Alluri Sitarama Raju District Latest News
-
కలెక్టర్ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి
చింతపల్లి: ఆదివాసీ ట్రస్టు పేరిట మోసపోయిన బాధితులకు కలెక్టర్ దినేష్కుమార్ వారికి న్యాయం చేయాలని గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్, ట్రస్టు బాధితులు సంఘం జిల్లా నాయకుడు చిక్కుడు అశోక్ డిమాండ్ చేశారు. చింతపల్లి సమీపంలో గల అంతర్ల గ్రామంలో ఆదివాసీ ట్రస్టు ప్రధాన కార్యాలయం ఎదుట ట్రస్టు బాధిత సభ్యులతో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇటీవల ట్రస్టు చైర్మన్ చేసిన మోసానికి బాధితులు ధర్నా, ర్యాలీలు కార్యక్రమాలను చేపట్టి కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు. దీంలో శుక్రవారం విచారణ బృందం కేవలం చైర్మన్ బాలంపడాల్ తో పాటు 11మంది ట్రస్టు సభ్యులతో మాత్రమే విచారణ చేపట్టడాన్ని తప్పు పడుతున్నామన్నారు. కేవలం ఒక ఐడికి 12,200లతో నెలకు 3వేలు చొప్పున జీవిత కాలం చెల్లిస్తానని నమ్మబలకడంతో ఎంతో మంది గిరిజనులు తమకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులను అమ్మి ఈ ట్రస్టుకు లక్షలాది రూపాయలు చెల్లించారన్నారు. ఇదే విషయమై అనేక సమావేశాలలో బహిరంగంగానే ప్రకటించారన్నారు. ట్రస్టు చైర్మ్న్ చేసిన మోసాన్ని పరిగనణలోనికి తీసుకుని పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.కిందిస్థాయి ఉద్యోగులతో కాకుండా చింతపల్లి కేంద్రంగా కలక్టర్ సమక్షంలో విచారణ చేపడితే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకుంటే ట్రస్టు బాధితులతో కలసి కలక్టరేట్ను ముట్టడిస్తాయని హెచ్చరించారు. ట్రస్టు వైస్ చైర్మన్ కయ్యం చిన్నబ్బాయి, పంచాయతీ కార్యదర్శి వండలం బాలయ్య, గిరిజన సంఘం నాయకులు ధనుంజయ్, చిరంజీవి, సత్యనారాయణ, రాంబాబు, విష్ణుమూర్తి, ట్రస్టు బాధితులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
గాజువాక: షీలానగర్ జాతీయ రహదారిపై ఓ కారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నుంచి పొగ వచ్చి ఒక్కసారిగా దట్టమైన మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడకు చెందిన ఎల్.ఎన్.వి.ప్రభాకర్ శనివారం తిరుపతి దర్శనం కోసం బయల్దేరాల్సి ఉంది. ఎన్ఏడీ కొత్తరోడ్లోని తమ బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకొని వెళ్లడం కోసం వచ్చిన ఆయన కుమార్తెతో కలిసి కారులో ఉమ్మలాడకు బయల్దేరారు. షీలానగర్ జంక్షన్కు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి పొగ రావడం గమనించారు. అప్రమత్తమైన ఆయన తనతోపాటు కుమార్తెను కారులో నుంచి దించేశారు. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆటోనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. -
సేవల్లో స్ఫూర్తి
వైద్యపరంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రాణదీప్తిగా నిలుస్తోంది పాడేరు రెడ్క్రాస్ సొసైటీ. ప్రజల్లో చైతన్యం నింపుతూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రోజురోజుకు సేవలను విస్తరిస్తోంది. పాడేరు కేంద్రంగా సేవలందిస్తూ జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2624 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.ప్రాణదీప్తి.. రక్తబంధువు కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వొచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి. ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ● ఆదర్శంగా రెడ్క్రాస్ సొసైటీ సేవలు ● అత్యవసర పరిస్థితుల్లో కీలకపాత్ర ● విజయవంతంగా 68 రక్తదాన శిబిరాల నిర్వహణ ● జిల్లావ్యాప్తంగా 2,624 యూనిట్ల సేకరణ ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సాక్షి, పాడేరు: రెడ్క్రాస్ సొసైటీ సేవలు ఇక్కడ అందుబాటులో లేనప్పుడు ఏజెన్సీ ఆస్పత్రుల్లోని రోగులకు రక్తం అవసరం ఉంటే విశాఖలోని కేజీహెచ్కు రిఫర్ చేసేవారు. మైదాన ప్రాంత బ్లడ్బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి స్థానికంగా ఉండే బ్లడ్ స్టోరేజీ పాయింట్లలో భద్రపరిచేవారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీ సేవలను 2022లో ఇక్కడికి విస్తరించింది. పాడేరు కేంద్రంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున సేకరణ చేపట్టింది. చైతన్యం పెరగడంతో రక్తదానం చేసేందుకు యువతీ యువకులు ముందుకు వస్తున్నారు.రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ విభాగం, వలంటీర్లు రక్తదానంపై విస్తృత ప్రచారం చేయడం రక్తసేకరణలో రెడ్క్రాస్ సొసైటీకి ఎంతో ఉపకరిస్తోంది. జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాతల నుంచి 2624 యూనిట్లు సేకరించింది. నాలుగు చోట్ల బ్లడ్ బ్యాంకులు: బ్లడ్ స్టోరేజీ పాయింట్ల స్థాయి నుంచి బ్లడ్ బ్యాంక్ స్థాయికి సేవలు విస్తరించాయి. జిల్లాలో పాడేరు జిల్లా ఆస్పత్రి, అరకులోయ, రంపచోడవరం, చింతూరు ఏరియా ఆస్పత్రుల్లో గత ప్రభుత్వంలోనే బ్లడ్ బ్యాంక్లు ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లో రక్తం క్యూరేషన్తో పాటు రక్తం నిల్వలను భద్రపరిచి జిల్లా వ్యాప్తంగా అత్యవసర సమయంలో రోగులకు సరఫరా జరుగుతోంది. చింతపల్లి, ముంచంగిపుట్టు, కూనవరం సీహెచ్సీల్లో కూడా బ్లడ్స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు అయ్యాయి. యువకులకు అభినందన పాడేరు ప్రాంతానికి చెందిన జి.సంతోష్కుమార్, ఎస్.వికాస్ అనే యువకులు 26 సార్లు రక్తదానం చేశారు. అలాగే పి.రాజు 18సార్లు, ఒ.సుమన్ 17 సార్లు రక్తదానం చేశారు. వీరందరినీ పాడేరు వైద్య కళాశాలలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా వారిని అభినందించారు. ఉత్తమసేవా పత్రాలను అందజేశారు.రక్తదానం చేయాలంటే.. పూర్తిస్థాయిలో రక్త నిల్వలు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంకులో నిరంతరం రక్తం నిల్వలు అందుబాటులో ఉంటున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ శిబిరాలలో సేకరించిన రక్తాన్ని స్థానికంగా గర్భిణులు, రక్తహీనత రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. బ్లడ్ బ్యాంకులో కనీసం 10 యూనిట్ల వరకు పలు గ్రూప్ల రక్తం నిల్వ ఉంటుంది. – డాక్టర్ విశ్వమిత్ర, సూపరింటెండెంట్, జిల్లా సర్వజన ఆస్పత్రి ప్రజల్లో చైతన్యం పెరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. రక్తదానంపై ఉన్న ఆపోహలను పక్కనబెట్టి రక్తదాన శిబిరాలకు యువకులు, విద్యార్ధులు, అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ పాడేరులో ఏర్పాటు చేసిన నాటి నుంచి కలెక్టర్ అధ్యక్షతన రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతమయ్యాయి. – గౌరీశంకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రెడ్క్రాస్ సొసైటీ, పాడేరు -
జిల్లా ఆస్పత్రి ఆవరణలో గిరిజనుడి మృతదేహం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పాడేరు: నిత్యం రద్దీగా ఉండే పాడేరు జిల్లా ఆస్పత్రి ఆవరణలో అనుమానాస్పద స్థితిలో ఓ గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చూసిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సీఐ దీనబంధు నేతృత్వంలో పోలీసు సిబ్బంది జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహం జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతడి వివరాలు సేకరించారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పెద్ద జాగీరు గ్రామానికి చెందిన మసాడ నడపయ్య(50)గా ఆయనను గుర్తించారు. మృతుడు పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టులో నివసిస్తున్న కుమార్తె వద్ద గత కొన్ని రోజులుగా ఉంటున్నట్లు తెలిసింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయానికి బాగానే ఉన్న వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించడంతో అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు ఆస్పత్రిలో పరామర్శించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారు. -
విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్ పాడేరు : ఏపీ గిరిజన గురుకుల కళాశాలల్లో రెండు దఫా కౌన్సెలింగ్ నిర్వహించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి దర్శి చిన్నారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ కమలకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా గిరిజన గురుకులాలు, కాలేజ్ ఆఫ్ ఎక్వ్లెన్స్ల్లో తక్కువ మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పిస్తున్నారని, దీంతో చాలామంది పేద గిరిజన విద్యార్ధులకు ఇంటర్లో ప్రవేశాలు దొరకడం లేదన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో బాలికల కోసం కేవలం మూడు మాత్రమే గిరిజన బాలికల గురుకుల కళాశాలలు ఉన్నందున గిరిజన విద్యార్థినులకు సీట్లు దొరకడం లేదన్నారు. అదనంగా బాలికల గిరిజన గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్ ఫీజులు తగ్గించాలన్నారు. గిరిజన గురుకుల కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గిరిజన విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యా సంస్థల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను గడువులోగా పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. -
రోడ్డు విస్తరణ వంద అడుగులు చేయాల్సిందే
సాక్షి,పాడేరు: హైకోర్టు ఆదేశాల మేరకు పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా అక్రమణలు తొలిగించి 100 అడుగుల మేర రోడ్లను విస్తరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ నాయకుల జోక్యం, ఆదిపత్యం సరైంది కాదన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేధ చ ట్టం అమల్లో ఉందని, జిల్లాలోని 5వ షెడ్యూల్ ప్రాంత పరిధిలో ప్రధాన కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమణలు తొలగించి వంద అడుగుల మేర రోడ్డును వెడల్పు చేయాలన్నారు. జిల్లా కేంద్రం పాడేరులో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు.అత్యవసర సమయంలో 108, అంబులెన్స్ల్లో రోగులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనివల్ల ,సత్వర వైద్యానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంత ప్రజలంతా పట్టణంలో రోడ్ల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.పట్టణ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్ కార్యచరణ చూసుకుని పలు రాజకీయ పార్టీల నేతలంతా రోడ్ల విస్తరణకు మద్దతు ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా వైఖరి వెల్లడించాలన్నారు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రోడ్డు అక్రమణలు తొలగింపు, రోడ్డు విస్తరణ పనులు ఆగకుండా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ అభివృద్ధికి రాజకీయ నేతలు అడ్డుతగలడం సరికాదని హితవు హైకోర్టు ఆదేశాలు అమలుచేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 13 మంది ఎంపిక
సాక్షి,పాడేరు: స్థానిక తలారిసింగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. యోగా నోడల్ అధికారి, ఎస్డీసీ లోకేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహనరావు పర్యవేక్షణలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. మూడు ఐటీడీఏల పరిధిలో 13ఆంశాల్లో యువతీ,యువకులు,పలు పాఠశాలల విద్యార్ధులు యోగా చేశారు. వీటిలో 13మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
● డీఆర్వో పద్మలత ● 105 వినతుల స్వీకరణ పాడేరు : వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు నిశితంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె. పద్మలత అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావుతో కలిసి ఆమె పలు ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి 105 వినతులను స్వీకరించారు. పక్కా గృహాలు మంజూరు చేయాలని, బీటీ రోడ్లు నిర్మించాలని, తాగునీటి సమస్య పరిష్కారించాలని, ఏకలవ్య, గిరిజన గురుకుల పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులకు సీట్లు ఇప్పించాలని, వంతెనలు నిర్మించాలని తదితర సమస్యలపై వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, డ్వామా పీడీ విద్యసాగర్, సర్వే, లాండ్స్ ఏడీ దేవేంద్రుడు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రమేష్కుమార్రావు, పరిశ్రమల శాఖ ఏడీ రమణరావు, పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ నర్శింహులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బీఎస్ఎస్ నంద్ పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుపై గిరి రైతులకు ప్రోత్సాహం
చింతపల్లి; గిరిజన ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉద్యానవన పంటల సాగుకు పోత్సాహిస్తున్నట్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ లాలం సీతయ్య అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఈ రెండు మండలాల పరిధిలో గిరిజన రైతులు గంజాయి సాగుకు పూర్తిగా నిలువరించడంతో పాటు ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా గిరి రైతులకు అనతి కాలంలోనే పంట దిగుబడులతో పాటు ఆదాయాన్నిచ్చే పండ్ల మొక్కలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రైతులకు సిల్వర్ ఓక్, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, సపోటా, మామిడి, సీతాఫలం, జీడిమామిడి, మిరియాలు తదతర మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతే కాకుండా మూడేళ్లు పాటు సాగుకు సంబంధించి ప్రోత్సాహాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ వార్షిక సంవత్సరంలో చింతపల్లి మండలంలో 3వేల మంది రైతులతో 2,036 ఎకరాల్లోను, గూడెం కొత్తవీధిలో మరో 3వేలు మంది రైతులతో 2,500 ఎకరాల్లో ఈ ఉద్యానవన పంటలు సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ దిశగా రైతులను సిద్ధం చేయాలని ఏపీడీ సీతయ్య సూచించారు . చింతపల్లి, జీకే వీధి ఏపీవోలు రాజు, రాంప్రసాద్ పాల్గొన్నారు. -
రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం రేంజ్ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ముగియకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గార్డుగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితుడు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్వోగా పనిచేసి ప్రమోషన్పై పాడేరు డివిజన్లో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చేశారు. కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గొలుగొండ కరక క్వారీ దోచుకునేందుకు పన్నాగం అడ్డుకుంటారన్న అనుమానంతో అటవీ అధికారుల మార్పు డీఎఫ్వోను మార్చేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖ ఏసీబీ ట్రాప్లో చిక్కిన అధికారిని తెచ్చుకునేందుకు యత్నాలు అవినీతి అధికారికి అందలం! ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్వోగా పనిచేస్తున్న శామ్యూల్ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కారు. గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్డీ డీఎఫ్వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం. -
610 మంది ఇళ్ల డాక్యుమెంట్ల అందజేత
కూనవరం: పోలవరం నిర్వాసితులు ఇంటి వాల్యూ అవార్డు గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాల ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నసరయ్య కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం టేకుల బోరు, ఉదయ భాస్క ర్ కాలనీ, సినిమాహాల్ సెంటర్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి వ్యాల్యూ అవార్డు గ్రామసభను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 610 మంది తమ ఇంటి విలువకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. 15 మంది మాత్రం తమ ఇళ్లకు తక్కువ వాల్యూ వచ్చిందని రీ సర్వేకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, ఎంపీటీసీ సాంబశివరావు, పోలవరం సిబ్బంది చిన్నబాబు, రామారావు, సురేష్, గీత, ప్రసాద్, రాజు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
అరకులోయ టౌన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిందన్నారు. కొమ్మినేనికి, సాక్షి టీవీకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాటిని ఆపాదిస్తూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించారని అన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారని, తక్షణమే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడాది కూటమి పాలనలో అక్రమ అరెస్టులు, కేసులతో నియంత పాలన సాగుతోందని, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం వదిలి, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, వైఎస్సార్సీపీ నేత కిరణ్ పాల్గొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంకు చెందిన గరికిపాటి సాయికిరణ్,పట్నాల రాజేశ్వరరావు,మహారాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కలిసి 2023 నవంబర్ నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లోని ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. ఎనిమిది మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేయగా, అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు అపహరించినట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ను తొలగించి, అమ్మేశారని తెలిపారు.ఈ విధంగా వారు విక్రయించిన 190 కిలోల కాపర్ వైర్ను రికవరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల విలువ రూ.54 లక్షల వరకూ ఉంటుందన్నారు.ఈ కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జి.రామచంద్రరావు,ఎస్ఐలు సింహాచలం, దివ్యలతో పాటు మిగిలిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 190 కిలోల కాపర్ వైర్ స్వాధీనం డీఎస్పీ విష్ణు స్వరూప్ -
యోగా సాధనకు4.62 లక్షల మంది నమోదు
● జేసీ అభిషేక్ గౌడ సాక్షి,పాడేరు: ఈనెల 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో యోగా సాధన కార్యక్రమాలు విజయ వంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.జే.అభిషేక్గౌడ ఆదేశించారు.శుక్రవారం ఆయన జిల్లా, మండల అధికారులతో పాటు యోగా ట్రైనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4.62లక్షల మంది యోగా సాధనకు నమోదు చేసుకున్నారని, 3,292 యోగా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అన్ని కేంద్రాల్లోను యోగా సాధన జరగాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులంతా దగ్గరగా ఉన్న సచివాలయాల్లో యోగా సాధన చేయాలని కోరారు. యోగా సాధనకు సంబంధించిన ఫొటోలను నోట్ కేమ్ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా నోడల్ అధికారి ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కిరండూల్ సెక్షన్లో రైల్వే జీఎం పర్యటన
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ శుక్రవారం రాయగడ డివిజన్ రైల్వే మేనేజర్ అబితాబ్ సింఘాల్తో కలసి కిరండూల్ సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా దమన్జోడి–కిరండూల్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ట్రాఫిక్, ప్రయాణికుల సదుపాయాలను జీఎం పరిశీలించారు. దమన్జోడి, జగదల్పూర్, కిరండూల్ స్టేషన్లు, రైల్వే కాలనీల్లో పర్యటించారు. అక్కడ ఆధునికీకరించిన ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. ప్రయాణికుల సలహాలు, అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం విండో ట్రయలింగ్ తనిఖీల ద్వారా డబ్లింగ్ పనులు, మలుపులు, వంతెనలు, టన్నెల్స్, వివిధ భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటనలో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారం, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బి.ఎస్.రాజకుమార్, చీఫ్ ట్రాక్ ఇంజినీర్ కె.ధనుంజయరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల రక్తదానం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు రక్తదానంలో పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరంలో15 మంది వైద్య విద్యార్ధులు రక్తదానం చేశారు. ఈసందర్భంగా వారిని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి అభినందించారు. సేకరించిన రక్తాన్ని పాడేరు బ్లడ్బ్యాంకుకు తరలించారు.ఈ కార్యక్రమంలో బ్లడ్బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ రాఘవేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, ప్రధాన కార్యదర్శి జి.గౌరిశంకర్,కోశాధికారి పల్టాసింగి సూర్యారావు, సభ్యులు తమర్భ ప్రసాద్నాయుడు, సంజీవరావు, రవి, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
పోస్టల్ పథకాలతో ఆర్థిక భరోసా
ముంచంగిపుట్టు: పోస్టల్ శాఖలో పొదుపు ఖాతాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఖాతాలు తెరిస్తే కలిగే ఆర్థిక భరోసాపై అవగాహన కల్పించాలని అరకు సబ్ డివిజనల్ పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ సిబ్బందికి తెలియజేశారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో బీపీఎంలు, ఏబీపీఎంలతో శుక్రవారం పోస్టల్ సేవలపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు సబ్ డివిజన్ ఐపీవో లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి వె వెళ్లి పోస్టల్ శాఖలో ఉన్న పొదుపు ఖాతాలపై వివరిస్తూ అవగాహన కల్పించాలని.ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే పోస్టాఫీసులను వినియోగించుకొని పోస్టల్ సేవలు పొందేలా పని చేయాలని, ఎస్బీ, ఆర్డి, సుకన్య, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, బీమా, ఐపిపిబి వంటి ఖాతాలు తెరిస్తే పొందే లబ్ధిని తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనంటే ఖాతాలకు ఎన్పీసీఎల్ లింక్ చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎంవో శ్రీను, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.అరకు పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ -
టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు?
రంపచోడవరం: రాజ్యాంగబద్దంగా ఎటువంటి పదవీ లేకపోయినా పసుపు చొక్కా వేసుకుంటే చాలు ప్రొటోకాల్ పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తారా అంటూ అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం టీడీపీ కార్యకర్త సలాది బాపిరాజు అనే వ్యక్తి చేతులమీదుగా పాఠశాల హెచ్ఎం పుస్తకాలు, బ్యాగులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఆహ్వానం లేకపోవడం తగదన్నారు. ఏ అర్హతతో సదరు టీడీపీ కార్యకర్తతో పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయించారో అధికారులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హెచ్ఎం, విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి మండిపాటు కలెక్టర్, టీడబ్ల్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక -
యోగాతో మంచి ఆరోగ్యం
● ఎస్డీసీ అంబేడ్కర్ రంపచోడవరం: ప్రతీ వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చని ఎస్డీసీ పి.అంబేడ్కర్ అన్నారు. గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లో ఈ నెల 21 వరకు ప్రఽభుత్వ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, శివకుమార్, భవాని, పోతురాజు పాల్గొన్నారు. -
రక్తదాన శిబిరానికివిశేష స్పందన
21 యూనిట్ల సేకరణపాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ హౌస్ అతిథి గృహంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఇండియాన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఆర్వో పద్మలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్బాషా, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహులు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పశుసంవర్థక శాఖ ఉద్యోగులు 21 యూనిట్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ షరీఫ్, డాక్టర్ రాఘవేంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు, సభ్యులు ప్రసాధ్నాయుడు పాల్గొన్నారు. -
ఏయూ మీడియా అసోసియేట్ డీన్గా సాల్మన్ బెన్నీ
మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్రా యూనివర్సిటీ ఔట్రీచ్, బ్రాండింగ్ అండ్ మీడియా అసోసియేట్ డీన్గా ఆంగ్ల విభాగం ఆచార్యుడు డాక్టర్ ఎన్. సాల్మన్ బెన్నీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ అండ్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్, జర్నలిజం ఆచార్యుడు చల్లా రామకృష్ణ ఆచార్య బెన్నీకి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ మాట్లాడుతూ ఆచార్య బెన్నీ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం బ్రాండింగ్ నూతన ఒరవడిని సాధిస్తుందన్నారు. అనంతరం ఆచార్య బెన్నీని ఘనంగా సత్కరించారు. పత్రికా సంబంధాల అధికారిగా, మీడియా రిలేషన్స్ డైరెక్టర్గా 33 ఏళ్లుగా ఆచార్య రామకృష్ణ అందించిన సేవలను బెన్నీ కొనియాడారు. 2006లో కామన్వెల్త్ నుంచి బెస్ట్ పీఆర్వోగా కెనడాలో రామకృష్ణ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం జర్నలిజం విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. -
మొక్కుబడి
కూటమి ప్రభుత్వ చర్యలపై విద్యార్థుల ఉసూరుపంపిణీలో ఘోరంగా విఫలం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు, బ్యాగులు, ఇతర కిట్లు అన్ని పంపిణీ జరిగేది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యా కిట్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బ్యాగులు లేకుండా పుస్తకాలు ఇస్తే వాటిని విద్యార్థులు ఎలా తీసుకువెళ్తారో విద్యాశాఖమంత్రి లోకేష్కు తెలియాలి. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం సరికాదు. – లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, పాడేరుసాక్షి,పాడేరు: ప్రభుత్వ పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటన ప్రచారానికే పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా పుస్తకాలు మినహా బ్యాగులు, యూనిఫాం, బెల్టులు, బూట్లు, సాక్సులు పంపిణీ చేసిన పరిస్థితులు కనిపించలేదు. గత ప్రభుత్వంలో ముందు చూపుతో.. గత విద్యాసంవత్సరంలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు చూపుతో అలోచించి మే నెల నాటికే విద్యా కానుక కిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులతో పాటు పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది.అ యితే ఈఏడాది మాత్రం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులు విద్యా కిట్లను పొందలేక పోయారు. హాజరుశాతం తక్కువగా ఉన్నప్పటికీ వచ్చిన వారికి చాలాచోట్ల పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. పాఠశాలలకు పుస్తకాలు తరలింపులోను జాప్యం ఏర్పడింది. ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం.. జిల్లా వ్యాప్తంగా 2,913 పాఠశాలల్లో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్ కిట్లను పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు ఉసూరుమన్నారు. మొత్తం విద్యార్థులు 1,69,175మందికి సరిపడ బ్యాగులను ప్రభుత్వం అందుబాటులోకి తేలేకపోయింది. ఇప్పటివరకు 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫారం, 24,886 బూట్లు, 24,886 సాక్సులు, 1,31,673 బెల్టులు మాత్రమే జిల్లాకు చేరాయి. పూర్తిస్థాయిలో కిట్లు రాకపోవడంతో ఇవన్నీ మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం అయ్యాయి. కిట్లు పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత వాటిని విద్యార్థులకు అందజేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో రావడానికి కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగానే ఉంది. వారికి కూడా కిట్లు అందలేదు.విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టింది. స్కూళ్లు ప్రారంభం నుంచి విద్యార్థులకు అన్ని సౌకర్యాలుఅందుబాటులోకి తెచ్చి విద్యాప్రమాణాల మెరుగుకు ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం చర్యలు మాత్రంఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాఠశాలలు పునః ప్రారంభ రోజునుంచే విద్యార్థులకు కష్టాలుమొదలయ్యాయి. విద్యామిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ వీటి జాడ కానరాలేదు. పుస్తకాల పంపిణీ అరకొరగా సాగింది. సన్నబియ్యంతోనాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పినా చాలాపాఠశాలల్లో విద్యార్థులు ముద్దయిన అన్నం తినాల్సి వచ్చింది. ముద్దవుతున్న సన్నబియ్యం కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సన్నబియ్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పాఠశాలలకు జీసీసీ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటితో సిద్ధం చేసిన అన్నం ముద్దగా ఉంటోంది. పాడేరు మండలం రాములపుట్టు పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూరలు, సాంబారు బాగున్నప్పటికీ ముద్దయిన అన్నం తినేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాక్షి పరిశీలనలో చాలా పాఠశాలల్లో ఇదే కనిపించింది. దేవీపట్నం మండలం సీతారాం ఎంపీపీ పాఠశాలలో విద్యార్ధులకు యూనిఫాం, బూట్లు పంపిణీ కాలేదు అరకులోయ మండలం బోసుబెడ పాఠశాల, అరకు పట్టణంలోని ఉన్నత పాఠశాలల్లో బ్యాగులు, పుస్తకాలు,ఇతర సామగ్రి పంపిణీ జరగలేదు. డుంబ్రిగుడ మండలంలోని కిల్లోగుడ, అరకు, డుంబ్రిగుడ ఉన్నత పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి పంపిణీ చేయలేదు. పెదబయలు మండలం గోమంగి ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాగులు, బూట్లు,ఇతర సామగ్రి పంపిణీ కాలేదు. సన్నబియ్యం పంపిణీ కాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తమ వద్ద ఉన్న బియ్యంతో పిల్లలకు ఆహారం తయారు చేశారు. అరకొరగా పుస్తకాల పంపిణీ సరఫరా కాని బ్యాగులు, బూట్లు ముద్దయిన సన్నబియ్యం తల్లుల ఖాతాల్లో జమకాని తల్లికి వందనం నగదు కూటమి ప్రభుత్వ ప్రకటన ప్రచారానికే పరిమితం -
ఉలికిపాటు
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హదారాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ అఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో భయాందోళన ● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్దతకు గురయ్యారు. ● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు. ● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్.రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్దతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్ధాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలు -
నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన
గంగవరం : పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్కు ప్రభుత్వం శ్రీకారం చుటిందని పందిరిమామిడి పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్, కె.వీరాంజనేయులు తెలిపారు. గురువారం కుసుమరాయి గ్రామంలో పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, రాజమండ్రి భారతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆముదాలబంద సర్పంచ్ పాయం రాజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరితోపాటు శాస్త్రవేత్త కె.సుమన్ కల్యాణ్ రైతులకు పలు సూచనలు చేశారు. సీటీఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ కస్తూరి, కృష్ణ డాక్టర్ రవిశంకర్, మండల వ్యవసాయాధికారి విశ్వనాథ్, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు రాజేంద్రప్రసాద్, వీరాంజనేయులు సదస్సు నిర్వహించిన పందిరిమామిడి శాస్త్రవేత్తలు -
మునగపాకలో తీరని విషాదం
మునగపాక : కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక మధ్య వీధిలో నివాసం ఉంటున్న శరగడం కుమార్(25)కు గత సంవత్సర క్రితం వివాహం జరిగింది. కుమార్ 8 నెలల క్రితం పరవాడలోని ఎస్ఎస్ ఫార్మాలో సేప్టీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నెల 11న రాత్రి విధి నిర్వహణలో ఉండగా వెలువడిన విష వాయువులను పీల్చడంతో కుమార్ అస్వస్థతకు గురవడంతో వెంటనే అతనిని విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ తండ్రి రామకృష్ణ గత 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి లక్ష్మి నాలుగు నెలల క్రితం చనిపోయింది. కుమార్ తమ్ముడు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో భార్య మాధురి కన్నీటిపర్యంతమైంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటూ ఆవేదన చెందుతున్నారు. అందరితో సఖ్యతగా ఉండే కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానికులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా మృతుడు కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, కర్రి సాయికృష్ణ, పెంటకోట విజయ్ తదితరులు చర్చలు జరిపారు. కుమార్ అంత్యక్రియలు శనివారం మునగపాకలో నిర్వహించనున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన వైనం -
రైల్వే ఆస్పత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యార్థం అధునాతన పరికరాలను డీఆర్ఎం లలిత్ బోరా గురువారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్లో ఇథైలిన్ ఆకై ్సడ్ స్టెరిలైజర్, అడ్వాన్స్డ్ లేజర్ మెషీన్లను ఆయనతోపాటు, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన పరికరాల సాయంతో రైల్వే ఉద్యోగులకు మరింత సుఖవంతమైన, శ్రేయస్కరమైన వైద్యసదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.శరత్బాబు, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారాం, ఇతర అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు లో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. జూ సంరక్షకులు వాటికి నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తున్నారని వివరించారు. -
చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించాలి
చింతూరు: చిన్నారులకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఎర్రంపేట–2 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ స్థాయినుంచి నాణ్యమైన విద్యతోపాటు మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో విజయగౌరి, సిబ్బంది పాల్గొన్నారు.చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
కూలిన ఉక్కు దీక్ష శిబిరం షెడ్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దీక్ష శిబిరం షెడ్ కూలిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తాటాకులతో నిర్మించిన షెడ్డు నేలమట్టమైంది. దీంతో కార్మికులు తమ నిరసనను శిబిరం వెలుపల కొనసాగించాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం 2021 ఫిబ్రవరి 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. ఈ దీక్షల కోసం తాటాకులతో ఈ షెడ్డును నిర్మించారు. సుమారు ఐదేళ్లు కావస్తున్నందున ఎండకు ఎండి, వానలకు తడిసి షెడ్డు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి షెడ్డు కూలిపోయింది. అయితే ఆందోళనకారులు, కార్మిక సంఘాలు మళ్లీ షెడ్డు నిర్మిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల పోలీసులు శిబిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి షెడ్డు నిర్మాణానికి అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
సీఆర్ఎంటీలకు కలవరం
● వీరిని బోధన నుంచి దూరం చేస్తున్న విద్యాశాఖ ● 2012 నుంచి సేవలందిస్తున్న రిజర్వ్ మొబైల్ టీచర్లు ● క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్స్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం: రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లకు (సీఆర్ఎంటీలు) శాపంగా మారాయి. బదిలీలు, ప్రమోషన్లు చేయగా మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సీఆర్ఎంటీల సేవలకు పెద్దపీట వేసింది. 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వీరి సేవలను బోధనకు ఉపయోగించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబరు 65 ద్వారా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్పీ విధానం రద్దయి సీఆర్ఎంటీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 260మంది సీఆర్ఎంటీలు టీచర్లు సెలవు పెడితే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. వీరు విద్యాశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సీఆర్ఎంటీలను ఇంటికి సాగనంపేందుకు పూనుకుందని, అందుకే బదిలీలు జరగగా మిగిలిన ఉపాధ్యాయులను తమ స్థానంలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. తమ సేవలను మరింత వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా సేవలను మరింత వినియోగించుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ తీసుకొచ్చిన క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పనిచేస్తున్న 3,300 మంది సీఆర్ఎంటీలకు తగు న్యాయం చేయాలి –పూడి వెంకట్రావు, ఏపీ సీఆర్ఎంటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఈఎస్ఐ ఆస్పత్రిలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు
సింథియా : హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సింధియాలోని కార్మిక బీమా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అల్ట్రా సౌండ్ 2డి ఎకో స్కాన్ పరికరాలను గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హెచ్ఎస్ఎల్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఖత్రీ , ఆయన సతీమణి వందన ఖత్రీ ముఖ్య అతిథులుగా హాజరై పరికరాలను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హేమంత్ ఖత్రీ మాట్లాడుతూ కార్మిక బీమా ఆస్పత్రికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ అందించడం అత్యంత అవసరమని గుర్తించి, ఉద్యోగుల సహకారంతో దీనిని అందించగలిగామని అన్నారు. ఈ పరికరాలు షిప్యార్డ్ కార్మికులతో పాటు పరిసర ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నేటి మానవ జీవన విధానాలలో మార్పుల వల్ల మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇప్పించడం ఎంతో గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్, బోన్ క్యాన్సర్, గర్భాశయ సమస్యల నుంచి రక్షించుకోవచ్చునని ఆయన వివరించారు. కార్యక్రమంలో షిప్యార్డ్ డైరెక్టర్ రాకేష్ ప్రసాద్, ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణమూర్తి, షిప్యార్డ్ గుర్తింపు యూనియన్ కార్మిక నాయకులు శ్రీరామ్మూర్తి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
తీరంలో మద్యం ఏరులు
ఏయూక్యాంపస్: పర్యాటక ప్రాంతం సాగర తీరంలో భద్రతా లోపానికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు. చీకటి పడితే మందుబాబులకు నిలయంగా తీర ప్రాంతం మారుతోంది. దీంతో ఇక్కడ మద్యం ఏరులై పారుతోంది. నిత్యం రాత్రి వేళల్లో సాగర తీరాన మందుబాబులు చేరి విచ్చలవిడిగా పార్టీలు చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడం, నిర్మానుష్యంగా పరిసరాలు మారిపోవడంతో మద్యం ప్రియులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న తీర ప్రాంతం నుంచి ఆర్.కె.బీచ్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో తాగిపడేసిన మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. తగినంత పోలీసు నిఘా లేకపోవడం, పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ నెల 21న విశాఖ సాగర తీరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో విద్యుత్ దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం, భద్రతను పెంచడం, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం ఎంతో అవసరం. ఈ దిశగా పోలీసులు, జీవీఎంసీ సమష్టిగా దృష్టి సారించాల్సిన అవసరముందని నగరవాసులు, సందర్శకులు సూచిస్తున్నారు. మందుబాబులకు అడ్డాగా తీర ప్రాంతం ఎక్కడ చూసినా వైన్ బాటిళ్ల దర్శనం -
విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా జరిపారు. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవ స్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి
తుమ్మపాల: తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించి కార్మికుల సమస్యలను వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మె చేస్తే యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. కార్మికులను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె.త్రినాథ్, కోరిబిల్లి శంకరరావు, సిహెచ్.రమణ, ఫణీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం
విశాఖ లీగల్ : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జి, లోక్ అదాలత్ న్యాయమూర్తి జి.వల్లభ నాయుడు అన్నారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ, జిల్లా విద్యాశాఖ, యాక్సిస్టివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. నిరక్షరాస్యత, వలస వెళ్లడం, ఇంటి పనులకు పెట్టడం, ఆర్థిక పరిస్థితుల వల్ల బాలలు బాల కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ లేబర్ సునీత మాట్లాడుతూ బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో తమ సమస్త డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. తిరిగి రిహాబ్లేట్ చేయడం కోసం బాలల సంక్షేమ సమితి, ఇతర డిపార్టుమెంటు, స్వచ్ఛంద సేవా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.పుష్యరాగం మాట్లాడుతూ చదువుకోవలసిన బాలలు పనిలోకి వెళ్లడం విచారకరమన్నారు. యాక్సిస్ టు జస్టిస్ అప్ హోల్డ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జి.డేవిడ్ రాజు మాట్లాడుతూ తమ సంస్థ గత సంవత్సరం లేబర్ డిపార్టుమెంటు, మిగిలిన సంస్థలతో కలిసి 2012 మందిని రిస్క్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ అధికారిణి మమత పాల్గొన్నారు -
వసతులిలా..చదువులెలా?
సాక్షి,పాడేరు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు గురువారం తెరచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు అవస్థలు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. గత విద్యాసంవత్సరంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల మధ్య చదువులు కొనసాగించాల్సిన దుస్థితిని విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు కానరావడం లేదు. – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వీటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. మరో ఐదు రోజుల వరకు ఉపాధ్యాయుల బదిలీల గడువు పెంచడంతో గందరగోళం నెలకొంది. పూర్తిస్థాయిలో రాని కిట్లు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో కిట్లు అందుబాటులోకి తేవడంలోను కూటమి ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలోని 2,913 ప్రభుత్వ పాఠశాలల్లో 1,69,175మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి నోటు, పాఠ్యపుస్తకాలను అందుబాటులో తెచ్చినప్పటికీ ఇతర కిట్లు మాత్రం అరకొరగానే జిల్లాకు సరఫరా జరిగింది.విద్యార్థులు 1,69,175 మందికి గాను, 1,31,673 బెల్టులు, 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫాం, 24,886 బూట్లు,సాక్సుల కిట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలతో పాటు అన్ని కిట్లు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గురువారం జిల్లాలో పుస్తకాలకే పరిమితం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం 967 పాఠశాలల్లో వెంటాడుతున్న అసౌకర్యాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని విద్యార్థుల కిట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ‘నాడు–నేడు’ నిలిపివేతతో ఇబ్బందులు గుత్తులపుట్టు ప్రాథమిక పాఠఽశాలలో నాడు–నేడు పనులు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల పనులు కూడా సగానికి పరిమితమ య్యాయి.పాఠశాలలో సమస్యలు నెలకొంటే తమ పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. పూర్తిస్థాయిలో పాఠఽశాలను అభివృద్ధి చేయాలి. – డి.పాపిటిరాజు, గుత్తులపుట్టు, పాడేరు మండలంజిల్లాలో పాఠశాలల వివరాలు ప్రాథమిక : 2551 ప్రాథమికోన్నత : 91 ఉన్నత : 271 మొత్తం పాఠశాలలు : 2,913 బాలురు : 82,757 బాలికలు : 86,418 మొత్తం విద్యార్థులు : 1,69,175 -
హామీలన్నీ గాలికి..
సూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలను నిరసిస్తూ జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలపై ఆమె ఆధ్వర్యంలో మహిళా నేతలంతా స్థానిక పాతబస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి చెప్పి, డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలుజేయాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై ఆరాచకాలు చాలా ఎక్కువగా జరగడం దారుణమన్నారు. హోంమంత్రి మహిళ అంటే ఎంతో సంతోషపడ్డామని, అయితే ఆమె కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శించారు. చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఆత్యాచారాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు, మహిళలు అన్యాయానికి గురవుతున్నా తోటి మహిళగా హోంమంత్రికి పరామర్శించే తీరిక కూడా లేకపోవడం బాధాకరమని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో బాలికలు, మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేదని, నేటి కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువై, తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి బాలికలు, మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అరకు, పాడేరు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు సమిడ పూర్ణిమాదేవి, కిల్లో ఉర్వశిరాణి, పాడేరు వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, సీహెచ్.మీనా, లకే రామకృష్ణపాత్రుడు, సర్పంచ్లు బీమాలమ్మ, వంతాల సీతమ్మ, మాదెల రమణమ్మ, కూడా సుబ్రహ్మణ్యం, లకే రామసత్యవతి, కోడా సుశీల, వరలక్ష్మి, నీలమ్మ పాల్గొన్నారు. రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం: అనంతగిరి(డుంబ్రిగుడ): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ధ్వజమెత్తారు. బుధవారం ఆమె ఆధ్వర్యంలో కాశీ పట్నంలో మహి ళలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహా నికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అంబేడ్కర్ఱ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తోందని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభు త్వం వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. హోంమంత్రిగా మహిళ ఉన్నా దారుణంగా అరాచకాలు రెడ్బుక్ రాజ్యాంగంతో మరింత అన్యాయం వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ -
పంగనామాలు
అందరికీకూటమి ఏడాది పాలన అంతా మోసం, దగా సూపర్ సిక్స్ హామీలకు మంగళం స్టీల్ప్లాంట్ కార్మికుల గోడుపట్టదా? ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులకు వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. -
మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రిలో మొదటిసారిగా మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెదిన మల్లపు మంగ అనే మహిళ ఎడమ కాలుకు ఆర్థ్దోపెడిక్ వైద్య నిపుణులు సుధాకర్, ప్రదీప్, మత్తు వైద్యులు రోహిణి సంయుక్తంగా శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ టీవీ శేషారెడ్డి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న మంగ గత మూడు రోజుల క్రితం తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. ఆమె మోకాళ్లకు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారన్నారు. వైద్య బృందాన్ని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అభినందించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డివిజన్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 66 అర్జీలు స్వీకరించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. -
మోదీ పాలన స్వర్ణయుగం
● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు సాక్షి,పాడేరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11ఏళ్ల పాలన స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు అన్నారు.11ఏళ్ల సేవా సుపరిపాలన, వికసిత్ భారత్ 2047 కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. వన్ధన్ వికాస కేంద్రాల ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి పథకాలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా ఎంతో ఆర్థిక లబ్ధి చేకూరుతోందన్నారు. పీవీటీజీలకు పీఎం జన్మన్ పథకం వరమని,పెద్ద ఎత్తున పక్కాగృహాల నిర్మాణం జరుగుతుందన్నారు.జల్జీవన్మిషన్తో తాగునీటి పథకాలు నిర్మితమవుతున్నాయన్నారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు.అరకు కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్గా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, జిల్లా ఇన్చార్జి పుట్టా గంగయ్య, ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి పెనుమాక రవికుమార్ తదితరులు పాల్గొన్నారు -
ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్ఎఫ్ వాహనం
ఇద్దరికి గాయాలుఉక్కునగరం: స్టీల్ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ఎదురుగా ఉన్న మిల్స్ కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. సీఐఎస్ఎఫ్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీరాపు సత్తిబాబు, నెమలికంటి రామారావు స్టీల్ప్లాంట్లోని వైర్ రాడ్ మిల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ‘ఏ’షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు వారిద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మిల్స్ కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా అదే సమయంలో సెంట్రల్ స్టోర్స్ జంక్షన్ వైపు నుంచి వేగంగా వస్తున్న సీఐఎస్ఎఫ్ వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రా మారావుకు ఉక్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో అంతులేని విషాదం అలుముకుంది. భార్య ఆరోగ్యం కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. ఈ క్రమంలో దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వారి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. తల్లి మృతి.. తండ్రికి సీరియస్ అనాథలైన పసిపాపలు స్కూటీ బ్రేకులు ఫెయిల్.. దివ్యాంగుడి కుటుంబంలో తీవ్ర విషాదం -
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయల బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు! మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. రెండో రోజూ బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం -
ఘనంగా లక్ష్మీ హోమం
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీచక్ర నవ వర్ణార్చన, లక్ష్మీ హోమం జరిపారు. ఈ పూజలో నలుగు రు ఉభయ దాతలు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే ఆసక్తి గల భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్, అకౌంట్ నంబరు 060810011006681, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0806081లో పూజా రుసుం చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన భక్తుల వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా, ఫోన్ నంబరును endow& eokanaka@gov.in మెయిల్కు పంపాలి. లేదా aptemples.ap. gov.inలో నమోదు చేసుకోవచ్చు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి,పాడేరు: జిల్లాలోని పలు ఇంజనీరింగ్శాఖల పరిధిలో రూ.728 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభ శిలాఫలకాలను కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ బుధవారం ఆవిష్కరించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో రూ.600 కోట్ల ఉపాధి హమీ పనులకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రానున్న మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు. కిలో కాఫీ గింజలను రూ.525 ధరతో విక్రయించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,ఎస్డీసీ లోకేశ్వరరావు,ఆర్టీసీ చైర్మన్ ఎస్.దొన్నుదొర, గిరిజన సంక్షేమశాఖ ఈఈ కె.వేణుగోపాల్, ఎస్ఎంఐ ఈఈ రాజేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు పాల్గొన్నారు. -
కేంద్రం పథకాలతో సమగ్ర గిరిజనాభివృద్ధి సాధ్యం
సాక్షి,పాడేరు: సమగ్ర గిరిజనాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (పీఎం జుగా)దోహదపడుతుందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం జుగా, పీఎం జన్మన్ పథకాలపై ఈనెల 15 నుంచి 30 వరకు జిల్లాలోని 518 గ్రామ సభల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పథకాలతో గిరిజన సాధికారతకు కృషి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలు అమలుజేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుతీరు పర్యవేక్షణకు తన అధ్యక్షతన ఐటీడీఏ పీవోలు, పలుశాఖల అధికారులతో జిల్లా కమిటీలు, ఎంపీడీవోల అధ్యక్షతన మండల స్థాయిలో పలువురు అధికారులతో మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పాఠశాలలకు దూరంగా ఉన్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతితో కూడిన భోజన సదుపాయం కల్పనకు 22 వసతి గృహాల నిర్మాణానికి జిల్లాకు ఎస్ఎస్ఏ నిధులు రూ.6,896 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. పాడేరు, రంపచోడవరం డివిజన్లలో రెండు మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఒకొక్కదానికి రూ.కోటి వెచ్చిస్తున్నట్టు చెప్పారు. రంపచోడవరం డివిజన్లో కేంద్రాన్ని ఆకుమామిడికోటలో నిర్మిస్తామన్నారు. పాడేరు డివిజన్లో 1,12,873 మందికి, రంపచోడవరం డివిజన్లో 25,14 6మందికి అటవీ హక్కుల చట్టం కింద భూములు పంపిణీ చేశామని చెప్పారు. పాడేరు డివిజన్లో రెండు వేల మందికి, రంపచోడవరం పరిధిలో 1496 మందికి కొత్తగా పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు మౌళిక వసతులు: రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలు చేయడానికి ఏజెన్సీలో 211 గ్రామాలను ముందుగా గుర్తించడం జరిగిందన్నారు. అడ్డతీగల మండలంలో 7 , గంగవరం మండలంలో 47, దేవీపట్నం మండలంలో 11, మారేడుమిల్లి మండలంలో 40, రాజవొమ్మంగి మండలంలో 14, రంపచోడవరం మండలంలో 23, వై.రామవరం మండలంలో 67 గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే సబ్ ప్లాన్ఏరియాలోని ప్రత్తిపాడు మండలంలో రెండు గ్రామాలు, శంకవరం మండలంలో మూడు, రౌతులపూడి మండలంలో ఒక గ్రామాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గిరిజన గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు కలెక్టర్ దినేష్కుమార్ -
ఐఐఏఎం బిజినెస్ స్కూల్లో విదేశీ విద్య
ఎంవీపీకాలనీ: ఐఐఏఎం(ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్) బిజినెస్ స్కూల్ విదేశీ విద్యను అందించేందుకు ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ఐజీఎంఏ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవీపీకాలనీలోని ఐఐఏఎం బీ–స్కూల్లో బుధవారం ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఐఐఏఎం కార్యదర్శి, డీన్ డాక్టర్ సుంకరి రవీంద్ర మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో యువతకు నాణ్యమైన విద్యను అందించి.. అంతర్జాతీయ ఉద్యోగ, వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. ఐఐఏఎం బీ–స్కూల్ డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులు ఏడాది పాటు దుబాయ్లో విద్యనభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆమోదం ఉందన్నారు. ఐజీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్లాల్ అగర్వాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు ఈ ఎంవోయూ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. విశాఖతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో సర్వీస్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ విద్య విశిష్టత, కార్పొరేట్ అవసరాలు, ఏఐ సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన్ని ఐఐఏఎం బీస్కూల్ ప్రతినిధులు సత్కరించారు.ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం -
అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ విజేత ఒడిశా
ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ చాంపియన్షిప్ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్ శర్మ, హెచ్ఆర్ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్ పాల్గొన్నారు. రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ జట్టు -
మమ్మేలు మాతల్లి.. గంగమ్మ తల్లి
ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోరుతూ మత్స్యకారుల పూజలు మహారాణిపేట: ప్రకృతి విపత్తుల నుంచి నుంచి మత్స్యకారులను, వారి బోట్లు, వేట సామగ్రిని రక్షించాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్ ఆవరణలో గంగమ్మ తల్లికి మత్స్యకారులు మంగళవారం విశేష పూజలు జరిపారు. గంగమ్మతల్లితోపాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటాక బోట్లు చేపల వేటకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పండగను ఘనంగా నిర్వహించారు. ఏపీ మరపడవల సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు దంపతులు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, ఇతర పూజా ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమంలో మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పీసీ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావు, కార్యదర్శి మున్నం బాలాజీ, నాయకులు గరికిన పరుశురాముడు, ఎస్ రాము, గరగయ్య, జి.రాజేష్, పుక్కళ్ల ఈశ్వరరావు, ఎ.చిన్న, పెద్ద, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు. కోలాహలంగా హార్బర్ ప్రాంతం గంగమ్మతల్లి పూజలతో హార్బర్ ప్రాంతంలో సందడి నెలకొంది. గంగమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక పూజారి శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికి భక్తులు వెరవకుండా గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. హార్బర్లో వేంచేసిన గంగమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. -
మొండి జాంగుడలో కలకలం
అనంతగిరి (డుంబ్రిగుడ/అరకులోయ టౌన్): తాను ఎంతోగానో ప్రేమించిన యువతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆందోళనకు గురైన యువకుడు తనకేమైనా అవుతోందేమోనన్న భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనఅనంతగిరి మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మొండి జాంగుడ గ్రామంలో మంగళవారం కలకలం రేపింది. అనంతగిరి ఎస్ఐ డి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పంచాయతీ మొండి జాంగుడ గ్రామానికి చెందిన జన్ని రాంబాబు ఆదే పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నందుల నీలమ్మ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి ఎనిమిది నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే ఏమైందో తెలియదు గాని మంగళవారం ఉదయం జామంగు గ్రామంలో ఇంటివద్ద నీలమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. దీనిని చూసిన యువకుడు జన్ని రాంబాబు ఒక్కసారిగా తీవ్రమానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో పెద్దలు ఏమంటారోనని ఆందోళనలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు ఎస్ఐ తెలిపారు. స్థానికులు గుర్తించి వెంటనే యువకుడిని అనంతగిరి పీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఎస్కోట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు సేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అనుమానాస్పదస్థితిలో యువతి మృతి భయంతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు -
ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ గందరగోళం
ఆరిలోవ (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాల సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) బదిలీలకు సంబంధించి మంగళవారం నిర్వహించాల్సిన మాన్యువల్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. కొన్ని రోజులుగా ధర్నాలు, నిరసనలతో తమ సమస్యలను వినిపించిన ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ కౌన్సెలింగ్కు అర్హులైన 1 నుంచి 500 మంది ఉపాధ్యాయులను పిలవగా, వారంతా మధ్యాహ్నం 2 గంటలకే హాజరయ్యారు. అయితే కౌన్సెలింగ్ ప్రక్రయ గంటల తరబడి ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అధికారులను నిలదీశారు. కౌన్సెలింగ్ జరుపుతారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొంటూ కౌన్సెలింగ్ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. అప్పటివరకు నిరీక్షించిన ఉపాధ్యాయులు ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం హాజరైన ఉపాధ్యాయులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి చంటి పిల్లలతో సహా హాజరైన కొందరు ఉపాధ్యాయులు రాత్రివేళ తీవ్ర అవస్థలు పడ్డారు. నగరానికి దగ్గరగా ఉన్నవారు ఇళ్లకు చేరుకోగా, దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు వసతి కోసం ల్యాడ్జీలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 9 గంటలకు 1 నుంచి 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే విద్యా శాఖ అధికారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ అయినా సక్రమంగా జరుపుతారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. కనీస వసతులు లేకపోవడంపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు -
అయోమయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. దీనివల్ల ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున 1,78,887 మంది విద్యార్థులు ఆర్థిక లబ్ధి కోల్పోయారు. తల్లికి వందనంబుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025అరకు రేంజ్ ఆఫీసర్శ్రీనివాసరావు బదిలీ అరకులోయ టౌన్: అరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు బదిలీ అయింది. ఆయనను విజయనగరం సా మాజిక అడవుల పరిరక్షణ, నిర్వహణ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అరకు పైనరీ, ఎకో పార్కును ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అటవీశాఖకు ఆదాయ వనరులను మెరుగుపరిచారు. ఆయన స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు.ఈ ఏడాది అమలుపై కానరాని స్పష్టతగతేడాది జమ చేయక తల్లుల్లో నిరాశ దాటవేత ధోరణితోకూటమి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించని పాలకులు తల్లికి వందనం పథకం అమలు చేయాలని కోరుతూ పిల్లలతో గిరిజన తల్లులుగత ప్రభుత్వంలో చేకూరిన లబ్ధి సంవత్సరం లబ్ధి మొత్తం (రూ.కోట్లలో) 2020–21 1,51,603 151.08 2021–22 1,51,603 151.08 2022–23 1,51,603 151.08 2023–24 1,51,575 151.75 ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తొలిఏడాదిలో ఏఒక్కరికి కూడా జమ చేయలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరిచేనాటికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నా ఇప్పటికీ దీనిపై ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చదువుకు చేయూత అందుతుందని, కొంతమేర ఖర్చుల భారం తగ్గుతుందని ఆశిస్తున్న వారికి ప్రభుత్వం తీరు నిరాశ కలిగిస్తోంది. విధి విధానాలేవీ? పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ విధి విధానాలను ప్రకటించలేదు. ఆర్థికశాఖ సైతం ఈ పథకం అమలుకు ఎటువంటి సూచనలు చేయలేదు. ఈ ఏడాదైనా తల్లికి వందనం ఉంటుందా.. లేకపోతే ఎగనామం పెడతుందా అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ఎన్పీసీఐ లింక్ కోసం పరుగులు తల్లికి వందనం పథకానికి విధి విధానాలు అధికారికంగా నేటికి విడుదల కాలేదు. కానీ పథకం అమలు కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబరు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థుల తల్లులు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్, పోస్టాఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఎన్పీసీఐకి లింక్ చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్పీసీఐతో లింక్ చేసుకోని వారు సుమారు 15 వేల మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ ఏడాది ఎగనామమేనా? ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. నేటికి తల్లికి వందనం పథకంపై ఎటువంటి మార్గదక్శకాలు ప్రభుత్వం జారీ చేయలేదు. బీపీఎల్ కుటుంబాలకు చెందిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తారా లేక విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధన పెడతారా, అమలు చేస్తారా.. చేయరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రేషన్ వాహనాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు రంపచోడవరం: కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలు రద్దు చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకర్గ కన్వీనర్ పండా రామకృష్ణదొర ఆరోపించారు. ఈ నెల గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే రేషన్ వాహనాలను ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రేషన్ వాహనదారులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. వృద్ధులు, వికలాంగులు రేషన్ పొందేందుకు ఇబ్బందులు పడుతున్నందున ఏజెన్సీ ప్రాంతంలో రేషన్ వాహనాలు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.● తీవ్ర ఇబ్బంది పడిన టీచర్లు ● కనీస ఏర్పాట్ల కరువు ● అధికారుల నిలదీత ● సాంకేతిక లోపం అంటూ నేటికి కౌన్సెలింగ్ వాయిదా న్యూస్రీల్పోలవరం ‘ఆర్అండ్ఆర్’లో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ కార్యాలయంలో పనిచేసేందుకు రిటైర్డ్ తహసీల్దార్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ తెలిపారు. తాత్కాలిక పద్ధతిపై పనిచేసేందుకు రిటైర్డ్ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ల నియామకానికి సంబంధంచి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక, చింతూరు, ఏలూరు జిల్లా కేఆర్పురం, పోలవరం ఆర్అండ్ఆర్ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆర్అండ్ఆర్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ధరఖాస్తులను ధవళేశ్వరం ఆర్అండ్ఆర్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేట్వ్ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని తెలిపారు.గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్న తేడా లేకుండా బీపీఎల్ కుటుంబాలందరికీ లబ్ధి చేకూర్చారు. చదువుకు అయ్యే అదనపు ఖర్చులు ఈ సొమ్ముతో ఒడ్డెక్కి పోయేవి. పిల్లల చదువుకు ఎంతో దోహదపడేవని గత ప్రభుత్వంలో మేలును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. స్పష్టత ఇవ్వని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో నమ్మి ఓటు వేశాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మొదటి సంవత్సరం అమలు చేయలేదు. రెండో ఏడాది వచ్చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ. 30వేలు ఖాతాలో జమకావాలి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తల్లికి వందనం పడుతుందో లేదో స్పష్టత లేదు. – కొర్రా సువర్ణ, బురుసింధిపుట్టు, ముంచంగిపుట్టు మండలం డ్రాపవుట్స్ పెరిగే అవకాశం తల్లికి వందనం అమలు చేయకపోవడం అన్యాయం.ఎన్నికల ముందు ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్న మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.చంద్రబాబు పాలన తల్లికి నిల్..తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రాప్ అవుట్లు తగ్గించడం కోసం అమ్మ ఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు.ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్లీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. జల్లిపల్లి సుభద్ర, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్రూ.30 వేలు వస్తుందనిఆశపడ్డా మాకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు 8, మరొకరు 4వ తరగతి చదువుతున్నారు. ప్రభు త్వం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేల చొప్పున రూ.30వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది వేస్తారని నమ్మి మోసం పోయా. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదైనా తల్లికి వందనం అమలు చేసి నగదు జమ చేస్తారని భావిస్తున్నా. ఈ ఏడాదైనా వేయకపోతే మోసపోయినట్టే. – ముఖి పద్మ, కరిముఖిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం
సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను మండలంలోని గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు సతకంపట్టు వద్ద భక్తులు పూజలు చేశారు. మంగళవారం ఉత్సవాలు ముగిసిన సందర్భంగా ఆయా గ్రామాల్లో అనుపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.శక్తివేషాలు, తీన్మార్, ఒడియా బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో ఘనంగా నిర్వహణ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
విద్వేషం.. విధ్వంసం
సాక్షి, అనకాపల్లి: హామీలు గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు విధ్వంసమైనా, ప్రాణాల మీదకు వచ్చినా.. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు అంటే పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కూటమి పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై హత్యాయత్నం చేశారు. 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంటలు, ఇళ్లు ధ్వంసం చేశారు. స్పీకర్ ఇలాకాలో దాడులు, దౌర్జన్యాలు.. సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు ఎక్కువగా జరిగాయి. నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకుగానూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్యకు యత్నించారు. ఆయన అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇళ్లను కూల్చేశారు. వైబీ పట్నానికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేయగా, 12 మంది వైఎస్సార్సీపీ యువతపై కేసులు నమోదు చేశారు. జూలై 9వ తేదీన మాకవరపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు రామారావు, తల్లిదండ్రులపై కూడా కర్రలతో దాడి చేశారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకవరపాలెంలోని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఇటీవల ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టి వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు. హోంమంత్రి నియోజకవర్గంలో.. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామ శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మాడెం వరలక్ష్మి ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన జవ్వాది ఈశ్వరరావు, జవ్వాది రమేష్, బత్తుల అప్పారావు, బత్తుల నరసింహమూర్తి, పబ్బు తుర్రయ్య దాడి చేశారు. మహిళల దుస్తులు చింపి అసభ్యకరంగా దూషించారు. దాడి చేయడమే కాకుండా బాధిత మహిళలపై టీడీపీ వారు కేసులు కూడా పెట్టారు. నాతవరం మండలం డి.ఎర్రవరంలో ధ్వంసమైన పంట కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంట నాశనం.. ఇళ్లు ధ్వంసం ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్తోపాటు 44 మందిపై కేసులు సోషల్మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోస రమణారెడ్డిపై వివిధ జిల్లాల్లోని పొదిలి, దర్శి, ఇచ్ఛాపురం, నీలకంఠాపురం, పార్వతీపురం పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ఒక స్టేషన్ తర్వాత మరో స్టేషన్కు తిప్పి తీవ్రంగా వేధించారు. ఆయన డిసెంబర్ నెలలో విడుదలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో నివాసముంటున్న బోడి వెంకటేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనన్ కల్యాణ్, మంత్రి లోకేష్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మొత్తం 17 కేసులు నమోదు చేశారు. ఆయనను తొలుత 2024 నవంబర్ 3న అరెస్టు చేశారు. మొత్తం 115 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు స్టేషన్లో సీఐ సీహెచ్ శేషగిరిరావు 15 నిమిషాల్లో 4 వేల గుంజీలు తీయమని ఇబ్బంది పెట్టారు. రాజాం, చినమేరంగి (కురుపాం), విశాఖలో దువ్వాడ, టూటౌన్, పరవాడ, సబ్బవరం, మహారాణిపేట, రేపల్లె, పెదకూరపాడు, పాతగుంటూరు, కృష్ణపట్నం, చీరాల, మార్టూరు, గుంటూరు, బాపట్ల, లావేరు, కర్నూల్, కడప, విజయవాడ, మైలవరం, మంచిలీపట్నంలలో కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు ప్రసాద్ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్లపై మార్టూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్పై విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదు చేశారు. కేసులు, విచారణ అంటూ రెండు నెలలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మొదట 2024 ఆగస్టు 31న పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో బెయిల్ లభించింది. మళ్లీ 2024 నవంబర్లో కొత్త కేసులు పెట్టి అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో బాపట్లలో కూడా మరో కేసు నమోదు చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా బాపట్లకు తీసుకువెళ్లి విచారించారు. ఇలా అతడిపై రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేశారు. -
ఉచిత కార్పొరేట్ విద్యకు మంగళం
విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)లో భాగంగా పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో అందించాల్సిన 25 శాతం సీట్లకు యాజమాన్యాలు మంగళం పాడుతున్నాయి. ఉచిత సీట్లు ఇవ్వలేమని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన ఈ విధానం, ఇప్పుడెందుకు అమలు చేయట్లేదంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆరిలోవ(విశాఖ): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీఈ కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఫీజు లేకుండా ఉచితంగా కేటాయించే వెసులుబాటు కల్పించింది. ప్రతి పాఠశాల యాజమాన్యం వారి పాఠశాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో నాలుగో వంతు సీట్లు కేటాయించాలి. ఉచితంగా చేర్చుకున్న విద్యార్థుల ఫీజుల్ని ఆయా పాఠశాలలకు ప్రభుత్వమే చెల్లించేంది. పట్టణ ప్రాంతాల పాఠశాలలకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.8 వేలు చెల్లించేది. ప్రస్తుతం రెండేళ్లుగా అలాంటి విద్యార్థులకు సంబంధించిన ఫీజులు బకాయిలు ఉండిపోయాయనే నెపంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల్ని ఈ ఏడాది చేర్చుకోవడంలేదు. చేర్చుకోలేమని తెగేసి చెప్తున్నారు తమకు బకాయిలు ఏళ్ల తరబడి ఉన్నాయని, అందుకే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చుకోబోమంటూ కొన్ని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఉచిత సీటుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తక్కువ కావడం వల్లే ప్రైవేట్ పాఠశాలలు తప్పించుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఏడాదికి నగరంలోని కొన్ని యాజమాన్యాలు ఒకటో తరగతి విద్యార్థికే రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటపుడు రూ.16 వేలకే సీటిచ్చి లాభాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. గ్రీవెన్స్లో ఫిర్యాదు యాజమాన్యాల తీరుతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎంత బ్రతిమాలినా పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో జిల్లా కలెక్టర్కు సోమవారం గ్రీవెన్స్లో కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని సీతమ్మధారలో ఉన్న శ్రీది ప్రెసిడెన్షియల్ స్కూల్శ్రీలో ఆర్టీఈ కింద చేర్చుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి నగరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉండటంతో తల్లిదంద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత సీట్లు ఇవ్వలేమన్నారు మేం సీతమ్మధార ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇక్కడున్న ది ప్రెసిడెన్షియల్ స్కూల్కు మా ఇంటి నుంచి కిలో మీటర్ మాత్రమే దూరం. ఈ దూరాన్ని బట్టి మొదటి ప్రాధాన్యతలో మా పిల్లలకు ఆ పాఠశాలలో సీట్లు ఇవ్వాలి. ఆర్టీఈ సీట్లు కోసం అవసరమైన పత్రాలు అందించాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయని, మేం మీ పిల్లలకు సీట్లు ఇవ్వలేమని చెప్పారు. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అని ఆ పాఠశాల నిర్వాహకులు అన్నారు. దీంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. కలెక్టర్ మా పిల్లలకు న్యాయం చేయాలని, ఆ పాఠశాలలో ఆర్టీఈ సీట్లు కేటాయించాలని కోరుతున్నాం. –బి.సంతోష్, సీహెచ్.ధనలక్ష్మి, ఎన్.దేవి, డి.లక్ష్మీప్రసన్న, సీహెచ్ యశోదకృష్ణ ప్రైవేట్ పాఠశాల్లో పేద పిల్లలకు సీట్లు కేటాయించని యాజమాన్యాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు -
సోషల్ మీడియాలోదుష్ప్రచారంపైపోలీసులకు ఫిర్యాదు
పాడేరు : తనపై ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కూడా సుబ్రహ్మణ్యం పోలీసులను కోరారు. ఈ మేరకు మంగళవారం పాడేరు సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గిరిజన ప్రాంతంలో జరుగుతున్న పలు అన్యాయాలు, అక్రమాలపై తాను ప్రశ్నిస్తుంటే కొంతమందికి గిట్టడం లేదని తెలిపారు. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ విషయంపై తాను కోర్టులో ప్రత్యేక కేసు వేస్తానని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్ ఉన్నారు. -
నేడు అప్పన్నకు మూడో విడత చందనం సమర్పణ
సింహాచలం: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి బుధవారం మూడో విడత చందన సమర్పణ కార్యక్రమం జరగనుంది. తెల్లవారుజామున అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనంలో మంగళవారం వైదికులు పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు సిద్ధం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు, అర్చకుడు అప్పాజీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడో విడత చందన సమర్పణ కారణంగా బుధవారం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. -
సోలార్ యూనిట్ల పరిశీలన
రాజవొమ్మంగి: మండలంలో పలు ఆదివాసీ కుటుంబాలకు పీఎం జన్మన్ పథకంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ల పనితీరును ఏపీఈపీడీసీఎల్ డీఈఈ గాబ్రియేల్ మంగళవారం పరిశీలించారు. మండలంలోని కొమరాపురం పరిసర అటవీ ప్రాంతాలు, వ్యవసాయక్షేత్రాల్లో నివసిస్తున్న 58 కుటుంబాలకు సోలార్ యూనిట్లను గతంలో ఏర్పాటుచేశారు. వీటి పనితీరు, వినియోగాన్ని ఆయన పరిశీలించారు. ఒకొక్క యూనిట్కు రూ.70 వేలు ఖర్చయిందన్నారు. సోలార్ యూనిట్లు ఏర్పాటైన తరువాత తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఆదివాసీ మహిళలు రాజయమ్మ, పార్వతమ్మ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోగలుగుతున్నామన్నారు. ఇదిలా వుండగా రాజవొమ్మంగిలోని 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ను పరిశీలించిన డీఈఈ. సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట అడ్డతీగల ఏడీ దివాకర్, రాజవొమ్మంగి ఏఈ అబ్బాయిదొర, ఇంజనీర్లు పోలేశ్వర్రావు, శ్రీనివాస్, రాజేష్, రాఘవరెడ్డి ఉన్నారు. -
వాల్తేర్ లోకోకు రెండో స్థానం
తాటిచెట్లపాలెం: ఇటీవల బనారస్ లోకోమోటివ్ వర్క్స్ లో నిర్వహించిన ‘బ్యూటీ కాంటెస్ట్ ఫర్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్’ పోటీలలో విశాఖ ఎలక్ట్రికల్ లోకో షెడ్కు ద్వితీయ స్థానం లభించింది. వాల్తేరు డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా నేతృత్వంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బి. షణ్ముఖరావు పర్యవేక్షణలో విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకో షెడ్ సిబ్బంది ఈ విజయాన్ని సాధించారు. వారు డబ్ల్యూ ఏపీ –7 లోకోమోటివ్ 37419 ను ఆధునీకరించి, అనేక అధునాతన సౌకర్యాలతో, మార్పులతో ఈ పోటీలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జోనల్ రైల్వేల నుంచి మొత్తం 13 లోకోలు ఈ పోటీలలో పాల్గొనగా, విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆధునికీకరించిన లోకోకు రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా ఎలక్ట్రికల్ లోకో షెడ్ సిబ్బంది, అధికారులను అభినందించారు. -
బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. సుండ్రుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య, పౌష్టికాహారం,కిశోర బాలికల వికాసం, కెరీర్ గైడెన్స్పై మంగళవారం ఐసీడీఎస్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కిషోర వికాసం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల్య వివాహలతో ఏర్పడే అనర్ధాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులతో కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో సీడీపీవో ఝాన్సీరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సద్దు, ఎంపీడీవో రతన్తేజ, ఎంఈవో–2 సరస్వతి, ఈవోపీఆర్డీ రమేష్ పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి రైతులు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో రైతులు రసాయన ఎరువులు వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ఖరీఫ్లో రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. కాఫీ,మిరియం పంట కోతలు అనంతరం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. కాఫీ రైతులకు అవసరమైన టార్పాలిన్లు, బేబీ పల్పర్యూనిట్టు, నిచ్చెనలు, కల్యాల నిర్మాణాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. కూరగాయల పెంపకం విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో పైనాపిల్ పండ్ల తోటల సాగు, చింతూరు డివిజన్లో మల్బరి సాగును విస్తరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్బీఎస్ నందు, రమేష్కుమార్రావు, పశుసంవర్ధకశాఖ ఏడీ నరసింహులు, పట్టుపరిశ్రమశాఖ అఽధికారి అప్పారావు పాల్గొన్నారు. -
నయన మనోహరం.. వెంకన్న నౌకా విహారం
డాబాగార్డెన్స్: నిత్యం పాలకడలిలో పవళించి ముల్లోకాలను బ్రోచే నారాయణుడు వేంకటేశుడై జలధిలో విహరించిన మనోహర దృశ్యం సాగరతీరంలో ఆవిష్కృతమైంది. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించి భక్తజనకోటి మురిసింది. పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం ఘనంగా సాగింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన హోమాలు, బలిహరణం, తీర్థగోష్ఠి జరిపారు. సాయంత్రం 4 గంటలకు స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పల్లకిలో మెట్లమార్గం మీదుగా కిందికి తీసుకొచ్చారు. అనంతరం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, పలువురు ప్రముఖులు స్వామివారి పల్లకిని మేళతాళాలు, అర్చకస్వాముల వేదమంత్రాల నడుమ తెప్పోత్సవానికి సిద్ధంగా ఉన్న నౌక వరకూ మోసుకెళ్లారు. శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామిని వివిధ రకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించిన నౌక మీదకు తీసుకెళ్లారు. భక్తులు ప్రయాణించే లాంచీలు అనుసరించగా స్వామి కాసేపు తెప్పపై సాగర విహారం చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ తెప్పోత్సవం భక్తులను పరవశింపజేసింది. నౌకా విహారంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రధానాచార్యులు శ్రీనివాస జగన్నాథాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు వార్షిక తిరు కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 8 నుంచి 11 వరకు పూర్ణాహుతి, చూర్ణోత్సవం, సముద్రస్నానం(చక్రస్నానం), సాయంత్రం 6 గంటలకు ఆరాధన చూర్ణోత్సవం(దొంగల దోపు ఉత్సవం), ధ్వజావరోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఘనంగా పోర్టు వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం సముద్రంలో విహరిస్తున్న వేంకటేశ్వర స్వామిశ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి -
బయో డైవర్సిటీ పార్కులో శ్రీగంధం చెట్ల నరికివేత
బీచ్రోడ్డు: పెదవాల్తేరులోని బయో డైవర్సిటీ పార్కులో 23 ఏళ్ల వయసున్న మూడు శ్రీగంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. ఈ దొంగలు పార్కు కంచెను తొలగించి, ఆరు నుంచి ఏడు అడుగుల పొడవైన కలప దుంగలను దొంగిలించారు. పార్కు నిర్వాహకుడు రామమూర్తి సోమవారం ఉదయం చెట్లు నరికివేయడాన్ని గుర్తించారు. వెంటనే మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం గంధపు చెట్ల దొంగతనం కాదని, పార్కును నాశనం చేయడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెట్లను నరికిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి, పార్కును రక్షించాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఆర్టీసీ పార్సిల్ సర్వీస్లో బట్టల మూట మాయం
సీలేరు : రాజమండ్రికి చెందిన ఓ బట్టల వ్యాపారి మారుమూల గిరిజన గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వ్యాపారి 50 వేల రూపాయలు బట్టలమూట మాయమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రికి చెందిన మహమ్మద్ షరీఫ్ అనే వ్యాపారి ఈ నెల 7న రాజమండ్రి ఆర్టీసీ పార్సిల్ కౌంటర్ వద్ద సీలేరుకు బుక్ చేసి, అదేరోజు బస్కు పంపించారు. అప్పటికే సీలేరులో వ్యాపారం చేస్తున్న మహమ్మద్ అలీ బస్సు దగ్గరకు వెల్లి బట్టల మూట ఇవ్వాలని డ్రైవర్ను అడగగా బస్సులో మూట ఏమీ లేదని, రాజమండ్రిలో ఇవ్వలేదని చెబుతూ దానికి సంబంధించిన రసీదును తీసుకోండి అని ఇచ్చాడు. మూట ఇవ్వకుండా రశీదును ఎలా ఇచ్చారని డ్రైవరును ప్రశ్నించగా సదరు డ్రైవరు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. రాజమండ్రి పార్సిల్ కౌంటర్లో సీలేరు బస్సుకు మూట వేసినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిందని, కానీ సీలేరుకు ఆ బట్టల మూట రాలేదని బాధితుడు వాపోయాడు. దీనిపై సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని తక్షణమే ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు మహమ్మద్ షరీఫ్ డిమాండ్ చేశారు. -
ఇవి ఈతపండ్లే. నమ్మండి
గూడెంకొత్తవీధి: ఇంత వరకు ఎరుపు రంగులో ఉండే ఈతపండ్లను చూసి ఉంటాం. అయితే ఇప్పుడు నేరేడుపండ్ల మాదిరిగా నలుపు రంగులో ఉన్న ఈతపండ్లు కూడా వస్తున్నాయి. వాటిని చూసిన చాలా మంది నేరుడుపళ్లుగా భావించారు. తీరా అవి ఈతపళ్లని తెలియడంతో ఆశ్చర్యపోయారు. ఇవి సోమవారం ఆర్వీ నగర్ సంతలో దర్శనమిచ్చాయి. గ్లాసు పండ్లను రూ.20కి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈత పండ్లు నేరేడు పండ్ల ఆకారంలో నల్లగా ఉన్నాయని రుచికరంగా ఉన్నాయని పలువురు చెప్పారు. -
ఘనంగా పాణిహాటి మహోత్సవం
భీమునిపట్నం: భీమిలి సాగరసంగమం సమీపంలో హరేకృష్ణ మూమెంట్(గంభీరం) ఆధ్వర్యంలో సోమవారం పాణిహాటి మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ముందుగా సామూహిక సంకీర్తనలతో ప్రారంభమైంది. అనంతరం బలరామకృష్ణుని విగ్రహాలకు పాలు, వివిధ నదుల నుంచి సేకరించిన జలాలు, పంచామృతాలు, పూలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉన్నాయని వివరించారు. హరేకృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు కోల్కతా సమీపంలోని పాణిహాటి గ్రామం వద్ద కృష్ణతత్వాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారన్నారు. అందులో భాగంగా గంగానది తీరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించగా.. అప్పటి నుంచి దీనిని నదీ తీరాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గోస్తని నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందరూ చక్కని జీవన ప్రయాణాన్ని సాగించాలంటే కృష్ణతత్వాన్ని అనుసరించాలని భక్త దాస సందేశమిచ్చారు. అంబరీష్ దాసతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
చింతపల్లి: తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వస్తాయని గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ బాలం పడాల్పై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ కార్యదర్శి వండలం బాలయ్య,వైస్ చైర్మన్ చిన్నబాయి,గిరిజన సంఘం మండల నాయకులు సాగిన చిరంజీవి ఆధ్వర్యంలో తహఽసీల్దారు కార్యాలయం ఎదుట పలువురు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి, ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఆదివాసీ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయి, సీపీఎం నాయకుడు పాండి ధనుంజయ మాట్లాడుతూ 2024లో కోరాబు బాలం పడాల్ సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ను ఏర్పాటు చేశారన్నారు.ట్రేడింగ్ మార్కెట్ పేరిట రూ.12,220 చెల్లించిన వారికి జీవితాంతం నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని, రూ.1,000 చెల్లిస్తే ఆరు నెలల తరువాత రూ.లక్ష చెల్లిస్తామని చైర్మన్ బాలం పడాల్ నమ్మబలికి చెప్పి మోసం చేశారని వారు ఆరోపించారు. ఇలా నగదు చెల్లించిన వందలాది మంది గిరిజనులు మోసపోయారని తెలిపారు.తక్కువ మందికి మాత్రమే నెలకు రూ.మూడు వేల చొప్పున చెల్లించి ఎక్కువ మందిని మోసం చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని వారంతా ఆందోళన చేపట్టారు. ఈ విషయమై చైర్మన్ బాలంపడాల్ను వివరణకోరగా ట్రస్ట్కు సభ్యులు భారీగా విరాళాలు ఇచ్చారని, ఆ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయిల వ్యక్తిగత ఖాతాల్లో రూ.80 లక్షలు, నగదు రూపంలో రూ.58.20లక్షలు ఉన్నాయని చెప్పారు. అవి చెల్లించమని అడిగితే కావాలనే తనపై నిందలుమోపుతున్నారని తెలిపారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్ స్తంభం
● త్రుటిలో తప్పిన ప్రమాదం ● నుజ్జనుజ్జయిన ఆటో డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని కళాశాల రోడ్డులో సోమవారం చిన్నపాటి గాలులతో నీలగిరి చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ తీగలపై పడింది. దీన్ని ప్రభావంతో విద్యుత్తు స్తంభం నేలకొరిగి ఆటోపై పడింది. దీంతో గ్రామానికి చెందిన కమ్మిడి గురుకృష్ణ అనే గిరిజన నిరుద్యోగ యువకుడి ఆటో నుజ్జనుజ్జయ్యింది. ప్రతి రోజు ఈ మార్గంలో కళాశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వాస్తవానికి ఆటోలో గ్రామ పిల్లలు కూర్చునేవారు అయితే గ్రామంలో చిన్న పాటి కార్యక్రమం జరుగుతుండటంతో అందరు అక్కడ ఉన్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్ధానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై పడ్డ చెట్టును గ్రామస్తుల సాయంతో తొలగించి, విద్యుత్తుని పునరుద్దరించారు. ఆటోతో ఉపాధి పొందుతున్న తనకు ఆటో మరమ్మత్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని బాధితుడు కమ్మిడి గురుకృష్ణ చెబుతున్నారు. -
అయోమ‘యోగాంధ్ర’
యలమంచిలి రూరల్: యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులు, ఉద్యోగులను అయోమయానికి, తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం అమలవుతున్న తీరు సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుంది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేయాలని సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్కర్నీ వదలడం లేదు. కొద్ది రోజులుగా మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం యోగా మంత్రం జపిస్తున్నారు. దీంతో అధికారులు తీవ్రంగా నలిగిపోతున్నారు. యోగాంధ్ర యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి గ్రామ, మండల స్థాయి పోటీల నిర్వహణ వరకూ ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులకు టార్గెట్లు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలమంటూ అధికారులు మధనపడిపోతున్నారు. గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనీలు ఇలా అందరిపైనా తీవ్ర పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు, యోగా ప్రొటోకాల్ ఆసనాల శిక్షణను అధికారులు నయానో, భయానో పూర్తి చేశారు. ఇవేం పోటీలు జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 ఏళ్లు పైబడి అంటూ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో, యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు గ్రూపునకు చెందిన కొందరు 35 ఏళ్ల వయస్సున్న వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని వారంతా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నిరంతరం సాధన చేసే వారు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందే వారు మాత్రమే వేయగల ఆసనాలను మాత్రమే పోటీల జాబితాలో పొందుపర్చడంతో ఆ జాబితాను చూసిన వారందరూ విస్మయం చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో.. క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని, తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. కానీ పోటీలో ఎక్కువమంది పాల్గొన్నట్టు చూపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం వంటి ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణ మత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడాసనం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతోపాటు యోగా మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు గ్రామాల్లోకి వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రాధేయపడవలసి వస్తోంది. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అన్పించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వెబ్తోనే టైం సరి యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతి రోజూ కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబెక్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్దీ సమయం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కిందిస్థాయి ఉద్యోగులను గ్రామాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇపుడు యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల రోజులపాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో తలలు పట్టుకుంటున్నారు. యోగాసనాలు నేలపై వేయకూడదు. మ్యాట్లు, లేదా కార్పెట్లు వంటివి ఉండాలి. కానీ యోగాంధ్ర కోసం అధికారుల మాట కాదనలేక కటిక నేలపై కూడా ఆసనాలు చేస్తున్న ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. యోగాంధ్ర కార్యాచరణతో చాలా పని ఒత్తిడితో సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులంతా నరకం చూస్తున్నారు. చివరకు రోజూ కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకూ కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు తీవ్రంగా మధనపడుతున్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి దివ్య ఔషధం... ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది... కానీ అధికారులు, ఉద్యోగులు మాత్రం గత పక్షం రోజులుగా ‘యోగాంధ్ర’ ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒక పక్క శిక్షణ కార్యక్రమాలు... మరో పక్క ఫొటోలను అప్లోడ్ చేయడం...ఇంకో పక్క అభ్యర్థులను ఒప్పించే, టార్గెట్లను పూర్తిచేసే పనులు, సర్వేలు, టెలీకాన్ఫరెన్స్లు ఇలా తలకు మించిన పనులతో సతమతమవుతున్నారు. కింది స్థాయి నుంచి ఒకటే హైరానా పడుతున్నారు.... సాధ్యం కాని ఆసనాలతో పోటీలకు ఎలా సిద్ధం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాధ్యం కాని ఆసనాలతో పోటీలు ఎలా ? యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా చేస్తోంది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీల రిజిస్ట్రేషన్, యోగా ప్రొటోకాల్ ఆసనాలను పూర్తి చేసినప్పటికీ, జిల్లా స్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కాని, అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తీవ్ర స్థాయిలో ఉద్యోగులపై పని ఒత్తిడి యోగాంధ్ర సర్వే, లక్ష్యాలు, టెలీకాన్ఫరెన్సులతో తిప్పలు సాధ్యం కాని ఆసనాలతో పోటీ ఎలా అంటున్న ప్రజలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పీవో ప్రారంభించారు. మెయిన్ రోడ్డు సెంటర్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో యోగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పీవో మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ పి.అంబేడ్కర్, ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీఎల్డీవో కోటేశ్వరరావు, ఏవో రమణి, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఏడీఏ సీహెచ్.కె.వి. చౌదరి తదితరులు పాల్గొన్నారు. అరకులోయటౌన్: ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అరకు నియోజకవర్గం ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు తెలిపారు. యోగాంధ్రలో భాగంగా సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని లోకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ఆస్పత్రుల ఖర్చులు తగ్గుతాయన్నారు.ఈ ర్యాలీ పెదలబుడు గ్రామ సచివాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఇన్చార్జీ ఎంపీడీవో సత్యనారాయణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి,పాడేరు: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ హెచ్చరించారు.సోమవారం కలెక్టరేట్లో విజిలెన్స్,మానటరింగ్ సమావేశాన్ని నిర్వహించారు.మానవ అక్రమ రవాణా,వెట్టిచాకిరీ నిర్మూలన,కార్మిక చట్టాల అమలుపై అధికారులతో సమీక్షించారు. కార్మిక చట్టాల ప్రచార వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలతో పనులు చేయించకూడదన్నారు.జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లే కార్మికులను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ,జిల్లా కార్మికశాఖ అధికారి సుజాత,డీఎస్పీ సహబాజ్ అహమ్మద్,డీఆర్డీఏ పీడీ మురళీ,ఎల్డీఎం మాతునాయుడు,జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జనార్ధనరావు,జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సాధు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధం గోదావరి ఇసుక రీచ్ల నుంచి వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 15వరకు గోదావరి రీచ్ల నుంచి ఇసుక సేకరణ నిలిపివేస్తున్నట్టు చెప్పారు.స్థానిక అవసరాలకు స్థానికంగా ఉన్న జలపాతాలు,గెడ్డల వద్ద ఇసుకను సేకరించవచ్చని తెలిపారు.ఎటపాక మండలం గుండాల ఇసుక రీచ్ వద్ద 1.19లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని చెప్పారు. వి.మాడుగుల,కొత్తవలస,బొబ్బిలి,నర్సీపట్నం వద్ద ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని,వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్గౌడ, మైన్స్ ఏడీ ఎం.ఆనంద్,భూగర్భ జలాలశాఖ డీడీఎం మురళీధర్,ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు,ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నీలిమా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
వరించిన రబీ
దిగుబడి ఆశాజనకం ఈఏడాది రబీలో వరిపంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.అర ఎకరంలో రెండవ పంటగా వరిని సాగుచేశాను.పంట కోతలు చేపట్టి నూర్పులు చేయగా 15బస్తాల ధాన్యం రావడం సంతోషంగా ఉంది.అఽధికంగా కురిసిన వర్షాలు పంట ఎదుగుదలకు మేలు చేశాయి. – మర్రి చంద్రశేఖర్, గిరిజన రైతు, గుర్రగరువు, పాడేరు మండలంసాక్షి,పాడేరు: రైతన్న పంట పండింది. రబీ సీజన్లో ధాన్యం దిగుబడి బాగా వచ్చింది. సమృద్ధిగా నీరు ఉండడంతో రెండో పంట రైతుల ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది దుక్కిపనులు నుంచి నారుమడుల తయారీ,వరినాట్లు పనులన్నీ జోరుగా సాగాయి. రబీ సాగుకు నీరు సమృద్ధిగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి.పంట ఎదుగుదల సమయంలో ఏప్రిల్,మే నెలల్లో విస్తారంగా కురిసిన వర్షాలు వరిపంటకు ఎంతో మేలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా 2,361 హెక్లార్లలో ఈ ఏడాది రబీలో వరిసాగు చేశారు. పాడేరు డివిజన్ పరిఽధిలో గిరిజన రైతులు తిండి గింజల అవసరాలకు రెండవ పంటగా వరి సాగుచేస్తుండగా,రంపచోడవరం,చింతూరు డివిజన్ల పరిధిలో వాణిజ్య అవసరాలకు వరి సాగుచేస్తారు. గిరిజన రైతులు రబీలో వరిని సాగు చేయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే సాగుకు వినియోగిస్తారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి రావడంతో ఉత్సాహంగా కోతలు,వెనువెంటనే ధాన్యం నూర్పులు చేపడుతున్నారు.చింతూరు,రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎకరానికి 40 బస్తాలు,పాడేరు డివిజన్లో 30 బస్తాలు దిగుబడులు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రబీ వ్యవసాయం సిరులు కురిపిస్తోంది. హుషారుగా పంట కోతలు, నూర్పులు ఆశాజనకంగా దిగుబడులు జిల్లాలో 2,361 హెక్టార్లలో సాగు -
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా
మాడుగుల రూరల్ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహసీల్దారు రమాదేవికి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెంలో సర్వే నంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాలని, సివిల్ కేసుల్లో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్కు పిలిపించి పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దారుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు. -
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు? మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు. పంచాయతీరాజ్లో 75 మందికి స్థానచలనం జిల్లా పరిషత్లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్మెన్లు ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే.. మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం సూపరింటెండెంట్ పేరు పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ) కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ) అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ) (ఆనందపురం హెచ్డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ (గాజువాక హెచ్డీటీ బి.శ్రీనివాసరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) సీతమ్మధార ఎం.రమేష్ను ములగాడ (సీతమ్మధార హెచ్డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) -
సింహాచలం దేవస్థానం ఈవో బదిలీ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని దేవదాయశాఖ రాజమహేంద్ర వరం మల్టీ జోన్–1 రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యే వరకు త్రినాథరావే ఇన్చార్జి ఈవోగా కొనసాగాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్రినాథరావు 2024 సెప్టెంబర్ 22 నుంచి సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్న ఆయన, గత నెల 26వ తేదీనే తిరిగి విధుల్లో చేరారు. కాగా, తనను సింహాచలం దేవస్థానం నుంచి బదిలీ చేయాలని త్రినాథరావే దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నందువల్లే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. -
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
పలు పోలీస్స్టేషన్లలో జర్నలిస్టుల ఫిర్యాదు సాక్షి,పాడేరు: రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పాడేరులో సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేయగా... అరకులోయలో ఎస్ఐ గోపాలరావుకు, హుకుంపేట, రాజవొమ్మంగి, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లలో సిబ్బందికి ఫిర్యాదులు అందజేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు
సాక్షి, పాడేరు: విద్యార్థులంతా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. ఈ ఏడాది టెన్త్,ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వి.ఆర్.పంక్షన్హాల్లో సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన 72 మందికి, ఇంటర్లో 19 మందికి ప్రతిభా పురస్కారాలతో పాటు మెడల్స్, రూ.20వేల చెక్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోవాలన్నారు. టెన్త్,ఇంటర్తోనే చదువులు ఆపవద్దని తెలిపారు.ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించాలన్నారు.పిల్లల బలాలు,బలహీనతలపై దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు.91మంది టెన్త్,ఇంటర్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.ఈ విద్యాసంవత్సరంలోను టెన్త్,ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులంతా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,డీఈవో బ్రహ్మాజీరావు,సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు,ఇన్చార్జి డీడీ రజనీ,ఎంపీపీ రత్నకుమారి,జీసీసీ డైరెక్టర్లు బొర్రా నాగరాజు,గంగులయ్య,ఇంటర్మీడియెట్ జిల్లా అఽధికారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ 91 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం -
సాగు భారం
రైతుకు గ్రామస్థాయిలో వ్యవసాయ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో గతవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాకు 344 కేంద్రాలు మంజూరు కాగా వీటిలో 150 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇవి కూడా ఆశయానికి తగ్గట్టుగా సేవలు అందించలేకపోతుండటంతో రైతులకు భరోసా కరువైంది. భరోసా దూరం..రంపచోడవరం: పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాలు, పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఒకొక్క ఆర్బీకే భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు వెచ్చించింది. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనల కోసం స్మార్ట్ టీవీలను ఏర్పాటుచేసింది. అంతే కాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. విత్తనం నాటే దగ్గర నుంచి.. పంట కొనుగోలు వరకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. తమకు సక్రమంగా సేవలు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి సాయం ఏదీ? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయం అందించేది. అయితే కూటమి ప్రభుత్వం దీనికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. ఇప్పుడు రూ. 20 వేలు అందిస్తామని చెప్పి నేటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సాగు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కష్టాలు మొదలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఏ రకం విత్తనం కావాలో తెలుసుకోకుండానే.. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి గిరిజన రైతులకు 90శాతం రాయితీపై 22,644 క్వింటాళ్ల వరి విత్తనాలు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పెట్టింది. తమకు ఏరకం విత్తనాలు అవసరమనేది తెలుసుకోకుండానే ప్రతిపాదనలు పంపడం వల్ల ఏంటి ఉపయోగమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ● గత ప్రభుత్వంలో తాము ఆర్బీకేలకు వెళ్లి కావాల్సిన రకం విత్తనాలు, ఎరువులు కియోస్క్ మిషన్లో స్వయంగా నమోదు చేసుకునే వారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కియోస్క్ మిషన్లు నిరుపయోగంగా మారాయి. ● రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీలు సరిగ్గా వినియోగానికి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో రైతులు సమయం దొరికినప్పుడు ఆర్బీకేలకు వచ్చి టీవీలో వ్యవసాయ సూచనలు తెలుసుకుని విజ్ఞానం పొందే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరుపయోగంగా అగ్రి ల్యాబ్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలో నిర్మించిన అగ్రి ల్యాబ్ నిరుపయోగంగా మారింది. దీని నిర్మాణానికి రూ.2కోట్లు వెచ్చించింది. విత్తనాలు, ఎరువు, పురుగు మందులు నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ● రాష్ట్రంలో వివిధ పాంతాల నుంచి వచ్చిన శాంపిళ్లను వీటిలో పరీక్షించి నాణ్యతను నిర్థారించేవారు. నాణ్యత లోపంతో ఉన్న ఎరువు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహద పడేది. ఏడాది కాలంలో ఈ ల్యాబ్లో పరీక్షలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అగ్రి ల్యాబ్లోనే ఏడీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆశయానికి దూరంగా ఆర్బీకేలు అందని పెట్టుబడి సాయం భూసార పరీక్షలకు నోచుకోని అగ్రిల్యాబ్లు నిర్వీర్యమే లక్ష్యంగా పాలన కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు ఆసరా కరువుప్రభుత్వ సహకారం అవసరం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అనేక సేవలు పొందే వారు. ప్రస్తుతం అరకొరగా సేవలు అందుతున్నా యి. రైతులకు ఆధునిక సాంకేతిక సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆర్బీకేల్లో రైతులకు సేవలు తూతూమంత్రంగానే అందుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభు త్వం స్పందించాలి. రైతులకు అవసరమైన అన్నిరకాల సాయం అందించగలిగితేనే సాగు ముందుకు సాగుతుంది. – మడకం పోతురాజు, రైతు,దేవరాతిగూడెంరైతులకు అందని సేవలు తామరపల్లిలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ వ్యవసాయం కోసం తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎటువంటి పుస్తకాలు, టీవీలు అందుబాటులో లేవు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పొందే అవకాశం లేకుండా చేశారు. అధికారులు తమకు నచ్చిన విధంగా ప్రతిపాదనలు పెట్టి విత్తనాలు పంపిణీ చేసే పరిస్థితి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా ఉన్నాయి. – శారపు బాపిరాజుదొర, రైతు, గోపవరం, రంపచోడవరం మండలం -
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనతో మండలంలోని బిల్లాపుట్టు, గం
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు. వీళ్లు ఇదే గ్రామానికి చెందిన కొర్ర ధన్యారావు కుమారుడు కొర్ర సుశాంత్తో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి మామిడిపళ్లు తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో జంగమయ్య గుడి పక్కనున్న చెరువులోకి స్నానానికి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో 10 నుంచి 12 అడుగుల లోతున నీరు చేరడంతో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేందుకు పరిసర ప్రాంతీయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈమేరకు ఎస్ఐ కె.పాపినాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ● గుంట కమందన్కు సాయికిరణ్తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంట బలరామ్కు కుమారుడు భానుతేజ్తోపాటు కుమార్తె ఉంది. సాయికిరణ్, భానుతేజ్ మృతితో ఈ రెండు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతులు ముగ్గురు వేర్వేరు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సాయికిరణ్ అరకులోయలోని పాఠశాలలో చదువుతుండగా భానుతేజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాల, కొర్రా సుశాంత్ మండలంలోని గుంటసీమలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలోను చదువుతున్నారు. కూలికి వెళ్తేనే గడిచేది.. చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు చెందిన కుటుంబాలది దయనీయ పరిస్థితి. రోజు వారీగా కూలీకి వెళ్తేనే తప్ప.. పూట గడవని పరిస్థితి బాధిత తల్లిదండ్రులది. సుశాంత్ తండ్రి వ్యవసాయ కూలీకాగా సాయికిరణ్, భానుతేజ్ తండ్రులు ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు చిన్నారులను చెరువు రూపంలో మృత్యువు దూరం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి చెరువులో స్నానానికి దిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఎంపీ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఉన్న ఎంపీని బాధిత కుటుంబీకులతో సర్పంచ్ నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడించారు. అనంతరం ఆమె అరకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసిన చిన్నారుల మృతదేహాలను అంబులెన్సులో వారి స్వగ్రామాలకు తరలించాలని ఎంపీ ఆదేశించారు. ముగ్గురు చిన్నారుల మృతితో గంగవలస, బిల్లాపుట్టులో విషాదం స్నానానికి దిగడంతో ప్రమాదం మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల సంతానం పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబాలు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి: అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
నేటికీ తెరచుకోని డిపో
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ సబ్ డిపో నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి ఎండీయూ వ్యవస్థను నిలిపివేసి డీఆర్ డిపోల ద్వారా సరుకులు పంపిణీకి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికి నేటికి మారుమూల ప్రాంతాలకు సరుకులు పంపిణీ చేయలేదు. మండలంలోని దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ జీసీసీ డిపో నుంచి ఇప్పటికీ సరుకులు పంపిణీ జరగకపోవడంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పరిధిలో వలసగెడ్డ, వలసగెడ్డ కాలనీ, శాండికొరి, పులిగొప్ప తదితర గ్రామాల ప్రజలు ఉన్నారు. తమకు రేషన్ సరకులు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రేషన్ సరుకులకు నోచుకోని ‘బూసుకొండ’ రేషన్ కార్డుదారులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
పౌష్టికాహారం, వ్యాయామంతో మంచి ఆరోగ్యం
రంపచోడవరం: మంచి ఆరోగ్యాన్ని పొందడం మన చేతుల్లోనే ఉందని, ఇందుకు మంచి పౌష్టికాహరం తీసుకుంటే వ్యాయామం చేయాలని సివిల్ జడ్జి టీవీ రాఘవేంద్రరావు అన్నారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాల బారిన పడవద్దని సూచించారు. వైద్య శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. స్వామి ప్రజ్ఞనాధనంద మహరాజ్, స్వామి లోకమయనంద మహరాజ్లు వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. వైద్యులు జీవీ రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, టీవీ సుబ్బారావు, దాసరి ఉమా మహేష్, ఎస్. సంపత్కుమార్, జీఎస్ఎల్ వైద్యులు సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో 87 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పది మందిని కంటి ఆపరేషన్ల కోసం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయానికి తరలించారు.సివిల్ జడ్జి రాఘవేంద్రరావు -
విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర
విశాఖ డీఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన టీచర్లు ఆరిలోవ (విశాఖ): విద్యాశాఖలో బదిలీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నిబంధన, గంటకో సవరణ, తొలుత ఇచ్చిన హామీని విస్మరించడపై నిరసన గళం వినిపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వందల మంది టీచర్లు ఉదయం 9 గంటలకే డీఈవో కార్యాలయానికి చేరుకొని కదం తొక్కారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. మాన్యువల్ కౌన్సెలింగే ముద్దు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడతామని చెప్పి, ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. గతంలో విద్యాశాఖా మంత్రి లోకేశ్ మాన్యువల్ కౌన్సెలింగ్ అని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా వందల ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. మాన్యువల్ ద్వారా అయితే అవసరమైన వాటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ కె.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు డి.గోపినాఽథ్, ఇమంది పైడిరాజు, టి.చిన్నబ్బాయి, టి.రామకృష్ణారావు, అరుణ్కుమార్, వీరభద్రరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. మాట మార్చిన అధికారులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్లో మాన్యువల్ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుకుంటున్నారని, ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ను అమలు చేయడం సరికాదు. – డి.గోపీనాథ్, పీఆర్టీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు -
కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు
సిటు అఖిలభారత కోశాధికారి సాయిబాబు డాబాగార్డెన్స్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీశాయని సిటు అఖిలభారత కోశాధికారి సాయిబాబు ఆరోపించారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సిటు 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కేంద్రం బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక శక్తి ఏకమై వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 1970లో ఐక్యతా నినాదంతో ప్రారంభమైన సిటు.. విద్యుత్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను సిటు విజయవంతంగా అడ్డుకుందన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు 21 సార్వత్రిక సమ్మెలు నిర్వహించామని, వచ్చే నెల 9న జరగనున్న సమ్మెను కూడా కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్వహించాలని కోరారు. ఎన్డీఏ హయాంలో దేశ జీడీపీని ప్రభావితం చేసే రంగాలు కుదేలయ్యాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవని విమర్శించారు. రైల్వే, డిఫెన్స్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం మత విభజన జరిగేలా బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల సభ్యులు ఈ సభల విజయానికి కృషి చేయాలని కోరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ తమ సంఘం పోరాటం వల్లే ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం కాలేదన్నారు. ఆర్ఎస్ఎస్ వారిని స్టీల్ ప్లాంట్ సీఎండీలుగా నియమించి.. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని అణచివేసే చర్యలు చేపడుతున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖను ఒక ప్రయోగశాలగా చూస్తోందన్నారు. పవన్ కల్యాణ్పై సిటు విమర్శలు సిటు పోరాటంలో భాగంగా స్టీల్ ప్లాంట్ కోసం ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని నరసింగరావు గుర్తు చేశారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఎన్డీఏ పక్షాన నిలబడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత ఇంతటి కార్మిక అణచివేత చర్యలు ఎప్పుడూ జరగలేదన్నారు. అనంతరం ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి విశాఖలో నిర్వహించనున్న 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీని సిటు రాష్ట్ర అధ్యక్షుడు కేవీ నాగేశ్వరరావు ప్రకటించారు. కమిటీ చైర్మన్గా సీహెచ్ నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్కేఎస్వీ కుమార్, కోశాధికారిగా ఏవీ నాగేశ్వరరావు వ్యవహరిస్తారు. -
కేజీహెచ్సూపరింటెండెంట్గా వాణి
మహారాణిపేట: కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఐ. వాణి నియమితులయ్యారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా పదోన్నతి పొందిన డాక్టర్ వాణి, ప్రస్తుతం కేజీహెచ్లో సీనియర్ ప్రొఫెసర్గా, గైనిక్ విభాగాధిపతి (హెచ్ఓడీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ పి. శివానంద్ 16 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు అచ్యుతాపురం రూరల్: స్థానిక ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, అనాథలు, నిరుపేదలకు ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఉచితంగా విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9989719158, 7032054123 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ పోటీలు
భీమునిపట్నం: భీమిలి మైదానంలో ఆదివారం చెన్నా నరసింగరావు మెమోరియల్ ఫుట్బాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర స్థాయిలో అండర్ 14, అండర్ 16 విభాగాలకు చెందిన 24 జట్లు పాల్గొన్నాయి.అండర్ 14 విభాగంలో విజయనగరానికి చెందిన టౌన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు విజేతగా నిలవగా, విజయనగరానికే చెందిన రేసింగ్ స్టార్ జట్టు రన్నరప్ సాధించింది. అండర్ 16 విభాగంలో కొమ్మాదికి చెందిన విజ్జు ఎఫ్.సి. జట్టు విజేతగా నిలవగా, విజయనగరానికి చెందిన రేసింగ్ స్టార్ జట్టు రన్నరప్గా నిలిచింది. విజేత, రన్నరప్ జట్లకు భీమిలికి చెందిన కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కలిగొట్ల శ్రీరామ్ రూ.ఐదువేలు, రూ.3వేల చొప్పున బహుమతులను అందించారు. ఫౌండేషన్ సభ్యులు కె.భానోజిరావు, శ్రీనివాసరావు, బాబ్జీ, చినబాబు, నరేంద్రకుమార్, సీతారామరాజు, వరహాలు పాల్గొన్నారు. -
సత్యదేవుని ఆలయంలోప్రత్యేక పూజలు
డాబాగార్డెన్స్: నగరంలోని ఇసుకకొండపై వెలసిన శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నిత్యపూజలు, సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం వైదిక సదస్యం, మహదాశీర్వచనం(పండిత సత్కారం) నిర్వహించారు. 9న ఉదయం నిత్యపూజలు, సాయంత్రం 6 గంటలకు స్వామి తిరువీధి(రథోత్సవం), విశేష హోమాలు నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాల్రెడ్డి తెలిపారు. 10న దోపోత్సవం (తిరుమంగైయాళ్వారు కై ంకర్యం), 11న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు వేకువ జాము 2 నుంచి 4 గంటల వరకు విశేష పూజలు, 7 గంటల నుంచి స్వామి వారి సామూహిక విశేష వ్రతాలు జరపనున్నట్లు తెలియజేశారు. -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్బాబు, తన వంతుగా విజేత జట్టుకు రూ. 75 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 25 వేలు బహుమతులుగా అందజేస్తానని ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. పోటీలలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు, కేరళ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఒడిశా జట్టు, ఢిల్లీ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి గెలుపొందింది. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. రవీంద్రబాబు, ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్ ప్రతినిధి అనీల్, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
అనేక వ్యాధులకు మూలకారణం ఊబకాయం
మహారాణిపేట: ఊబకాయం అంటువ్యాధి కానప్పటికీ, అనేక వ్యాధులకు మూలకారణంగా మారుతోందని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లా పరిషత్ సమీపంలోని అంకోశా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికవర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఒకరోజు అవగాహన, సీఎంఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమంలో పలువురు వైద్యులు ప్రసంగించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, పద్మవిభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఊబకాయాన్ని అదుపులో ఉంచకపోతే తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఐఎంఏ విశాఖ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధిపతి డాక్టర్ శ్రీనివాస్ నిస్తాల మాట్లాడుతూ, ఊబకాయం తీవ్రమైన చిక్కులు తెస్తుందని, వైద్య సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ గైనిక్ విభాగాధిపతి డాక్టర్ ఇసుకపల్లి వాణి, ఐఎంఏ నాయకుడు డాక్టర్ మురళీమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది వైద్యులు హాజరై మంచి స్పందన లభించింది. -
నిండుకుండలా పెద్దేరు
మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు నీరు చేరి పెద్దేరు జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది. జలాశయంలోకి నీరు పుష్కలంగా చేరడంతో ఖరీఫ్కు కలసి వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దేరు ఖరీఫ్ ఆయకట్టు సుమారు 15 వేల ఎకరాలు. ఇప్పటికే రైతులు వరి నారుమడులు సిద్ధం చేశారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.50 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు అధికమైతే పెద్దేరు గేట్లు ఎత్తవలసి ఉంటుందని జలాశయం జేఈ సుధాకర రెడ్డి తెలిపారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట పెద్దేరులోకి దిగవద్దని జేఈ సూచించారు. -
సింహగిరిపై విశేషంగా నృసింహ హోమం
సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సింహగిరిపై శ్రీ నరసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఉత్తరరాజగోపురం ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలో ఈ హోమాన్ని నిర్వహించారు. హోమంలో 22 మంది ఉభయదాతలు ప్రత్యక్షంగా, అలాగే 87 మంది ఉభయదాతలు పరోక్షంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజింపచేశారు. హోమగుండం వద్ద విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదాతలతో స్వామివారి అష్టోత్తరశతనామావళిని పఠింపజేశారు. అనంతరం కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి. త్రినాథరావు, విజయనగరం ఆర్డీవో ఎస్. శ్రీనివాసమూర్తి, ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్దాస్, స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’గీసి మరీ వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కంచే చేను మేసిన చందంగా మారిపోయిందనే విమర్శలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వ్యవహారంలో వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధానికి కృషి చేయాల్సిన సొంత శాఖకు చెందిన కొందరు అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటుపడి సమాచారాన్ని లీకు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే గతంలో ఓ సీఐ స్థాయి అధికారిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా రిజిస్ట్రేషన్లతో పాటు రవాణాశాఖ నుంచి ప్రతీ నెలా కొద్ది మంది నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. సొంత శాఖకు చెందిన ఓ ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లశాఖ నుంచి మామూళ్లు ముట్టచెప్పడంలో ఓ డాక్యుమెంట్ రైటర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నెలా ‘గిరి’గీసి మరీ ఠంచనుగా కొద్ది మంది కీలకమైన అధికారుల నుంచి వసూలు చేసి ముట్టచెబుతున్నట్టు సమాచారం. అయితే ఈ మామూళ్ల వ్యవహారంలో ఎవరెవరికి ఎంత అందుతుందనే విషయంలో మొదలైన చర్చ రచ్చ కావడంతో ఈ వ్యవహారం పైదాకా వెళ్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్టు ఆ శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా అవినీతిని కట్టడి చేయాల్సిన అధికారులే అవినీతి రొంపిలో కూరుకుపోతుండటం మాత్రం విస్తుగొలుపుతోంది. ముందుగానే సమాచారం లీకు...! వాస్తవానికి ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది సమర్థులైన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక ఉన్నతాధికారిపై ఎలాంటి ఆరోప ణలు లేకపోయినప్పటికీ, కిందిస్థాయిలో పేరుకుపోయిన కొందరు అవినీతి సిబ్బందిపై ఆయన సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఏసీబీలో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఒక ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సంస్థ పరువును నెలవారీ మామూళ్ల కోసం బజారున పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రవాణా, జీవీఎంసీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి వీరు నెలవారీ మామూళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న సదరు నలుగురు సిబ్బంది డిపార్ట్మెంట్ల వారీగా వసూళ్లకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత శాఖకు ముందుగానే సమాచారాన్ని లీక్ చేస్తున్నారని విమర్శలున్నాయి. ఒకవేళ ఎవరైనా తమ నెలవారీ మామూళ్లకు అంగీకరించకపోతే, వీరే వేరే పేర్లతో ఫిర్యాదు చేసి సదరు అధికారిపై దాడులు చేస్తారనే అపప్రద కూడా ఉంది. ఈ వ్యవహారంలోనే ఒక జీవీఎంసీ అధికారిని కూడా గతంలో ఇదే తరహాలో ఇబ్బంది పెట్టినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అయితే తాము చెప్పినట్లు వింటే వారిపై ఏ ఫిర్యాదు వచ్చినా కాపాడతారనే ధైర్యాన్ని కూడా ఈ సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది. కీలకంగా డాక్యుమెంట్ రైటర్...! ఏసీబీలో నెలవారీ మామూళ్ల వ్యవహారం మరింత ముదురుతోంది. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల నుంచి వసూలు చేసిన మామూళ్లకు సంబంధించి ఒక సీఐను ఇందులో ఇరికించారని తెలుస్తోంది. మొదట్లో తన విధులను మాత్రమే చూసుకునే సదరు సీఐని, నెలవారీ మామూళ్ల రొంపిలోకి లాగి, చివరికి సొంత శాఖ సిబ్బందే ఆయన్ను అడ్డంగా బుక్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో శాఖ పరువు బజారున పడకుండా, ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా గుట్టుగా బదిలీతో సరిపెట్టినట్టు సమాచారం. ఈ మామూళ్ల వ్యవహారంలో ఒక డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులతో సన్నిహి తంగా మెలుగుతూ నెలవారీ మామూళ్లను అందజేస్తున్నట్లు సమాచారం. సదరు డాక్యుమెంట్ రైటర్ ఓ ఉన్నతాధికారికి (గతంలో పనిచేసిన) అత్యంత సన్నిహితుడని ప్రచారం ఉంది. అందుకే ఎన్నో ఆరోపణలున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖలోని నలుగురైదుగురు అధికారులపై ఎటువంటి చర్యలూ ఉండవనే విమర్శలున్నాయి. తాజాగా, ఇదే శాఖకు చెందిన ఒక అధికారి అవినీతికి సంబంధించి పక్కాగా కొన్ని వీడియోలు, ఫొటోలతో సహా అందిన ఫిర్యాదును కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ వాణిజ్య భవంతిని నిర్మించి, అద్దెకు పెట్టి అడ్డంగా దొరికినప్పటికీ, ఆ అధికారిని కాపాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఏసీబీ పరువును బజారున పడకుండా ఉండేందుకు రహస్యంగా ఉన్నతస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ నుంచి భారీగా మామూళ్లు? చక్రం తిప్పుతున్న ఓ డాక్యుమెంట్ రైటర్ -
180 లీటర్ల సారా స్వాధీనం
రంపచోడవరం: దేవీపట్నం మండలం పాముగండి గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించి 180 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఇంద్రజిత్ తెలిపారు. రంపచోడవరం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగ రాహుల్ ఆధ్వర్యంలో శనివారం ఈ దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. సారా రవాణా, తయారీపై సమాచారాన్ని 14405 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని కోరారు. ఎవరి వద్దనైనా సారా ఉంటే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. -
సీలేరు నదిలో యువకుడి గల్లంతు
మోతుగూడెం : స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తుండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం ఇక్కడికి సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఏ. నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా ఆకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగతా నలుగురు నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్లు సాయంతో నలుగురు యువకులను ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకు లభ్యం కాలేదు. దీంతో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహారయాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేసీ్త్రలుగా పనిచేస్తున్నారు. ఇలావుండగా కొద్దిరోజుల క్రితం సీలేరు నదిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు యువకులను ఎస్ఐ సాధిక్ ఆధ్వర్యంలో సిబ్బంది రక్షించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విహార యాత్రకు వచ్చి సీలేరు నదిలో దిగి ప్రమాదానికి గురవడం బాధాకరంగా ఉందన్నారు. విహార యాత్రకు వచ్చిన వారు ఒడ్డున స్నానాలు చేయకుండా నది మధ్యలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్నారు. త్వరలోనే సీలేరు నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రవాహంలో చిక్కుకున్న నలుగురిని తాళ్ల్ల సాయంతో రక్షించిన స్థానిక పోలీసులు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి విహారయాత్రకు వచ్చిన తాపీమేసీ్త్రల బృందం నది మధ్యలోకి దిగి స్నానాలు చేస్తుండగా ప్రమాదం నది మధ్యలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు గల్లంతైన అభిలాష్ -
నేటి నుంచి మోదమ్మ జాతర
● నక్కలపుట్టు, తుంపాడ, గుత్తులపుట్టులో ఘనంగా ఏర్పాట్లు సాక్షి,పాడేరు: మండలంలోని నక్కలపుట్టు, తుంపాడ, గుత్తులపుట్టు గ్రా మాల్లో ఆదివారం నుంచి మూడు రోజులపాటు మో దకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిలో భాగంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులు ఏర్పాటుచేశారు. ఉదయం 7గంటల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను ఊరేగించి కొలువుదీర్చేందుకు సతకంపట్టు వద్ద మండపాలు ఏర్పాటచేశారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. చివరిరోజు మంగళవారం ఉత్సవాల అనుపు ఉత్సవం జరుగుతుందని కమిటీలు తెలిపాయి. -
వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ టీచర్ల ఆందోళన
రాజవొమ్మంగి: బదిలీ ప్రక్రియలో వెబ్ కౌన్సెలింగ్ వద్దని, దీనిపై ఇప్పటికే బహిష్కరించామని యూటీఎఫ్కు చెందిన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం స్థానిక విద్యావనరుల కేంద్రం వద్ద వారు మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి భిన్నంగా సెకండరీ గ్రేడ్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధపడటం అన్యాయమని ఖండించారు. ఇచ్చిన హామీ ప్రకారం బదిలీ ప్రక్రియ మాన్యువల్గానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ మండలశాఖ ప్రధాన కార్యదర్శి కానెం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మిరియాల రమేష్, ఎఫ్డబ్ల్యూఎస్ బోర్డు డైరెక్టర్ దాసరి పైడిమల్లు, జిల్లా మహిళాకార్యవర్గ సభ్యురాలు బి. వెంకటలక్ష్మి, సభ్యులు రాంబాబు, రాజుబాబు, లక్ష్మణరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. గంగవరం: ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి భిన్నంగా బదిలీ కౌనెలింగ్ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యూటీఎఫ్ మండల ప్రతినిధులు సీహెచ్ వెంకటేశ్వరరావు, కుసుమ కుమారి తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. అధికారులు తీరు మారకుంటే ఆదివారం పెద్ద సంఖ్యలో జిల్లావిద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. -
ఈదురు గాలుల బీభత్సం
గూడెంకొత్తవీధి: మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రింతాడ పంచాయతీ అసరాడలో శనివారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు కూలడంతో విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. రహదారులు జలమయం అయ్యాయి. కొయ్యూరు: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి నెలకొన్న ఎండతీవ్రతకు జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.వర్షం కురువడంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. అసరాడలో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్లు సరఫరాకు అంతరాయం -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు ● సేవా కార్యక్రమాలు సాక్షి,పాడేరు: జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండగను ముస్లిం సోదరులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక మెయిన్రోడ్డులోని పురాతన జిక్రి ఇలాహి జామియా మసీద్లో గురువు ఇమామ్ మహ్మద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులంతా మసీదులో నమాజ్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు షేక్ అబ్దుల్లా, మహ్మద్ ఇక్బాల్, మహ్మద్ సులేమాన్, షేక్ అన్సారీ, షేక్ మొహ్మద్ పాల్గొన్నారు. అలాగే తమిళనాడు ముస్లింలకు చెందిన జమాత్ మసీదులోను ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. -
ఉత్తమ రైతుగా జిన్ను
● ఎంపిక చేసిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ● 12న పురస్కార స్వీకారం డుంబ్రిగుడ: మండలంలోని అరమ పంచాయతీ బడిమెల గ్రామానికి చెందిన తాంగుల జిన్నును ఉత్తమ రైతుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపికచేసింది. ఉత్తమ పురస్కారాన్ని ఈనెల 12న గుంటూరు జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. ఈయన 2017లో వన వికాస మ్యాక్స్ బోర్డు సహకారంతో మాతోట ద్వారా గులి రాగి విధానంలో ఎకరాలో 21.6 క్వింటాళ్ల గులి రాగిని పండించారు. తమ సంస్థ సహకారంతో గులి రాగితో పాటు వాణిజ్య పంటలను సేంద్రియ విధానంలో పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ తెలిపారు. -
ఇంత.. నిర్లక్ష్యమా?
● పాడేరు వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు ● నత్తనడకన నిర్మాణాలు ● బిల్లులు చెల్లించకపోవడంతో ముందుకు సాగని పనులు ● వసతి సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు, సిబ్బంది ● గిరిజనులకు కార్పొరేట్ వైద్యంపై ప్రభావం ఆశయానికి కూటమి తూట్లు పాడేరులో వైద్య కళాశాలను గొప్పగా ప్రారంభించి, గిరిజనులకు అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యం అందించాలన్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వైద్య కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బిల్లులు చెల్లింపులతో పాటు భవన నిర్మాణాల పర్యవేక్షణలోను ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అన్యాయం. రానున్న మూడు నెలల్లో అయినా ఆస్పత్రి భవనంతో పాటు మిగతా పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే పనుల్లో నిర్లక్ష్యంపైప్రభుత్వానికి లేఖ వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఇతర సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖమంత్రితో పాటు ప్రభుత్వానికి లేఖ రాశాం. వైద్య కళాశాలను గత ఏడాది 50 సీట్లతో ప్రారంభించిన ప్రభుత్వం, పెండింగ్ భవన నిర్మాణాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు లేవు. వైద్యులు కూడా వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి భవన నిర్మాణాలు చురుగ్గా జరగడం లేదు.ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – కె.అజశర్మ, కన్వీనర్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికసాక్షి,పాడేరు: జిల్లాకేంద్రమైన పాడేరులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టిన వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. 2021లో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో గత ప్రభుత్వం శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఎన్సీసీ నిర్మాణ సంస్థ భవన నిర్మాణ పనులను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటి నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టకపోవడంతో నత్తనడకన తలపిస్తున్నాయి. తొలి ఏడాది 50 సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఇప్పటివరకు ఓ బ్లాక్ పనులు, వీరి హాస్టల్కు సంబంధించి హాస్పటల్ బ్లాక్లోని కొన్ని గదులను సిద్ధం చేసి తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ అసంపూర్తిగా.. వైద్య కళాశాలకు అనుబంధంగా 500 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రధాన సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు అంతస్తుల భవనాలకు శ్లాబ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాల కళాశాల తరగతులు నిర్వహించే బ్లాక్లో పెండింగ్ పనులు, వైద్యులు, సిబ్బంది నివాస గృహాలు, విద్యార్థుల వసతి గృహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీలు దొరక్క.. పూర్తిస్థాయిలో కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోంది. గత డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని బ్లాక్ల నిర్మాణాలు పూర్తి అవుతాయని అందరూ భావించినప్పటికీ కేవలం 40శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. దీనివల్ల ఈ ఏడాది కూడా ఆస్పత్రి ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. పేరుకుపోయిన బకాయిలు వైద్యకళాశాల భవన నిర్మాణాలకు సంబంధించి బిల్లుల బకాయిలు పేరుకుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ ఎన్సీసీకి రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్లే భవన నిర్మాణ పనులు చురుగ్గా జరగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. -
త్వరితగతిన ఆక్రమణలు తొలగించాల్సిందే
పాడేరు : పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా అధికమైన ఆక్రమణలను సంబంధిత అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేసి త్వరితగతిన తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఏజెన్సీ వ్యాప్తంగా ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని కలెక్టర్ దినేష్కుమార్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకు ఆయన వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులతో కలిసి పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. గంటన్నర పాటు అక్కడే ఎదురు చూసినా ఆక్రమణల తొలగింపు మొదలవ్వలేదు. దీంతో ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం గత వారం కేవలం 16 మంది ఆక్రమణదారులకు మాత్రమే నోటీసులు ఇచ్చి ఆక్రమణలను తొలగించామని, త్వరలో మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి సోమవారం నుంచి తొలగింపు ప్రక్రియ చేపడుతామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్థానికులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణల తొలగింపుపై కలెక్టర్ దినేష్కుమార్ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. గతవారం తొలగింపు కార్యక్రమం చేపట్టి శనివారం చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పలువురు వర్తకులు, వ్యాపారులకు వెంటపెట్టుకొని ఐటీడీఏ వద్ద ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ వద్దకు వెళ్లి చర్చలు జరిపి 35 అడుగుల వరకు మాత్రమే తొలగించాలని హుకుం జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని దీంతో అత్యవసర సమాయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు మధ్య నుంచి అటూ ఇటూ 50 అడుగుల చొప్పున ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అభివృద్ధిని అడ్డుకోవడం లేదన్నారు. సోమవారం నుంచి ఆక్రమణలు తొలగించకపోతే తాము స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంపరాయి దిలీప్కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కూడ సుబ్రమణ్యం పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచన లేకుంటే గిరిజనులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిక -
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో స్థానిక సీహెచ్సీతోపాటు కిలగాడ పీహెచ్సీలో శనివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయనగరం శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. 187 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మండల ఆప్తమాలిక్ అసిస్టెంట్ కిషోర్కుమార్ మాట్లాడుతూ తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న 67మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించామని, వీరిని బస్సులలో విజయనగరం తరలించామని చెప్పారు. శస్త్రచికిత్సల సమయంలో మూడు రోజులపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమేష్, శిరీష, గీతాంజలి, ధరణి, నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి సుబ్రహ్మణ్యం, పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 187 మందికి నేత్ర వైద్య పరీక్షలు -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
చింతూరు: ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా తెలిపారు. మోతుగూడెం పోలీసుస్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన కారును ఆపి తనిఖీచేయగా రూ.ఐదు లక్షల విలువైన వంద కిలోల గంజాయి లభ్యమైనట్లు ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న చింతూరు మండలం తూలుగొండకు చెందిన కరణం రామాంజనేయులు, ఆరెళ్ల బొజ్జిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని మల్కనగిరికి చెందిన కొవ్వాసి తాతారావు వద్ద కొనుగోలు చేసిన గంజాయిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సుభానీ అనే వ్యక్తికి అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పట్టుబడినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు ఓ గ్యాంగ్గా ఏర్పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని, వీరిపై గతంలో కూడా చింతూరు పోలీసుస్టేషన్ పరిధిలో కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐలు సాధిక్, రమేష్ పాల్గొన్నారు.ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగాపట్టుకున్న పోలీసులు -
ఊపిరి తీసిన బైక్ షూరిటీ
పెదబయలు: షూరిటీపై స్నేహితుడికి బైక్ ఇప్పించగా, దానికి అతడు నెలా నెలా ఫైనాన్స్ కట్టలేదు. దాంతో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక టిప్పర్ లారీ డ్రైవర్ గూబరి లోవరాజు(23) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని సీకరి పంచాయతీ పులుసుమామిడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పెదబయలు ఇన్చార్జి ఎస్ఐ రామకృష్ణ, మృతుడి భార్య సరోజిని అందించిన వివరాల ప్రకారం... పెదబయలు గ్రామానికి చెందిన గూబరి లోవరాజు సీకరి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన సరోజినితో కలిసి తన అత్తవారింట్లో ఏడాదిగా నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం లోవరాజు షూరిటీతో పాడేరులో టీవీఎస్ బైక్ షోరూం నుంచి టీవీస్ పల్సర్ 220 సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్పై స్నేహితుడు అనిల్కుమార్ (డ్రైవర్) తీసుకున్నాడు. అప్పటి నుంచి బైక్ ఫైనాన్స్ కట్టకపోవడంతో రెండు వారాల నుంచి ఫైనాన్షియర్లు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఈ నెల 3వ తేదీ ఉదయం ఇంట్లో ఫోన్ వదిలేసి బయటకు వెళ్లి ఐదు రోజుల నుంచి తిరిగి రాలేదు. ఈ క్రమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం పులుసుమామిడి గ్రామానికి చెందిన కొంతమంది కొండకు వెళ్లగా, దుర్వాసన రావడంతో చెట్టుకు ఉరేసుకున్న యువకుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరేసుకుని ఐదు రోజులు అవ్వడంతో మృతదేహం కుళ్లిపోయింది. భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతికి ఇతర కారణాలు ఉన్నాయా లేదా అని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి నాలుగేళ్ల వయస్సు కలిగిన కుమారుడు ఉన్నారు. ఫైనాన్షియర్ల వేధింపులతో టిప్పర్ లారీ డ్రైవర్ ఆత్మహత్య -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్ : మండలంలోని తండాలదిబ్బ కూడలికి సమీపంలో జంపపాలెం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన నీరు లేని పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఇటీవల ఈ ప్రాంతంలో చొక్కా లేకుండా జీన్స్ ప్యాంటుతో తిరుగుతూ, మతిస్థిమితం లేనట్టు కనిపించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కొందరు స్థానికులు అతని ఫొటోను కూడా తీశారు. ఈ ఫొటో పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎండల తీవ్రతకు ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో పిల్లి గంగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796104, 9440796079 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు. -
31 పిల్లలతో నాగుపాము హల్చల్
ముంచంగిపుట్టు: జర్జుల పంచాయతీ బలడ గ్రామంలో గొల్లోరి మెద్దు నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది గోతులు తవ్వుతుండగా పెద్దబండరాయి అడ్డుగా ఉంది. దీంతో కూలీలు బండరాయిని తొలగించేందుకు ప్రయత్నం చేయగా నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పామును హతమార్చి, రాయిని తొలగించగా నాగుపాము పిల్లలు గుంపులుగా బయటకు వచ్చాయి. పాము పిల్లలను కొట్టి చంపేసి లెక్క వేయగా 31 పాము పిల్లలుగా తేలింది. గ్రామస్తులు పాములను నిప్పుపెట్టి దహనం చేశారు. ఒకేసారి ఇన్ని పాములు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆసక్తిగా తిలకించారు. వ్యాన్ బోల్తా రంపచోడవరం: మారేడుమిల్లి మండలం దేవరపల్లి సమీపంలో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్ బోల్తా పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
అధిక దిగుబడినిచ్చే పంటలపై దృష్టి పెట్టాలి
చింతపల్లి: గిరిజన రైతాంగం ఖరీఫ్ సీజన్లో మేలు రకం విత్తనాలతో మంచి దిగుబడులు ఇచ్చే పంటలపై దృష్టి సారించాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. శనివారం మండలంలోని కుడుముసారి పంచాయతీ పరిధి కోటగున్నలు గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో అధిక దిగుబడినిచ్చే రకాలు, పంటలు, చీడపీడలు, యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. సీనియర్ శాస్త్రవేత్త బయ్యపురెడ్డి ప్రభుత్వ పథకాలు, భూసార పరీక్షల ప్రయోజనాలను తెలియజేశారు. వ్యవసాయ సాంకేతిక నిపుణుడు డాక్టర్ అప్పలరాజు వరి నాట్లు, యాజమాన్య పద్ధతులు కోనోవీడర్ వినియోగం తదితర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఏఏ రాజశేఖర్, ఎంపీటీసీ పాంగి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి -
ఓ గాంధీ పుస్తకం
చదివేద్దాం..సీతంపేట: జాతిపిత మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు. గాంధీజీ గురించి ఎందుకు చదవాలి? గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి.స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్, కరికులమ్, కల్చర్’అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు ముంబయిలోని సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు. తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్ బోట్మ్యాన్(రాజమోహన్ గాంధీ), గాంధీ: ప్రిజనర్ ఆఫ్ హోప్(జుడిత్ ఎం. బ్రౌన్), ది డెత్ అండ్ ఆఫ్టర్లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ(మకరంద్ పరాంజపే), హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్రూల్(గాంధీ–1909), ఐయామ్ గాంధీ(బ్రాడ్ మెల్ట్జర్), మై డేస్ విత్ గాంధీ(నిర్మల్ కుమార్ బోస్), ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్), ఎ వీక్ విత్ గాంధీ(లూయీ ఫిషర్), మహాత్మా గాంధీ: హిజ్ లైఫ్ అండ్ ఐడియాస్(చార్లెస్ ఎఫ్. ఆండ్రూస్, అరుణ్ గాంధీ), ది మ్యాన్ బిఫోర్ ది మహాత్మా(చార్లెస్ డిసాల్వో), ది లివింగ్ గాంధీ: లెసన్స్ ఫర్ అవర్ టైమ్స్(తారా సేఠియా), గాంధీ అండ్ మావో ఇన్ క్వెస్ట్ ఆఫ్ అనాలజీ(రతన్ దాస్), గాంధీ సీఈవో(అలాన్ ఆక్సెల్రాడ్). బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం గాంధేయవాదం యువతకు ఆదర్శం గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు కె.ఎస్.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత నైతిక విలువలు పెరుగుతాయి గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్ క్రెడిట్ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్దాస్, గాంధీ సెంటర్ అధ్యక్షుడు -
హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పవన్ కార్తీక్
ఏయూక్యాంపస్: హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (హెచ్ఆర్ఏఏపీ) నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.వి. పవన్ కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జైదీప్ బిశ్వాస్, కోశాధికారిగా ఆర్. వెంకటరావులను ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యుడిగా డాక్టర్ ఎస్. ప్రశాంత్ వ్యవహరిస్తారు. నూతన కార్యవర్గం రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామన్నారు. -
● వినీలాకాశంలో విహంగాల విన్యాసం
వినీలాకాశంలో శనివారం అద్భుత దృశ్యం అబ్బురపరిచింది. నీలిరంగులో ఉండే విశాలమైన కాన్వాస్పై పక్షుల గుంపు రిథమిక్గా సాగిపోతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేసింది. సాయంత్రం సమయంలో కావడంతో ఆకాశం నిర్మలంగా, నీలి రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ చిన్నపాటి మబ్బులు తేలియాడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వందల సంఖ్యలో పక్షుల గుంపు ఒక పర్వతం ఆకారాన్ని తలపించేలా గాల్లో కదులుతూ ప్రయాణించింది. లయబద్ధంగా సాగిన వాటి ప్రయాణం చూసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచింది. ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఆర్టీసీ సిబ్బందికి యోగా శిక్షణ తరగతులు
డాబాగార్డెన్స్: ఈ నెల 21న ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి విశాఖపట్నం డిపోలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ డిపో మేనేజర్ కె. గంగాధరరావు యోగా ప్రాముఖ్యత సిబ్బందికి వివరిస్తూ, ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం డిపో ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు? సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీటీవో సంతకం చేసి సెలవుపై..? ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా 34 మందికి స్థానచలనం ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని అధికారులు -
ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
పెదబయలు: మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక జీసీసీ పెట్రోల్ బంక్ నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపును జేసీబీతో చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన, గిరిజనేతర వర్తకులు అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా తొలగిస్తే ఒక్క దుకాణం కూడా మిగిలే పరిస్థితి లేదని, జీవనోపాధి కోల్పోతామని వాపోయారు. ఈ పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల మేర ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగిస్తామని వారు తహసీల్దార్కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ మిగిలిన ఆక్రమణలను రెండు వారాల తరువాత తొలగిస్తామని స్పష్టం చేశారు. దీంతో వ్యాపారులు స్వచ్ఛదంగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పెద్దఎత్తున రెవెన్యూ, ఆర్అండ్బీ, మండల పరిషత్, విద్యుత్, అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ పలాసి మాధవరావు, ఎంపీటీసీ బొంజుబాబు, ఆర్ఐ పూర్ణయ్య, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. దుకాణాలు తొలగిస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారుల ఆవేదన 50 అడుగుల మేర స్వచ్ఛందంగా తొలగిస్తామన్న పెదబయలు వ్యాపారులు అంగీకరించిన అధికారులు -
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది. -
ఏయూలో సమూల మార్పులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్లు, డైరెక్టర్లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కీలక నియామకాలు డీన్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్, డీన్ అవుట్రీచ్, డీన్ అలమ్నీ రిలేషన్స్, డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, చీఫ్ కో–ఆర్డినేటర్లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విభాగానికి చీఫ్ కో–ఆర్డినేటర్ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ను నియమించారు. డీన్ అలమ్నీ రిలేషన్స్ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు. నూతన డీన్ల వివరాలు డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్: కె. రాంబాబు, డీన్ అకడమిక్స్ అఫైర్ కె. శ్రీనివాసరావు, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ వల్లికుమారి (కంప్యూటర్ సైన్స్), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అప్పలనాయుడు (కెమికల్ ఇంజనీరింగ్), డీన్, పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్), డీన్ అలమ్నీ రిలేషన్స్ ప్రొఫెసర్ శ్యామల (కెమిస్ట్రీ), డీన్ అవుట్రీచ్ ప్రొఫెసర్ కె. రమాసుధ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎస్. హరినాథ్ (సోషల్ వర్క్), డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. రావు (సివిల్ ఇంజనీరింగ్), చీఫ్ కో–ఆర్డినేటర్ స్పాట్ వాల్యుయేషన్ కేటీ బలరాం పడాల్ను నియమించారు. విభాగాలకు నూతన డీన్, డైరెక్టర్ల నియామకం -
కుటుంబం చెంతకు బీహార్ వ్యక్తి
అల్లిపురం: నల్లమందుకు అలవాటు పడి మతిస్థిమితం కోల్పోయి రోడ్డున పడ్డ బీహార్ వ్యక్తిని ఏయూటీడీ సభ్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీవీఎంసీ ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం, దర్భంగ జిల్లా సిసపునా గ్రామానికి చెందిన రాంబిహారి ఇల్లు వదిలిపెట్టి లూథియానా వెళ్లిపోయాడు. అక్కడ బిచ్చగాళ్లతో స్నేహం చేసి నల్లమందుకు అలవాటుపడ్డాడు. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో మత్తులో ఎక్కడెక్కడో తిరిగి విశాఖ చేరుకున్నాడు. గత ఏడాది నవంబర్లో రైల్వే స్టేషన్లో ఏయూటీడీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో అతను పట్టుబడ్డాడు. అతన్ని షెల్డర్కు తరలించి పూణేకి చెందిన శ్రద్ధ ఫౌండేషన్ సహకారంతో చికిత్స అందించడంతో అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో అతన్ని నేరుగా బీహార్లోని అతని స్వగ్రామానికి తీసుకెళ్లి అతని తల్లి కౌశల్య ముఖియా, సోదరుడు రాజ్కుమార్ ముఖియాకు అప్పగించారు. దీంతో వారు ఏయూటీడీ, శ్రద్ధా ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. -
షైనింగ్ స్టార్స్–2025 అవార్డులకు ముగ్గురు ఎంపిక
రంపచోడవరం: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జెడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్–2025 అవార్డులకు ఎంపికయ్యారు. విద్యార్థులు గొర్రిల మంజుల, మట్టా సాయి ప్రదీప్, బొమ్మిన విజయేంద్రవర్మ ఎంపికై నట్లు హెచ్ఎం వీరవిల్లి ముత్యాలరావు తెలిపారు. అవార్డు కింద రూ. 20 వేల నగదు, షీల్డు, ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరిస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 9న పాడేరులోని వీఆర్ పంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారని ఆయన వివరించారు. అవార్డుకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు దేవుడు తదితరులు అభినందించారు. -
ఖైదీలకు యోగా శిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలోని ఖైదీలు యోగాసనాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్రా’ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. కారాగారం లోపల ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య ఖైదీలకు యోగా నేర్పుతున్నారు. ఖైదీలకు ప్రతిరోజూ గంట పాటు యోగాసనాలు నేర్పుతున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం. మహేష్ బాబు శుక్రవారం తెలిపారు. ప్రతిరోజు ఖైదీలు యోగ సాధనలో పాల్గొంటున్నారని, దీని వల్ల వారి శరీర దృఢత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం నాటికి జైలులో ఉన్న అందరి ఖైదీలతో యోగాసనాలలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. -
● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం ● సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ పట్టని చంద్రబాబు ● 56,491 మంది సొంతింటి ఆశలపై నీళ్లు
సాక్షి, పాడేరు: పేదలకు రెండు నుంచి మూడు సెంట్ల ఇంటి స్థలం.. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం.. సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది. అధికారం చేపట్టి ఏడాదైనా గిరిజనులకు కనీసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం మినహా మిగిలిన గిరిజన జాతుల పేదలకు ఇళ్లు మంజూరు చేయలేదు. దరఖాస్తుదారులకు నిరాశ కూటమి ప్రభుత్వ హామీలు నమ్మి ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో గృహ నిర్మాణశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. 22 మండలాల పరిధిలో 56,491 మంది పేద కుటుంబాలను గుర్తించారు. కాలనీ ఇళ్లు మంజూరు అవుతాయని పేదలు ఎంతో ఆశతో ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. గుడిసెల్లో దుర్భర జీవనం సొంతిల్లు లేక మట్టి గుడిసెల్లో పలు జాతుల గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అనంతగిరి మండలం బల్లగరువు గ్రామాన్ని సందర్శించారు. కూలే దశలో ఉన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్న గిరిజనుల దుర్భర జీవనాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఈ ప్రాంతానికి ఎగువున ఉన్న గుమ్మంతి, గుమ్మంతి కాలనీల్లో గిరిజనులు సొంతంగా మట్టిగోడలతో నిర్మించిన గుడిసెలే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల్లో పేదల పరిస్థితి సొంతిల్లు లేక మరింత దయనీయంగా ఉంది. బిల్లుల చెల్లింపులో జాప్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన పీఎంఏవైతో పాటు పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2023–24లో 17వేలు పీఎంఏవై, 8787 పీఎం జన్మన్ ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే 2024–25లో కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనులకు 16,791 పీఎం జన్మన్ ఇళ్లను మంజూరు చేసింది. అయితే పాత, కొత్త ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిల్లుల చెల్లింపు ఆలస్యమవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. అనంతగిరి మండలం బల్లగరువులో పక్కా ఇళ్లకు నోచుకోని గిరిజనుల మట్టి గుడిసెలుఒక ఇల్లూ ఇవ్వలేదు స్థలం ఉన్నందున కాలనీ ఇల్లు మంజూరు చేయాలని పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మా గ్రామ పర్యటన సమయంలో కొత్త ఇళ్లకోసం సర్వే చేశారు. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. మట్టిగోడలు, శిథిలమైన రేకుల గుడిసెల్లో ఇబ్బంది పడుతూ కాలం గడుపుతున్నాం. ఇవి ఎప్పుడు కూలిపోతాయేనని భయంగా ఉంది. – చింత గంగమ్మ, బల్లగరువు, పినకోట పంచాయతీ, అనంతగిరి మండలంబిల్లులు చెల్లించాలి పీఎం జన్మన్ పథకంలో పక్కా ఇల్లు నిర్మించుకుంటున్నాం. జరిగిన పనులకు తగ్గట్టుగా ప్రభుత్వం బిల్లులు వెంటనే చెల్లించకపోవడంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. రెండవ దశలో రూ.90వేల బిల్లు చెల్లింపు పెండింగ్లో ఉంది. బిల్లులు వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలుకుంటే వర్షాకాలం ముందే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం – వంతాల లక్ష్మణరావు, డల్లాపల్లి, పాడేరు మండలం గుడిసెలకు పరిమితం రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయకపోవడంతో మా బతుకులు గుడిసెలకు పరిమితమయ్యాయి. మట్టిగోడలతో సొంతంగా గుడిసెలను నిర్మించుకున్నాం. వర్షాలు కురిసినప్పుడల్లా భయం భయంగా జీవనం సాగిస్తున్నాం. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం దృష్టి సారించి కాలనీ ఇళ్లు మంజూరు చేయాలి. – కొర్రా మల్లన్న, గుమ్మంతి, అనంతగిరి మండలం -
వాడివేడిగా మండల సమావేశం
కొయ్యూరు: మండల కేంద్రంలోని ఎంపీపీ బడుగు రమేష్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలోని పాఠశాలల నిర్మాణ పనుల్లో జాప్యంపై చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, డౌనూరు ఎంపీటీసీ సభ్యుడు అప్పారావు మాట్లాడుతూ పాఠశాలల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా సమగ్ర శిక్ష అభియాన్ జేఈ తదితరులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పనులు తదితర విషయాలపై ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఎంపీటీసీ గంగాభవానీ, చీడిపాలెం సర్పంచ్ సోమన్నదొర చెప్పారు. ఉపాధిహమీ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీవో అప్పలరాజు మాట్లాడుతూ 700 ఫారంపాండ్లకు సంబంధించి 11,502 మొక్కలు వచ్చాయన్నారు. రైతులకు వాటిని అందజేస్తున్నామన్నారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముసిలినాయుడు మాట్లాడుతూ నర్సరీల నుంచి నాణ్యత లేని మొక్కలు తేవడంతో అవి చనిపోతున్నాయన్నారు. నర్సరీలపై తమకు అవగాహన ఉందన్నారు. ఏవో ఉమాదేవి మాట్లాడుతూ 635 క్వింటాళ్ల వరి విత్తనాలకు ప్రతిపాదించామన్నారు. విత్తనాల సమస్య లేకుండా చూడాలని జడ్పీటీసీ నూకరాజు ఆమెను కోరారు.మాపింగ్లో బేస్మెంట్కు కూడా చెల్లింపులు చేస్తే నిర్మాణాలు వేగంగా జరుగుతాయన్నారు.కినపర్తి పంచాయతీలో 12 పీవీటీజీ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఇన్చార్జి తహశీల్దారు కుమారస్వామి సర్పంచ్ శ్రీనుకు తెలిపారు. ఎంపీడీవో ప్రసాద్, పరిపాలన అధికారి బాలమురళీకృష్ణ, జేఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
పాడేరు : పీఎం జన్మన్ పథకంలో ఆదివాసీ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి బాబు ఆదేశించారు. మండలంలోని వంతాడపల్లి పంచాయతీ అల్లివరం, సప్పిపుట్టు ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆదివాసీలు చేపడుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి సకాలంలో బిల్లుల చెల్లిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ ఈశ్వర్రావు తదితరులు ఉన్నారు. -
త్వరితగతిన ప్రజా సమస్యల పరిష్కారం
పాడేరు : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్తో కలిసి ఆయన 93 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకోసంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీదారులు అందజేసిన వినతుల పరిష్కారంపై 1100 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేష్, హౌసింగ్ పీడీ బి. బాబునాయక్, డీఆర్డీఏ పీడీ మురళి, ఎస్టీవో కృష్ణారావు, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ రజని పాల్గొన్నారు. 14న మెగా రక్తదాన శిబిరం ఈనెల 14న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని సూచించారు. -
వేంకటేశ్వరునికి అభిషేక పూజలు
రంపచోడవరం: మండల పరిధి ఐ.పోలవరం కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి శుక్రవారం అభిషేక సేవలను ఆలయ అర్చకులు గోవర్థన్, శ్రీ మణికంఠాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ డీఎఫ్వో టి.అనూష మాట్లాడుతూ టీటీడీ ఆలయ ప్రాంగణంలో మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో శ్రీవారి అన్నదాన సమితి సేవకులు గురుప్రసాద్, కందుల రాంబాబు తదితరుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్టు ఆలయ అధికారి నారాయణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
25 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు
సాక్షి,పాడేరు: విశాఖలో ఈనెల 21వతేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవంలో 25వేల మంది విద్యార్థులతో ప్రత్యేకంగా 108 సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో యోగాంధ్ర, విద్యార్థులకు యోగా శిక్షణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా గిరిజన విద్యార్థులతో యోగా సాధన చేయిస్తున్నామన్నారు. ఇప్పటికే అరకులోయలో 21,800మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు చేయించి ప్రపంచ రికార్డును సాధించామని, ఇదే స్ఫూర్తితో విశాఖ వేదికగా 25వేల మంది విద్యార్థులతో యోగా చేయిస్తామన్నారు.ఈనెల 12వతేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని, ప్రతిరోజు 30 నుంచి 40నిమిషాలు సూర్య నమస్కారాలపై యోగా సాధన చేయించాలన్నారు. ప్రధాన మంత్రి సమక్షంలో జరగనున్న విద్యార్థుల సూర్య నమస్కారాల యోగాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. వారి సమగ్ర వివరాలతో నివేదిక తయారుచేసి పోలీసుశాఖకు అందజేసి, సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలన్నారు. విద్యార్థులను విశాఖకు తరలించడానికి రవాణా, ఆహారం, వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల యోగాకు ఆంఽధ్ర విశ్వవిద్యాలయం మైదానాన్ని కేటాయించారని, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. యోగాంధ్రలో భాగంగా జిల్లాలో 19 మంది యోగా గురువులు, 112మంది యోగా మాస్టర్ ట్రైనీలు, 3,367మంది ట్రైనర్లుగా నమోదు అయ్యారన్నారు. ఇప్పటివరకు నమోదైన 3,49,141మందికి యోగా శిక్షణ విజయవంతంగా జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,జిల్లా యోగా నోడల్ అధికారి లోకేశ్వరరావు, డీఎస్పీ సహబాజ్ అహ్మద్,డీఈవో బ్రహ్మజీరావు, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ ఎల్.రజనీ, ఏటీడబ్ల్యూవోలు జయనాగలక్ష్మి, మల్లికార్జునరావు, వెంకటరమణ, పలుశాఖల అధికారులు, హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఈనెల 21న ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ప్రదర్శన విశాఖ వేదికగా గిన్నిస్ రికార్డు లక్ష్యం కలెక్టర్ దినేష్కుమార్ -
గర్భిణులకు నిలిచిన అల్ట్రాసౌండ్ పరీక్షలు
ముంచంగిపుట్టు: స్థాస్థానిక సీహెచ్సీలో గత ఏడు నెలలుగా అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళ, గురు వారాల్లో సీహెచ్సీలో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ టెస్ట్లు చేసి గర్భంలో శిశువు పరిమాణం, హృదయ స్పందన, శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు. శిశువు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యం అందిస్తారు. ఇలా ఎంతో కీలకమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు ఇక్కడ గైనికాలజిస్ట్ లేక జరగడం లేదు. గతంలో గైనకాలజిస్ట్ పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి ఇక్కడి వచ్చి సేవలు అందించేవారు. నవంబర్ నుంచి గైనకాలజిస్ట్ లేకపోవడం గర్భిణుల వైద్య సేవలపై తీప్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడి వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం సుమారు 60 మంది గర్భిణులు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి గర్భిణులు ఇబ్బందులు పడుతున్నా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల్లో ఏమాత్రం చలనం ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక సీహెచ్సీపై వారి పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి గైనకాలజిస్ట్ నియామకానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముంచంగిపుట్టు సీహెచ్సీలో గైనకాలజిస్ట్ లేక ఇబ్బందులు ఏడు నెలలుగా ఇదే దుస్థితి పట్టించుకోని వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు -
నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు
అల్లిపురం: జగదాంబ జంక్షన్ సమీపంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారితో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణం చూడ ముచ్చటగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అడపా దేముళ్లు పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. అంబికాబాగ్ రామాలయంలో ధ్వజారోహణం.. డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దత్తత దేవాలయం అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం, అంకురార్పణ నిర్వహించారు. శనివారం ఉదయం విశేష హోమాల అనంతరం, 10.30 గంటలకు స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరపనున్నారు. సాయంత్రం విశేష హోమాలు నిర్వహించనున్నారు. -
విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఆర్థికసాయం
చింతపల్లి: మన్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక చేయూత అందిస్తామని నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్ తెలిపారు. గురువారం ఆయన చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పరిశీలించారు. దీనిలో భాగంగా ఆయన చింతపల్లిలోని అరుణతార, సుగుణ స్వచ్ఛంద సంస్థల రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన భవిష్యత్లో ఎఫ్పీవోలు చేపట్టనున్న కార్యక్రమాలన్నాయన వారి నుంచి తెలుసుకున్నారు. భవిష్యత్తులో కొన్ని ఎఫ్పీవోలను ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి విలువ ఆధారిత ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఎగుమతులు అన్నీ ఒకే కేంద్రంగా చేయాలని సూచించారు. ఏజెన్సీలో లభించే కాఫీ, అల్లం, పసుపు, మిరియాలు, పిప్పలి తదితర వ్యవసాయ ఉత్పత్తులతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పీవోల డైరెక్టర్లు శ్రీనివాసరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్ చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచన -
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అప్పుఘర్ వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేసే సమయంలో మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి దర్శనాలు ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందనోత్సవం జరుగుతుందని తెలిపారు. యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ యంత్రాంగం సహకారంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గుర్తించిన 28 ప్రదేశాల్లో 290 తాత్కాలిక టాయిలెట్లు, 129 శాశ్వత టాయిలెట్లు, జీవీఎంసీ ఆధ్వర్యంలో మరో 29 శాశ్వత టాయిలెట్లు, 31 వైద్య శిబిరాలు, 6 ప్రధాన ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్ట్ం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొండపైన 170, దిగువన 58 సీసీ కెమెరాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి పావంచా వద్ద అవసరానికి తగిన విధంగా కొబ్బరి కాయలు కొట్టేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్ మాథుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
డుంబ్రిగుడ: ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం మండలంలోని కొర్రాయి పంచాయతీ అంజోడ అరకు పైనరీ వద్ద వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించాలని, దీనిలో భాగంగా వనాలు పెంచాలని సూచించారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో అడవులు నిర్వీర్యం అవుతున్నాయని, వాటిని ఆరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా పోడు వ్యవసాయానికి అడవులు తగులపెట్టడం, ధూమపానం చేసి అక్కడ వదిలేయడంతో మంటలు వ్యాపించడం తదితర కారణాల వల్ల అడవులు అంతరించిపోతున్నాయన్నారు. వీటిని ప్రజలు బాధ్యతగా నివారిస్తే వాటి మనుగడకు సాధ్యపడుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఒకే రోజు 3.45 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, హరితవలయాల విస్తరణపై ప్రతిజ్ఞ చేశారు. అంతక ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డివిజనల్ అటవీ శాఖధికారి పీవీ సందీప్ రెడ్డి, ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మతో కలిసి మొక్కలను నాటారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆ మొక్కలకు వారి బంధువుల పేర్లను సూచిస్తూ రాశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ దొన్నుదొర, ఎంపీటీసీలు లలిత, దేవదాసు, సర్పంచ్లు కొమ్ములు, సీతారం, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, కండ్రుమ్ మాజీ సర్పంచ్ ఆనంద్, అరకు రేంజర్ శ్రీనివాసరావు, బీట్ అధికారులు, ఉద్దంగి వనసరక్షణ సమితుల సభ్యులు పాల్గొన్నారు. సాక్షి,పాడేరు: మండలంలోని మినుములూరు ఏపీఎఫ్డీసీ కాఫీతోటల్లో వనం–మనం కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, కేంద్ర కాఫీ బోర్డు, ఏపీఎఫ్డీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది మొక్కలు నాటారు. కాఫీ కార్మికులు, మినుములూరు ప్రజలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అలాగే తలారిసింగి కార్యాలయంతో పాటు సుండ్రుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ సూర్యకుమారి, సీడీపీవో ఝాన్సీరాణీ మొక్కలు నాటారు. చిన్నారులతో కూడా నాటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, జీసీసీ డిపోల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.మొక్కల సంరక్షణ బాధ్యత స్వీకరించాలి : రంపచోడవరం డీఎఫ్వో బబిత కూనవరం: చెట్ల ఆవశ్యకతపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ నియంత్రణపై చొరవ చూపాలని చింతూరు డీఎఫ్వో ఎం. బబిత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూనవరం అటవీ రేంజ్ పరిధిలో పైదిగూడెం, రేపాక, బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి ప్రాంతాల్లో గురువారం సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 8,650 మొక్కలను నాటించారు. పైదిగూడెం గిరిజన గ్రామంలో ఆదివాసీ నవ దంపతులు మొరక నవీన్, రమ్యలు డీఎఫ్వో సమక్షంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత స్వీకరించాలని కోరారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలకాలని ప్రతిజ్ఞ చేయించారు. సబ్ డీఎప్వో కేవీఎస్ రాఘవరావు, జెడ్పీటీసీ గుజ్జా విజయ, సర్పంచ్లు కారం పార్వతి, మల్లం పల్లి హేమంత్, రేంజ్ ఆఫీసర్ ఎం కరుణాకర్, డీఆర్ఓ అనిల్కుమార్,ఎఫ్ఎస్ఓలు విజయలక్ష్మి, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ పాడేరు : ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతలో భాగంగా మొక్కలు నాటాలని ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యవరణ దినోత్సవంలో భాగంగా గురువారం ఐటీడీఏ ఆవరణలో ఐటీడీఏ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ రజని, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అరకు పైనరీలో ఘనంగా పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన ఎమ్మెల్యే మత్స్యలింగం -
● వైకల్యాన్ని అధిగమించిన కోటిరెడ్డి ● మిస్టర్ ఇండియాగా నాలుగుసార్లు ● కోచ్గా ఎంతో మందికి మార్గనిర్దేశం ● సేవల్లోనూ ఇతరులకు ఆదర్శం
కోటిరెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక, ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ సాడి వెంకటేష్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఒక బాడీబిల్డర్ కాకుండా.. ఒక ఫొటోగ్రాఫర్ ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం విశేషం. సంకల్ప బలం.. అకండ విజయం విజయాలు.. సవాళ్లు పారా బాడీ బిల్డింగ్లో కోటిరెడ్డి సాధించిన విజయాలెన్నో.. 2013లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మిస్టర్ ఇండియా పోటీలో మూడవ స్థానం, 2015, 2017లో బెల్గాంలో జరిగిన సతీష్ సుగర్ క్లాసిక్ (మిస్టర్ ఇండియా) పోటీల్లో వరుసగా రెండు, మొదటి స్థానాలు కైవసం చేసుకున్నారు. 2019లో మీరట్, 2024లో తమిళనాడు, పంజాబ్లలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి తన సత్తా చాటారు. ఇప్పటివరకు తగరపువలస కేంద్రంగా 2008, 2010, 2017లో మిస్టర్ ఆంధ్ర, 2014లో ఈస్ట్జోన్ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలతో పాటు పారా బాడీ బిల్డింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు. నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీకాం పూర్తి చేసిన కోటిరెడ్డి.. తన ఆసక్తిని బాడీబిల్డింగ్ వైపు మళ్లించారు. ఆరేళ్ల కఠోర శిక్షణ అనంతరం దీనినే తన ఉపాధిగా మార్చుకున్నారు. గత 20 ఏళ్లుగా ఈ రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. తొలిసారిగా తగరపువలస బైపాస్రోడ్డులో శ్రీఆంజనేయం మజిల్ ప్లానెట్ జిమ్ను స్థాపించారు. అప్పట్లో ఈ జిమ్కు రూ.8 లక్షలు ఖర్చు చేయగా తర్వాత రూ.25 లక్షల విలువైన వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచారు. తర్వాత జీవీఎంసీ భీమిలిలో జోన్ సంతపేట చిల్డ్రన్స్ పార్కులో 1,500 చదరపు అడుగు విస్తీర్ణంలో రూ.12 లక్షల పరికరాలు, నగరంలోని కృష్ణా కళాశాల వద్ద 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.70 లక్షల పరికరాలతో జిమ్లను ప్రారంభించారు. త్వరలో సంగివలస సుఖీభవ కాలనీ వద్ద 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో అధునాతన జిమ్ను సిద్ధం చేస్తున్నారు. ఆనందపురంలో మరో జిమ్ను తెరచి.. తన శిష్యుడికి అప్పగించారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ఎంతోమంది ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్లకు ఉపాధి కల్పిస్తూ.. సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తన మకాంను నగరంలోని రామాటాకీస్ ప్రాంతానికి మార్చుకున్నారు. భారీగానే ఖర్చు బాడీ బిల్డింగ్ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మిస్టర్ ఇండియా పోటీలకు సిద్ధం కావాలంటే దాదాపు ఏడు నెలల పాటు కఠోరంగా శ్రమించాలి. రోజుకు 750 గ్రాముల చికెన్, 20 కోడిగుడ్లు, 250 గ్రాముల కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ పౌడర్, మల్టీ విటమిన్ టాబ్లెట్లతో పాటు రోజుకు నాలుగు గంటల వ్యాయామం అవసరం. మిస్టర్ ఇండియా పోటీల కోసం కోటిరెడ్డి వద్దకు వచ్చే వారికి ఈ విధంగానే శిక్షణ ఇస్తారు. అయితే ఇందుకు నెలకు రూ.40,000 పైనే ఖర్చవుతుందని, పోటీలకు సిద్ధం కావడానికి మొత్తం రూ.4 లక్షల వరకు వ్యయమవుతుందని కోటిరెడ్డి తెలిపారు. గెలిచిన ప్రైజ్మనీ ఈ ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చుతో కూడినది కావడంతో బాడీ బిల్డింగ్ను ప్రోత్సహించేవారు తక్కువగా ఉన్నారన్నారు. కోవిడ్–19 సమయంలో జిమ్ల మూసివేత వలన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఫొటోగ్రాఫర్ ప్రోత్సాహంసామాజిక సేవఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కోటిరెడ్డి సేవా దృక్పథాన్ని వీడలేదు. తన తల్లిదండ్రులు బోర అప్పన్నరెడ్డి, అప్పయ్యమ్మల పేరుతో ఏటా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బాడీబిల్డింగ్ను ఒలింపిక్స్లో చేర్చాలని, ఇతర క్రీడల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం కోటా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్పాన్సర్లు ముందుకు వస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించడానికి సిద్ధంగా ఉన్నానని, 60 ఏళ్ల వయసు వరకు పోటీలలో పాల్గొంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఏ క్రీడ అయినా సరే.. అది మనల్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా జిమ్కు వెళితే ఉక్కులాంటి శరీరం, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది’ అని కోటిరెడ్డి యువతకు సందేశమిస్తున్నారు. నిడిగట్టు నుంచి మొదలైన ఈ స్ఫూర్తిదాయక ప్రస్థానం.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. బోర కోటిరెడ్డి కేవలం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు.. ఆయన ఒక యోధుడు, మార్గదర్శకుడు. -
వరదొస్తే దారెటు?
2024 వరద ముంపులో చింతూరు, చట్టి గ్రామాలు● విలీన మండలాల ప్రజల్లో గుబులురేపుతున్న వాతావరణశాఖ హెచ్చరికలు ● సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కాని ప్రభుత్వం ● కానరాని ముందస్తు సమీక్షలు ● కనీసం బఫర్ స్టాక్ను సిద్ధం చేయని అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తు చేపట్టని కూటమి సర్కార్ చింతూరు/వీఆర్పురం/కూనవరం: గోదావరి, శబరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధం కాకపోవడంతో విలీన మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చే వరదలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జూన్, జూలై మాసాల్లోనే ప్రారంభమైపోతున్నాయి. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన అధికారులు వీటిపై దృష్టిసారించిన దాఖలాలు కానరావడం లేదు. వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రణాళికపరమైన చర్యలు చేపట్టేది. 2022లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని 2023లో అప్పటి అధికారులు ముందుగానే వీఆర్పురం, కూనవరం మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీంతో వరదలు సంభవించిన సందర్భంలో సురక్షితంగా వాటిలోకి తరలివెళ్లారు. ● వరద వస్తే గతంలో మాదిరిగా కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తగ్గుముఖం ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా వరదలకు ముందుగానే ప్రతి మండలంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సిద్ధంగా ఉంచాలి. ● నాలుగు మండలాల్లోని వరద ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లాంచీలు, నాటు పడవలు, నిత్యావసరాలకు సంబంధించి జీసీసీ ద్వారా మూడు నెలలకు సరిపడా బఫర్స్టాకును ముందుగానే సిద్ధం చేయాలని పలువురు సూచిస్తున్నారు. ● వరద సమయంలో చుట్టూ దారులు మూసుకుపోవడంతోపాటు గ్రామాల్లోకి నీరు వచ్చేస్తోంది. దీంతో ఆశ్రయం కష్టంగా ఉంటోంది. ఎత్తయిన, అటవీప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకునేందుకు టార్పాలిన్లతోపాటు టార్చిలైట్లు, లాంతర్లు, కొవ్వొత్తులు, కిరోసిన్తో పాటు వంటనూనె, కూరగాయలు, పాలప్యాకెట్లు అందించాలి. ● వరదలకు రహదారులు ముంపునకు గురికాకముందే నిత్యావసర సరకుల నిల్వలను ఆయా మండలాలకు తరలించాలి. నిత్యావసరాల తరలింపుతో పాటు ఇతరత్రా పనులు సజావుగా చేపట్టేందుకు ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి. కంటిమీద కునుకు లేకుండా..పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించిన స్పిల్వే, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల కారణంగా ఇక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వీటి కారణంగా బ్యాక్వాటర్ ఇప్పటికే ఏటా వర్షాకాలంలో వీఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో భద్రాచలంలో రెండో హెచ్చరిక అయిన 53 అడుగులకు నీరు చేరాక విలీన మండలాల్లోని గ్రామాలు వరద తాకిడికి గురయ్యేవి. ప్రస్తుతం స్పిల్వేతో పాటు కాపర్ డ్యాంల కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు చేరేసరికే విలీన మండలాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గోదావరి, చింతూరు, వీఆర్పురం మండలాల్లో శబరినది వరదముంపు కారణంగా రహదారుల పైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. 2022లో వచ్చిన వరదలకు భద్రాచలంలో 72.4 అడుగుల వరదనీరు నమోదుకాగా 25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. దీని కారణంగా నాలుగు మండలాల్లో సుమారు 150 గ్రామాలు ముంపునకు గురికాగా 232 గ్రామాలపై ప్రభావం చూపింది. సుమారు 27 వేల కుటుంబాలకు చెందిన 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వాగులు పొంగితే.. చింతూరు మండలంలో సోకిలేరు, జల్లివారిగూడెం వాగులు పొంగినప్పుడల్లా చింతూరు, వీఆర్పురం మండలాల మధ్యతోపాటు, మరో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కుయిగూరువాగు పొంగితే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు మండలంలోని నాలుగు గ్రామాలకు, చిడుమూరు వాగు వల్ల ఆంధ్రా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య, చంద్రవంక వాగు పొంగితే చింతూరు, కూనవరం మండలాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కూనవరం మండలంలో పోలిపాక, కోతులగుట్ట వద్ద వరదనీరు రహదారి పైకి చేరుతోంది. దీనివల్ల భద్రాచలం, చింతూరు, ఎటపాక మండలంలో రాయినపేట, నెల్లిపాక, నందిగామ, మురుమూరు ప్రాంతాల్లో వరదనీరు రహదారిని ముంచెత్తుతోంది. వీఆర్పురం మండలంలో కన్నాయిగూడెం, రామవరం, అడవి వెంకన్నగూడెం, ఇప్పూరు వద్ద రహదారిపైకి వరదనీరు ఎగదన్నడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. -
అలుగువాగు ప్రాజెక్ట్ కాలువ పరిశీలన
ఎటపాక: మండలంలోని కన్నాపురం అలుగు వాగు ప్రాజెక్టు కాలువను చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ గురువారం పరిశీలించారు. కాలువలో పూడికతీతతో పాటు ప్రాజెక్ట్కు గేటు ఏర్పాటుచేయించాలని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మోసం కన్నా ఆధ్వర్యంలో బుధవారం ఆయకట్టుదారులు గ్రీవెన్స్లో పీవోకు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన పీవో కుసుమనపల్లిలోని కాలువను పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కుడి కాలువ కోతకు గురై గండ్లు ఏర్పడటం వల్ల సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వారు పీవోకు వివరించారు. ఈసమస్య పరిష్కారమైతే కుసుమనపల్లి, రేగడగట్టు, ఒడ్డుగుంపు, బొడ్డుగూడెం, పండువారిగూడెం, అయ్యవారిపేట, తోటపల్లి, ఎర్రబోరు గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రైతుల సాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన కన్నాను పీవో అభినందించారు. టీపీవీడు సర్పంచ్ మోసం రాజులు, రైతులు నాగేశ్వరరావు, బొజ్జయ్య, రమేష్, నాగేష్, బాబూరావు, బాలరాజు పాల్గొన్నారు. -
పేద విద్యార్థికి డాక్టరేట్
ఎటపాక: అక్షరాలే ఆస్తిగా ...చదువే సంపదగా భావించి రిజర్వేషన్ల సహకారంతో చదువుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ సాధించాడు. ఎటపాక మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇసంపల్లి రాములు, బంగారమ్మ దంపతుల రెండవ కుమారుడు ఇసంపల్లి వెంకన్న కుటుంబం కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. వెంకన్న ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో ఉంటూ పట్టుదలతో చదువు కొనసాగించాడు. బిగ్ డేటా, టాపిక్ మోడలింగ్ టెక్నిక్ తదితర అంశాలపై పరిశోధనలను జేఎన్టీయూహెచ్లో వెంకన్న పూర్తి చేశాడు. ఇందుకుగాను ఈనెల 3న హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నాడు. గ్రామస్తులు, స్నేహితులు పలువురు ఆయనను అభినందించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు స్వల్పగాయాలు ● డొంకరాయి జెన్కో ఆస్పత్రికి తరలింపు ● అదుపు తప్పడంతో ఘటన ● అదే సమయంలో సరఫరాలేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం రంపచోడవరం : భద్రాచలం నుంచి పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపు సమీపంలోని 33 కేవీలైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. జంగిల్ కటింగ్ నిమిత్తం అదే సమయంలో ఏపీ జెన్కో సంస్థకు చెందిన డొంకరాయి డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది 33 కేవీ/11 కేవీ పవర్ కెనాల్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం దెబ్బతింది. ప్రమాదానికి గురైన బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ జెన్కో డొంకరాయి డీఈ భాస్కరరావు సంఘటన స్థలానికి వచ్చారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను డొంకరాయిలోని ఏపీ జెన్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం వారిని సీలేరు వరకు ఏపీ జెన్కో బస్సులో తరలించారు. అక్కడి నుంచి ఇతర మార్గాల ద్వారా ప్రయాణికులు గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. -
నష్టపరిహారం చెల్లించిన తరువాతే హైవే పనులు
జి.మాడుగుల: మా సాగు భూములకు నష్టపరిహారం అందించే వరకు జాతీయ రహదారి 516ఈ రోడ్డు నిర్మాణ పనులు చేయవద్దని వంజరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోయిన బాధితులతో గురువారం మండలంలోని వంజరిలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మన్నపడాల్, జాతీయ రహదారి బాధితుల సంఘం మండల కన్వీనర్ వంజరి సీతారాంనాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంజరిలో గ్రామంలో 50 కుటుంబాలు, ములకాయపుట్టులో 40 కుటుంబాలు, కడగెడ్డ గ్రామంలో 10 కుటుంబాలు వరిగెలపాలెంలో 10 కుటుంబాలకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు వినతి పత్రం అందించామని వారు తెలిపారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన సుమిత్కుమార్ ఉన్నప్పుడు రెవెన్యూ, హర్టికల్చర్, అటవీ అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారన్నారు. యూఆర్ఎఫ్ పట్టాలు 1985 సంవత్సరంలో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్లు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారితోపాటు ఇదివరకు సాగులో ఉన్న వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పనప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. రోడ్ ఫార్మేషన్ జరిగి ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నా నష్టపరిహారం అందించకపోవడం బాధాకరమని వారు అన్నారు. కాఫీ, మిరియం, మామిడి తోటలపై రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, లేదంటే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తమ గ్రామాల్లో రోడ్డు నిర్మాణంలో పంట కాలువలు, నాలుగు బోర్లు కప్పేశారని, వాటిని ఇప్పటికీ పునరుద్ధరించలేదన్నారు. హైవే బాధితుల సంఘం కోకన్వీనర్ శ్రీనివాస్, ప్రతినిధులు చిరంజీవినాయుడు, రామూర్తినాయుడు, బాబూరావు, వెంకటలక్ష్మి, కనకాలమ్మ, భారతమ్మ, కల్యాణం బాలయ్య, చిన్నయ్య, హరి, భాస్కర్ పాల్గొన్నారు. వంజరిలో బాధితుల డిమాండ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద నిరసన -
మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనే లక్ష్యం
పాడేరు : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పిలుపునిచ్చారు. కలెక్టర్ దినేష్కుమర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2024లో 316 కేసులు నమోదు చేసి 23,366.25 కిలోల ఎండు గంజాయిని, 91.2 హషిస్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 970 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 2025లో ఇప్పటి వరకు 62 కేసులు నమోదు చేసి 7082.74 కిలోల ఎండు గంజాయి, 5.5కిలోల హషిస్ ఆయిల్ను స్వాధీనం చేసుకుని 129 మందిని అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్లతో ప్రత్యేక సర్వే చేపట్టి 93.01 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. పదేపదేగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న 50 మంది హాబిట్యువల్ నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించామని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 907 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు డీఐజీ తెలిపారు. గంజాయి సాగు, రవాణా, క్రయ,విక్రయాలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేసి వారు సంపాదించిన ఆస్తులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు, క్రయ, విక్రయాలు, రవాణా చేసే వారి సమాచారం ఉంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్డీపీఎస్ సెల్ :9381123100, 1930(ఈగల్)కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీతో కలిసి ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన డీఐజీ గోపినాఽథ్ జెట్టీకి ఎస్పీ అమిత్బర్దర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ధీరజ్, డీఎస్పీ షేక్ సహాబాజ్ అహ్మద్, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు -
ఏవోబీలోనూ సుధాకర్ కీలకపాత్ర
● మావోయిస్టు ఉద్యమ బలోపేతంలో తనదైన ముద్ర ● ఏజెన్సీలో ఘటనలకు ఆయనే వ్యూహంరూపొందించే వారని ప్రచారంసాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ లక్ష్మీనరసింహచలం ఏవోబీలో ఉద్యమ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందారు. ఈ ప్రాంత ఉద్యమంతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. నల్లమల అడవుల నుంచి ఏవోబీలోకి ప్రవేశించిన ఆయన ఏవోబీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చేపట్టిన శాంతి చర్చల్లోను ఆయన పాల్గొన్నారు. ఒడిశాలోని సుంకి–సాలూరు ఏరియా కమిటీలో సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపారు. 2006లో అప్పటి విజయనగరం జిల్లా మక్కువ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రసమంతవలస అడవుల్లో సుధాకర్ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అడవిలో సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో అప్పటి పోలీసు పార్టీలు ఆయనను సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారారు. ఏవోబీ పరిధి రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగే మావోయిస్టు ఉద్యమ కార్యక్రమాలకు ఈయనే వ్యూహం రూపొందించేవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనను కోల్పోవడం దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగానే చెప్పవచ్చు. -
యువతకు ఉపాధి.. యోధులకు భరోసా
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు ఇక్కడ శిక్షణ పొందిన పలు రాష్ట్రాలకు చెందిన డిఫెన్స్ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతాలు, పట్టణాల్లో విజయవంతంగా ఉపాధి పొందుతున్నారు. కొందరు నగరంలోని పలు హోటళ్లు, గీతం వంటి యూనివర్సిటీల్లో ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొందరు ఇతర రాష్ట్రాల్లో సొంతంగా హోటళ్లు, పార్లర్లు కూడా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఒడిశాకు చెందిన తుస్టి అనే ఆర్మీ ఉద్యోగి ఇక్కడ శిక్షణ పొందారు. పదవీ విరమణ తర్వాత తన పేరుతోనే ఒక పార్లర్ను విజయవంతంగా నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్.. అటు నిరుద్యోగ యువతకు, ఇటు దేశ సేవలో తరించిన సైనికులకు ఉపాధి మార్గాలను చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆరిలోవ: నగరంలోని ప్రభుత్వ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకై క ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది యువత దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించడంతో పాటు స్వయం ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్లో రక్షణ రంగ ఉద్యోగులకు సైతం వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 1986లో ఈ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వేలాది మంది నిరుద్యోగ పేద యువతకు అండగా నిలుస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులకు వంటలు, హాస్పిటాలిటీ, బేకరీ వంటి పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతోంది. రక్షణ రంగ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ 2017 నుంచి ఈ ఇన్స్టిట్యూట్ తన సేవల పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో డిఫెన్స్ రంగంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉద్యోగులకు వంటల తయారీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉద్యోగ విరమణకు ఆరు నెలల ముందు ఉన్న వారిలో ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి ఈ శిక్షణ అందిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ రీసెటిల్మెంట్(డీజీఆర్) ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ఎఫ్సీఐ వంటి సంస్థలతో పాటు ఫుడ్క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్లో కూడా ప్రీ రిలీజ్ కోర్సు(పీఆర్సీ)లలో భాగంగా ఈ శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను, ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారత వంటకాలతో పాటు హాస్పిటాలిటీ, బేకరీ, టూరిజం (హోటల్ మేనేజ్మెంట్) వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఇన్స్ట్రక్టర్ల ద్వారా తర్ఫీదు ఇస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు 24 బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ బ్యాచ్ మూడు నెలల కాలపరిమితితో నడుస్తుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్తో వారు పదవీ విరమణ అనంతరం స్వయం ఉపాధి పొందడానికి లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం సుగమం అవుతోంది. పదవీ విరమణ పొందుతున్న సైనికులకు ‘ఫుడ్క్రాఫ్ట్’అండ నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి మూడు నెలల శిక్షణతో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు 2017 నుంచి డిఫెన్స్ ఉద్యోగులకు ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటివరకు 24 బ్యాచ్ల్లో 796 మందికి శిక్షణ అందించి సర్టిఫికెట్లు అందజేశాం. ఇక్కడ శిక్షణ పొందినవారు డిఫెన్స్లో రిటైర్ అయిన వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు నిర్వహిస్తున్నారు. ఇది వారికి చాలా మంచి అవకాశం. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. –కె.వి.రమణ, ప్రిన్సిపాల్, ఫుడ్క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్, విశాఖపట్నంరిటైర్మెంట్ అనంతరం నూతన కెరీర్ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో 2024 బ్యాచ్లో ‘డిప్లమో ఇన్ బ్యాంక్విట్ మేనేజ్మెంట్’లో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగ విరమణ అనంతరం గీతం వర్సిటీలో హాస్పిటాలిటీ సర్వీస్లో ఉద్యోగంలో చేరాను. ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడం వల్ల నాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఉపాధి లభించింది. – ఆర్.అనూప్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ శిక్షణ వల్లే సాధ్యమైంది 2024 బ్యాచ్లో ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో హాస్పిటాలిటీలో శిక్షణ పొందాను. మూడు నెలల శిక్షణ అనంతరం తిరిగి ఎయిర్ఫోర్స్లో ఉద్యోగంలో చేరాను. మూడు నెలలు తర్వాత రిటైర్ అయ్యాను. అనంతరం గీతం యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం లభించింది. ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో పొందిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. దీంతో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే చోట ఉద్యోగం కోసం వెతకాల్సిన పని తప్పింది. – శ్రీకాంత్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్ఫోర్స్ -
ట్రాఫిక్ నియంత్రణకుప్రత్యేక చర్యలు
చింతపల్లి: మండల కేంద్రంలోని వారపు సంతలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి బుధవారం జరిగే వారపు సంతకు చింతపల్లి జీకే వీధి మండలాల నుంచి వందలాది మంది గిరిజనులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలతో స్థానిక హనుమాన్ జంక్షన్ నుంచి డిగ్రీ కళాశాల వరకూ తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న దుకాణాలను సంత స్థలంలోకి పోలీసులు దగ్గరుండి మార్పించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరమణ మాట్లాడుతూ వారపు సంత రోజున మార్కెట్ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు రాకపోకలు సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
శిశు మరణాలపై విచారణ
రాజవొమ్మంగి: మండలంలోని మొల్లిమెట్ల, వాతంగి గ్రామాల్లో రెండు రోజుల వ్యవధిలో సంభవించిన శిశు మరణాలపై రంపచోడవరం ఏడీఎంఅండ్హెచ్వో శిరీష బుధవారం విచారణ జరిపారు. ‘శిశువు మృతి– సకాలంలో అందని వైద్యం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించా రు. లాగరాయి, జడ్డంగి, రాజవొమ్మంగి పీహెచ్సీలను బుధవారం సందర్శించిన ఆమె ఆపరేషన్ థియేటర్లో పరికరాలు శుభ్రతగా లేకపోవడంపై ఆమె అసహ నం వ్యక్తం చేశారు. శిశువు మృతి చెందిన మొల్లిమెట్ల గ్రామానికి వెళ్లారు. రామిరెడ్డి, శిరీష దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి మృతిపై వివరాలు తెలుసుకున్నారు. జ్వరం, ఫిట్స్ రావడంతో చిన్నారి అస్వస్థకు గురైందని, చికిత్స అందించే లోగా మృతి చెందిందని వారు వివరించారు. శిశు మరణంపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏడీఎంహెచ్వో తెలిపారు. అనంతరం ఆమె సిబ్బందితో సమీక్షించారు. అప్పుడే పుట్టిన బిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా అంగన్వాడీ వర్కర్లు, పీహెచ్సీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని కోరారు. సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆమె వెంట లాగరాయి, రాజవొమ్మంగి పీహెచ్సీల వైద్యాధికారులు నాగార్జున, సుష్మ తదితరులు పాల్గొన్నారు.వివరాలు సేకరించిన ఏడీఎంహెచ్వో శిరీష -
ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నంద్ పాడేరు : లాభదాయకమైన ప్రకృతి విధానంలో వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నంద్ సూచించారు. బుధవారం పట్టణంలోని జిల్లా వ్యవసాయ శిక్షణ కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమం ముగింపులో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ద్రవ, ఘన జీవామృత తయారీ విధానం, జీవ వైవిధ్యం అధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రత్యక్షంగా రైతులకు, పరోక్షంగా భూమికి ఎంతో మేలు కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామ్మోహన్రావు, ఎల్. భాస్కర్రావు, వ్యవసాయ శాఖ అనుబంద విభాగాల ఏడీఏ, ఎంఎంఏ, ఏవో, హెచ్వోలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
గర్భశోకం
● ప్రాణం తీసిన ఈత సరదా ● వరాహ నదిలో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృతి ● తల్లిదండ్రులకు తీరని వేదన కోటవురట్ల: మాటలకందని విషాదం.. పగవారికి సైతం రాకూడని ఉత్పాతం.. వరాహ నదిలో మునిగి ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.. ఉన్న పిల్లలిద్దరూ కన్నుమూయడంతో తల్లిదండ్రులు అంతులేని వేదనతో కన్నీరుమున్నీరయ్యారు. మీరే లేకపోతే ఇక మాకెందుకు ఈ బతుకు అంటూ వారు విలపిస్తున్న తీరు అందరి మనసులను కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కోటవురట్ల శివారు జానకీరాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుర్ల దేవా (14), సుర్ల హిమవంత్ (10), అల్లు నాయుడులతోపాటు కె.వెంకటాపురానికి చెందిన పోలుపర్తి మోహన్ ఉదయం 8 గంటల సమయంలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న వరాహ నదిలోకి ఈత కొట్టేందుకు దిగారు. ఒకచోట లోతు ఎక్కువగా ఉండడంతో అన్నదమ్ములైన దేవా, హిమవంత్ గోతిలో పడి మునిగిపోయారు. మిగతా ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే అన్నదమ్ములిద్దరూ ఊపిరాడక మృతి చెందారు. అల్లు నాయుడు బాగానే ఉండగా పోలుపర్తి మోహన్ను స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పిల్లలు ఈతకు వెళ్లే సమయానికి మృతుల తల్లిదండ్రులు సుర్ల రాము, సుర్ల లక్ష్మి ఉపాధి పనికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుల్లో పెద్దవాడైన దేవా చిన్నతనం నుంచి తాతగారి ఊరు రోలుగుంట మండలం రొంగలిపాలెంలో ఉంటూ రోలుగుంటలో చదువుకుంటున్నాడు. ఇటీవల తలుపులమ్మతల్లి పండగ జరగడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. సెలవులు కావడంతో తమ్ముడు హిమవంత్, మిగతా పిల్లలతో కలిసి నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుల తండ్రి సుర్ల రాము ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి మృతదేహాలకు స్థానిక సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ సత్యనారాయణరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, సర్పంచ్ బి.అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆర్ఎస్ లక్ష్మీనరసింహరాజు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్ మాట్లాడుతూ పిల్లలిద్దరినీ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. -
క్షయ పట్ల అప్రమత్తత తప్పనిసరి
పాడేరు : క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే సమీక్ష ఆస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా సూచించారు. మండలంలోని మారుమూల ఈదులపాలెం పీహెచ్సీలో బుధవారం నిర్వహించిన క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవోడీటీ డాక్టర్ సూర్యనారాయణమ్మ, ఎంవోటీసీ డాక్టర్ రేఖ, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీను, డాక్టర్ నర్సింగ్, ఆశా కార్యకర్తలు, స్థానిక పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట: గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జమాల్బాషా సూచించారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్సీని సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయాలన్నారు. అనంతరం కొట్నాపల్లి, పెదగరువు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. స్థానిక వైధ్యాధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా -
రీసర్వేలో నిర్లక్ష్యం సహించను
సాక్షి,పాడేరు: జిల్లాలో భూముల రీసర్వేను రెవెన్యూ అధికారులు మరిచిపోతున్నారని కలెక్టర్ ఎ.ఎస్.దినే ష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాల రెవెన్యూ,సర్వే అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.జూన్ నెలాఖరు నాటికి మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రంపచోడవరం డివిజన్లో మ్యుటేషన్లు,రీసర్వే పనులు సంతృప్తికరంగా జరగడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.పోరంబోకు భూముల్లో ఆక్రమణలు తొలగించి, అభ్యంతరం లేని భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. గతంలో జారీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను పునః పరిశీలన చేయాలని, వేరేచోట ఇళ్ల స్థలాలు,ఇళ్లు ఉంటే గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. సబ్కలెక్టర్లు సౌర్యమన్పటేల్, కల్పశ్రీ, డీఆర్వో పద్మలత, సర్వే ఏడీ దేవేంద్రుడు, అన్ని మండలాల తహసీలార్లు, సర్వేయర్లు,వీఆర్వోలు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ ఆగ్రహం -
ప్రతి కార్డుదారునికిరేషన్ అందించాలి
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి రేషన్కార్డుదారునికి రేషన్బియ్యం,ఇతర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పౌరసరఫరాలశాఖ అఽధికారులను ఆదేశించారు.పట్టణంలోని సుండ్రుపుట్టు డీఆర్ డిపోలో రేషన్కార్డుదారులకు మంగళవారం కలెక్టర్ బియ్యం,పంచదార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్వో బి.గణేష్కుమార్,తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు,పౌర సరఫరాలశాఖ డీటీ ప్రశాంత్,జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
వెన్నుపోటు
● అబద్ధపు హామీలతో అడవి బిడ్డలకుఅన్నం పెట్టే రైతుకుసున్నం పెట్టారు అన్నదాతా సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20వేలు సాయం అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుల ఖాతాలో జమ చేయలేదు. ఈ ఏడాది కూడా జమ చేస్తారనే నమ్మకం లేదు. అమలు చేయలేని హామీలిచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. – పాంగి రాంబాబు,గిరిరైతు, శిమిలిగుడ గ్రామం, అరకులోయ సాక్షి,పాడేరు: అబద్ధపు హామీలతో కూటమి నేతలు గిరిజనులకు వెన్నుపోటు పొడిచారు. జీవో నంబర్ 3, ప్రత్యామ్నాయ జీవో ఇలా ఎన్నో హామీలను అరకులోయ ఎన్నికల సభలో గుప్పించిన చంద్రబాబునాయుడు వాటిని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలను గుప్పించిన కూటమి పార్టీల నాయకులు వాటిని అమలు చేయకుండా ఏడాది పాటు కాలక్షేపం చేసేశారు. దీంతో గిరిజనులు తమ హక్కులను, చట్టాలను కాపాడుకునేందుకు ఆందోళనబాట పట్టవలసి వచ్చింది. నిరుద్యోగులు రోడ్డెక్కవలసిన పరిస్థితి దాపురించింది. ఎన్నికల ప్రచార సమయంలో.. జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోతో నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాళీలను గిరిజనులతోనే భర్తీ చేస్తామని, గిరిజన ఆశ్రమపాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియమిస్తామని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. రెండు నెలలుగా ఆందోళనలు జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో తేకుండానే సీఎం చంద్రబాబు డీఎస్సీని ప్రకటించడంతో గిరిజనులకు అన్యాయం జరిగింది.నూరుశాతం ఉద్యోగాల జీవోతో పాటు,ప్రత్యేక డీఎస్సీ ప్రకటన చేస్తారని భావించిన ఆదివాసీలు చివరకు మోసపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు హామీలను విస్మరించడాన్ని నిరిసిస్తూ గత రెండు నెలలుగా గిరిజన ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఆదివాసీ జేఏసీ నేతలు పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ఎదుట 18రోజుల నుంచి రిలే దీక్షలతో ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. సూపర్ సిక్స్.. దగా ఫిక్స్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు కూడా చాలామందికి అమలుకాలేదని జిల్లా వాసులు వాపోతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500,ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం,ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం,రైతులకు అన్నదాతా సుఖీభవ,యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి వంటి పథకాలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలజేయకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ,విద్యా,వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గ్రామాల్లో రోడ్లు,తాగునీటి పథకాల నిర్మాణాలు,గెడ్డలపై వంతెనల నిర్మాణాల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పాఠశాలల భవనాలు,సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తల్లులకు పంగనామం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకంలో సాయమందిస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అమలు చేయలేదు. దీంతో జిల్లాలో 1,73,887 తల్లులు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం తుస్ జిల్లాలోని 5,55,503మంది మహిళలు ఉన్నారు.వారందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చి ప్రచారం చేశారు.అయితే అధికారంలోకి ఇచ్చి ఏడాదవుతున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం లేదు. రూ.1500 ఆర్థిక సాయం వట్టిదే 18ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు నెలకు రూ.1500చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అఽధికారం చేపట్టిన ఈ 12 నెలల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.జిల్లాలో 3,96,969మంది మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.ఉసూరుమంటున్న అన్నదాతలు నిరుద్యోగులతో ఆటలువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుకున్న జిల్లాలోని 1,69,264మంది గిరిజన రైతులకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్న కూటమి నాయకులు గత ఖరీఫ్లో ఇవ్వకపోవడంతో జిల్లాలోని పేదరైతులంతా ఉసూరుమంటున్నారు. కూటమి ప్రభుత్వం నయ వంచన జీవో నంబర్ 3పై నోరుమెదపని సీఎం ప్రచార సభలో ఇచ్చిన హామీలపై పట్టని నేతలు రెండు నెలలుగా ఆదివాసీ ప్రజాసంఘాల ఉద్యమాలు సూపర్ సిక్స్ హామీలు ప్రకటనలకే పరిమితం అంతా మోసమే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలతో నిండిపోయింది. జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తానని అరకు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజనులకు మోసం చేశారు.గిరిజన ప్రాంతాలకు కూటమి పాలనలో ఒరిగిందేమి లేదు.విద్య,వైద్య రంగాల్లోను నిర్లక్ష్యం నెలకొంది.రైతుల సంక్షేమాన్ని కూడా విస్మరించారు. – పొద్దు బాలదేవ్, గిరిజన సంఘం నేత, అరకులోయ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు.జిల్లాలో 2.20 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు.వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా,ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలోను నిర్లక్ష్యం చూపుతున్నారు.రైతులకు తీవ్ర అన్యాయం సీఎం చంద్రబాబు రైతు భరోసాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు.గత సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసా ఆర్థిక సాయం పొందాం.గత ఏడాది నుంచి రైతు భరోసా సాయం నిలిపివేయడంతో గిరిజ న రైతులమంతా వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నాం. – ముడువ కొండబాబు, గెడ్డంపుట్టు, తుంపాడ పంచాయతీ, పాడేరు మండలం నిరుద్యోగ భృతి చెల్లించాలి నిరుద్యోగ భృతి హామీని చంద్రబాబు నెరవేర్చాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల హామీలు అమలు చేస్తారని యువత ఓటేస్తే కూటమి నాయకులు వంచించారు. ఇప్పటికై నా నిరుద్యోగ భృతి చెల్లించాలి. – బారికి కల్యాణ్, నిరుద్యోగి, బోసుబెడ, అరకులోయ ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచిని ఎక్కడా కనబడకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తన పాలనలో పేదలకు అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తే, కూటమి ప్రభుత్వం దానికి విరుద్ధంగా పనిచేస్తోంది. వలంటీర్లను తొలగించడంతో పాటు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పేదలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇలాంటి ప్రభుత్వాలు ఎంతో కాలం కొనసాగవు. – కూడ బొంజుబాబు, రైతు, కుమ్మరివీధి గ్రామం, పెదబయలు మండలంమహిళలను మోసం చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. – బురిడి సుమిత్ర, గంగగుడ్డి గ్రామం, అరకులోయ హామీ ఇచ్చి అన్యాయం చేశారు అరకులోయలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తానని,ప్రత్యామ్నాయ జీవోతో నూరుశా తం ఉద్యోగాలు గిరిజనులకు క ల్పిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. దీంతో గిరిజన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గిరిజన ప్రత్యేక డీఎస్సీ కోసం ఉద్యమా లు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం. – రామారావుదొర, ఆదివాసీ జేఏసీ, జిల్లా అధ్యక్షుడు, పాడేరురేషన్ వాహనాల రద్దుతో ఇక్కట్లు రేషన్ వాహనాల రద్దుతో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లు ఎక్కడెక్కడో ఉంటాయి. వాహన సదుపాయం అందుబాటు లేని పరిస్థితిలో జీసీసీ డిపోకు నడిచి వచ్చి రేషన్ తీసుకుని తిరిగి వెళ్లాంటే ఇబ్బందులు తప్పవు.ఏజెన్సీలో రేషన్ వాహనాలు పునరుద్ధరించాలి. – కుంజం రామకృష్ణదొర, ఐ పోలవరం -
మోసాలను ఎండగడతాం..
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి సాక్షి,పాడేరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ మోసాలపై జిల్లాలో బుధవారం నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాలైన పాడేరు,అరకులోయ,రంపచోడవరంలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల ప్రతి నిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో గిరిజనులకు ఒరిగిందేమి లేదన్నారు.సూపర్సిక్స్ పథకాలను కూడా అమలు చేయకుండా మోసం చేసిందని పేర్కొన్నారు.అరకు ఎన్నికల సభలో జీవో నంబర్ 3 పునరుద్ధరణపై, నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతో భర్తీ చేసేందుకు చంద్రబాబు హామీ ఇచ్చి, నిలబెట్టుకోలేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దగా చేశారని తెలిపారు. ఇంటి వద్దే బియ్యం,ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం కక్షగట్టి రద్దు చేయడం దారుణమని తెలిపారు.గిరిజనులంతా మూడు రోజుల నుంచి నిత్యావసరాలు పొందేందుకు జీసీసీ డిపోలకు కాలినడకన వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఏడాది పాలనలో పేద ప్రజలకు అన్యాయమే జరిగిందన్నారు.ప్రజలంతా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని తెలిపారు. అరకులోయటౌన్: నియోజకవర్గ కేంద్రం అరకులోయలో ఈనెల 4వ తేదీ బుధవారం నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న వెన్నుపోటు దినం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగాలను గిరిజన నిరుద్యోగులతో భర్తీ చేస్తానని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారం పొందిన తరువాత విస్మరించారని ఆరోపించారు. క్యాంప్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
రేషన్ బియ్యం పట్టివేత
రాజవొమ్మంగి: స్థానిక శివాలయం వీధిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తహసీల్దార్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఐదు సంచుల్లో లభించిన 173 కిలోల బియ్యాన్ని సీజ్ చేసి, జడ్డంగిలోని ఎంఎల్ఎస్ గోదాంకు తరలించినట్టు చెప్పారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్ఐ చెల్లమ్మ, వీఆర్వో భూలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి
సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్అరకులోయటౌన్: ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అన్నారు. పర్యాటక, సందర్శిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగ శిక్షణలో భాగంగా మంగళవారం స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ యోగతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఈవోపీఆర్డీ కె.వి. సత్యనారాయణ, గిరిజన మ్యూజియం, పద్మా పురం ఉద్యానవనం మేనేజర్లు మురళీ, బొంజుబాబు, వెలుగు ఏపీఎం శెట్టి కృష్ణారావు, డీటీ గోవిందు, ఆర్ఐ బలరామ్ పాల్గొన్నారు.