అరకువ్యాలీలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● కొనసాగుతున్న శీతల గాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. చలి, పొగమంచు తీవ్రత కొనుసాగుతోంది. బుధవారం అరకువ్యాలీలో 10.6 డిగ్రీలు, చింతపల్లిలో 10.8 డిగ్రీలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో ముంచంగిపుట్టులో 11.2 డిగ్రీలు, హుకుంపేటలో 11.5 డిగ్రీలు,పెదబయలులో 12.1డిగ్రీలు, కొయ్యూరులో 15.3 డిగ్రీలు, అనంతగిరిలో 17.0 నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం నుంచివ వీస్తున్న శీతల గాలులకు ప్రజలు తాళలేకపోతున్నారు.


