breaking news
Alluri Sitarama Raju District Latest News
-
మత్స్యగుండంలో పకడ్బందీగా శివరాత్రి ఉత్సవాలు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు మాట్లాడుతున్న ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఇతర అధికారులు సాక్షి,పాడేరు: పవిత్ర పుణ్యక్షేత్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఈఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 14నుంచి 16వతేదీ వరకు మత్స్యగుండంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో మూడు రోజుల జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత తాగునీరు,విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, పాడేరు డీఎస్పీ అభిషేక్, డీఎల్పీవో కుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
● శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ దారుణం ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు. దాడి చేసిన వారికి బెయిల్.. ప్రశ్నించిన అంబటికి జైలా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్, పాలిశెట్టి సురేష్, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్, మలసాల కుమార్ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్, ధీరజ్ కుమార్, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జి.మాడుగుల: కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం మండలంలోని కుంబిడిసింగి, బొయితిలి, కిల్లంకోట పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కుంబిడిసింగి వెళ్లే మార్గంలో గెడ్డపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, కిల్లంకోట గ్రామ సమీపంలోని గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి మరో మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేసి, పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కిల్లంకోట పంచాయతీ చిలకపనస గ్రామంలో జరుగుతున్న తారు రోడ్డు పనులను తనిఖీ చేశారు.కె.బందవీధి నుంచి బొయితిలి ఆశ్రమ పాఠశాల వరకు జరుగుతున్న పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని, త్వరలోనే రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెదబయలు మండలం బూరికిపనస సమీపంలోని కల్వర్టు పనులు పూర్తికాగానే, మార్చి నాటికి గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కుంబిడిసింగిలో పంచాయతీ భవనం లేక పడుతున్న ఇబ్బందులను గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. స్థానిక ఎంపీపీ లంబోరి అప్పలరాజు కలెక్టర్ను కలిసి పలు ప్రాంతాల్లో కొత్త రోడ్ల మంజూరు కోసం కోరారు. దిగరాపల్లి ఆర్అండ్బీ రోడ్డు నుంచి జాములవీధి వరకు రెండు కిలోమీటర్లు, పులుసుమామిడి ఘాట్ నుంచి సిరిసపల్లి వరకు రెండు కిలోమీటర్లు, వాకపల్లి రోడ్డు నుంచి తోకగరువు వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మండిభ నుంచి రాసవీధి వరకు 2.5 కిలోమీటర్ల కొత్తరోడ్డు, మడతకొండ నుంచి రెయ్యిలగెడ్డ, వణుకూరు, సారాపల్లి వరకు 3.5 కిలోమీటరు మేర రోడ్లకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుభద్ర, సర్పంచ్లు కృష్ణమూర్తి, లసంగి మాలన్న, మాజీ సర్పంచ్ రామన్న, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
భగవంతుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేల్చిన తర్వాత కూడా కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన శివభక్తులపై లాఠీ చార్జీ చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. -
మత్స్యగెడ్డలో పడి వ్యక్తి మృతి
అరడకోటలో విషాదం పెదబయలు: మండలంలోని అరడకోట గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి తమర్భ వెంకటరమణ (35) అనే వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో వెంకటరమణ బహిర్భూమి కోసం మత్స్యగెడ్డ ఒడ్డుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి గెడ్డలో పడిపోవడంతో, నీటి అడుగున ఉన్న ఊబిలో చిక్కుకొని మృతి చెందాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన్ని కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఒడిశాకు వెళ్లే బోటు రేవు (వెలంబొడ్డ) సమీపంలో కొన్ని గంటల తర్వాత మృతదేహాన్ని గమనించిన స్థానికులు అరడకోట గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్, మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబంలో తీరని లోటు.. మృతుడు వెంకటరమణ ప్రైవేటు జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనతో అరడకోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లక్ష్యంతోనే ఉన్నతస్థాయి సాధ్యం
కొయ్యూరు: ఉన్నత స్థితికి చేరేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి లక్ష్యంతో ముందుకు సాగాలని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సూచించారు. బుధవారం ఆయన మండలంలో బాలుర ఆశ్రమ పాఠశాల–1, శరభన్నపాలెం బాలుర ఆశ్రమ పాఠశాల, పెదమాకవరం బాలికల పాఠశాలను సందర్శించారు. బోధనను పరిశీలించారు. పెదమాకవరం, శరభన్నపాలెంలో టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదిలో మంచి మార్కులు ఎలా సాధించాలో సూచించారు. ఇప్పటినుంచి ఇష్టపడి చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని తెలిపారు. గణితం, ఆంగ్లం,సైన్స్తో పాటు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించాలని కోరారు. నిరంతరం లక్ష్యంతో తపిస్తే అనుకున్నది సాధించడం సులభంగా మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం,బోధనపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరికి ఆరోగ్యం సరిగా లేకున్నా తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ ఉన్నారు. -
నిరుపయోగం
నాడుచింతపల్లిలో ఖాళీగా యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనం గిరిజన యువత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన జిల్లాలోని ఏకైక శిక్షణ కేంద్రం.. నేడు నిశ్శబ్దానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. రూ.కోట్ల ప్రజాధనంతో చింతపల్లిలో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా పడి ఉంది. ఒకప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులతో కళకళలాడిన ఈ భవనం, నేడు కేవలం ఒక ఖాళీ కట్టడంగా మిగిలిపోవడంపై మన్యం యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. కలల సౌధం..నేడుచింతపల్లి: మండలకేంద్రం చింతపల్లికి పొలిమేరలోని కొండపై, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు రూ.కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్ నేడు నిరుపయోగంగా మారింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలతో పాటు పాడేరు డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవాల్సిన ఈ కేంద్రం, ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పడి ఉంది. అనేక శిక్షణలకు వేదికగా.. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం చింతపల్లిలోని సాయిబాబా ఆలయ సమీపంలో అన్ని వసతులతో ఈ భవనాన్ని నిర్మించింది. ప్రారంభంలో ఇక్కడ గిరిజన యువతీ యువకులకు కంప్యూటర్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ స్కిల్స్, స్వయం ఉపాధి కోర్సులతో పాటు పోలీసు కానిస్టేబుల్, ఏపీపీఎస్సీ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్ శిక్షణ కూడా ఇక్కడ నిర్వహించేవారు. ఏకలవ్య నుంచి కోవిడ్ సెంటర్ వరకు.. చింతపల్లిలో తొలిసారిగా ప్రారంభించిన ఏకలవ్య ఆదర్శ పాఠశాల గత విద్యా సంవత్సరం వరకు ఇక్కడే కొనసాగింది. అంతేకాకుండా ఐటీడీఏ, మాక్స్ ఆధ్వర్యంలో కాఫీ గింజల నిల్వ, రైతులతో సమావేశాలు, వేలం వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవి. కరోనా సమయంలో ఈ కేంద్రాన్ని క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించి ఎంతో మందికి సేవలందించారు. గత రెండు, మూడు నెలల క్రితం వరకు కొయ్యూరు ఏకలవ్య ఆదర్శ పాఠశాల కూడా ఇక్కడే నిర్వహించారు. అయితే, కొయ్యూరులో నూతన భవనం అందుబాటులోకి రావడంతో పాఠశాలను అక్కడికి తరలించారు. అప్పటి నుంచి ఈ యూత ట్రైనింగ్ సెంటర్ భవనం ఖాళీగా ఉండి, క్రమంగా పాడవుతోంది. రూ.కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ శిక్షణ కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
బంగారుమెట్టలో కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : బంగారుమెట్ట,లోపూడి గ్రామాల మధ్య మిరాశలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు తోటలు కాలిపోయాయి. విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోటలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బంగారుమెట్టకు చెందిన జక్కా చిన్నారావు, వేచలపు చినతల్లికి చెందిన సరుగుడు తోటతో పాటు విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోట కాలిపోయాయి. సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది గంగరాజు, శివయ్యనాయుడు, రాజు, అర్జున మంటలను అదుపు చేశారు. -
వేసవిలో పొదుపుగా నీటి వాడకం
సీలేరు: ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయం నీటి నిల్వలపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులు స్థానిక ఏపీ జెన్కో గెస్ట్ హౌస్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో గ్రిడ్కు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. బలిమెల జలాశయంలో ప్రస్తుతం మొత్తం 86.8499 టీఎంసీల నీరు ఉంది. దీనిలో ఒడిశా వాటా: 28.4829 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా: 58.3670 టీఎంసీలు ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాల కోసం ఒడిశా రోజుకు 3వేలు క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ 6,500 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. 2024–25 నీటి సంవత్సరంలో (జూలై నుంచి జనవరి వరకు) ఒడిశా 58.2836 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 28.3996 టీఎంసీలు వినియోగించింది. ఈ సమావేశంలో ఒడిశా నీటిపారుదల శాఖ, ఓహెచ్పీసీఎల్ అధికారులతో పాటు ఏపీ జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, హనుమ, ఏడీ జయపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నాధికారులకు నివేదించాం
చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్నటు యూత్ ట్రైనింగ్ సెంటర్ని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఐటీడీఏ ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సాధ్యమైన తొందరలో ఈ కేందాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – సీతామహాలక్ష్మి, ఎంిపీడీవో, చింతపల్లివినియోగంలోకి తేవాలి చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలి. ఈ కేంద్రం నిరుపయోగంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భవనం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి – దురియా పుష్పలత, అధ్యక్షురాలు, సర్పంచ్ల ఫోరం, చింతపల్లి -
దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం
దేవరాపల్లి: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలవ లేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విష ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని, ఇప్పుడేమో ఏకంగా బాత్రూమ్లు కడిగే హార్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని దు ష్ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమన్నా రు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై బురదజల్లాలన్న దుర్బుద్ధితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. వీరిద్దరితో పాటు కూటమి నేతలంతా శ్రీవారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా దేవుడితో రాజకీయాలు చేయడం మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేసే విష సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు. -
36 టన్నుల మేర కాఫీ కొనుగోలు
● జీసీసీ బ్రాంచి మేనేజర్ అప్పన్నమాట్లాడుతున్న జీసీసీ మేనేజర్ అప్పన్న పెదబయలు: స్థానిక జీసీసీ బ్రాంచ్ పరిధిలో 70 టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 36 టన్నులు కొనుగోలు చేశామని బ్రాంచ్ మేనేజర్ జి.అప్పన్న తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కాఫీ కొనుగోలుకు సంబంధించి రూ.1.70 కోట్లతో కాఫీ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాఫీ గింజలను నేరుగా గ్రామాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర రైతులు ముందుగానే అడ్వాన్సులు తీసుకుని ఉన్నందున వారికి ఎక్కువ మొత్తంలో కాఫీ ఇస్తున్నారన్నారు. రైతులకు జీసీసీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 62 మంది కాఫీ రైతులకు రూ. 5 45 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. గిరిజనులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలకు విక్రయించాలని ఆయన కోరారు. కాఫీ అమ్మకాలు చేసిన రైతులకు 24 గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
● ఎస్పీ అమిత్ బర్దర్ సాక్షి,పాడేరు: జిల్లాలో మావోయిస్టుల కార్యకలపాల నిర్మూలన ,శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేయాలని ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై నేరసమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా గ్రామాల సందర్శన చేపట్టాలన్నారు. బాలికలు, మహిళలకు రక్షణతో పాటు సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలన ముందున్న లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు పంకజ్ కుమార్ మీనా, నవజ్యోతిమిశ్రా, డీఎస్పీలు సాయిప్రశాంత్, ఆర్వీవీఎస్ అభిషేక్, బొడ్డు హేమంత్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే కంటైనర్ తొలగింపు
గొలుగొండ: ఏటిగైరంపేటలో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న కంటైనర్ను కూటమి నేతలు రాజకీయ కక్షతోనే తొలగించారని మండల వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత పాము అప్పలనాయుడుపై కక్షతో ఇలా చేయడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణీశాంతారామ్, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాము అప్పలనాయుడును పరామర్శించి, కంటైనర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటైనర్ను తొలగించడం దారుణమన్నారు. కోర్టు అనుమతితో ఈ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారని, తొలగింపుపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని వారు చెప్పారు. అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, గాదంపాలెం, కొమిర సర్పంచ్లు నల్లబెల్లి శ్రీనివాసరావు, అల్లురాజుబాబు, ఏఎల్పురం ఎంపీటీసీ సభ్యులు బుల్లిప్రసాద్, సీనియర్ నాయకులు కిలపర్తి పెద్దిరాజు, కొల్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనుల తనిఖీ
దేవరాపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్రం నుంచి వచ్చిన అధికారితో కూడిన బృందం పరిశీలించింది. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ, చిననందిపల్లి, తారువ, బోయిలకింతాడ, కొత్తపెంట తదితర గ్రామాల్లో బుధవారం అధికార్లు పర్యటించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మండలాల వారీగా ఆన్లైన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని అక్కడ నిబంధనల ప్రకారం పని జరిగిందా లేదా అని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. జలసంచయ్–భాగీదారీ పథక కేంద్ర నోడల్ అధికారి, కేంద్ర జల కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సుగుణాకరరావు, డ్వామా నుంచి ఇంజినీరింగ్ కన్సల్టెంట్ బాలు తదితర అధికారులు చెరువులు, నీటి గుంతల పనులను పరిశీలించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఉపాధి హామీ పథకం ఏపీవో వై. రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, లక్ష్మణరావు, ఎర్రునాయుడు, సత్యనారాయణ ఉన్నారు. -
నిబంధనల ప్రకారమే ఆదిత్యకు ధ్రువపత్రం జారీ
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్యకు గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తహసీల్దార్ కె. కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్యకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చారు. ఆదిత్య తండ్రి (లేటు) ఎండపల్లి కన్నంనాయుడుకు సంబంధించి 1982 నాటి టీసీతో పాటు 2005, 2017, 2022, 2024 సంవత్సరాల్లో అరకులోయ తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ అయిన కొండదొర (ఎస్టీ) కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదిత్య చదువుకున్న టీసీ, 2013 నుంచి 2025 వరకు వివిధ సంవత్సరాల్లో అతను పొందిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఈ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు. రైల్వే శాఖలో పనిచేస్తూ మృతి చెందిన కన్నంనాయుడు వారసుడిగా ఆదిత్య ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అతని కులాన్ని నిర్ధారించాలని కోరుతూ రైల్వే అధికారులు 2025 సెప్టెంబర్ 18, డిసెంబర్ 24 తేదీల్లో తహసీల్దార్కు లేఖలు రాశారన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వోలు ఎండపల్లివలసలో క్షేత్రస్థాయి విచారణ (పంచనామా) నిర్వహించి, వారు కొండదొర కులానికి చెందిన వారని నిర్ధారించిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశామని వివరించారు. ఈ విషయంలో ఎవరికై నా ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు. అరకు తహసీల్దార్ కుమారస్వామి -
మత విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మానుకోవాలి
దేవరాపల్లి: ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతుంటే అవేవీ పట్టించుకోకుండా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని వాడుకోవడం దారుణమన్నారు. లడ్డూలో జరిగిన కల్తీపై సిట్ నివేదికను అధికారికంగా వెల్లడించకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమకు తోచిన విధంగా దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై కూటమి నాయకులు తలో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్రం నియమించిన సిట్ టీటీడీకి చెందిన ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే కూటమి ప్రభుత్వం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డారని సిట్ నివేదిక చెప్పినా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయడం చూస్తే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
● పోతురాజు బాబు ఆలయానికి షెడ్డు నిర్మాణం ● రిటైర్డ్ ఉద్యోగి సేవాభావం
పుట్టిన ఊరిపై మమకారం కొయ్యూరు: ఉద్యోగ రీత్యా ఎక్కడో స్థిరపడినా, కన్నతల్లిని.. ఉన్న ఊరిని మర్చిపోకూడదని నిరూపించారు రిటైర్డ్ ఉద్యోగి జంపా అప్పారావు. తన సొంత గ్రామమైన రావణాపల్లి పంచాయతీ తోట లూరుపై ఉన్న ప్రేమతో, అక్కడి స్థానిక ఆలయ అభివృద్ధికి ఆయన చేయూత అందించారు. భక్తుల సౌకర్యార్థం రూ. 50 వేలతో అభివృద్ధి తోటలూరులోని శ్రీశ్రీశ్రీ పోతురాజు బాబు ఆలయం సరైన వసతులు లేక ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన అప్పారావు, భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సుమారు రూ. 50 వేలు సొంత నిధులతో రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఆయన ఎంఎంటీసీలో పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. మంగళవారం షెడ్డు పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సొంత ఊరిలోని ఆలయానికి చిన్న సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తోటలూరుకు చెందిన ఎంతోమంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వారందరూ కూడా తమ వంతుగా గ్రామాభివృద్ధికి సహకరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆయన దాతృత్వాన్ని చూసి తోటలూరు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. తోటి ఉద్యోగులకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు. -
గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
● టికిలిబెడ్డలో ఘటన డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ పరిధి మారుమూల టికిలిబెడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి 7:30 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పాలకి అనందరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాప్తించి, ఇంట్లోని ధాన్యం, దుస్తులు, విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. సర్వం కోల్పోయి వీధిన పడ్డామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అదుకోవాలని వారు కోరుతున్నారు. -
అరకువేలీలో తగ్గిన ఉష్ణోగ్రతలు
● 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం అరకువేలిలో 6.5 డిగ్రీ లు, ముంచంగిపుట్టులో 7.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.1 డిగ్రీలు, జి.మాడుగులలో 10.3 డిగ్రీలు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీ లు, అనంతగిరిలో 15.1 డిగ్రీలు నమోదు అయ్యాయయని ఆయన పేర్కొన్నారు. -
త్రోబాల్ పోటీల్లో టీచర్ల ప్రతిభ
● రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం ● జట్టు సభ్యులను అభినందించిన కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: రాష్ట్రస్థాయి టీచర్స్ లీప్ యాప్ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన మహిళాటీచర్లు త్రోబాల్ పోటీల్లో సత్తా చాటారు.రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరిని మంగళవారం కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ మంగళవారం కలెక్టరేట్లో అభినందించారు.ఎస్జీఎఫ్ జిల్లా మేనేజర్ సూరిబాబు,కోచ్ రాజులమ్మ,త్రోబాల్ క్రీడాకారులు రమణమ్మ, రాజేశ్వరి, దుర్గలత, కొండమ్మ, ఆశ పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలు నిలబెట్టుకో చంద్రబాబు
ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్ సాక్షి,పాడేరు: ఎన్నికలకు ముందు అరకు సభలో ఆదివాసీలకు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల హమీని సీఎం చంద్రబాబు వెంటనే నిలబెట్టుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోను జారీ చేసి గిరిజన ప్రాంతాలలో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావవస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. గత ఏడాది మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన రాబోయే డీఎస్సీలో మళ్లీ గిరిజనులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. గిరిజన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఈనెల 11వతేదీ బుధవారం జరిగే 114వ గిరిజన సలహా మండలి(టీఏసీ) సమావేశంలో సీఎం చంద్రాబు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవోకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సలహా మండలి మినీ రాజ్యాంగంగిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి మినీ రాజ్యాంగమని, అందులో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు,ఇతర సభ్యులంతా గిరిజనులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం రద్దుకు సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఆయన కోరారు..రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి, కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. -
కార్పొరేట్ కంపెనీల కోసమే లేబర్ కోడ్లు
సాక్షి,పాడేరు: ఈనెల 12వతేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజాశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పీఎంఆర్సీ భవనంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా లేబర్ కోడ్లను తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈలేబర్ కోడ్లు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లు లాభాలు మిగిల్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. లేబర్ కోడ్లను జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశం అనంతరం బైక్ ప్రచార ర్యాలీని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ జెండా ఊపి ప్రారంభించారు.సీఐటీయూ జిల్లా నేతలు ఎల్.సుందర్రావు, పోతురాజు, పలు ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు చిన్నారి, రేణుక, కాంతమ్మ, రత్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజాశర్మ -
రీసర్వే 2.0లో అవకతవకలు జరిగితే చర్యలు
● కలెక్టర్ దినేష్కుమార్ ● పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్పాడేరు: భూవివాదాల పరిష్కారం, శాశ్వత భూమి హక్కుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వే 2.0లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. మంగళ వారం ఆయన కలెక్టరేట్ నుంచి పోలవరం, అల్లూరి జిల్లాల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. సర్వే 2.0 నిర్వహణకు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్వే బృందాలకు మండల స్థాయిలో సమగ్ర శిక్షణ ఇవ్వాలి. ఇందులో తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రెండు జిల్లాల్లో గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, సర్వేను అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యూటేషన్ల సమయంలో సర్వే బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉద్యానవన పంటల సాగు పెంచాలి పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ రెండు జిల్లాలు ఉద్యానవన పంటలకు ఎంతో అనుకూలమైనవన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలతో భూసార పరీక్షలు నిర్వహించి, కొత్త రకం పంటలను ప్రోత్సహించాలన్నారు. కాఫీ సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తూనే, అంతర పంటల సాగును పెంచాలన్నారు. అల్లం, మిరియాలు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, లిచీ, స్ట్రాబెర్రీ, జీడిమామిడి, పైనాపిల్, సీతాఫలం, పనస, పామాయిల్ వంటి పంటల ద్వారా రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నందు, జిల్లా ఉద్యానవన అధికారి బాలకర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జిహ్వచేపల్యం
నోరూరిస్తున్న ‘పొడైల మాచ్’.. సంతలో విరివిగా అమ్మకాలుపెదబయలు: మన్యంలోని గిరిజనుల జీవనశైలి ఎంత విభిన్నమో, వారి ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రత్యేకం. మైదాన ప్రాంత ప్రజలతో పోలిస్తే వీరి వంటకాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా అందరూ చేపలతో పులుసు లేదా ఫ్రై చేసుకుంటారు. కానీ, ఇక్కడ వేటాడిన చేపలను నిప్పులపై కాల్చి, ఆపై ఎండలో ఆరబెట్టి భద్రపరుచుకోవడం ఒక విశిష్టమైన పద్ధతి. ఏమిటీ ‘పొడైల మాచ్’? అరకు ప్రాంతంలో ’బొంగు చికెన్’ ఎంత ఫేమస్సో, పెదబయలు వారపు సంతల్లో ’పొడైల మాచ్’ (ఒరియా భాషలో కాల్చిన చేపలు) అంత పాపులర్. ● పెదబయలు, ముంచంగిపుట్టు సరిహద్దుల్లోని మత్స్యగెడ్డ, జోలాపుట్టు రిజర్వాయర్, డుడుమ డ్యాం ప్రాంతాల్లో గిరిజనులు చేపలను వేటాడుతుంటారు. వేటాడి తెచ్చిన చేపల్లో పెద్ద వాటిని పక్కన పెట్టి, చిన్న పరిగె చేపలను ఎంచుకుంటారు. వీటిని మంటల్లో పొడిపొడిగా కాల్చి, ఆ తర్వాత ఎండలో పూర్తిగా ఎండిపోయేలా చేస్తారు. పురుషులు చేపల వేటకు వెళ్తే, వాటిని కాల్చి, ఎండబెట్టి విక్రయానికి సిద్ధం చేసే బాధ్యతను మహిళలు, పిల్లలు తీసుకుంటారు. ఇలా వందలాది గిరిజన కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సంతల్లో ఫుల్ డిమాండ్! : ప్రస్తుతం మార్కెట్లో దొరికే చెరువు చేపలు, సముద్రపు చేపల కంటే ఈ గెడ్డ చేపలకే గిరాకీ ఎక్కువ. ఎలాంటి వ్యర్థాలు, రసాయనాలు లేకుండా సహజంగా పెరిగే ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాల్చిన చేపలతో పులుసు వండి తినిపిస్తే, బాలింతలకు కాల్షియం లభిస్తుందని, పాలు పెరుగుతాయని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ చేపలను కొనుగోలు చేయడానికి గిరిజనులు సంతల్లో ఎగబడుతుంటారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ రుచులు గిరిజనుల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి వెన్నుముకగా నిలుస్తున్నాయి. పెదబయలు సంతలో అడుగుపెడితే చాలు.. నిప్పుల మీద కాల్చిన చేపల ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇవి కేవలం చేపలు మాత్రమే కాదు, గిరిజన సంస్కృతిలో భాగమైన ఒక అద్భుతమైన రుచి. జలాల్లో పట్టిన పరిగెలను అగ్గి మీద కాల్చి, ఎండలో ఆరబెట్టి ఈ వంటకాన్ని సిద్ధం చేస్తారు. సహజసిద్ధమైన ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని, ముఖ్యంగా బాలింతలకు ఇది గొప్ప పౌష్టికాహారమని గిరిజనులు చెబుతుంటారు. రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం కావాలనుకునే వారు ఈ ’పొడైల మాచ్’ ను అమితంగా ఇష్టపడతారు. -
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులు వైఎస్సార్ కడప జిల్లా వాసులు కొయ్యూరు: మండలంలోని బలభద్రం గ్రామం సమీపంలోని డౌన్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ప్రాథమి క చికిత్స అనంతరం 108 వాహనాల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమిలా.. వైఎస్సార్ కడప జిల్లాలోని కొత్తరెడ్డిపల్లి పంచాయతీ సరిబాల, రామాపురం మండలం గంగునాయుడు గ్రామాలకు చెందిన కొందరు కార్మికులు వాటర్ షెడ్డు పథకం కింద రాతి కట్టు పనుల కోసం కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరంతా మంప పంచాయతీ చిక్కుడుపాడులో నివాసం ఉంటున్నారు.మంగళవారం సాయంత్రం పనులు ముగించుకుని ఆటోలో చిక్కుడుపాడు బయలుదేరారు. డ్రైవర్ అంతిరెడ్డి శ్రీనివాస్ ఆటో నడుపుతుండగా, అతని పక్కనే కూర్చున్న సరిబాలకు చెందిన ఆంజనేయులు తాను నడుపుతానని బలవంతంగా స్టీరింగ్ తీసుకున్నాడు. తోటి కార్మికులు వద్దని వారించినా వినకుండా ఆటో నడపడంతో, డౌన్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో స్థానికులతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. క్షతగాత్రుల వివరాలు: వెంకటేష్(గంగునాయుడు గ్రామం): తల, ముక్కు పై తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఆర్. రమణ, ఆర్. శంకర్, జయరామ్: వీరికి కాళ్లు విరగడంతో పాటు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆంజనేయులు (డ్రైవింగ్ చేసిన వ్యక్తి) తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 వాహనం, రాజేంద్రపాలెం పీహెచ్సీ అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు స్నేహలతా రెడ్డి, స్టాఫ్ నర్సులు ఇందిర, లావణ్య, శైలు, దేవి సత్వర చికిత్స అందించారు. మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్ ఆసుపత్రిని సందర్శించి బాధితుల వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
చింతపల్లి: మండలంలో టెన్త్లో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పాడేరు, అరకువేలీ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎంఈవో ప్రసాద్ తెలిపారు. మండలానికి చెందిన సి,డి గ్రేడ్ల్లో ఉన్నటు 29 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వీరిని ఉన్నతాధికారుల ఆదేశాలు, తల్లిదండ్రుల అంగీకారం మేరకు 13 మంది విద్యార్థినులను అరకువేలీ ఉన్నత పాఠశాలకు,16 మంది బాలురలను పాడేరు ఉన్నత పాఠశాలకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు పాఠశాలకు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులను పంపిస్తున్నామన్నారు. ఈ శిక్షణ నెల రోజులపాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం గిడ్డి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నకిలీ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపించాలి
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్య (తండ్రి (లేటు) కన్నం నాయుడు) పొందిన నకిలీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరపాలని అరకుఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండపల్లి ఆదిత్యకు 2025 జూలై 17న ‘కొండదొర’ కుల ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందని, ప్రస్తుతం ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.దీనిపై గతంలో గిరిజనులు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుత తహసీల్దార్ కమక కుమారస్వామి, అప్పటి ఆర్ఐ, వీఆర్వోలు ధ్రువీకరించిన పత్రాలను పరిశీలించి, అది అసలైనదేనని పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రైల్వే అధికారులకు పంపడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎండపల్లివలసలో నివసిస్తున్న ఆదిత్య వాస్తవానికి కొండకాపు కులానికి చెందిన వ్యక్తి అని, అటువంటప్పుడు కొండదొర సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ -
పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం
కోటవురట్ల: జీవితం మలుపుకు మొదటి అడుగు ఇంటర్లోనే..పదిని పదిలంగా దాటేసినా ఇంటర్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం..ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజినీరు అవ్వాలన్నా, సైంటిస్టుగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురి తప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు ప్రతీ రోజు పరిశీలన, వారానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలంటున్నారు. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను చేధించేందుకు గత పరీక్ష పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరం జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాలకోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
డీసీసీబీలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
అనంతగిరి మండలం వెలగలపాడు వాసిగా గుర్తింపు దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)లో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కె.కోటపాడు ఇన్చార్జి సీఐ పి.అప్పలరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైవాడ జలాశయం అతిథి గృహం సమీపంలోని బ్యాంకు వెనుక భాగంలో ప్రహరీ దాటి లోపలికి ప్రవేశించాడన్నారు. మేనేజర్ గది కిటికీ ఐరన్ గ్రిల్ను తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తొలగించి బ్యాంకులోకి చొరబడినట్టు చెప్పారు. సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు అవుతుందని గమనించి తలపై స్వెటర్ కప్పుకుని లైట్లు ఆఫ్ చేసి చోరీకి యత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాష్ కౌంటర్లలో నగదు దొరకకపోవడంతో లాకర్ను తెరవడానికి యత్నించి విఫలమై అదే మార్గంలో పరారైనట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి డీఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజీలో ఫొటో ఆధారంగా నిందితుడు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు వెలగలపాడుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవరాపల్లి శారదానది వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వచ్చిన యువకుడు పంది ప్రభాస్ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కేసును కొద్ది రోజుల్లోనే ఛేదించిన సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభినందించారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా నిందితుడి ప్రభాస్ను చోడవరం కోర్టుకు తరలించినున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
లెక్చరర్లు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజూ అదనంగా గంటపాటు చదివిస్తున్నారు. సబ్జెక్టులలో అనుమానాలను తీరుస్తున్నారు. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాం. –చరణ్, బైపీసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల ప్రోత్సాహం బాగుంది.. అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. మా కళాశాలలో మంచి వాతావరణం ఉంది. స్టడీ అవర్స్ చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అధ్యాపకుల పర్యవేక్షణలో పట్టుదలగా చదువుతున్నాం. – మేఘన, సీఈసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. –ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నాం.. గత ఏడాది కంటే మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో విద్యార్ధులకు తర్ఫీదునిస్తున్నాం. అధ్యాపకులు వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించి ప్రతీ రోజు పురోగతిని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు సహకారం అందించాలి. ఇంటి వద్ద విద్యార్ధులను పర్యవేక్షించి జాగ్రత్తగా చదివేలా చూడాలి. –డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, ప్రిన్సిపాల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటవురట్ల -
కోడి పందాలపై పోలీసుల దాడి
బుచ్చెయ్యపేట: రాజాం గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం గ్రామంలో పండగ సందర్భంగా నూకాలతల్లి గుడి వెనుక జరుగుతున్న కోడి పందాలపై ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను, రెండు కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న రూ, 1,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామదేవతల పండగల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయా గ్రామాల నాయకులు పోలీసులకు సహకరించాల ని అన్నారు. -
గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
అనకాపల్లి: మండలంలోని శంకరం వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ జి. రవికుమార్ మంగళవారం తెలిపారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఉగ్గిన శేష మణికంట(29), జగ్గుపల్లి జగదీష్ (28), రాజపూడి ఆదిత్యసాయి వెంకటేష్ (29) ఉన్నారన్నారు. వీరు శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్సీ గోదాముల వెనుక కొండ ప్రాంతంలో సోమవారం గంజాయి సేవిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్టు చెప్పారు. వారిని విచారించగా విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి దుర్గాప్రసాద్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో శేష మణికంఠపై గతంలో క్రిమినల్ కేసులున్నాయన్నారు. అతని నుంచి 20 గ్రాములు,మిగిలిన ఇద్దరి నుంచి 15 గ్రాముల చొప్పున గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి
యలమంచిలి రూరల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఫైనల్ చార్జ్ షీట్లో నిగ్గుతేల్చిందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గసమన్వయకర్త కర ణం ధర్మశ్రీ తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని తెలుపుతూ ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా పదేపదే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని ఆయనడిమాండ్ చేశా రు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని,చేప నూనె కలి పారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలోనెయ్యి రూ.320కి కొంటే,చంద్రబాబు హయాంలో రూ.290కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2019 మార్చి 6న ఆసంస్థకు 82వేల కిలోల నెయ్యి ని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ని తెలిపారు.సీబీఐ సిట్ ఎన్డీడీబీ,ఎన్డీఆర్ఐలు ఇచ్చిన నివేదికలు నిజం కాదట,చంద్రబాబు చెప్పి ందే నిజమట అని మండిపడ్డారు.చేసిన తప్పులకు చెంపలు వేసుకుని చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మెడికల్, ఫార్మా మాఫియా వ్యతిరేక పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు నాసిరకం మందులు పంపిణీ చేయడంతో పాటు వాటిని అధిక ధరలకు అమ్మకాలు చేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అద్దె సర్టిఫికెట్లతో ఫార్మేషన్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పై తనిఖీలు నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఉన్నత అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కన్వీనర్ కె.త్రినాఽథ్, నాయకులు విత్తనాల పోతురాజు, మూతుర్తి సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
మెడకు చుట్టుకున్న మాంజా దారం
యలమంచిలి రూరల్: ఆటలాడుకుంటున్న రెండో తరగతి విద్యార్థి మెడకు మాంజా దారం చుట్టుకున్న ఘటనలో అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. రెండు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఉక్కిరిబిక్కిరైన విద్యార్థి దారంతో పెనుగులాడడంతో తెగిపోయింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడం, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూపడంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులను నిలదీశారు. యలమంచిలి భాష్యం స్కూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలివి.. కోర్టుపేట వీధిలో భాష్యం స్కూల్లో రెండో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఓ టీచర్ ఆటలాడించడానికి తీసుకెళ్లారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా,హెచ్ఎంకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆటలాడించడానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఆటలాడుతుండగా జారుడుబల్లపైకి ఎక్కిన నలుగురు విద్యార్థుల్లో పెదపల్లికి చెందిన బొద్దపు సాయి దీక్షిత్ మెడకు సమీపంలో చెట్టుకు వేలాడుతున్న పదునైన దారం చుట్టుకుంది. దీంతో మెడ భాగంలో రెండు లేయర్లు తెగిపోయాయి.మూడో రౌండు తిరిగే సమయంలో విద్యార్థి దారాన్ని తెంపుకొన్నాడు.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి వెంటనే చికిత్స చేయించకుండా అలాగే వదిలేశారు.విద్యార్థి తండ్రి అశోక్ ఫోన్ నంబరుకు కాల్ చేసిన టీచర్ అసలు విషయాన్ని చెప్పకుండా మీ అబ్బాయికి చిన్న గాయమైంది స్కూలుకు రావాలంటూ తెలపడంతో అనుమానం వచ్చిన తండ్రి హుటాహుటిన స్కూలు వద్దకు చేరుకున్నారు.మెడకు గాయమైనా తన కొడుక్కి చికిత్స చేయించకుండా తాత్సారం చేయడంతో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గాయపడిన విద్యార్థిని పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి,అక్కడ్నుంచి యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఎంఎల్సీ కావడంతో పట్టణ ఎస్ఐ సావిత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.మంగళవారం ఉదయం విద్యార్థిని అనకాపల్లి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్థారించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి స్కూల్ నిర్వాహకులు,గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు,పెదపల్లి గ్రామపెద్దలతో యలమంచిలి సీఐ ధనుంజయరావు సమక్షంలో చర్చలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రాధేయపడ్డారు.దీనిపై ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు తెలిసింది.కాగా భాష్యం స్కూలు బిల్డింగుతో పాటు సమీపంలో ఉన్న బహుళ అంతస్థుల భవానాలకు పెద్దపెద్ద తేనెపట్లు ఉన్నాయి.వాటివల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంటుందని,వాటిని తొలగించాలని కోరినా స్కూలు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద సంఖ్యలో విద్యార్థులను కుక్కుతున్నారని..ఇలా పలువురు తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. -
‘డెయిరీ కంటైనర్ తొలగింపు అన్యాయం’
గొలుగొండ: ఏటిగైరంపేటలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్న కంటైనర్ను అన్యాయంగా తొలగించడంపై రైతులు ఆవేదన చెందారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీసీ) గ్రామంలో పాల సంఘం ఆధ్వర్యంలో కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకం కోసం చర్యలు తీసుకుంది. గ్రామానికి చెందిన పాము లోకేష్కు వీటి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మకాలు ఇష్టం లేని కొంతమంది అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దానిని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు యత్నించారు. విశాఖ డెయిరీ సంఘంలో పాలు పోస్తున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు కంటైనర్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు. ఈ పాల ఉత్పత్తులు అమ్మకాలు చేసే కంటైనర్ ఆర్అండ్బీ స్థలంలో ఉందనే కారణంగా మంగళవారం రైతులకు తెలియకుండా దానిని తొలగించారు. ఏటిగైరంపేట పరిధిలో చాలా వరకు ఆర్అండ్బీ స్థలంలోనే షాపులు ఉండగా రైతుల ద్వారా నడిచే ఈ కంటైనర్ తొలగించడం చాలా దారుణంగా ఆవేదన చెందుతున్నారు. వీటిపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని విశాఖ డెయిరీ సంఘ కార్యదర్శి పాము అప్పలనాయుడు, రైతులు తెలిపారు. -
13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
పాడేరు : భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావా దేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాటు చేసుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందటం వంటి అంఽశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ మాతునాయుడు, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా ఫౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతంగా గుర్రాయి జలపాతం
సందర్శించిన ఇంజినీరింగ్ అధికారులు జి.మాడుగుల: ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకుంటున్న గుర్రాయి జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మండలంలో కుంబిడిసింగి పంచాయతీలో గల ఈ జలపాతాన్ని సోమవారం టూరిజం పాడేరు టీడబ్ల్యూ ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్ కృష్ణమూర్తి సందర్శించారు. జలపాత ప్రాంతం, పరిసర ప్రాంతాల అభివృద్ధిపై సర్పంచ్తో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. జలపాతానికి రోడ్డు, పర్యాటకులకు సౌకర్యాలు,వాహనాల పార్కిగ్, ఇతర వసతుల గురించి పరిశీలించారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్పంచ్ కృష్ణమూర్తి అధికారులకు తెలిపారు. -
గిరిజన విద్యార్థుల సంరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం
పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అద్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఇటీవల తరచుగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వందల సంఖ్యలో గిరిజన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కనీసం నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా బోధన కరవయ్యాయని చెప్పారు. చాలీచాలని వసతులతో నాసిరకమైన ఆహారంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. విద్యార్థులు తాగేందుకు గుక్కేడు రక్షిత నీరు కరువైందన్నారు. ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్వలంటీర్లను నియమిస్తామని ఊదరగొట్టిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేడం లేదని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన విద్యార్థులకు అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారం అందేదని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి -
కేంద్ర బడ్జెట్పై అవగాహనకు క్విజ్ పోటీలు
● విశాఖ జిల్లా మై భారత డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు అరకులోయటౌన్: కేంద్ర బడ్జెట్పై యువత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, మై భారత్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్పై యువతకు అవగాహన కల్పించేందుకు మేరా యువభారత్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయి లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి విజేతలు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాల్లో యువత పాత్రను కీలకం చేస్తూ మైభారత్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలు పి.నాగబాబు, వై.విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి మాట్లాడుతూ మై భారత్ బడ్జెట్ క్విజ్ 2026 మొదట ఆన్లైన్ ద్వారా మొదలవుతుందన్నారు. -
ఆరోగ్యశ్రీ
ఐసీయూలో మొదటి నుంచి ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అడపా దడపా బకాయిలు విడుదల చేస్తున్నా, అవి కనీసం ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. ఈ పరిస్థితి పేదవాడి పాలిట మరణశాసనంగా మారుతోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలకు ‘ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. మేము వైద్యం చేయలేం’ అంటూ ఆస్పత్రులు ముఖం చాటేస్తుండటం దారుణం. ప్రభుత్వ అసమర్థతకు, నిధుల మళ్లింపునకు సామాన్యుడి ప్రాణాలు బలికావాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలు, పథకాల పేర్ల మార్పుల మీద చూపిస్తున్న శ్రద్ధ, రోగి ప్రాణాలను కాపాడటంలో చూపకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను శంకిస్తోంది. మొత్తానికి ఒక గొప్ప సామాజిక భద్రత కవచంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసింది. వైఎస్సార్ ఆశయం.. జగన్ విస్తరణ ఆరోగ్యశ్రీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. 2008లో ఆయన ప్రారంభించిన ఈ పథకం రెండు దశాబ్దాలుగా పేదలకు ప్రాణదాతగా నిలిచింది. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో దీనిని పరిమితం చేసినప్పటికీ, వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పథకాన్ని విప్లవాత్మకంగా మార్చారు. చికిత్సల సంఖ్యను 1800 నుంచి ఏకంగా 3,257కు పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత చికిత్సను చేర్చారు. కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తూ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా సేవలు పొందేలా విస్తరించారు. కేవలం వైద్యమే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనోపాధి కోసం ‘ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ. 225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి కుట్ర పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, రాజకీయ కారణాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ , జర్నలిస్టుల వైద్య సేవలు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నిరుపేదల సంజీవనిగా పేరుగాంచిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని బాధితులు వాపోతున్నారు. పథకం పేరు మార్చి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఇన్సూరెన్స్ పద్ధతిని తీసుకువస్తే, సామాన్యుడికి ఉచిత వైద్యం అందడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. నూతన హెల్త్ పాలసీ.. ఆరోగ్యమిత్రల ఆందోళనఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఓ నంబర్ 162 ద్వారా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలవడం, పలువురు బిడ్డర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ , ఇతర ఇన్సూరెన్స్ మోడల్స్ను కలిపి కొత్త విధానం తెస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రద్దవుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ మార్పుల వల్ల ఆస్పత్రుల్లో రోగులకు మార్గదర్శకులుగా ఉంటూ సేవలందిస్తున్న ‘ఆరోగ్యమిత్ర’ల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారింది. వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు నిరుపేదల గుమ్మం వద్దకు కార్పొరేట్ వైద్యాన్ని చేర్చి, చావు అంచుల్లో ఉన్న వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం నేడు ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. ధనవంతులకే పరిమితమైన కార్పొరేట్ ఆస్పత్రుల గడపను సామాన్యుడు కూడా ధైర్యంగా తొక్కవచ్చన్న నమ్మకాన్ని కలిగించిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనత వల్ల కుప్పకూలుతోంది. నిన్నటి వరకు పేదవాడి గుండెల్లో ధైర్యం నింపిన ఈ పథకం, నేడు అదే గుండెల్లో ఆందోళన నింపుతూ ‘అనారోగ్యశ్రీ’గా మారుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో, చికిత్సల ప్రక్రియ స్తంభించిపోయింది. అప్పులు తెచ్చి వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు మొండికేస్తుంటే, చికిత్స కోసం కార్డు పట్టుకుని వెళ్తున్న సామాన్యుడికి ఆస్పత్రి గేట్ల దగ్గరే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. – మహారాణిపేట బకాయిల సెగ.. అందని ‘ఆసరా’ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. జిల్లా విషయానికొస్తే, సుమారు 92 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందులో 50 నెట్వర్క్ ఆస్పత్రులు, 19 ప్రభుత్వ ఆస్పత్రులు, 23 డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులకు సుమారు రూ.90 కోట్ల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బకాయిల కోసం కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మెకు దిగడం, ప్రభుత్వం నామమాత్రంగా 5 శాతం నిధులు విడుదల చేయడంతో తాత్కాలికంగా సేవలు కొనసాగుతున్నా, పూర్తిస్థాయి భరోసా కరువైంది. మరోవైపు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ఆరోగ్య ఆసరా’ పథకం ఇప్పుడు పూర్తిగా మూలనపడింది. డిశ్చార్జ్ అయిన రోజూనే ఖాతాల్లో పడాల్సిన నగదు ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. -
కుస్తీ పట్టి..పతకాలు కొట్టి
● రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ● గోల్డ్మెడల్స్ సాధించిన కొయ్యూరు, చింతపల్లి క్రీడాకారులు కొయ్యూరు: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కుస్తీ పోటీల్లో కొయ్యూరు కుస్తీ అకాడమీ, చింతపల్లి డిగ్రీకళాశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొయ్యూరు కుస్తీ అకాడమీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అండర్ 15, అండర్ 17,అండర్ 20 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ను సాధించి, వచ్చే నెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 17 మంది ఎంపికయ్యారు. అండర్ 20 విభాగంలో వి.మహేష్, పి.ధారవీర ప్రసాద్, ఎం.రమణబాబు, సీహెచ్ మహేష్, కె.రూతు, కె.సుజాత, కె.కెసియ, కె.కమల, బి.భార్గవ్ బంగారు పతాకాలు సాధించారు.అండర్ 17 విభాగంలో కె.తబిత, పి.సురేష్, వి.శ్రీనుబాబు, ఎస్.రాజు, దుర్గాప్రసాద్లు బంగారు పతాకాలు సాధించారు.అండర్ 15 విభాగంలో జి.బుజ్జిబాబు, పి.శ్రీను, డి.ఆదినారాయణ బంగారు సాధించి ఢిల్లీలో వచ్చేనెల జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరితో పాటు జి.చరణ్,కె.చందు, వి.రాజేష్లు వెండిపతాకాలు సాధించారు.చిత్తూరు నుంచి సోమవారం కొయ్యూరు వచ్చిన వీరిని, పీడీ అంబటి నూకరాజును హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. చింతపల్లి: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో చింతపల్లి డిగ్రీ కళాశాలు విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి తెలిపారు. బి.భార్గవి, కె.రూతూ,కె.తబిత,కె.కేసియా, వి, మహేష్లు బంగారు పతకాలు సాధించారని చెప్పారు అనంతరం విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్ అభినందించారు. -
లిక్విడ్ గంజాయితో ముగ్గురు పట్టివేత
సీలేరు: ఒడిశా నుంచి సీలేరు మీదుగా ద్విచక్ర వాహనాల పై తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ యాసిన్ తెలిపారు. ఒడిశాలోని ఓ గ్రామంలో ఏడు కిలోల గంజాయితో తయారుచేసిన లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి రెండు ద్విచక్ర వాహనాల మీద తరలిస్తుండగా సీలేరులో సోమవారం పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. దారకొండ గ్రామానికి చెందిన బంగారు రాజు, రింతాడ గ్రామానికి చెందిన వీరయ్య, డబల్ప హాడ్ ప్రాంతానికి చెందిన బిక్కులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
అరకులోయటౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించి, వారి గెలుపునకు కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. అప్పటి పరిస్థితి, సమీకరణలు పరిగణనలోకి అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, పల్టాసింగ్ విజయ్కుమార్, గుడివాడ ప్రకాష్, ఎంపీటీసీలు స్వాభి రామచందర్, శత్రుఘ్న, వార్డు సభ్యుడు శివ, ముఖ్య నాయకులు బి.బి. కామేశ్వరరావు, మండియకేడి బాలరాజు, పాంగి నాగేశ్వరరావు, పెట్టెలి సుక్రయ్య తదితరులు పాల్గొన్నారు. దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం అరకులోయటౌన్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాందలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అత్యున్నత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైందన్నారు. కానీ అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వేంకటేశ్వర స్వామికి, దేశ, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
అంతర పంటలతో అధిక ఆదాయం
ఇన్చార్జ్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: కాఫీ సాగును పెంపొందించడంతో పాటు అంతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలతో పాటు అధిక ఆదాయం లభిస్తుందని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమ వారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాఫీ సాగులో అంత రపంటల ఉత్పత్తులను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన ప్రణాళికలను రూపొందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిక్స్డ్ క్రాప్ ఏర్పాటు అనుకూలమైన ప్రాంతాల్లో కాఫీతో పాటు ఇతర మిశ్రమ పంటలను ప్రోత్సహించడం వల్ల రైతులకు అదన పు ఆదాయం లభిస్తుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సేంద్రియ ఎరువుల వినియోగం యాజమాన్యంపై ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలన్నారు. కాఫీ బోర్డు అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి విత్తన సేకరణ, నర్సరీల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకుని మొక్కల పెంపకంపై ప్రోత్సహకాలు, రాయితీలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ డీడీ మురళీధర, కాఫీ ఏడీ బొంజుబాబు, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏలో ఆధార్ సెంటర్ ఏర్పాటు పాడేరు : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 150 ఆధార్ ఎన్రోల్ కిట్లు మంజూరయ్యాయని, వీటిని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధార్ కేంద్రంలో పుట్టిన తేదీ సవరణలు, బయోమెట్రిక్ అప్డేట్స్, కొత్త ఆధార్ కార్డుల జారీ వంటి సేవలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏ దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికాకుండా ఉండేలా చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో పరిష్కారం కాని ఆధార్ సమస్యలకు పాడేరు ఐటీడీఏ అధార్ సెంటర్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పీఎంయూ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాంగోపాల్, అడిషనల్ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాజేష్, ఆధార్ జిల్లా కో ఆర్డినేటర్ వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం
నక్కపల్లి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టం చేయడంతో చంద్రబాబు, లోకేష్ పవన్కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీతంపాలెంలో మాట్లాడుతూ గుజరాత్లోని ఎన్డీడీబీ, హర్యానాలో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో పరీక్షించి నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలవలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం మానుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని 2024 జూలై 17న నివేదిక వచ్చిందని అప్పటి ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే, అదే ట్యాంకర్లలో నెయ్యి తిరిగి ఏఆర్ డెయిరీకి వెళ్లకుండా వైష్ణవి డైయిరీకి వెళ్లి పేరు మార్చి మళ్లీ తిరుమలకు ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఇదే నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారని సుప్రీం కోర్టులో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. అల్ఫా మిల్క్లో ప్రమాణాలు సరిగ్గా లేవని కేసులు నమోదు చేసిందన్నారు. అదే ఆల్ఫా మిల్క్ కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని ప్రస్తుత చైర్మన్ బీఆర్నాయడు రూ.245 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి వాటిని అప్పటి ఈవో అనిల్కుమార్ సింఘాల్పై తోసేసి రాత్రికి రాత్రే అతనిని బదిలీ చేసిందన్నారు. అతనితోపాటు శ్యామలరావులను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ చార్జ్షీట్ ప్రజలు పూర్తిగా తెలుసుకునేలోపు వారిలో విష ప్రచారం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టడం, యూట్యూబ్ చానళ్ల ద్వారా గత ప్రభుత్వంపైన అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. దీని కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల్లోకి రాలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసి అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై భౌతిక దాడులకు పాల్పడి అరెస్టు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల గోవిందు, సర్పంచ్లు వెదుళ్ల వెంకటరమణ, నాగఅప్పలరాజు, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా త్రినాఽథ్
బుచ్చెయ్యపేట: ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కందిపూడి ఉపాధ్యాయుడు తమరాన త్రినాఽథ్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఏపీటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో త్రినాఽథ్ను ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. పి. కందిపూడి పాఠశాలలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీటీఎఫ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని త్రినాథ్ తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
పీఏసీఎస్ల ద్వారా యూరియా సరఫరాకు చర్యలు
కశింకోట: పీఏసీఎస్ల ద్వారా యూరియాను సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. కశింకోట, నరసింగబిల్లి పీఏసీఎస్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సంఘ సభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. రుణాలను ఎకరాకు రూ.5 లక్షల నుంచి అవసరాన్ని బట్టి పెంచుతామని తెలిపారు. డీసీసీబీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు రూ.3 లక్షల వరకు 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 9.50 శాతం వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులు డీసీసీబీ రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో మరణించిన రైతుకు ఇచ్చే బీమా రూ.15,000 ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.50,000 కు పెంచామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, అలాగే పీఎంఎస్బీవై పథకం కింద ఎల్ఐసీ ద్వారా మరో రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తామని తెలిపారు. -
ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!
మునగపాక: పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
భూ సమస్యలే అధికం
కాళ్లరిగేలా తిరిగినా గోడు వినలేదు... తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ల ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1 , 2 లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆయనతో పాటు ఎన్ఎఓబీ, బిజయూఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రామమణి, మనోరమలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 131, రెవిన్యూ క్లినిక్లో 197 అర్జీలు మొత్తం – 328 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెప్మా, ఐసిడీి ఎస్ అధికారులు కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా పాల్గొన్నారు. పాఠశాల ఆటస్థలంలో నిర్మాణాలపై నిరసన పాఠశాల ఆటస్థలంలో నిర్మించే డ్రైనేజీ వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలంటూ యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలంతో పాటు గ్రామ అవసరాలకు కూడా వినియోగించుకుంటున్న గ్రౌండ్ను కనుమరుగు చేసేవిధంగా గ్రామస్తుల అంగీకారం లేకుండా యలమంచిలి మున్సిపాలిటీ అవసరాలకు వినియోగించడం దారుణమని, పాఠశాలకు చెందిన ఆటస్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనధికార భూసర్వే పనులపై ఆగ్రహం రైతులకు కనీస సమాచారం లేకుండా వ్యవసాయ భూముల్లో అధికారులు చేపట్టే అనధికారిక సర్వేను నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలంటూ సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే తమ భూముల్లో మూడు రోజులుగా అధికారులు భూ సర్వే పనులు చేస్తున్నారని, అడిగితే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఏపీఐఐసీకి భూములు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామన్నారు. పరిశ్రమలకు గ్రామంలో రైతుల భూములను సేకరించే విధంగా సర్వే చేయడం అన్యాయమని, గ్రామసభ, గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా చేపడుతున్న సర్వేను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయం అధారంగా ఉన్న గ్రామస్తుల పొట్ట కొట్టవద్దని, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు మరో చోట చేపట్టి మా గ్రామాన్ని విడిచిపెట్టాలంటూ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఆ వీఆర్వోలపై చర్యలు తీసుకోండి... నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలంలోనే విధుల్లో కొనసాగుతున్న ఇద్దరు వీఆర్వోలపై విజిలెన్స్ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్ బొంతు రమణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండల స్థిరనివాసులైన జి.సాంబశివరావు, ఎస్.సూర్యనారాయణ అనే ఇద్దరు వీఆర్వోలు మాకవరపాలెం, రాచపల్లి గ్రామాల్లోనే వీఆర్వోలుగా విధుల్లో కొనసాగుతున్నారని, ప్రభుత్వం చేపట్టే బదిలీలకు విరుద్ధంగా ఇతర చోట్లకు వెళ్లకుండా కొనసాగడం ప్రాథమిక ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. చిల్లంగి పేరిట వేధింపులపై ఫిర్యాదు చెడుపులు చిల్లంగులు చేస్తున్నామంటూ అదేపనిగా దూషించడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాక మండలం టి.సిరసపల్లి గ్రామానికి చెందిన బి.నరేష్, మరికొంతమంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో అద్దెకు వచ్చి నివాసముంటూ వికలాంగులుగా ఉన్న చిట్టిబోయిన విజయ, కరుణ, వగైరాలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని, అందరిపై పోలీసు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్ చేసి తమకు కాపాడాలని కోరారు. ఆటస్థలాన్ని కాపాడాలంటూ నిరసన తెలుపుతున్న తెరువుపల్లి గ్రామస్తులురాయపుర అగ్రహారం గ్రామస్తుల నిరసన ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుడుగా నమోదైన కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావడం లేదని, తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా రాకపోవడంపై కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అర్జీ చేసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్ల అర్జీని నమోదు చేయకుండా కలెక్టరేట్ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేశారు. అనకాపల్లి మండలం మూలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇల్లా హిమవర్శిని డిగ్రీ, యామిని ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూలీపనులు చేసుకుంటు కుటుంబాన్ని నేట్టుకొచ్చే తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న క్రమంలో ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుగా నమోదైంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో అప్పును ఆగమేఘాల మీద తీర్చేసినప్పటికీ తప్పుగా నమోదైన ఇన్కంట్యాక్స్ వివరాలు మాత్రం ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగిపోలేదు. దీంతో అమ్మ ఒడి దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ ఇతరత్రా ఏ ఒక్కపథకంలో వీరికి లబ్ధి చేకూరలేదు. దీనిపై అనేక వినతులు చేస్తున్నా పట్టించుకుని పరిష్కరించే అధికార యాంత్రంగమే లేకపోవడంతో చివరకు కళాశాలకు సెలవు పెట్టి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలెక్టరేట్కు వచ్చారు. కూలీపనులు చేసుకుంటూ తమను పోషిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న తమకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్కు తమ బాధ చెప్పుకుందామని వస్తే మీ అర్జీ తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉందంటూ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేయడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. – ఇల్లా హిమవర్శిని, యామిని పీజీఆర్ఎస్కు 131 అర్జీలు ఎస్పీ కార్యాలయానికి 55 అర్జీలు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 55 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు. భూ తగాదాలకు సంబంధించి 25, కుటుంబ కలహాలపై 2, మోసపూరిత వ్యవ హారాలపై 4, ఇతరత్రా 24 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ జి.విశ్వనాథం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వడం అత్యంత దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లలమెట్ట సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై గత ఏడాది డిసెంబర్ 1న ఫిర్యాదు చేస్తే సుమారు 75 రోజుల తర్వాత దర్యాప్తు జరిపి సోమవారం తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లిలో మూడు సర్వే నెంబర్లలో కేవలం ఏడు రోజులు మాత్రమే మట్టి తవ్వి వ్యవసాయ భూమి చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలని సూచిస్తూ గత ఏడాది నవంబర్ 25న తహసీల్దార్ అనుమతులు ఇచ్చామని ఎండర్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. సదరు మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తి సుమారు నెల రోజులకు పైబడి నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ వాహనాలతో రాత్రి పగలు తేడా లేకుండా రెండు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టారని, కానీ రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వ్యవహరించి, అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వంపై నమ్మకం పోయి, తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకం, స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతిపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
అచ్యుతాపురం రూరల్: బొలేరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తాడు అనుకునేలోపే కుమారుడు అంతుచిక్కని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజం ఒక తల్లి గుండెలను చిదిమేసింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో యర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (22) బ్రాండిక్స్లో గల టీజే పరిశ్రమలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సుప్రజా డెయిరీ ఎదురుగా అకస్మాత్తుగా రాంగ్ రూట్లో వచ్చిన బొలేరో వాహనంను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో వెనక కూర్చున్న రావాడ శ్రీను కూడా తీవ్రంగా గాయపడి ఆరిలోవలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యర్రవరంలో ఒక ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదం బారినపడి ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన సాయి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. కొడుకు మృతితో తల్లి గుండెలవిసేలా చేసిన రోదన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన రావాడ శ్రీనుకు వివాహమై ఒక కుమార్తె ఉంది. విధుల నుంచి వస్తూ శ్రీను ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నారు. కాగా ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం సుప్రజ డెయిరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి అలాగే ఆసుపత్రిలో ఉన్న యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం, సీఐటీయు, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా రహదారి పూర్తిగా స్తంభించడంతో కొన్ని గంటల వ్యవధి ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుకోకుండా బొలేరో వాహనం సుప్రజా డెయిరీలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రహదారికి అడ్డంగా రావడంతో బైక్ పై ఉన్నవారు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతున్నట్టు ఇన్స్పెక్టర్ చంధ్రశేఖర్రావు తెలిపారు. గాయపడిన రావాడ శ్రీనుసంఘటనా స్థలంలో సాయి మృతదేహం -
కక్ష సాధింపుతో కాపులపై అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు పాయకరావుపేట: కాపులపై కక్ష సాధింపుతో సీఎం చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కాపు నేతలను విమర్శించడంపై మండలంలోని మాసాహేబుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈ నెల 7న ఉత్తరాంధ్ర కాపులందరూ పరామర్శించామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆ సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారన్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు దుర్భాషలాడటం తగదన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబులకు లేదన్నారు. నాడు వంగవీటి రంగాను, నేడు ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులను కక్ష సాధింపుతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాపులను అణగదొక్కడం కోసమే కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అనడం అవగాహన రాహిత్యం అన్నారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ, సిట్ నిర్ధారించాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కాపు నాయకులు వైఎస్సార్సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే కాపులకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, గోపాలపట్నం, కేశవరం సర్పంచ్లు పన్నీరు బాబ్జి, మేడిశెట్టి రామగోవిందు, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, నాయకులు కోనే పుత్రరావు, పాలపర్తి సతీష్, అక్కిరెడ్డి నాగేశ్వరరావు, పెనుమత్య నాగేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, పర్వత సత్యనారాయణ పాల్గొన్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
కొయ్యూరు సీఐ శ్రీనివాసరావుకొయ్యూరు: వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పుడు బీమాతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు రావని కొయ్యూరు సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం కొయ్యూరు సంతలో మంప ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి ఆయన గిరిజనులతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, దీనివల్ల జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించారు. గంజాయి పండించినా లేదా రవాణా చేసినా జీవితాలు నాశనమవుతాయని ఆయన హెచ్చరించారు. అటువంటి కేసుల్లో చిక్కుకుంటే బెయిల్ రాక నెలల తరబడి జైలులోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేస్తే ఖాతాల్లోని సొమ్ము మాయమవుతుందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలపై ఎవరూ నేరాలకు పాల్పడకూడదని, ప్రస్తుతం చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్రీడల్లో రాణించాలి యువత క్రీడల్లో రాణించాలని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు,మంప ఎస్ఐ శ్రీనివాస్ కోరారు.బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ,కొత్తపల్లి గ్రామాలకు చెందిన యువకులకు ఆదివారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. -
ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిఉమామహేశ్వరరావు పాడేరు రూరల్: ఉపాధి హమీ పథకం పరిరక్షణకు అందరూ కలిసి పోరాడుదామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈనెల 12న జరగనున్న కార్మిక సంఘాల సమ్మెకు సంబంధించి పోస్టర్లను ఆదివారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకై నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి అనివర్గాల కార్మిక సంఘాలు తరలి రావాలన్నారు. ఇప్పటికే కార్మికుల హక్కుల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబ్ కోడ్లు తక్షణం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్, కోశాధికారి పోతురాజు, సహాయ కార్యదర్శి సుందర్రావు పాల్గొన్నారు. -
మాకవరంలో నేడు గంగమ్మతల్లి జాతర
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ప్రతి ఏటా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ బుడియాలు. దీక్షా పరులైన వీరు కేవలం గోచీ (ప్యాటు) మాత్రమే ధరించి, శరీరంపై తెల్లటి సున్నంతో చారలు వేసుకుని వారం రోజుల పాటు మాల ధరిస్తారు. వీరు గ్రామగ్రామాన తిరుగుతూ పండుగ విశిష్టతను చాటిచెబుతారు. ఆదివారం నాడు జోలాపుట్టు, మాకవరం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వీరు ప్రచారం నిర్వహించారు. జాతర సందర్భంగా మాకవరం గ్రామం, గంగమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సోమవారం రాత్రి జాతర ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు పులంధర్, జగత్రాయ్, గంగాధర్, పరశురాం, రఘుపతి పడాల్, ధనుంజయ్, రాజు, రాధాకృష్ణ, రామ్మూర్తి, గణపతి, నరసింగరావు పడాల్, బాబూరావు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ -
ముగిసిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత వేడుకలు
ఏయూక్యాంపస్ : జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ఆదివారం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్తో ముగిశాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను కాలువల్లో వేసి సముద్రాలను కలుషితం చేయవద్దని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి. సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. ఔత్సాహికులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసి సైక్లోథాన్ నిర్వహించారు. అనంతరం 20 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన విజేతలకు, ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం
గాజువాక: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం తమిళనాడు ‘పెరియార్ ’ తరహాలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలపాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం లంకా మైదానంలో ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోల కంటే వినూత్నంగా నల్లచొక్కాల ఉద్యమం ద్వారా పాలకులను నిలదీయాలని కోరారు. తమిళనాడులో సేలం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్న స్ఫూర్తితో ఇక్కడి నిర్వాసితులు, కార్మికులు ఉద్యమించాలన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలోనే స్టీల్ప్లాంట్ నిర్వాసితులకు ఎకరానికి 1250 గజాల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై.మహాదేవ్, పరంధామయ్య పాల్గొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పిలుపు -
ప్రగతి దారులు
కొండకోనల్లోకొండకోనల మధ్య ఉండే గిరిజన పల్లెలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రవాణా కష్టాల నుంచి విముక్తి లభించింది. రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన జోడిగుడ– చటువా, లోగిలి, సంపంగి గెడ్డ వంతెనలతో పాటు అంతర్రాష్ట్ర రహదారులు అందుబాటులోకి రావడంతో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. హుద్హుద్ వంటి విపత్తులు మిగిల్చిన గాయాలను మాన్పుతూ, ప్రజల సౌకర్యార్థం పక్కా ప్రణాళికతో ఈ పనులు పూర్తి చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన కండ్రుమ్– సర్రయి వంతెనలోగిలిలో పూర్తయిన వంతెనడుంబ్రిగుడ: మండల గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రత్యేక చొరవతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణం ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేసింది. ముఖ్యంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులను కలుపుతూ సాగిన ఈ అభివృద్ధి పనులపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన అభివృద్ధి పనులివే.. జోడిగుడ – చటువా వంతెన: కండ్రుమ్ పంచాయతీ పరిధిలోని గుంటసీమ వీజే రోడ్డు నుంచి కండ్రుమ్, సర్రాయి మీదుగా జోడిగుడ, చటువా వద్ద పీఎంజీఎస్వై నిధులు రూ.5.80 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇది ఆంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామాల మధ్య కీలక అనుసంధానకర్తగా మారింది. లోగిలి వంతెన: 2014 హుద్హుద్ తుపాను ధాటికి కొట్టుకుపోయిన ఈ వంతెన లేక గిరిజనులు పదేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.80 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయడంతో, మార్చి 13, 2024న ఇది ప్రారంభమైంది. దీనివల్ల గసభ, సొవ్వా పంచాయతీలతో పాటు ఒడిశా ప్రజలకు సైతం రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంపంగి గెడ్డ వంతెన: కితలంగి, కించుమండ పంచాయతీల పరిధిలోని 18 గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, రూ.4.40 కోట్లతో సంపంగి గెడ్డ వద్ద వంతెనను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ శంకుస్థాపన చేసిన ఈ వంతెన పూర్తికావడంతో అరకులోయ, అనంతగిరి మండల వాసులకు ప్రయాణం సులువైంది. అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం: అరకు రోడ్డు నుంచి కొర్రయి, కొల్లాపుట్టు మీదుగా బొడ్డలమామిడి వరకు 10.50 కిలోమీటర్ల మేర తారు రోడ్డును, 14 కల్వర్టులను నిర్మించారు. ఈ రహదారి ద్వారా ఒడిశాలోని పుక్కలి, పొట్టంగి, జైపూర్తోపాటు ఛత్తీస్గఢ్, ఢిల్లీ వరకు రవాణా అనుసంధానం ఏర్పడటం విశేషం. కిలోగుడ జంక్షన్ – చమడపాడు రోడ్డు: సాగర పంచాయతీ కిలోగుడ జంక్షన్ నుంచి టిక్కిటిబెడ్డ, కమలబంద, సొవ్వా మీదుగా చమడపాడు వరకు 22 కిలోమీటర్ల పొడవైన తారు రోడ్డును పీఎంజీఎస్వై నిధులు రూ.11.50 కోట్లతో నిర్మించి గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రాణభయం తప్పింది సంపంగి గెడ్డపై వంతెన లేక గతంలో చాలా మంది గిరిజనులు గెడ్డలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వంతెన ఏర్పాటు నిధులు మంజూరు చే యించారు. వంతెన నిర్మించడంతో సమస్య తీరింది. – వరబోయిన సుబ్బారావు, సర్పంచ్, కితలంగివంతెన కష్టాలు తీరాయి లోగిలి వంతెన కూలిపోవడంతో పదేళ్లుగా ఇబ్బందులు పడ్డాం. వైఎస్సార్సీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంతెన నిర్మించారు. రోగాలకు గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లే మార్గం లేకుండా ఉండేది. ఇప్పుడు కష్టాలు తీరాయి. – వంతాల జెమ్మ, ఎంపీటీసీ, గసభ గత ప్రభుత్వానికిరుణపడి ఉంటాం సుమారు రూ.కోట్ల నిధులు వెచ్చించి వంతెన నిర్మించడంతో రవాణా కష్టాలు తీరాయి. సమస్య పరిష్కరించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటాం. ఇదే పెద్ద వంతెన కావడం అదృష్టంగా భావిస్తున్నాం. – శెట్టి ఆనందరావు, ఎంపీటీసీ, కండ్రుమ్ జగనన్న పాలనలో డుంబ్రిగుడకు దక్కిన రవాణా విప్లవం దశాబ్దాల కష్టానికి చెక్ రూ. కోట్ల నిధులతో నిర్మించిన వంతెనలు, అంతర్రాష్ట్ర రహదారులు గిరిజన పల్లెల్లో వెలుగులు నింపిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం -
హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన
సింహాచలం: అడవివరంలోని సింహాద్రిమఠం ఆధ్వర్యంలో అల్లూరిజిల్లా హుకుంపేటలో ఆదివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ పెద్ద ఎత్తున నిర్వహించారు. 896 మంది గిరిజనులు ఈ పూజలో పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం రిటైర్డ్ ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఈ పూజని నిర్వహించారు. 1001 నామాలతో స్వామికి అర్చన చేశారు. పూజలో పాల్గొన్న గిరిజనులకు సింహాద్రిమఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి లక్ష్మీదేవి సహిత శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు ఉచితంగా అందజేశారు. -
ఇంటర్ ప్రయోగ పరీక్షల పరిశీలన
జి.మాడుగుల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్ష పరీక్షలను ఆదివారం ఇంటర్బోర్డు అబ్జర్వర్ చాణుక్యుడు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరు, ల్యాబ్ సదుపాయాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు కళాశాలను సందర్శించి పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణపై అధ్యాపకులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీ ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. చింతపల్లి: ఎటువంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ చాణక్యుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించాలని అధ్యాపకులకు సూచించారు. డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు
● 7.5 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మంచు, చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం చింతపల్లిలో 7.5 డిగ్రీలు, అరకువేలీలో 7.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో హకుంపేటలో 8.2 డిగ్రీలు, ముంచంగిపుట్లులో 8.9 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీలు,,కొయ్యూరులో 12.7 డిగ్రీలు, అనంతగిరిలో 16.6 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. -
ఏపీఎన్జీజీవో ఉపాధ్యక్షుడిగా రవిశంకర్
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఆర్.రవిశంకర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గతంలో ఆయన విశాఖ జిల్లా ఎన్జీజీవో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్, కార్యదర్శిగా డి.వి.రమణ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న రవిశంకర్ను పలువురు ఉద్యోగ సంఘ నేతలు అభినందించారు. -
అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’
తగరపువలస: మండలంలోని గంభీరం ఐఐఎంవీ రోడ్డులో ఉన్న హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం ‘శ్రీకృష్ణ అర్పణం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహనుల మందిరంలో జరిగిన ఈ వేడుకలో చైతన్య డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ లీలలు’ నృత్య రూపకం భక్తులను అలరించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బుక్కపట్నం ఇందిర, లీలభాను, పూజిత, శాంతిప్రియ తదితర చిన్నారులను హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస ప్రత్యేకంగా అభినందించారు. -
భక్తుల సౌకర్యమే తొలి లక్ష్యం
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణసింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్చార్టి ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. -
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
కశింకోట: స్థానిక కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణరావు అందించిన వివరాలు ప్రకారం.. మండలంలోని తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి నరసింగరావు(65) మోపెడు వాహనంపై తమ గ్రామం నుంచి వస్తూ కసింకోట కూడలి వద్ద మలుపులో రోడ్డు దాటుతుండగా, అదే మార్గంలో లారీ వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన నరసింగరావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విరిగిపడిన విద్యుత్ స్తంభం
● ధ్వంసమైన పెంకుటిల్లు ● ఇద్దరికి తీవ్ర గాయాలు పాడేరు: మండలంలోని డి.గొందూరు పంచాయతీ పాలమాను చిలక గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన ఓ విద్యుత్ స్తంభం ఇళ్లపై విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనివల్ల ఒక పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తీరు.. గ్రామంలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం పూర్తిగా పాడైపోయింది. శనివారం ఉదయం ఆ స్తంభం ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న పెంకుటింటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో పనులు చేసుకుంటున్న సీసా లక్ష్మమ్మ, సీసా విశ్వేశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు ప్రమాద సమాచారం తెలుసుకున్న సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. దీనివల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. అనంతరం గాయపడిన వారిని గ్రామస్తుల సహాయంతో ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం శిథిలమైన విద్యుత్ స్తంభాన్ని మార్చాలని సర్పంచ్ రాంబాబుతో పాటు గ్రామస్తులు అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పంచాయతీ పరిధిలో శిథిలావస్థకు చేరిన మిగిలిన స్తంభాలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అదుపుతప్పివాహనం బోల్తా చింతపల్లి: కొత్తపల్లి జలపాతం వద్ద నుంచి విశాఖ బయలుదేరిన వాహనం లోతుగెడ్డ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఽశనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రెండు కుటుంబాలు ఏజెన్సీ పర్యటనకు వచ్చాయి. మధ్యాహ్నం కొత్తపల్లి జలపాతం వద్ద భోజనాలు ముగించుకుని మైదాన ప్రాంతానికి తిరిగి పయనమయ్యాయి. మార్గం మధ్యలో లోతుగెడ్డ, చెరుకుంపాకల గ్రామాల మధ్య వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలు కానందున ఊపరిపీల్చుకున్నారు. -
దివ్యాంగ బాలలను ప్రోత్సహించాలి
అనకాపల్లి: దివ్యాంగ బాలలను ప్రోత్సహించి, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి ఆర్ట్, కల్చరల్ పోటీలను శనివారం నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి, సరైన దిశలో ప్రొత్సహించినట్టయితే వారిలో ప్రతిభను వెలికితీయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణం నాయుడు, మండల విద్యాశాఖాధికారి కోటేశ్వరరావు, వివిధ మండలాల దివ్యాంగ బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మహిళలకు ‘ఉచిత’ గౌరవం ఇదేనా?
ముంచంగిపుట్టు: ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వారికి అవమానాలు తప్పడం లేదు. ముఖ్యంగా అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై మహిళా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి నుంచి పాడేరు మీదుగా జోలాపుట్టు వెళ్లే ఆర్టీసీ బస్సులో శనివారం దారుణమైన పరిస్థితి నెలకొంది. బస్సులో సీట్లపై డ్రైవర్, కండక్టర్లు నీటి పైపులు, ఇనుప గొట్టాలను పేర్చారు. దీనివల్ల పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు గంటల తరబడి నిలబడే ప్రయాణించాల్సి వచ్చిందని మహిళలు వాపోయారు. తాము ఎక్కువగా ఉన్న బస్సు స్టాపులను చూసి, బస్సు ఆపకుండానే వెళ్లడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎక్కితే డబ్బులు రావు అనే వివక్షతో సిబ్బంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సామగ్రి ఉంటే బస్సు పైభాగంలో ఉంచాలి కానీ, సీట్లపై వేసి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లి–జోలాపుట్టు బస్సులో సీట్లపై పైపులు, ఇనుప గొట్టాలు ఆర్టీసీ సిబ్బంది తీరుపై మహిళా ప్రయాణికుల ఆగ్రహం ఉచిత ప్రయాణమని తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
మంత్రులపైనా పీడీయాక్టు ఎందుకు పెట్టలేదు
అనకాపల్లి: హోం మంత్రి అనితపైనా 32 కేసులు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్పైనా 37 కేసులున్నా పీడీ యాక్టు ఎందుకు ప్రయోగించడం లేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజుపై 19 కేసులున్నాయని పీడీ యాక్టు ప్రయోగించినా చివరికి ప్రజా పోరాటమే గెలిచిందని విమర్శించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్.రాయవరం మండలంలో బల్క్డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతు పలికినందుకు అప్పలరాజును అన్యాయంగా నిర్బంధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. గత నెల 30న అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగులో పోలీసులు పెట్టిన తప్పుడు కేసులుపై సమీక్షించి పీడీ చట్టాన్ని రద్దు చేసి శుక్రవారం విడుదల చేశారన్నారు. ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా పీడీ యాక్టు కింద 43 రోజులు జైలులో నిర్బంధించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అప్పలరాజును జైలులో పెట్టినా ఉద్యమాలు ఆగలేదన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని భావించి విడుదల చేశారన్నారు. గతంలో రసాయన కంపెనీలు పెట్టకూడదని చెప్పిన అనిత అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవిధంగా మాట్లాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
సీసీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్న చోడవరం సిఐ పి. అప్పలరాజు తదితర్లుదుండగులు తొలగించిన కిటికీని పరిశీలిస్తున్న ఎస్ఐ వి. సత్యనారాయణ. దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న డీసీసీబీలో బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీని తొలగించి లోనికి చొరబడి చోరీకి యత్నించారు. వారికి నగదు, బంగారం లభించకపోవడంతో వెనుదిరిగారు. ప్రతీ రోజు మాదిరిగా శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీ తొలగించి ఉండటాన్ని గుర్తించి తక్షణమే బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావు సమాచారం అందించారు. ఆయన తమ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బ్యాంకులో లాకర్, కిటికీ తొలగించిన ప్రదేశాల్లో దుండగుల వేలి ముద్రలు ఇతర ఆధారాలను సేకరించింది. బ్యాంక్లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగులు బ్యాంకులోకి చొరబడిన విధానాన్ని చోడవరం సీఐ పి. అప్పలరాజు, ఎస్ఐలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితర్లు పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు వెనుక భాగంలోని ఇనుప కిటికీని తొలగించారని చెప్పారు. ఒక వ్యక్తి బ్యాంకులోకి చొరబడగా మరో వ్యక్తి వెనుక వైపు కాపలా ఉన్నట్టు తెలిపారు. లోపల దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా ఎక్కడా అవకాశం లేక పోవడంతో వెనుదిరిగాడన్నారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ తుప్పు పట్టి ఉందని, వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని, బ్యాంక్లో ఆగిపోయిన అలారం మోగే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావుకు పోలీసులు సూచించారు. బ్యాంకులో నగదు, బంగారు అభరణాలు భద్రంగా ఉన్నాయని, పోలీసు, బ్యాంకు అధికారులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దుండగుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో పాటు ఎ. కోడూరు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీసీ టీవీ ద్వారా సేకరించిన దుండగుల ఫొటోలు -
ప్రకృతి సెగ
ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిరియం సాగు ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పూత దశలోనే పంట దెబ్బతిని, దిగుబడి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం చూసిన రైతులు, ఈసారి కనీస పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మిరియం రైతుకుఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026విజృంభిస్తున్న శీతల గాలులు ● కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు, శీతల గాలులు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. శనివారం అరకువ్యాలీలో 7.8 డిగ్రీలు, చింతపల్లిలో 8.2 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. హకుంపేటలో 8.2 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 8.9 డిగ్రీలు, పెదబయలులో 9.2 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీలు, కొయ్యూరులో 12.7 డిగ్రీలు, అనంతగిరిలో 16.2 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.● పూత సమయంలో కానరాని వర్షాలు ● పాదులకు గణనీయంగా తగ్గిన కాపు ● ఎకరాకు 50 కిలోలు కష్టమే ● గతేడాది రూ.లక్షల్లో ఆదాయం ● ఈ ఏడాది భారీగా గండి సాక్షి, పాడేరు: ఏటా గిరిజన రైతులకు సిరులు కురిపించే మిరియం దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. తోటల్లోని పాదులకు అక్కడక్కడ మాత్రమే గుత్తులు కనిపిస్తుండటంతో, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటల మధ్య అంతరపంటగా మిరియం సాగవుతోంది. గతంలో ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేదని, ఈసారి మాత్రం రూ. 20 వేలకు మించి వచ్చేలా లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నా.. గిరిజన రైతులు సాగు చేసే మిరియాలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా ఎకరాకు 150 నుంచి 200 కిలోల వరకు ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. గత ఏడాది దిగుబడి బాగుండటంతో, కిలో మిరియాలు రూ. 600 నుండి రూ. 700 వరకు పలికాయి. దీనితో ఎకరాకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఆదాయం లభించిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కాపు భారీగా తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పూత సమయంలో వర్షాల్లేక.. మిరియం పాదులు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గిరిజన రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీని ప్రభావం పూతపై పడటంతో దిగుబడి క్షీణించింది. గత ఏడాది మిరియం గుత్తులతో కళకళలాడిన తోటలన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.మోదాపల్లి ప్రాంతంలో పాదులకు కనిపించని మిరియం గుత్తులురక్తదాన శిబిరం రేపు జి.మాడుగుల: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 9న (సోమవారం) రెడ్ క్రాస్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో డేవిడ్రాజ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పాల్గొనాలని ఆయన కోరారు.ఐదు ఎకరాల కాఫీ తోటలో మిరియం పాదులు ఉన్నాయి. ఏటా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది పూత తక్కువగా ఉంది. అందువల్ల కాపు కూడా బాగా తగ్గింది. అరకు, పాడేరు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఆదాయంపై చూపుతుంది. – పాలికి లక్కు, గిరిజన ౖరైతు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం -
వరి కుప్పలకు నిప్పు పెట్టిన దుండగులు
కోటవురట్ల: పి.కె.పల్లిలో వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన అల్లు శ్రీరామ్మూర్తి, తానారి నూకరాజులకు చెందిన రెండు వరి కుప్పలకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారు. రైతులు శనివారం ఉదయం పొలానికి వెళ్లేసరికి కుప్పలు దగ్ధమవుతూ కనిపించాయి. సమీప రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ రెండు కుప్పలను నూరిస్తే సుమారు 75 బస్తాల ధాన్యం అవుతాయని, కక్షపూరితంగానే మంట పెట్టారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడో రేపో కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇంటికి పట్టుకెళ్లేందుకు చూస్తుండగా ఎవరో కావాలనే నిప్పు పెట్టారని వాపోయారు. చేతికి ఫలసాయం రాకుండా కక్ష కట్టారని ఆరోపించారు. బాధిత రైతులు పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణరాజు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు పగలను పెంచుతాయని, పల్లెల్లో అంతా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా మెలగాలన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
రివ్వున వైద్యసేవలు
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. మండల కేంద్రంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద అత్యవసర రక్త నమూనాల సేకరణ కోసం వస్తున్న డ్రోన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సమయం ఆదా.. వేగంగా వైద్య పరీక్షలు గత వారం రోజులుగా ఈ డ్రోన్ ముంచంగిపుట్టు నుంచి పాడేరు జిల్లా కేంద్ర ఆసుపత్రి మధ్య నిరంతరాయంగా సేవలందిస్తోంది. రోజుకు మూడు, నాలుగు సార్లు రాకపోకలు సాగిస్తూ సీహెచ్సీలో సేకరించిన రక్త నమూనాలను వేగంగా పాడేరు ఆసుపత్రికి చేరవేస్తోంది. అక్కడి నుంచి అత్యవసర మందులను తీసుకువస్తోంది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే రక్త పరీక్షల రిపోర్టులను తిరిగి సీహెచ్సీకి చేరవేస్తూ రోగులకు సత్వర వైద్యం అందేలా చేస్తోంది. వారపు సంతలో ప్రత్యేక ఆకర్షణ శనివారం మండల కేంద్రంలో వారపు సంత కావడంతో పరిసర ప్రాంతాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఆకాశంలో రివ్వున ఎగురుతున్న డ్రోన్ను చూసి ఆశ్చర్యపోయిన జనం, అది నేరుగా సీహెచ్సీ వద్ద దిగడాన్ని చూసి ఆసక్తితో అక్కడికి పరుగులు తీశారు. సాంకేతికత సాయంతో వైద్య సేవలు ఇంత వేగంగా అందుతుండటం చూసి గిరిజనులు విస్తుపోతున్నారు. -
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుళ్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సేవలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరికపాడేరు: ప్రభుత్వ పథకాలు, సేవలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు శాఖల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు: ప్రత్యేక సెల్ ఏర్పాటు ఐవీఆర్ఎస్ కాల్స్ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. దీనికి నోడల్ ఆఫీసర్లుగా ఇంచార్జ్ డీఆర్వో అంబేద్కర్, ఇంచార్జ్ ఆర్డీఓ లోకేశ్వరరావులను నియమించారు. ప్రధానంగా గ్రామ సచివాలయ సేవలు, ఆసుపత్రి సేవలు, సివిల్ సప్లైస్, పట్టాదార్ పాసుపుస్తకాలు, మ్యుటేషన్ల వంటి విభాగాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో తేలిందని కలెక్టర్ వివరించారు. తక్కువ రేటింగ్ వచ్చిన శాఖల అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, ఫీడ్బ్యాక్ మెరుగుపడకపోతే శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిరంతరం ప్రతికూల స్పందన వచ్చే ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. -
పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కల్పించాలి
చింతపల్లి: స్థానిక పోస్టల్ సబ్ డివిజన్ పరిధిలోని ఖాతాదారుల్లో ఎక్కువ మందిని ఇన్సూరెన్స్ పాలసీ లబ్ధిదారులుగా చేర్చాలని పోస్టల్ సౌత్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ బి. దివాకర్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన పోస్టల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఈ రెండు మండలాల పరిధిలో ఉన్న ఖాతాదారులు, ప్రజలకు తపాలా ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలను వివరించి చేర్పించాలని సూచించారు.గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్, పోస్టల్ ఇన్సూరెన్స్, పీవో ఎస్బీ ఖాతాలను పెద్ద ఎత్తున తెరిపించి, ఎక్కువ మందిని చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీర్ శ్రీనివాస్, రెండు మండలాల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.ఆశాఖ సౌత్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ దివాకర్ -
ప్రముఖులకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ ఆహ్వానం
అరకులోయ టౌన్: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన కుమారుడు రేగం చాణక్య వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు అందజేశారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నాయకులను వారి నివాసాల్లో కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు.ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ ఉన్నారు. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మలను కూడా ఎమ్మెల్యే కలిసి వివాహానికి ఆహ్వానించారు.వివాహ వేడుకకు తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదిస్తామని వారంతా హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేతెలిపారు. ఆయన వెంట అనంతగిరి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు ఉన్నారు. -
డిగ్రీ అధ్యాపకుడికి ప్రశంస
మాడుగుల: స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులపర్తి పైడిరాజు మహాభారతంలోని భీష్మపర్వంపై ఉపన్యాసించి ప్రశంసలందుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన జాతీయ తెలుగు భాషా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ నెల 5, 6వ తేదీల్లో జాతీయ తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసించారు. ఈ మేరకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, డైరెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పైడిరాజును అభినందించారు. -
ఉపాధి పథకం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం ● సీపీఐ నేతల విమర్శ పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడిపించాలని చూడటం కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శనివారం పాడేరు పర్యటనలో భాగంగా ఆదివాసీల సమస్యలపై పార్టీ శ్రేణులతో కలిసి వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పాడేరు వైద్య కళాశాలను సందర్శించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వచ్చిన ఉపాధి హామీ పథకం, ప్రస్తుతం పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అని, దీనివల్ల 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు.రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యవసాయ సంక్షోభం దృష్ట్యా కూలీలకు కనీసం 200 పనిదినాలు కల్పించాలని, కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నడిపించాలనుకోవడం కూటమి ప్రభుత్వ చేతకానితనమని వారు మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను మానుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు తదితర కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు పోతురాజు, దేవుళ్లు, సింహాచలం పాల్గొన్నారు. -
చక్కని ప్రణాళిక..
కోటవురట్ల: జీవితం మలుపునకు మొదటి అడుగు ఇంటర్లోనే.. పదో తరగతిని పదిలంగా దాటేసినా ఇంటర్మీడియట్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం.. ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజనీరు అవ్వాలన్నా, శాస్త్రవేత్తగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే.. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురితప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా, కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా, ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతోపాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు రోజూ పరిశీలన, వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను ఛేదించేందుకు గత పరీక్షా పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చేతిరాతను విద్యార్థులు మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది. స్టడీ అవర్స్లో విద్యార్థులను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు కోటవురట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరంలో జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా, ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాల కోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
భరత్నితీష్శశికాంత్విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం -
వలస కూలీ ఇంట్లో చోరీ
● తురకపూడిలో ఘటనఇంటిని పరిశీలిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ బుచ్చెయ్యపేట: మండలంలో తురకపూడి గ్రామంలో వలస కూలీ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెఽందిన తోకల రాము పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉంది. రాము ఇంటి లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో దాచుకున్న 2 తులాల బంగారు తాడు, 30 తులాల వెండి పట్టీలు చోరీ అయినట్లు గుర్తించాడు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. -
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
నర్సీపట్నం: పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు సీఐ గఫుర్ తెలిపారు. గత నెల 31న స్థానిక వెలమ వీధికి చెందిన దేవాడ త్రివేణి చోడవరంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కింది. ఆమె వెంట సుమారు ఐదు తులాల బంగారు చైను, రెండు గాజులు, చెవిదిద్దులు బ్యాగ్లో తీసుకువెళ్లింది. ఏదో పనిపై వెళ్లిన ఆమె బస్సులోనే నర్సీపట్నం తిరిగి వచ్చింది. కాంప్లెక్స్ బయట ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి సంచిలో చూసే సరికి బ్యాగ్లో ఆభరణాలు లేవు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు సిబ్బందితో ప్రత్యేక పోలీసు టీమ్ ఏర్పాటు చేశారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం షేర్ఆటోలో ఇద్దురు నిందితులు తునివైపు వెళ్తుండగా పాతబస్టాండ్ వద్ద పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి ఆలియాస్ శ్యామల, షేక్ చాన్ బాషాను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఇద్దరు నిందితులు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఆటోను అద్దెకు తీసుకుని ఈ ఇద్దరూ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. ఆటోను సీజ్ చేశామని తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. -
దారకొండ హెచ్ఎంపై శాఖాపరమైన చర్యలు
● గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ● విద్యార్థులను చావబాదడంపై విచారణ సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, దారకొండ బాలుర ఆశ్రమ పాఠశాలలో భోజనం బాగోలేదని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులను హెచ్ఎం హేమచంద్ర తీవ్రంగా కొట్టడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పాడేరు డిప్యూటీ డైరెక్టర్ పరిమళ, ఏటీడబ్ల్యూవో నాగజయలక్ష్మి శుక్ర వారం పాఠశాలలో విచారణ చేపట్టారు. నిజం అంగీకరించిన హెచ్ఎం తొలుత నీళ్లు నమిలిన హెచ్ఎం, డీడీ హెచ్చరికతో విద్యార్థులను కొట్టినట్లు అంగీకరించారు. బాధ్యుడైన హెచ్ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో, కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు డీడీ విలేకరులకు తెలిపారు. గిరిజన సంఘాల ఆగ్రహం : మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, విద్యార్థులపై దాడి చేసిన హెచ్ఎంను వెంటనే తొలగించాలని గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. భోజనం నాణ్యతగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు డీడీ దృష్టికి తీసుకువెళ్లారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సీలేరు బాలికల పాఠశాలను తనిఖీ చేసిన డీడీ , పదో తరగతి ఫలితాల మెరుగుదలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా వెనుకబడిన విద్యార్థుల కోసం రోజుకు రెండు గంటలు అదనపు తరగతులు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ప్రతిరోజూ ఒక సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించి, మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె సూచించారు.గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించేలా నూతన డీఎస్సీ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. -
ముగిసిన ఎన్ఎస్జీ విన్యాసాలు
మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డాక్టర్ సుమిత్ గరుడ్ వెల్లడించారు. నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్ పేర్కొన్నారు. -
బీమా ప్రక్రియను వేగవంతం చేయాలి
చింతపల్లి: మండలంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా నమోదు ప్రక్రియను సర్పంచ్లు, పార్టీ నాయకులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆపార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ కోరారు. శుక్రవారం పెదబరడ పంచాయతీ పరిధిలోని కృష్ణాపురంలో సర్పంచ్ సమిడి గోపాల్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు, నాయకుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి పంచాయతీలో అర్హులైన వారందరి బీమా పత్రాలను వెంటనే పూర్తి చేసేలా సర్పంచ్లు, ఎంపీటీసీలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, పంచాయతీల విభాగం జిల్లా అధ్యక్షుడు సాగిన గంగన్నపడాల్, యువజన విభాగం కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారం వేగవంతం
అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన, ట్రైనీ డీఎఫ్వో చిదానందం, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు 137 వినతులను స్వీకరించారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అర్జీలను పరిష్కరించుకోవచ్చన్నారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్బీఎస్ నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి మోహన్, కాఫీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ బొంజుబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి రమణరావు, డీపీవో చంద్రశేఖర్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్, డీఎల్డీవో జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రోలుగుంట: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజల్లోకి తెసుకువెళ్లాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు. మండలం కేంద్రం రోలుగుంటలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర ఉత్సవాల్లో వారు శుక్రవారం పాల్గొని, ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రతినిధి పోతల లక్షీశ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోతల రాజశేఖర్, ఎంపీటీసీ వడ్డాది సతీష్, మాజీ సర్పంచ్లు బంటుసూర్య సన్యాసి దేముళ్లు, పరవాడ చిన్ని, స్థానిక మాజీ ఉప సర్పంచ్ తాతబాబు, యువ కార్యకర్తలు మడ్డు శివ, పిల్లి శ్రీను, కాళ్ల నాయుడు మహిళా విభాగం యువ కార్యకర్త దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
● సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ మహారాణిపేట: సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు. దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. -
కల్యాణపులోవనుసందర్శించిన డీఎస్పీ శ్రావణి
పోతురాజుబాబు ఆలయ పరిసరాలను సందర్శిస్తున్న డీఎస్పీ శ్రావణి రావికమతం: కల్యాణపులోవ పోతురాజుబాబు జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడంతో పాటు భద్రతా పరమైన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పోలీసులను ఆదేశించారు.ఆమె శుక్రవారం కల్యాణపులోవలో పోతురాజుబాబు అలయం,పెద్దింటమ్మ గుడి, జలాశయం వద్ద పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను, జాతర ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జాతరకు ఏ స్థాయిలో భక్తులు తరలివస్తారో ఆరా తీశారు. గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, రిజార్వయర్ నీటి సంఘం కమిటీ చైర్మన్ బంటు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పౌరుడికీ ‘ఆభా’ గుర్తింపు కార్డు తప్పనిసరి
పాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి పౌరుడు తప్పనిసరిగా 14 అంకెలతో కూడిన ఆభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) గుర్తింపు కార్డును కలిగి ఉండాలని జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఐడీని సృష్టించుకుని, తమ ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేసుకోవాలన్నారు. వైద్య సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు. మొబైల్/ కంప్యూటర్ ద్వారా healthid.ndhm. gov.in వెబ్సైట్ను సందర్శించి, ఆధార్ కార్డును ఉపయోగించి సులభంగా ఆభా నంబర్ను జనరేట్ చేసు కోవచ్చని సూచించారు. ఆరోగ్య రికార్డులను డిజిటల్గా భద్రపరుచుకోవడం ద్వారా ఎక్కడి నుంచైనా వాటిని యాక్సెస్ చేయవచ్చన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆభా నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ఈహెచ్ఆర్ సేవలను విస్తృతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి (ఎన్హెచ్ఎం) డాక్టర్ కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.డీఎంహెచ్వో కృష్ణమూర్తినాయక్ -
ఆదివాసీలపై కేంద్రం సవతితల్లి ప్రేమ
● బడ్జెట్లో నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శ పాడేరు రూరల్: కేంద్ర బడ్జెట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. శుక్రవారం పాడేరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడంలో ఉన్న ఉత్సాహం, నిధుల కేటాయింపులో చూపడం లేదని మండిపడ్డారు. 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.53 లక్షల కోట్ల బడ్జెట్లో, జనాభా ప్రాతిపదికన ఆదివాసీలకు రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, నామమాత్రపు నిధులతో సరిపెట్టారని ఆరోపించారు. పీఎం జన్మన్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధరను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రస్తుత నిధులు సరిపోవడం లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణానికి తక్షణమే రూ.800 కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ఎన్నికల సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల జీవోలు (2, 13, 51) వెంటనే రద్దు చేసి, 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెర్రీ బోర్రర్ పురుగుతో నష్టపోయిన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేంద్ర, జిల్లా కార్యదర్శి అప్పలనర్స, జిల్లా నాయకులు గంగరాజు, ఉమామహేశ్వరరావు, పోతురాజు, చిన్నయ్యపడాల్, లక్కు, త్రినాథ్ పాల్గొన్నారు. -
యాత్రకు వెళ్తుండగా విషాదం
● అతివేగమే ప్రాణం తీసింది ● కారు నడిపిన వ్యక్తి దుర్మరణంనుజ్జయిన కారు ముందు భాగంఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. -
మహిళా రైతుకు పాము కాటు
108 వాహనంలో బాధిత మహిళను సీహెచ్సీకి తరలిస్తున్న వైద్య సిబ్బంది దేవరాపల్లి: మండలంలోని వాకపల్లిలో శుక్రవారం ఓ మహిళా రైతు పాము కాటుకు గురైంది. గ్రామానికి చెందిన రాణం సత్యవతి రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలోకి వెళ్లింది. అక్కడ చెరకు తోట పనులు చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే స్థానికులు వేచలం పీహెచ్సీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుడు రమేష్బాబు ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారిని నిశితంగా గమనిస్తూ వెనుకబడిన సబ్జెక్టులలో తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల పర్యవేక్షణకు నలుగురు నియామకం
పాడేరు రూరల్: ఈనెల 8,9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్, త్రోబాల్ క్రీడా పోటీల పర్యవేక్షణకు నలుగురిని నియమించినట్టు డీఈవో రామకృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కేంద్రంగా మహిళలు, పురుషుల క్రికెట్, త్రోబాల్ క్రీడా పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వీటి ప్రత్యేక పర్యవేక్షణకు నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్టు తెలిపారు. క్రికెట్ జట్టు మేనేజర్గా పాంగి సూరిబాబు (పాడేరు), క్రికెట్ టీమ్ కెప్టెన్గా కిముడు సింహాద్రి (ముంచంగిపుట్టు), త్రోబాల్ టీమ్ మేనేజర్గా పలాసి రాజులమ్మ (పాడేరు), మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎ.చిన్నమి (జి.మాడుగుల)ను నియమించినట్టు ఆయన తెలిపారు. సింహాద్రి చిన్నమి రాజులమ్మ సూరిబాబు -
స్థానికులకు అన్యాయంజరిగితే సహించం
● జేఏసీ సభ్యుల హెచ్చరిక సీలేరు: ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సాండికోరి, బూసుకొండ, పార్వతీనగరంతో పాటు సీలేరు వాసులకు, ముఖ్యంగా చదువుకున్న యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టులో జీవో నంబరు 3 ప్రకారం స్థానిక ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో జెన్కో అతిథి గృహంలో జరిగిన సమావేశంలో చీఫ్ ఇంజనీర్ అందరికీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారులు మాట మార్చడం బాధాకరమని పేర్కొన్నారు. స్థానిక యువతకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి పోరాడుతామని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. -
బలవంతపు భూ సేకరణపై రైతుల ఆందోళన
బుచ్చెయ్యపేట: బలవంతపు భూ సేకరణ పనులను అధికారులు నిలిపివేయాలని ఆర్. శివరాంపురం, అప్పంపాలెం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రెండు గ్రామాల్లో రామాలయాల వద్ద రైతులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు ఏర్పాటుకు తమ గ్రామాల్లో భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు. పరిశ్రమలకు తమ భూములను ఇచ్చేది లేదన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవొద్దంటూ వేడుకున్నారు. ‘మాకు అన్నం పెట్టే భూములే మాకు ముద్దు, కంపెనీల కోసం చేపట్టే భూ సేకరణ మాకొద్దు, భూ సేకరణ కోసం చేపట్టే సర్వేలు మాకొద్దు’ అంటూ రైతులు నినాదాలు చేశారు. రైతుల భూ సమస్యలపై తప్ప పరిశ్రమల కోసం ఎటువంటి సర్వేలు తమ గ్రామాల్లో చేయొద్దని తహసీల్దార్ లక్ష్మికి రైతులు, రైతు సంఘ ప్రతినిధులు వినతి పత్రం అందించారు. -
క్రమశిక్షణకు నిలయాలు... గురుకులాలు
నర్సీపట్నం : పేద విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలు(ఎంజేపీ) ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నాయి. వీటిలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడుతున్నారు. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరు గురుకులం. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తుంటారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో విద్యా బోధన జరుగుతుంది. అనేక సదుపాయాలు గురుకుల విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఈ ఏడాది గురుకులంలో సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీకి గురుకుల విద్యాలయ సంస్థ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రవేశ పరీక్షల్లో రాణించిన వారికి ప్రాధాన్యమిస్తారు. జిల్లాలో తానాం, పాయకరావుపేట, చోడవరం, అన్నవరం(బాలికలు), నర్సీపట్నం, అనకాపల్లి, సింహాచలం, పెదనరం (బాలుర గురుకులాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఇవీ అర్హతలు.. అర్హులైన విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఐదో తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వం లేదా, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా 3,4 తరగతులు చదివి ఉండాలి. తానాం 80 సీట్లు, ఎస్.రాయవరం 40, చోడవరం 40, నర్సీపట్నం 40, అనకాపల్లి 40, సింహాచలం 160, పెదనరం 60, అన్నవరం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తానాం, సింహాచలంలో ఇంటర్మీడియేట్ అందుబాటులో ఉంది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సీట్లకు డిమాండ్ పెరిగింది.. ఎంజేపీ గురుకులంలో సీట్ల డిమాండ్ పెరిగింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది. వారి అభ్యున్నతికి ఇక్కడే బాటలు వేస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుండడంతో సీట్లకు డిమాండ్ పెరిగింది. 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – డా..ఎం.విజయ్దేవరాజు, ప్రిన్సిపాల్ ఎంజేపీ గురుకులం, నర్సీపట్నం -
వాహనాల విధ్వంసం కేసులో హైదరాబాద్ యువకుడి అరెస్ట్
యలమంచిలి రూరల్ : గతేడాది డిసెంబరు 9వ తేదీ రాత్రి పట్టణానికి సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం ఆవరణలో నిలిపి ఉంచిన ఆటో, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన కేసులో నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గండిమైసమ్మ గుడి సమీపంలో ఉన్న బహదూర్పల్లికి చెందిన తొర్రి కార్తీక్ (23) సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన యలమంచిలికి చెందిన యువతి కోసం గత డిసెంబరు 9వ తేదీన యలమంచిలి వచ్చాడు. యువతి నివాసముంటున్న టిడ్కో కాలనీ వద్దకు వెళ్లిన యువకుడితో యువతి మాట్లాడేందుకు నిరాకరించించి. దీంతో ఉన్మాదిగా మారిన నిందితుడు కాలనీలో నివాస గృహాల వద్ద నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి హైదరాబాదుకు పరారయ్యాడు. ఈ ఘటనపై కాలనీ వాసులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు కార్తీక్ను అరెస్ట్ చేయడానికి పట్టణ ఎస్ఐ ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాదుకు పంపించారు. అక్కడ అదుపులోకి తీసుకున్న యువకుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్టు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ వార్డు సభ్యుడు మృతి
మునగపాక : స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బీలా లక్ష్మణరావు అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. లక్ష్మణరావు గతంలో పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసి తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అనకాపల్లిలో సొంత పని నిమిత్తం వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్న విషయం తెలియడంతో మునగపాక వాసులు ఆవేదనకు గురయ్యారు. అందరితో ఆత్మీయంగా ఉండే లక్ష్మణరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మణరావు భార్య స్రవంతి ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయ ట్రస్ట్బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన విషయం తెలిసి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణరావు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మణరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్
అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్ థియేటర్ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. -
వివాహిత ఆత్మహత్య
మృతురాలు సంతోషిమునగపాక : మండలంలోని నాగులాపల్లి జగనన్న కాలనీలో వివాహిత గురువారం ఆత్యహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. నాగులాపల్లి జగనన్న కాలనీలో ఉంటున్న ఆళ్ల ఆదినారాయణతో మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన సంతోషికుమారితో 2012లో వివాహం జరిగింది. వివాహ సమయంలో సంతోషి తల్లితండ్రులు అనుకున్న ప్రకారం కట్నకానుకలు అందించారు. ఇరువురు దంపతులు అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఆదినారాయణ తన కుమారుడు చదువుకుంటున్న నాగులాపల్లి హైస్కూల్కు బైక్పై తీసుకువెళ్లి కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆదినారాయణ తలుపులు తీయాలని తన భార్య సంతోషిని పిలుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి గునపాంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఫ్యాన్కు చీర ఉరివేసుకొని విగతజీవిగా కిందపడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంతోషిని గమనించి ఆటోలో అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సంతోషి మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలు సంతోషికి పాప,బాబు ఉన్నారు. పాప పాటిపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుకుంటుంది. అలాగే బాబు నాగులాపల్లిలో అయిదో తరగతి చదువుకుంటున్నారు. కాగా సంతోషి మృతికి అదనపు కట్నంతో పాటు భర్త వేధింపులే కారణమని, ఈ విషయమై తగు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్టు
నర్సీపట్నం : గొలుగొండ మండలం, కృష్ణదేవిపేట సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం పల్లావూరు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో 50 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపులో రాజవొమ్మంగికి చెందిన గంటిమల్ల రాజుకుమార్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అతనిపై 14 కేసులు ఉన్నాయన్నారు. చిత్రకొండ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి తీసుకువెళ్తుండగా పల్లావూరు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడితో పాటు అభినేష్ మునియప్పన్, మెరిపో కిశోర్, గంటిమల్ల లోవరాజు, మెరిపో లావణ్య, చెన్నాడ ప్రవీణ్కుమార్, మెరిపో విజయ్కుమార్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, 3 స్కూటీలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. -
హోరాహోరీగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
సబ్బవరం: మండలంలోని గొర్లివానిపాలెంలో కొలువైన కుంచాలమ్మ, మంచాలమ్మ, బంగారమ్మ తల్లి తీర్థమహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు వరుసగా రూ.20,116, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7,500 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందించన్నుట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఎంపీటీసీ గొర్లి చైతన్య, గ్రామ పెద్దలు, నాయుకులు గండి దేముడు, బాదిరెడ్డి లక్ష్మణ, గొర్లి కృష్ణ పాల్గొన్నారు.గొర్లివానిపాలెం తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహణ -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ●శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ
కశింకోట: మృత్యు రూపంలో వచ్చిన కంటైనర్ లారీ అన్నదమ్ములను బలి తీసుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మండలంలో తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామి నాయుడు అందించిన వివరాల ప్రకారం... మండలంలోని తాళ్లపాలెంలో ఎస్బీఐ వద్ద యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కంటైనర్ లారీ ముందు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో స్కూటీపై వెళ్తున్న రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ(51), సోదరుడు వెంకటేశ్వరరావు(47) కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వగ్రామం దిమిలి నుంచి అనకాపల్లికి పని మీద వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో వెంకటేశ్వర కూలి కాగా, తాతాజీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా అనకాపల్లిలో పని చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన తాతాజీ, వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరారైన కంటైనర్ లారీని అనకాపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దిమిలిలో విషాధ చాయలు రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం దిమిలిలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలం తాళ్లపాలెంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో దిమిలిలోని వారి స్వగృహాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాతాజీకి భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడాన్ని వారి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు కుటుంబాల్లోని పిల్లలు చిన్న వాళ్లు కావడంతో కుటుంబ పోషణ భారం కానుంది. ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
100 కిలోల గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఒడిశా ఏజెన్సీ ప్రాంతం నుంచి పాడేరు, కె.కోటపాడు మండలం మీదుగా హైదరాబాదుకు కారులో 100 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. మండలంలో కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న జిల్లా స్పెషల్ బ్రాంచి ఎస్ఐ, కె.కోటపాడు పోలీసులకు కారులో గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం ఇవ్వడంతో అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కె.కోటపాడు మండలం చల్లవారి కల్లాలు ప్రాంతంలో టాటా సఫారి కారును ఆపి తనిఖీ చేయగా 100 కేజీలు గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగిందన్నారు. కారులోని కర్ణాటకకు చెందిన డ్రైవర్ అబ్దుల్ హాకీమ్, తెలంగాణకు చెందిన మరో డ్రైవర్ సయ్యద్ సమీర్ ఆలీలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు హైదరాబాద్ నుంచి ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు ఈనెల 3వ తేదీన వెళ్లి అక్కడ గంజాయిని సేకరించి, దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం, నర్సీపట్నం మండలం మీదుగా హైదరబాద్ రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. కారుతో పాటు గంజాయిని, వారి వద్ద మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. సమావేశంలో కె. కోటపాడు ఇన్ఛార్జ్ సీఐ పి.అప్పలరాజు, కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనంజయ్ పాల్గొన్నారు. -
స్పర్శ కోల్పోయిన విద్యార్థిని కేజీహెచ్కు తరలింపు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, ధారకొండ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజారి సూరిబాబు బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా కాళ్లు కదపలేక, స్పర్శ కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమాధికారిణి నాగ జయలక్ష్మి, విద్యార్థిని వెంటనే చింతపల్లి తరలించాలని సూచించారు. అక్కడి వైద్యులు విద్యార్థిని పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్కు తరలించాలని సూచించారు. అయితే, సూరిబాబు తల్లిదండ్రులు ఇందుకు మొదట నిరాకరించారు. దీంతో ఏటీడబ్ల్యూవో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, పరిస్థితిని వివరించారు. వారు అంగీకరించడంతో, ఆమె స్వయంగా దగ్గరుండి విద్యార్థిని చింతపల్లి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
విద్యార్థులు లక్ష్య సాధనలో పోటీ పడాలి
కొయ్యూరు: ఇష్టపడి చదివితే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనలో పోటీ పడాలని ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ పిలుపునిచ్చారు. కొయ్యూరు పోలీసులు, ’నేను సైతం’ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక కేజీబీవీలో వ్యక్తిత్వ వికాస తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యండమూరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో కష్టసుఖాలు సహజమని, ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయపథంలో కొనసాగుతున్న వారందరి జీవితాలు పూలపాన్పులు కావని ఆయన గుర్తుచేశారు. వారంతా ఎంతో కష్టపడి పైకి ఎదిగినవారేనని పేర్కొన్నారు.జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని సవాలుగా స్వీకరించి, విజయపథంలో పయనించే లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలనిసూచించారు. ఈ సందర్భంగా యండమూరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కిషోర్ వర్మ, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ -
ఎమ్మెల్యే మత్స్యలింగంకుమారుడి వివాహానికి ఆహ్వానం
● జగన్మోహన్రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన కుమారుడు రేగం చాణక్య వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేయగా, దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు. వివాహ మహోత్సవానికి తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ కుటుంబంపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా జగన్ను ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు (వరుడు) రేగం చాణక్య ఉన్నారు. -
‘ఉపాధి’ వేతనం పెంచాలని ఆందోళన
ముంచంగిపుట్టు: ఉపాధి హామీ నిధులు పెంచాలని, బకాయి పడిన గృహ నిర్మాణ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం గిరిజనులు ఆందోళనకు దిగారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చకూడదని, నిధుల కుదింపు వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేసి, పనిదినాలను 200 రోజులకు పెంచాలని, రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.పీఎం జన్–మన్, జనరల్ కేటగిరీ ఇళ్లకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను రూ.10 లక్షలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కె. త్రినాథ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు న్యాయం జరగకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ భాస్కర అప్పారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సీపీఎం మండల నేతలు ఎంఎం శ్రీను, కె. నర్సయ్య, ఎస్. గాసిరాం దొర, జి. నారాయణ, పి. రామదాసు, కె. శంకర్ రావు, జి. జినబంధు, డొంబ్రు, శ్రీను, నీలకంఠం, దేవ, పరశురామ్ పాల్గొన్నారు.సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్ -
అగ్ని పరీక్ష
స్టీరింగ్ ఊడిపోతోంది.. ట్యాంకు నుంచి నీరు కారిపోతోంది.. ఇది పాడేరు అగ్నిమాపక కేంద్రంలోని వాహనం పరిస్థితి..అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు వెళ్లాల్సిన వాహనమే ఇప్పుడు ప్రమాదంలో ఉంది. జిల్లా కేంద్రమైన పాడేరులో అగ్నిమాపక సేవల పరిస్థితి దారుణంగా మారాయి. వంద కిలోమీటర్ల పరిధి.. వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులు.. కానీ రక్షణకు ఉన్నది మాత్రం ఒకే ఒక్క డొక్కు వాహనం. దీంతో సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంటే, అధికారులు మాత్రం కొత్త వాహనాల హామీని గాలికొదిలేశారు అక్కడికి చేరడమే గగనం ● సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులోని అగ్నిమాపక కేంద్రం సేవల విస్తరణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. గత ఏడాది కాలంగా ఇక్కడి పాత అగ్ని మాపక వాహనం మరమ్మతులకు గురై పూర్తిగా మూలకు చేరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరో వాహనం కూడా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా వాహన పరిస్థితి ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు దాటితే అందులో కూర్చోవడానికే సిబ్బంది భయపడుతున్నారు. గతంలో ప్రయాణంలో ఉండగానే స్టీరింగ్ ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, వాహన ట్యాంకుకు రంధ్రాలు పడటంతో నీరు వృథాగా లీకవుతోంది. దీనివల్ల ప్రమాద స్థలానికి చేరుకునే సరికి ట్యాంకు ఖాళీ అయిపోతుండటంతో అగ్నిమాపక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ● జిల్లాలోని 11 మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా పాడేరులోని ఈ ఒక్క డొక్కు వాహనమే దిక్కవుతోంది. పాడేరు నుంచి అనంతగిరి, ముంచంగిపుట్టు, గూడెకొత్తవీధి, కొయ్యూరు వంటి మండలాలు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాహనం కండిషన్లో లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లేలోపే ఆస్తిపాస్తులు, గడ్డి వాములు, పంట కుప్పలు కాలి బూడిదవుతున్నాయి. ● పాత వాహనాల స్థానంలో రెండు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని అధికారులు గత ఏడాదే ప్రకటించినా, అది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఒక వాహనం పూర్తిగా పాడైపోవడం, రెండో వాహనం నీటి లీకేజీతో ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పాత వాహనంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తక్షణమే స్పందించి పాడేరు కేంద్రానికి కొత్త అగ్నిమాపక వాహనాలను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. మార్చిలో కొనుగోలు చేస్తాం పాడేరు అగ్నిమాపక కేంద్రంలో రెండు వాహనాల మరమ్మతులకు గురయ్యాయి. వీటిని పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించాం.15వ ఆర్థిక సంఘ నిధులతో కొత్త వాహనాన్ని మార్చిలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొత్త వాహన సేవలు అందుబాటులోకి వస్తే చాలవరకు ఇబ్బందులు తప్పుతాయి. – లక్ష్మణస్వామి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, పాడేరు కొత్త వాహనాలు అవసరం పాడేరు అగ్నిమాపక కేంద్రంలో రెండు వాహనాల సేవలను అందుబాటులో ఉంచాలి.గిరిజన ప్రాంతాలలో వేసవి కాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.గత నెలలో హుకుంపేట మండలంలో పలు చోట్ల వరిపనల కుప్పలు దహనం అయ్యాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. – చెండా ప్రసాద్, గిరిజన రైతు, ములియాపుట్టు, హుకుంపేట మండలం -
గురువు ముసుగులో మృగం!
గురువు అంటే మార్గదర్శిగా ఉండాలి.. కానీ ఆ ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతూ మృగంలా ప్రవర్తించాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేయగా, అధికారులు విచారణ చేపట్టారు. విద్యా వ్యవస్థకు కళంకం తెచ్చిన ఈ ఘటన కలకలం రేపింది.పాడేరు: విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడికను నేర్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడి తీరుతో విసిగిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో, తల్లిదండ్రులు వారిని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం మారుమూల ఐనాడ పంచాయతీ, రాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ పాఠశాలలో సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఆయన పాఠశాల విద్యార్థినుల పట్ల వికృత చేష్టలతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రుల ఆగ్రహం.. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు బుధవారం ఆయనపై భౌతిక దాడి చేశారు. చిన్నారులను తరచుగా కొట్టడంతో పాటు, అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇన్చార్జి ఎంఈవో సువర్ణరాజు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన, గురువారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. జరిగిన తీరును తల్లిదండ్రులు ఎంఈవోకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, నివేదికను కలెక్టర్, డీఈవోకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఉపాధ్యాయుడిని వేరే చోటుకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఆందోళన.. డిమాండ్లు మరోవైపు గురువారం పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, సర్పంచ్, ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐటీడీఏ, కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆరోపణలు అవాస్తవం అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కక్షగట్టి తన భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని, 2023 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై గ్రామానికి చెందిన కొంతమంది భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన వాపోయారు. రాయిపాలెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన పాఠశాలకు వెళ్లకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు వెలుగులోకి అసలు విషయం ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు దేహశుద్ధి విచారణ చేపట్టిన ఇన్చార్జి ఎంఈవో సువర్ణరాజు -
12న పర్యాటక ప్రాంతాల్లో బంద్
అరకులోయ టౌన్: ఈ నెల 12వ తేదీ గురువారం అరకులోయలోని పర్యాటక సందర్శిత ప్రాంతాల బంద్కు సీఐటీయూ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో భాగంగా పాడేరు ఐటీడీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొంటారని ఐటీడీఏ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాడి రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భగత్ రామ్ తెలిపారు.ఇప్పటికే సంబంధిత యూనిట్ మేనేజర్లకు సమ్మె నోటీసులు అందజేశామన్నారు. ఈనెల 12న అరకులోయలోని అన్ని పర్యాటక ప్రాంతాలు మూతబడతాయని, ఈ విషయాన్ని సందర్శకులు గుర్తించాలని వారు కోరారు.విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపు -
నేడు అరకు ఆర్ఐటీఐలో మెగా జాబ్మేళా
పాడేరు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో అరకువ్యాలీ ఆర్ఐటీఐ కళాశాలలో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మెగా జాబ్మేళా జరుగుతుందని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు జాబ్మేళా పోస్టర్లను కలెక్టర్తోపాటు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ రోహిణి ఆవిష్కరించారు. జాబ్మేళాలో అపోలో ఫార్మసీ, నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్, ముత్తూట్ ఫైనాన్స్, ఫ్లిప్కార్ట్, వరుణ్ మోటర్స్, తదితర పది కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఆపై చదువులు చదువుకున్న నిరుద్యోగ యువత ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, పాన్కార్డు జెరాక్స్ కాఫీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9491057527, 6302636174లలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. -
పోటీపరీక్షల్లో విజయం సాధించేందుకే ‘సంకల్పం’
● ఎస్పీ అమిత్ బర్దర్ ● ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభం అరకులోయ టౌన్: యువతలో విద్యపై అవగాహన పెంచడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రోత్సహించడానికి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఎంతో దోహదపడుతుందని ఎస్పీ అమిత్ బర్డర్ అన్నారు. కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరకులోయలో గిరిజన యువత కోసం ఏర్పాటు చేసిన ‘సంకల్పం’ ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అరకులోయ మండలంలోని యువతీ యువకులు పోలీస్, ఎస్ఐ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ శిక్షణ రూపొందించబడిందన్నారు. గిరిజన యువతలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, సమాజంలో వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.నిపుణులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన విద్యా సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ.. యువత చదువు పట్ల అనాసక్తి చూపకుండా, నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తారని పేర్కొన్నారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గిరిజన యువత అభివృద్ధి కోసం పోలీస్ శాఖ తీసుకున్న ఈ చొరవ అభినందనీయమన్నారు. పోలీస్ శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విద్యార్థులకు అత్యుత్తమ కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, అరకులోయ ఎస్ఐ గోపాలరావు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలోఇద్దరికి తీవ్ర గాయాలు
జి.మాడుగుల: మండలంలోని మద్దిగరువు వెళ్లే ఆర్అండ్బీ ప్రధా న రహదారిపై అనర్భ గ్రామం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. పాసింజర్ జీపు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మద్దిగరువు వారపు సంత నుంచి ప్రయాణికులతో జి.మాడుగుల వైపు వస్తున్న టికెట్ సర్వీసింగ్ జీపు, కిల్లంకోట పంచాయతీ కె.బందవీధి గ్రామానికి చెందిన పొత్తూరి తిరుపతిరావు, ఎండ్రపల్లి మురళి ప్రయాణిస్తున్న బైక్ను అనర్భ గ్రామ సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న తిరుపతిరావు, మురళీకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. -
అగ్నిప్రమాదంలో రైతు మృతి
మాడుగుల రూరల్: చలిమంట కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పశువుల పాక దగ్ధంకాగా, అందులో నిద్రించిన రైతు తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో మృతిచెందాడు. రెండు పాడి గేదెలు గాయపడ్డాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన నుంచి గాదిరాయి వెళ్లే రహదారిలో జంపెన గ్రామానికి చెందిన రైతు ధర్మిశెట్టి అచ్చిమినాయుడు(40)కు చెందిన పశువుల పాక ఉంది. ఈ పాకలో రెండు పాడి గేదెలు, ఒక బైక్ ఉన్నాయి. మంగళవారం రాత్రి పశువుల పాకలో అచ్చిమినాయుడు చలిమంట వేసుకున్నాడు. దానిని ఆర్పకుండా పాకలో నిద్రపోయాడు. దీంతో బుధవారం తెల్లవారు జామున నిప్పు అంటుకుని పాక దగ్ధమైంది. నిద్రమత్తులో ఉన్న అచ్చిమినాయుడు లేచి చూసేసరికి పాక అంతా మంటలు వ్యాపించాయి. గేదెలను రక్షించే ప్రయత్నంలో ఉండగా ఒక్క సారిగా కాలుతున్న దూలం అచ్చిమినాయుడు మీద పడి, 70 శాతం శరీరం కాలిపోయింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందదుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక గేదె స్వల్పంగా, మరో గేదె 50 శాతం కాలినగాయాలకు గురయ్యాయి. పాకలో ఉన్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న మాడుగుల అగ్నిమాపక కేంద్రం అధికారి వి.రాజేశ్వరావు తన సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయాం అగ్నిప్రమాదం కారణంగా పెద్దను కోల్పోయామని, మృతుడు అచ్చిమినాయుడు భార్య దుర్గ, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడికి ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కాపు నేతలు
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ గుండాలతో చంద్రబాబు దాడులు చేయించారని ఉమ్మడి విశాఖకు చెందిన కాపు నేతలు ఆక్షేపించారు. ఈ నెల 7న విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన కాపునేతలు పార్టీలకు అతీతంగా అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వందకు పైగా కార్ల ర్యాలీతో వెళ్లి, అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞలకు ధైర్యం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు బుధవారం సమావేశమయ్యారు. కాపునేతలపై చంద్రబాబు కక్ష కాపు నేత అంబటి రాంబాబుపై పథకం ప్రకారమే టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా టీడీపీ రౌడీ మూకలతో పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారంటూ కాపునేతలు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారనే దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో దాడికి తెగబడినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫోన్లు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. అదే రీతిలో వంగవీటి రంగా శిష్యుడుగా పేరున్న మరో కాపునేత అంబటి రాంబాబును, ఆయన కుటుంబాన్ని హతమార్చాలని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాపులను ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందని కాపునేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి అంబటి కుటుంబానికి అండగా నిలిచి, ధై ర్యాన్నివ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు నేతలు బాణాల శ్రీనివాసరావు, వీసం రామకృష్ణ, కోరుకొండ స్వాతి, పీవీ సురేష్, గుడివాడ అనూష, గుండపు నాగేశ్వరరావు, రామజోగి, రాయపూడి అనిల్కుమార్, గుడివాడ లతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష
అనకాపల్లి: పలు దొంగతనాల కేసుల్లో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి న్యాయమూర్తి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్ చెప్పారు. విశాఖ జిల్లా గాజువాక మండలం అగనంపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాటిపూడి శంకర్కు పలు చోరీలకు పాల్పడడంతో మొదటి ఏజేసీజే న్యాయమూర్తి ఎ.రమేష్ శంకర్కు ఏడాదిన్నర జైలు శిక్షవిధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్టు పట్టణ సీఐ తెలిపారు. అనకాపల్లి పట్టణ పరిధిలో 2019 సంవత్సరంలో లక్ష్మీదేవీపేట, పాత్రుడు కాలనీ, సాయినగర్, కొత్తూరు, గవరపాలెం, నూకాంబిక ఆలయవీధిలో చోరీలకు పాల్పడిన తాటిపూడి శంకర్పై అప్పటి సీఐ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా వాదోపవాదాలు అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృణాళిని వాదనలు వినిపించినట్టు చెప్పారు. -
రేషన్ డిపో తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని అరకుసంత రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ తీరుపై ఇన్చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని ఆయన తహసీల్దార్ త్రివేణితో కలిసి స్వయంగా పరిశీలించారు. డిపోలోని స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు, నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు.లబ్ధిదారులకు అందిస్తున్న సరుకుల తూకం సరిగ్గా ఉందో లేదో అడిగి తెలుసుకున్నారు.ఈ–కేవైసీ ప్రక్రియ, వేలిముద్రల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై కార్డుదారులతో మాట్లాడారు. కార్డుదారులకు కేటాయించిన సరకులలో ఎటువంటి కోత విధించకుండా పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. నిర్ణీత సమయం ప్రకారం డిపోలను తెరిచి ఉంచాలని, డిపోల వద్ద స్టాక్ వివరాలతో పాటు ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. సరకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడినా, నిత్యావసరాలను పక్కదారి పట్టించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సరకులు అందేలా చూడాలని తహసీల్దార్ త్రివేణికి ఆయన దిశానిర్దేశం చేశారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
చింతపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే అడ్డుకోగలమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ అన్నారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు చట్టాలను తీసుకువస్తున్నాయని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రతి కార్మికుడు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి శానిటేషన్ కార్మిక యూనియన్ నాయకులు సత్యనారాయణ, ఈశ్వరరావు, లక్ష్మి, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ -
అరకువ్యాలీలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● కొనసాగుతున్న శీతల గాలులు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. చలి, పొగమంచు తీవ్రత కొనుసాగుతోంది. బుధవారం అరకువ్యాలీలో 10.6 డిగ్రీలు, చింతపల్లిలో 10.8 డిగ్రీలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో ముంచంగిపుట్టులో 11.2 డిగ్రీలు, హుకుంపేటలో 11.5 డిగ్రీలు,పెదబయలులో 12.1డిగ్రీలు, కొయ్యూరులో 15.3 డిగ్రీలు, అనంతగిరిలో 17.0 నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం నుంచివ వీస్తున్న శీతల గాలులకు ప్రజలు తాళలేకపోతున్నారు. -
రక్తహీనతతో ఆశ్రమ విద్యార్థినికి తీవ్ర అస్వస్థత
● స్పృహ తప్పి పడిపోవడంతో అప్రమత్తమైన హెచ్డబ్ల్యూవో గంగాభవాని ● రక్తపరీక్షల అనంతరం అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలింపు పెదబయలు: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల–1లో బుధవారం రాత్రి ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఎన్. మహేశ్వరి రాత్రి 8.30 గంటల సమయంలో వసతి గృహంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. విద్యార్థిని స్పృహ తప్పడంతో అప్రమత్తమైన పాఠశాల హెచ్డబ్ల్యూవో గంగాభవాని వెంటనే ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెకు పీహెచ్సీ వైద్యాధికారి నిఖిల్ పరీక్షలు నిర్వహించగా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కేవలం 5.4 పాయింట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. రక్తహీనత తీవ్రంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్లో హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు హెచ్బీ, సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తహీనత ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, వారికి పౌష్టికాహారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. -
మరింత మెరుగ్గా పోలీసుల నైపుణ్యాలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): పోలీసులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ సూచించారు. విశాఖ నగరంలోని కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయంలో పోలీసులకు వార్షిక మొబిలైజేషన్ రీఫ్రెష్ ట్రైనింగ్ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునే ఈ శిక్షణ 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సిబ్బందికి క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. పోలీసులకు విధుల్లో ఒత్తిడి సహజమన్నారు. ఇలాంటి రీఫ్రెష్ శిక్షణ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు వారి కుటుంబ సంక్షేమం, పిల్లల చదువుల విషయంపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐలు బి.రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రూప్–2 విజేతగుణశేఖర్కు సత్కారం
పెదబయలు: గుల్లేలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ, గోమంగి పంచాయతీకి అదనపు బాధ్యతలు చూస్తున్న పెనుమాల గుణశేఖర్, ఇటీవల విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం స్థాని క మండల పరిషత్ కార్యాలయంలో ఆయనను ఎంపీపీ బొండా వరహాలమ్మ, జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, మండల పరిషత్ ఏవో ఎల్. పూర్ణ య్య శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన యువత గుణశేఖర్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత గుణశేఖర్ మాట్లాడుతూ.. గ్రూప్–2 సాధించడం సంతోషంగా ఉందని, అయితే తన అసలు లక్ష్యం గ్రూప్–1 సాధించడమేనని పేర్కొన్నారు. ఎస్ఐ వెంకటేష్, వైస్ ఎంపీపీలు సోనే, కొర్ర రాజుబాబు, ఎంపీటీసీల ఫోరం అ ధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు పాల్గొన్నారు. -
ట్రాలీ ఢీకొని రైల్వే గేటు ధ్వంసం
డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయితీ కేంద్రం సమీపంలో ఉన్న రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఒక భారీ ట్రాలీ అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొట్టింది. ఆ సమయంలో గేటు మూసి ఉండటంతో, అక్కడ నిలిపి ఉంచిన స్కూటీపైకి ట్రాలీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.అదే సమయంలో ఒక గూడ్స్ రైలు నెమ్మదిగా వస్తూ పట్టాలపై ఉన్న ట్రాలీని గమనించి సకాలంలో ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదం ధాటికి రైల్వే గేటు పూర్తిగా విరిగిపోవడం, ట్రాలీ పట్టాలపైనే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత్యంతరం లేక ప్రయాణికులు గేటు దాటి అవతలి వైపునకు వెళ్లి ఆటోల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ట్రాలీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు సుమారు గంటపాటు శ్రమించి ట్రాలీని తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.గూడ్సు రైలు నిలిపివేయడంతో తప్పిన పెద్ద ప్రమాదం -
స్ట్రాబెర్రీ
ప్రకృతి ఒడిలో కురుస్తున్న దట్టమైన మంచు కేవలం పర్యాటకులకే కాదు, లంబసింగి రైతులకు కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఈ ఏడాది హిమబిందువుల మధ్య చేపట్టిన స్ట్రాబెర్రీ సాగుకు వాతావరణంఅనుకూలించడంతో మంచి దిగుబడి వచ్చింది. అటు ప్రకృతి అందం, ఇటు ఆర్థిక లాభం జతకలవడంతో ఏజెన్సీ రైతుల ఇంట స్ట్రాబెర్రీ తీపి కనిపిస్తోంది. గిరి రైతు గురిచింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగి ప్రాంతం ఇప్పుడు విదేశీ పంటలకు కేంద్రంగా మారుతోంది. చలి తీవ్రత అధికంగా ఉండే ఈ ప్రాంతంలో గిరిజన రైతులు సంప్రదాయేతర పంట అయిన ’స్ట్రాబెర్రీ’ సాగులో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఊటీ, మహాబలేశ్వర్ వంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట, ఇప్పుడు లంబసింగిలో కూడా విరివిగా పండుతుండటం విశేషం. సాగు ప్రస్థానమిలా.. సుమారు 30 ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇక్కడ స్ట్రాబెర్రీ సాగుపై ప్రయోగాలు చేపట్టారు. వారి సూచనల మేరకు గొందిపాకలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బౌడు కుశలవుడు ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టారు. పూణే (మహాబలేశ్వర్) నుంచి కామరోజా అనే రకాన్ని తీసుకువచ్చి, ఎకరాలో 20 వేల మొక్కలతో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయన సాధించిన ఫలితాలను ఆదర్శంగా తీసుకుని నేడు అనేకమంది రైతులు దీనిని అనుసరిస్తున్నారు. ● ప్రస్తుతం లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, రాజబంద, తాజంగి, లబ్బంగి, సిరిపురం, చెలకవీధి తదితర గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో ఈ సాగు విస్తరించింది. ప్రారంభంలో సాగు చేసిన రకాల కంటే, ప్రస్తుతం ఈ ప్రాంత వాతావరణానికి అత్యంత అనుకూలమైన ’వింటర్ డాన్’ రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. రబీ సీజన్లో భాగంగా సాగయ్యే ఈ పంట, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగు నుంచి ఐదు నెలల పాటు దిగుబడి ఇస్తుంది. ● ఎకరా సాగుకు సుమారు 20 వేల మొక్కలు అవసరమవుతాయి. మొక్కల కొనుగోలు, రవాణా, సాగు ఖర్చులు కలిపి ఎకరాకు సుమారు రూ. 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఒక్కో మొక్క నుంచి 300 నుంచి 500 గ్రాముల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. మైదాన ప్రాంత రైతులు సైతం ఇక్కడికి వచ్చి, గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని మరీ సాగు చేపడుతుండటం ఈ పంట లాభదాయకతకు నిదర్శనం. ● లంబసింగి పర్యాటక ప్రాంతం కావడంతో మార్కెటింగ్ సమస్యే లేదు. పండించిన పంటలో 90 శాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులకే అమ్ముడుపోతోంది. తాజా స్ట్రాబెర్రీ పండ్లను పర్యాటకులు హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. 250 గ్రాములు (సుమారు 15–20 పండ్లు) ఉండే బాక్స్ను రూ. 100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు. జామ్ తయారీ పండ్లే కాకుండా, స్ట్రాబెర్రీ జామ్ను కూడా తయారు చేసి 100–200 గ్రాముల బాక్సులను రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు పెట్టుబడి పోను రూ. 8లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ఈ ఏడాది వర్షాల వల్ల సాగు కాస్త ఆలస్యమైనప్పటికీ, వాతావరణం అనుకూలించిందని, గత మూడేళ్లతో పోలిస్తే మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్న లంబసింగి రైతులు నోరూరించే రుచితోపాటు లాభాలు ఎకరాకు రూ.8 లక్షల ఆదాయం కాసులు కురిపిస్తున్న పైరు -
ఘనంగా శ్రీ గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు ప్రారంభం
రోలుగుంట: నాలుగురోజుల పాటు నిర్వహించే గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆచార సంప్రదాయం ప్రకారం బుడబుక్కల వేషం నిర్వహించారు. తరువాత సాయంత్రం వరకూ యువకులు ఉత్సాహంగా బాలనాగమ్మ, తిక్కలోడు వంటి పలు వేషాలు ప్రదర్శించారు. సాయంత్రం 4:30 గంటల తరువాత ముందుగా వెదురు కలపతో నిర్మించిన 90 అడుగుల బండి ప్రభను భక్తులు భుజాలపై ఉత్సవస్థలానికి మోసుకుని వచ్చి శుభ ఘడియలో ప్రతిష్టించారు. గ్రామ వీధులను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించారు. రాత్రి శూలాలు ఉత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఉత్సవ స్థలానికి తీసుకువచ్చి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనార్థం రథంపై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పోతల లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ గురువారం చిన్న తీర్థం, శుక్రవారం పెద తీర్థం జరుగుతుందన్నారు. గ్రామ వీధుల్లో స్టేజి ప్రోగాంలు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం నిమజ్జనోత్సవం జరుగుతుందన్నారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా వెదురుతో నిర్మించిన 90 అడుగుల బండిప్రభ ప్రతిష్ట ప్రత్యేకాకర్షణగా ఉంటుందన్నారు. ఏ విధమైన ఆల్లర్లకు తావు లేకుండా గ్రామ యవత వలంటీర్లుగా తమ సహకారం అందించాలని కోరారు. అలాగే ఉత్సవం విజయవంతానికి పోలీసులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఐక్య పోరాటం
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ, సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు అందజేసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను అందరూ వ్యతిరేకించాలన్నారు. ఉపాధి హామీ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, వారి ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శంకర్ రావు, సింహచలం, ముత్యకొండమ్మ, నీలకంఠం పాల్గొన్నారు. -
యలమంచిలి వైస్ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక
యలమంచిలి రూరల్: యలమంచిలి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఏటికొప్పాక–1 ఎంపీటీసీ నగిరెడ్డి అమ్మాజీ ఎన్నికయ్యారు.బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో ఎంపీటీసీ సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి పి.కె.పి.ప్రసాద్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మొత్తం ఆరుగురు ఎంపీటీసీ సభ్యులకు గాను నలుగురు సభ్యులు ఎంపీపీ రాజాన శేషు,శిలపరశెట్టి ఉమ,బర్రే శివలక్ష్మి మాత్రమే హాజరయ్యారు.వీరిలో ఎంపీపీ రాజాన శేషు నగిరెడ్డి అమ్మాజీని వైస్ ఎంపీపీగా ప్రతిపాదించగా శిలపరశెట్టి ఉమ మద్దతిచ్చారు.దీంతో నగిరెడ్డి అమ్మాజీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు పీవో ప్రకటించారు. గెలుపొందినట్టు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేసి,ప్రమాణం చేయించారు.వైస్ ఎంపీపీగా ఎన్నికై న అమ్మాజీకి ఎంపీపీ రాజాన శేషు,ఎంపీడీవో కొండలరావు,సిబ్బంది,ఎంపీటీసీలు అభినందనలు తెలిపారు.ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం ఉపేంద్ర బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై నెగ్గిన అవిశ్వాసం
మునగపాక: స్థానిక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలపై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నెల 9వ తేదీన మునగపాక ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజాలక్ష్మి,చిందాడ దేవీలపై అవిశ్వాసం ప్రకటిస్తూ 11 మంది ఎంపీటీసీలు నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో ఆయిషా అవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు. మెజార్టీ సభ్యులు 11 మంది ఎంపీపీతోపాటు వైస్ ఎంపీపీలకు వ్యతిరేకంగా, అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ మునగపాక మండల ఎంపీటీసీ సభ్యులిచ్చిన అవిశ్వాస నోటీసుకు సంబంధించి మండల పరిషత్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గిందన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలిపారు. -
కార్డుదారులకుబియ్యం పంపిణీ
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ పరిధిలో ఉన్న పెదబయలు డీఆర్ డిపోలో బుధవారం ఉదయం నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేపట్టారు. మండల సివిల్ సప్లై గోదాం ఇన్చార్జ్, మండల ఆర్ఐ వి.పూర్ణయ్య పర్యవేక్షణలో లబ్ధిదారులకు ఈ పంపిణీ జరిగింది. ఈ నెల 4న ’సాక్షి’లో ప్రచురితమైన ‘రేషన్ కోసం నిరీక్షణ.. తెరుచుకోని పెదబయలు డీఆర్ డిపో’ అనే కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు స్థానిక సేల్స్మెన్ కొర్ర ఆనందరావు, ఇతర సిబ్బంది ద్వారా కార్డుదారులకు బియ్యం అందజేశారు. డిపో పరిధిలోని కార్డుదారులందరికీ రేషన్ సరకులు అందుబాటులో ఉన్నాయని, అందరూ వచ్చి తమ సరకులు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
గిరిజన విద్యార్థులకుడిజిటల్ విద్య
● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : గిరిజన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆరోహణ స్వచ్ఛంద సంస్థ, ఐఆర్సీటీసీ సీఎస్సార్ నిధులతో జిల్లాలోని లోచలిపుట్టు, గుత్తులపుట్టు, బొర్రా, టోకూరులో ఒక్కో పాఠశాలకు 15 కంప్యూటర్ల చొప్పున అందజేశారన్నారు. విద్యార్థులు డిజిటల్ తరగతి గదులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోహణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రాణి పాటిల్, టీడబ్ల్యూ డీడీ పరిమళ పాల్గొన్నారు. జిల్లా పర్యాటకాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ దినేష్కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, అటవీశాఖ, పరిశ్రమల శాఖ మూడు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. హోం స్టేలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ బాధ్యత తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, పర్యాటక అభివృద్ధి సంస్థ రీజనల్ డైరెక్టర్ కల్యాణి, డివిజనల్ మేనేజర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి దాసు పాల్గొన్నారు. -
కాఫీ రైతులకు గిట్టుబాటు ధర
జి.మాడుగుల: గిరిజన సహకార సంస్థకు రైతులు కాఫీ విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆసంస్థ కాఫీ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కోరారు. మండలంలో పీజీ మాడుగుల, గొడుగుమామిడి, కుబ్బంగి తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. గిరిజన గ్రామాల్లో కాఫీ దిగుబడుల వివరాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. రైతులు కాఫీని దళారీలకు విక్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. గిరిజన సహకార సంస్ధ ద్వారా పాచ్మెంట్ కాఫీ కిలో రూ.450, చెర్రీ కిలో రూ.270 చొప్పున ధర చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. గిరిజన రైతులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుందన్నారు. అందువల్ల రైతులు తమ సంస్థకు విక్రయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బాబూరావు, సేల్స్మెన్లు కోటిబాబు, పంతులుబాబు, సూరిబాబు,నిరీక్షణరావు పాల్గొన్నారు.జీసీసీ కాఫీ విభాగం జీఎం శ్రీనివాస్ -
భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : ఏజెన్సీలో భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి భూ హక్కులు కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ బొక్కెళ్లు గ్రామంలో బుధవారం 43 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలో భూమి రికార్డుల్లో సాంకేతికంగా లోపాలు, పేర్ల తప్పులు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు చేపట్టామన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి హక్కుతో కూడిన పాసు పుస్తకాలను అందజేశామని ఆయన వివరించారు. పారదర్శకంగా పట్టాదారు పాసు పుస్తకాలు : ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అరకులోయ టౌన్: గిరిజన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యంత పారదర్శకంగా, తప్పుల్లేని రికార్డులను అందించడమే లక్ష్యంగా పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని లిట్టిగుడ గ్రామంలో రీ–సర్వే పూర్తయిన సందర్భంగా, 36 మంది గిరిరైతులకు ఆయన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎటువంటి తప్పులు లేకుండా రాజముద్రతో అధికారికంగా ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు.పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం లబ్ధిదారులకు వెంటనే ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. దీనివల్ల యాజమాన్య హక్కులు డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించబడి, రైతులకు పూర్తి భరోసా కలుగుతుందన్నారు. రీ–సర్వే వల్ల భూ వివాదాలకు ముగింపు పలకడమే కాకుండా, పారదర్శకమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని జేసీ వివరించారు. పాసు పుస్తకాల ముద్రణకు ముందే తహసీల్దార్ ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు స్వయంగా గ్రామస్తుల వద్దకు వెళ్లి, వివరాలలోని తప్పుప్పులను సరిచూసుకున్న తర్వాతే ముద్రణకు పంపినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ దొన్నుదొర, తహసీల్దార్ కుమారస్వామి, డీటీ పంచాడి గోవిందరావు, ఆర్ఐ పట్టాసి శంకరరావు, సర్పంచ్ దాసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అవగాహనతోనే గిరి రైతులకు అధిక ఆదాయం
పాడేరు రూరల్: వ్యవసాయంపై అవగాహన పెంచుకోవడం ద్వారానే గిరిజన రైతులకు మరింత ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ అధికారి డాక్టర్ జి. శివనారాయణ తెలిపారు. బుధవారం పాడేరులోని ఏరువాక కేంద్రం వద్ద గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద మంజూరైన ఆయిల్ మిల్లులు, సైకిల్ వీడర్లను అర్హులైన గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆధునిక మెలకువలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో విక్రయించకుండా, శుద్ధి చేసి విక్రయిస్తే గిట్టుబాటు ధరతో పాటు అధిక లాభాలు వస్తాయన్నారు. రైతులందరూ నూతన సాగు పద్ధతులను అలవాటు చేసుకున్నప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ మిల్లులు, సైకిల్ వీడర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీ నోడల్ అధికారి డాక్టర్ సురేష్, ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దేవుళ్లు పాల్గొన్నారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణాధికారి శివనారాయణ -
ఫస్ట్ అండ్ లాస్ట్ బడ్జెట్!
మేయర్ కాలానికి మోగిన ముగింపు గంట నేడు 2026–27 జీవీఎంసీ బడ్జెట్ సమావేశం మరో నెలన్నరలో పాలకవర్గానికి తెర డాబాగార్డెన్స్(విశాఖ) : జీవీఎంసీ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నగర పాలకవర్గం కాలపరిమితి ముగియడానికి మరో నెలన్నర రోజులే గడువు ఉండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నగర ప్రజల్లో భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 18వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం అధికారికంగా ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఆయన పదవీ కాలంలో మొదటిది, చివరిది కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం మార్చి 7వ తేదీ తర్వాత ఎటువంటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి పెండింగ్ పనులను చక్కబెట్టే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మళ్లీ చంద్రకాలమేనా? నగర చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 27 నుంచి సుమారు ఎనిమిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రేటర్ విశాఖకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, గతంలో లాగే మళ్లీ అధికారుల పాలన మొదలవుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పాలకవర్గ పదవీకాలం ముగియగానే సహజంగానే అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇదే తరుణంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. తన నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాఫీగా రాకపోకలు సాగడానికి, భీమిలి పరిధిలో ప్రతిపాదించిన ఏడు కీలక మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి ఈ విలీనం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను చేపడితే, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు కాబట్టి, మరోసారి సుదీర్ఘకాలం పాటు నగర పాలన అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. విద్యారంగంపై నిర్లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. బాల్యం పథకం కింద 3 నుంచి 7 ఏళ్లలోపు బాలలకు చిన్నబడి కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాలతో మున్సిపల్ పాఠశాలలను అనుసంధానం చేసి పౌష్టికాహారం, విద్య, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా అన్ని రంగాలను ఈ బడ్జెట్ విస్మరిస్తూ నిధులు కేటాయించింది. గత బడ్జెట్ అలా.. నేటి బడ్జెట్ ఇలా.. నగర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే బడ్జెట్ గణాంకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రారంభ నిల్వ రూ.482.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుత 2026–27 బడ్జెట్లో అది రూ.365.96 కోట్లకు పడిపోయింది. అంటే ప్రారంభ నిల్వలోనే సుమారు రూ.116.3 కోట్ల మేర కోత పడింది. గతేడాది అన్ని పద్దుల కింద మొత్తం ఆదాయం రూ.4,761.87 కోట్లుగా చూపగా, ఈ ఏడాది అది రూ.4,180.37 కోట్లకు పరిమితమైంది. అంటే ఆదాయం పరంగా చూస్తే ఈ ఏడాది ఏకంగా రూ.370 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముగింపు నిల్వలో సైతం రూ.27 కోట్ల మేర తేడా ఉండటం గమనార్హం. -
వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ
చోడవరం: పరదేశమ్మ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. 14గ్రామాల ప్రజలు తమ గ్రామదేవతగా పరదేశమ్మను కొలుస్తారు. గోవాడ, దుడ్డుపాలెం, కన్నంపాలెం, రామజోగిపాలెం, బెన్నవోలు, చాకిపల్లి, పీఎస్పేట, గంధవరం, కొత్తపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన పరదేశమ్మ అమ్మవారి పండగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేకపూజలు చేశారు. గోవాడలో సర్పంచ్, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం కనులపండువగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడాని పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం సాయంత్రం తీర్థం జరిగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అందర్నీ ఆకట్టుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం రావికమతం: మండలంలోని కొత్తకోటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గుర్రపు పందాలు,ముగ్గుల పోటీలు నిర్వహించారు.గుర్రపు పోటీలను గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ తదితరులు ప్రారంభించారు.గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుమ్ముడి సత్యదేవా తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. -
12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్ భద్రం కోరారు. మామిడిపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో దశల వారీగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు ధారాత్తం చేయడం జరుగుతుందని, కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు కుదించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ప్లాంట్ను దశల వారీగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం, బీఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల బీమాను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు, నాయకులు అరిగా అప్పలకొండ, ఎం.కాశీఅప్పారావు, పీలా వెంకట్రావు, ఏఐటీయుసీ నాయకులు చెల్లూరి నాగరాజు, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు. -
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
దేవరాపల్లి: కార్మికులకు నష్టం కల్గించేలా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, దేవరాపల్లి పీహెచ్సీ ముందు ఆశా కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కా ర్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకువచ్చి అమలుకు పూనుకుందన్నారు. ఇది ముమ్మాటికి కార్మికులను కట్టు బానిసలుగా చేయడమేనన్నారు. కార్మికులకు వీటితో ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆశా కార్యకర్తలు పీహెచ్సీ వైద్యాధికారికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న, మండల నాయుకుడు బిటి. దొర, ఇందిర, జ్యోతి, వరలక్ష్మీ తదితర్లు పాల్గొన్నారు. కశింకోట: కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధుల కేటాయింపు, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి కాసులమ్మ మాట్లాడుతూ 2026–27 సంవత్సర కేంద్ర బడ్జెట్లో దేశంలో ఉన్న 26 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులతోపాటు దాదాపు కోటి మంది వర్కర్ల దుర్భర పరిస్థితి, హక్కులపై ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. స్కీం వర్కర్లకు సామాజిక భద్రత, పింఛన్ లేదని, అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకులకు గాట్యూటీ మంజూరు చేస్తూ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు.అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు తనూజ, విజయ, రామలక్ష్మి, గంగ, సీఐటీయూ అనకాపల్లి మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తుమ్మపాల : ప్రతి ఇంటి నుంచి వారానికి కనీసం రెండుసార్లు చెత్త సేకరణ చేపట్టి పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నెల 15 నాటికి గ్రామాల్లో శతశాతం ఇంటిపన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. పట్టణంలో న్యూకాలనీలో గల ఫంక్షన్ హాలులో మంగళవారం ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, సచివాలయాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వర్మీ కంపోస్టులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఇంటిపన్నుల వసూలు లక్ష్యంగా పెట్టుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతకుముందు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డిప్యూటీ ఎంపీడీవోలు డి.రాము, ఎం.సోమరాజు, జి.కోటేశ్వరరావు, జె.దుర్గా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఎ.శైలజారత్నం, కె.యరయ్యమ్మ, వై.శ్రీనివాస్లకు సేవా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఈ. సందీప్, జిల్లా అభివృద్ధి అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్.మంజులవాణి, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు నక్కపల్లి : చినదొడ్డిగల్లు శివారులో జరుగుతున్న పేకాటశిబిరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీఐ మురళికి వచ్చిన సమాచారం మేరకు చినదొడ్డిగల్లులో ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి రూ.73,400 నగదు, 13 సెల్ఫోన్లు,3 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
తాబేళ్లను రక్షించిన ఇండియన్ నేవీ
తాబేళ్లను రక్షిస్తున్న నేవీ సిబ్బంది విశాఖ సిటీ : సముద్ర సరిహద్దులను కాపాడటమే కాకుండా, సముద్ర గర్భంలోని మూగజీవాలను సంరక్షించడంలోనూ భారత నావికాదళం తమ దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’ యుద్ధ నౌక సిబ్బంది.. మృత్యువుతో పోరాడుతున్న రెండు అరుదైన తాబేళ్లను ప్రాణాలతో రక్షించారు. కోస్టల్ సెక్యూరిటీ పెట్రోలింగ్లో భాగంగా ఐఎన్ఎస్ తార్ముగ్లి సిబ్బంది సముద్రంపై గస్తీ నిర్వహిస్తుండగా నీటిపై తేలుతున్న పాత చేపల వలలో ఏదో కదలిక ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించగా, అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రెండు ‘ఒలివ్ రిడ్లే’ తాబేళ్లు ఆ వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే యుద్ధనౌకలోని నేవీ డైవర్లు సముద్రంలోకి దూకి ఆ వలను కోసి తాబేళ్లను విడిపించారు. గాయాలపాలైన ఆ తాబేళ్లకు ప్రాథమిక చికిత్స అందేలా చూసి, వాటిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. -
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
పోలీస్ శాఖ – డీఎస్ఎన్ఎల్యూ మధ్య చారిత్రాత్మక ఒప్పందంసబ్బవరం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతనంగా ఎంపికై న 6 వేల మంది కానిస్టేబుల్ శిక్షణార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీస్ శాఖ మంగళవారం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన ఈ ఒప్పందం ద్వారా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై నిష్ణాతులైన న్యాయ నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 పోలీస్ శిక్షణ కళాశాలలు, 5 బెటాలియన్లు మరియు 9 పోలీస్ శిక్షణ కేంద్రాలలో తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా, ఈ నెల 22వ తేదీ నుంచి ప్రత్యేక ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల ద్వారా ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని మెళకువలు, క్షేత్రస్థాయిలో చట్టాన్ని అమలు చేసే విధానాలపై శిక్షణార్థులకు పట్టు సాధించేలా బోధించనున్నారు. ఈ శిక్షణ వల్ల రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి. రామచంద్రరాజు, డీఎస్ఎన్ఎల్యూ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐజీపీ (ట్రైనింగ్) సత్య యేసు బాబు తదితర ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈ విద్యా–పోలీస్ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. -
‘విద్యార్థిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలి’
అనకాపల్లి: బుచ్చెయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామానికి చెందిన, విజయవాడ దగ్గర పోరంకి చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పవన్ కుమార్ను హత్యచేసిన సీనియర్ విద్యార్థులను అరెస్టు చేయాలని, ఈ సంఘటను ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని జిల్లా యాదవ సక్షేమ సంఘం అధ్యక్షుడు భరణికాన బాబూరావు అన్నారు. విద్యార్థి మృతికి నిరసనగా పట్టణంలోని రింగ్రోడ్డు వద్ద గల చైతన్య కళాశాల వద్ద మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, సాక్ష్యాధారాలను మాయంచేయడానికి ప్రయత్నించిన కళాశాల యాజమాన్యంపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు కుటుంబానికి కశాశాల యాజమాన్యం నష్టపరింగా రూ.కోటి అందజేయాలన్నారు. సీపీఐ మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులతో పాటు అన్నివర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు, చోడవరం నియోజకవర్గం అధ్యక్షుడు మొల్లి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటరమణ, యాదవ సంఘం నాయుకులు కోనా గురయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ, కార్యదర్శి పి.విజయ్, సహాయకార్యదర్శి కృపానం, ప్రజా సంఘాల నాయకులు భర్నికాన నరసింహమూర్తి, పంచదార్ల సూరిబాబు, మొల్లి ప్రసాద్, మొల్లి సన్నిబాబు, గోకివాడ కోటేశ్వరరావు, వియ్యపు సింహాచలం, పల్లా సతీష్, కారుకొండ కన్నా, మొల్లి నాగు, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.


