీవో అపూర్వభరత్ శుక్రవారం వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమతెరలు పంపిణీ చేయాలని, ఇళ్లను ఖాళీచేసిన బాధితులకు టార్పాలిన్లు ఇవ్వాలని ఆదేశించారు. కూనవరం మండలం బోదునూరు నుంచి ఏడుగురాళ్లపల్లి వరకు నిర్మాణంలో ఉన్న రహదారికి అటవీ అనుమతులు వచ్చినందున యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నాలుగు మండలాల్లో అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వైద్యసిబ్బందికి మూడు నాటు పడవలను ఏర్పాటు చేయడం జరిగిందని, నాలుగు మండలాల్లో ఇప్పటివరకు 440 మంది గర్భిణులను గుర్తించినట్టు తెలిపారు. వరద అధికమైతే వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి పీహెచ్సీలో జనరేటర్ ఏర్పాటు చేయాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని పీవో సూచించారు. వరదల సమయంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు అంబేద్కర్, బాలకృష్ణారెడ్డి, ట్రైబల్వెల్ఫేర్ ఈఈ మురళి, ఏవో రాజ్కుమార్ పాల్గొన్నారు. 40 అడుగులకు పెరిగే అవకాశం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద గోదావరి 40 అడుగుల వరకు పెరిగే అవకాశాలున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారని పీవో అపూర్వభరత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టవచ్చని, ప్రస్తుతం చింతూరు డివిజన్లో కొండ్రాజుపేట, టేకులబోరు నడుమ రహదారిపైకి వరదనీరు చేరిందని, మిగిలిన గ్రామాలకు యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయని పీవో తెలిపారు. -
పోలవరం పునరావాసంలో తీవ్ర జాప్యం
చింతూరు: పోలవరం ముంపు నిర్వాసితులకు పునారావాసం కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, మునిగే ప్రాంతాలన్నింటినీ ఒకటే కాంటూరుగా పరిగణించి త్వరితగతిన పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని ఎర్రంపేటలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ముంపు మండలాల ప్రజలు ఏటా వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి అన్నిరకాల సౌకర్యాలతో పునరావాస కాలనీలు నిర్మించి అక్కడికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన విలువ విషయంలో పోలవరం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇష్టానుసారంగా విలువలు వేసి నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీంతో నిర్వాసితులు న్యాయపరంగా తమకు రావాల్సిన పరిహారాన్ని నష్టపోయారని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా పునరావాసం కల్పించే నాటికి పరిహారం, పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీప్రాంతంలో కొండరెడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి గ్రామాలకు రహదారులు, మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ట్రైబల్ సబ్ప్లాన్ నిధులను వారి అభివృద్ధికి ఎందుకు కేటాయిచడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా ఆ నిధులతో గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాల్సి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీఆర్పురం ఎంపీపీ కారం లక్ష్మి, గిరిజనసంఘం రాష్ట్ర కార్యదర్శి లోకనాథం, జిల్లా కార్యదర్శి అశోక్, పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, శ్రీవాణి, చినబాబు, వెంకట్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, బుచ్చమ్మ పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
గిడ్డి ఈశ్వరికి అసమ్మతి సెగ
సాక్షి,పాడేరు: టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అసమ్మతి సెగ నెలకొంది. పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నికల నిర్వహణలో ఆమెతోపాటు, మండల పరిశీలకుడు రెహ్మాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జి.మాడుగుల మండలానికి చెందిన టీడీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా శుక్రవారం పాడేరులోని కేవీఆర్ లాడ్జి మేడపై సమావేశమయ్యారు. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, టూరిజంశాఖ డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు ఆధ్వర్యంలో జి.మాడుగుల టీడీపీ కీలక క్యాడర్ అంతా గిడ్డి ఈశ్వరి వైఖరిపై మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు గ్రామ, మండల కమిటీల్లో అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో టీడీపీకి రాజీనామా చేస్తామని వారంతా హెచ్చరించారు. అవసరమైతే ఛలో అమరావతి కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. గిడ్డి ఈశ్వరి పార్టీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా పాడేరులో జి.మాడుగుల టీడీపీ నేతల సమావేశం పార్టీ కోసం పనిచేసేవారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యతిరేక విధానాలు విడనాడాలని నినాదాలు అవసరమైతే చలో అమరావతి చేపడతాం రాజీనామా చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిక -
శరత్నగర్ సబ్ సెంటర్కు జాతీయ స్థాయి గుర్తింపు
● ఉన్నత ప్రమాణాలకు 84.56 శాతం మార్కులు డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని శరత్నగర్ సబ్సెంటర్కు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని వైద్యాధికారులు నజీబ్, కుమార్రత్న తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 25న ఇక్కడ వచ్చిన ఎన్క్యూఏఎస్ బృందం సేవలు, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించి వెళ్లిందన్నారు. వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు 84.56 శాతం మార్కులు లభించినట్టు వారు పేర్కొన్నారు. -
విద్యుత్షాక్తో యువకుడి మృతి
మాడుగుల రూరల్: డి.గోటివాడ గ్రా మంలో విద్యుత్షాక్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తెలియవచ్చింది. గ్రామానికి చెందిన బొబ్బాది శివాజీ (22) గురువారం ఉదయం తన పొలంలో పామాయిల్ కొమ్మలు నరుకుతుండగా, చెట్టు పక్కన్న వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో శివాజీ విద్యుత్ షాక్కు గురియ్యారు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రైల్వే స్టేషన్లో క్యాప్సూల్ హోటల్
● పీపీపీ విధానంలో అభివృద్ధి.. అందుబాటులోకి 88 క్యాప్సూల్ బెడ్లు ● 3 గంటల వరకు రూ.200, రోజుకు రూ.400 వసూలు ● రైలు ప్యాసింజర్లతో పాటు బయటవారు వినియోగించుకునే సౌకర్యం ● డిమాండ్ను బట్టి మరిన్ని స్టేషన్లలో ఏర్పాటుకు ఆలోచన ● వాల్తేరు డీఆర్ఎం లలిత్ బొహ్రావిశాఖ సిటీ : విశాఖ రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా క్యాప్సూల్ హోటల్ సిద్ధమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ప్లాట్ఫాం నెంబర్–1, గేట్ నెంబర్–3 వద్ద మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే తొలిసారిగా ఈ తరహా క్యాప్సూల్ హోటల్ను విశాఖలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. గురువారం డీఆర్ఎం చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్లో వసతి సౌకర్యాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూమ్స్ సరిపోక ప్రయాణికులు బయట హోటల్స్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటు ధరలో సౌకర్యవంతమైన వసతి కల్పించాలన్న ఉద్దేశంతో సరికొత్తగా క్యాప్సూల్ హోటల్ను ఏర్పాటు చేశారు. ఈ తరహా హోటల్స్ ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ వంటి రైల్వేస్టేషన్లలో మాత్రమే ఉన్నాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి విశాఖ రైల్వే స్టేషన్లో కూడా ఆధునిక హంగులు, అందుబాటు ధరలతో క్యాప్సూల్ హోటల్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఈ–యాక్షన్ నిర్వహించారు. ఇందులో శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీ అనే సంస్థ ఐదేళ్ల కాలానికి ప్రాజెక్టును దక్కించుకుంది. రైల్వేస్టేషన్ మొదటి అంతస్తులో అధికారులు స్థలాన్ని కేటాయించారు. సదరు కాంట్రాక్టు సంస్థ ఇక్కడ క్యాప్సూల్ హోటల్ను అభివృద్ధి చేసింది. ఇందులో 73 సింగిల్ బెడ్లు, 15 డబుల్ బెడ్లు మొత్తంగా 88 బెడ్లను ఏర్పాటు చేసింది. మహిళల కోసం 18 బెడ్లు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. రైల్వే ప్రయాణికులతో పాటు పర్యాటకులు, బయట వ్యక్తులకు కూడా ఈ హోటల్లో వసతి పొందే సౌలభ్యాన్ని కల్పించారు. 3 గంటలలోపు రూ.200 ఈ కొత్త క్యాప్సూల్ హోటల్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు అనేక సదుపాయాలు కల్పించారు. అతిథులకు ఉచిత వైఫై, 24 గంటలు వేడి నీళ్ల సౌకర్యం, పర్యాటకుల కోసం ట్రావెల్ డెస్క్తో పాటు ఇన్హౌస్ స్నాక్ బార్ను ఏర్పాటు చేశారు. ఇందులో సింగిల్ బెడ్కు 3 గంటలలోపు రూ.200, 3 నుంచి 24 గంటల వరకు రూ.400 వసూలు చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్కు మూడు గంటలలోపు రూ.300, 3 నుంచి 24 గంటలలోపు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఈ బెడ్స్ను బుక్ చేసుకునే సదుపాయం లేదని డీఆర్ఎం తెలిపారు. డిమాండ్ను బట్టి ఆ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. -
స్వామీ.. నీ సన్నిధి చేరి..
సింహాచలం: ఆషాఢ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని జరిగిన సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం గురువారంతో దిగ్విజయంగా ముగిసింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని స్మరిస్తూ బుధవారం చేపట్టిన 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అశేష జనసందోహంతో కొనసాగింది. సింహాచలంలోని తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణను ముగించారు. పలువురు భక్తులు సింహగిరికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సింహగిరిపై జన జాతర ఒక పక్క 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు.. మరో పక్క ఆలయ ప్రదక్షిణలకు వచ్చిన భక్తులతో గురువారం సింహగిరి భక్త జనజాతరగా మారింది. దేవస్థానం అంచనాల ప్రకారం.. ఈ సారి గిరి ప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. గురువారం ఒక్క రోజే 68 వేల మంది భక్తులు సింహగిరిపై స్వామిని దర్శించుకోగా, బుధవారం 42 వేల మంది దర్శనం చేసుకున్నారు. అలాగే సుమారు 5 వేల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు గిరి ప్రదక్షిణ చేసి సింహగిరికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే స్వామి దర్శనాలకు అనుమతించారు. తొలుత ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తామని ప్రకటించినప్పటికీ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 4.30 గంటల నుంచి రూ.100, రూ.300 టికెట్ల క్యూల్లో కూడా భక్తులను ఉచితంగా పంపించారు. ఆలయ నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే లఘు దర్శనం కల్పించి, అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. విశేషంగా ఆలయ ప్రదక్షిణలు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహగిరిపై గురువారం ఆలయ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను ఆలయ ప్రదక్షిణలకు అనుమతించారు. అచంచల భక్తితో గిరి ప్రదక్షిణపూర్తి చేసిన భక్తులు పౌర్ణమి వేళ విశేషంగా ఆలయ ప్రదక్షిణలు లక్షలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం నృసింహుని స్మరణతో మార్మోగిన గిరి మార్గం ముఖ్యాంశాలు కొండ దిగువ పాత గోశాల జంక్షన్ నుంచి పాత అడవివరం వరకు ఉన్న మార్గం భక్తులతో కిక్కిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి తొలిపావంచాకు చేరుకునే భక్తులు, ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకునే భక్తులతో రద్దీ నెలకొంది. గిరి ప్రదక్షిణ ముగించుకుని కొబ్బరికాయలు కొట్టే భక్తులతో తొలిపావంచా గురువారం మధ్యాహ్నం వరకు కిటకిటలాడింది. మెట్ల మార్గంలో కేవలం సింహగిరికి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతించారు. కొండ దిగువకు మెట్ల మార్గంలో అనుమతించలేదు. సింహగిరి నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి దేవస్థానం 50 ఉచిత బస్సులను నడిపింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసి సింహగిరి వచ్చిన భక్తులను ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన కింద నుంచి దర్శనానికి, దక్షిణ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన దిగువ నుంచి దర్శన అనంతరం బయటకు పంపించారు. ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద నాలుగు లైన్లలో ర్యాంపులు ఏర్పాటు చేసి దర్శనాలు కల్పించారు. సింహగిరిపై అడవివరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలతో తొలి పావంచా వద్ద పెద్ద ఎత్తున కుప్ప ఏర్పడింది. సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. సింహగిరిపై బస్టాండ్లో తీవ్ర రద్దీ నెలకొంది. కొండ దిగువకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. అలాగే కొండ దిగువ పాతగోశాల జంక్షన్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తొలిపావంచా వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం వద్దకు వచ్చిన చాలా మంది భక్తులు తమ బంధువులు కనిపించడం లేదని పోలీసుల సహాయం కోరారు. సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గిరి ప్రదక్షిణ చేసిన చాలా మంది భక్తులు అడవివరంలోని తొలిపావంచా వద్ద మెట్లపై, రహదారి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, పలు కల్యాణ మండపాల హాళ్లలో నిద్రించి, ఆ తర్వాత తమ గ్రామాలకు తరలివెళ్లారు. -
గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం
సాక్షి, పాడేరు: రాష్ట్రంలోనే 7 లక్షల గిరిజన జనాభా కలిగి ఉన్న అతి పెద్ద పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. ఐదు నెలలుగా ప్రాజెక్టు అధికారి లేక పరిపాలన కుంటుపడింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడను ఇన్చార్జి పీవోగా వ్యవహరిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి పీవో లేక గిరిజన సంక్షేమం గాడితప్పుతోంది. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్గా పాడేరు ఐటీడీఏ పీవో పోస్టుకు విశేష అధికారాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల డివిజన్, మండల స్థాయి అఽధికారులు, ఉద్యోగులంతా ఐటీడీఏ పరిధిలోనే పనిచేస్తారు. ఇంత ప్రాధాన్యత గల పాడేరు ఐటీడీఏ పీవో పోస్టు భర్తీలో కూటమి ప్రభుత్వం చేతులేత్తేసింది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు రోజువారి ఐటీడీఏకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఈఏడాది ఏప్రిల్ 21వ తేదిన జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఇన్చార్జి పీవోతోనే మమ అనిపించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీల గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు పాలనపరమైన నిర్ణయాలు తీసుకుని ఐటీడీఏకు ఉన్న అపారమైన నిధులు ఖర్చుపెట్టాల్సిన బాధ్యతలన్నీ ఐటీడీఏ పీవో మీదే ఉంటాయి. పీవోగా పనిచేసిన అభిషేక్ను పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. 8 నెలలుగా గిరిజన సంక్షేమ డీడీ పోస్టు ఖాళీ పాడేరు ఐటీడీఏలో గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టును కూడా కూటమి ప్రభుత్వం 8 నెలలుగా భర్తీ చేయలేదు. పాడేరు సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి (ఏటీడబ్ల్యూవో) ఎల్.రజనిని ఇన్చార్జి డీడీగా వ్యవహరించేవారు. ఆమె ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖలో సాధారణ బదిలీలు జరిగినప్పటికీ ప్రభుత్వం పాడేరు డీడీ పోస్టును భర్తీ చేయలేదు. కొత్త డీడీ నియామకం లేకపోవడంతో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పాడేరు ఏటీడబ్ల్యూవో ఇక్కడ నుంచి రిలీవ్ అవ్వలేదు. 8 నెలగా డీడీ పోస్టు ఖాళీగా ఉండడంతో పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యకు సంబంధించిన ఆంశాలు పెండింగ్లో ఉండిపోతున్నాయి. పాడేరు ఐటీడీఏ పీవోతోపాటు గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టును భర్తీ చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఏప్రిల్లో జరిగిన పాలకవర్గ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. కొన్ని గిరిజన ప్రజా సంఘాల నేతలు మంత్రిని కలిసి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది ఐదు నెలలుగా ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీ గిరిజన సంక్షేమ డీడీ పోస్టుదీ అదే పరిస్థితి ఇన్చార్జి అధికారుల పాలనతో సంక్షేమానికి ఇబ్బందులు రెగ్యులర్గా సమస్యలు చెప్పుకోలేకపోతున్న గిరిజనులు ఐటీడీఏ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు పాడేరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోతో పాటు గిరిజన సంక్షేమ డీడీని ప్రభుత్వం నియమించకపోవడంతో ఇబ్బందిగా ఉంది. గిరిజనులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణలో గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. పెద్ద ఐటీడీఏలో ప్రధాన అధికారుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం తగదు. వెంటనే పీవో, డీడీలను నియమించాలి. – పొద్దు బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఏయూను సందర్శించిన ఐసాయ్ ప్రతివిధులు
మద్దిలపాలెం: ఐసాయ్(ఈఐఎస్ఏఐ) గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(టోక్యో) మకోటో హొకెట్సు, ఇతర ప్రతినిధులు ఏయూను గురువారం సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ విభాగాల ఆచార్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐసాయ్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. వీసీ మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని విధాలా జీసీసీకి అనుకూలమన్నారు. ఏయూ తరఫున ఒక కోఆర్డినేటర్ను నియమిస్తామని తెలిపారు. ఇంటర్న్షిఫ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో ఐసాయ్ మేనేజింగ్ డైరెక్టర్ కియో టోడా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గిరీష్ దీక్షిత్, సంస్థ తరఫున ఐటీ ఇండియా హెడ్ జోసఫ్ కిరణ్ కుమార్, ఆచార్య శశి, డీన్ ఔట్రీచ్ ఆచార్య కె.రమసుధ తదితరులు పాల్గొన్నారు. -
చాతుర్మాస్య మహావ్రతం ప్రారంభం
● కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామిజీ ఆశ్రమంలో సందడి ● పలు జిల్లాల నుంచి హాజరైన సాధువులు ● దేవానంద స్వామీజి సమాధిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం బూడిదేవరాపల్లి : కొత్తపెంటలోని సద్గురు దేవానంద సరస్వతీ స్వామీజీ ఆశ్రమంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని చాతుర్మాస్య మహావ్రతం పూజలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ చాతుర్మాస్య మహావ్రత ఆధ్యాత్మిక కార్యక్రమం నవంబర్ 5 (కార్తీక పౌర్ణమి) వరకు సుమారు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవానంద స్వామీజీని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సాధు సత్పురుషులు, పీఠాధిపతులు హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. దేవానంద స్వామీజీని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకొన్నారు. సద్గురు దేవానంద స్వామీజీ వారి 25వ పుణ్యతిథి రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వ్రత కాలంలో ప్రతి రోజు పూజా కార్యక్రమాలు, భగవద్గీత పారాయణం, పఠనలు, ప్రవచనాలు, ధ్యానధారణలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దివ్య జీవన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. -
అదనపు సీట్లు కేటాయించాలని వినతి
పాడేరు : కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్, గిరిజన గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు కేటాయించి దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి ప్రవేశం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏలో ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు ఎస్ఎఫ్ఐ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. టెన్త్లో 60శాతం పైబడి మార్కులు వచ్చిన వారికే గిరిజన గురుకులాలు, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్లో ప్రవేశం కల్పించాలనే నిబంధన వలన చాలా మంది పేద విద్యార్థులు అడ్మిషన్ కోల్పోయారన్నారు. గిరిజన ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం కావడంతో ప్రాథమిక విద్యా దశ నుంచి మెరుగైన విద్య బోధన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫలితంగా విద్యార్థులకు 60 శాతం పైబడి మార్కులు రావడం లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి గిరిజన గురుకుల కళాశాల, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రతి గ్రూపునకు అదనంగా 20 సీట్లు కేటాయించాలని కోరారు. గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. అనంతరం వారు ఐటీడీఏ పీవోకు సమస్యపై వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు కార్తిక శ్రీను, కార్యదర్శి జీవన్ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు తదితరులున్నారు. -
వానొస్తే గొడుగుడుగుంచం!
బడిలో ఆటల సమయంలో చిన్నారులు గుడుగుడు గుంచం ఆడడం చూస్తుంటాం.. కానీ ఈ చిన్నారులు వానొస్తే నిత్యం ‘గొడుగు’డుగుంచం అంటూ అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తడిచిముద్దయిపోతున్నారు. ఈ చిత్రంలో కనిపించేది ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ ముక్కిపుట్టులో ఎంపీపీ పాఠశాల. ప్రస్తుతం ఈ బడిలో 27 మంది పిల్లలు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో తల్లిదండ్రులు నిర్మించిన ఈ చిన్న రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు కారిపోతోంది. ఫలితంగా పిల్లలు ఇలా గొడుగులు పట్టుకుని కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గోడలు లేకపోవడంతో పక్క నుంచి పడే జల్లు వానకు తడిచి ముద్దవ్వాల్సిందే. గ్రామస్తులు షెడ్డుపైన టార్పాలిన్లు కప్పినా ఫలితం లేదు. నేలంతా బురదమయమవుతోంది. గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో విద్యావలంటీర్తోనే పాఠశాలను నడిపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చత్వారం సోకిన సర్కారు ఈ ఛత్రాలు చూసైనా చలించకపోతుందా అని నిరీక్షిస్తున్నారు. పక్కా భవనం నిర్మించడంతోపాటు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు. – ముంచంగిపుట్టు -
చిత్తశుద్ధి నిల్
ప్రచారం ఫుల్..జి.మాడుగుల: రచ్చపల్లి గ్రామంలో గల పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఈ పాఠశాలలో 20మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం ఉదయం పేరెంట్, టీచర్స్ ఆత్మీయ సమావేశం ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా విద్యార్థులు, తల్లిదండ్రులు లేచి పాఠశాల భవనం శిథిలమైందని, కొత్త భవనం కావాలని నినాదాలు చేశారు. పాఠశాలను పురాతన భవనంలో నడుపుతున్నారని, ఇది నేలకూలటానికి సిద్ధంగా ఉందని, పాఠశాలకు తమ పిల్లలను చదువుకు పంపించటానికి భయపడుతున్నామని తెలిపారు. వర్షంలోనే పేరెంట్స్ మీటింగ్ జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వర్షంలోనే సమావేశం నిర్వహించటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గొడుగులు వేసుకొని నిల్చొని ప్రసంగాలు ఆలకించారు. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. ఇంత అవస్థ పెట్టి సమావేశాలు నిర్వహించి, ఏం సాధించారని పలువురు కోపంతో వ్యాఖ్యానించడం కనిపించింది. చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతారా అని నిరసన వ్యక్తం చేశారు. సీఆర్టీని నిలదీసిన భూసుకొండ గ్రామస్తులు సీలేరు: ఉపాధ్యాయులు లేని మెగా పేరెంట్ మీటింగులు ఎందుకని దుప్పులవాడ పంచాయతీ భూసుకొండ గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను నిలదీశారు. గురువారం జరిగిన పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో గందరగోళం చోటు చేసుకుంది. పాఠశాల పునఃప్రారంభించి నెల రోజులవుతున్నా ఇప్పటికీ బడి తెరవలేదని, ఉపాధ్యాయుడిని నియమించకుండా పేరెంట్స్ మీటింగ్ ఎందుకని మండల సీఆర్టీని నిలదీశారు. ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి.. ఉపాధ్యాయుడిని నియమించాకే ఈ సమావేశం నిర్వహించాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక సమావేశాన్ని నిర్వహించకుండా అధికారులు వెనుతిరిగారు. సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకు..? పాడేరు : విద్యాలయాల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించడం వలన ఉపయోగం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాలను ప్రశ్నించారు. పాడేరు పట్టణంలోని కుమ్మరిపుట్టులో పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను వేదిక పైకి ఆహ్వానించకుండా అగౌరవపరచారని నిరసన వ్యక్తమైంది. నేటికీ సొంత భవనాలు నిర్మించకుండా పాడేరు గిరిజన గురుకుల పాఠశాలలో పాడేరు, హుకుంపేట ఏకలవ్య పాఠశాలల నిర్వహణతో విద్యార్థినులకు వసతి, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సరిపడ మరుగుదొడ్లు, గదులు లేవన్నారు. మెనూ ప్రకారం ఆహారం వడ్డించడం లేదన్నారు. గతంలో విద్య బోధన బాగుండేదని ఏడాది కాలంగా బోధన తీరు సక్రమంగా లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. విద్యార్థులను బయట కూర్చోబెట్టి పాడేరు, హుకుంపేట ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే ఒక గదిలో కూర్చోబెట్టి పేరెంట్స్ మీట్ మమా అనిపించారు. వర్షంలో తడుస్తూ.. పాడేరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్లో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో మధ్యాహ్నం కురుస్తున్న చిన్నపాటి వర్షంలో తడుస్తూ పశువులు సంచరిస్తున్న చోట విద్యార్థినులు ఆరుబయట భోజనాలు చేశారు.సీలేరు: జి.కె.వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో సీఆర్టీని నిలదీస్తున్న గ్రామస్తులుజిల్లాలో పలుచోట్ల మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రసాభాసగా సాగింది. జి.కె.వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో ఉపాధ్యాయులు లేని మెగా పేరెంట్ మీటింగులు ఎందుకని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను నిలదీశారు. గ్రామంలో ఇప్పటికీ బడి తెరవలేదని, ఉపాధ్యాయుడిని నియమించలేదని నిలదీశారు. జి.మాడుగుల మండలం రచ్చపల్లి గ్రామంలో గల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేశారు. పాడేరులో జరిగిన పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమావేశాల్లో కూడా సమస్యలపై నిరసన వ్యక్తమైంది. జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వర్షంలోనే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించటంతో ఇబ్బందులు పడ్డారు. పాడేరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు చిన్నపాటి వర్షంలో తడుస్తూ పశువులు సంచారిస్తున్న చోట ఆరుబయట భోజనాలు చేశారు. మెగా పేరెంట్స్ మీటింగ్లలోసమస్యలపై తల్లిదండ్రుల నిరసనలు టీచర్ లేని, పాఠశాల తెరవని చోట సమావేశమెందుకని నిలదీత పలుచోట్ల వర్షంలోనే తల్లిదండ్రుల సమావేశాలు.. విద్యార్థుల అవస్థలు విద్యాభివృద్ధికి పెద్దపీట సాక్షి, పాడేరు: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సమగ్రశిక్ష గురువారం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2900 పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ తల్లిదండ్రులంతా తమ పిల్లలను బడులకు పంపాలని, పిల్లల చదువులు.వారి అభిరుచులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థినులకు గ్రీన్ పాస్పోర్టులో భాగంగా కలెక్టర్, ఎస్పీలు మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్ సౌర్యమన్పటేల్ మధ్యాహ్న భోజనం చేశారు. డీఈవో పి.బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ రజని, ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, పాఠశాల హెచ్ఎం ఎస్.సింహచలం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
గిరి విద్యార్థుల ఆశలకు విఘాతం
చింతపల్లి: గిరిజన విద్యార్థుల అశనిపాతంలాంటి వార్త.. వారి బంగారు భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తూ చింతపల్లిలోని సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం (2025–26) నుంచే ప్రవేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తున్నారు. దశాబ్దన్నర కాలం క్రితం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పారు. ఉత్తరాంధ్రకు మూడు మంజూరు కాగా అందులో ఏజెన్సీలో ప్రారంభించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఇదొక్కటే. మన్య ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా భావించిన అధికారులు 2011లో చింతపల్లిలో ఉన్న ఎన్జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ప్రారంభం నుంచి 30మంది విద్యార్థులతో 2024–25 విద్యాసంవత్సరం వరకూ 14 సంవత్సరాలపాటు నిర్విరామంగా కొనసాగింది. దీనిని రాష్ట్రంలోనే ఏకై క సేంద్రియ వ్యవసాయ కళాశాలగా 2014–15 సంవత్సరంలో మార్పు చేశారు. గడిచిన 14 ఏళ్లుగా ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఈ కళాశాలలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అగ్రిటెక్లో ప్రతి ఏడాది అగ్రస్థానం చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు గడిచిన ఐదేళ్లుగా మొదటి ర్యాంకులను సాధిస్తున్నారు. ఇక్కడ కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కలిగిన విద్యతోపాటు అన్ని రకాలైన ప్రయోగాలతో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో ఈ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. 40 లక్షలతో అత్యాధునిక విద్యా సౌకర్యాలు ఈ కళాశాలలో విద్యార్థుల కోసం రూ.40 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన విఽశాలమైన పాఠశాల గదులు, డిజిటల్ బోర్డులు, ప్రయోగశాలలు, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గిరి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ కళాశాలను.. ప్రవేశాలు ఆశించినంత లేవని కుంటిసాకు చూపుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించడాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని జీవో విడుదల -
ఇది మరో ‘మెగా’ మోసం
అరకులోయ టౌన్: మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఏమి సాధించారని, మెగా మోసంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యార్ధులకు వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇలాంటి సమావేశం నిర్వహించడం హస్యస్పదం అన్నారు. పేరెంట్స్ మీటింగ్ రోజు కూడ మెనూ ప్రకారంగా సరైన భోజనాలు పెట్టలేని స్థితితో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్రతీ పాఠశాలలో భోజనాలు బాగోలేదని, మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, నీటి కొరత తీవ్రంగా ఉందని పేరెంట్స్ నిలదీసే స్థితి ఏర్పడిందన్నారు. జగనన్న పాలనలో నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తే అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వాటిని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు విధ్యనభ్యశిస్తుంటే అంత మంది తల్లుల ఖాతాలో ఏడాదికి రూ. 15వేల జమ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రస్తుతం కుంటి సాకులతో అరకొరగా తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. నాడు–నేడు రెండవ ఫేజ్ కింద పాఠశాలలకు నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. పాఠశాలలు పునర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఉపాద్యాయులు లేని పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా ఉపాద్యాయుల్ని నియమించలేదని, దీంతో విద్యార్ధులు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, మండల పార్టీ ఉపాధ్యాక్షులు పల్టాసింగి విజయ్ కుమార్, ప్రకాష్ పాల్గొన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
● అనుమానమే కారణం అడ్డతీగల: వంగలమడుగులో గురువారం మడకం విజయకుమారి (45) అనే మహిళను ఆమె భర్త మడకం జోగిదొర విచక్షణరహితంగా కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. తెల్లవారుజాము సమయంలో మంచంపై పడుకుని ఉన్న విజయకుమారిని కత్తితో తలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలోని దుశ్చర్తి పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడు అనుమానంతోనే భార్యను చంపాడని బంధువులు, గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
గోదావరికి వరద పోటు
ఎటపాక: గోదావరికి వరద పోటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి క్రమేపీ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదలటంతో శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద 37 అడుగులకు చేరుకోవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద గోదావరి నదికి చేరుతుండటంతో మండలంలోని తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగులకు గోదావరి వరద పోటెత్తింది. మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు పడుతుండటం, ఎగువ ప్రాజెక్టులు నిండుతుండటం, ఇటు శబరి, తాలిపేరుకి వరద ప్రవాహం పెరుగుతున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో గోదావరికి వరద పోటు మరింత ఎక్కువ కానుందన్న సమాచారంతో ముంపు మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చింతూరు: ఎగువన తెలంగాణ నుంచి వస్తున్న వరద నీటి కారణంగా గోదావరి, శబరి నదులు పెరిగే అవకాశమున్నందున నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలంలో 37 అడుగుల వరకు వరద నమోదయ్యే అవకాశముందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.భద్రాచలం వద్ద 25.8 అడుగులకు చేరుకున్న నీటిమట్టం -
స్వర్ణాంధ్ర సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి, పాడేరు: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు, పర్యాటకం, మహిళా శిశుసంక్షేమం, పేదరిక నిర్మూలన తదితర ఆంశాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షిస్తారని, అధికారులంతా సమగ్ర వివరాలతో సమావేశానికి రావాలన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఇద్దరు మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
హైడ్రోపవర్ ప్రాజెక్ట్లు వద్దేవద్దు
మహారాణిపేట (విశాఖ): అనంతగిరి మండలం గుజ్జలి, చిట్టంవలసలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు నెలకొనడమే కాకుండా పర్యావరణం, రైతులకు నష్టం జరగనున్న దృష్ట్యా ప్రాజెక్టుల సర్వే నిలిపివేసి, అనుమతులను తక్షణమే రద్దు చేయాలని తీర్మానించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతగిరి జెడ్పీటీసీ (సీపీఎం) డి.గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం చట్ట విరుద్ధమన్నారు. వీటివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గిరిజన చట్టాలను ఉల్లంఘించడంతోపాటు 1/70 చట్టాన్ని తూట్లు పొడినట్టే అన్నారు. ప్రాజెక్ట్ల ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన గ్రామసభలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రైవాడ జలాశయం నీరు కూడ కలుషితం అవుతుందని, దీనివల్ల ఇటు రైతులు అటు విశాఖ నగరానికి తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ల వల్ల గిరిజనులకు ఎంతోనష్టం జరుగుతుందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. దీనిపై ఏఎస్సార్ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వైఎస్సార్సీపీ సభ్యులు ఈర్లె అనురాధ, చెట్టి రోషిణి, కె.నూకరాజు, సన్యాసిరాజు, ఎంపీపీ బి.రమేష్బాబు, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు తదితరులు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం విరమించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉచిత విత్తనాలు అందించాలని, రైతు భరోసాకు సంబంధించి రైతుల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు తగ్గడానికి కారణాలు తెలియజేయాలని పలువురు సభ్యులు కోరారు. గిరిజనులకు కేజీహెచ్లో సరియైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు అందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు అందజేస్తే విచారణ చేస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్హరేందిర ప్రసాద్ చెప్పారు. కేజీహెచ్లో ఎస్టీ సెల్ కూడా బాగా పనిచేస్తున్నందున ఈ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సూచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంబులెన్సులు తక్కువగా ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై ఏఎస్సార్ జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ స్పందిస్తూ సీఎస్సార్ నిధులు వెచ్చించి అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ గిరిజన ప్రాంత వైద్యశాలల్లో వైద్యనిపుణులు అందుబాటులో లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీరిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. అరకు జెడ్పీటీసీ చెట్టి రోషిణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభించి నెల రోజు లు కావస్తున్నా ఉపాధ్యాయులు రాకపోవడం బాఽ దాకరమన్నారు. సంఘ సమావేశాలు, సర్వ సభ్య సమావేశాలు వేర్వేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరగా అందుకు జెడ్పీ చైర్పర్సన్ అంగీకరించారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వ హణాధికారి, కె.రాజ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు చాలా నష్టం తక్షణమే సర్వే నిలిపివేసి, అనుమతులు రద్దుచేయాలి పలువురు సభ్యుల డిమాండ్ ఉమ్మడి విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్లకార్డులతో నిరసన సభ్యుల సూచన మేరకు ప్రాజెక్ట్ల రద్దుకు తీర్మానం -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ’ నిర్వహణ ఇప్పుడు ఉపాధ్యాయులకు తలపోటుగా మారింది. సమావేశాల కోసం కనీసం రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర హైరానా ప
సాక్షి, పాడేరు : మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ నిర్వహణ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలను గురువారం అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినప్పటికీ నిధుల సమస్య నెలకొంది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రియల్ టైమ్ గ్రేస్ పేమెంట్ కింద నిధులు జమ అవుతాయని ఉపాధ్యాయులు భావించారు. అయితే బుధవారం సాయంత్రం వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు. ప్రతీ పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.6నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతుంది. సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్,టీ, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటన్నింటిని ఉపాధ్యాయ వర్గాలు కొనుగోలు చేశాయి. అలాగే టెంట్లు, కుర్చీలను కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖర్చులు అధికంగా ఉంటుండడంతో ఆ సొమ్మంతటిని ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థికంగా నష్టపోతామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో వార్డెన్లు, మేట్రిన్లకు కూడా చేతిచమురు వదిలేటట్టు లేదు. తల్లిదండ్రుల సమావేశాలతో ఉపాధ్యాయులు హైరానా పడుతున్నారు. జిల్లాలోని 2,895 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వతరగతి వరకు 1.70 లక్షల మంది, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్టు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. మౌలిక సౌకర్యాలను పక్కనబెట్టి.. మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులకు తలనొప్పి తెస్తోంది. బడులు తెరిచి నెల రోజులు కావస్తున్నా ఏ పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో యూనిఫామ్, షూస్, బెల్ట్లు, పుస్తకాలు అందించలేదు. కొద్ది మందికి యూనిఫామ్స్ మాత్రమే అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఇప్పటికే వివిధ కారణాలతో తల్లికి వందనం ఆపేయడంతో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు చదువు కన్నా ప్రచార ఆర్భాటాల కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మొన్న యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు చదువులకు దూరం అయ్యారని, ఇప్పడు పనికి రాని మీటింగ్లతో వారం రోజలు చదువులు చెప్పడం లేదని వారు వాపోతున్నారు. మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ నిర్వహణకు నిధుల కొరత ఆర్భాటంగా నిర్వహించాలని ఆదేశాలు ఉపాధ్యాయులకు తప్పని చేతిచమురు నిధులు ఊసెత్తని కూటమి సర్కారు -
వైద్యం అందక బాలుడి మృతి
ఎటపాక: పీహెచ్సీలో వైద్యులు లేక సకాలంలో వైద్యం అందక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం లక్ష్మీపురం పీహెచ్సీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...బండిరేవు గ్రామానికి చెందిన నూపా రాజేష్ కుమారుడు జయదేవ్(6) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే బుధ వారం సాయంత్రం బాలుడికి వాంతులు, ఫిట్స్ రావడంతో సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్సీకి తీసుకువెళ్లారు. ఆసమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం, సిబ్బంది ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆమె సూచనల మేరకు బాలుడికి వైద్యం చేసినట్లు తెలిసింది.ఈక్రమంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో 108కు సమాచారం ఇచ్చారు.అయితే మండలంలో 108 సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో పక్క మండలం నుంచి వాహనం వచ్చే సరికి బాలుడు మృతి చెందాడు. రెండు గంటల పాటు ఆస్పత్రిలోనే ఉంచారని సకాలంలో వైద్యం అందించి ఉంటే బాలుడు బతికేవాడని బాధితులు రోదించారు. -
కార్మికులు, ప్రజాసంఘాల బంద్ ప్రశాంతం
పాడేరు : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో విజయవంతమైంది. సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కార్మికులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ బజార్, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ సందర్భంగా కార్మికలోకానికి నష్టం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలిపారు. ఐటీడీఏ ఔట్ గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎంజిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స, ఏఐటీయూ జిల్లా నేత సాయి శంకర్, మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి లింగేరి సుందర్రావు, అంగన్వాడీ వర్కర్స్ ఆండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్మిక సంఘ నేతలు అప్పారావు, అర్జున్, కో ఆపరేటివ్ బ్యాంకు కార్మిక సంఘం నాయకులు అప్పలనాయుడు, జాతీయ కాఫీ రైతుల సంఘం నేత పాలికి లక్కు, ఎస్ఎఫ్ఐ నాయకులు జీవన్, కార్తిక్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు ధామోదర్, సింహాచలం, సెక్యూరిటీ యూనియన్ నాయకులు చంటిబాబు, పలు కార్మిక సంఘాల నేతలు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అరకులోయ టౌన్: కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం మెడలు వంచైనా వాటిని రద్దు చేయిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి. ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం దేశ వ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు మండలంలోని గిరిజన మ్యూజియం, పెట్రోల్ బంక్లు, పర్యాటక యూనిట్లు, సోఫ్ యూనిట్, పద్మావతి ఉద్యానవనం, కాఫీ హౌస్లు మూసి వేసి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. గిరిజన మ్యూజియం వద్ద జరిగిన సమావేశం అనంతరం ప్రధాన రహదారిలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్రామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి రామారావు, అంగన్వాడీ, టూరిజం, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, సో్ప్ యూనిట్ కార్మిక సంఘ ప్రతినిధులు వెంకటలక్ష్మీ, నాగమ్మ, దాడి రాజు, రఘు, ధర్మ, అభిన, దామోదర్, సింహాద్రి, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు చింతపల్లి: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చింతపల్లి యూనియన్ బ్యాంకు ఉద్యోగులు బుధవారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఏఐబీఈఏ యూనియన్ నాయుకులు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనడం జరిగిందని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటేష్, ఉదయ్ శంకర్, సూర్యకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ అరకులో మూతబడిన రిసార్ట్లు -
తెరపల్లి క్వారీపై గనులశాఖకు నివేదిక
చింతపల్లి: మండలంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న తెరపల్లి తెల్లరాయి క్వారీపై 36 అంశాలతో కూడిన నివేదికను గనులశాఖకు సమర్పించనున్నట్టు తహసీల్దారు టి.రామకృష్ణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెరపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిర్వహించిన సభలో గ్రామస్తులు క్వారీ నిర్వాహకులు వైఖరిని వివరించారన్నారు. ఇందులో భాగంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ వ్యర్థాలను తమ పంట పొలాల్లో పడేస్తున్నారని దానికి ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదని, అనేకమంది అనారోగ్యం పాలవుతున్నట్టు గ్రామానికి చెందిన రాములమ్మ పఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 5న తెరపల్లిలో తెల్లరాయి క్వారీని రెవెన్యూ,పోలీసులు సందర్శించి లోతుగా పరిశీలించినట్టు చెప్పారు.ఈ క్యారీకి 4.2 ఎకారాల్లో తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు మంజూరు చేయగా అనధికారికంగా మరో 15 ఎకరాల్లో ఈ క్వారీ తవ్వకాలు చేపడుతున్నట్టు పరిశీలనలో తేలిందన్నారు. గనులశాఖ అనుమతులు పాటించకుండా ఈ తవ్వకాలు జరుగుతున్న అనేక అంఽశాలను గ్రామస్తులు వివరించినట్టు ఆయన చెప్పారు. గ్రానైట్ క్వారీలో గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని, భూములిచ్చిన గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించాలని, పంచాయతీ పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, క్వారీలో పనిచేస్తున్న కార్మికులకు బీమా చేయించాలని, క్వారీ వద్ద వైద్యాధికారిని అందుబాటులో ఉంచాలని నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ నివేదికను గనులుశాఖకు పంపుతున్నట్టు తెలిపారు. -
సీఎస్పీల్లో అక్రమ వసూళ్లపై ఫిర్యాదు
ముంచంగిపుట్టు: ప్రైవేట్ వ్యక్తులు కొనసాగిస్తున్న కస్టమర్ సర్వీసు పాయింట్ వద్ద వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు గిరిజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీను, నేతలు నరసింగరావు పడాల్, గాసిరందొర, నారాయణలు అన్నారు. మండలంలో ఉన్న చాలా సీఎస్పీ కేంద్రాల వ్యక్తులు పేమెంట్లులో కోత, విత్డ్రాల్లో మోసాలపై బుధవారం గిరిజన సంఘం మండల నేతలు ఎస్బీఐ, ఏపీజీవీబీ బీఎంలు కె.శ్రీనివాస్, పి.సురేష్కుమార్లను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎస్పీల వద్ద జరుగుతున్న మోసాలను వివరించి, అరికట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ సీఎస్పీ కేంద్రాలు అక్రమ వసూలు, మోసాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. పలు పథకాల సొమ్ములు ఖాతాల్లో జమ అయ్యాయని, వాటిని తీసుకునేందుకు సీఎస్పీ కేంద్రాలకు వెళ్తున్న వినియోగదారులు మోసాలకు గురవుతున్నారన్నారు. వెయ్యి రూపాయలు విత్డ్రా చేస్తే 10 నుంచి 30 వరకు కోతవిధిస్తూ అక్రమ వసూలు చేస్తున్నారన్నారు. ఎన్ని వేలు తీసుకుంటే అన్ని వేలకు రూ.30 చొప్పున ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పాటు మారుమూల గిరిజనులు డిజిటల్ పేమెంట్ల మీద అవగాహన లేని వారికి ఖాతాల్లో భారీగా మోసాలు చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే సీఎస్పీ కేంద్రాల వద్ద ఇలాంటి మోసాలు, అక్రమ వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డియాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ దినేష్కుమార్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్టు నేతలు తెలిపారు. దీనికి స్పందించిన బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ సీఎస్సీ కేంద్రాల వద్ద పేమెంట్లకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, మోసాలు బారిన పడే కస్టమర్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
అప్పన్నను స్మరిస్తూ..
అడుగులో అడుగేస్తూ..సైడ్ లైట్స్● గిరి ప్రదక్షిణ ప్రారంభించేందుకు ఉదయం 6 గంటల నుంచే భక్తులు సింహాచలం చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభం సమయానికి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు బీఆర్టీఎస్ రోడ్డులో కిక్కిరిశారు. ● ఉదయం 6 గంటలకే గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పలువురు భక్తులు సాయంత్రానికే తిరిగి సింహాచలం చేరుకున్నారు. వారందరికీ రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనాలు అందజేశారు. ● సాయంత్రం 4 గంటల నుంచి తొలిపావంచా వద్ద భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ● తొలిపావంచా వద్దకు వెళ్లలేని భక్తులు రోడ్లపైన, బీఆర్టీఎస్ రోడ్డును ఆనుకుని ఏర్పాటుచేసిన గోడపైన కొబ్బరికాయలు కొట్టారు. దీంతో తొలిపావంచా వద్ద రోడ్డుపైనే కొబ్బరికాయచెక్కల కుప్ప పెద్ద ఎత్తున ఏర్పడింది. ● భక్తులు కొట్టిన కొబ్బరి చెక్కలు తరలించేందుకు క్రేనులు, లారీలు ఏర్పాటు చేశారు. ● భక్తులు రోడ్లపై కొబ్బరికాయలు కొట్టేయడంతో తొలిపావంచా వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● దేవస్థానం బస్టాండ్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వాళ్ల బంధువులు అక్కడికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. ● తొలిపావంచా ఎదురుగా మధ్యాహ్నం నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున నిలపడంతో.. అక్కడకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● పారిశుధ్య నిర్వాహణలో జీవీఎంసీ దారుణంగా విఫలమైంది. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటి చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తిన జీవీఎంసీ సిబ్బంది.. సాయంత్రం భక్తుల రద్దీ పెరిగేసరికి చేతులెత్తేశారు. మేయర్, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడిక్కడే చెత్త పేరుకుపోయింది. ● 32 కిలోమీటర్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మరో పది కిలో మీటర్లు అదనంగా నడిచిన భక్తులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. ● గిరి ప్రదక్షిణలో మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు ఏఐ ట్యాగ్లు వేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని అమలు చేయగా, ఈ ఏడాది కూడా అధికారులు కొనసాగించారు. తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో పులివేషాలు, తప్పెటగుళ్లు, కేరళ డ్రమ్స్, కాళీ వేషాలు విశేషంగా అలరించాయి. స్వచ్ఛంద సంస్థల సాయం గిరి ప్రదక్షిణని పురస్కరించుకుని కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల కొండచుట్టూ 30 ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్ స్పెషాల్టీ వైద్య బందాలు అందుబాటులో ఉంచి భక్తులకు వైద్య సేవలు, మందులు అందజేశారు. జీవీఎంసీ 109 ప్రదేశాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో తాగునీరు అందుబాటులో ఉంచింది. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, స్నాక్స్, పానియాలు అందజేశాయి. 32 కి.మీ కాదు.. 44 కి.మీ. నడిచారు వీఐపీ, వీవీఐపీ వారిపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై లేదంటూ పోలీసులపై, ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు నేరుగా తొలి పావంచా వద్దకు అనుమతించి.. సామాన్య భక్తుల వాహనాలను మాత్రం ఐదారు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. దీంతో తొలిపావంచా వరకు నడిచి.. అక్కడి నుంచి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి.. మళ్లీ వాహనాల కోసం ఐదారు కిలోమీటర్లు నడిచి.. వాహనాల వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. దీంతో దాదాపు 44 కిలోమీటర్లకు వరకు భక్తులు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ పేజీ తరువాయి -
గిరి ప్రదక్షిణకు వెళుతూ ప్రమాదం
సబ్బవరం : మండలంలోని పినగాడి–కోటపాడు రోడ్డులో అయ్యన్నపాలెం వద్ద బుధవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కేజీహెచ్కు తరలించారు. స్థానిక పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు స్నేహితులంతా (చెవిటి, మూగవారు) కలిసి సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరంతా మురళీనగర్లోని ‘గ్రోత్ ఇన్స్టిట్యూట్ ట్రైనీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ’లో శిక్షణ పొందుతున్నారు. మురళీనగర్ నుంచి ఆటోలో సబ్బవరంలోని అయ్యన్నయ్య పాలెం వద్ద ఉన్న రైవాడ కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానమాచరించిన అనంతరం ఇన్స్టిట్యూట్ వెళ్లి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆటోలో వస్తుండగా, అయ్యన్నపాలెం సమీపంలో రోడ్డుపై పాము కనిపించింది. పామును తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎస్. శాంతి(22) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. గాయపడిన ఇతర స్నేహితు లు విజయనగరం ప్రాంతానికి చెందిన కె. రాజ్యలక్ష్మి, కె. ధనలక్ష్మి, విశాఖ ప్రాంతానికి చెందిన ఆనంద్కుమార్, పరవాడలోని దలైపాలెంకు చెందిన సి.హెచ్. నరేంద్రలను వెంటనే కేజీహెచ్కు తరలించారు. మృతురాలు శాంతి స్వగ్రామం అనంతగిరి మండలం తట్టవలస అని, ప్రస్తుతం ఆమె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. బోల్తాపడిన ఆటో దివ్యాంగురాలి మృతి మరో నలుగురికి గాయాలు -
ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా బందోబస్తు
ఎటపాక: పురుషోత్తపట్నం వెళ్తున్నామన్న ముందస్తు సమాచారం భద్రాద్రి దేవస్థానం అధికారులు తమకు ఇవ్వలేదని చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పురుషోత్తపట్నంలో మంగళవారం జరిగిన ఘటనపై స్పందించారు. దేవస్థానం భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇటువంటి ఘటనలు జరగడం సరైందికాదన్నారు.దేవస్థానం ఈవో రమాదేవి తన సిబ్బందితో పురుషోత్తపట్నం వెళ్లిన సమయంలో ఆంధ్రా, తెలంగాణ పోలీసులకు తెలియపర్చలేదన్నారు. గతంలో కూడా అనేక మార్లు పురుషోత్తపట్నం భూముల విషయంలో ఘర్షణలు జరిగాయని, తమకు సమాచారం ఇస్తే తప్పకుండా బందోబస్తుగా వెళ్లేవాళ్లమన్నారు. మంగళవారం జరిగిన ఘటనపై తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఏఎస్పీలతో మాట్లాడినట్టు చెప్పారు. ఎండోమెంట్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ తెలిపారు. దేవస్థానం భూముల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఆంధ్రా పరిధిలోకి వచ్చేటప్పుడు ఇక్కడి పోలీసుల కు ముందస్తు సమాచారం ఇస్తే శాంతి భద్రతల సమస్య లేకుండా చూస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు.చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా -
ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు తప్పనిసరి
ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ పాడేరు : ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయాలని ఐటీడీఎ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో తన చాంబర్లో గ్రామ సచివాలయం, ఐసీడీఎస్, పీఎంయూ అధికారులతో చిన్నారులకు ఆధార్ నమోదు, జనన ధ్రువీకరణ పత్రాల జారీపై సమావేశం నిర్వహించారు.ణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 4765 మంది పిల్లలకు ఆధార్కార్డులు, 3484 మంది చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు నేటికీ లేదన్నారు. ఈ నెలఖరులోగా ఆధార్ లేని చిన్నారులందరికీ ఆధార్ నమోదు పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శులు, వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్లు సమన్వయంతో జనన ధ్రువీకరణ పత్రాల జారీ పూర్తి చేయాలన్నారు. ఆధార్ నమోదుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నగదు వసూలు చేయాలని, అదనంగా ఎక్కడైనా వసూలు చేసినట్లు తమకు సమాచారం అందించే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గ్రామ సచివాలయల నోడల్ అధికారి కుమార్, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా సమన్వయకర్త సునీల్, జి.మాడుగుల ఐసీడీఎస్ సీడీపీవో మణి, పీఎంయూ అధికారి రాజేష్, ఆధార్ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరించండి
చింతపల్లి: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అనూషదేవి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సభ్యులు ప్రస్తావించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీపీ నిలదీశారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలను అధికారులు ిపరిష్కరించకుంటే ఎలా అని నిలదీశారు. చింతపల్లి మండల కేంద్రంతో పాటు తాజంగి, కొమ్మంగి, ఎర్రబొమ్మలు, గొందిపాకలు, తమ్మెంగులు,చౌడుపల్లి పంచాయతీల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతుందని పలువురు సభ్యులు నిలదీశారు. జల్జీవన్ మిషన్ తాగునీటి పథకాల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చొరవ చూపాలన్నారు. తహసీల్దారు రామకృష్ణ మాట్లాడుతూ బయోమెట్రిక్ సమస్యతో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పలు శాఖలు అధికారులు అబివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎంపీడీవో సీతామహాలక్ష్మి, వైస్ ఎంపీపీలు గోపినాయక్ శారద, వెంగళరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దురియా పుష్పలత, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, ఎంఈఓ ప్రసాద్, ఏఓ శ్రీనివాసరావు, ఏఈ ప్రబాకరరావు, ఏపీవో రాజు, సీడీపీవో శ్రీదేవి, హెచ్ఓ బాలకర్ణ, సర్పంచ్లు, ఎంటీటీసీలు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం
● సందర్శించిన మేఘాలయ బృందం సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయంపై మేఘాలయ వ్యవసాయ బృందం అధ్యయనం చేస్తోంది. మేఘాలయ రాష్ట్రానికి చెందిన 30 మంది రైతులు, మహిళా లీడ్ రైతులు, ఫీల్డ్ కోఆర్డినేటర్ల బృందం బుధవారం జిల్లా రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. మేఘాలయ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకున్నారు. పలు గ్రామాల రైతులతో వారు మాట్లాడారు. ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారక మందుల తయారీ, వాటి వినియోగంపై శిక్షణ పొందారు. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం పొందిన మేఘాలయ రైతులు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కూడా ప్రకృతి వ్యవసాయంలో నాణ్యమైన పంటలు పండించి అధిక దిగుబడులు సాధిస్తామని తెలిపారు. మేఘాలయ రాష్ట్ర రూరల్ లైవ్లీహుడ్స్ సొసైటీ, ఏపీ రైతుసాధికార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆక్రమణలను తొలగించకుంటే చర్యలు తప్పవు
కొయ్యూరు: రోడ్ల ఆక్రమణలను స్వచ్ఛంధంగా తొలగించాలని లేనిపక్షంలో తామే తొలగిస్తామని డీటీ కుమారస్వామి స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో బుధవారం వర్తక సంఘం నేతలు, చీడిపాలెం, రాజేంద్రపాలెం సర్పంచ్లు, స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొత్తం సింగవరం,రాజేంద్రపాలెం, కొయ్యూరుకు కలిపి 177మందికి 7ఏ నోటీసులు ఇచ్చామన్నారు. ఇప్పటికే కొందరు ఆక్రమణలు తొలగించారని, అయితే మిగిలిన పూర్తిగా తొలగించాలన్నారు. వర్తక సంఘం నేత చక్రరావు మాట్లాడుతూ రెండు వైపుల 15 అడుగుల చొప్పున తొలగిస్తున్నామని చెప్పారు.దీనిపై పంచాయతీల ద్వారా తీర్మాణాలు చేయించి కలెక్టర్కు పంపిస్తామని, సర్పంచ్లు సహకరించాలని కోరారు. ఈ మేరకు 15 రోజులు గడువు కావాలని వర్తకులు కోరారు. దీంతో ఈనెల 24 వరకు గడువు ఇచ్చారు. అప్పటిలోగా తొలగించకుంటే 6ఏ నోటీసులు ఇచ్చి తామే తొలగిస్తామన్నారు. కొయ్యూరు, రాజేంద్రపాలెం, చీడిపాలెం సర్పంచ్లు మాకాడ బాలరాజు, సింహాచలం, సోమన్నదొరలు పంచాయతీ తీర్మాణాలతో కలెక్టర్ దినేష్కుమార్ను కలిసేందుకు నిర్ణయించారు. చిరు వ్యాపారాలతో పాటు పూటగడవని వారు కష్టాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ను కోరతామన్నారు. -
రహదారుల నిర్మాణం వేగవంతం
జి.మాడుగుల: రహదారుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజె అభిషేక్ గౌడ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలో రూ.440 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న తారురోడ్లు పనులను తనిఖీ చేశారు. రహదారుల నిర్మాణాల్లో తగిన నాణ్యత పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ నెలాఖరుకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో పాలకొండ నుంచి రూడిబయలు వరకు రూ.120లక్షలతో 2.5కిలో మీటర్లు రోడ్డు, కోరాపల్లి నుంచి పెద్దకొండ వరకు రూ.144లక్షలతో 2.6కిలో మీటర్లు రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. వీటితోపాటు పెదకొత్తూరు– సారుబయలు వరకు రూ.80లక్షలతో నిర్మిస్తున్న రోడ్డును, కుడ్డంగి జంక్షన్ నుంచి మునికర్లతోగు వరకు రూ.100లక్షలతో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులకు నాణ్యమైన మెటీరియల్ ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డేవిడ్రాజ్, ఏఈఈ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.పాడేరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ -
సీహెచ్వోలు స్థానిక నివాసం తప్పనిసరి
పాడేరు : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్ ఆఫీసర్స్ (సీహెచ్వో)లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానికంగా నివాసం ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ టి. విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. బుధవారం మండలంలోని గుత్తులపుట్టు, మినుములూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆయా చోట్ల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ద్వారా అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. రోగులకు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఆయా చోట్ల రెండో విడత ఐఆర్ఎస్ 5శాతం స్ప్రేయింగ్ పనులను పర్యవేక్షించారు. పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది ముఖ అధారిత హాజరును వారికి కేటాయించిన కేంద్రాల్లో ఉండి మాత్రమే వేసుకోవాలన్నారు. పీహెచ్సీల్లో వైద్యాధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదన్నారు. అన్ని చోట్ల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. స్థానిక నివాసం లేకపోవడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆరోగ్య విస్తరణాధికారి గుల్లెలి సింహాద్రి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
చింతూరు/వీఆర్పురం: వరదలు సంభవిస్తే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బుధవారం చింతూరు, వీఆర్పురం మండలాల్లో మాక్డ్రిల్ నిర్వహించాయి. వీఆర్పురం మండలం చింతరేగుపల్లిలో వరదనీరు గ్రామాల్లోకి వస్తే అప్రమత్తంగా ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చింతూరు ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్తో కలసి చింతూరు, వీఆర్పురం శబరినది వంతెనలను పరిశీలించారు. వరదలు వస్తే ప్రజలను తరలించేందుకు ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలను కూడా పరిశీలించారు. గ్రామాల్లోకి వరదలు వస్తే వెంటనే ప్రజలను ఇళ్లు ఖాళీచేయించి పునారావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వరదల సమయంలో సమాచారం నిమిత్తం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 8121729228 9490026397 నంబర్లు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. వరదలకు సంబంధించిన ముందస్తు రేషన్ స్టాకును ఆయా పాయింట్లకు తరలించాలని, అన్ని పీహెచ్సీలు, సబ్సెంటర్లలో అత్యవసర మందులు అందుబాటులో వుంచాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, రహదారి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్పురం మండలానికి చెందిన తహసీల్దార్ సరస్వతి, ఎంఈవో లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. -
ఇంటింటికీ కూటమి మోసాలు
భృతి అమలు చేయలేదని విమర్శించారు. ● అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకు వర్తింపకుండా ఎత్తివేశారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిలా వైఎస్ జగన్ పాలనలో వైఎస్సార్సీపీ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడంతోపాటు అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మోసం చేసే చంద్రబాబు కన్నా మడమ తిప్పని నేత జగనన్న అంటే ఈప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టమని.. అందుకే మూడు పర్యాయాలు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిపించారన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎదురులేదన్నారు. ● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ హామీల బాండ్ పేపర్లను ఇంటింటికి పంచిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ● ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో బాండ్లు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమి కాదన్నారు. గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసిన సమయంలో కూడా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని గడగడలాడించిన ధీరుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. ● అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో సూపర్సిక్స్లో ఏఒక్కటీ అమలు చేయలేదన్నారు. 2029లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పార్టీ సైనికులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలని పిలుపునిచ్చారు. ● మాజీ ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ గడచిన ఏడాది కూటమి కాలంలో నష్టపోయిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజల్లోకి వెళితే స్వాగతిస్తుండగా, కూటమి నేతలను నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడాన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీసెల్ ప్రదాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రదాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, విశాఖ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్కుమార్, మాజీ జీసీసీ చైర్మన్ స్వాతిరాణి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, అరకులోయ, డుంబ్రిగుడ జడ్పీటీసీలు శెట్టి రోషిణి, జానకమ్మ, అనంతగిరి, డుంబ్రిగుడ ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి, అరకు లోయ ఆరు మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ పేజీ తరువాయి -
ఏర్పాట్లు ఇలా..
● సింహాచలంలోని తొలిపావంచా వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభిస్తారు. ● అక్కడ భక్తులు కొబ్బరి కాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ● అడవివరం–హనుమంతవాక బీఆర్టీఎస్ మార్గంలో రెండో టోల్గేట్ వద్ద నుంచి ప్రదక్షిణ ప్రారంభించే భక్తుల సౌకర్యార్ధం కొబ్బరికాయలు కొట్టేందుకు 20 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ● 177 శాశ్వత మరుగుదొడ్లకు అదనంగా మరో 500 తాత్కాలిక మరుగుదొడ్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ● వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు షిఫ్ట్కి 640 మంది చొప్పున మూడు షిఫ్ట్లకు 1,920 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. ● ప్రతీ 200 మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 132 తాగునీటి పాయింట్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ● అప్పుఘర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు, హైపవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ● 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్ స్పెషాల్టీ వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. ● 32 ప్రదేశాల్లో 200 వాట్స్ సామర్థ్యం కలిగిన 750 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 9 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. ● నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ● ప్రతీ ఆరు కిలోమీటరుకు ఒక బృందం చొప్పున మూడు షిప్టుల్లో ఆరు బృందాలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ నియమించారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ఒక్కో బృందంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, వైద్య, విద్య, విద్యుత్, రెవెన్యూ, జీవీఎంసీ, ఆర్అండ్బీ, రవాణాశాల అధికారులు, సిబ్బంది ఉంటారు. ● బుధవారం ఉదయం 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ● భక్తులకు అందుబాటులో టోల్ ఫ్రీనెంబరు 1800–4250–0009, 0891–2507225లను ఏర్పాటు చేశారు. ● కొండదిగువ తొలిపావంచా, అడవివరం, పాతగోశాల జంక్షన్, అప్పుఘర్, మాధవధారలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఏర్పాటు చేశారు. ● జోడుగుళ్లపాలెం వద్ద సముద్రస్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ● లుంబిని పార్క్ వద్ద తాత్కాలిక స్నానపు గదులు, టాయ్లెట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో పాఠశాలలు, కల్యాణ మండపాల్లో మొత్తం 14 చోట్ల విశ్రాంతి ప్రాంతాలను గుర్తించారు. ● 10న సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం అన్నప్రసాదంగా అందజేస్తారు. ● ఉచిత, రూ.100, రూ..300 దర్శనాల క్యూలను ఏర్పాటు చేశారు. ● భక్తుల కోసం సుమారు లక్ష లడ్డూలను విక్రయానికి సిద్ధం చేశారు. -
క్షయ నియంత్రణకు కృషి
● డాక్టర్ కిరణ్కుమార్ పెదబయలు: గ్రామ స్థాయిలో క్షయ నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం. కిరణ్కుమార్ అన్నారు. గోమంగి పీహెచ్సీలో ఆశ డే సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షయ వ్యాధి నిర్మూలన, క్షయ ముక్త్ భారత్ అభియాన్ ప్రాముఖ్యతను క్షేత్ర స్థాయి సిబ్బందికి వివరించారు. ప్రధాన మంత్రి మాతృత్వ సురక్షత్ అభియాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెదబయలు, గోమంగి సీహెచ్సీల వైద్యాధికారులు నిఖిల్, చైతన్య, ముంచంగిపుట్టు క్షయ నియంత్రణ సూపర్వైజర్ మూర్తి, సిబ్బంది నాగేశ్దొర, రామరాజు, పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజన యువతి ఆత్మహత్య
మోతుగూడెం : చింతూరు మండలం గొందుగూడెం గ్రామానికి చెందిన కూర జయ(18) అనే గిరిజన బాలిక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు వివరాలను ఎస్ఐ సాదిక్ తెలిపారు. మృతురాలు రంపచోడవరంలో ఇంటర్ చదువుతుంది. మంగళవారం ఇంటికి వచ్చి ఉదయం 8 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లి వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై తల్లిదండ్రులను విచారించగా చదువు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినట్టు తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. మతృదేహాన్ని చింతూరు ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి
రంపచోడవరం: ఏజెన్సీలో ఉద్యాన పంటలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం అన్నారు. మండలంలోని కుంజం వీధి గ్రామంలో వనం–మనం కార్యక్రమంలో మంగళవా రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయ న ప్రారంభించారు. పీవో మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా వనం–మనం కార్యక్రమంలో రైతులను అభివృద్ధి చెందేలా వివిధ రకాలైన ఉద్యాన పండ్ల మొక్కలు గిరిజన రైతులకు అందజేస్తామన్నారు. ఏజెన్సీలో 3,330 ఎకరాల్లో 2,740 మంది గిరిజన రైతులకు ఉపాధి హామీ పథకంలో మొక్కలు అందజేస్తామన్నారు. మొక్కలు సంరక్షణకు ఉపాధి పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, డీఎల్డీవో కోటేశ్వరరావు, సర్పంచ్ చెదల దేవి, ఏపీడీ బి. సత్యనారాయణ పాల్గొన్నారు. ఆర్థికాభివృద్ధికి చర్యలు ఏజెన్సీలో గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ప్రైమరీ సెక్టార్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీతో 550 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కోతుల నివారణ చర్యల్లో భాగంగా ఒక్కొక్క గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా 50 ఎకరాల బయో పెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో జాబితాలో పేర్లు లేని రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13 వరకు ఆధార్, పాస్పుస్తకంతో పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మట్టి నమునాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ షరీప్, ఏడీ గణేష్, ఏడీఏ కేవీ చౌదరి, కె సావిత్రి తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నా.. వస్తున్నాం..
ముస్తాబైన పుష్పరథంసింహాచలం: సింహగిరి ప్రదక్షిణకు సమయం ఆసన్ననమైంది. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వేంజేసిన 32 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం వచ్చింది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుంది. ఈ ఏడాది సుమారు 6 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనా వేశారు. ఈ మేరకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. సింహగిరికి మెట్లమార్గంలో అనుమతి గురువారం కొండపైకి కేవలం మెట్లమార్గంలో మాత్రమే అనుమతి ఇస్తారు. ఆరోజు ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండదిగువకి వచ్చే భక్తులను దేవస్థానం బస్సులు, దేవస్థానం అద్దె చెల్లించిన 50 ఆర్టీసీ బస్సుల్లోను ఉచితంగా చేరవేస్తారు. దర్శన సమయాలు బుధవారం ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదేరోజు రాత్రి చేరుకునే భక్తులకు రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభిస్తాయి. ఆ తర్వాత తిరిగివారికి 10వ తేదీ ఉదయం 5.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శనాలు ఉండవు. తిరిగి సాయత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు లభిస్తాయి. నేడే సింహగిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథం ప్రారంభం రేపు వేకువజాము 3 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణ రేపు ఆలయ ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం 3 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణలకు అనుమతిస్తారు. ఆలయ బాహ్య ప్రకారం చుట్టూ 400 మీటర్ల మేర ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఆలయ ప్రదక్షిణలకు సంబంధించి ఉత్తర రాజగోపురం వద్ద, దక్షిణ రాజగోపురం వద్ద వంతెలను ఏర్పాటు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
అడ్డతీగల : అడ్డతీగల మండలం, తుంగమడుగుల గ్రామ పరిసరాల్లో మంగళవారం గుర్తు తెలియని మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు ఎస్ఐ బి.వినోద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న ఆమెను కొందరు గ్రామస్తులు సమీపంలోని దుప్పులపాలెం పీహెచ్సీకి చికిత్స కోసం పంపించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు డ్యూటీ డాక్టర్ చెప్పారన్నారు. మృతురాలి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చన్నారు. ఎర్రచారలు కలిగిన చీర ధరించి ఉందన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగుతూ ఉందని చుట్టుపక్కల వారి చెప్పి ఉన్నారన్నారు. రోడ్డు ప్రమాదం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అడ్డతీగల : అడ్డతీగల మండలం భీముడుపాకలు బోడకొండమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించడం జరిగిందని సీఐ బి.నరసింహమూర్తి తెలిపారు. మృతుడు సుమారు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఉండి మృతుని శరీరంపై పసుపు రంగు డిజైన్ షర్టు, నీలం రంగు ఫ్యాంటు ధరించి కాళ్లకు నలుపు రంగు కలిగిన చెప్పులు కలిగి ఉన్నాడన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పైన పేర్కొన్న గుర్తులతో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టినట్టయితే అడ్డతీగల సీఐ 9440900768, ఎస్ఐ 9440900769 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మలేరియాతో చిన్నారి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ లంగాబపోదోర్ గ్రామానికి చెందిన కొర్ర రంజిత(6) కొద్దిరోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతూ పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందింది. రంజిత కొద్దిరోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతోంది. సోమవారం వైస్ఎంపీపీ భాగ్యవతి, గ్రామస్తులు చొరవతో ఆమెను లబ్బూరు పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చనిపోయింది. వైద్యులు, సిబ్బంది చెప్పినట్టుగా సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే మా కుమార్తె బతికి ఉండేదని తల్లిదండ్రులు శంకర్రావు, బుధోయ్ రోదించారు. బాలిక మృతదేహాన్ని మంగళవారం ఉదయం అంబులెన్స్లో లంగాబపోదోర్ గ్రామానికి తరలించారు. ఇలావుండగా ఇదే గ్రామంలో మరికొంతమంది చిన్నారులు జ్వరాలు, దగ్గు తదితర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిని గమనించిన వైస్ ఎంపీపీ భాగ్యవతి, మండల వైఎస్సార్సీపీ నేత దేవా తదితరుల వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యాధికారి శ్యామ్ప్రసాద్ ఆధ్వర్యంలో లబ్బూరు పీహెచ్సీకి ఐదుగురు చిన్నారులను తరలించారు. -
10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కల పునరుద్ధరణ
● పాడేరు ఐటీడీఏ ఏడీ లకే బొంజుబాబు ● రైతులకు పంపిణీ చేపట్టామని వెల్లడి చింతపల్లి: పాడేరు డివిజన్లో సాగులో ఉన్న 10 వేల ఎకరాల పాత కాఫీ తోటల్లో గ్యాప్ ఫిల్లింగ్లో భాగంగా మొక్కల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. మంగళవారం ఆయన జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పర్యటించారు. అనంతరం చింతపల్లి మండలంలో బిల్లబడ్డ, బెన్నవరం, నక్కమెట్ట, సూదిమెట్ట గ్రామాల్లో కాఫీ నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి రైతులు సాగుచేసే పాత కాఫీ తోటల్లో పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎకరానికి 450 చొప్పున పంపిణీ చేసేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మొక్కల నిమిత్తం 234 సెకండరీ నర్సరీలను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం రైతులకు మొక్కలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల కాఫీ ఏఈవోలు ధర్మారాయ్, చిన్నబ్బాయి, కేవీ రమణ, హెచ్సీ అరుణకుమారి, ఎఫ్సీలు, లైజన్ వర్కర్లు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: గోదావరి,శబరి నదుల ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూనవరం, ఎటపాక, చింతూరు, వీర్పురం మండలాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య, విద్యుత్శాఖలు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని, రానున్న రెండు రోజుల్లో మొబైల్ టాయ్లెట్లను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలను తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ఎస్పీ అమిత్బర్దర్ఱ మాట్లాడుతూ వరదలపై అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.పద్మలత, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ రజని, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, తహసీల్దార్ తారకేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సమర్థంగా ఉపాధి హామీ అమలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హమీ పథకం పనులను సమర్ధవంతంగా అమలుజేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఎంపీడీవోలు, ఉపాధి పథకం అధికారులు, పంచాయతీరాజ్,గ్రామ సచివాలయాలు, పౌరసరఫరాలశాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆయాశాఖల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పాడేరు డివిజన్లో 30 వేల మొక్కలు పెంపకం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. నాణ్యమైన మొక్కలు సరఫరా చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు తల్లికి వందనం అమలుచేయాలన్నారు. చిన్నారులను పంచాయతీ కార్యదర్శులు జనన ధ్రువపత్రాలు అందజేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుతోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ అభిషేక్గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, డ్వామా పీడీ విద్యాసాగర్, డీపీవో చంద్రశేఖర్, నో డల్ అధికారి కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సంక్షేమ సారఽథి వైఎస్
సాక్షి,పాడేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల సంక్షేమానికి విశేష కృషి చేసిన రైతు బాంధవుడు, మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. జిల్లా కేంద్రం పాడేరు పాతబస్టాండ్లో మహానేత వైఎస్ విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా జయంతి నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్టీ ఎస్టీసెల్ వరాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఇతర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్ వైద్యం, అటవీ భూములకు హక్కులు కల్పించిన మహోన్నత నేతగా గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. వైఎస్సార్ పేదల పెన్నిధి అని గిరిజనులకు ఎంతో మేలు చేశారని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, అటవీ హక్కుల చట్టంతో పోడు భూములకు పట్టాలు, కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహానేత ఆశయా లకు అనుగుణంగా పనిచేస్తున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని 2029 ఎన్నికల్లో సీఎంగా చేసుకునే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, ఎంపీటీసీ లకే రాామకృష్ణపాత్రుడు, సర్పంచ్లు వనుగు బసవన్నదొర, వంతాల రాంబాబు, గబ్బాడి చిట్టిబాబు, గొల్లోరి నీలకంఠం, పార్టీ నాయకులు లకే రామసత్యవతి, కిల్లు కోటిబాబునాయుడు, లకే రత్నాభాయి, కూడా సుబ్రహ్మణ్యం, బాబూరావు, వంతాల నరేష్, బూర మహేష్, డి.పి.రాంబాబు, వలంటీర్ల విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మ సురేష్బాబు, జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాంబాబు పాల్గొన్నారు. మండలంలోని కాడెలి పంచాయతీ గురుపల్లి గ్రామంలో వైఎస్సార్ జయంతిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఘనంగా నిర్వహించింది. మహానేత విగ్రహానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర.. అరకులోయ టౌన్: పేదల సంక్షేమానికి చిరునామా వైఎస్సార్ అని వైఎస్సార్సీపీజిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు అన్నారు. అరకులో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఆయన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన చేసిన మంచిని ఎన్నటికీ మరువలేరన్నారు. ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కేక్కట్ చేశారు. పార్టీ జెండా ఎగరవేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజరాణి, ఎమ్మెల్సీ రవిబాబు, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, హైమావతి, మాజీ జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, జెడ్పీటీసీలు రోషిణి, జానకమ్మ, ఎంపీపీలు నీలవేణి, ఈశ్వరి, పాంగి చిన్నరావు, శెట్టి అప్పాలు, రేగం చాణక్య, ఆశోక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. సంక్షేమాన్ని ప్రజల చెంతకు తెచ్చిన నేత : మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి రాజవొమ్మంగి: సంక్షేమాన్ని ప్రజల చెంతకు తెచ్చిన పేద బడుగు బలహీనవర్గాల పెన్నిధి డాక్టర్ రాజశేఖరరెడ్డి అని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మంగళవారం రాజవొమ్మంగిలో జరిగిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్లోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆమె క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటికీ పేద కుటుంబాల్లో వైఎస్ చిరస్థాయిగా ఉన్నారన్నారు. స్థానిక పీహెచ్సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్లు కొంగర మురళీకృష్ణ, ఆగూరి శుభలక్ష్మి, కించు వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు గంగదుర్గ, లోవకుమారి, నాయకులు నాగులాపల్లి కుశరాజు, కనిగిరి దుర్గాప్రసాద్, ఆధ్య రమేష్, కనిగిరి వీరబాబు, చీడిపల్లి శాంతకుమారి, అడపా కామేష్, శింగిరెడ్డి రవి, జుర్రా జాన్బాబు, చింతలపూడి వెంకటరమణ, మాడి బాబ్జీ, పండూరి బుజ్జి, గండేపల్లి రాంబాబు, బొడ్డు వెంకటరమణ, నూకరాజు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఘనంగా వైఎస్ జయంతి వాడవాడలా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు -
నిలిచిన సేవలు.. ప్రజల ఇబ్బందులు
● కించాయిపుట్టు సచివాలయంలో హైవోల్టేజీకి కాలిపోయిన కంప్యూటర్లు ● వారం రోజులైనా పునరుద్ధరించని అధికారులుముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని కించాయిపుట్టు గ్రామ సచివాలయంలో వారం రోజులుగా సేవలు నిలిచిపోయినా అధికారుల్లో స్పందన కరువైంది. హైవోల్టేజీ కారణంగా రెండు కంప్యూటర్లు వారం రోజుల క్రితం కాలిపోయాయి. సేవలు అందకపోవడంతో పంచాయతీలోని మర్రిపుట్టు, వర్కుగుమ్మి, రాములు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డుల సవరణల నిమిత్తం గ్రామ సచివాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కూడా ఆయా గ్రామాల ప్రజలు గ్రామ సచివాలయం వద్ద పడిగాపులు పడ్డారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించాలని మండల అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మత్తు పదార్థాల జోలికి పోవద్దు
● విద్యార్థులకు ఎస్పీ అమిత్ బర్దర్ సూచన సాక్షి,పాడేరు: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అమిత్బర్దర్ సూచించారు. ఆపరేషన్ సేప్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ విద్యార్థులంతా చెడు అలవాట్ల జోలికి పోకుండా ఉన్నత చదువులు, ఉద్యోగ లక్ష్యాన్ని నిర్మించుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదవాలన్నారు. ఉన్నత స్థానా నికి ఎదిగి గిరిజన ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఏఎస్పీ కె.ధీరజ్, డీఎస్పీ సహబాజ్ అహ్మద్, సీఐ దీనబంధు, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. -
ఇంటింటికీ కూటమి మోసాలు
అరకులోయ టౌన్: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి సర్కార్ అసమర్థపాలనను ప్రజలందరికీ తెలియజేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. అరకు పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో రూ.4 వేల పింఛను మినహా ఏఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రతీ గడపకు వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుతం కూటమిలో జరిగిన నష్టాన్ని స్పష్టంగా వివరించాలన్నారు. ప్రతీ గడపకు వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి చంద్రబాబు మోసాలు తెలుసుకునేలా చేయాలని సూచించారు. కార్యకర్తలకు ఏసమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభు త్వ పాలకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. జగనన్న పాలనకు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తల్లికి వందనం అరకొరగా తల్లుల ఖాతాల్లో జమ చేశారన్నారు. నిరుద్యోగులకు మిగతా 8వ పేజీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అధ్యక్షతన పార్టీ సమావేశం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పోస్టర్ ఆవిష్కరణ అసమర్థ పాలనను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు -
అల్లూరి వాడలో...అవకాడో
● సాగు విస్తీర్ణం పెంచేందుకు సన్నాహాలు ● అనుకూల అంశాలపై సర్వే ● ఈ ఏడాది జిల్లాలో 250 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు ● సాగుకు ముందుకు వస్తున్న రైతులు జిల్లాలో అవకాడో సాగు పెంపే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సాగుకు అనుకూలమైన అంశాలపై హెచ్ఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్వే చేస్తూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరో వైపు రైతులు కూడా ముందుకు వస్తుండడంతో మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.రంపచోడవరం: జిల్లాలో మారేడుమిల్లి మండలం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడంతో ఇక్కడ వాతావరణం బయట ప్రాంతం కంటే శీతలంగా ఉంటుంది. శీతల ప్రాంతంలో పండే పంటలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో రబ్బరు, కాఫీ, మిరియాలు తదితర పంటలను రైతులు పండిస్తున్నారు. అవకాడో మొక్కలను ఎక్కువగా పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను తాజాగా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. దీనిలో భాగంగా వై.రామవరం ఎగువ ప్రాంతం, మారేడుమిల్లి ప్రాంతాల్లో అవకాడో మొక్కలు పెంచేందుకు గ్రామాలను ఎంపిక చేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవకాడో ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్న ఖరీదైన పండు. ఆరోగ్యానికి మేలు చేసే ఇది విదేశాల్లో ఎక్కువగా పండుతోంది. ప్రస్తుతం మన దేశంలో తూర్పు హిమాలయ ప్రాంతంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు,మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే సాగులో ఉంది. ఇప్పటికే జిల్లాలో పాడేరు, అరకు ప్రాంతాల్లో అవకాడో మొక్కలను గిరిజన రైతులకు పంపిణీ చేస్తున్నారు. గొందిపాకలు, పెద్దబరడ గ్రామాల్లో రైతులు అవకాడో సాగు ప్రారంభించారు. మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ అవకాడో సాగుకు అనుకూలంగా ఉంటుంది. సాగుకు పొడి వాతావరణం ఉండాలి. ఈ చెట్లకు ఎక్కువ నీరు, ఎక్కువ చల్లదనం ఉండకూడదు. ఈ ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఉండడంతో అవకాడో సాగుకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగుపై విస్తృత సర్వే ఏజెన్సీ ప్రాంతంలో అవకాడో సాగుకు అనుకూలమైన అంశాలపై విస్తృతంగా సర్వే చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలోఎవరైనా రైతులు అవకాడో సాగు చేస్తున్నారా, వాతారణం, వర్షపాతం వంటి విషయాలపై ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హార్టీ కల్చర్ యూనివర్సిటీ నుంచి నివేదికలు ఇచ్చాం. ఈ ఏడాది కొంత మంది రైతులకు అవకాడో మొక్కలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ పి.సి. వెంగయ్య, హెచ్ఆర్ఎస్ అధిపతి,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడి, -
చాపరాయి పర్యాటక ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని ఉన్న పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతానికి వచ్చే ఆదాయంలో 25 శాతం పంచాయతీకి కేటాయించాలని, చాపరాయి వద్ద స్థానికులకే ఉద్యోగాలు కొనసాగించాలని, వేరే ప్రాంతాల వారిని తోలగించాలని అలా చేయని పక్షంలో చాపరాయి ప్రవేశానికి అనుమతివ్వమని పోతంగి పంచాయతీ సర్పంచ్ వంతాల వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం 12 పంచాయతీ వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి గవర్నింగ్ బాడీ తీర్మాణంతో చాపరాయిని ఐటీడీఏకు అప్పగించామన్నారు. అప్పట్లో పంచాయతీ పరిధిలోని 10 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించి, నేటి వరకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. ఐటీడీఏ అధికారులు అడ్డుగోలుగా చాపరాయిలో ఉద్యోగాలు నియమించారన్నారు. అలాగే చాపరాయిలో వచ్చే ఆదాయంలో 25 శాతం పంచాయతీకి కేటాయించాలని, దీంతో పోతంగి పంచాయతీ అభివృద్ధి చేందుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పోతంగి పంచాయతీ పరిధిలోని నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఇక్కడ విధుల నిర్వహిస్తున్న వేరే ప్రాంతాల వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చాపరాయి వద్ద బైఠాయించి, పర్యాటకులను లోపలకు అనుమతివ్వకుండ తాళం వేస్తామని వారు హెచ్చరించారు. వైస్ సర్పంచ్ శెట్టి జగ్గునాయుడు, వార్డు సభ్యులు కాంతారావు, లక్ష్మణ్, రాజు, ముకుంద్, కష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తం
కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం పాడేరు: గోదావరి, శబరి నదుల వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. సోమవా రం తన కార్యాలయం నుంచి ఎటపాక, కూనవరం, చింతూరు,వీఆర్పురం ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు చెప్పారు. గోదావరికి ప్రథమ హెచ్చరిక, శబరి నదికి మొదటి, రెండో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు ముందస్తు చర్యలు చేపట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. -
విధి నిర్వహణలో అప్రమత్తం
● సీలేరు కాంప్లెక్స్ సీఈ రాజారావు ● మాచ్ఖండ్లో విద్యుత్ ఉత్పత్తి, సమస్యలపై సమీక్ష ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని, వర్షకాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సీలేరు కాంప్లెక్స్ సీఈ కె.వి.రాజారావు సూచించారు.ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సోమవారం సీఈ కె.వి.రాజారావు మొదటి సారిగా సందర్శించారు.వించ్ మార్గంలో ప్రాజెక్టుకు చేరుకున్నారు.ప్రాజెక్టు ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.విద్యుత్ కేంద్రంలో వినియోగంలో ఉన్న జనరేటర్ల పరిశీలించి,మరమ్మతులకు గురైన 4వ నంబర్ జనరేటర్ పరిస్థితిపై ఆరా తీశారు. డుడుమ,జోలాపుట్టు జలాశయాల నీటి నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రాజెక్టు ఉద్యోగులు,సిబ్బందితో జలవిద్యుత్ కేంద్రం స్థితిగతులు,నెలకొన్న సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్స్ సీఈ కె.వి.రాజారావు మాట్లాడుతూ ప్రాజెక్టులో విధుల నిర్వహణలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని,ముఖ్యంగా వర్షకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని అన్నారు.మరమ్మతులో ఉన్న 4వ నంబర్ జనరేటర్ను పది రోజుల్లో వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని,పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగాలని,జలాశయాల సిబ్బంది నీటి నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ,నీటి నిల్వలు ప్రమాదస్థాయికి చేరుకోకుండా చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈ సివిల్ చంద్రశేఖర్రెడ్డి,ఈఈ జనరేషన్ గోవిందరాజులు,ఏడీఈ టెక్నికల్ మోత్తిగూడెం బి.జనార్థన్,ప్రాజెక్టు ఏడీఈలు ఒబుల్రెడ్డి,శివకుమార్,తదితరులు పాల్గొన్నారు. -
రేపే గిరి ప్రదక్షిణ
జీవీఎంసీ హెల్ప్లైన్ నెంబర్ 0891-2507225 టోల్ ఫ్రీ నెంబరు 1800-4250-0009 సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ(గిరి ప్రదక్షిణ) బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనావేసి కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్సులు, 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రతీ స్టాల్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. భక్తులు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోవాలి కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి మూలవిరాట్, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. రథంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పుష్పరథం తిరిగే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్రోడ్డు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఏర్పాటుచేసే ప్రదేశాలు తొలిపావంచా, పాతగోశాల జంక్షన్, అడవివరం జంక్షన్, అప్పుఘర్, మాధవధార దర్శన సమయాలు 9వ తేదీన ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు కల్పిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10న ఆలయ ప్రదక్షిణలు సింహగిరిపై 10న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారుజామున 3గంటల నుంచి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణం 10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి 50 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. స్టాళ్లు, మెడికల్ క్యాంపులు స్టాళ్లు, మెడికల్ క్యాంపులు స్వామి తొలిపావంచా, అడవివరం గ్రౌండ్, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, ముడసర్లోవ పార్కు, చినగదిలి, పెదగదిలి, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, వెంకోజీపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం, నరసింహనగర్, సింగాలమ్మ ఆలయం డాక్యార్ట్ క్వార్టర్స్, పోర్టు డీఎల్బి క్వార్టర్స్, సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్, మురళీనగర్, మాధవధార వాటర్ఫాల్స్, మాధవధార, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు కార్యాలయం, ఆర్అండ్బి కార్యాలయం, ఎన్ఎస్టీఎల్ ఫ్యామిలీ గేట్, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, పాత గోశాల జంక్షన్, అడవివరం ఆరోగ్య కేంద్రం ఏరియా, శ్రీదేవి కాంప్లెక్స్, సింహగిరి మెట్లమార్గంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ● తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుప గడ్డర్లు ిసిద్ధం చేస్తున్నారు. అడవివరం నుంచి హనుమంతవాక వెళ్లే బీఆర్టీఎస్ మార్గంలోని రెండో టోల్గేట్ వద్ద 20 ఇనుప గడ్డర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో దాదాపు 40 ప్రాంతాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. దేవస్థానం ఏర్పాటు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీటి సరఫరా చేస్తోంది. ● అప్పుఘర్ వద్ద స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థంతాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, రెండు జనరేటర్లు, కమాండ్ కంట్రోలింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. 60 మంది గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. ● మాధవధార వద్ద 60 తాత్కాలిక మరుగుదొడ్లు, ఒక వైద్య శిబిరం, 50 ఎల్ఈడీ లైట్లు, ఒక జనరేటర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం సిద్ధం చేస్తున్నారు. ● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ● 10న ఆలయ ప్రదక్షిణలకు గాను ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద వంతెనలను సిద్ధం చేస్తున్నారు. ● 10వ తేదీన సింహగిరికి వచ్చే భక్తుల కోసం 10,800 రన్నింగ్ ఫీట్ మేర క్యూలను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 9 వేల మంది క్యూల్లో వేచి ఉండవచ్చు. ● 10న కేవలం కొండపైకి మెట్లమార్గంలో వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. స్వామి దర్శనం తర్వాత కొండదిగువకి ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ● అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచుతున్నారు. ● రెండో ఘాట్రోడ్డు వద్ద స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ● 9,10 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద పుష్పరథం ప్రారంభం 10న ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, పోర్టు డీఎల్బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్అండ్బీ కార్యాలయం, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకోవాలి. -
గిరి ప్రదక్షిణకు 2,460 మందితో బందోబస్తు
అల్లిపురం: గిరి ప్రదక్షిణకు 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాయిలెట్స్, మంచినీళ్లు, అంబులెన్స్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు. భక్తులను హెచ్చరిస్తూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బీచ్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య
కొయ్యూరు: భర్తతో జరిగిన వివాదంతో క్షణికావేశంలో నాలుగేళ్ల కూతురితోపాటు ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన ఆదివారం రావణాపల్లిలో చోటు చేసుకుంది. మృతురాలు మౌనిక తండ్రి దిబ్బ రాజుబాబు ఫిర్యాదు మేరకు, ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపిన వివరాలు. రావణాపల్లికి చెందిన సతీష్, రాజేంద్రపాలేనికి చెందిన లువ్వా మౌనిక(29) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ ఆటో డ్రైవర్. మౌనిక టిఫిన్ సెంటర్ నిర్వహించడంతో పాటు పెట్రోల్ అమ్ముతోంది.కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన సతీష్ తరచూ తాగి వస్తుండడంతో భార్యా భర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మళ్లీ గొడవ జరిగింది. అనంతరం సతీష్ బయటకు వెళ్లాడు. భర్త తీరుతో విసిగిపోయిన మౌనిక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది. విక్రయించేందుకు ఇంట్లో సిద్ధంగా ఉన్న పెట్రోల్ సీసాలు పట్టుకుని, కూతురు లాస్యశ్రీతో కలిసి పక్కనే ఉన్న జీడితోటల మధ్యకు వెళ్లింది. మొదట కూతురు లాస్య(4)పై పెట్రోల్ పోసి, ఆ తర్వాత తనపై పోసుకుని నిప్పటించుకుంది. కూతురు అక్కడే చనిపోగా, మౌనిక మంటల వేడిని భరించలేక పక్కన ఉన్న కాలువలో దూకింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను వైద్యం కోసం నర్సీపట్నం తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించింది. స్థానిక కిషోర్ వర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
10న మెగా పేరెంట్స్ మీట్
● అధికారుల సమన్వయంతోనే విజయవంతం ● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 10న మెగా పేరెంట్స్ మీట్ను అధికారులంతా సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి గిరిజన సంక్షేమాధికారులు, విద్యాశాఖ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులతో మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను తప్పనిసరిగా ఈ మీట్కు అహ్వానించాలన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు స్థానికంగా ఉండే దాతల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. మంగళవారం నుంచి పాఠశాలలకు మొక్కల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లీ పేరిట ఒక మొక్క నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయటానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మెగా పేరెంట్స్ మీట్ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని పాఠశాలలకు నిధులు విడుదల చేశామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ మీట్కు ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు డాక్టర్ ఎంజే అభిషేక్, కట్టా సింహాచలం, డీఎఫ్వో సందీప్రెడ్డి వర్చువల్గా హాజరు కాగా.. డీఈవో బ్రహ్మాజీరావు, ఏపీసీ డాక్టర్ స్వామి నాయుడు, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
అరకులోయటౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలని అరకులోయ ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. నియోజక వర్గం పరిధిలోని ఆరు మండలాల్లో మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్నం అరకులోయలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
రోడ్ల పనుల్లో జాప్యం... గిరిజనుల్లో ఆగ్రహం
● రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని ధర్నా ● వంటావార్పుతో పెద్ద ఎత్తున నిరసన ● గిరిజనసంక్షేమశాఖ ఈఈ హామీతో ఆందోళన విరమణ రాజవొమ్మంగి: మండలంలో చేపట్టిన రోడ్డు నిర్మాణపనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా నిలచిపోయిన ఏడు బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గిరిజనసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడే వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న రంపచోడవరం ట్రైబల్వెల్ఫేర్ డీఈ గౌతమి రాజవొమ్మంగి వచ్చి ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్లే 11 నెలలుగా రోడ్డు నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు తెలిపారు. ఎప్పుడు పూర్తి చేస్తారో లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. అనంతరం గిరిజనసంక్షేమశాఖ ఈఈ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడి ఆందోళనకారులకు నచ్చచెప్పారు. మంగళవారం తాను స్వయంగా వస్తానని, ఎంపీడీవో కార్యాలయంలో ఐదు గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డి.మల్లవరం, అప్పలరాజుపేట, వయ్యేడు–బూరుగపల్లి, ముంజవరప్పాడు, లోదొడ్డి, జడ్డంగి, జమ్మిచావిడి గ్రామాల రోడ్డు పనులను అధికారులు మొదలుపెట్టి 11 నెలలు కావస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. బిల్లులు మంజూరుకాకపోవడం వల్లే ఆలస్యం మండలానికి రూ. 12.5 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ. 6.5 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని డీఈ గౌతమి తెలిపారు. రూ.4కోట్ల మేర బిల్లులు చెల్లించామని, మరో రూ.2.5 కోట్లు బకాయి ఉండడం వల్ల సంబంధిత కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని డీఈ ఆందోళనకారులకు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావుతో పాటు ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు చుండ్రు లోవకుమారి, సర్పంచ్లు చంద్రుడు, జగన్నాథం, సూరిబాబు, గిరిజనసంఘం నాయకులు సింగిరెడ్డి అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ సన్యాసినాయుడు , ఎంపీడీవో యాదగిరిఈశ్వరరావు, ఇంటిలిజెన్స్ హెచ్సీ దుర్గారావు చర్యలు తీసుకున్నారు. -
తొలిపావంచా
అడవివరంపైనాపిల్కాలనీసెంట్రల్జైల్ప్రహ్లాదపురంహనుమంతవాకకుమారి కల్యాణమండపంవిశాలాక్షినగర్జోడుగుళ్లపాలెంమురళీనగర్మాధవదారతెన్నేటి పార్కులక్ష్మీనగర్కప్పరాడ సీతమ్మధారఅప్పుఘర్పోర్టు డీఎల్బీ క్వార్టర్స్ఎంవీపీకాలనీనరసింహనగర్ -
పూరిపాకలో పాఠశాల నిర్వహణ
● భవనం ఏర్పాటుకు చర్యలు ● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశం రంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. రంపచోడవరం సమీపంలోని బోర్నగూడెంలో జీపీఎస్ పాఠశాలను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల భవనం బాగోలేకపోవడంతో పాకలో విద్యా బోధన జరుగుతుందని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందించి పక్కా భవనంలో పాఠశాల నిర్వహించాలని హెచ్ఎంకు తెలిపారు. పాఠశాలకు పక్కా భవనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరగుతుందన్నారు. -
అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణతులసీ దళార్చనని ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణ తులసీ దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
గేదెల మందను ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన లింగం రాజుబాబు మోటారుసైకిల్పై వెళ్తుండగా అకస్మాత్తుగా గేదెలు అడ్డురావడంతో ఢీకొని ఆదివారం రాత్రి తీవ్రంగా గాయపడ్డాడు. రాజుబాబు దోమల మందు పిచికారీ పనుల నిమిత్తం మండలంలోని ఏ.బి.కాలనీ గ్రామానికి వెళ్లి పనులు పూర్తి చేసుకొని బైక్పై తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. మార్గమధ్యలో చీకటిలో రోడ్డుపై గేదెల మంద అడ్డురావడంతో వాహనం అదుపుతప్పడంతో రాజుబాబు వాటిని బలంగా ఢీ కొట్టి పడిపోయాడు. అతనిని సహచర కూలీలు జడ్డంగి పీహెచ్సీకు, ఆ తరువాత రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలేశ్వరం సీహెచ్సీకు తరలించారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టుఅనుమతులు రద్దు చేయాలి
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలు, హక్కులను కాలరాస్తూ, ఏజెన్సీకి విఘాతం కలిగించే ప్రాజెక్టులపై ఏకపక్ష అనుమతులు జారీ చేయడం తగదని ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య అన్నారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అనంతగిరి మండలం పెద్దకోటలో అదానీ కంపెనీకు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవో 51 కాపీలను నేతలు, గిరిజనులు దగ్ధం చేశారు. జీవో 51ను వెనక్కి తీసుకోవాలని, ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల ఏజెన్సీకి పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. ఆదివాసీలు అభిప్రాయాలు, గ్రామసభలో తీర్మానం లేకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు. రాజ్యాంగం 5వ షెడ్యూల్లో ఉన్న పెద్దకోట ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలులో ఉందన్నారు. కూటమ ప్రభుత్వం ఆయా చట్టాలను ఉల్లంఘించిందన్నారు. పెద్దకోట ప్రాంతంలో ఆదివాసీలు నీటి అవసరాలు, అక్కడ వాగులపై ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి వాగులపై హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం తరలిస్తే ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 51ను రద్దు చేయాలని,లేనిపక్షనా ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. నాయకులు శ్రీను, చందు, దేవన్న, చంద్రయ్య పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్ పంచాయతీ జాకరవలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో 51 జీవో ఉత్తర్వులు అనుమతులు రద్దు చేయాలని జీవో కాపీని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ అనంతగిరి మండలం పెద్దకోట గ్రామ పంచాయతీలో ఆదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు పీసా గ్రామసభ నిర్వహించకుండా ఏక పక్షంగా అనుమతులు ఇస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్–51కి ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. జీవో నెంబర్ 51 తక్షణమే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలోని అటవీ సంపదను దోచుకునే యేచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. గిరిజన సంపద జోలికి వస్తే సహించమని, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు రామంచదర్, రాజు, భాస్కర్రావు, భగత్, రుకుదార్ తదితరులు పాల్గొన్నారు. గూడెంకొత్తవీధి: అరకు నియోజకవర్గం అనంతరిగి మండలం పెద్దకోట గ్రామ పంచాయతీలో ఆదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు మంజూరుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 51ని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కొర్ర బాలయ్య తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జీవో కాపీలు దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలయ్య మాట్లాడుతూ ఆ ప్రాజక్ట్ నిర్మాణం చేస్తే గిరిజనులకు తీరని నష్టం వాటిల్లుతుందనామ్నరు. జీవోను రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు కేశవరావు, మంగిబాబు, రమేష్, బాబూరావు, కొండబాబు పాల్గొన్నారు. ఏజెన్సీకి విఘాతం కలిగించే ప్రాజెక్టును విరమించుకోవాలి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ జీవో కాపీలను దహనం చేసిన నేతలు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక -
నిషేధిత మందులు..యథేచ్ఛగా అమ్మకాలు
● వయాగ్రా, అబార్షన్, మత్తు మందుల కిట్ల విక్రయం ● జోరుగా కాలం చెల్లిన మందుల విక్రయాలు ● కొన్ని మందుల షాపులు, ఏజెనీల్లో అక్రమాలు ● దాడులు చేస్తున్నా పట్టించుకోని మెడికల్ మాఫియా మహారాణిపేట: స్మార్ట్ సిటీ విశాఖలో నిషేధిత మందుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇంజక్షన్లు, గర్భస్రావ కిట్లు, లైంగిక సామర్థ్యం పెంచే వయాగ్రా వంటి ఔషధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్ షాపులు, ఏజెన్సీలు అక్రమాలకు అడ్డాగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మామూళ్ల ఆరోపణల నడుమ ‘మెడికల్ మాఫియా’తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. వాస్తవానికి వీటికి విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మందుల దుకాణాలు, హోల్సేల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అనేక షాపులు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశాయి. కనీస అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా, అమ్మకపు వివరాలు నమోదు చేసే కంప్యూటర్లు, రిజిస్టర్లు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి. కాలం చెల్లిన మందులను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దగ్గు మందులు, నొప్పి నివారణ మందులు, మత్తును కలిగించే ఇంజక్షన్లను యువతకు సులభంగా విక్రయిస్తున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వయాగ్రా అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని జిల్లా పరిషత్, రెల్లివీధి, కురుపాం మార్కెట్, కొత్త రోడ్డు, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు వంటి ప్రాంతాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వయాగ్రా, అబార్షన్ కిట్లను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు అమ్ముతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మొక్కుబడిగా తనిఖీలు ఔషధ నియంత్రణ మండలి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, ఈగల్ వంటి వివిధ శాఖలు అడపాదడపా దాడులు చేస్తున్నా ఫలితం శూన్యంగానే ఉంటోంది. దాడుల తర్వాత కొద్ది రోజులకే మాఫియా మళ్లీ తమ అక్రమ వ్యాపారాన్ని యథావిధిగా ప్రారంభిస్తోంది. కొన్ని శాఖలకు మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఔషధ నియంత్రణ శాఖలో సిబ్బందికి వాహనాలు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో తనిఖీలు మొక్కుబడిగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. తనిఖీల్లో బిల్లులు లేకుండా అమ్మకాలు జరపడం, ప్రిస్క్రిప్షన్ వివరాలు నమోదు చేయకపోవడం, ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు బయటపడినా, చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఈ ఆరోపణలపై ఔషధ నియంత్రణ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ వద్ద ప్రస్తావించగా.. ‘వయాగ్రా, అబార్షన్ కిట్ల అమ్మకాలు మా దృష్టికి రాలేదు. మేము రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే, వారి షాపు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తాం’అని ’సాక్షి’కి తెలిపారు. -
సెకెండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు : సెకెండ్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ అధ్యక్షతన సెకండ్ ఏఎన్ఎంల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు మాట్లాడుతూ గత 15ఏళ్లుగా గిరిజన ప్రాంతంలోని అతిమారుమూల గ్రామాల్లో సెకెండ్ ఏఎన్ఎంలు ఎన్నో ప్రయాసలు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారన్నారు. రెగ్యులర్ ఏఎన్ఎంల మాదిరిగానే సేవలు అందిస్తున్నప్పటికీ వారికి వర్తించే సదుపాయాలు సెకెండ్ ఏఎఎన్ఎంలకు ఇవ్వడం లేదన్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పాటు వేతనాలు కూడా ఏ మాత్రం పెంచడం లేదన్నారు. రెండో ఏఎన్ఎం నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా మార్పు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న సెకెండ్ ఏఎన్ఎం పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీలో సెకెండ్ ఏఎన్ఎంలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సెకెండ్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, సెకెండ్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు -
వందే విష్ణుం.. భవభయహరం
నక్కపల్లి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కొండదిగువన స్వా మివారి ఉత్సవమూర్తులకు తిరుమంజన కార్యక్ర మం నిర్వహించి నూతన వస్త్రాలంకరణ చేశారు. తదుపరి స్వామివారి ఉత్సవమూర్తులకు, ఆండాళ్లమ్మవారికి, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. ఆషాఢమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగాను, శయన ఏకాదశిగాను పిలుస్తారు. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉండటంతో ఉపమాకలో వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా ఉన్న అఖిలాండం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరిగింది. అధికంగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉపమాకకు చెందిన శ్రీనివాస భక్త సమాజం సభ్యులతో గరుడాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు పాల్గొన్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ నానాజీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. మార్మోగిన విష్ణు సహస్రనామ పారాయణ ఉపమాకలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు పోటెత్తిన భక్త జనం -
బల్లిగిరికి పోటెత్తిన భక్తులు
అల్లిపురం (విశాఖ): ఆషాడ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం బల్లిగిరి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారు జాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకుడు గొడవర్తి రఘునాథాచార్యులు స్వామిని చందనంతో విశేషంగా అలంకరించారు. స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను నూతనంగా భక్తుల సహకారంతో తయారు చేసిన మండపంలో ఏర్పాటు చేసి భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్త బృందాలు స్వామికి పండ్లు, పూలు, పిండి పదార్థాలు నివేదన చేసి విష్ణు సహస్ర నామాభిషేకాలు చేశారు. సాయంత్రం దేవస్థానం ఆవరణలో గల ధ్వజస్తంభం వద్ద మహిళలు ప్రత్యేకంగా దీపాలంకరణ చేసి పూజలు చేశారు. -
వరదొస్తే.. అంధకారమే!
తోటపల్లి ఫీడర్ పరిధిలో గోదావరి ముంపు ప్రభావిత గ్రామాల్లో ఈ ఏడాది కూడా కరెంట్ కష్టాలు తప్పేట్టు లేవు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు నీటమునుతుంటాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సుమారు 20 గ్రామాల్లో అంధకారంలో నెలకొంటోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంబడి ఎత్తయిన స్తంభాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నిధులు కేటాయించింది. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగడం లేదు.పూర్తిస్థాయిలో నిర్మాణ సామగ్రి రాకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. తోటపల్లి ఫీడర్ పరిధిలో 20 గ్రామాలకు చీకటి కష్టాలు ● గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే విద్యుత్ లైన్లకు ముంపు సమస్య ● సరఫరా నిలిపివేస్తున్న అధికారులు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమస్య శాశ్వత పరిష్కారానికి సంకల్పం ● ప్రభుత్వం మారిన తరువాత ముందుకు సాగని కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనులు ● విద్యుత్ స్తంభాలకే పరిమితం ● పూర్తిస్థాయిలో నిర్మాణ సామగ్రి రాలేదంటున్న అధికారవర్గాలు ఎటపాక: గోదావరి వరదల కాలం సమీపిస్తోంది. వరదలంటేనే చిమ్మచీకట్లో భయం.. భయంగా రాత్రులు గడపాల్సిన దుస్థితి. గోదావరి వరద ఉధృతి పెరిగితే తోటపల్లి ఫీడర్ పరిధిలోని గ్రామాలన్నీ అంధకారంలో మగ్గాల్సిందే. ఈ ఏడాది కూడా వరదల సమయంలో కరెంట్ కష్టాలు తప్పేటట్టులేవు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్లను తొలగించి ప్రధాన రహదారి వెంట కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలోని బుట్టాయిగూడెం సబ్స్టేషన్ తోటపల్లి ఫీడర్ పరిధిలో 23 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు 3,726 మంది వినియోగదారులు విద్యుత్ కనెక్షన్లు కలిగిఉన్నారు. గోదావరి వరదలు వస్తున్నాయంటే చాలు ఎప్పుడు కరెంట్ సరఫరా నిలిచిపోతుందో అనే ఆందోళనలో ఈ ప్రాంత వాసులు ఉంటారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 53 అడుగులకు చేరుతుందంటే ముమ్మడివరం నందిగామ వాగు పరివాహక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నీటమునుగుతుంటాయి. సుమారు 56 అడుగులకు చేరితే గన్నవరం, కృష్ణవరం, కన్నాపురం వరకు జంపర్లు కట్ చేసి సరఫరా నిలిపివేస్తుంటారు. దీంతో గౌరిదేవిపేట నుంచి బండిరేవు వరకు అదేవిధంగా నందిగామ నుంచి ఎర్రగట్టు, మురుమూరు వరకు ఉన్న సుమారు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఆ సమయంలో ఆప్రాంత వాసులు పిల్లలు, వృద్ధులతో రాత్రివేళ బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అసలే వానా కాలం దోమలు, విషపురుగుల బెడద.. ఆబాధలు గుర్తుచేసుకుంటూ వణికిపోతున్నారు. సమస్యకు పరిష్కారం ఏదీ? గోదావరి తీర ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి గత వైఎస్సార్సీపీ సంకల్పించింది. కొత్త విద్యుత్ లైన్ల పనులకు శ్రీకారం చుట్టింది. దీనికి గత ఏప్రిల్లో రూ.53.32 లక్షల నిధులు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. తోటపల్లి నుంచి గన్నవరం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు వరకు భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారి వెంబడి 7.5 కిలోమీటర్లు కొత్తలైన్ ఏర్పాటు కసరత్తు మొదలైంది. దీనిలో భాగంగా ఒకొక్కటి 28 అడుగుల ఎత్తయిన 150 విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందగా మారింది. రహదారి వెంట విద్యుత్ స్తంభాలు కుప్పలుగా వేసి నెలరోజులైంది. కాని నేటికీ వీటితో లైన్ ఏర్పాటు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఏటా జూలై, ఆగస్టు నెలల్లోనే గోదావరికి వరదలు వస్తాయి. అయినప్పుటికీ కొత్తలైన్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈఏడాది కూడా కరెంట్ కష్టాలు తప్పవని 20 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సామగ్రి రాలేదు కొత్తలైన్ల ఏర్పాటుకు స్తంభాలు మినహా ఇతర సామగ్రి రాలేదు. అందుకే లైన్ల ఏర్పాటులో ఆలస్యమవుతోంది. సామగ్రి, యంత్ర పరికరాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటాం. – సూరిబాబు, ఏఈ, విద్యుత్శాఖ, ఎటపాక -
పర్యాటకులకు నిరాశ
అనుకూలించని వాతావరణంముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం వద్ద పొగమంచు దట్టంగా కురవడంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. మంచు తెరలు అలముకోవడం వల్ల ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారే డుడుమ జలపాత ప్రవాహం కనిపించడం లేదు. ఆదివారం ఎటుచూసినా మంచు కమ్మేయడంతో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్,విజయనగరం తదితర ప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ముఖద్వారం నుంచి వీక్షించి.. డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే వచ్చారు. చాపరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ముఖద్వారం నుంచి వీక్షించి వెళ్లిపోయారు. చెరువులవేనంకు అరకొరగా.. చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి సమీపంలోని చెరువులవేనం వ్యూపాయింట్కు ఆదివా రం పర్యాటకులు అరకొరగా వచ్చారు. ఏకధాటిగా వర్షాల కురుస్తుండటంతో సందర్శకుల సంఖ్య తగ్గింది. -
నవజాత శిశువులకు వెంటనే జనన ధ్రువపత్రాలు
● డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు డుంబ్రిగుడ: పీహెచ్సీల్లో జరిగే ప్రసవాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి, వెంటనే నవజాత శిశువులకు జనన ధ్రువపత్రాలు అందజేయాలని డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. స్థానిక పీహెచ్సీని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది రోజువారి హాజరును, మందుల గదిని పరిశీలించారు. మలేరియా కేసులు, ప్రసవాల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి పీహెచ్సీ, ఆశా, ఏఎన్ఎం ఆరోగ్య సహాయకుల వద్ద మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మాతా శిశు మరణాలు సంభవిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రసవాల అనంతరం జనన ధ్రువపత్రంతోపాటు బేబీ కిట్లు అందజేయాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎం, హెచ్వీలు కచ్చితంగా అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అంగన్వాడీ టు డాన్..
రంపచోడవరం: ఏజెన్సీలో ఎన్నడూలేనివిధంగా ఉద్యోగుల బదిలీలకు రేట్లు ఫిక్స్ చేసి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి వసూళ్లకు పాల్పడుతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో ఆరోపించారు. రంపచోడవరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డబ్బులిచ్చిన వారికే కోరిన చోటకు బదిలీ అవుతుందని, ఇవ్వనివారికి అన్యాయం జరుగుతోందని రెండు రోజుల క్రితం ఐఏఎస్ అధికారికి ఒక గిరిజన అగ్రికల్చర్ అధికారి ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఐఏఎస్ అధికారి విచారణ చేస్తున్నప్పుడు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఫిర్యాదు చేసిన ఉద్యోగిని పోలీసుస్టేషన్లో కూర్చోబెట్టారన్నారు. ఫిర్యాదు చేసిన అధికారిని ఐఏఎస్ అధికారి విచారణ చేస్తుంటే ఆయన్ని పోలీసుస్టేషన్లో కూర్చోబెట్టడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐఏఎస్ అధికారి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి, పోలీసులపై సీరియస్ కావడంతో సదరు ఉద్యోగిని వదిలిపెట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధన దాహానికి ఈ సంఘటనే నిద ర్శనమన్నారు. అధికారంలో లేని రోజుల్లోనే నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.లక్షలు వసూలు చేసి, మోసంమిగతా 8వ పేజీలో ఉద్యోగుల బదిలీలకు అక్రమ వసూళ్లు ఎమ్మెల్యే శిరీషదేవి ఆగడాలు డబ్బులిచ్చిన వారికే కోరినచోటకు ట్రాన్స్ఫర్లు అంతులేని ధనదాహం ఫిర్యాదు చేస్తే వేధింపులు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఫైర్ ఏజెన్సీ అభివృద్ధిపై దమ్ముంటే తేల్చుకుందామని సవాల్ -
హైడ్రోపవర్ ప్రాజెక్ట్నిర్మాణ ప్రదేశం పరిశీలన
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని టోకూరు పంచాయతీ చిట్టంపాడులో నవయుగ సంస్థ నిర్మించనున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి బాలదేవ్, అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, టోకూరు సర్పంచ్ మోసియా పరిశీలించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1/70, పెసా, అటవీహక్కుల చట్టానికి వ్యతిరేకంగా కేటాయించిన పెదకోట హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలన్నారు. టోకూరు చిట్టంపాడు, గుమ్మకోట పంచాయతీ గుజెల్లి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సర్వేలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 10 వేల మంది ఆదివాసీలను జలసమాధి చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. -
ఆదివాసీ చట్టాల అమలుపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
చింతూరు: ఆదివాసీ చట్టాలు, హక్కుల అమలుపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు విమర్శించారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల మహాసభ లక్కవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసా చట్టం అనుమతి లేకుండా ఏజన్సీలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం టైగర్జోన్ పేరుతో ఏజెన్సీ గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తోందని, దీనిపై ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ పేరుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. చింతూరు మండల కమిటీ అధ్యక్షుడిగా కారం నాగేష్, కార్యదర్శిగా మొట్టం రాజయ్య, ఉపాధ్యక్షుడిగా వేకా రాజ్కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్, మడకం చిన్నయ్య, గుర్రం రంగమ్మ, పట్టా రాములమ్మ, మడివి శ్రీదేవి, వీరభద్రం పాల్గొన్నారు.ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు -
1500 పెంపుడుశునకాలకు వ్యాక్సినేషన్
● పశుసంవర్ధక శాఖ ఏడీ రాజా రవికుమార్ పాడేరు : పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేయించాలని పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజా రవికుమార్ సూచించారు. ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల్లో 1500 పెంపుడు శునకాలకు ఉచితంగా వ్యాక్సిన్ వేశారు. మిగిలిన వాటికి కూడా వ్యాక్సిన్ వేయించవచ్చన్నారు. లైవ్ స్టాక్ అధికారి సురేష్, వెటర్నరీ అసిస్టెంట్లు శ్రీను, కోటి, ఉమ, రామకృష్ణ, చంద్రమోహన్, బాబూరావు పాల్గొన్నారు. -
పని గంటల పెంపుతోఅధిక శ్రమదోపిడీ
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ● 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు పాడేరు : పనిగంటల పెంపుతో కార్మికులు, ఉద్యోగుల నుంచి అధిక శ్రమ దోపిడీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ విమర్శించారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రమైన పాడేరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. జీసీసీ కార్యాలయం నుంచి మెయిన్ బజారు, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయించుకునేందుకు అదనంగా రెండు గంటలు పెంచి 10గంటల పని దినాలను అమలు చేయడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపి కార్మి కులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల చెల్లింపు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడు దేశవ్యాప్త సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నాలన్నారు. మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు, నాయకులు లక్ష్మణ్, సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు వగ్గు జయరాజ్, పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు అర్జున్, కళాసీల యూనియన్ నాయకులు గౌరినాయుడు, దేముడు, జిల్లా ఆస్పత్రికి కార్మికుల యూనియన్ నాయకులు నగేష్, చిట్టిబాబు, కొండబాబు, బొజ్జన్న, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు పాల్గొన్నారు. -
తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు
ముంచంగిపుట్టు: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని జలాశయాల నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు నిండుగా కళకళలాడుతున్నాయి. ● జోలాపుట్టు జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు. ఆదివారం నాటికి 2732.30 అడుగుల నీటి నిల్వ నమోదు అయింది. ● డుడుమ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు. ప్రస్తుతం 2585.10 అడుగులకు చేరింది. ● డుడుమ,జోలాపుట్టు జలాశయాల నుంచి నీటి విడుదల వల్ల దిగువనున్న బలిమెల, డొంకరాయి, గుంటవాడ జలాశయాల్లో నీటిమట్టాలు కూడా పెరుగుతున్నాయి. ● బలిమెల జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1457.10 అడుగులకు చేరింది. ● డొంకరాయి జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు. ప్రస్తుతం 997.10 అడుగులుగా నమోదు అయింది. ● గుంటవాడ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా 1352.10 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తం ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాలు గణనీయంగా పెరుగుతుండటంతో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. గత ఏడాది జోలాపుట్టు జలాశయ నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది. దీంతో జలాశయం గేట్లపై నుంచి ప్రవహించింది. సుమారు 40 వేల నుంచి 55 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో వరద ఉధృతికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. గ్రామాలను ముంచెత్తడమే కాకుండా మాచ్ఖండ్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. గత ఏడాది జరిగిన నష్టాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. బలిమెల, డొంకరాయి, గుంటవాడ జలాశయాల నీటిమట్టాలను జెన్కో అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పొంగిన వాగులు, గెడ్డలు ముంచంగిపుట్టు: మండలంలో ఏకధాటిగా వర్షాలు పడుతూనే ఉండటంతో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ, ఉబ్బెంగుల, తుమిడిపుట్టు, కర్లపోదర్ వాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల గిరిజనులు అతికష్టం మీద వాగులు దాటుకొని పంచాయతీ కేంద్రానికి వస్తున్నారు. బంగారుమెట్టలో బొనంగి నీలమ్మ అనే గిరిజన మహిళ ఇంటి గోడ వర్షానికి తడిచిపోయి ఆదివారం కూలిపోయింది. ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది. వరదనీటితో సీలేరు కాంప్లెక్సులో జలాశయాలు కళకళ డుడుమ ప్రాజెక్ట్ నుంచి 1600 క్యూసెక్కుల వరదనీరు విడుదల ప్రమాదస్థాయికి చేరుకోకుండా జాగ్రత్తలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరదనీరు డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లోకి భారీ గా వరద నీరు చేరుతోంది. కొద్దిరోజులుగా డుడుమ నుంచి బలిమెలకు 1600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నాం. జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాదస్థాయికి చేరు కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
బీఎల్వోలకు శిక్షణ
రంపచోడవరం: రంపచోడవరం నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎన్నికల జాబితా నిర్వహణపై శిక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అన్నారు. ఈ శిక్షణ భారత ఎన్నికల సంఘంకు అనుబంధ సంస్ధ అయిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఇందులో భాగంగా రెండో శిక్షణలో 50 మంది చొప్పున తొమ్మిది బ్యాచ్లుగా 399 మందికి శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎలక్షన్ డీటీఆర్ సునీత, మాస్టర్ ట్రైనర్ సుధాప్రకాష్లు శిక్షణ ఇచ్చారు. -
ఎన్ఏడీ అధికారిపై దాడి.. నలుగురి అరెస్ట్
గోపాలపట్నం: నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్ఏడీ) అధికారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న నేవల్ ఆర్మమెంట్ డిపో డీజీఎం మల్లికార్జునరావుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఎన్ఏడీలో విధులను ముగించుకుని భోజన విరామ సమయంలో క్వార్టర్స్లో ఉన్న తన ఇంటికి వస్తుండగా.. కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని ఆపి ఆయనపై దాడి చేశారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఆయన హెల్మెట్ ధరించి ఉండటంతో తలపైనా, ముఖంపైనా దెబ్బలు తగల్లేదు. దాడికి పాల్పడిన వారిలో ఎన్ఏడీ ఉద్యోగి ఒకరు ఉండటంతో, కక్షపూరితంగానే దాడి చేశారని తెలుస్తోంది. మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎన్ఏడీలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం వంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నామనే కక్షతోనే దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన ఎన్ఏడీ ఉద్యోగి బెహరా అరుణ్తో పాటు ఎల్లవిల్లి దినేష్ కుమార్, చిత్ర గణేష్ కుమార్, నడిపిల్లి నితేష్ కుమార్లను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరుణ్ కుమార్కు ఈ ముగ్గురు స్నేహితులు. అయితే అరుణ్ కుమార్ సుపారీ గ్యాంగ్తో కలిసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో ఒక సీఈ యూనియన్ హస్తం ఉందని కార్మికులు, ఇతర యూనియన్లు చెప్పుకుంటున్నాయి. ఐఎన్టీయూసీ నిరసన ఎన్ఏడీ అధికారి దాడి ఘటనపై ఐఎన్టీయూసీ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, థర్డ్ లెవెల్ జేసీఎం సభ్యుడు సాలాపు మారయ్య మాట్లాడుతూ ఎన్ఏడీ యూనియన్ నాయకులు సుపారీ గ్యాంగ్తో అధికారిపై దాడి చేయించారని ఆరోపించారు. హత్యాయత్నం చేయడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారన్నారు. కార్మిక సంఘాల నాయకులు కార్మిక చట్టాలను అనుసరించి పోరాటాలు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప, దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. నిరసనలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన -
నేడు ఉపమాకలో తొలి ఏకాదశి పూజలు
నక్కపల్లి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. విరామం అనంతరం తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు భక్తులతో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉపమాకకు చెందిన శ్రీనివాస భక్త సమాజం వారిచే ఉపమాక గరుడాద్రి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ జరుగుతుందన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు ఉంటాయని ప్రసాదాచార్యులు తెలిపారు. -
ఘనంగా జగన్నాథుని తిరుగు యాత్ర
బీచ్రోడ్డు: ఉత్కళ్ సంస్కృతి సమాజ్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ముగింపు వేడుక శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల కిందట లాసన్స్బే కాలనీలోని గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి తిరిగి దసపల్లాలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. ఈ ఊరేగింపులో ఒడిస్సీ, కూచిపూడి నృత్యాలు, ఒడిశాకు కళాకారుల ‘థింసా’నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన ఆలయానికి చేరుకున్నాక.. లక్ష్మీదేవిని శాంతిపజేయడానికి జగన్నాథుడు రసగుల్లాలు సమర్పించే సంప్రదాయాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సమాజ్ అధ్యక్షుడు జె.కె. నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన
రంపచోడవరం: గిరిజన విద్యార్థులకు అర్ధమైయ్యే రీతిలో బోధించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. మండలంలోని బందపల్లి ఆశ్రమ పాఠశాలను పీవో శనివారం సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి పాఠశాలలో వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు, నోట్ బుక్స్ విద్యార్థులకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వెండర్లు కోడి మాంసం, పాలు, గుడ్లు సక్రమంగా సరఫరా చేస్తున్నారో లేదా తెలుసుకున్నారు. విద్యార్థులకు అనారోగ్యమైతే తక్షణమే వైద్య సేవలందించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారులకు ఆట పాటలతో బోధన చేసి పాఠశాలకు సిద్ధం చేయాలన్నారు. సీతపల్లి ఎంపీపీ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం సమక్రంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలపై పూర్తి పర్యవేక్షణ : ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీడీ రుక్మాండయ్య అన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో తాడేపల్లి, బూసిగూడెం ఆశ్రమ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు బేస్ లైన్ టెస్టు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్ధికి నాణ్యమై/న విద్య అందించే విధంగా ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. నిబంధనలు ప్రకారం మెను అమలు చేయాలన్నారు.ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం -
పేరేంట్స్ డే విజయవంతం చేయండి
పాడేరు : జిల్లాలో ఈనెల 10న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పెరెంట్స్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. మెగా పెరెంట్స్ డే, తల్లికి వందనం అమలుపై శనివారం కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల10న జిల్లాలోని 2,900 పాఠశాలల్లో పేరెంట్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. మెగా పెరెంట్స్ డే నిర్వహణకు రూ.61లక్షల 11వేల నిధులను పాఠశాలలకు విడుదల చేశామన్నారు. పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థుల తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. పేరెంట్స్ డే నిర్వహణకు మండల ప్రత్యేకాధికారులను నియమించినట్టు తెలిపారు. బాలికల రక్షణ, సైబర్స్ క్రైమ్, ఆరోగ్యం, డ్రగ్స్ వద్దు బ్రో, గంజాయి నిర్మూలన తదితర వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. తల్లికి వందనం మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా లక్షా 56వేల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయినట్టు చెప్పారు. రెండో విడత ఈనెల 10న జమ చేస్తారన్నారు. మెగా పేరెంట్స్ మీట్లో రంగవల్లులు, క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. ఆకాంక్ష జిల్లాకు రూ.10కోట్ల నిధులు విడుదల అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాంక్ష జిల్లా కావడం వలన నీతి ఆయోగ్ రూ.10కోట్ల నిధులను విడుల చేసిందన కలెక్టర్ దినేష్కుమార్ చెప్పారు. ఆ నిధులను విద్యాభివృద్ధికి వెచ్చిస్తామన్నారు. జిల్లాలో ఐదు మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అధ్లెటిక్స్, రెజ్లింగ్ తదితర క్రీడల్లోశిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యేకంగా ఫిజికల్ డైరెక్టర్లను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. విద్యార్ధులకు క్రీడల్లో తర్పీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో మాదిరిగా సూపర్ 50 తరగతులను నిర్వహిస్తామన్నారు. మనబడి మన భవిష్యత్ కింద భవనాలు లేని పాఠశాలలను గుర్తించి రూ.56 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా మండలానికి మూడు పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతి, నాణ్యమైన భోజనం, వైద్య సేవలు, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఐటీడీఏ మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. వారపు సంతల్లో పుడ్సేప్టీ అధికారులు చేత ప్రత్యేక తనిఖీలు చేయించి కల్తీలను అరికడతామన్నారు. పాఠశాలలకు రూ.61లక్షలు విడుదల కలెక్టర్ దినేష్కుమార్ -
సమ్మోహన భరితం.. సత్యభామ నృత్యోత్సవం
మద్దిలపాలెం: మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 11వ సత్యభామ యువ నృత్యోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు అంతర్జాతీయ స్థాయి భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రతిష్టాత్మక నృత్యోత్సవంలో భాగంగా సత్యభామ నేషనల్ అవార్డులు – 2025లను గీతా నారాయణ సుదగాని – కూచిపూడి (ఏపీ), సంజనా పుట్ట – కూచిపూడి (అమెరికా), డా. మనీషా మిట్టల్ – భరతనాట్యం (కర్ణాటక), అపర్ణ శర్మ ఈ.జీ – కేరళ నాటనం (కేరళ), లక్ష్మీశ్రవణ్ – భరతనాట్యం (కర్ణాటక)లకు ప్రదానం చేశారు. వివిధ రాష్రాలకు చెందిన నృత్యోత్సవ డైరెక్టర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ, ఈ ఉత్సవం భారతీయ శాసీ్త్రయ నృత్యాలకు గొప్ప వేదికగా నిలుస్తుందని, కళాకారులకు తమ నృత్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కలుగుతుందని అన్నారు. రిటైర్డ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ రవిశంకర్ నారాయణ్ సుధాగాని మాట్లాడుతూ, ఈ నృత్య మహోత్సవానికి ప్రతి సంవత్సరం అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ, విక్రమ్ కుమార్ గౌడ్ గత 25 ఏళ్లుగా భారతీయ నృత్య సంప్రదాయాలను అభివృద్ధి చేస్తూ, నూతన తరం కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ నృత్య పోటీలు నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు, నృత్యోత్సవాల సారధి బత్తిన విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ, తొలిరోజు జరిగిన జాతీయ నృత్య పోటీలలో సుమారు వందకు పైగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన భరతనాట్యం, కథాకళి నృత్య కళాకారిణి పరిమిత ముఖర్జీ, మణిపూరి రాష్ట్రానికి చెందిన సుమనలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ వంటి భారతీయ శాసీ్త్రయ నృత్యాలతో పాటు జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
తుది విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం నుంచి తుదివిడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీన ఆషాఢ పౌర్ణమిని పురస్కరించు కుని స్వామివారికి సమర్పించనున్న మూడు మ ణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ అరగదీత చేపట్టారు. ఉదయం చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 15 మంది నాలుగో తరగతి సిబ్బంది 36 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ చందనం అరగదీత కొనసాగనుంది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, సూపరింటెండెంట్ వెంకటరమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన
పాడేరు రూరల్: హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ఆరోపించారు. శనివారం ఆయన పాడేరులో మాట్లాడుతూ జిల్లాలోని అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దకోట జీనబాడు, గుజ్జలి, చిట్టంపాడు ప్రాంతాల్లో ఏడు వేల ఎకరాలు సేకరించి నవయుగ కంపెనీకి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గిరిజన ప్రాంతా ఖనిజ సంపదలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అదానీతో చేతులు కలిపిందన్నారు. ఐదో షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అనుమతి లేకుండాఎటువంటి ప్రాజెక్టులు, కంపెనీలు ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేయకూడదన్నారు. గిరిజన చట్టాలు, హక్కుల ధిక్కరణ రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లోని రెండు లక్షల పీవీటీజీ, ఆదివాసీ గిరిజన కుటుంబాలు ముంపునకు గురవుతున్నారన్నారు. బాకై ్సట్ ఉప్పందాల మాదిరిగానే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఇచ్చేందుకు కూటమి న్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 1800 మెగావాట్లకు పెంచి అనుమతులు ఇచ్చేందుకు ప్రతిపాదించి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అప్పలనర్స, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు పాల్గొన్నారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం -
● వాగులు దాటితేనే చదువులు
తీగలవలస పంచాయతీ పంతలచింతలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సుమారు 22 మంది విద్యార్థులు కిలోమీటరు దూరంలోని తడిగిరి పంచాయతీ ముళ్లుమెట్ట పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరంతా శనివారం పాఠశాలకు కాలినడకన బయలుదేరారు. భారీ వర్షానికి మార్గం మధ్యలో గోనెల రేవు వాగులు పొంగి ప్రవహించడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రవాహాన్ని గమనించిన కొంతమంది ఒడ్డున ఆగిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక గిరిజనులు అక్కడికి చేరుకుని వాగు దాటించి బడికి పంపించారు. ఈ సందర్భంగా గ్రామ గిరిజనులు మాట్లాడుతూ గ్రామంలో 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల ఏర్పాటుచేయలేదన్నారు. దీనివల్ల ప్రమాదకర పరిస్థితుల మధ్య వాగులు దాటి పాఠశాలకు వెళ్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు తమ సమస్యను గుర్తించి గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – హుకుంపేట -
ఆక్రమణలు తొలగించాల్సిందే
పాడేరు : పట్టణంతో పాటు ఏజెన్సీలో రోజురోజుకు పెరుగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను న్యాయస్థానం ఆదేశాల మేరకు తక్షణమే తొలగింపు చేపట్టాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరోసారి హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను జిల్లా ఉన్నతాధికారులు బేఖాతర్ చేస్తూ ఆక్రమణల తొలగింపులో నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులతో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నాలుగు గంటల పాటు రహదారిపై కూర్చొని నిరసన కొనసాగించారు. స్థానికులతో కలిసి రహదారిపై కూర్చొని భోజనం చేశారు. సీఐ దీనబంధుసిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని ఎమ్మెల్యేకు సూచించారు. కానీ జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఆందోళన కారణంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ దినేష్కుమార్ అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేతో చర్చించారు. ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని కొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటామని హామీ ఇవ్వడంతో గడువు ఇచ్చామన్నారు. ఈ విషయంపై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆక్రమణల తొలగింపు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, పెదబయలు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాతరి సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, సర్పంచ్ వంతాల రాంబాబు, వైఎస్సార్సీపీ సీనియర్, యువజన విభాగం నాయకులు కూడా సుబ్రమణ్యం, మినుముల కన్నాపాత్రుడు, గుల్లెలి లింగమూర్తి, రాజేష్, కొర్రా బాబి, గంగరాజు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతాం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరిక పాడేరులో ప్రధాన రోడ్డుపై బైఠాయించి జిల్లా ఉన్నతాధికారుల తీరుపై నిరసన కలెక్టర్ దినేష్కుమార్ హామీతో విరమణ -
రూ.103 కోట్లతో జైళ్ల అభివృద్ధి
ఆరిలోవ (విశాఖ): రాష్ట్రంలో వివిధ జైళ్లలో రూ.103 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఏపీ జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ పనుల కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు జవహర్బాబు, సాయి ప్రవీణ్, సూర్యకుమార్, జైలర్లతో కలసి పలు బ్యారక్లు, ఆస్పత్రులను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైళ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో 250 మంది ఖైదీల సామర్ధ్యం కలిగిన కొత్త బ్యారక్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఐసీజీఎస్ 2.0తో శాఖల మధ్య సమన్వయం జైళ్ల శాఖతో పోలీస్, న్యాయ శాఖలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టం 2.0(ఐసీజీఎస్) టెక్నాలజీని ఏర్పాటు చేశామని, దీని వల్ల ఆ మూడు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని తెలిపారు. ల్యాప్టాప్లు, డెస్క్ టాప్లు వినియోగించి, ఆన్లైన్ విధానం అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 14 కేంద్ర కారాగారాల్లో సూపరింటెండెంట్లకు ఒక్కో ల్యాప్టాప్ చొప్పున అందించామన్నారు. వీటితో పాటు అన్ని కేంద్ర కారాగారాలు, జిల్లా, సబ్ జైళ్లకు మరో 108 డెస్క్టాప్లు అందించామని తెలిపారు. దీనివల్ల సాంకేతిక, పరిపాలనా విధానం, సీసీ కెమెరాల పనితీరు, అవి ఏ విధమైన సాంకేతికతతో కూడి ఉన్నాయి, ఖైదీల పూర్తి వివరాలు, బయోమెట్రిక్ విధానం తదితర అంశాలు స్పష్టంగా నమోదై ఉంటాయన్నారు. ఆ వివరాలు అవసరం మేరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్