Mancherial
-
కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్రెడ్డి అశోక్రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రెచ్చగొట్టే పోస్టులుపెడితే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సిగరేట్ తాగడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే రౌడీషీటర్ సిగరేట్ తాగుతూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలోని ఎగ్జిబిషన్ వ్యాపారిని సయ్యద్ మోసిన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడగా అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో కత్తులు, నిర్లక్ష్య డ్రైవింగ్, సిగరెట్ తాగుతూ రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒకరిపై చీటింగ్ కేసుఆదిలాబాద్రూరల్: ఇచ్చోడలోని మాధపూర్కు చెందిన మల్లేశ్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. రాంనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వహబొద్దీన్కు ఫోన్చేసి ఫర్నీచర్పై రూ.5 లక్షల స్కీమ్ ఉందని, మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బిల్స్తో రుణం వస్తుందని మాయమాటలు చెప్పాడు. తాను ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాని చెప్పి రూ.20వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పడంతో బాధితుడు రూ.18వేలు ఫోన్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండడంతో బాధితుడు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై..ఆదిలాబాద్టౌన్: పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. తాంసి మండలంలోని సవర్గాంకు చెందిన గజకంటి ప్రభాకర్ పంచాయతీ కా ర్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో పలువురు నాయకులు మంగళవారం మృతదేహంతో జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో డీపీవో శ్రీలత ఫిర్యాదు మేరకు అనుము ల కిరణ్, బొజ్జ ఆశన్న, అలాలి అజయ్, లంకా రాఘవులు, ఎ.మల్లేశ్, అగ్గిమల్ల స్వామితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నకిలీ పత్రాల కేసులో తవ్వినకొద్దీ అక్రమాలు
ఇచ్చోడ: నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ద్వారా కొలువులు సాధించిన కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో నివాసం ఉంటున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు సాధించిన విషయంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పోలీసు, రెవెన్యూ యంత్రాగం విచారణకు రంగంలోకి దిగింది. మరో తొమ్మిది మందిపై ఫిర్యాదు... గతంలో ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన జాదవ్ రామారావు (ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేస్తున్నారు) తన డిజిటిల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇస్లాంనగర్ గ్రామ నివాస ధ్రువీకరణ పత్రాలు మార్ఫింగ్ చేసిన అంకిత్పటేల్, బిపిన్యాదవ్, అతుల్కుమార్యాదవ్, ఘాన్శ్యామ్ తివారి, జైనులొద్దీన్, తివారికుల్దీప్, అభిద్ఖాన్, సురాజ్సహని, విశ్వుకర్మపై సోమవారం రాత్రి ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ విషయంలో గోప్యత... నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన 8 మంది సర్టిఫికెట్లు పరిశీలనలో నకిలీవని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఈ విషయంలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన 8 మంది వ్యక్తుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని 2025 మార్చి 8న కమాండెంట్ 53 బెటాలియన్ ఐటీబీపీ ఫోర్స్ మండలం కలికిరి, అన్నమయ్య జిల్లా అధికారులు ఆదిలాబాద్ కలెక్టర్ను కోరారు. సంబంధిత పత్రాలు పరిశీలించి పంపించాలని కలెక్టరేట్ అధికారులు ఇచ్చోడ తహసీల్దార్ను ఆదేశించారు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ నకిలీ పత్రాలుగా గుర్తించారు. దీనిపై పోలీసులకుగానీ జిల్లా అధికారులకు గానీ ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉండేవారి అండతోనే నివాస ధ్రువీకరణ పత్రాల మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ దిశగా విచారణ జరిపితే అసలు దోషులు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరో 9 మందిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిరాజ్ అన్సారీ అనే వ్యక్తి 2025 జనవరి 16లో ఆర్సీ 022511735376 నంబర్ ద్వారా మీసేవలో నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇదే నంబర్ మహబూబ్నగర్ జిల్లాలోని శేర్ వెంకటాపురం అశ్విని అనే అమ్మాయి పేరుతో జారీ అయిన ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ నివాసిగా సిరాజ్ అన్సారీ మార్ఫింగ్ చేశారు. -
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
ఓ వైపు పచ్చని అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు.. మరోవైపు పురాతన ఆలయాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అడవి దున్నలు, చిరుతలతో పాటు జింకలు, నీలుగాయిలు ఇతర వన్యప్రాణులకు నిలయంగా కవ్వాల్ అభయారణ్యం నిలుస్తోంది. గిరిజన పోరాట స్ఫూర్తిని తెలిపే కుమురంభీం స్మారకం, జైన శిల్పకళతో నిర్మించిన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం, పాండవులు వనవాసం చేసిన పెద్దయ్య దేవుడి గుట్ట, గోదావరి ఒడ్డున వెలిసిన సత్యదేవుని ఆలయం, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం పర్యాటకంగా కీలకమైన ప్రాంతాలు. వేసవి సెలవుల్లో ఉమ్మడి జిల్లాలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రాంతాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జన్నారం అటవీ డివిజన్లో చుక్కల దుప్పులు ఆదిలాబాద్టౌన్: దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఉంది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ విశిష్టత మహారాష్ట్రాలోని వెమత్మాలపంత్ రాతి తో ఈ ఆ లయం నిర్మించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎ త్తు, 40 గజాల వైశాల్యమున్న అష్టకోణాకార మండపము పైనున్న గర్భగుడిలో సూర్యనారా యణ స్వామి విగ్రహం ప్రతిష్టించబడి ఉంది. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణ దిశలో లక్ష్మీదేవి, హల్వారులు, అన్యదేవత మూర్తులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి. స్వామి పాదాలను తాకే భానుడి కిరణాలు.. ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో, దసరా అనంతరం అశ్వియుజ పౌర్ణమిరోజు ఉదయం లక్ష్మీనారాయణ పాదాల ను సూర్యకిరణాలు తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూ ర్యదేవాలయంగా కూడా పిలు స్తారు. ఈ అద్భుత దృశ్యం చూడటానికి రాష్ట్ర నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టలు పుణ్యక్షేత్రాలకు నిలయంగా మారాయి. గుట్టపై వెలసిన సత్యనారాయణ స్వామి ఆలయం తె లంగాణలోనే ప్రసిద్ధి గాంచింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు గోవర్దన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ సమీపంలోనే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఎత్తయిన కొండపై అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. గుట్ట కింద షిర్డి సాయినాథుని ఆలయం ఉంది. ఇలా ఒకే చోటా ఇన్ని ఆలయాలు ఉండటంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా మారింది. సత్యదేవుని ఆలయంలో ప్రతీ పౌర్ణమికి జాతర నిర్వహిస్తారు. మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా నేరుగా రావచ్చు. జన్నారం: దట్టమైన అడవులు, పచ్చదనం పంచుతున్న చెట్లు, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు కేరాఫ్గా కవ్వాల్ టైగర్జోన్కు పేరుంది. 982 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలో విస్తరించి ఉంది. పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల పరుగులు, వాగుల గలగలలు ఇవన్నీ కలగలిపిన సంపదే కవ్వాల్ టైగర్జోన్. దీనికి గుండెకాయ జన్నారం అటవీ డివిజన్. సఫారీ ప్రయాణం పర్యాటకులను అడవిలో తిప్పేందుకు అటవీ శా ఖ, పర్యాటక శాఖలు సఫారీల ను ఏర్పాటు చేశా యి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఐదు లగ్జరీ సఫా రీలు, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండు సఫా రీలను ఏ ర్పాటు చేశారు. పర్యటక శాఖ ఏర్పా టు చేసిన రిసార్ట్స్లో రాత్రి బసచేసి, ఉదయా న్నే అడవిలో సఫారీ ప్రయాణం చేస్తారు. ఉదయం 7 నుంచి 10 గంటలకు, 10 నుంచి ఒంటిగంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అడవిలో సుమారు 15 కి లోమీటర్ల దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. వన్యప్రాణుల పరుగులు, పక్షుల కిలకిలలు నేరుగా చూడవచ్చు. పచ్చదనం పంచుకున్న అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హరిత రిసార్ట్లో పర్యాటకుల కోసం కార్టేజీలను ఏ ర్పాటు చేశారు. ఇలా వెళ్లాలి.. మంచిర్యాల నుంచి గంటకో బస్సు ఉంటుంది. మంచిర్యాల నుంచి 60 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కాకుండా నేరుగా సొంత వాహనాలతో కూడ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సొంత వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలకు అనుమతి ఉండదు. అటవీశాఖ చెక్పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేస్తారు. దట్టమైన అడవిలో పెద్దయ్య ఆలయందండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో రెండు గుట్టల నడుమ గలగలా పారే సెలయేరు ఒడ్డున పెద్దయ్యదేవుని ఆలయం ఉంది. ద్వాపర యుగంలో ఇక్కడ పాండవులు వనవాసం చేశారని పూర్వీకులు చెబుతుంటారు. ప్రతీ గురు, ఆదివారాల్లో ఇక్కడ జాతర జరుగుతుంది. జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ గిరిజనులే పూజారులు. ప్రతీ ఖరీప్, రబీ సీజన్ల ప్రారంభంలో రైతులు పెద్దయ్య దేవున్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆలయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వస్తుంటారు. ఆకట్టుకుంటున్న ‘జోడేఘాట్’కెరమెరి(ఆసిఫాబాద్): భూమి, నీరు, అడవి నినాదాలతో పోరాడి అసువులు బాసిన కుమురం భీం పోరుగడ్డ జోడేఘాట్ పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుమారు 35 ఏళ్లుగా ఆదివాసీలు జోడేఘాట్లో భీం వర్ధంతిని నిర్వహించి నివాళి అర్పిస్తున్నారు. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులతో నిలువెత్తు భీం విగ్రహం, స్మృతివనం, స్మృతిచిహ్నం, జల్, జంగల్, జమీన్ల ఆర్చీలను ఏర్పాటు చేసింది. సమాధి నిర్మాణం చేసింది. జోడేఘాట్ నుంచి టోకెన్మోవాడ్ వరకు తారురోడ్డు, భీం మ్యూజియం నిర్మించింది. అందులో కుమురంభీం, అతని సహచరుల ప్రతిమలు, గుస్సాడీలు చేస్తున్న నృత్యాలు, ఆదివాసీ ఆభరణాలు, ఆయుధాలు, దేవతల మండపాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జోడేఘాట్ ప్రాచూర్యంలోకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, ఏటూరు నాగారం, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజురా, బల్లార్షా, పాండర్కవడా, తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు జోడేఘాట్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇలా వెళ్లవచ్చు.. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో కెరమెరికి రెండు కిలో మీటర్లు ముందుగానే హట్టి స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి జోడేఘాట్ 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లేనప్పటికీ ప్రైవేటు వాహనాలు నడుస్తాయి. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్కు వెళ్లే మార్గంలో కెరమెరి తర్వాత వచ్చే హట్టిలో దిగాల్సి ఉంటుంది. మంచిర్యాలరూరల్(హాజీపూర్): కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పాతమంచిర్యాల అటవీ బీట్ పరిధిలోని హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ శివారు ఎంసీసీ క్వారీ లోని అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ సఫారీలో పాతమంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీబీట్ అడవులు ఉన్నా యి. 30 హెక్టార్లలో గ్రాస్ప్లాంట్, 30 హె క్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. పర్యాటకులు అడవిఅందాలు, వన్యప్రాణులను వీక్షి ంచేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. రెండున్నర గంటలపాటు 25 కిలోమీటర్ల మేర జంగల్ సఫారీ సాగుతుంది. ఆరుగురికి ఒక్కట్రిప్పుకు రూ.2,100, అదన పు వ్యక్తికి రూ.350, ట్రెక్కింగ్కు రూ.200లు తీసుకుంటున్నారు. ఉదయం 6:30, 9:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రిప్పులు ఉన్నాయి. నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లాబాసర సరస్వతీ మాత ఆలయం నిర్మల్/కడెం/సారంగపూర్: నిర్మల్ జిల్లాలో అణువణువునా ప్రత్యేకతలున్న పర్యాటక, దర్శనీయ స్థలాలు ఉన్నా యి. బాసరలో గోదారి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. నిర్మల్–భైంసా మీదుగా, నిజామాబాద్ మీదుగా బాసర చేరుకోవచ్చు. బస్సులతో పాటు రైల్వే సౌకర్యమూ ఉంది. కదిలె.. పాపహరేశ్వరుడు దిలావర్పూర్ మండలంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో వెలిసిన దర్శనీయ స్థలం కదిలె. దిలావర్పూర్ నుంచి ఘాట్రోడ్డు మీదుగా వెళ్లాలి. దిలావర్పూర్ నుంచి 4కి.మీ దూరంలో కదిలె ఆలయం ఉంటుంది. కొయ్యబొమ్మల ఖిల్లా.. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. నిమ్మనాయుడు కాలంలో వచ్చిన నకాశీలు ఇప్పటికీ ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ‘కడెం’ ఒడ్డున సేదదీరాల్సిందే.. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ దూరంలో కడెం నదిపై ప్రాజెక్టు నిర్మించారు. పాపికొండలను తలపించే పచ్చని కొండల మధ్య ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఉంటుంది. ఆ అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. ప్రాజెక్టు పక్కనే రిసార్టులు ఉన్నాయి. నిర్మల్ నుంచి 48 కి.మీ, మంచిర్యాల నుంచి 90 కి.మీ, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పుణ్యక్షేత్రాల గూడెం..నమోః సూర్య నారాయణవిహారయాత్రగా జంగల్ సఫారీ -
రహదారికి ప్రాధాన్యత!
● ఎన్హెచ్–63పై కదలిక ● కేంద్రమంత్రి పర్యటన ముందు టెండర్లు ● గత కొంతకాలంగా పనుల్లో జాప్యం ● భూములు ఇచ్చేందుకు రైతుల వ్యతిరేకతసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ‘ప్రధానమంత్రి ప్రాధాన్యత జాబితా’లో చ్చేడంతో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల వరకు నాలుగు వరుసల రహదారికి ప్రణాళిక రచించిన విషయం తెలిసిందే. చెన్నూర్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కలుపుతూ ప్రతిపాదించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక ప్రాజెక్టుల్లో ఈ హైవే చేర్చినప్పటికీ జాప్యం జరిగింది. సాంకేతిక, పర్యావరణ, అటవీ అనుమతులు, భూ సేకరణ, కోర్టు కేసులతో జాప్యం జరుగుతోంది. తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ రాష్ట్ర పర్యటన ముందు మళ్లీ పురోగతి కనిపిస్తోంది. మరోవైపు భూ సేకరణతో ప్రభావితం అవుతున్న రైతులు వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. స్థానికంగా, జిల్లా ఉన్నతాధికారులు, ఎన్హెచ్ఏఐ, పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ నిర్వాసితులు భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. అంతేగాక భూ సేకరణ, హైవే అలైన్మెంటు మార్పుపైనా హైకోర్టులోనూ ఐదు కేసులు విచారణలో ఉన్నాయి. పనులు సాగేనా?మొత్తం నాలుగు ప్యాకేజీల్లో నిర్మిస్తున్నప్పటికీ ఆర్థిక పర బిడ్లో రెండు ప్యాకేజీల్లోనే నిర్మించనున్నారు. గ్రీన్, బ్రౌన్ ఫీల్డ్, అంటూ ఇప్పటికే రెండుసార్లు అలైన్మెంట్లు మార్చారు. చివరగా గీన్ ఫీల్డ్ హైవేగానే నిర్మితం కావడంతో పంట పొలాల నుంచి రోడ్డు వెళ్లనుంది. కొద్దిమేర ప్రస్తుతమున్న రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఇక ముల్కల శివారు నుంచి బైపాస్ మందమర్రి మండలం కుర్మపల్లి క్రాస్ జంక్షన్ వద్ద ఎన్హెచ్–363కి కలుపనున్నారు. రాష్ట్ర జాతీయ రహదారుల పరిధిలోని పాత మంచిర్యాల మీదుగా, శ్రీరాంపూర్ జంక్షన్, జైపూర్, చెన్నూరు బైపాస్తో మహారాష్ట్ర సరిహద్దు వరకు పూర్తయింది. ఇక్కడ టోల్గేటు సిద్ధమైంది. అటు నుంచి ఛత్తీస్గఢ్ వరకు వెళ్లనుంది. తాజాగా అన్ని అనుమతులు రావడంతో పనులు మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయి, టెండరు పిలిచి, కాంట్రాక్టర్లతో ఒప్పందమైతే పూర్తిస్తాయిలో నిర్మాణం మొదలు కానుంది. అయితే స్థానికంగా నిర్వాసితుల వ్యతిరేకతతో పనులు సాగుతాయా? అనే సందేహాలు వస్తున్నాయి.మంచిర్యాల–లక్సెట్టిపేట రోడ్డుఆర్మూర్–మంచిర్యాల హైవే సెక్షన్ భూ సేకరణ వివరాలు(ఎకరాల్లో) ప్రభుత్వ 176.11ప్రైవేటు 1317అటవీ 38.05ప్రభావిత నిర్మాణాలు 135నిర్వాసిత కుటుంబాలు 162నిర్మించే రోడ్డు 131.895కి.మీ వ్యయం రూ.2937.36కోట్లు పట్టణాలు: ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల -
30న కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
శ్రీరాంపూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న చలో కొత్తగూడెం కార్యక్రమం చేపట్టినట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం జేఏసీ నాయకులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే విశ్వనాథ్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి పోచమల్లు, టీసీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉల్లి మొగిలి, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతీనెల 7న వేతనాలు చెల్లించాలని, బోనస్, ఈఎస్ఐ, సీఎంపీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా, నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపీనాథ్, రాజ్ కుమార్, శ్రీ విముక్తి సంఘం, నాయకురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను నియంత్రించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, వినియోగం వల్ల కలిగే నష్టాలను ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం ఇతర వివిధ రకాల పద్ధతులు, మానసిక వైద్య నిపుణుల శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ రిహ్యాబిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాలను అరికట్టేందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ ఎక్కడైనా మత్తపదార్థాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. నీట్కు పకడ్బందీ ఏర్పాట్లుమంచిర్యాలఅర్బన్: జిల్లాలో మే 4న నిర్వహించే నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నీట్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పరీక్ష కోసం కంట్రోల్రూం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరీక్ష కో–ఆర్డినేటర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రాణకోటికి కల్పవల్లి ‘ఎల్లంపల్లి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 2008 జూలై 28 మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 62 గేట్లతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ దాదాపు రూ.4,950 కోట్లతో రెండేళ్ల క్రితం పూర్తి చేశారు. ప్రాజెక్ట్ కింద 1.118 కిలో మీటర్ల మేర 4 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కింద రోజుకు 220 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. హాజీపూర్ మండలం ర్యాలీ గిరిజన గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎల్లంపల్లి జలాశయం -
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ పంపించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నా రు. ఎన్నికల హామీలను అమలు చేసి బీసీల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, అంకం సతీష్, భిక్షపతి, సల్మాన్, మహిళా నాయకురాలు లలితముదిరాజ్, రవికిరణ్, రాజం పాల్గొన్నారు. -
భూభారతితో వివాదాలు దూరం
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్వేమనపల్లి: భూభారతి చట్టంతో భూ వివాదాలు దూరమవుతాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్తో కలిసి నీ ల్వాయి రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణితో గ్రామాల్లో లక్షలాది భూ వివాదాలు తలెత్తాయని, సాదాబైనామా, ఆర్ఓఆర్, మ్యుటేషన్, అన్ని రకాల భూ సమస్యలకు భూభారతితో పరి ష్కారం దొరికిందని అన్నారు. రికార్డు ప్రకారం ఏ తప్పులు ఉన్నా మార్పులు, చేర్పులు, విరాసత్ పట్టా, పాలు పంపకాలు, దస్తావేజులు సరి చేసుకో వడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అ నంతరం 19మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చె క్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరి కృష్ణ, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సంతోష్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్ఆలీ పాల్గొన్నారు. ‘అప్పులపాలు చేసిన కేసీఆర్’వేమనపల్లి: తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పా ర్టీదైతే అనుభవించి అప్పుల పాలు చేసింది కేసీఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విమర్శించా రు. మంగళవారం నీల్వాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులపాలు చేశారని, ప్రభుత్వం ఏటా 65 వేల కోట్ల మిత్తిలు చెల్లిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సంతోష్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్ఆలీ, గాలి మధు, సత్యనారాయణ, రాజన్న పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్కు తప్పని తిప్పలు
మంచిర్యాలటౌన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. ఎల్ఎస్ఆర్లో 25శాతం రాయితీ వర్తింపు అవకాశం ఈ నెల 30వరకు కల్పించిన విషయం తెలిసిందే. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎల్1 ఆఫీసర్ లాగిన్లోకి కొన్ని రాకపోవడం, ఎఫ్టీఎల్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సమస్యలు తీర్చకపోవడంతో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఎదురవుతోంది. బుధవారం చివరి రోజు కావడంతో మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చి ఫీజు చెల్లించేందుకు తిప్పలు పడ్డారు. నేడు బసవేశ్వర జయంతి మంచిర్యాలటౌన్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 30న ఉదయం 9గంటలకు బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, వివిధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
‘ఉపాధి’లో అవకతవకలు
మందమర్రిరూరల్: మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. డీఆర్డీవో కిషన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. తనిఖీ బృందం దృష్టికి వచ్చిన వివరాలు వెల్లడించారు. మండలంలోని పది పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన పనులపై ఈ నెల 19నుంచి 28వరకు సామాజిక తనిఖీ చేపట్టారు. ఆయా పంచాయతీల్లో రూ.48వేల జరిమానామాతోపాటు రూ.34వేలు రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ కిరణ్, మండల ప్రత్యేక అధికారి అనిత, జీఎస్ ఏపీవో రజియాసుల్తానా, ఎస్ఆర్వోలు, డీఆర్వోలు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
బార్కు లక్కీ డ్రా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బార్కు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. హాజీపూర్ మండలం నమ్నూర్కు చెందిన నడిపెల్లి ధనుంజయ్రావు లక్కీడ్రాలో గెలుపొందినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. 15దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. ధనుంజయ్రావుకు ఎంపిక పత్రాన్ని అందజేశారు. సీఐ గురువయ్య, ఎస్సైలు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో దరఖాస్తు గడువు పొడిగింపుబెల్లంపల్లి: బెల్లంపల్లిలో బార్ ఏర్పాటుకు ఒకటే దరఖాస్తు రావడంతో మే 5వరకు గడువు పొడిగించినట్లు బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ జే.ఇంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 8712658785 నంబరులో, బెల్లంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మే 6న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో లక్కీడ్రా తీస్తామని ప్రకటించారు. -
జిల్లా రిసోర్స్పర్సన్లకు ఇంటర్వ్యూలు
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల్లో వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లిషు, ఉర్ధూ మాధ్యమాల్లో బోధనకు జిల్లా రిసోర్స్పర్సన్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సోమవారం మంచిర్యాల డీసీఈబీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు రిసోర్స్పర్సన్లుగా సేవలు అందించడానికి దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ కేడర్లకు చెందిన 60 మంది ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. వివిధ రకాల ప్రశ్నలకు మెరుగైన స్కోర్ సాధించిన వారిని ఎంపిక చేయనున్నారు. ఆదిలాబాద్ డైట్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సమగ్రశిక్ష శిక్ష కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్, లెక్చరర్లు శంకర్, కిషోర్కుమార్, సురేష్, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి, చౌదరి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 44 మంది ఉపాధ్యాయులను జిల్లా రిసోర్సుపర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. -
‘ఉపాధి’లో రిక‘వర్రీ’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజుల పని కల్పించి ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో రూ.లక్షలు పక్కదారి పడుతున్నాయి. ఏటా సామాజిక తనిఖీల్లో భారీగా ఆర్థిక తేడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గుర్తిస్తున్నారు. అయినా అక్రమాలు ఆగడం లే దు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో మొత్తం రూ.5లక్షలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. జిల్లాలో ఈ పథకం అమలవుతున్న 16మండలాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక ఆర్థిక తనిఖీలు మొదలు కానుంది. సోమవారం మందమర్రి మండలంలో ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఆ ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పథ కం నిధుల ఖర్చు, అందులో తేడాలు గుర్తించి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల ముందే వివరిస్తారు. కూలీల హాజరు పని దినాల నుంచి మెటీరియల్ పనులు, ఇతర నిధుల ఖర్చు పారదర్శకంగా జరిగిందా..? లేదా అని గుర్తిస్తారు. ఇక ఆన్లైన్తోపాటు మాన్యువల్ రికార్డులు పరిశీస్తున్నారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి పై స్థాయి వరకు ఎవరు బాధ్యులైతే వారిపై చర్యలు తీసుకుంటారు. వసూలు అంతంతే..తనిఖీల్లో గుర్తించిన నిధులపై మళ్లీ రికవరీ మాత్రం అంతంతగానే ఉంటోంది. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నుంచి జిల్లా ఏర్పడిన వరకు అత్యధికంగా కొన్ని మండలాల్లో 15 వ రౌండ్ వరకు సభలు పూర్తి కాగా, రూ.లక్షల్లోనే నిధుల అవకతవకలు బయటపడ్డా యి. ఇప్పటికీ ఆయా నిధుల రికవరీ పూర్తి కావడం లేదు. గతేడాది పరిశీలిస్తే ఒక్క మందమర్రి మండలంలో రూ.47వేలకుపైగా తేడాలు గుర్తిస్తే, అందులో రూ.4,539 వసూలు అయ్యాయి. మిగతా ఏ మండలంలోనూ పైసా వసూలు కాలేదు. ఈ ఏడాది లోనూ డబ్బులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏప్రిల్ నుంచే మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాదికి సంబంధించి మొత్తం రూ.5లక్షలకు పైగా గు ర్తించగా, ఇందులో ఇంకా రూ.4లక్షలకు పైగా మిగిలి ఉన్నాయి. ఇక అంతకుముందు తనిఖీల్లో గుర్తించిన మొత్తం రూ.లక్షల్లో నే ఉంది. ఏటేటా సామాజిక సర్వేలో అవకతవకలు గుర్తిస్తున్నప్పటికీ ఆ మేరకు రికవరీ జరగడం లేదు.2024–25లో గుర్తించినవి విలువ (రూ.ల్లో)మండలం రౌండ్ గుర్తించింది మిగిలింది భీమిని 13 90046 90046 మందమర్రి 14 47387 42848 హాజీపూర్ 03 10428 10428 భీమారం 03 15701 15701 కన్నెపల్లి 03 20364 20364 జన్నారం 14 97278 97278 కాసిపేట 14 18166 18166 వేమనపల్లి 14 975 975 జైపూర్ 14 41632 41632 చెన్నూరు 14 51131 51131 దండేపల్లి 14 6507 6507 కోటపల్లి 15 26166 26166 లక్సెట్టిపేట 14 44088 44088 నెన్నెల 14 3872 3872 తాండూరు 15 13084 13084 బెల్లంపల్లి 15 14237 14237 మొత్తం 5,00,382 4,95,843 నోట్:మందమర్రి మండలంలో రూ.4,539 రికవరీ అయ్యాయి. పనుల్లో ఏటా రూ.లక్షల్లో అవకతవకలు కింది స్థాయి సిబ్బంది పాత్రే అధికం -
కేంద్రం హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం
చెన్నూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారుల నిర్మాణా లు చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 63వ జాతీయ రహదారి జగ్దల్పూర్ నుంచి నిజామాబాద్ రోడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. నిజామాబాద్ ఆర్మూర్ వయా మంచిర్యాల వరకు రూ.3376 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిందని తెలిపారు. ఈ పనులు పూర్తయి తే మంచిర్యాల నుంచి నిజామాబాద్కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. శ్రీరాంపూర్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు జాతీయ రహదారి–363 నిర్మాణానికి రూ.2497 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వరంగల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు రూ.2606 కోట్లతో ప్రారంభం అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్మాణం చేపడితే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తామే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ఆశోక్, పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎతం శివకృష్ణ, నాయకులు వంశీగౌడ్, శంకర్, రాజు పాల్గొన్నారు. -
పరిష్కారంలో అలసత్వం వద్దు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అధికారులకు సూచనలు మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ● చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామ రైతులు అస్నాద్ శివారులో 55ఎకరాల భూమికి సంబంధించి విరాసత్ పట్టా అమలు చేయాలని దరఖాస్తు అందజేశారు. ● మంచిర్యాలకు చెందిన నంద్యాల చంద్రమౌళి రెడ్డి మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, రిజిష్టర్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు, చట్ట వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా ఇందిర మ్మ ఇల్లు మంజూరు కాలేదని, పేదలకు మంజూ రు చేయకుండా ఉన్నవాళ్లకే మంజూరు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడం లేదని మందమర్రి మండలం కోటేశ్వర్పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. ● తన కుమారుడు కొడిత్యాల లక్ష్మినారాయణకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా మంచిర్యాల కన్సల్టింగ్ ఏజెంటు శ్రీనివాస్, ఆర్డీవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏడాది నుంచి వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన కొడిత్యాల వెంకటశివప్రసాద్ ఫిర్యాదు చేశారు. జన్నారం: జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ వైకుంఠధామం కోసం 1.25ఎకరాలు కొనుగోలు చేశామని, గ్రామానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, అక్రమ పట్టా రద్దు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ రవి, మాజీ సర్పంచ్ ఆశరాజ్, ఏఎంసీ డైరెక్టర్ రాజన్న, మాజీ ఎంపీటీసీ వెంకటరాజం కోరారు. 41 కాదు.. 42కిలోలు జోకుతున్నారు.. మొదట కొనుగోలు చేసిన ధాన్యం బస్తాకు 41కిలోల చొప్పున తూకం వేశారు. మిల్లుకుపోయినా లారీ ఇంకా బస్తాలు దించుకోకుండా అక్కడే ఉంది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో 41కిలోలు కాదు 42కిలోలు జోకుతున్నారు. తేమ 15శాతంలోపు వచ్చినా, తూర్పాల పట్టినా, చెత్తాచెదారం లేకుండా చేసినా బస్తాకు 42కిలోల ధాన్యం జోకుతున్నారు. తాలు, తప్ప ఉన్నా, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా అందరికీ ఒకేలా 42కిలోలు తూకం వేస్తున్నారు. క్వింటాల్కు నాలుగు కిలో చొప్పున లారీ లోడు ధాన్యానికి రూ.30 వేల వరకు నష్టపోతున్నాం. అధికారులే కిలోకు రెండు కిలోలు జోకాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చిన రైతుల నుంచి తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు చేయాలి. – రైతులు ఆర్.శ్రీకాంత్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, జే.మల్లేష్, సతీష్, కిష్టాపూర్, జైపూర్ -
మామిడి మద్దతు ధరకు కృషి
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ● మ్యాంగో మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం బెల్లంపల్లి: మామిడికాయలకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లిలో మ్యాంగోమార్కెట్, కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మామిడి రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కష్ట, నష్టాలను రైతులు తన దృష్టికి తేవడంతో క్రయవిక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం ట్రేడర్లతోపాటు ఫ్రూట్ ఎక్స్ కంపెనీతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు వివరించారు. రైతులు వివిధ రకాల పండ్ల తోటలు పెంపకం చేపట్టి ఫలసాయాన్ని ఇదే మార్కెట్లో అమ్ముకుని లాభాలు గడించవచ్చని సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు పాటు పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎండీ.షాబుద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జి కార్యదర్శి ఎస్.భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కారుకూరి రాంచందర్, మాజీ ఎంపీటీసీలు ముడిమడుగుల మహేందర్, హరీష్గౌడ్, కాంగ్రెస్ నాయకులు బత్తుల రవి, నాతరి స్వామి, ఫ్రూట్ కంపెనీ యజమాని, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
దండేపల్లి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు అన్నారు. మండలంలోని నంబాల గ్రామంలో సీతారామాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ఐక్యతగా చందాలు పోగు చేయడం, దానికి తోడు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. నంబాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని, ఆలయ అభివృద్ధి కూడా కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజల అవసరాలకే ఇసుక రీచ్
జైపూర్: జిల్లా ప్రజల అవసరాలు తీర్చడానికి ఇందారం వద్ద మరో ఇసుక రీచ్ అందుబాటులోకి తీ సుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపా రు. మండలంలోని ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను సోమవారం ఆయన మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, పంచాయతీ కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా ఐదు..మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రజలు అవసరాలకు సరిపడా ఇసుక లభ్యతకు కొత్తగా ఐదు ఇసుక రీచ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి–1, వేంపల్లి–2, తాళ్లపల్లి, ఇందారం ఇసుకరీచ్లను ప్రారంభించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ ఏడీ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: భవిష్యత్లో విద్యార్థులు ఉ న్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచి ర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలతో కలిసి ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల కళాశాల వసతిగృహాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇంటర్మీడియెట్ విద్యార్థులు గురుండ్ల రవీందర్, ఎస్.అభినయ్లను శాలువాలతో సన్మానించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అ భివృద్ధి అధికారి పురుషోత్తంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ డీడీ దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధి కారులు మోసీన్ అహ్మద్, సుధాలక్ష్మి పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
క్షయవ్యాధి నిర్మూలనకు కృషి
జైపూర్: జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ఓల్డ్ఏజ్ హోమ్స్, భవన కార్మికులు, టీబీ వ్యాధిగ్రస్తులకు ఇంటిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా వైద్యం అందిస్తామని జిల్లా వైద్యాధికారి హరీశ్రాజు తెలిపారు. జైపూర్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. జిల్లాలో 998 మంది టీబీ వ్యాధిగ్రస్తులు వైద్యం పొందుతున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో అంబులెన్స్ ద్వారా వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. వైద్యులు సుధాకర్నాయక్, ప్రసాద్, ముస్తఫా, జిల్లా అక్షయ ప్రోగ్రాం అధికారి సురేందర్, మాస్మీడియా అధికారి వెంకటేశ్వర్, వైద్యసిబ్బంది వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి రహిత పాలనే లక్ష్యం
● బాల్క సుమన్ హయాంలో ఇసుక దందా ● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో అవినీ తి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బాల్క సుమన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇసుక దందా విచ్చలవిడిగా సాగిందని, తాను గెలుపొందిన తర్వాత ఇసుక దందాకు అడ్డుకట్ట వేశామని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్స్లో సోమవారం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీఆర్ తనకు తన కొడుకు, కూతురికి ఫామ్హౌజ్లు కట్టించారు తప్ప ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉంటే బీఆర్ఎస్ పాలనలో 60 వేల ఉద్యోగాలు పోయాయని అన్నారు. ఏడాదిన్నర పాలనలో చెన్నూర్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా బాల్క సుమన్ పదేళ్లు ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్టీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, రామ్భూపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో బాలింత..
కాసిపేట: అనారోగ్యంతో బాలింత మృతిచెందింది. మండలంలోని మల్కేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మల్కేపల్లికి చెందిన పెరుగు రజిత(28), వెంకటేశ్ భార్యభర్తలు. పెళ్లయినప్పటి నుంచి రజిత సికిల్సెల్ వ్యాధితో బాధపడుతోంది. ఈనెల 8న కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చింది. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆస్పత్రిలో ఉండగానే మూడుసార్లు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు వైద్యులతో వాదనకు దిగినట్లు సమాచారం. -
తప్పుడు పత్రాలతో కొలువులు!
● ఆదిలాబాద్ జిల్లా నివాస ధ్రువపత్రాలతో బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు ● ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల నుంచి దరఖాస్తులు ● నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఇతర రాష్ట్రాల యువకులు ● ఇచ్చోడలో ముగ్గురిపై కేసు ● ఆలస్యంగా వెలుగులోకి ఘటనఇచ్చోడ: ఇతర రాష్టాల నిరుద్యోగ యువకులు కొందరు ఆదిలాబాద్ జిల్లా నివాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు సాధించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నివాసముంటున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందారని సమాచారం. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ద్వారా బయటకు రావడంతో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఆదివారం ఇచ్చోడలో కేసు నమోదైంది. ఎస్బీ అధికారుల ఫిర్యాదు మేరకు సహని సురాజ్, డాగ్ విజయ్, విశ్వుకర్మలపై కేసులు నమోదు చేశారు. మీసేవ ద్వారా దరఖాస్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో నివాసముంటున్నట్లు దరఖాస్తులు చేసుకున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ఆధార్, రేషన్ కార్డులు పాస్ఫొటోతో జిరాక్స్ పత్రాలు జతచేసి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి మీసేవ ద్వారా ధ్రువీకరణపత్రం జారీ చేస్తారు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తప్పుడు ఆధార్, రేషన్ కార్డులను సృష్టించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. భారీగా దరఖాస్తులు ఇచ్చోడ మండలంలో భారీగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఒక్క ఇస్లాంనగర్ గ్రామం నుంచే 189 మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ గతంలో కొకస్మన్నూర్ పంచాయతీలో ఉండేది. ఇటీవల సాథ్నంబర్, ఇస్లాంనగర్ గ్రామాలు కలిసి నూతన పంచాయతీగా ఏర్పాటైంది. ఇస్లాంనగర్లో మొత్తం జనాభా మూడు వందల లోపు ఉంటుంది. ఇక్కడ ఉన్నత చదువులు చదువకున్న వారిని సైతం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం ఇస్లాంనగర్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా లేరు. అఽధికారులు ఆ దరఖాస్తులను రిజెక్ట్ చేశారే తప్ప, తప్పుడు ఆధార్, రేషన్కార్డులు ద్వారా నివాస ధ్రు వీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు గుర్తించకపోవడం వారి తప్పిదం కనిపిస్తుంది. అభినవ్ యాదవ్ తండ్రి ప్రేమంత్హెచ్యాదవ్. ఇతడు ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్లో ఉంటున్నట్లు 2024 ఆగస్టు 14న నివాస ధ్రువపత్రం కోసం మీసేవ ద్వారా నంబర్(ఆర్సీ022411234864) దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి రిజెక్ట్ చేశారు. మరోసారి నిజామాబాద్ జిల్లా నుంచి మీ సేవ ద్వారా నంబర్ (ఆర్సీ 022511946191) ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి గతమార్చి 15న రిజెక్ట్ చేశారు.సునీల్యాదవ్ తండ్రి రామనంద్ యాదవ్. అతనికి 2024 డిసెంబర్ 23న బీఎస్ఎఫ్లో ఉద్యోగం వచ్చింది. కాల్ లెటర్లో ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ నివాసిగా అడ్రస్ ఉంది. కానీ ఇతను ఇక్కడ లేకపోవడం, గ్రామం నుంచి బీఎస్ఎఫ్, ఆర్మీలో ఉద్యోగం చేసేవారు లేరని గ్రామస్తులు తెలిపారు. సదరు వ్యక్తి ఇస్లాంనగర్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం పొంది ఉద్యోగంలో చేరడం గమనార్హం.రిజెక్ట్ అయిన నంబర్ ద్వారానే మార్ఫింగ్ అధికారులు రిజెక్ట్ చేసిన దరఖాస్తు నంబర్తో నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇతరుల పత్రాన్ని రిజెక్ట్ అయిన దరఖాస్తు పత్రం నంబర్ ఆధారంగా మార్ఫింగ్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. గత కొన్నిరోజుల నుంచి మీసేవ కేంద్రాలు ఓటీపీ పద్ధతి ద్వారా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఓటీపీ ద్వారా మీసేవలో లాగిన్ కావచ్చు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్లో నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా మీసేవల నుంచి దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తులను రిజెక్ట్ తర్వాత కొందరు మీసేవ నిర్వాహకులు నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటాం తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగాలు సాధించినట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై విచారణ చేపట్టాలని స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశాం. – వినోద్కుమార్, ఆర్డీవో -
కర్రెగుట్టలో కూంబింగ్ ఆపాలి
ఉట్నూర్రూరల్: కేంద్రప్రభుత్వం చర్చలకు స్పందిస్తే మేము కూడా సిద్ధమేనని సీపీఐ మావోయిస్తు పార్టీ ప్రకటించినందన కర్రెగుట్టలో చేపట్టిన పోలీ సుల కూంబింగ్ ఆపాలని శాంతి చర్చల కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ ఆత్రం భుజంగ్రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ బానోత్ రామారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ‘ఆపరేషన్ కగార్’అంతర్యుద్దాన్ని కేంద్రం మానుకోవాలన్నారు. నక్సలైట్ల హింసలో, పోలీసుల ఎన్కౌంటర్లో, ఉగ్రవాదుల కాల్పుల్లో సామాన్య ప్రజలు సమిధలు అవుతున్నారన్నారు. కర్రెగుట్టలో పోలీసులు చేపట్టిన కూంబింగ్తో ఆదివాసీ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. పోలీసుల కాల్పుల చర్యలను విరమించుకోవాలని, శాంతి చర్చలకు అవకాశం ఇ వ్వాలని కోరారు. సమావేశంలో నేతావత్ రాందా స్, బండి విజయ్కుమార్, దిలేశ్ చౌహాన్, జాదవ్ రాంకిషన్, పవార్ గంగారాం నాయక్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి●
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలను ఖుష్బూ గుప్తా స్వీకరించారు. అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. పెంబి మండలం గుమ్మనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని టేకం భీంరావ్, తాండూర్ మండలం కిష్టంపేట గ్రామస్తులు తమ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్వో సందీప్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు. పోలీసుల అదుపులో మైనర్ బాలుడుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు పదేళ్లలోపు ఇద్దరు బాలురు, ఒక బాలికను నిర్బంధించాడు. తన నివాసానికి తీసుకెళ్లి తలుపు పెట్టి నిర్బంధించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆ ము గ్గురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మైనర్ బా లుడిని అదుపులో తీసుకుని సోమవారం జువైనెల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో కిడ్నాప్ కేసుతోపా టు అక్రమ నిర్బంధం, పోక్సో కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: తండ్రి మందలించాడని కొడుకు షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో ఈఘటన చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. ఉట్నూర్లోని శాంతినగర్ కాలనీకి చెందిన చౌహాన్ రాంకుమార్ కుమారుడు చౌహాన్ సాయి (20) ఇంటర్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పని చేసుకోవాలని తండ్రి మందలించాడు. క్షణికావేశంలో ఈనెల 26న రాత్రి ఇంట్లో అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్కు పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి రాంకుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక యువకుడు.. తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన యువకుడు పిట్లెవాడ్ లక్ష్మణ్ (25) అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి కథనం ప్రకారం..లక్ష్మణ్ గత రెండేళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకుని ఫైనాన్స్పై ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కిరాయికి ట్రాక్టర్ నడవకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదు. దీంతో ట్రాక్టర్ను అమ్మి కిస్తీలు కట్టాడు. గతంలో తీసుకున్న రూ.2 లక్షల అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి అందరు నిద్రపోయాక ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ట్రెయినీ ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
● సీఎంఓ కిరణ్ రాజ్కుమార్ శ్రీరాంపూర్/మందమర్రిరూరల్/రామకృష్ణాపూర్: సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కంపెనీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని సి ంగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) కిరణ్ రాజ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఆర్కే 8 డిస్పెన్సరీ, నస్పూర్ డిస్పెన్సరీ, మందమర్రిలోని కేకే డిస్పెన్స రీ, రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రుల ను సందర్శించారు. వార్డులను సందర్శించి వైద్య సేవలు, చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది సమయపాలన పా టించాలని సూచించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్తో కలిసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేసవి దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఆయనను ఆయా ప్రాంతాల్లో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) బీభత్సా, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రె డ్డి, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, డీవైసీఎంఓ రమేశ్బాబు, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, వైద్యులు వేద వ్యాస్, మురళీధర్, లోక్నాథ్ రెడ్డి, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఐఈడీ ఎస్ఈ కిరణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ అధి కారి హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు. ఉద్యోగులకు వైద్యసేవలు జైపూర్: పవర్ ప్లాంట్ ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎంఓ కిరణ్రాజ్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో డిస్పెన్సరీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో వసతులు, ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్ రవీందర్, శ్యామల ఉన్నారు. -
పాన్షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
నిర్మల్టౌన్: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్, శాంతినగర్, చైన్గేట్ సమీపంలోని పలు పాన్షాపుల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓసీబీ పేపర్స్ లభ్యం కాగా, సాధారణంగా వీటిలో గంజాయితో చుట్టి కాల్చడానికి ఈ పేపర్లు వాడతారని ఏఎస్పీ తెలిపారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ సేవించిన, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్సై రవి, ప్రొబేషనరీ ఎస్సై జుబీర్, సుప్రియ, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఎస్టీపీపీకి పలు విభాగాల్లో బహుమతులు
జైపూర్: ప్రపంచ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపార్టుమెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ని ర్వహించిన వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్టీపీపీ సే ఫ్టీ బృందం రెండు బహుమతులు గెలుపొందింది. సేఫ్టీ పోస్టర్ డ్రాయింగ్ కాంపిటీషన్లో శ్రీ నాథ్ బహుమతి గెలుపొందగా, ఎస్టీపీపీ నాటి క బృందం రక్షణపై అవగాహన కల్పిస్తూ నాటికను ప్రదర్శించగా మరో బహుమతి గెలుపొందింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్రా వు, డాక్టర్ సంజయ్ చతుర్వేది, హేమచంద్ర చే తులమీదుగా బహుమతులు అందుకున్నారు. డీజీఎం పంతులా, ఎస్ఈ సేఫ్టీ సురేశ్, డివైఎస్సీ శ్రీనాథ్, పవర్మేక్ సేఫ్టీ అధికారి శ్రావణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికకుంటాల: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ధ్వర్యంలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రాజన్న సిరిసిల్లలో వుషు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. కుంటాలలోని విజయసాయి పాఠశాల విద్యార్థి జాదవ్ ఆర్యన్ సబ్జూనియర్ వుషు ఛాంపియన్ పోటీల్లో జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తమిళనాడులోని తిరుచెంగోడేలో మే 26 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనున్నాడు. -
అడవి పందుల దాడిలో ముగ్గురికి గాయాలు
ఆసిఫాబాద్రూరల్: మండలంలో కౌటగూడలో సోమవారం అడవిపందుల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కుమురం రవి, ప్రేమలత, రాజుబాయిలు ఉదయం 10 గంటల ఇంటి ముందు కూర్చొన్నారు. వీరిపై ఒక్కసారిగా అడవిపందులు వచ్చి దాడి చేయగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రేమలత, రాజుబాయిను మంచిర్యాలకు రెఫర్ చేశారు. యువౖ రెతు కూడా.. కోటపల్లి: పంట కాపలా వెళ్లిన యువరైతు అడవి పందుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని బోరంపల్లికి చెందిన దుర్గం శేఖర్కు రాంపూర్ శివారులో వరి పొలం ఉంది. అడవి పందుల బెడద కారణంగా ఆదివారం రాత్రి పంటకు కాపలాగా ఉండేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అడవిపందులు ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి రైతులు వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు..
నెన్నెల: ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని కొత్తగూడం గ్రామానికి చెందిన యువకుడు దుర్గం బాలస్వామి(26) వ్యవసాయ పని కోసం తన సొంత ట్రాక్టర్తో సోమవారం నెన్నెలకు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ కింద బాలస్వామి శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. గ్రామస్తులు వచ్చి అతడిని బయటకు తీసి 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తమ్ముడు జీవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్య ప్రసన్న, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రిమ్స్లో చికిత్స పొందుతూ ఒకరు.. ఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా పల్సితాండకు చెందిన జాదవ్ మనోజ్ (38) రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు టూటౌన్ ఏఎస్సై ఖైసర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోజ్ మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్లో ఉదయం చేర్పించగా, రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య జయశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
వేసవిలో జీవాలు పైలం
● మేత, దాణా సరిపడా అందించాలి ● జాగ్రతలు తప్పనిసరంటున్న పశువైద్యాధికారి సతీశ్ చెన్నూర్రూరల్: వేసవిలో పాడి పశువులు, జీవాల పోషణపై జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో.. పాడి పశువులకు వేసవిలో మేత, దాణాను సరిపడా అందించాలి. పచ్చిమేత దొరకని సమయంలో ఎండుమేత దీంతోపాటు ఎక్కువగా దాణాను ఇవ్వాలి. పశువులకు ఎల్లవేళలా పరిశుభ్రమైన చల్లని నీరు లభించేలా చూడాలి. మేత, నీరు సరిపడా ఉంటే పాడి పశువులు వేసవిలో కూడా పాలు బాగా ఇస్తాయి. ఎదకొచ్చి చూలు కడుతాయి. వేసవిలో పాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే పాడి పరిశ్రమకు లాభదాయకం. దీనికోసం పశువుల షెడ్లు(కొట్టాల) వద్ద చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. వీలైతే షెడ్డు(కొట్టాల)పై గడ్డిని కప్పి ఉంచాలి. షెడ్ల చుట్టూ తడికెలు, గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లాలి. పశువులపై మధ్యాహ్నం రెండు, మూడుసార్లు నీళ్లు చల్లితే మంచిది. గేదెలను చెరువులకు పంపి మధ్యాహ్నం కొంతసేపు అందులో ఉండనివ్వాలి. కొట్టాల చుట్టూ పెద్ద చెట్లు ఉంటే లోపల చల్లగా ఉంటుంది. ఈ పద్ధతుల్ని పాటిస్తే పాలు ఎక్కువగా ఉండటమే కాకుండా పశువులు ఎదకొచ్చి చూడి కడుతాయి. అలా అవి సంవత్సరం పొడవునా ఈని పాలిచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం పాలు పితికే ముందు పశువును, పొదుగును చల్లని నీటితో కడిగితే మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వేసవిలో గొర్రెలు, మేకల్ని జత కలిపి చూడి కట్టించాలి. మూడు నెలల వయసు దాటిన పిల్లలను తల్లుల నుంచి వేరుచేయాలి. పిడుదులు, గోమార్లు లేకుండా మూడు వారాలకోసారి మందు కలిపిన నీటిలో గొర్రెలను తడిపి తీయాలి. అమ్మతల్లి(బొబ్బ, మశూచి) టీకాలు, చిటుక రోగం టీకాలను పిల్లలకు తప్పకుండా వేయించాలి. మధ్యాహ్నం పూట ఎండ వేడిమికి మేతకు బయట మేపకపోవడం మంచిది. బయట మేసే సమయంలో చెట్ల నీడ, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలి. నట్టల నివారణ మందులను పశువైద్యుడి సలహా మేరకు వినియోగించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో పశువులను, జీవాలను కాపాడుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన తొండకూరి సాయన్న (45) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో నిర్మల్ నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్తున్నాడు. ఆటోను అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్ల కౌట్ల(బి) శాంతినగర్ మూలమలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయం కాగా 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆదివారం అధికారులకు దావత్!?
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, కోటపల్లి, హాజీపూర్ తదితర మండలాల్లో శని వారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతుంటే.. అధికారులు మా త్రం ఆదివారం మిల్లర్ల దావత్లో మునిగితేలడం వివాదాస్పదమైంది. వేంపల్లి శివారులోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రారైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఏర్పాటు చేసిన ఈ దావత్లో ఒక ఉన్నతాధికారితోపాటు సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధా న్యం సరఫరా, మిల్లింగ్ తర్వాత సీఎంఆర్ బియ్యం స్వీకరణ వంటి అంశాలకు సంబంధించిన అధికా రుల హాజరు, మిల్లర్లతో సన్నిహిత సంబంధాలపై ఆనుమానాలను రేకెత్తిస్తోంది. మిల్లర్ల తిరకాసు కారణంగా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్నారు. మిల్లులకు ధాన్యం తరలింపులో ఆలస్యం చేస్తున్నారు. లారీలు రోజుల తరబడి మిల్లుల వద్ద నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలను సందర్శించాల్సిన అధికారులు మిల్లర్లతో దావత్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర
జన్నారం/బెల్లంపల్లి/కోటపల్లి: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, తాండూర్, కోటపల్లి మండలాల్లో శనివారం రాత్రి వరణుడు అన్నదాతపై కన్నెర్రజేశాడు. అకాల వర్షంతో కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. మామిడి కాయలు నేలరాలాయి. జన్నారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోగా, బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో మామిడి కాయలు గాలి దుమారంతో నేలరాలాయి. ఈ ప్రకృతి విపత్తు రైతులను ఆర్థక దెబ్బతోపాటు మానసిక ఆఘాతంలోకి నెట్టింది. రాత్రి 11 గంటల సమయంలో జన్నారం మండలంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వరదలో కొట్టుకుపోయింది. పొనకల్, ఇందన్పల్లి, మొర్రిగూడ, కవ్వాల్, రేండ్లగూడ వంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, కొన్ని చోట్ల నీటిలో కొట్టుకుపోయింది. ఆలస్యంగా కల్లాల వద్దకు చేరుకున్న రైతులు ధాన్యం కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన అ కాల వర్షం, గాలి దుమారంతో మామిడి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. గాలి దుమారం కారణంగా చెట్లపై ఉన్న మామిడి కాయలు నేలరా లాయి. మరో వారంలో కాయలను సేకరించాలని ఆశించిన రైతులు, వ్యాపారులకు ఈ విపత్తు ఆర్థిక దెబ్బతీసింది. ప్రభుత్వం స్పందించి, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, మామిడి రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. కోటపల్లి మండలంలో ఆకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. కుప్పపై నిలిచిన నీటిని ఎత్తివేస్తున్న మహిళపొనకల్ మార్కెట్ యార్డులో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం అకాల వర్షంతో వరి ధాన్యం వరదపాలు నేలరాలిన మామిడి కాయలు ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకోలు -
ప్రశాంతంగా మోడల్స్కూల్ ప్రవేశ పరీక్ష
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొ త్తం 1,686 మంది విద్యార్థులకు 1,365 మంది హాజరయ్యారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వర కు పరీక్షలు జరిగాయి. 6వ తరగతి పరీక్ష కో సం 8 పరీక్ష కేంద్రాల్లో 1,021 మంది విద్యార్థులకు 815 మంది హాజరయ్యారు. ఏడో తరగతిలో 299 మందికి 265 మంది, ఎనిమిదో తరగతిలో 212 మంది విద్యార్థులకు 172 మంది, 9వ తరగతికి 126 మంది 99 మంది, పదో తరగతిలో ప్రవేశ పరీక్షకు 28 మందికి 14 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో యాదయ్య వివరించారు. -
సర్కారు బడిలో వేసవి శిక్షణ
● 12 రోజులు నిర్వహణ ● జిల్లాలో 108 పాఠశాలలు ఎంపిక మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాల్లో రాణించేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు 15 నుంచి 20 రోజులపాటు(12 వర్కింగ్ డేస్) వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో విద్యతోపాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. జిల్లాలో ఎలాంటి శిక్షణ నిర్వహించాలనే అంశాలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే మే 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 12,600 మంది విద్యార్థులు జిల్లాలో 108 పాఠశాలల్లో 12,600 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, ధ్యానం, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు, సైన్స్ ప్రయోగాలు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఎంతోపాటు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో వలంటీర్లు రోజుకు మూడు గంటలపాటు అంశాలపై శిక్షణ ఇస్తారు. 40 మంది విద్యార్థులకు ఒక వలంటీర్ను నియమిస్తారు. ఒక్కో ఇన్స్ట్రక్టర్కు రూ.6 వేల గౌరవ వేతనం అందిస్తారు. ఇందుకు రూ.50 లక్షల బడ్జెట్ అంచనా వేశారు. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. -
కాంగ్రెస్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గం అడ్వైజర్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పీసీసీ సభ్యుడు రామ్ భోపాల్తో కలిసి రాఘవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ స్థాయి నుంచి గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో పటిష్టం చేయాలన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలను నాయకత్వం గుర్తిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. -
ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?
● స్ట్రక్చరల్ ఒప్పందాలకు కలగని మోక్షం ● ఉత్తర్వుల జారీలో సింగరేణి జాప్యం ● నష్టపోతున్న కార్మికులు ● గుర్తింపు సంఘం ఒత్తిడికి డిమాండ్శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశాలు చాలా కాలం తర్వాత ఫలప్రదమయ్యాయి. అనేక డిమాండ్లపై యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాల అమలులో జాప్యం కార్మికులను నిరాశకు గురి చేస్తోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆమోదించిన డిమాండ్లు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి. సమావేశాల పునరుద్ధరణఐదేళ్లుగా నిలిచిన స్ట్రక్చరల్ సమావేశాలు, 2024లో ఏఐటీయూసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 24న డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్), మార్చి 6, 2025న సీఎండీ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు మెడికల్ అన్ఫిట్ కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు, స్వంత ఇళ్ల కార్మికులకు క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రస్తావించారు. కమిటీల జాప్యంసొంత ఇంటి పథకం, పెర్క్స్పై పన్ను మినహాయింపు, విజిలెన్స్ కేసుల పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేయాలని యజమాన్యం నిర్ణయించింది. అయితే, కమిటీల ప్రక్రియలో జాప్యం నివారించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యజమాన్యం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, కమిటీల నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కార్మికులు కోరుతున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు కార్మిక సంక్షేమానికి ఆశాకిరణంగా నిలిచినప్పటికీ, ఒప్పందాల అమలులో జాప్యం కార్మికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. యాజమాన్యం ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి.. కంపెనీ స్థాయిలో డైరెక్టర్ (పా), సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశంలో జరిగిన ఒప్పందాలపై యజమాన్యం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. జాప్యం సరికాదు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చాలా కాలంగా కార్మికవర్గం ఎదురుచూస్తుంది. ఉత్తర్వుల కోసం యజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. – కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శిఒప్పందాలలో జాప్యంయజమాన్యం కొన్ని డిమాండ్లకు బేషరతుగా ఒప్పుకుంది. మరికొన్నింటిపై కమిటీలు ఏర్పా టు చేస్తామని చెప్పింది. ప్రమోషన్లలో సర్వీసు నిబంధనల మార్పు, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజె క్టు కోడ్ల విభజన, హైదరాబాద్లో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ వంటి ఒ ప్పందాలు కుదిరాయి. మైనింగ్ స్టాఫ్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ డిమాండ్ పరిష్కా రం కోసం వీరంతా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు. జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్కు సంబంధించిన అంశంలో ఏ1 గ్రేడ్లో 5 సంవత్సరాల సర్వీసు చేసి ఉంటేనే వారికి ఎగ్జిక్యూటీవ్ గా పదోన్నతి కల్పిస్తుండగా దాన్ని మార్చుతూ ఏ గ్రేడ్లోనే 5 సంవత్సరాలు సర్వీసు ఉన్న కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పందమైంది. కాని దీనికి కూడా ఉత్తర్వులు రాలేదు. డిస్మిస్ కార్మికులందరికీ 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక సంవత్సరం 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పించడానికి యజమాన్యం ఒప్పుకుంది. ఈ ఒప్పందాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది. -
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలో ని నర్సింగాపూర్, నంనూర్, గుడిపేటలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్దీపక్, నంనూర్, దొనబండ, హాజీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఆదివారం వేర్వేరుగా సందర్శించారు. శనివా రం రాత్రి గాలి దుమారంతోపాటు కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని తెలుసుకున్నారు. కేంద్రాల్లోని ధాన్యం తూకం, టాబ్లో నమోదు, ధాన్యం తరలింపు, మిల్లుల్లో అన్లోడింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యంను నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు, హస్క్ రీమూవర్లు, తేమ మీటర్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
చెన్నూర్/రామకృష్ణాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెన్నూర్, రామకృష్ణాపూర్లో ఆదివా రం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చెన్నూర్ నియోజకవర్గంలో 40 ఏళ్లు వివేక్ కుటుంబ సభ్యులే అధికారంలో ఉన్నా ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో చెన్నూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది తప్ప 18 నెలల్లో వివేక్ ఒక్క రూపాయి తీసుకురాలేదని తెలిపారు. తన హయాంలో మంజూరైన నిధులకు పేరుమార్చి తాను తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవిపై శ్రద్ధ చూపిస్తున్నారే తప్ప, నియోజకవర్గ అభివృద్ధిపై ఆసక్తి లేదని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఇక ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మందమర్రి ఆర్వోబీ, క్యాతన్పల్లి ఫ్లైఓవర్ వంటి పనులను వివేక్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై దశలవారీ ఆందోళనలు, మెంబర్షిప్ డ్రైవ్, కమిటీల ఏర్పాటు చేపడతామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లోని రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేశ్, రాంలాల్గిల్డా, మంత్రి బాపు, మోతె తిరుపతి, నవాజ్, కృష్ణ, ఆరీఫ్, సుదర్శన్గౌడ్, బడికల సంపత్, జాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ -
కల్మలపేటలో వృద్ధుడి హత్య!
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు వేమనపల్లి: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వృద్ధుడు హత్యకు గురైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కల్మలపేటకు చెందిన బద్ది లచ్చయ్య (64) మొదటి భార్య మధునక్క మృతి చెందగా లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు నలుగురు కుమారులు నారాయణ, పోచన్న, రాములు, తిరుపతి ఉన్నారు. లచ్చయ్య కౌలు వ్యవసాయం, గుడుంబా అమ్ముకుంటూ అదేఇంట్లో వేరే గదిలో ఉంటున్నాడు. శనివారంరాత్రి చిరుజల్లులు కురుస్తుండగా తన ఎక్స్ఎల్ వాహనంపై బయటకు వెళ్లివచ్చాడు. తెల్లారేసరికి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన కోడలు సమ్మక్క ఏడుస్తూ కొడుకులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు ఉపయోగించిన ఎడ్లబండికి ఉండే గడుగొయ్య అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్ పరిశీలించారు. -
● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 15 బ్యాచ్లు ● ఉమ్మడి జిల్లాలో 1,450 మందికి తర్ఫీదు
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యావ్యవస్థలో నూతనంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా విద్యాబోధన అందించాలని భావించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమోన్నత పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నేటి నుంచి ఆన్లైన్ మాధ్యమంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు 15 బ్యాచ్లను తయారు చేశారు. ఒక్కో బ్యాచ్కు 350 నుంచి 400 మంది టీచర్లు క్లాసులు వినేలా ప్రణాళికలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులు ఈ నెల 26, 28 తేదీల్లో ఏఐటూల్స్పై శిక్షణ పొందనున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ లోకల్ బాడి పాఠశాలల్లో ఎంపిక చేసిన 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ఏఐ విద్య కొనసాగుతుండగా కొంతమార్పు వచ్చింది. రీడింగ్, రైటింగ్ స్కిల్స్ పెరిగాయి. గణితంలోనూ లెక్కలు చేయగలుగుతున్నారు. ఇదే తరహాలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ విద్యాబోధన అందించాలని గిరిజన సంక్షేమశాఖ సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మే 30 వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,560 మంది ఉపాధ్యాయులు ఏఐపై శిక్షణ తీసుకోనుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గల 1,450 మంది ఆన్లైన్ వేదికగా ఆన్లైన్ శిక్షణలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు 26, 28 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 15 బ్యాచ్లను తయారు చేయగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులకు మే 26న 13వ బ్యాచ్లో ఆదిలాబాద్, నిర్మల్, 28న 14వ బ్యాచ్లో కుమురం భీం, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఆరు సెషన్లలో సబ్జెక్టుల వారీగా తరగతులు కొనసాగుతాయి. సిగ్నల్స్ లేక.. పాఠాలు వినక కోవిడ్ కారణంగా అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడి పోయారు. ఐటీడీఏ పరిధిలోని ఆన్లైన్ బోధనలకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ తరగుతులకు దూరమయ్యారు. కొన్నిచోట్ల సిగ్నల్స్ ఉన్నప్పటికీ డేటా సరిపోక పోవడంతో మధ్యలోనే అంతరాయం ఏర్పడేది. చివరకు ఏపాఠం చెబుతున్నారో.. తామేం వింటున్నమో అనేంతగా విద్యార్థుల్లో గందర గోళం ఏర్పడింది. గత అనుభభవాలను దృష్టిలో పెట్టుకుని సిగ్నల్స్కు అంతరాయం లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు రెగ్యులర్ ఉపాధ్యాయులు : 878 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు : 26 సీఆర్టీలు : 528 ఉన్నత పాఠశాలలు : 126 ప్రాథమిక పాఠశాలలు : 950 శిక్షణలో పాల్గొనాలి నేటికాలంలో ఏఐ విద్యాబోధన విద్యార్థులకు ఎంతో ఆవశ్యకమైంది. కాలానుగుణంగా బోధనలో మార్పులు తేవడానికి గిరిజన సంక్షేమ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ పీవో ఆదేశానుసారంగా మేలో కొనసాగే ఏఐ టూల్స్ పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనాలి. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలి. – పుర్క ఉద్దవ్, ఏసీఎంవో, కుమురంభీం -
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని బాల కేంద్రానికి చెందిన చిన్నారులు జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మహారాష్ట్రలోని వార్ధాలో ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రీయ కళామంచ్, సచిన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి నృత్యోత్సవ పోటీల్లో విజేతలుగా నిలిచారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో కూచిపూడి ఈవెంట్లో దువాస హర్షిని, కోండ్ర అలేఖ్య ప్రథమ స్థానంలో, జాహ్నవి క్షీరసాగర్ ద్వితీయస్థానంలో నిలిచినట్లు బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి తెలిపారు. జూనియర్ విభాగంలో ప్రథమస్థానంలో వర్ధిని, ద్వితీయ స్థానంలో శ్రీనిధి, సబ్ జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో ఇతీక్ష కొంకటి, ద్వితీయ స్థానంలో రితీక్షా జంగిలి, ప్రాపర్టీ రౌండ్లో సన్నిధి దేశ్ముఖ్, హర్షిని ఠాకూర్ ప్రథమ స్థానంలో నిలిచారు. మహారాష్ట్ర వేదికగా జరిగిన పోటీల్లో బాలకేంద్రం చిన్నారులు ఇప్పటివరకు మూడు పర్యాయాలు ప్రథమ స్థానంలో నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో సెల్పాయింట్ దగ్ధం
జన్నారం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెల్పాయింట్ దగ్ధమైన సంఘటన మండలంలోని కలమడుగులో చోటు చేసుకుంది. బాధితుడు మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో తాళం వేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో షాపు లోపలి నుంచి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పివేశారు. ఆదివారం ఉదయం ఫైర్ అధికారి శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనలో మొత్తం రూ.16 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో పేదల ఇళ్లలో ఫ్యాన్లు, మధ్య తరగత ఇళ్లలో కూలర్లు, ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల ఇళ్లలో ఏసీలు 24 గంటలూ నడుస్తున్నాయి. అయినా వాటికింద ఉన్నంతసేపే వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాసేపు బయటకు వెళ్లినా వేడి తట్టుకోలేకపోతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలోని పాతకాలంనాటి ఇళ్లలో ఉంటున్నవారు మాత్రం మండువేసవిలోనూ చల్లగా.. హాయిగా ఉంటున్నారు. ఎక్కువ ఎత్తుతో కట్టిన మట్టి మిద్దెలు, ఎక్కువ గ్రీనరీతో నిర్మించుకున్న పురాతన ఇళ్లలో ఫ్యాన్ గాలి చల్లదనం సరిపోతుందని పేర్కొంటున్నారు. నాటి నిర్మాణ శైలి, నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి కారణంగా నేటికీ ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా ఆ ఇళ్లలో వేడిగా ఉండదని యజమానులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్చల్లదనం పంచుతుంది మాది రత్నాపూర్ కాండ్లి. మేము ఇద్దరం అన్నదమ్ములం. 1970లో రూ.50 వేలు ఖర్చుచేసి బంకమట్టి ముద్దలు, సున్నపురాయి కలిపి ఇంటిగోడలు నిర్మించాం. ఇంటి పైకప్పుపై మట్టిముద్దలు పేర్చి దానిపై గూనపెంకలు పేర్చాం. అందుకే వేసవి కాలంలో కూడా మాఇల్లు చల్లదనాన్ని పంచుతుంది. – ముత్తన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ఏసీ, కూలర్ అవసరం లేదు మాదీ నిర్మల్ రూరల్ మండలంలోని రత్నాపూర్కాండ్లీ. ఎస్సారెస్పీ రియాబిటేషన్ విలేజ్ కావడంతో 1977లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి విశాలమైన ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో మా మామయ్యలు ఎంతో ఆసక్తితో చుట్టూ బంతి ఇల్లు నిర్మించారు. వేసవికాలంలో ఎలాంటి ఏసీ, కూలర్ అవసరం ఉండదు. అందుకే ఇప్పటికీ అతి పురాతనమైన ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. – ఉమారెడ్డి, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ డంగుసున్నంతో నిర్మించాం దండేపల్లి: మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాదాపూర్. 90 ఏళ్ల క్రితం డంగుసున్నంతో మిద్దె ఇల్లు (భవంతి) నిర్మించాం. సాధారణ ఇళ్లకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించాం. ఇప్పటికీ మాఇంట్లో ఫ్యాన్లు తప్పా కూలర్లు, ఏసీలు వాడం. మండు వేసవిలోనూ ఎంతో చల్లగా ఉంటుంది. 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. – వీరమనేని సుభద్ర, మాదాపూర్, దండేపల్లి, మంచిర్యాల చల్లగానే ఉంటుంది మా నాన్నలు ఇద్దరు అన్నదమ్ములు. మేము నలుగురం అన్నదమ్ములం. 1970లో కలిసికట్టుగా బంతి ఇల్లు నిర్మించుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అన్నదమ్ములం ఇదే ఇంట్లో కలిసే ఉంటున్నాం. ఇంటి పైకప్పుకు వేపచెక్కలు కొట్టి వాటిపై మట్టిముద్దలు వేసి పైన గూనపెంకలు పేర్చారు. అందుకే వేసవికాలంలో ఎండలు ఎంతగా ముదిరినా మా ఇంట్లో మాత్రం చల్లగానే ఉంటుంది. – లింగన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ -
● బాధిత కుటుంబాల భరోసాకు ప్రభుత్వం కార్యాచరణ ● ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు ● నేడు అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం
ఉన్న ఊర్లో ఉపాధిలేకనో.. గల్ఫ్ దేశాలకు వెళ్తే జీవనం మెరుగుపడుతుందనో.. తమ కుటుంబాలు బాగుపడతాయనో.. కారణం ఏదైనా కావచ్చు.. ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఎడారి దేశాలకు వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే విధి నిర్వహణలో అనారోగ్యం రీత్యా, ప్రమాదాల బారిన పడి, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పలుకారణాలతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వారిపై ఆధారపడిన బాధిత కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేసింది. వారి జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించింది. నేడు అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం సందర్భంగా కథనం.నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, కువైట్ తదితర దేశాలకు రెండు దశాబ్దాలకు ముందు నుంచే వలసలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 70 వేలకు పైగా మంది కార్మికులు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. కాగా ఎక్కువమంది నైపుణ్య రహిత కార్మిక రంగంలోనే ఉపాధి పొందేందుకు వెళుతుండడంతో అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడడం, ఒత్తిడికి గురికావడం, ప్రమాదాల బారిన పడటం వంటి అనేక కారణాలరీత్యా తనువుచాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక గల్ఫ్ సంక్షేమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి బిఎం వినోద్ కుమార్ను చైర్మన్గా, 12 మందిని సభ్యులుగా నియమించింది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన స్వదేశ్ పరికిపండ్లకు అవకాశం కల్పించింది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన గల్ఫ్ బాధిత కుటుంబాల్లో కాసింత భరోసా కల్పించినట్లు అయింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందజేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశల్లో ఈ పరిహారం ఆయా బాధిత కుటుంబాల ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి. అమలుచేయాల్సినవి ఇవే.. ● ఎన్నారై పాలసీ అమలు ● ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడం ● ఎంబసీలో తెలుగు అధికారుల నియామకం ● మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడం ● అంత్యక్రియలకు ఆర్థికసాయం ● బాఽధిత కుటుంబాలకు పరిహారం ● వివిధ కారణాలతో అక్కడి జైళ్లో మగ్గుతున్న్ల కార్మికులకు న్యాయ సహాయం ● ప్రమాద ఆరోగ్య బీమా అమలు ● నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ● తిరిగివచ్చిన కార్మికులకు పునరావాసం నేడు నిర్మల్లో ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ కార్మిక స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో గాయపడిన లేదా మృతి చెందిన, అంగవైకల్యం పొందిన కార్మికుల స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘చనిపోయిన వారిని స్మరించండి–బతికున్న వారికోసం పోరాడండి’ అనే నినాదంతో టీపీసీసీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ‘అమరుల దినోత్సవం’ నిర్వహించనున్నట్లు గల్ఫ్ కార్మిక సంక్షేమ రాష్ట్ర సలహా మండలి సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు.స్వగ్రామంలో గల్ఫ్ కార్మికుడి మృతదేహం (ఫైల్) -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూన్ లైట్ బార్ బిల్డింగ్ సెల్లార్ కింద వాష్ రూమ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బార్ యజమాని ఆదివారం సెల్లార్ కిందకు వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు ఉందన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు తెలియని స్థితిలో ఉందన్నారు. బార్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఽసీసీ పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిబోథ్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ధన్నూర్(బి) గ్రామానికి చెందిన ముసుగు రాకేశ్రెడ్డి (37), ముద్దం రాజు ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బోథ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా సాయినగర్ కాలనీ వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో 108లో బోథ్లోని సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా రాకేష్రెడ్డి మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
వ్యవసాయరంగం బలోపేతానికి కృషి
● ఎంపీ గోడం నగేశ్ఇంద్రవెల్లి: వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని పిట్టబొంగరంలో ఏర్పాటు చేసిన మన్కీ బాత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని రైతులకు రేడియో ద్వారా వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆర్థికాభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మన్కీ బాత్ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగంలో పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు సలహాలు, సూచనలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతీరైతు పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పిట్టబొంగరం, దస్నాపూర్, ధర్ముగూడ, బట్టగూడ గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగు, నాయకులు మారుతి దేవ్పూజే, శివకుమార్ జైస్వాల్, ముండే రాజేశ్వర్, దిలీప్ మోరే, రాథోడ్ భీంరావ్, మెస్రం తుకారాం, కనక హనుమంత్రావ్, కోవ రాజేశ్వర్, గేడం యేశ్వంత్రావ్, తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ పోటీల్లో బంగారు పతకాలు
మంచిర్యాలటౌన్: ఈనెల 24 నుంచి 26 వరకు హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ 7వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఆదివారం క్రీడాకారులు మంచిర్యాల రైల్వేస్టేషన్కు చేరుకోగా అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. జట్టు కెప్టెన్గా వ్యవహరించిన అమూల్య, కోచ్ సునార్కర్ అరవింద్, మేనేజర్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి రమేశ్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ రఘునాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
జైపూర్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే 163 భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కిష్టాపూర్ వద్ద ఎగ్జిట్ ఇవ్వాలని వరంగల్–విజయవాడ హైవే రోడ్డు భూనిర్వాసితులు శనివారం కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం మా భూములను సైతం హైవే రోడ్డుకు ఇచ్చి మాకు ఉన్న ఉపాధి కోల్పోయామన్నారు. స్థానిక భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తే పనులను అడ్డుకుంటామన్నారు. స్థానిక కాంట్రాక్టు పనుల్లో కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు సుందిళ్ల మల్లేశ్, రామారావు, రాంరెడ్డి, జనార్దన్రెడ్డి, కృష్ణమూర్తి, భూమయ్య, ప్రభాకర్, రాజారాం, సాగర్రెడ్డి, కృష్ణారెడ్డి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అందాల పోటీలు రద్దు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రపంచ సుందరి అందాల పోటీలు రద్దు చేయాలని మహిళా, విద్యార్థి, యువజన సాంస్కృతిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముష్క జ్యోతి, అరుణ మాట్లాడుతూ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి అనేక మర్గాలు ఉండగా మహిళలకు అవమానకరమైన, మహిళలను ప్రదర్శన వస్తువుగా చూపే సామ్రాజ్యవాద మార్కెట్కు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడం సిగ్గుమాలిన పని విమర్శించారు. -
ఎండ.. జాగ్రత్తలే అండ..!
ఇంటి మొక్కలు జర జాగ్రత్తవాహనాలకూ ఇబ్బందే.. బైక్లు, కార్లు ఎండలో నిలిపితే సూర్య కిరణాలు నేరుగా వాటిపైపడి కొద్ది కాలంలోనే రంగు వెలసిపోతుంది. తప్పనిసరిగా వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పాలి. పెట్రోల్ ట్యాంక్ త్వరగా వేడెక్కి ఇంధనం ఆవిరయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వాహనాల్లో ఇంధనం పోయించడం మంచిది. గ్యాస్కిట్లను ఉపయోగించే కార్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ ట్యాంక్పై మందంగా ఉన్న వస్త్రం లేదా గోనె సంచి కప్పి ఉంచడం వలన గ్యాస్ లీక్ కాకుండా ఉంటుంది. ఎండలో ఎక్కువ సమయం వాహనాలు నిలపడం వల్ల రేడియేటర్ హెడ్ గ్యాస్ కట్ అయ్యే అవకాశముంది. ట్రాఫిక్ జాం అయినప్పుడు సిగ్నల్స్ వద్ద కార్లలో ఏసీ వేయవద్దు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వాహనాలకు విశ్రాంతి ఇవ్వాలి.– చెలిమల చంద్రమౌళి, మెకానిక్, మంచిర్యాల ఎలక్ట్రిక్ బైక్లు హీట్ కానివ్వొద్దు ● ఎలక్ట్రిక్ బైక్ను వారానికోసారి శుభ్రం చేసి ఇంజన్, చైన్లలోని దుమ్ము, ధూళిని తొలగిస్తే ఇంజన్ సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. ● ఈవీ బైక్ ఎంత బరువు మోయగలదో అంతే బరువుతో ప్రయాణించాలి. ● ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, ఎక్కడైనా ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయాలి. దీని వల్ల పవర్ ఆదాతో పాటు, లైఫ్ పెరుగుతుంది. ● ఈవీ బైక్లు లైట్ వెయిట్ ఉండడం వల్ల టైర్లో ఎంత ప్రెజర్ ఉందో తెలియదు. దానిని పట్టించుకోకుండా దీర్ఘకాలంపాటు ప్రయాణాలు చేస్తే ఇంజన్పై దుష్ప్రభావం పడుతుంది. ● ఈవీ బైక్ను చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ను తీసేయాలి. ఓవర్హీట్ అయితే బైక్లు దగ్ధమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలి ఎండలో తిరగడం, వడగాలులతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశముంది. తగు జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు. పనుల కోసం బయటకు వెళ్లేవారు ఉదయం 10 లోపు, సాయత్రం 6గంటల తర్వాతే వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు, నెత్తికి టోపి, రుమాలు ధరించాలి. వదులుగా ఉండే తెలుపురంగు గల కాటన్ దుస్తులు ధరించాలి. తరచూ నీటిని తాగుతుండాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తాగడం శ్రేయస్కరం. – డా.ఆడే క్రాంతికుమార్, జనరల్ ఫిజీషియన్ వడదెబ్బ లక్షణాలు శరీరంలో వేడి పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం, ఫిట్స్, వాంతులు, విరేచనాలు వంటివి వడదెబ్బ లక్షణాలు. అలాంటి వారిని శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువగా వచ్చే వరకు తడిగుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ బాధితులు డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఎండలో బయటకు వెళ్లవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తలపై రుమాలు లేదా టోపీ ధరించాలి. ● నీరు, ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా కాపాడుకోవచ్చు. ● మద్యం సేవించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ● తప్పనిసరిగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ● చిన్నారులను ఎండలో ఆడనివ్వకూడదు. ఇంటి ఆవరణలో, చెట్ల నీడలో ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత భగ్గుమంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలతో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు ఇతరత్రా అత్యవసర పనుల్లో బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అధిక వేడి కారణంగా శరీరం నీరసంగా, నిస్సత్తువుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండేవారు సైతం తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. – కై లాస్నగర్/మంచిర్యాలటౌన్/నిర్మల్ చైన్గేట్ ● కూలర్లలో నీళ్లు పోశాక అటూ ఇటు కదల్చ కూడదు. ● ఓపెన్ గదిలో వాడడంతో పాటు, గాలి ప్రవాహం ఉండేలా చూడాలి. ● కూలర్కు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి, హానీకాంబ్ ప్యాడ్స్, ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ● సమ్మర్ సీజన్లో కూలర్ వినియోగించడం అయిపోయాక క్లీన్ చేసి, వాటి తడకలు వేరుచేసి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే ఉంచితే వచ్చే ఏడాదికి అది పాడైపోతుంది. ● కూలర్ను కిటికీ దగ్గర కానీ, తలుపు దగ్గర కానీ ఉంచి వినియోగిస్తేనే ఎక్కువ గాలి వీస్తుంది. అలా కాకుండా ఇంటి మధ్య భాగంలో పెడితే అనుకున్నంత గాలి రాక ఇబ్బందులు పడుతారు. ● ఏసీలు 1 టన్, 1.5 టన్, 2 టన్స్ అని మూడు రకాలుగా దొరుకుతాయి. గది చిన్నగా ఉంటే 1 టన్, మధ్యస్తంగా ఉంటే 1.5 టన్, పెద్దదిగా ఉంటే 2 టన్స్ ఏసీలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● ఏసీ గాలి బయటకు వెళ్లకుండా గది తలుపులన్నీ మూసి ఉంచాలి ● 24 నుంచి 26 డిగ్రీలలో ఏసీని సెట్ చేసుకుంటే గది ఉష్ణోగ్రతతో చల్లగా ఉండి విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ● ఏడాదిలో ఒకసారి ఏసీని తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించాలి. ● స్టెబిలైజర్ను వాడడం మంచిది. ఫ్రిజ్ వాడకం ఇలా.. ● అవసరమున్నప్పుడే ఫ్రిజ్ డోర్ తీయాలి ● వేడి పదార్థాలను ఉంచకుండా చూసుకోవాలి. ● ఫ్రిజ్ వెనక భాగం శుభ్రం చేసుకోవాలి. ● డోర్ గాస్కెట్ లీక్ ఉందో లేదో చూసుకోవాలి. ● వెనుక భాగానికి గోడకి మధ్య కాస్త గ్యాప్ ఉంచాలి. అప్రమత్తత అవసరం ఎండల తీవ్రత మనుషులపైనే కాదు మూగజీవా లు, పశుపక్షాదులపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. అధిక వేడి కారణంగా జంతువులు ఉష్ణోగ్రతను నియంత్రించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతా యి. దీంతో ఊపిరాడక మృతి చెందే ప్రమా దం ఉంది. మూగజీవాలకు పశుగ్రాసం, నీటికొరత లేకుండా చూడాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దు. వేడి తీవ్రతను అధిగమించేందుకు గోనె సంచులను తడిపి వాటిపై కప్పితే చల్ల దనం లభిస్తుంది. – బి.కిషన్, జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి, ఆదిలాబాద్ ● రోజువారి వాడకానికి సరిపడా మోడ్ను సెలక్ట్ చేసుకోవాలి ● వేడి నీరు అవసరం లేనిదే వాడవద్దు ● ఎండలో ఉంచకుండా చూడాలి ● ఫిల్టర్లు నెలకోసారి శుభ్రం చేయాలి.వాషింగ్ మెషీన్ వాడకం ఇతరత్రా పరికరాలు ● టీవీని నేరుగా సూర్యకాంతికి పెట్టవద్దు. స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్టర్ను వాడాలి. ● అవసరంలేని సమయాల్లో లైట్లను ఆర్పివేడయం వల్ల గదిలో వేడి తగ్గుతుంది. ● ఎల్ఈడీ బల్బులు వాడడం వల్ల హీట్ తక్కువగా ఉంటుంది. విద్యుత్ ఆదా అవుతుంది. ● విద్యుత్ పరికరాలు వేడి వాతావరణంలో వాడకుండా చూసుకోవాలి. వాడిన తర్వాత తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. ● ఉద్యానవన శాఖ కాగజ్నగర్ డివిజన్ అధికారి సుప్రజచింతలమానెపల్లి: మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. పండ్ల ధరలదీ అదే పరి స్థితి. పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండాల్సిందే. మరి వీటికి పరిష్కారం.. కిచెన్లో, ఇంటి కప్పు మీద రూఫ్లో, కూరగాయలు, పండ్లు, మొక్కలు పెంచుకోవడం. ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూల మొక్కలు ఏర్పాటు చేసుకోవడం. గ్రా మాలు, పల్లెలు అనే తేడా లేకుండా పట్టణాలుగా మారుతున్న వేళ ఇరుకు ఇళ్లు, అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈమధ్య కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం మన పట్టణ ప్రాంత ఆవాసాల్లో పోషక పదార్థాలను ఇచ్చే కూరగాయలు పెంచే పథకం ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పేరిట ప్రోత్సహిస్తోంది. కానీ.. పెరిగిన ఎండల వేడికి వీటిని కాపాడుకునేందుకు ఏం చేయాలి. వేల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ అర్బన్ ప్లాంటేషన్ల నుంచి లబ్ధి ఎలా పొందాలి. వీటిపై సలహాలు, సూచనలు, జాగ్రత్తలు ఉద్యానవన శాఖ కాగజ్నగర్ డివిజన్ అధికారి సుప్రజ అందించారు. అర్బన్ ప్లాంటేషన్, కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ అంటే వివరాలు తెలపండి?ఈ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ఇంటి వద్దనే పెంచుకోవచ్చు. ప్రధానంగా పట్టణ సంస్కృతి కలిగి ఉండి, వ్యవసాయ స్థ లాలు లేని వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఇవి ఉన్నాయా?మన జిల్లాలో ఇవి తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని భవనాల్లో ఆసక్తి ఉన్న వా రు కూడా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పూల మొక్కలు, పచ్చదనం కోసం విదేశీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మొక్కలు పెంచుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల వంట నిర్వాహకులూ పోషకాలు అందించే కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు చేస్తే కలిగే ఉపయోగాలేవి? ఈ పద్ధతుల్లో సాగు చేసేవారికి తాజా కూరగాయలు, పండ్లు లభిస్తాయి. ఆరోగ్య రక్షణలో వీటి పాత్ర కీలకం. ఆరోగ్య రక్షణతో పాటు సేంద్రియ ఎరువులు, కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా వినియోగించుకోవచ్చు. ఎండ వేడిమి నుంచి వీటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.మొక్కలు సాగు చేసే చోట గ్రీన్నెట్ షీట్స్ వినియోగించి ఎండవేడిమి నుంచి రక్షించుకోవాలి. ఇంటి దగ్గర సాగు చేసే మొక్కలను పరుచుకునేలా సాగు చేసుకోవాలి. కిచెన్లోని కూరగాయల వ్యర్థాలను మొక్కల వద్ద పరుచుకోవాలి. దీని ద్వారా కింద మట్టిలో ఉండే తేమను రక్షించుకోవచ్చు. మొక్కలకు నీటిని అందించే పద్ధతులేమిటి? ఆధునిక పరిజ్ఞానం వినియోగించే వారు ఇళ్లపై ఉండే నీళ్ల ట్యాంకులను వినియోగించి డ్రిప్ పద్ధతిలో మైక్రోజెట్లను ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ సీసాలు, మట్టి కుండలు లాంటివి వినియోగించడంపై ఆన్లైన్లో చాలామంది నిపుణులు మెళకువలు తెలియజేస్తున్నారు. ఎలాంటి మెలకువలు పాటించాలి?మొక్కల పెంపకంలో ప్రధానంగా కొన్ని సూచనలు పాటించాలి. సూర్యరశ్మి లభ్యత, అందుబాటులో ఉన్న స్థలం, సాగునీటి లభ్యత, నీరు నిల్వ ఉంచే సామర్థ్యం (వాటర్ప్రూఫ్ ఇంటి కప్పు), మన అభిరుచి అవగాహన లాంటివి కీలకంగా పరిశీలించుకోవాలి. ఎలాంటి మట్టిని వినియోగించుకోవాలి?ఈ పద్ధతుల్లో పెంపకానికి మట్టి తయారీ కీలకంగా మారుతుంది. 20శాత ఎర్రమట్టి, 40శాతం వర్మీకంపోస్ట్, 20శాతం కొబ్బరి పీచుపొట్టు, 5శాతం వేపపిండి, 15శాతం పశువుల చివికిన ఎరువులు కలిపి తయారు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందా?ప్రభుత్వం ఈ పద్ధతుల్లో పట్టణాలు, నగరాల్లో పో త్సహించడానికి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతిలో శాఖ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఇతర విషయాలు తెలు సుకోవాలంటే శాఖ అధికారులను సంప్రదించాలి.కూలర్ వినియోగంలో జాగ్రత్తలు ఏసీల వినియోగం -
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మహిళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ శివారులో హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి (36), సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సత్యనారాయణ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటివద్దే ఉంటున్నాడు. రమాదేవి ఈజీఎస్లో మేట్గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం సదరు మహిళ షెట్పల్లి గ్రామానికి వెళ్లివస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని లక్కేపూర్ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో లక్కేపూర్లో పరిచయం ఉన్న పండుగు మొగిళిపై అనుమానం ఉన్నట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో విషాదం -
హమాలీలపై సమ్మె పోటు
● నిలిచిన లారీల రవాణా ● ఉపాధి లేక అల్లాడుతున్న కాంటా కార్మికులు తిండికి తిప్పలైతంది.. పని చేస్తేనే వచ్చిన పైసలతో బతుకుడు. బండ్లు నడవక డబ్బులు లేక తిండికి తిప్పలైతంది. 15రోజులుగా బండ్లు నడుస్తలేవు. పని లేక ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం. కుటుంబం గడువడం కష్టంగా మారింది. – జనగామ నాగరాజు, రామారావుపేట జైపూర్: కాంటా హమాలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఊరి కార్మికులకు ఉపాధి కరువైంది. లారీ యజమానుల సమ్మె కారణంగా ఉపాధి దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడున్నర దశాబ్దాలుగా హమాలీ పనిపైనే ఆధారపడి జీవిస్తున్న వారంతా మరో పనికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. గత పదిహేను రోజులుగా మంచిర్యాల లారీ ట్రాన్స్పోర్టు అసోసియేషన్, శ్రీరాంపూర్ కోల్బెల్ట్ అసోసియేషన్ లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా లారీల్లో బొగ్గు రవాణా నిలిచిపోయింది. లారీలపై బొగ్గు లెవలింగ్ చేసే హమాలీ కార్మికులకు ఉపాధి కరువైంది. మండలంలోని రామారావుపేట గ్రామం నుంచి 300మంది కాంటా హమాలీ కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1990లో శ్రీరాంపూర్ ఏరియాలో లారీ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ద్వారా కాంటా హమాలీ పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని అప్పటి నుంచి హమాలీ పని చేస్తున్నారు. 300 మంది హమాలీ కార్మికులు మూడు షిఫ్టులుగా సింగరేణి గనులు, కాంటాల వద్ద లోడింగ్కు వచ్చిన లైన్ లారీల్లో బొగ్గు నింపిన తర్వాత కాంటా వేశాక బొగ్గు ఎక్కువగా ఉంటే తీసేయడం, తక్కువగా ఉంటే మళ్లీ లారీలో వేయడం, సమానంగా చేసి టార్పాలిన్ కవర్ కప్పడం వీరి పని. ఇందుకు ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ద్వారా పది టైర్ల లారీకి రూ.410, ఆరు టైర్ల లారీకి రూ.360 చొప్పున చెల్లిస్తారు. మూడు షిఫ్టుల్లో బొగ్గు రవాణా డిమాండ్కు అనుగుణంగా లారీలు వస్తాయి. ఆ రోజు వచ్చిన హమాలీ కార్మికులు వేర్వేరు గనులపైకి వెళ్లి అక్కడ పని చేస్తారు. వచ్చిన డబ్బులను రోజువారీగా మస్టర్ లెక్కగట్టి నెలనెలా జీతంగా తీసుకుంటారు. ఇలా గ్రామానికి చెందిన వారిలో అధిక శాతం ఇదే పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరో పని చేయలేక.. ఉన్న పనిలో ఏడాదిలో వేర్వేరుగా ఉన్న ట్రాన్స్పోర్టు యూనియన్లు సమ్మె చేయడం ఆరు నెలలకోసారి ఇలా 20 రోజులు సమ్మె చేయడంతో పని కరువై తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. 300 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించిందని హమాలీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రత లేని బతుకులుసుమారు 35ఏళ్లుగా హమాలీ పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రత లేదు. నెలంతా చేసినా రూ.10వేలు దాటవు. అందులో లారీ యూనియన్లు సమ్మె చేయడంతో కనీసం తిందామంటే తిండి దొరకని స్థితిలో అల్లాడుతున్నారు. ఊరు ఊరంతా వారి తండ్రులు చేస్తూ వచ్చిన పనిని కొడుకులకు అప్పగించడంతో వారు కూడా అదే పనికి అలవాటు పడి మరో పని చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. అనేక మార్లు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలని పోరాటాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులుగా గుర్తించాలె.. బొగ్గు లోడింగ్, ఆన్లోడింగ్, లెవలింగ్ హమాలీలను కార్మికులుగా గుర్తించాలి. ఏళ్లుగా హమాలీ పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. కనీసం కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించడం లేదు. కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలి. – బొద్దున రాజేశం, యూనియన్ లీడర్ -
చేపల కదలికలు గమనించాలి
● జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి వాతావరణ పరిస్థితుల్లో చేపల పెంపకంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. మత్స్యకారుల సంఘాలు, సభ్యులు జాగ్రత్తలు వహించాలి. చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గితే చేపలు పట్టుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.అవినాష్ సూచించారు. వేసవి ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు వివరించారు. జిల్లాలో అధికంగా వర్షాధార చెరవులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లోని నీటి నాణ్యత, లోతు విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతీ రోజు గమనించాలి. కొన్ని చేపలను పట్టి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం ఇతర లక్షణాలు పరిశీలించాలి. తేడా ఉన్నట్లయితే మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టి ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలి. ఉదయం సమయంలో చెరువు పైభాగంలో చేపలు నోరు తెరుచుకొని తిరుగుతుంటే ప్రాణవాయువు కొరత ఉందని గ్రహించి చెరువులో నీరు పెట్టడం, పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించడం చేయాలి. తద్వారా చేపల సాంద్రత తగ్గడం వల్ల ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చెరువులో నీటి నాణ్యత తగ్గినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు చల్లడంతో నాణ్యతతోపాటు ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. చెరువులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే రాత్రి సమయంలో ఆవి విడుదల చేసే కార్బన్ డై ఆకై ్సడ్ కారణంగా ప్రాణవాయువు కొరత ఏర్పడి చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సందర్భాల్లో విషం కలిపారనే అపోహలను నమ్మకుండా నిజనిర్ధారణ చేసుకోవాలి. వ్యాధితో చేపలు చనిపోయిన వెంటనే వాటిని నీటి నుంచి తొలగించి చెరువు దూరంగా కాల్చివేయడం, భూమిలో పూడ్చి వేయడం చేయాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు బీకేసీ(బెంజాల్ కొలియం క్లోరైడ్)ను ఒక హెక్టర్కు ఒక లీటర్ చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. అయినప్పటికీ మార్పు లేకపోతే యాంటీ బయోటిక్ మందులు సూచించిన మోతాదులో మేతతోపాటు కలిపి ఇవ్వాలి. నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెంచుతుంది. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల్లో ఉంటూ ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గరుండ్ల రవీందర్, ఎన్.అభినయ శనివారం హరిత ప్లాజా టూరిజం భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేయగా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. మంచిర్యాల ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహం కంప్యూటర్ సైన్స్(వొకేషనల్) విద్యార్థి రవీందర్, బీసీ బాలికల కళాశాల వసతిగృహం ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థిని అభినయ నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంపై వసతిగృహ సంక్షేమాధికారి మోసిన్ ఆహ్మద్, సుధాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. -
నేలలు నిస్సారం..!
● భూసార పరీక్షలు లేక రైతులకు నష్టం ● జాడలేని భూసార పరీక్ష కేంద్రాలు ● సీజన్కు ముందు ఫలితాలతో ప్రయోజనాలుమంచిర్యాలఅగ్రికల్చర్: రైతులు అధిక పంట దిగుబడి సాధించేందుకు పోటీ పడి ఎరువులు వేస్తున్నా నష్టాలే చవి చూడాల్సి వస్తోంది. భూమిలో పోషక లోపాలు గుర్తించకుండా వేసిన పంటలే వేయడం, అధిక మోతాదులో ఎరువులు చల్లడం వల్ల పంటలపై చీడపీడల దాడి అధికమై సస్యరక్షణ ఖర్చు పెరుగుతోంది. భూములు నిస్సారమై భవిష్యత్లో పంటలు వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నేలలో అంతర్లీనంగా ఉన్న పోషకాలను కాపాడుకోవాలి. భూసారం తెలుసుకోకుండా ఎలాంటి పంటలు సాగు చేసినా దిగుబడి లేక ఆర్థికంగా చతికిల పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో నెల పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మే నెలల్లో భూ సార పరీక్షలు చేయడానికి మట్టి నమూనాల సేకరణకు అనుకూలమైన సమయం. వానా కా లం పంటలు విత్తుకునే సమయానికి ఫలితాలు వస్తే అందుకు అనుగుణంగా విత్తనం, ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు ఆదేశాలు రాలేదు. గత రబీ సీజన్ సమయంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి తరలించారు. అధికంగా ఎరువుల వినియోగంజిల్లాల్లో 3.60 లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 70శాతం నల్లరేగడి, 20 శా తం ఎర్ర, ఇసుక, చౌడు నేలలు ఉన్నాయి. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులు అధికంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియకుండా అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో రైతులకు అవగాహన ఉండాలి. భూమిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మట్టి పరీక్షలు నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించవచ్చు. తద్వారా మోతాదులో రసాయన ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. పరీక్షల ఫలితాల ఆధారంగా పంట సాగు మేలుపంటలు భూమిలోని పోషకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటాయనే దానిపై దిగుబడులు ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా తక్కువైనా ఆశించిన దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వారం, పొటాష్ ఎరువులు సిఫార్సు చేసిన మోతాదు కంటే తక్కువగాను, నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువగా వేస్తుంటారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని ఎరువును అధిక వినియోగం వల్ల పంట విపరీతంగా ఎదిగి పడిపోతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. తాలు గింజలు ఎక్కువగా ఉంటాయి. పంట చీడపీడలకు సులభంగా లోనవుతుంది. చివరికి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏ పంటకు ఏ పోషక పరిమాణంలో అవసరమో తెలుసుకుని తగిన మోతదులో అందించడాన్నే పోషక సమత్యులత అంటారు. భూసార పరీక్షల్లో ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును సిఫార్సు చేస్తారు. ఆదేశాలు రాలేదు వానాకాలం ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో భూ పరీక్షల నిర్వహణకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రబీ సీజన్ ముందు డిసెంబర్, జనవరి నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలకు 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రానికి తరలించాం. – కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి భూసార పరీక్ష కేంద్రం మూతజిల్లా ఆవిర్భావ సమయంలో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి మంచిర్యాల వ్యవసాయ మార్కెట్లో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయించారు. వివిధ గ్రామాల నుంచి ఏఈవోలు మట్టి నమూనాలు సేకరించి పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులకు సూచనలు చేశారు. 2020లో భారీ వర్షంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భూసార పరీక్ష కేంద్రంలోని యంత్రాలు కాలిపోయాయి. అనంతరం మరమ్మతులు చేయించారు. 2022లో మంజూరైన మెడికల్ కళాశాలను తాత్కాలికంగా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మూతపడింది. అప్పటి నుంచి భూసార పరీక్షలు లేక రైతులకు నేల స్వభావం తెలియకుండా పోతోంది. -
‘గులాబీ’ దండు కదులుతోంది..!
● ఎల్కతుర్తి రజతోత్సవ సభకు సిద్ధం ● వేలాది మంది హాజరయ్యేలా ప్రణాళిక ● వందలాది వాహనాలు ఏర్పాటు చేసిన నాయకులుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రజతోత్సవ వరంగల్(ఎల్కతుర్తి) బహిరంగ సభకు జిల్లా నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నారు. ఆ పార్టీ ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ విజయవంతానికి ముఖ్య నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో గోడలపై రాతలు, ప్రచారం సాగిస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్న య్య, బాల్క సుమన్, నాయకులు నడిపెల్లి విజిత్రావు తదితరు ఇప్పటికే కేడర్ను సిద్ధం చేశారు. జిల్లా నుంచి వేలాదిగా జనాన్ని తరలించి తమ బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని విభాగాల ఇన్చార్జీ లు, యువత, మహిళలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులను బస్సులు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పెద్దయెత్తున వాహనాల్లో ఎల్కతుర్తి వైపు గులాబీ దండు కదలనుంది. నియోజకవర్గానికి మూడు వేల మందిప్రతీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది చొప్పున జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.30గంటల నుంచే వాహనాలను సిద్ధం చేసి 12గంటలకు సభాస్థలికి చేరుకునేలా ప్రణాళిక చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200బస్సులు, 200కార్లు, ఇతర వాహనాలు సమకూర్చుతున్నారు. గ్రామం, పట్టణాన్ని బట్టి ఒకటి నుంచి రెండు, మూడు బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో హాజరవుతున్నారని నాయకులు చెబుతున్నారు. ఆ మేరకు పట్టణంలో భారీగా బైక్ర్యాలీ నిర్వహించారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల వారు వయా రాయపట్నం మీదుగా కరీంనగర్ నుంచి వరంగల్కు చేరుకుంటారు. హాజీపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం, మందమర్రి మండలాల వారు వయా ఇందారం గోదావరిఖని మీదుగా వరంగల్కు వెళ్తారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలు వయా కాళేశ్వరం, భూపాలపల్లి, కాటారం మీదుగా సభకు హాజరుకానున్నారు. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల్లో చల్లని తాగునీరు, ఓఆర్ఎస్, పులిహోర ప్యాకెట్లు, రెండు పూటల భోజన సౌకర్యం కల్పించనున్నారు. మహిళలకు తగిన భద్రత కల్పించనున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాలు, పట్టణా ల నుంచి పెద్ద ఎత్తున, రైతులు, యువత, మహిళలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ వారితోపాటు ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. – నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ యువ నాయకుడు -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మే 4న నీట్(నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రెన్స్ టెస్ట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నీట్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 4న జరిగే పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరవుతారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మంచిర్యాల), తెలంగాణ ఆదర్శపాఠశాల(రాజీవ్నగర్), మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను బందోబస్తుతో భద్రపర్చాలని తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఒక్కో పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకుడు, పాలన విభాగం నుంచి ఒక నోడల్ అధికారి, పోలీస్ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇదే నా ఇల్లు.. నాకు లేదా ఇందిరమ్మ ఇల్లు?
మంచిర్యాల జిల్లా: ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని ఆ మహిళ ఎంతో ఆశపెట్టుకుంది. శిథిలావస్థకు చేరిన ఇంటిని తొలగించి ప్రస్తుతం నాలుగు వైపులా కర్రలు పాతి ప్లాస్టిక్ కవర్లతో గూడు ఏర్పాటు చేసుకుని ఉంటోంది. తీరా ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్ గ్రామంలో బండారు లక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకుంది. శిథిలమైన ఇంటిని తొలగించి 4 నెలల క్రితం తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 104 మందికి ఇళ్లు మంజూరైనట్లు ప్రజాపాలన సభలో ప్రకటించారు. ఇందులో నుంచి 34 మందికి నిర్మాణాలకు అనుమతి ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ జాబితాలో లక్ష్మి పేరు లేకపోవడంతో ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలే గానీ ఆర్థికంగా ఉన్న వాళ్లకి ఎందుకు మంజూరు చేస్తున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం రాస్తారోకో
కొనసాగుతున్న నిరవధిక సమ్మె బాసర: ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదోరోజుకు చేరింది. శుక్రవారం బాసర రైల్వేస్టేషన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం శ్రీకాంత్ శ్రీరామ్, శేఖర్, రజిత, భానుప్రియ, ప్రశాంతి, ప్రభాకర్రావు పాల్గొన్నారు. చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామస్తులు శుక్రవారం చెన్నూర్–మంచిర్యాల ప్రధా న రహదారిపై రాస్తారోకో చేశారు. పంచా యతీలో 1,104 మంది ఇందిరమ్మ ఇళ్లకు ద రఖాస్తు చేసుకోగా 70మంది పేర్లు వచ్చాయని తెలిపారు. ఇందులో ఎల్లక్కపేటకు చెందిన ఆరుగురి పేర్లు మాత్రమే ఉన్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదని తెలిపారు. అధికారులు మళ్లీ సర్వే చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
వివాహితపై లైంగికదాడి
తానూరు: మండలంలోని మొగ్లి గ్రామానికి చెందిన యువకుడు సునీల్పై శుక్రవారం అత్యాచారం కేసు నమోదైనట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉదయం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. అక్కడే ఉన్న సునీల్ ఆమెను వంతెన పైపులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గాయాలతో ఇంటికి చేరకున్న బాధితురాలు భర్తకు విషయం తెలిపింది. అనంతరం తానూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం భైంసా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాలి చెన్నూర్: ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తని ఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంత రం సంఘ విద్రోహ శక్తులు గుంపులుగా ఏర్ప డి గొడవలు సృష్టించే సమయంలో ఎలా చెదరగొట్టాలో మాక్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో మమేక మై స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలని సూచించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ దేవేందర్రావు, ఎస్సైలు సుబ్బారావు, వెంకటేశ్వర్రావు, సిబ్బంది ఉన్నారు. -
ఈ స్టేషన్లో రైళ్లు ఆగవు
● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పక్క స్టేషన్లకు వెళ్లాలంటే ఆర్థిక భారం మందమర్రిరూరల్: సింగరేణి పారిశ్రామిక ప్రాంతం మందమర్రిలోని రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కరువైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ ప్రాంతాల ఉద్యోగులు, వ్యాపారులు సొంతూళ్లకు, విద్యార్థులు చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లాలంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతీరోజు వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్లో భాగ్యనగర్, ఇంటర్సిటీ, కరీంనగర్ పుష్పుల్ రైళ్లు తప్ప ఇతర రైళ్లు ఆగడం లేదు. గతంలో సింగరేణి, ప్యాసింజర్, రామగిరి, సిర్పూర్ కాగజ్నగర్(పాత తెలంగాణ) రైళ్లకు హాల్టింగ్ ఉండేది. కరోనా నుంచి రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కనీస సౌకర్యాలు కరువుమందమర్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రతీరోజు భాగ్యనగర్, ఇంటర్ సిటీ రైళ్ల ద్వారా వందలాది మంది ప్ర యాణం సాగిస్తారు. రైల్వేస్టేషన్ ఆవరణలో మరుగుదొడ్డి, తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు తదితర కనీ స సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తెల్లవా రు జామున వచ్చే భాగ్యనగర్ రైలు ప్రయాణికులకు కొన్ని సమయాల్లో విద్యుత్ దీపాల సౌకర్యం లేక విష పురుగుల బాధ తప్పడం లేదు. ఎంపీ చొరవ చూపాలిమందమర్రి రైల్వేస్టేషన్లో గతంలో నిలిపివేసిన రైళ్ల హాల్టింగ్ను పునరుద్ధరించడంతోపాటు మరికొన్ని కొత్త రైళ్లు నిలిపే విధంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఎంపీ హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రమంత్రితో మాట్లాడి కాజీపేట టు ఆజ్నీ ప్యాసింజర్ హాల్టింగ్కు కృషి చేశారు. తెలంగాణ రైలు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లే మరికొన్ని కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.జీవనోపాధికి తిప్పలు మందమర్రి రైల్వేస్టేషన్లో గతంలో పలు రైళ్లకు హాల్టింగ్ ఉన్నప్పుడు కనీసం 30నుంచి 40 మంది ఆటోడ్రైవర్లకు రోజుకు రూ.500 నుంచి రూ.600 వచ్చేది. భాగ్యనగర్, తెలంగాణ రైళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉండడం వల్ల జీవనోపాధికి తిప్పలు తప్పడం లేదు. అన్ని రైళ్లకు గతంలో మాదిరిగా హాల్టింగ్ ఉన్నట్లయితే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లభిస్తుంది. – బెంజిమెన్ ఆటో డ్రైవర్, మందమర్రి ప్రయాణానికి ఇబ్బంది తెలంగాణ, సిర్పూర్ కాగజ్నగర్, తదితర ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణించాంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది. మందమర్రి రైల్వేస్టేషన్లోనే రైళ్లు నిలిపితే ఇబ్బంది తప్పుతుంది. – అబ్బాస్, మందమర్రి -
కొడుకును కడతేర్చిన తండ్రి
లక్ష్మణచాంద: ఆర్థిక గొడవల కారణంగా తండ్రి కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన బైనం ఎర్రన్న–గంగవ్వ దంపతులకు కుమారుడు అశోక్ (32), కూతురు ఉన్నా రు. కూతురుకు వివాహమైంది. అశోక్కు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, తండ్రీకొడుకులు మద్యం సేవించి నిత్యం గొడవ పడేవారు. చంపుతా.. అంటే చంపుతా.. అని పరస్పరం హెచ్చరించుకునేవారు. తండ్రీకొడుకుల మధ్య గొడవ కారణంగా అశోక్ భార్య ఇద్దరు చిన్నారులతో ఆర్నెళ్ల క్రితం లక్ష్మణచాందలోని పుట్టింటికి వెళ్లింది. అశోక్ తరచూ వెళ్లి భార్య, పిల్లలను చూసి వస్తుండేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా అశోక్ భార్య వద్దకు వెళ్లాడు. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజులాగానే తండ్రితో గొడవ పడ్డాడు. నిత్యం గొడవలతో వేగలేకపోతున్నానని భావించిన ఎర్రన్న మద్యం మత్తులో ఉన్న కొడుకును చంపాలనుకున్నాడు. రాత్రి ఆరుబయట పడుకున్న అశోక్ను శుక్రవారం వేకువజామున గొడ్డలితో తల, ముఖంపై నరికాడు. తీవ్ర గాయాలతో అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత గొడ్డలిని సమీప పొలంలో పడేసిన ఎర్రన్న లక్ష్మణచాంద పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎర్రన్నను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. అశోక్కు భార్య లక్ష్మి, ఏడేళ్ల కూతురు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. -
వన్యప్రాణుల కోసం నీటి కుంటల నిర్మాణం
జైపూర్: ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్లాంటేషన్, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు నిర్మిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ తెలిపారు. మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలోగల టీజీఎఫ్డీసీ నీలగిరి ప్లాంటేషన్లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు. ఈజీఎస్ కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలున్న ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నీరు నిల్వ ఉండేలా నీటి కుంటలు తవ్విస్తున్నట్లు పేర్కొన్నారు. కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాంటేషన్ వాచర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్న అటవీ సిబ్బంది -
నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన రైతు మర్రిపెద్ద భోజన్నకు చెందిన నూర్పిడికి సిద్ధంగా ఉన్న జొన్న పంటకు ప్రమాదవశాత్తు ని ప్పంటుకుని దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన్న ఎకరం జొన్న పంటను కో యించి పొలంలోనే ఆరబెట్టాడు. ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లి ఎండ ఎక్కువ కావడంతో ఇంటికి వెళ్లాడు. సాయంత్రం మరోసారి పొలానికి వెళ్లి చూడగా అప్పటికే జొన్న పంటకు నిప్పంటుకుంది. గమనించి తోటిరైతుల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. జిల్లాకేంద్రంలోని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఫైర్ ఇంజన్ ఆలస్యంగా చేరడంతో అప్పటికే ఎక రం జొన్న పంట అగ్నికి ఆహూతైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే కాలిపోగా భోజన్న బోరున విలపించాడు. సుమారు రూ.75 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ముధోల్ మండలం ఆష్టలో..ముధోల్: మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన రైతు రవి లింగారెడ్డికి చెందిన నాలుగెకరాల మొక్కజొన్న పంట శుక్రవారం షార్ట్షర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వారం క్రితం లింగారెడ్డి మొక్కజొన్నను కోసి చేనులోనే ఆరబెట్టాడు. తన పొలం మీదుగా విద్యుత్ లైన్ ఉండగా మధ్యాహ్నం ఈదురు గాలులు వీచాయి. తీగలు ఒకదానికొకటి రాసుకోగా నిప్పు రవ్వలు ఎగిసిపడి మొక్కజొన్న పంట మీద పడగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో నాలుగెకరాల పంట పూర్తిగా దగ్ధమైందని బాధితుడు తెలిపాడు. రెవెన్యూ అధికారులు నారాయణ్పటేల్, సరస్వతీ పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదించి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
మంచిర్యాలటౌన్: జిల్లాలో మలేరియా వ్యాధి రాకుండా అరికట్టి, మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో దోమలు పెరగకుండా చూడాలని, 2030 నాటికి దేశవ్యాప్తంగా మలేరియా నిర్మూలనలో జిల్లాను భాగస్వామిగా చేయాలని అన్నారు. నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెందుతాయని, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎస్.అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు శివప్రతాప్, అశోక్, సునిత, అమర్, రాము, రజిత, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సంతోష్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు. -
42కిలోలైతే ఓకే..!
● ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల మెలిక ● కొనుగోలు కేంద్రాల్లో మొదలైన దోపిడీసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ మొదలైంది. ధాన్యం సరిగా లేదని, తేమ సాకు చూపి బస్తాకు 42కిలోల చొప్పున తూకం వేస్తూ రైతులను ముంచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభం కాగా, కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 11మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. సుమారు 9వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు జరిగాయి. క్రమంగా కేంద్రాలకు ధాన్యం రావడం పెరుగుతుండడంతో మిల్లర్లు మెలిక పెడుతున్నారు. తూకంలో అధికంగా బరువు వేయొద్దని మిల్లర్లకు ముందే చెబుతున్నా ధాన్యం దించుకోబోమని రైతులతోనే చెబుతుండడంతో కేంద్రాల నిర్వాహకులు 42కిలోలు జోకుతున్నారు. నిబంధనల ప్రకారం 40కిలోలు తూకం వేయాలి. గన్నీ సంచితో మరో 500గ్రాములు కలిపి, మరో అర కిలో తరుగు చేర్చినా, మొత్తంగా 41కిలోలకు పరిమితం కావాలి. అయితే శుక్రవారం జన్నారం మండలంలో ఐకేపీ కేంద్రంలో 42కిలోలు, ప్రాథమిక సహకార సంఘం పరిధి కేంద్రంలో 41కిలోలు, దండేపల్లిలో 42కిలోల చొప్పున తూకం వేశారు. దీంతో రైతులు రైతులు గత్యంతరం లేక అమ్మేసుకుంటున్నారు. జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఓ రైతుకు తూకంలో అనుమానం వచ్చింది. దీంతో వేరే చోట బరువు చూస్తే బస్తాకు 42కిలోలు రావడంతో ఆయన కొనుగోలు నిలిపివేశాడు. తేమ, శుభ్రత లేవనే సాకుఏటా ప్రతీ సీజన్లో మిల్లర్లు తేమ, శుభ్రత సాకుతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. నిబంధనల ప్రకారం 17శాతం లోపే తేమ ఉంటే మద్దతు ధర చెల్లించాలి. చాలా చోట్ల తేమ ఎక్కువగా ఉంటోంది. ఇక ధాన్యం శుభ్రం చేసే యంత్రాల(ప్యాడీ క్లీనర్లు)తో ధాన్యం శుభ్రం చేసుకునేందుకు చాలామంది రైతులు ముందుకు రావడం లేదు. కేంద్రానికి వెళ్లిన వెంటనే అమ్మేసుకోవాలనే వాతావరణ భయంతో, రైతుల తొందరపాటు మిల్లర్లకు కలిసి వస్తోంది. ఇందుకు నిర్వాహకులు సైతం సహకరిస్తూ ఆ మేరకు ట్రక్ షీట్లు, ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. జిల్లాలో 321 కేంద్రాల్లో 3.31లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఉంది. ఇందులో ఒక కిలో చొప్పున రైతుల నుంచి కోత పెట్టినా రూ.కోట్లలోనే జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోగా, ఇంకా ఈ సీజన్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. 41కిలోలే తూకం జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడా 42కిలోలు తూకం వేయడం లేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆ మేరకే తూకం వేయాలని ఆదేశాలిచ్చాం. – కిషన్ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్బెల్లంపల్లిరూరల్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం రూపొందించారని, ఈ చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కన్నాల రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని అన్నారు. ఎలాంటి సమస్యనైనా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి వీలుందని తెలిపారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం బుధాకుర్థు గ్రామ పంచాయతీ పరిధిలో సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో పి.హరికృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, పీ ఏసీఎస్ చైర్మన్ స్వామి, ఏడీఏ రాజానరేందర్, తహసీల్దార్ జ్యోత్న్స, నాయకులు మహేందర్, శ్రీనివా స్, స్వామి, అనిత, లక్ష్మీనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు. రైతులకు వరం..తాండూర్: భూభారతి చట్టం రైతులకు వరమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సురభి గార్డెన్స్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసి భవిష్యత్లో ఎలాంటి భూ సమస్యలు రాకుండా మరింత సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రైతులు, నాయకులు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ భూభారతి చట్టం, ప్రయోజనాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, డెప్యూటీ తహసీల్దార్ వీవీఆర్కేడీ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు. -
‘మాదీ సైట్ బ్యాచే.. అన్నకు ఫోన్ చేయాలా?’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మాది కూడా సైట్ బ్యాచ్. అన్నకు ఫోన్ చేయాలా?’ అంటూ ఇరువర్గాలు ఘర్షణ పడిన తీరు అక్కడు న్న వారిని ఆశ్చర్యపోయేలా చేసింది. శుక్రవా రం మధ్యాహ్నం జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద ఓ హోటల్ పక్కనే ఉన్న పాన్షాపు యజమానికి మరో ఇద్దరికి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నగదు ఇచ్చినా ఇవ్వలేదనే షాపు నిర్వాహకుడు చెప్పగా, ఇద్దరి మధ్య ఈ విషయంలో ఒకరిపై ఒకరు మాటామాట పెరిగేలా చేసింది. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు షాపు అతని దగ్గరిగా వస్తూ ‘మాది సైట్ బ్యాచ్, అన్నతో మాట్లాడాలా?’ అంటూ బెదిరించసాగారు. అయితే అక్కడున్న మరొక వ్యక్తి ‘మేం కూడా సైట్ బ్యాచే. మేం కూడా అన్నతో మాట్లాడుతాం. ఎవరికి ఫోన్ చేయాలే, నేను మాజీ కౌన్సిలర్ని’ అంటూ గొడవ పడడం అక్కడున్నవారిని ఆశ్చర్యపడేలా చేసింది. ఇరువర్గాలు ఆ ‘బ్యాచ్’ పేరు చెబుతూనే కాసేపు వా దించుకుని వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంలో సైట్ బ్యాచ్ పేరుతో యువత, గ్యాంగ్లను పెంచిపోషిస్తూ చట్టవ్యతిరేక సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా గొడవ జరిగితే ఆ బ్యాచ్ పేరు చెబితే సామాన్యుల్లో భయం ఉంటుందనే కోణంలో ఆ పేరే వాడుకుంటున్నారు. గతంలో ఇదే షాపు వద్ద గొడవ జరగడం గమనార్హం. -
28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు
మందమర్రిరూరల్: ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున 20 మంది ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న జట్టు గుజరాత్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి రమేష్రెడ్డి, కోచ్ అరవింద్ పాల్గొన్నారు. -
ఆర్కే 7గని సింగరేణికే తలమానికం
● కంపెనీ డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు ● ఘనంగా గని స్వర్ణోత్సవాలు శ్రీరాంపూర్: ఆర్కే 7 గని సాంకేతికతలో సింగరేణికే తలమానికమని సింగరేణి డైరెక్టర్లు అన్నారు. గని 50సంవత్సరాలు జీవిత కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలోనే మొట్టమొదట ఎస్డీఎ ల్ యంత్రాలను ఈ గనిలోనే ప్రవేశపెట్టామని తెలి పారు. మ్యాన్ రైడింగ్ యంత్రాలనూ ఇక్కడే ప్రవేశపెట్టామని, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, రక్షణ చర్యల్లో గనికి మంచి చరిత్ర ఉందని అన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఉద్యోగుల కు జ్ఞాపికలు అందజేశారు. గనిపై మైసమ్మ ఆలయంలో హోమాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవులు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం సుశాంత్ సాహూ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బాలాజీ పాల్గొన్నారు. -
ఫోన్కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్వాచ్మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్కు వాచ్మెన్ మహేశ్ సెల్ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్మెన్కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
టిప్పర్ ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి
ఆదిలాబాద్టౌన్: టిప్పర్ ఢీకొట్టి రిటైర్డ్ టీచర్ మృతిచెందిన ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్రూరల్ మండలం చాందా (టి) గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేవళ్ల నారాయణ (65) జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఉంటున్నాడు. ఉదయం మార్నింగ్ వాక్ అనంతరం గాంధీ పార్కు నుంచి విద్యానగర్ వైపు వెళ్తుండగా కుమురంభీం చౌక్లో గల సర్కిల్ వద్ద టిప్పర్ ఆయనపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్కిల్తో ప్రమాదాలు.. సుందరీకరణ పేరిట గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని పలు ముఖ్య కూడళ్లలో సర్కిల్స్ ఏర్పాటు చేసింది. గతంలో కుమురంభీం చౌక్ వద్ద సిగ్నల్స్ ఉండేవి. ఉన్నవాటిని తొలగించి పెద్దగా సర్కిల్ను ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇటీవల కాలంలో నాలుగు దిక్కులా స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం కుమురంభీం చౌక్ సర్కిల్లో రెండు కార్లు సైతం ఢీకొట్టాయి. -
కప్పర్లలో భారీ అగ్నిప్రమాదం
తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి పశువుల కొట్టం, మూడు మ్యాక్స్ వాహనాలు దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బొమ్మని బుచ్చన్న పశువుల కొట్టం గ్రామ శివారులో ఉంది. గ్రామానికి చెందిన పలువురు తమ వా హనాలను సైతం పశువుల కొట్టం దగ్గరే నిలిపి ఉంచుతారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో పశువుల కొట్టం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే పార్కింగ్ చేసిన మూడు మ్యాక్స్ వాహనాలకు సైతం మంటలు వ్యాపించాయి. రెండు మ్యాక్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా మరొక వాహనం పాక్షికంగా కాలిపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చే వరకు గ్రామస్తులు వ్యవసాయ బోర్ మోటార్ ద్వారా నీళ్లను చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో పశువుల కొట్టంలో ఉన్న పైపులు, స్పింక్లర్లు, పశుగ్రాసం, వ్యవసా య సామగ్రి, మందులు, ఎరువులు, విద్యుత్ మో టార్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. గ్రా మానికి చెందిన గండ్రత్ కృష్ణకుమార్, గండ్రత్ అభిలాష్, దారుట్ల ప్రవీణ్లకు చెందిన మ్యాక్స్ వాహనాలు కాలిపోగా మొత్తంగా రూ.23 లక్షల కు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని ఆర్ఐ సంతోష్ పరిశీలించి పంచనామా ని ర్వహించారు. కాగా ప్రభుత్వం తరఫున సాయం అందించి ఆదుకోవాలని రైతు బుచ్చన్న కోరుతున్నాడు. మ్యాక్స్ వాహన యజమానులకు సైతం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పశువుల కొట్టం దగ్ధం -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
నిర్మల్టౌన్: ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ ఇన్విజిలేటర్కు పట్టుబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేశ్ మీనా బుధవారం వివరాలు వెల్లడించారు. స్థానిక సోమవార్పేట్లో గల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాసర్ల రత్నాకర్ అనే వ్యక్తి పరీక్ష రాయాల్సి ఉండగా అతని స్థానంలో కందుల జయవర్ధన్ పరీక్షకు హాజరయ్యాడు. ఇన్విజిలేటర్ అతని హాల్టికెట్ తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందజేయగా అక్కడకు చేరుకుని రత్నాకర్, జయవర్ధన్లపై కేసు నమోదు చేయడంతో పాటు అతని ఎగ్జామ్ పేపర్, హాల్ టికెట్ సీజ్ చేశారు. -
‘అణగారిన వర్గాలకు ఆసుపత్రులు కరువు’
బేల: అణగారిన పేద వర్గాలకు కనీసం ఆసుపత్రులు కూడా దిక్కులేవని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ అధ్వానంగా ఉండడంతో తానే స్వయంగా చీపురుతో ఊడ్చారు. అనంతరం శంషాబాద్లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కోడె గోవిందు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పెడచెవిన పెట్టాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు
కడెం: మండలంలోని దోస్త్నగర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్కు చెందిన దముఖ శివకృష్ణ తన కుమారుడు శ్రీశాంత్తో కలిసి తన కారులో జన్నారం నుంచి కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వెళ్తుండగా మార్గమధ్యలో దోస్త్నగర్ సమీపంలోని ఐ లవ్ కవ్వాల్ లోగో వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలు కాగా, శ్రీశాంత్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో జన్నారంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పేకాటస్థావరంపై దాడిలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూ రు చౌరస్తా సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సురేశ్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బు ధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి నిర్వహించి ఊత్కూరు గ్రామానికి చెందిన తుమ్మల సునీల్, ఏనుగుల తిరుపతి, గౌరువంతుల ప్రశాంత్, కడమండ్ల శేఖర్, ముప్పు శ్రీధర్, సత్యసాయి నగర్కు చెందిన ఎస్కె సనీర్, బుఖ్య రాజు, రాచర్ల రాకేశ్, పేరం పోచం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3470ల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. స్క్రాప్ పట్టివేతశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐరన్ స్క్రాప్ను సింగరేణి ఎస్అండ్పీసీ సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం ఓసీపీ ఎంట్రన్స్ సమీపంలో ఆటోలో తరలిస్తున్న బెల్ట్ రోలర్, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. ఓసీపీ రోడ్లపై దుమ్ము లేవకుండా నీటి ట్యాంకర్ను ఉపయోగిస్తున్నారు. ఈ ట్యాంకర్ను ప్రైవేటు కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ క్వారీ లోపల నీటిని నింపుకునే క్రమంలో అక్కడ ఉన్న ఈ స్క్రాప్ను ట్యాంకర్లో వేసుకొని పైకి తీసుకొచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్ నుంచి తీసి స్క్రాప్ను చెట్ల పొదల్లో ఆటోలోకి మార్చుతున్న సమయంలో ఎంటీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి చూసే సరిగా దొంగతనం బయటపడింది. సిబ్బందిని చూసి దొంగలు పోరిపోగా ఆటోను, స్క్రాప్ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతూ ఒకరి మృతిఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఒకరు మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. జైనథ్ మండలంలోని మేడిగూడకు చెందిన గొర్ల గణేశ్ (35) ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్నాడు. పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫిట్స్తో బాధపడుతుండగా ఉద్యోగం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆయన ఈనెల 19న తన ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
లక్ష్మణచాంద: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్రూరల్ మండలంలోని మూటాపూర్ గ్రామానికి చెందిన పులి పెద్దన్న (32)కు నిర్మల్ శాంతినగర్కు చెందిన లక్ష్మితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రో జులుగా భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య లక్ష్మి తల్లి గారింటికి వెళ్లిపోయింది. ఈనెల 21న పెద్దన్న తన భా ర్యను తీసుకురావడానికి వెళ్లగా భార్య లక్ష్మి, ఆమె బంధువులు కలిసి పెద్దన్నపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దన్న సరస్వతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మండలంలోని రాచాపూర్ సమీపంలోని సరస్వతి కాలువలో మృతదేహం లభ్యమైంది. పెద్దన్న తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలి పారు.ఉరేసుకుని ఒకరు..నర్సాపూర్ (జి): మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న (55) స్థానిక జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 35 సంవత్సరాలుగా తాత్కాలిక అటెండర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి పనికి వెళ్లడం మానేసి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటి వెనకాల గల రేకుల షెడ్డులో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న కుమారుడు తోకల వంశీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మలేషియాలో నృత్య ప్రదర్శనకు ఆహ్వానం
● నటరాజ కళాక్షేత్రం విద్యార్థులకు అవకాశం ● ఈనెల 27న ప్రదర్శన జన్నారం: మలేషియాలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు మండల కేంద్రంలోని నటరాజ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. మండల కేంద్రంలో చిన్నగా ప్రారంభమైన నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27న కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు గురువారం మలేషియకు వెళ్లనున్నారు. 2017లో ప్రారంభం.. 2017లో నటరాజ కళాక్షేత్రాన్ని కూచిపూడి నృత్యం, ఫోక్ డ్యాన్సులు నేర్పించేందుకు ముగ్గురితో ప్రారంభించారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చి అనేక బహుమతులు పొందారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. కూచిపూడిలో డాక్టరేట్ పొందిన మాస్టర్ నర్మద గౌడ్ నేతృత్వంలో రెండు బ్యాచ్లలో 20 మంది కూచిపూడి నృత్యంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం 26 మంది నటరాజ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకుంటున్నారు. కూచిపూడితో పాటుగా ఫోక్ పాటలపై కూడా డ్యాన్సులు నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. 27న మలేషియాలో ప్రదర్శన.. ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా మలేషియాలో ఉద్యోగరీత్య స్థిరపడిన తమిళనాడుకు చెందిన ఆరుద్ర, నాట్య సమర్పణం ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న మలేషియా ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది డ్యాన్స్ మాస్టర్లకు ఆహ్వానం అందింది. అందులో తమిళనాడు రాష్ట్రం చైన్నె నుంచి కొందరు డ్యాన్స్ మాస్టర్లు, కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ నుంచి కొందరు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కొందరు ఎంపికయ్యారు. వీరితో పాటుగా జన్నారం మండలకేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రం డ్యాన్స్ మాస్టర్ నర్మదగౌడ్కు ఆహ్వానం అందింది. డ్యాన్స్ మాస్టర్ నర్మద గౌడ్తో పాటు 9 మంది విద్యార్థులు మలేషియాలో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మేరకు 10 మంది నృత్య కళాకారులతో పాటుగా మరో 15 మంది తల్లిదండ్రులు గురువారం మలేషియాకు బయలు దేరనున్నారు.మంచి పేరు తీసుకొస్తాం.. నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ నృత్య ప్రదర్శనకు ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. మా విద్యార్థులు మలేషియాలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జన్నారం మండలానికి మంచి పేరు తీసుకొస్తాం. – గాజుల నర్మదగౌడ్, డ్యాన్స్ మాస్టర్ -
‘ఓపెన్’ పరీక్షల్లో డబ్బులు వసూళ్లు!
బెల్లంపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా బెల్లంపల్లిలో ఇంటర్ విద్యార్థుల కోసం బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, టెన్త్ విద్యార్థుల కోసం బెల్లంపల్లి బస్తీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రంలో డ్యూటీ చేస్తున్న ఇన్విజిలేటర్లు కొందరు విద్యార్థుల నుంచి బలవంతంగా ఒక్కో పరీక్షకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వని విద్యార్థులను టార్గెట్ చేసి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి చిట్టీలు అందజేసి మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి డబ్బుల వసూలును నివారించి మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయమై మంచిర్యాల ఏసీజీ దామోదర్రావును వివరణ కోరగా పరీక్ష రాస్తున్న విద్యార్థుల వద్ద నుంచి ఇన్విజిలేటర్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. పరీక్ష కేంద్రాలకు స్క్వాడ్ను పంపించి కట్టడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా నివారిస్తామని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులపై ఎస్పీ కొరడాఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం కొరడా ఝులిపించారు. ఆరు మండలాల్లో 30 బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ వన్టౌన్, టూటౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. గురువారం వారి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు ఇచ్చోడ: నియోజకవర్గంలోని వడ్డీ వ్యాపారులతో పాటు ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. సోదాల్లో వ్యాపారుల నుంచి పలు రకాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, గుడిహత్నూర్లలో విడివిడిగా పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీలో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆయా పోలీస్స్టేషన్లలో అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలోని గోదావరి రోడ్కు చెందిన పందిరి అశ్విత(17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ బైపీసీ చదివిన విద్యార్థిని ఇటీవల వార్షిక పరీక్షలకు హాజరైంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షకు గైర్హాజరు కావడంతో ఫెయిల్ అయింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై బుధవారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నస్పూర్లో ఏసీబీ కార్యాలయం
● ప్రారంభానికి సిద్ధమైన భవనం ● ఇక్కడే ఆసిఫాబాద్, మంచిర్యాల కేసుల పర్యవేక్షణ ● సీసీసీ నస్పూర్ పాత సీఐ కార్యాలయంలో ఏర్పాట్లు ● ప్రస్తుతం ఆదిలాబాద్లో కొనసాగుతున్న వైనంనస్పూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ కార్యాలయానికి అనుబంధంగా త్వరలోనే మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీసీ నస్పూర్లోని సింగరేణి క్వార్టర్లో కొనసాగిన పాతపోలీస్స్టేషన్ పక్కన గల సీఐ కార్యాలయంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. క్వార్టర్లో మరమ్మతులు పూర్తి చేసి వారం, పది రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. తగ్గనున్న దూరభారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏసీబీ కార్యాలయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇతర సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల బాధితులు అవినీతి అ ధికారులపై ఏసీబీకి నేరుగా ఫిర్యాదు చేయాలంటే వ్యయప్రయాసలకోర్చి ఆదిలాబాద్కు వెళ్లాల్సిన ప రిస్థితి ఉంది. అధికారులు సైతం ఫిర్యాదులపై వి చారణ జరిపేందుకు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రావాలంటే చాలా క ష్టపడాల్సి వస్తోంది. కాగా నస్పూర్లో కార్యాల యం ఏర్పాటైతే అన్నింటికీ సులభతరంగా ఉండనుంది. పెరుగనున్న ఫిర్యాదులు.. నస్పూర్ పట్టణంలో సమీకృత కార్యాలయం ఉండడం, అధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉండడంతో సంబంధిత శాఖల అధికారులు భారీగానే అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఆసిఫాబాద్ జిల్లా వాసులకు సైతం నస్పూర్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. నస్పూర్ పట్టణంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటవుతున్న దృష్ట్యా అవినీతి అధికారులపై ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ఓ వైపు సీసీసీ నస్పూర్ పాత పోలీస్స్టేషన్ భవనంలో భరోసా కేంద్రం కొనసాగుతుండగా పక్కనే ఏసీబీ కార్యాలయం ఏర్పాటుపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రెండు జిల్లాల కేసులు పర్యవేక్షణ..నస్పూర్లో ఏర్పాటయ్యే కార్యాలయంలో ఒక సీఐ, ఇతర సిబ్బంది ఉంటారు. వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ పర్యవేక్షణలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నారు. ఆదిలాబాద్ కార్యాలయం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు.ప్రారంభానికి చర్యలు నస్పూర్ ఏసీబీ కార్యాలయం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సింగరేణి అధికారులు భవనాన్ని తమకు అప్పగించిన తర్వాత ఉన్నతాధికారుల సమయం తీసుకుని వారం, పది రోజులలో ప్రారంభిస్తాం. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
కుటుంబానికి జలగండం..!
● సరస్వతి కెనాల్లో కొట్టుకుపోయిన యువకుడు ● గతంలో ఇద్దరు సోదరులు చెరువులో పడి మృతినిర్మల్టౌన్: ఆ కుటుంబాన్ని జలగండం వెంటాడుతోంది. గతంలో ఇద్దరు కొడుకులు చెరువులో పడి మృతి చెందగా, బుధవారం మూడో కుమారుడు సరస్వతి కెనాల్లో గల్లంతు కావడం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇబ్రహీం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో దిలావర్పుర్లో ఉండగానే ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఇబ్రహీం తన కుటుంబాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని సర్ద్మహల్కాలనీకి మార్చాడు. ఈతకు వెళ్లి.. ఇబ్రహీం మూడో కుమారుడు హనీఫ్ (17) ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం స్థానిక సిద్దాపూర్ సమీపంలోని సరస్వతి కెనాల్లో ఈతకు వెళ్లాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముందుగా దిగిన హనీఫ్ అందులో కొట్టుకుపోయాడు. మిత్రులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కాలువలో హనీఫ్ కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్ మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్లో ఇంటర్ చదువుతున్న హనీఫ్ పరీక్ష ఫలితాలు మంగళవారమే వచ్చాయి. ఇందులో ఆయన పాసయ్యాడు. ఫలితాలు వచ్చిన తెల్లారే ఇలా గల్లంతు కావడంతో విషాదం నెలకొంది. -
‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’
లక్సెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు వెర్రబెల్లి రఘునాఽథరావు అన్నారు. బుధవారం కొత్తూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టింగ్ పేరుతో బస్తాకు రెండు కిలోలు దోచుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్రెడ్డి, పురుషోత్తం, రమణారావు, ప్రభాకర్, గంగన్న, హరిగోపాల్, రాజగురువయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు. బీజేపీలో పట్టభద్రుల చేరిక చెన్నూర్రూరల్: మండలంలోని దుగ్నెపల్లి, ఎర్ర గుంటపల్లి, ఆస్నాదకు చెందిన పట్టభద్రులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునాధరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్టీ చెన్నూర్ పట్టణ ఇన్చార్జి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, భీమారం మండల ఇన్చార్జి ఆలం బాపు, నాయకులు కొటారి వెంకటేశ్, సత్యం, దుర్గం రాజు పాల్గొన్నారు. -
గ్యారంటీ గండం..!
● ఇప్పటికీ 9మిల్లులకే ‘సీఎంఆర్’కు అనుమతి ● గత సీజన్ నుంచే తగ్గుతున్న మిల్లులకు ట్యాగింగ్ ● ఈ యాసంగిలో పొరుగు జిల్లాలకు పంపే యోచన ● జిల్లా మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని వేడుకోలుధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ పరిశీలిస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బ్యాంకు గ్యారంటీ మెలిక మిల్లర్లకు గండంలా మారింది. రా మిల్లర్లు, కొత్తగా పరిశ్రమలో చేరిన వారికి మరింత ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లు మొదలైనా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మిల్లర్లు రూ.కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ట్యాగింగ్ కావడం లేదు. నిబంధన ప్రకారం పది శాతం గ్యారంటీ ఇస్తేనే ధాన్యం అప్పగించాలి. పాత బకాయి ఉంటే మరో 20 శాతం అదనం. గత సీజన్ నుంచే సర్కారు కఠినంగా ఈ నియమం అమలు చేస్తోంది. దీంతో గత వానాకాలం నుంచే జిల్లాలో అనేక మంది మిల్లర్లు సీఎంఆర్కు దూరమయ్యారు. ఇక 2022–23 యాక్షన్ ధాన్యంకు సంబంఽధించి రూ.87 కోట్ల బకాయి ఉంది. మరోవైపు సీఎంఆర్ జాప్యం చేసిన 20 మిల్లులపై ఆర్ఆర్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విలువ రూ.133.78 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ లెక్కగట్టింది. ఆ డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. బాయిల్డ్తో పోలిస్తే రా రైస్ మిల్లర్లు గత సీజన్ నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సేకరణకు ఇబ్బంది లేకుండా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 56 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 9 మిల్లులకే ట్యాగింగ్ ఇచ్చారు. మరో రెండు మిల్లులకు ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో ధాన్యం పెద్దఎత్తున కేంద్రాలకు రానుంది. దీంతో ఆలస్యమైతే రైతులు ఇబ్బంది పడనున్నారు. పొరుగు జిల్లాకు ధాన్యం ఈ యాసంగిలో జిల్లాలో 1.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 3.41లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉంది. మొత్తం 321 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఇప్పటికే 4వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. గత వానాకాలంలోనే గ్యారంటీలు ఇవ్వకపోవడంతో కరీంనగర్ జిల్లా మిల్లులకు ఇక్కడి ధాన్యాన్ని తరలించారు. ఈ నెల నుంచే రేషన్ షాపులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో రాష్ట్రస్థాయిలో బఫర్ స్టాక్తో చేసుకోవాల్సి ఉంది. వారంలో ధాన్యం రాక ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ధాన్యం పంపేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల అనుమతి కోరారు. స్థానిక గోదాముల్లో నిల్వ సామర్థ్యం సైతం పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఇతర జిల్లాలకు పంపే యోచన చేస్తున్నారు. మిల్లర్ల వేడుకోలు బకాయిలు చెల్లించేందుకు ‘అండర్ టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే మూడు నెలలపాటు సమయం ఇవ్వగా జిల్లా మిల్లర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పొరుగు జిల్లాలకు ధాన్యం పంపితే అక్కడ తరుగు కటింగ్ చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ధాన్యం రవాణా ఖర్చు పెరుగుతుందని, ఇబ్బందులు వస్తాయంటున్నారు. కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్ నిలిచిపోయిందని, రూ.కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న రైస్మిల్లర్లకు, ఉపాధికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారంటీ, బకాయిలు తీర్చిన వాటికే ధాన్యం అప్పగిస్తున్నామని, ఆ మేరకు తమ బకాయిలు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు. -
వేసవి సెలవులు వచ్చేశాయ్..
మంచిర్యాలఅర్బన్: ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలీడేస్ (వేసవి సెలవులు) ప్రకటించడంతో చివరి రోజు బుధవారం విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు సందడిగా మారాయి. చాలారోజుల తర్వాత ఇంటికి వెళ్తుండడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కబుర్లు చెప్పుకుంటూ సెల్ఫీ దిగారు. సెలవులతో విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో మంచిర్యాల బస్స్టేషన్ రద్దీగా మారింది. బస్సుల్లో సీట్ల కోసం పాట్లు పడ్డారు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
మందమర్రిరూరల్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శంకర్పల్లి జీపీ పరిధిలోని సండ్రోన్పల్లి రైతువేదికలో మంగళవారం తహసీల్దార్ సతీశ్కుమార్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సారంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వ్యవసాయధికారులు బానోత్ప్రసాద్, కిరణ్మయి, తిరుపతి, రైతులు పాల్గొన్నారు. రైతులకు ప్రయోజనంకాసిపేట: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వరకు సమస్యలు పరిష్కరించి మిగతా మండలాల్లోని సమస్యను గుర్తించి ఆగస్టు 15లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు. పార్టీ సమావేశమా.. అధికారిక కార్యక్రమమా? సమావేశంలో అధికారుల తీరుపై బీజేపీ మండలాధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది అధికారిక కార్యక్రమమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా ఫ్రోటోకాల్ ఏంటీ.. వేదిక పై కాంగ్రెస్ నాయకులే ఉంటారా.. అని అధికారులతో వాదనకు దిగారు. ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. కలెక్టర్ నచ్చచెప్పి గొడవ సద్దుమణిగించారు. అర్హులకు రాజీవ్ యువ వికాసం వర్తింపజేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన లబ్ధిదారులకు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం వై.సురేష్, టీజీబీ ఆర్ఎం మురళీమోహన్రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 30లోగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన బోయ శ్రీనివాసులు నారాయణపేట్కు బదిలీకాగా ఆయన స్థానంలో సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్ట్లో పని చేసిన వీరయ్యను నియమిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించారు. జిల్లా జడ్జిని కలిసిన డీసీపీ మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఏ. వీరయ్యను బుధవారం డీసీపీ ఎగ్గడి భాస్కర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై సమీక్షించారు. -
జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎన్నికల ప్రత్యేకాధికారి నర్సింహస్వామి, డీపీఎం స్వర్ణలత ఆధ్వర్యంలో ఏడుగురు ప్రతినిధులను, తొమ్మిది మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దండేపల్లి మండలానికి చెందిన ఏ.అనిత, కార్యదర్శిగా లక్సెట్టిపేట మండలానికి చెందిన బి.శ్రీలత, కోశాధికారిగా జైపూర్ మండలానికి చెందిన ఎం.మాలతీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న సభ్యులను అధికారులు శాలువాలతో సత్కరించారు. -
అమరులకు కొవ్వొత్తులతో నివాళి
ఐఎంఏ సభ్యుల కొవ్వొత్తుల ర్యాలీ మంచిర్యాలటౌన్/మంచిర్యాలక్రైం: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీజేపీ, ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ఉగ్రవాదుల దాడులు సరికాదన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, వైద్యులు పి.రమణ, ఏ.వెంకటేశ్వరరావు, ఏ.స్వరూపరాణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధం
సిరికొండ: మండలంలోని ఫకీర్నాయక్ తాండలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రాథోడ్ లాల్సింగ్ ఇంటిపైనున్న విద్యుత్ తీగలతో షార్ట్సర్క్యూట్ జరిగి పశుగ్రాసానికి నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న 10 క్వింటాళ్ల జొన్నలు, బియ్యం, బట్టలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. రాథోడ్రెడ్డి, రాథోడ్ జ్ఞానేశ్వర్ ఇళ్లు పాక్షికంగా కాలిపోయాయి. తహసీల్దార్ తుకారాం, ఎస్సై శివరాం, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాథోడ్ లాల్సింగ్కు రూ.1.17 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. -
పుస్తకనేస్తం..జీవన సర్వస్వం
నిర్మల్కు చెందిన వీరు ఇరువురు మంచి స్నేహితులు. వెల్మల మధు డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్గా, మహమ్మద్ నజీర్ఖాన్ డిప్యూటీ అటవీ క్షేత్ర అధికారిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి అభిరుచి పుస్తక పఠనం. ఇద్దరి మనస్తత్వాలు ఒకటే కావడంతో వృక్షశాస్త్ర రంగంలో అనేక పరిశోధనలు చేస్తున్నారు. వివిధ రకాల ప్రాంతాల్లోని పుస్తకాలను సేకరించి వాటిలో తమకు నచ్చిన అంశాలపై అధ్యయనం చేస్తారు. నచ్చిన పుస్తకాలను సేకరిస్తూ ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. -
కొనేపరిస్థితి లేదు
ఆసిఫాబాద్: పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేదు. భవిష్యత్లో బంగారం ఆభరణంలా కాకుండా పొటోల్లో పెట్టుకునే పరిస్థితి ఉందది. ఇంకా పెరుగుతున్నాయే తప్ప దిగడం లేదు. ఇటీవల అరతులం కొనాలనుకున్నా.. ధర తగ్గుతుందనడంతో ఆగిపోయా. – గుర్రాల హరిప్రియ, గృహిణి, ఆసిఫాబాద్ నియంత్రణ ఉండాలి ఆసిఫాబాద్: పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా వివాహాల సందర్భంగా పేదలకు బంగారం కొనాలంటే మరింత కష్టంగా మారింది. బంగారం ధరలపై నియంత్రణ ఉండాలి.– కాచం వినేశ్, వ్యాపారి, ఆసిఫాబాద్ కొనలేని పరిస్థితి మంచిర్యాలటౌన్: ఈ నెల 23న మా బాబు పెళ్లి ఉంది. బంగారం కొందామని వెళ్తే లక్ష రూపాయలకు చేరింది. పెళ్లికి తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలి కాబట్టి ధర పెరిగినా కొనుగోలు చేశాం. వేల నుంచి లక్షల్లోకి చేరిన బంగారంను సామాన్యులు కొనలేని పరిస్థితి. – పురెల్ల సుజాత, పాతమంచిర్యాల కొనక తప్పదు మంచిర్యాలటౌన్: మా కూతురు పెళ్లి ఈ నెల 24న ఉంది. బంగారం తప్పనిసరి కావడంతో ధర పెరిగినా కొనడం తప్పడం లేదు. లక్షకు చేరుతుందని ఊహించ లేదు. ధర పెరిగినా పెళ్లి కోసం కొనక తప్పదు. – హబీబునీసా బేగం, మంచిర్యాల -
అంబేడ్కర్ విగ్రహానికి అధ్యాపకుల వినతి
బాసర: ఆర్జీయూకేటీ ఒప్పంద అధ్యాపకుల నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సంబంధించిన జీవో 21 ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రశాంతి, రజిత, శ్రీకాంత్, విజయకుమార్, ప్రభాకర్రావు, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని వృద్ధుడు దుర్మరణంగుడిహత్నూర్: మండలంలోని సీతాగొంది జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన డోంగరి అడెల్లు (70) బోథ్ నుంచి ఆదిలాబాద్కు వెళ్లి తిరుగుప్రయాణంలో వాఘాపూర్ సమీపంలోని లక్ష్మీపూర్లో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్లడానికి బస్సులో వచ్చి జాతీయ రహదారి దాటుతుండగా గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు అతివేగంతో వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరిపై కత్తితో దాడినిర్మల్టౌన్: ఇద్దరు చికెన్ షాపుల నిర్వాహకులు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అబ్దుల్, వజిద్ ఖూరేష్కు స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా చికెన్షాపులు ఉన్నాయి. మంగళవారం వజీర్ తన దుకాణంలో యాసిడ్తో కడుగుతుండగా అబ్దుల్ కళ్లు మండుతున్నాయని, వాసన వస్తుందని చెప్పా డు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వజీర్, గఫర్, షాప్లో పనిచేసే హుస్సేన్ అబ్దుల్పై కత్తితో దాడికి దిగడంతో గాయాలయ్యాయి. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలుడిపై కుక్కలదాడికడెం: మండల కేంద్రానికి చెందిన గుంటుకు భూమేశ్ అనే బాలుడిపై ఈ నెల 21న రాత్రి ఊరకుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
● రూ.లక్ష దాటిన తులం బంగారం ● కొండెక్కిన గోల్డ్ ధరలు ● శుభ ఘడియల నేపథ్యంలో భారంగా బంగారం
పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యునికి అందనంత దూరంలో ‘లక్ష’ణంగా కొండెక్కి కూర్చుంది. భారతీయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్లో రూ.1,01,600 ధర పలికింది. ఉదయం రూ.1,00,800 పలికిన ధర సాయంత్రానికి మరో రూ.800 పెరిగింది. గత వారం రోజులుగా సుమారుగా రూ.96 వేలు ఉన్న ధర ఏకంగా లక్షకు ఎగబాకింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో శుభకార్యాల సమయంలో కనకాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ అతివలు బంగారంపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర అధికంగా ఉన్నా తప్పదన్న ఆలోచనతో కొనాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, సెక్రెటరీ ఫణి, కోచ్లు ఎం.వనిత, రవికుమార్ తెలిపారు. వనపర్తిలో నిర్వహించిన 68వ ఎస్జీఎఫ్ ఫుట్బాల్ అండర్–14 పోటీల్లో ఉమ్మడి జిల్లా ద్వితీయస్థానం కై వసం చేసుకుంది. సిర్పూర్(టి) టీజీ ఎంఆర్ఎస్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ఏ. దీక్షిత, ఆసిఫాబాద్ టీజీ డబ్ల్యూఆర్జేసీలో ఎనిమిదో తరగతి చదువుతున్న భూమిక, కాగజ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అనిత మండల్తో పాటు, అండర 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అభిలాష్ ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకు మహారాష్ట్రలోని కోల్హాపూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్ఆదిలాబాద్రూరల్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన కిచక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మావల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న గుండి మహేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని షీటీంకు ఫిర్యాదు అందగా మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మంగళవారం సదరు టీచర్ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక యోగ టీచర్తో అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె ఫిర్యాదుతో మరో కేసు సైతం నమోదు చేసినట్లు తెలిపారు. -
‘శ్రీ చైతన్య’ విజయఢంకా
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. సెకండియర్ ఎంపీసీలో ఆర్.వైష్ణవి 993, లాస్విక 992, జి.శ్రీనిత్య, పి.భరత్రెడ్డి, అకిరానందన్ 991 మార్కులు సాధించారు. బైపీసీలో అభ్యుదయ 994, ఎన్.భార్గవి 992, పి.స్ఫూర్తిశ్రీ, బి.రోహిత్ 990 మార్కులు సాధించారు. సీఈసీలో మధుమిత 961, ఎంఈసీ లో ఎం.భానుప్రకాశ్ 951 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎ.లక్ష్మీహాసిని 468, జి.శ్రీహి త, పి.హాసినిరావు, ఎం.సాత్విక, జి.శ్రీనిధి, కె.మైత్రి 467 మార్కులు సాధించారు. 466పైగా మార్కులు 22మంది, 465 పైగా మార్కులు 14 మంది సాధించారు. బైపీసీలో ఇ.అఖిల, ఔష సినివాసన్ 437, ఎస్.విఘ్న, వి.లహరి, ఆర్.అక్షయశ్రీ, సీహెచ్.కార్తీక్ 436 మార్కులు, ఎంఈసీలో ఎల్.కమలేశ్ 474, సూర మనీష 470, సీఈసీలో హరిణి 492, కె.అంజలి 491 మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి సత్కరించారు. డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్ మోహన్రెడ్డి, ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, రాఽధాకృష్ణ, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సరికొత్త మైత్రిబంధం పుస్తకంతోనే..
జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ టి.సంపత్ కుమార్ ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సీనియర్ సలహాదారుగా పనిచేసి రిటైర్ అయ్యారు. సుధీర్ఘకాలంగా పుస్తకాలతోనే మైత్రిబంధం కొనసాగిస్తున్నారు. పలు నవలలు, కథల పుస్తకాలను తెలుగు, ఆంగ్లభాషల్లో రచించారు. నాలుగు దశాబ్దాలుగా పుస్తకాలనే నేస్తాలుగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. నేటి యువతరానికి చిన్నప్పటి నుంచే పుస్తక పఠనాన్ని అభిరుచిగా రూపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు.నిర్మల్ఖిల్లా: పుస్తకమా.. పుస్తకమా.. నిన్ను చదవడంవల్ల ఉపయోగం ఏంటీ..! అంటే..‘తలదించుకుని నన్ను చదువు.. జీవితంలో నిన్ను తలెత్తుకుని జీవించేలా తయారుచేస్తా’ అంటుందట పాఠకుడితో.. విజేతల్ని మీ అభిరుచి ఏమిటని ప్రశ్నిస్తే ఎక్కువమంది ఠక్కున చెప్పే సమాధానం పుస్తక పఠనం... జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. ఎంత చదివితే అంత విజ్ఞానవంతుల్ని చేయగలిగే ఏకై క శక్తి పుస్తకానికే ఉంది. మారుతున్న కాలానికనుగుణంగా ప్రస్తుతం పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు క్రమంగా తగ్గుతోంది. ఆన్లైన్ అభ్యసనంతో పట్టుమని పది నిమిషాలు కూడా విద్యార్థులు పుస్తకాలు చదవలేకపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు నేర్పించే అతిముఖ్యమైన అలవాటు పుస్తక పఠనమే. మన పిల్లల్ని కూడా పుస్తకాలతో దోస్తీ కట్టించేందుకు తగిన మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉంది. పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి యువ తరానికి అవగాహన కల్పించడానికి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా కథనం. ప్రయోజనాలివే.. ● ఒంటరితనం పారద్రోలి మంచి స్నేహితులుగా వ్యవహరిస్తాయి. ● ఏకాగ్రత పెరుగుతుంది. విషయాన్ని శ్రద్ధగా చదవడం అలవాటవుతుంది. ● పద సంపద వృద్ధిచెంది భాషపై పట్టు పెరుగుతుంది. ● భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. ● ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి. లోకజ్ఞానం రెట్టింపవుతుంది. ● సృజనాత్మకత పెంపొందించడానికి విషయ పరిజ్ఞానం తోడ్పడుతుంది. ● విజేతల ఆత్మకథలు చదివినప్పుడు స్ఫూర్తి, ప్రేరణ పొందవచ్చు. ● పరాజితుల అనుభవాలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. ● ఒత్తిడిని తగ్గించడానికి దివ్యఔషధంగా పనిచేస్తుంది. దారిచూపే దీపం.. సాంకేతికంగా పురోగమనంలోనూ వన్నెతగ్గని పుస్తకం నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం లక్ష్యానికి చేరువ చేస్తుంది పిల్లలకు చిన్నప్నటినుంచే పుస్తకపఠనం అలవాటు చేయాలి. విజ్ఞానంతో పాటు మానసిక స్థిరత్వం కూడా కలుగుతుంది. టీవీ, ఫోన్లకు దూరంగా ఉంచాలి. పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా పెద్దయ్యాక ఈ అభిరుచి తాము ఎంచుకున్న లక్ష్యాలకు చేరువ చేస్తుంది. – పోలీస్ భీమేశ్, కవి, రచయిత, అనంతపేట్, నిర్మల్ ఇంట్లోనే గ్రంథాలయం పుస్తకాలు చదవడం చిన్నప్పటినుండే అభిరుచిగా మారింది. ఎక్కడ కొత్త పుస్తకం కనపడినా వెంటనే కొనేయడం అలవాటైంది. మిత్రులు, సాహితీవేత్తలు కానుకగా ఇచ్చిన పుస్తకాలతో ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటైంది. ఏ కాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తుంటా. పుస్తకాలు చదవడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. – అంబటి నారాయణ, సాహితీవేత్త, నిర్మల్ -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్లోని ట్రినిటీ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనా యత్, రశ్మిత, నేహ, నిఖిత 467 మార్కులు సాధించారు. 48 మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్. హేమనందిని 438 మార్కులు, 16మంది 436, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494 మార్కులు, రాహుల్, దీపిక 490, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994, 13మంది 993, 21మంది 992 మార్కులు, 27 మంది 991 మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996 మార్కులు, మహతి, పల్లవి 994 మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992 మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి అభినందించారు. -
కొంతన్నా కొనాల్సిందే..
తాంసి: మహిళలకు బంగారం అలంకారం కన్నా అధిక ప్రియమైంది. అందుకే కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. ముఖ్యంగా అక్షయ తృతీయ, దీపావళి సమయాల్లో బంగారం కొనడం శుభసూచకంగా భావిస్తారు. ధరలో తగ్గుదల ఉంటే బాగుంటుంది. అయినప్పటికీ కొంతన్నా కొనాల్సిందే. – దారవేణి సుప్రియ, గృహిణి, తాంసి శుభకార్యాలు భారంగా.. ఆదిలాబాద్: గతేడాదితో పోలిస్తే ఈఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెళ్లి వేడుకల్లో బంగారాన్ని కానుకగా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ధరలు ఇలా పెరిగితే సామాన్యులకు కష్టమే. పెళ్లి సమయంలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటే శుభకార్యాలు సైతం భారంగా మారుతాయి. – రవళి, గృహిణి ధర తక్కువ ఉండేది.. ఆదిలాబాద్ : మేము చిన్నగా ఉన్నప్పుడు బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. తులం రూ.2 వేల నుంచి 3 వేల వరకు ధర పలికేది. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు చేరండం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. భవిష్యత్లో ఇంతకంటే ధర ఎక్కువగా పెరిగితే బంగారం కొనడం కష్టమే. – సూరం మల్లమ్మ, కుమ్మరివాడ -
‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతా లక్సెట్టిపేట: చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ప్రోత్సాహంతో హాస్టల్లో ఉంటూ చదువుకుని మంచి మార్కులు సాధించాను. కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివి భవిష్యత్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలని అనుకుంటున్న. కళాశాలలో సొసైటీ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యాను. అందువల్లే మంచి మార్కులు సాఽధించాను. లెక్చరర్లు చాలా మంచిగా సిలబస్ బోధించారు. మంచి ఉద్యోగం చేసి అమ్మానాన్నలకు ఆర్థికంగా అండగా ఉంటాను. – అస్మిత, 994 మార్కులులక్సెట్టిపేట: ఇంటర్మీడియెట్ ఫలి తాల్లో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ప్రైవేటు కశాళాలకు దీటుగా మార్కులు సాధించారు. కళాశాలలోని గ్రూపుల్లో ద్వితీయ సంవత్సరం 97శాతం, ప్రథమ సంవత్సరం 86శాతం ఉత్తీర్నత సాధించినట్లు ప్రిన్సిపాల్ రమాకల్యాణి తెలిపారు. అక్షయ వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 987 మార్కులు, శ్రీవర్ష ప్రథమ సంవత్సరంలో 493 మార్కులు సాధించారు. విద్యార్థులను తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది అభినందించారు. ఎంపీసీలో 994మార్కులు సాధించిన అస్మితకళాశాల విద్యార్థిని దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన చిట్ల రమణ, సునీత దంపతుల కూతురు అస్మిత ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 994మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తుండగా.. తల్లి గృహిణి. ఒకటో తరగతి నుంచి ఐ దో తరగతి వరకు గ్రామంలో చదివింది. బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ప్రథమ సంవత్సరంలో ప్రజ్ఞకు 468మార్కులునస్పూర్ పట్టణానికి చెందిన బెనికి శ్రీశైలం, శ్రీలక్ష్మి దంపతుల కూతురు ప్రజ్ఞ ఎంపీసీ ప్రథమ సంవత్సరం 468మార్కులు సాధించింది. తండ్రి ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా చేస్తుండగా..తల్లి గృహిణి. మోడల్స్కూల్ విద్యార్థినికి బైపీసీలో 467మార్కులు కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని కొమ్మల స్వతంత్య్ర ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. దేవాపూర్కు చెందిన స్వతంత్ర తండ్రి సంతోష్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సివిల్స్ సాధించడం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు స్వతంత్ర తెలిపింది. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● పైలట్ ప్రాజెక్టుగా భీమారం ఎంపిక ● కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి/భీమారం: భూభారతితో రైతుల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కోటపల్లి, భీమారం మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతి అమలుకు మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తుందని, జిల్లాలో భీమారం మండలం ఎంపికై ందని ప్రకటించారు. ప్రస్తుత తహసీల్దార్తోపాటు మరో ముగ్గురిని కేటాయిస్తామని, సర్వేయర్లు, అధికారుల బృందం గ్రామాల్లో పర్యటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఆర్డీవో శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, డీటీ నవీన్కుమార్, భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు. ప్రతీ రైతుకు చట్టాన్ని వివరించాలిమంచిర్యాలఅగ్రికల్చర్: భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంలో పొందుపర్చిన హక్కులు, అంశాలను ప్రతీ రైతుకు వివరించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, గృహ నిర్మాణాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, హౌసింగ్ పీడీ బన్సీలాల్ పాల్గొన్నారు. -
మండుతున్న సూరీడు
● 44.3 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ● వడదెబ్బతో జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సూరీడు భగ భగ మండిపోతున్నాడు. నాలుగు రోజులుగా జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగిలి జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. ఉదయం ఎండలు, సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. మంగళవారం భీమారం మండలంలో 44.3 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సింగరేణి బొగ్గు గని ఏరియాలో ఎండవేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. ఓపెన్కాస్టుల్లో కార్మికులు అల్లాడిపోతున్నారు. రానున్న మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.జిల్లాలో గత నాలుగు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలుగొడుగుతో వెళ్తున్న కలెక్టరేట్ ఉద్యోగులుతేదీ కనిష్టం గరిష్టం 19 26.2 42.6 20 27.6 42.8 21 28.4 43.6 22 29.2 44.3 -
ఏజెన్సీ గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు
తాండూర్: ఏజెన్సీ గ్రామాల సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం మండలంలోని రేచి నీ గ్రామ పంచాయతీ పరిధి గజ్జలపల్లి, తోటిగూడ గ్రామాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహా రం పంపిణీ సరిగా జరగడం లేదని ఫిర్యాదు రావడంతో అంగన్వాడీ టీచర్పై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి స మస్య సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీవో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కిష్టంపేట గ్రామస్తులు, నర్సాపూర్ పరిధిలోని రెండు చెరువుల్లో పూడిక తీత తీయించాలని, గ్రామ శివారులో ని రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నాయకులు విన్నవించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను పీవో ఆదేశించారు. తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
విపత్తు సాయం పెంపు
● కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ● విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ● బాధిత కుటుంబాలకు ఊరటబెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల కారణంగా మృతిచెందినవారి కుటుంబాల కోసం సానుకూల నిర్ణయం తీసుకుంది. వడగాల్పులు లేదా ఎండ తీవ్రత వల్ల మరణిస్తే, బాధిత కుటుంబాలకు అందించే విపత్తు సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. వడదెబ్బను ప్రత్యేక విపత్తుగా గుర్తించిన ప్రభుత్వం, ఈ సాయం అందించేందుకు విధివిధానాలను నిర్దేశించింది. విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిరుపేదలే బాధితులు.. ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గంటల తరబడి ఎండలో పనిచేసే గ్రామీణ ఉపాధి కూలీలు, భ వన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు ఉష్ణోగ్రతలు 35 నుంచి 48 డిగ్రీల సెల్సియస్కు చేరుతాయి. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిగా మారుతుంది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ వడగాల్పులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మరణ నిర్ధారణకు మండల కమిటీ వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు మండలస్థాయిలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో తహసీల్దార్(రెవెన్యూ శాఖ), సబ్–ఇన్స్పెక్టర్ (పోలీసు శాఖ), మండల వైద్యాధికారి (వైద్య శాఖ) సభ్యులుగా ఉంటారు. కమిటీ మార్గదర్శకాల ప్రకారం మరణాన్ని ధ్రువీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పోస్ట్మార్టం నిర్వహిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆమోదంతో బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తారు. ఉపశమనం కోసం ప్రభుత్వం చర్యలు వడదెబ్బ మరణాలకు పరిహారాన్ని గణనీయంగా పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించనుంది. సత్వర నిర్ధారణ, పారదర్శక పరిహార పంపిణీతో విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. -
దేశానికే దిక్సూచిలా పాలన
మంచిర్యాలటౌన్: తెలంగాణ ఉద్యమం 1969, 1972 లలో పెద్ద ఎత్తున సాగినా నాడు తెలంగాణను సాధించుకోలేక పోయాం. తెలంగాణ సాధన కోసం నాడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ను స్థాపించి అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకుసాగారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్షా దివాస్తో కేంద్రం కదిలివచ్చి డిసెంబర్ 9న తెలంగా ణను ప్రకటించింది. అయినా ఎన్నో ఇబ్బందులకు గురిచేయడంతో రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి పోరాడిన ఘనత కేసీఆర్ది. 2014లో రాష్ట్ర పగ్గాలు చేప ట్టి దేశానికే దిక్సూచిలా పదేళ్లు చేసిన పరిపాలన, పథకాలు, అభివృద్ధి ఎనలేనిది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇవ్వడంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చింది. ఈ నెల 27న చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. – మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మంచిర్యాల -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యలు త్వరగా ప రిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధి కారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పీవోకు అ ర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రజా వాణికి పింఛన్, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన 65 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీ టిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఐఎంఏ’లో కుల రాజకీయం!
● దళిత వైద్యుడిపై మరో వైద్యుడి వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మంచిర్యాల చాప్టర్లో కుల రాజకీయం వివాదాస్పదమైంది. గత సెప్టెంబర్లో జిల్లా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా పోటీలో ఉన్న ఓ సీనియర్ వైద్యుడు.. మరో వైద్యుడిపై తన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసిన అ భ్యంతకర వ్యాఖ్యలపై విచారణ మొదలైంది. జిల్లా ఎన్నికల్లో గెలిచేందుకు పోటీలో ఉన్న ఓ సీని యర్ వైద్యుడు.. పోటీదారుడైన ఓ దళిత సీనియర్ వైద్యుడిపై తీవ్ర ఆరోపణ చేశారు. ఆ సమయంలోనే పో లీసులకు ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్లో ఫిర్యా దు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలే దు. అంతేగాక జిల్లా ఐఎంఏలో కీలకంగా ఉన్న ఆ వైద్యుడు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా అనేక ర కాలుగా పలుకుబడి వాడి ఒత్తిడి తెస్తున్నట్లుగా తె లుస్తోంది. దీనిపై సదరు వైద్యుడు, సంధి చేసుకుని కేసు కాకుండా ఉండేందుకు మొదట క్షమాపణ చె ప్పి కూడా, మళ్లీ తన మాటలకు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించాడు. దీంతో తాజాగా మళ్లీ వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో కుల ప్రస్తావన తెచ్చి తనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో గెలిచారని రారష్ట్ర ఐఎంఏ ప్రతినిధులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో రెండు రోజుల క్రితం నిజ నిర్ధారణ కమిటీ జిల్లా అసోసియేషన్ సభ్యుల నుంచి ఈ ఘటనపై వివరాలు సేకరించింది. త్వరలోనే రాష్ట్ర కమిటీకి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య అసోసియేషన్ ఎన్నికల్లో కుల ప్రస్తావన తెచ్చినట్లు రుజువైతే గెలిచిన ఆ ప్రతినిధిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కార్మిక సమస్యలపై ఆందోళనలు శ్రీరాంపూర్: సింగరేణిలో కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనున్నట్లు టీబీజీకేఎస్ నాయకులు తెలిపారు. సోమవారం ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో నూతన గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త గనులు లేకపోతే సంస్థ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. సమస్యలపై మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 25న జీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు కార్మికవర్గం రావాలని పిలుపునిచ్చారు. వాల్పోస్టర్లు విడుదల చేశారు. యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు పొగాకు రమేష్, పానుగంటి సత్తయ్య, అన్వేష్రెడ్డి, నాయకులు ఉత్తేజ్రెడ్డి, సాధుల భాస్కర్, రమేష్, లాల, జయపాల్రెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చి..
లక్ష్మణచాంద: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే బాలింత ప్రాణాలు కో ల్పోయిన విషాదకర ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాపట్ల ఆశన్న–లలిత దంపతుల చిన్న కుమారుడు అరుణ్కు మూడేళ్ల క్రితం ఖానాపూర్కు చెందిన హేమశ్రీతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితం హేమశ్రీ మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం నిర్మల్లోని ఓ ఆస్పత్రిలో రెండో సంతానంగా మరో మగబిడ్డను ప్రసవించింది. అంతలోనే హేమశ్రీకి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు కుటుంబీకులకు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆ తల్లి కన్నుమూయగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
పోడు రైతులకు అండగా ఉంటాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ● అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం చెన్నూర్: పోడు భూములు సాగు చేసుకుని జీ వనం సాగిస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూర్ ఎఫ్డీవో కార్యాలయంలో అధి కారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండలం పిన్నారం, ఎసాన్వాయి, బొప్పారం, ఎడగట్ట గ్రామాల్లో పోడు రైతులను కొందరు అధి కారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. రైతుల ఎద్దులు, నాగళ్లను తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఫా రెస్ట్ అధికారులు నాలుగు గ్రామాల్లో కందకాలు ఏ ర్పాటు చేశారని, వాటి అవతల వ్యవసాయం చేసుకుంటున్న రైతులను చిత్రహింసలకు గురిచేయడం బాధాకరమని అన్నారు. కోటపల్లి అటవీ అధికా రుల తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బీ జేపీ అధ్యక్షుడు మంత్రి రామయ్య, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, మాజీ కౌన్సి లర్ కమ్మల శ్రీనివాస్, వంశీగౌడ్ పాల్గొన్నారు. -
భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి
నస్పూర్: భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రై తులందరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణ పరిధిలోని సీతారాంపల్లి రైతువైదిక వద్ద భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూ తన చట్టంపై ఈ నెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన క ల్పిస్తామని తెలిపారు. హక్కులు, రికార్డుల్లో తప్పు ల సవరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. భూఆధార్ కార్డులు జారీ చేస్తామని, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, జూన్ 2 నుంచి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అన్నారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్రావు, తహసీల్దార్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండలంలోని కొత్తూరు, వెంకట్రావ్పేట, ఎల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. నిర్వాహకులు రైతుల వివరాలు ట్యాబ్లో నమోదు చేయాలని సూచించారు. ధాన్యం రశీదులు రైతులకు అప్పగించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులు, గ్రామ సమైఖ్య సభ్యులు పాల్గొన్నారు. వరిధాన్యం బకాయిలు చెల్లించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: గత 2022–23 యాసంగి సీజన్ వరిధాన్యం బకాయి ఉన్న రైస్మిల్లరు వెంట నే పూర్తిగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారా వు, జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్మిల్లర్లతో బకాయి చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం బకాయి ఉన్న దాదాపు రూ.87 కోట్లు రైస్మిల్లర్లు వెంటనే చెల్లించాలని, రూ.కోటిలోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి అర్జీ లు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్, పరి హారం తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖ లకు సంబంధించిన అర్జీలు పెండింగ్లో ఉంచరాద ని అన్నారు. అధికారుల పరిధిలో సమస్య పరి ష్కారం కాకుంటే చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ● భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టుకోనివ్వకుండా కొంతమంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చేపలు పట్టుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భీమారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. -
స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది..
బెల్లంపల్లి: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉంది. స్వ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ ప్రజా సహకారంతో వీరోచితంగా పోరాడి అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ పార్టీగా ఏర్పడి సాధించుకున్న తెలంగాణను బంగారుమయం చేయడానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ 10ఏళ్లపాటు కష్టపడ్డారు. ఎందరో అమరులు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారు. ఒక్కడితో ఏర్పడిన పార్టీ క్రమంగా బలోపేతమైంది. బీఆర్ఎస్ పార్టీ చరిత్రతో మరే రాజకీయ పార్టీని చూడలేం. బీఆర్ఎస్తోనే రాష్ట్ర ప్రజల జీవితం ముడి పడి ఉంది. – మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి -
నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..
● ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సీపీ ● నిందితులకు శిక్ష పడటమే లక్ష్యం ● పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ ● ఏడాదిలో 135 మందికి జైలు శిక్ష ● ఈ ఏడాది శిక్షలు పెంచేలా చర్యలు మంచిర్యాలక్రైం: ఒక్కసారి నేరం చేసినవారు మరో సారి నేరాలకు పాల్పడకుండా వారికి సరైన శిక్ష పడేలా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎఫ్ఐఆర్ న మోదు నుంచి నిందితుడికి శిక్ష పడేదాకా అన్ని జా గ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి శిక్షల శాతాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ప లుసార్లు కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్, లైసన్ ఆఫీసర్లతో సీపీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 2024లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 80 కే సుల్లో 135 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండు కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగారం, మరో రెండు కేసుల్లో ఆరుగురికి పదేళ్ల జైలు, మంచిర్యాల జిల్లాలో మూడు కేసుల్లో ముగ్గురికి ఐదేళ్లు శిక్ష పడేందుకు కృషి చేశారు. శిక్షలు పడిన ఘటనలు కొన్ని.. ● 2016 సెప్టెంబర్ 17న మంచిర్యాల ఠాణా పరిధిలోని ఘడ్పూర్ పంచాయతీ పరిధి బాబానగర్కు చెందిన సండ్ర లక్ష్మణ్, అనిల్, అశోక్ను అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ గొడ్డలి, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ఎస్సై వేణుగోపాల్రావు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఎదుట పీపీ మదన్మోహన్రావు కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. దీంతో శ్రీనివాస్కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 2024 మే 8న తీర్పునిచ్చారు. ● 2022లో మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి ఠాణా పరిధి సుర్జాపూర్కు చెందిన దాసరి శ్రీనివాస్, రాజన్న బైక్పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూదరి చంద్రశేఖర్ తన ట్రాక్టర్తో బైక్ ఎక్కించి గొడ్డలితో నరికి చంపుతానని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఎస్సై గంగారాం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కాగా అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి చంద్రశేఖర్కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ● 2017 అక్టోబర్ 21న జిల్లాలోని లక్సెట్టిపేట ఠాణా పరిధి ఇందిరానగర్లో ఇంటి ప్రహరీ విషయంలో మామిడి మల్లయ్య, దుంపల బంగారమ్మకు గొడవ జరిగింది. బంగారమ్మ, ఆమె కుమారులు సురేశ్, నరేశ్ మల్లయ్య కుమారులు చంద్రమౌళి, రాజగోపాల్, కృష్ణంరాజుపై తల్వార్లతో దాడి చేయగా చంద్రమౌళి మృతి చెందాడు. రాజగోపాల్, కృష్ణంరాజును గాయపరిచారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. బంగారమ్మ, నరేశ్, సురేశ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అప్పటి న్యాయమూర్తి డీ వెంకటేశ్ 2022 జనవరి 8న తీర్పునిచ్చారు. నేరస్తులు తప్పించుకోలేరు నేరం చేసిన వారు చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, సెల్ఫోన్ కాల్డేటా, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పంచనామా సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేసి కోర్టుకు అందజేస్తున్నాం. నేర దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక సమ్మె
బాసర: యుటాక్ స్టేట్ అసోసియేషన్ పిలుపుమేరకు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. 17 ఏళ్లుగా పని చేస్తున్న తమ ను రెగ్యులరైజ్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మా ట్లాడారు. బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అధ్యాపకులతో ప్రారంభమైందని, విశ్వవిద్యాలయ పు రోగతికి తమవంతు కృషి చేస్తున్నామని తెలిపా రు. కాంట్రాక్ట్ వ్యవస్థకు ముగింపు పలికి విశ్వవి ద్యాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విజ య్కుమార్, మందా సతీశ్కుమార్, డాక్టర్ రాములు, శ్రీధర్, తిలక్రెడ్డి, భానుప్రియ, రమాదేవి, ప్రశాంతి, రజితారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. 13వ రోజుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్ష ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చే పట్టిన నిరవధిక నిరసన దీక్ష సోమవారం 13వ రోజుకు చేరింది. తమకు అదనపు బాధ్యతలు వ ద్దని, రెగ్యులర్ చేయాలని, తమ సేవలు గుర్తించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని విశ్వవిద్యాలయం ఆ వరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉ పేంద్ర, కృష్ణప్రసాద్, ఖలీల్, డాక్టర్ కుమార్ రా గుల, డాక్టర్ విఠల్, ప్రకాశ్, డాక్టర్ రోషన్, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ పావని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
దాడికి పాల్పడ్డ ముగ్గురి అరెస్ట్
భీమిని: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి బైండోవర్ చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన పెద్దపల్లి ప్రశాంత్ సోమవారం కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామంలో చేపట్టిన తన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. మల్లీడి గ్రామానికి తన బంధువులైన పెద్దపల్లి నగేశ్, పెద్దపల్లి గణేశ్, పెద్దపల్లి సురేశ్ పాతకక్షలతో ప్రశాంత్పై చేతులు, కర్రలతో దాడి చేశారు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టినట్లు ఎస్సై తెలి పారు. మరోసారి గొడవ పడకుండా తహసీల్దార్ శ్రవణ్కుమార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
బోథ్: మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెంది న నైతం భూమన్న (35) ఈ నెల 17న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎ స్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమన్న ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మద్యం తాగి ఇంట్లో భార్య లక్ష్మితో గొ డవ పడ్డాడు. దీంతో లక్ష్మి మందలించగా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు బోథ్లోని సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్లోని రి మ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, మూడేళ్ల కుమారుడున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన మునుగంటి చంద్రశేఖర్ (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ ఈ నెల 20న పురోహితం ముగించుకుని ఎల్లారం గ్రామ స్టేజీ మీదుగా బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్కు బలమైన గాయాలు కాగా స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు జాహ్నవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రక్తహీనతతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరేకర్ సౌజన్య (15) రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా రక్త హీనతతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సిబ్బంది సౌజన్యను రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే.. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే సౌజన్య మృతి చెందిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆ రోపించారు. సౌజన్య కుటుంబీకులను ఆయన పరా మర్శించారు. సౌజన్యను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందిందని పేర్కొన్నారు. సౌజన్య తండ్రి గతంలోనే మరణించగా తల్లి అనిత కూలీ పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని, కేజీబీవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జైపూర్: మండలంలోని టేకుమట్ల రోడ్డు సమీపంలో ఇందారం ప్లాంటేషన్ వద్ద గంజాయి విక్రయించేందుకు వచ్చిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రాటే నగేశ్, చౌతాకారి శ్రీకాంత్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పై శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన నగేశ్, శ్రీకాంత్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు బైక్పై వెళ్లి అక్కడి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేస్తుంటారు. అందులో కొంత సేవించి మిగతా దా న్ని ప్యాకెట్లుగా చేసి రూ.500 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ జల్సా చేసేవారు. ఈ క్రమంలో అక్కడ గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేందుకు తెస్తుండగా సోమవారం వారిని పట్టుకున్నట్లు ఎస్సై తెలి పారు. వారి నుంచి 102 గ్రాముల గంజాయి, సెల్ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
‘పేదల ఆరోగ్యంపై వివక్ష ఎందుకు’
ఆదిలాబాద్టౌన్(జైనథ్): పేదల ఆరోగ్యంపై ఈ ప్ర భుత్వాలకు వివక్ష ఎందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదో రో జు సోమవారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనమని చెబుతూనే దొడ్డు బియ్యం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. కోడి గుడ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇదేనా విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనమని ప్ర శ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యతగా లేద ని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. మందులు ఉన్నాయా.. లేవా.. అనే విషయాలను రోగుల ద్వారా తెలుసుకున్నారు. మా భూమి రథయాత్ర ద్వారా విద్య, వై ద్యం, ఉపాధి రంగాలన్నింటినీ పరిశీలించి వాటి మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతామని వివరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఇతర నాయకులున్నారు. -
‘అంబేడ్కర్ విధానాలను కాలరాసిన కాంగ్రెస్’
ఆదిలాబాద్: అంబేడ్కర్ విధానాలను అధికారంలో ఉన్న 60 ఏళ్లపాటు కాంగ్రెస్ కాలరాసిందని ఎంపీ గోడం నగేశ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ఆరోపించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సదస్సు నిర్వహించా రు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకూ అంబేడ్కర్ చే సిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి పెద్దపీట వేసింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అస్తక్ సుభాష్, పాయల్ శరత్ తదితరులున్నారు. నివాళులర్పిస్తున్న ఎంపీ నగేశ్, మహేందర్ -
నస్పూర్లోని ఓ ఇంట్లో చోరీ
నస్పూర్: పట్టణ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరి గినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ హిల్స్లో నివాసముండే భూపెల్లి లావణ్య ఈ నెల 18వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ స భ్యులతో కలిసి గోదావరిఖనికి పెళ్లికి వెళ్లింది. ఈనె ల 21న తిరిగి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూసి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఇల్లు, పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు దండేపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. దండేపల్లి, హాజీపూర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొ క్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రాంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు సాగునీటి నుంచి మొదలు, పండించిన పంటను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యాసంగిలో రైతులు వరితోపాటు, చాలాచోట్ల మొక్కజొన్న పంట సాగుచేశారన్నారు. దీంతో వరి కొ నుగోలు కేంద్రాలతోపాటు, మొక్క జొన్న కొ నుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. హాజీపూర్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివి ధ పథకాలను మహిళల అభ్యున్నతికి తీసుకు వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, డీఆర్డీవో కిషన్, డీపీఎం వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, ఏపీఎం బ్రహ్మయ్య, ఏవో అంజిత్, రైతులు పాల్గొన్నారు. -
సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం
● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ భీమారం: రైతులకు సాగునీటిని అందించేందు కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో పాత చెరువుకు రూ.33 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించా రు. చెరువుల కింద పెద్ద ఎత్తున పంటలు సాగవుతాయని, అందుకే చెరువుల అభివృద్ధికి కూ డా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. తర్వాత పోలంపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పార్టీ కార్యాలయం.. రామకృష్ణాపూర్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే మందమర్రిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేసినట్లు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి బీ–1 క్వార్టర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. సింగరేణి కార్మికుల పెన్షన్ రూ.10 వేలకు పెంచేలా కేంద్రంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు నోముల ఉపేందర్, సొత్కు సుదర్శన్, తిరుమల్ పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై తప్పుడు ప్రచారం
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ పై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచా రం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, నాయకులతో కలిసి ఆది వారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్బో ర్డును ప్రక్షాళన చేయాలని, వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు దక్కాలని సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంఐఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇన్ని రోజులుగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సంపన్న ముస్లిం పెద్దలు అవినీతికి పాల్పడి ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. కొన్ని మతతత్వ పార్టీలు ముస్లిం మైనారీటీ ఓటు బ్యాంక్ కోసం ముస్లింలలో అపోహలు సృష్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టి వెంకటకృష్ణ, కొయ్యల ఏమాజీ, గాజుల ముఖేశ్గౌడ్, తాజ్ఖాన్, ఎనగందుల కృష్ణమూర్తి, అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్రావు, మాసు రజిని, అక్కల రమేశ్, రాకేశ్ రెన్వా, చిరంజీవి పాల్గొన్నారు. -
ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు, రుణాలు
పప్పు దినుసుల సాగుకు ప్రోత్సాహం..రానున్న ఖరీఫ్ సీజన్లో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులకు అవగా హన సదస్సులు నిర్వహిస్తాం. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు ప్రణాళిక రూపొందించడం జరిగింది. పత్తి విత్తనాలు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. తప్పని సరిగా రశీదు తీసుకోవాలి. నాణ్యత లేని, హెచ్టీ పత్తి వి త్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దు. కలు పు నివారణ కోసం గ్లైఫొసెట్ పిచికారీ చే యడం వలన భూసారం దెబ్బతింటుంది. రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. – జి.కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి నెన్నెలలో వేసవి దుక్కులు దున్నుతున్న రైతు ఇతర విత్తనాలు 32,324 క్వింటాళ్లుపత్తి విత్తనాలు 3,40,306 ప్యాకెట్లుసాగు విస్తీర్ణం 3,33,565 ఎకరాలుమంచిర్యాలఅగ్రిల్చర్: మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కానుంది. యాసంగి పంటలు పూర్తయిన రైతులు ఇప్పటికే చేలను చదును చేస్తున్నారు. వేసవి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నా రు. దీంతో వ్యవసాయ శాఖ వానాకాలం సాగు కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది ఆలస్య వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సకాలంలో వానలు.. గతేడాది ఖరీఫ్లో ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు సాధరణ స్థాయికి చేరాయి. దీంతో సాగు విస్తీర్ణం సాధరణ స్థాయికి చేరింది. ఈయేడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాగు విస్తీర్ణం, విత్తనాల ప్రణాళిక గతేడాది వానాకాలంలో జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 3.33 లక్షల ఎకరాలకు సాగు పెరుగుతుందని అంచనా. ఇందులో పత్తి (1.58 లక్షల ఎకరాలు), వరి (1.58 లక్షల ఎకరాలు), కందులు, మొక్కజొన్న, పెసలు, మినుములతో సహా ఇతర పంటల సాగు ప్లాన్ రూపొందింది. పత్తి కోసం 3.40 లక్షల ప్యాకెట్లు, వరి కోసం 23,790 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. సేంద్రియ ఎరువులైన జిలుగ, జనుము విత్తనాలపై ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. యూరియా (43,952 మెట్రిక్ టన్నులు), డీఏపీ (13,306 మెట్రిక్ టన్నులు) ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుణ లక్ష్యం, రైతుల సమస్యలు ఈ ఏడాది రూ.2,242 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. గతేడాది కంటే రూ.250 కోట్లు అధికం. అయితే, గతేడాది రూ.1,346 కోట్లు మాత్రమే అందిన నేపథ్యంలో, సకాలంలో రుణాలు అందకపోతే రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి ఉంది. రబీ దిగుబడి ఆలస్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల సహాయం సకాలంలో అందితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ రాయితీ విత్తనాలు 45,424 క్వింటాళ్లు (జీలుగ, జనుము)ఎరువులు : 1,10,205 మెట్రిక్ టన్నులురుణ లక్ష్యం : రూ.1951.25 కోట్లు ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు పత్తి, వరి సాగే ప్రధానం -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
● కలెక్టర్ కుమార్ దీపక్చెన్నూర్/జైపూర్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి 2025 ఆర్వోఆర్ చట్టం అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో, జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవో శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు భూముల వివరాలను పూర్తిస్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములను విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. జూన్ 2 నాటికి ఎంపిక చేసిన మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించి మిగిలిన మండలాల్లో ఆగస్టు 15 వరకు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అనంతరం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెన్నూర్లోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఇంది రా మహిళ శక్తి పథకంలో భాగంగా మండల సమాఖ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను ప్రారంభించారు. -
ఆర్టీసీ సర్వర్ డౌన్.. నిలిచిన బస్సులు
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ మంచిర్యాల డిపోలో ఆదివారం సాంకేతిక లోపం కారణంగా సర్వర్ డౌన్ అయింది. దీంతో బస్సుల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం 3:45 నుంచి 8:30 గంటల వరకు పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులతో సహా 74 బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. దీంతో బస్స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం ఎందుకు? హైదరాబాద్కు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించిన డ్రైవర్, కండక్టర్లు టిమ్ లోడింగ్కు డిపోకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత సిస్టమ్లో (కంప్యూటర్)లో కండక్టర్, డ్రైవర్, టిమ్ నంబర్ నమోదు చేయాల్సిన చోట వివరాలు నమోదు కాలేదు. టిమ్ లోడింగ్ చేస్తేనే టిక్కెటు ఇష్యూ అవుతుంది. (సాంకేతిక లోపం)తో ఫైల్ కరెఫ్ట్ (ఎర్రర్) రావటంతో టిమ్ లోడింగ్ కాలేదు. అయితే, సర్వర్ లోపంతో ఫైల్ కరప్ట్ కావడంతో టిమ్ లోడింగ్ విఫలమైంది. సిస్టమ్ ఇన్చార్జి వీక్లీ ఆఫ్లో ఉన్నప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా డిపోకు వచ్చారు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ అనలైజర్ తప్పనిసరి అనడంతో వివాదం చెలరేగింది. తన డ్యూటీ కాకపోయినా సంస్థ కోసం విధులకు హాజరైతే బ్రీత్ ఎన్లైజర్ పేరుతో అవమానిస్తారా అని ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి బ్రీత్ అనలైజర్కు నిరాకరించడంతో సమస్య పరిష్కారం ఆలస్యమైంది. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ఉదయం 9 గంటలకు సమస్య పరిష్కరించడంతో బస్సులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. డిపోలో అనిశ్చితి మంచిర్యాల డిపోలో ఇటీవల విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం డిపో కార్యాల య తాళాలు సెక్యూరిటీ కార్యాలయం నుంచి మా యమయ్యాయి. శనివారం ఉదయం తాళాలు లేని విషయం తెలిసి, తలుపులు కట్టర్తో కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి రావచ్చు. ఈ సంఘటనలు ఆర్టీసీ డిపోలో సమన్వయ లోపాన్ని, ప్రయాణికులకు ఇబ్బందులను తెలియజేస్తున్నాయి. పరిష్కారం కోసం చర్యలు సాంకేతిక లోపాలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది మధ్య సమన్వయం, సెక్యూరిటీ విధానాల సమీక్ష అవసరం. ప్రయాణికుల సౌకర్యం కోసం డిపో నిర్వహణలో సమర్థత పెంచాలి. మూడు గంటలకుపైగా ఆలస్యం.. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్శ్రీరాంపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. నస్పూర్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. గెలిచిన తరువాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్యేలను మంత్రులు చేయడానికి గెలిపించలేదని, వారి హామీలు అమలు చేస్తారని నమ్మి గెలిపించారన్నారు. జిల్లాలో గంజాయి బ్యాచ్ పెట్రోగిపోతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. అధికా రులు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకుని నిస్పక్షపాతంగా పని చేయాలన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఇప్పటికి కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు కనిపించుకుండా చేస్తున్నారన్నారు. పార్టీ రజతోత్సవ వేడుకల కోసం చెన్నూర్లో వాల్రైటింగ్, పోస్టర్లు వేస్తే చింపివేస్తున్నారన్నారు. ఈనెల 27 ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరా వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నడిపెల్లి విజిత్రావు, డాక్టర్ రాజారమేశ్, పార్టీపట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్కుమార్ పాల్గొన్నారు. -
క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు
● రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆదిలాబాద్: క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, తెలంగాణ క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలు, క్రీడ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను గురించి డీవైఎస్వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని డీఎస్ఏ అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. హాస్టల్, జిమ్ను పరిశీలించి, మరిన్ని సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షకుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ అధికారులు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్, కిసాన్ కాంగ్రెస్ బేల అధ్యక్షుడు ఘన్శ్యామ్, మాజీ సర్పంచ్ రూప్ రావు, రమేశ్ పటేల్, ఠాక్రే సాగర్ పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
బెజ్జూర్: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సుంకరి లక్ష్మి (55) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108లో కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త సుంకరి పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
కారాదు విషాదం
ఈత సరదా.. ● నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువకులు ● తల్లిదండ్రులకు తీరని శోకం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లడం అంటే ఎవరికై నా సరదాగానే అనిపిస్తుంది. వేసవికాలం వచ్చిదంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో చిన్నాపెద్ద తేడాలేకుండా చెరువులు, వాగులు, స్విమ్మింగ్ పూల్స్లో సరదాగా ఈత కొడుతుంటారు. అయితే ఈత సరదా కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తోంది. పలువురి ప్రాణాలు బలిగొంటోంది. నీటిలోకి దిగి ఈతరాక అందులో మునిగి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సరదాగా ఈత కసం చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ● ఈ నెల 18న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లికి చెందిన పూరెళ్ల అశోక్ (20)శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి స్నానా నికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ● ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్కు చెందిన ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులు ఆడుకుంటూ గ్రామ సమీపంలోని చెరువువద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందారు. ● ఈ ఏడాది మార్చి 4న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన గూడెం సత్యనారాయణ (41) స్నానం చేసేందుకు గోదావరినదికి వెళ్లి ఈతరాక నీటమునిగి మృతి చెందాడు. ● ఈఏడాది మార్చి30న ఆదిలాబాద్ జిల్లా నార్నూ ర్ మండలంలోని గంగాపూర్కు చెందిన శంకర్ (20) కెరమెరి మండలంలోని శంకర్ లొద్దికి దైవదర్శనానికి వెళ్లాడు. స్నానం చేసేందుకు చెరువులో దిగి నీటమునిగి మృతి చెందాడు. ● ఈ నెల 5న ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని చెరువులో ఈతకు వెళ్లిన పదేళ్లలోపున్న సంజీవ్, రాహుల్ ఈతరాక నీటమునిగి మృతి చెందారు. ● 2020లో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్షిప్కు చెందిన వాసు (13), సతీశ్ (14) గ్రామ శివారులోని వ్యవసాయ కుంటలో ఈతకొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు. ● 2024 నవంబర్ 1న మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నేపల్లికి చెందిన కొండ అరుణ్ కుమార్ (18), దాసరి సాయి (16) సుందరశాల సమీపంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. ● 2024 మార్చి 26న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నదిమాబాద్కు చెందిన వనస కమలాకర్ (22), ఆలం సాయి (22), ఉప్పుల సంతోష్ (25), ఎల్ముల ప్రవీణ్ (23) హోలీరోజు మిత్రులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి సమీపంలోని వార్ధానదికి వెళ్లారు. లోతుకు వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● చిన్నారులకు నిపుణుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. ● ఈత రానివారు నేరుగా నీటిలో దిగకుండా సేఫ్టీ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. ● ఈత వచ్చినవారు సైతం నీళ్లు ఎంతలోతు ఉన్నాయి? అనేది ముందుగానే గమనించిన తర్వాతే నీటిలోకి దిగాలి. లేదంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ● చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. కావున అందులోని పరిస్థితిని తెలుసుకోకుండా దూకితే ప్రమాదాల బారిన పడుతారు. ● చెరువులు, వాగులు, ఇతర జలాశయాల వద్ద అధికారులు తప్పనిసరిగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● రైతులు వ్యవసాయ బావుల చుట్టూ కంచెను ఏర్పాటు చేసి అందులోకి ఎవరూ దిగకుండా చర్యలు చేపట్టాలి. సేఫ్టీ జాకెట్ ధరించాలి ఈతకు వెళ్లే సమయంలో లైట్ సేఫ్టీ జాకెట్ ధరిస్తే ప్రమాదం సంభవించదు. ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించకనే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈతకు వెళ్లినప్పుడు ఒకరిద్దరు కాకుండా గుంపుగా స్నానం చేయాలి. ప్రమాదవశాత్తు ఒకరు మునుగుతున్నా మిగిలిన వారు కాపాడవచ్చు. – జింక లక్ష్మీనారాయణ, గజ ఈతగాడు, నిర్మల్ అవగాహన లేక.. గ్రామాలలో చెరువులు, కాలువలు, కుంటలు, వాగుల్లోకి ఈతకు వెళ్లినవారు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతోనే లోతులోకి వెళ్లి నీటమునిగి ఊపిరి ఆడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. నేను ఇప్పటి వరకు గోదావరిలో మునిగిన సుమారు వందమంది ప్రాణాలు కాపాడాను. – సాయిలు, గజ ఈతగాడు, గాంధీనగర్ ఓ కంట కనిపెట్టాలి ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. పిల్లలు ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని వేసవి శిబిరాలకు పంపించాలి. లేదంటే ఇంటిపట్టున ఉండే పిల్లలను తల్లిందండ్రులు అనుక్షణం కనిపెడుతూ ఉండాలి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తే తరచూ వాకబు చేయాలి. – పి.సాయన్న, పోషకుడు -
కారును ఢీకొన్న లారీ..
జగిత్యాలక్రైం: దైవ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన కడెం శ్రీరాం, ల్యాండ్రి ము న్నా, దన్నూరి ప్రణీత్, కారెపు రుషి, కడెం విశ్వంత్, భూమేశ్, రిషికరుణ్, నిమ్మల నర్సయ్య, కారే మధు ఆదివారం కొండగట్టు దైవదర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. రూరల్ ఎస్సై సదాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: సరదాగా ఈతకు వెళ్లి న విద్యార్థి ప్రాణా లు కోల్పోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్కు చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రాంచరణ్(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల ముగిసిన తరువాత గ్రామ సమీపంలోని వాగుపై గల చెక్డ్యామ్ వద్దకు ఈతకు వెళ్లాడు. అదే సమయంలో సరస్వతి కాలువ ద్వారా సదర్మాట్ కోసం వాగులోకి ఎక్కువ మోతాదులో నీటిని వదలడంతో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు చెక్డ్యామ్ వద్ద వెతుకగా రాంచరణ్ ప్యాంటు, షర్ట్, పాదరక్షలు లభించాయి. ఆదివారం గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది వెతుకగా మృతదేహం లభించింది. ‘పద్నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా లడ్డూ.. నీళ్లలో నీవు ఎలా నిదురపోయావురా..నీవు లేకుండా మేము ఎలా బతకాలిరా.. నన్నుకూడా నీతో తీసుకుపోరా.. అంటూ మృతుని తల్లి కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. -
పోలీసులమని చెప్పి చైన్ అపహరణ
లక్ష్మణచాంద: పోలీసులమనిచెప్పి వాహనాన్ని ఆపి మహిళ బంగారు గొలుసు అపహరించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వడ్యాల్ గ్రామానికి చెందిన ఇప్ప (కొత్తూర్)రామవ్వ ఆదివారం మధ్యాహ్నం తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు తమ ఇంటిపక్కనున్న భీమేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్ బయలుదేరింది. కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైకును ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లడం సరికాదని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో సదరు మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు తీసి తన పర్స్లో పెట్టుకునే క్రమంలో తాము పెట్టి ఇస్తామని చెప్పి తీసుకుని మళ్లీ పర్సు ఇచ్చారు. అనంతరం వారు అక్కడి నుండి జారుకున్నారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో చైన్కు బదులు రాళ్లు కనిపించడంతో లబోదిబోమంది. రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జాతీయ రహదారి పరిశీలన కనకాపూర్ జాతీయ రహదారిని నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్మీనా, ఉపేందర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన కొత్తూరు రామవ్వ నిర్మల్లో తమ బంధువుల పెళ్లి ఉండగా తన ఇంటి పక్కనున్న వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. ఈ క్రమంలో కనకాపూర్ జాతీయ రహదారిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి రామవ్వ ద్వారా వివరాలు సేకరించారు. ఘటనపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్సై మాలిక్ రెహమాన్ను ఆదేశించారు. -
ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కఉట్నూర్రూరల్: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లోని వైటీసీలో గిరిజన నిరుద్యోగులకు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ సహకారంతో హెవీ వెహికిల్ మోటార్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 59 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం దేవుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు అందజేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ విఠల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు పాల్గొన్నారు. -
తొడసం కట్టికి ఘన నివాళి
ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారధ్యం వహించిన తుమ్మగూడకు చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద ఆదివారం ఉదయం గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తుమ్మగూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో రాంనగర్చౌక్ వద్ద ఉన్న స్మారక జెండావద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తొడసం కట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మగూడ గ్రామ పెద్దలు కనక హనుమంత్రావ్, సోయం వినోద్, ఆత్రం జల్పత్రావ్, మడావి శేకు, తదితరులు పాల్గొన్నారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలుభైంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ముధోల్ వైపు నుంచి ప్యాసింజర్లతో వస్తున్న ఆటో భైంసాలోని సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తా పడగా, అందులోని ప్రయాణికులు నిజామాబాద్కు చెందిన సుశ్మిత, సతీష్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలు, చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతోక్షతగాత్రులను ఏరియాస్పత్రికి తరలించారు. -
ఆర్కేపీలో రెండు చోరీలు
● 10 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులురామకృష్ణాపూర్: పట్టణంలోని హనుమాన్నగర్లో రెండు చోరీల ఘటనలను పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమాన్నగర్కు చెందిన ఇరుముల్ల శరణ్య ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో కిటికీ పక్కన నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తస్కరించాడు. అదే కాలనీలో బుర్ర రాజేంద్రప్రసాద్ ఫోన్ను కూడా కిటికీ నుండే దొంగిలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గోదావరిఖనిలోని కాకతీయకాలనీకి చెందిన గుంజ ఇమ్మానుయేల్గా గుర్తించారు. మధ్యాహ్నం నిందితుడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఎఫ్టీటీజెడ్ బైక్పై వెళ్తుండగా పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న మూడు తులాల గొలుసు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, క్రైంటీమ్ సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డ్లను అందజేశారు. రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో నాలుగిళ్లలో చోరీ జరిగింది. ఎస్సై స్వరూప్రాజ్ కథనం మేరకు ఈనెల 18న గ్రామాని కి చెందిన కాల్ల రమ, ఊట్నూరి అంజయ్య, ఊట్నూ రి లక్ష్మి, ఊ ట్నూరి విశాల్ ఇళ్లలో చోరీ జరిగింది. కాల్ల రమ ఇంట్లో పావుతులం బంగారు పుస్తెలు, ఊట్నూరి లక్ష్మి ఇంట్లో 18 తులాల వెండి ప ట్ట గొలుసులు అపహరించారు. రమ ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఉట్నూర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాలెవాడ(కె) గ్రామానికి చెందిన కోవ ప్రకాశ్ (47), కనక దత్తు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్కు వెళ్తుండగా ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ వైపు వెళ్తున్న బైక్ పులిమడుగు సమీపంలో మూల మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోవ ప్రకాశ్కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మహిళ..భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారిపై తిమ్మాపూర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మహిళకు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, చేతిపై నేతాజీ అని పచ్చబొట్టు రాసి ఉందని, ఎరుపురంగు చీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే భైంసారూరల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యవాంకిడి: మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చెంద్రి లచ్చుంబాయి చిన్న కుమారుడు చెంద్రి సంతోష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం తల్లితో పాటు అతని భార్య కల్పన మందలించారు. దీంతో మనస్తాపానికి గురై రాత్రి అందరు పడుకున్న సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. మృతుని తల్లి లచ్చుంబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య ఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలం పెన్గంగ సమీపంలోని డొల్లార గ్రామ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఛాతి భాగంలో కత్తితో పొడవడంతో శరీరంలోని పేగులు బయటకు వచ్చాయన్నారు. ముఖంపై కత్తితో పొడిచి గాయపర్చారన్నారు. ముఖం గుర్తుపట్టకుండా బండ రాయితో కొట్టినట్లు ఉందన్నారు. మృతుడు నలుపు రంగు టీషర్ట్, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, మహారాష్ట్రవాసిగా అనుమానిస్తున్నామన్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని ఎస్సై వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే జైనథ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నిర్మల్రూరల్: రాబోయే విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డేనియల్ తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో బెల్లంపల్లిలో 80 సీట్లు (బాలురు), నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) 80 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా
మంచిర్యాల: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ మందమర్రి మొదటి జోన్లో ఉండే అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తనను గత కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నాడని చందన అనే హిజ్రా వాపోయింది. వీడియో కాల్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నాడని, ఇవ్వకపోతే రైలు కిందపడి చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. అజయ్ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతులక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్నృలక్ష్మి దంపతుల కుమారుడు రామ్చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. -
శ్రీచైతన్య విద్యాసంస్థల విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కన్యాకుమారి నుంచి కశ్మీర్కు సైకిల్యాత్ర
నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు.ఇసుక డంప్ స్వాధీనం ఆదిలాబాద్టౌన్(జైనథ్): జిల్లా అధికారుల ఆదేశాలతో జైనథ్ మండలంలోని పెన్గంగా పరీవాహక గ్రామాలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఎస్సై పురుషోత్తం, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ సాంగ్వి, కౌట గ్రామాల మధ్య ఉన్న ఇసుక డంప్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక విలువ రూ.20వేల వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. -
జేఈఈలో మెరిసిన మనోళ్లు
బెల్లంపల్లి సీవోఈ విద్యార్థుల ప్రతిభదేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించింది.బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. కళాశాల నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వీరే... ఎస్.కే. సుభాన్ 88.88 పర్సంటైల్ సాధించి కళాశాల టాపర్గా నిలవగా కె.రంజిత్ 86.57, సీహెచ్.సాయికుమార్ 85.15, కె.శ్రీనివాస్ 80.17, ఎం.సాయిరాం 78.99, ఆర్.అంజి 78.53, కె.శారూన్ 76.84, డి.రాజేందర్ 75.69, ఎస్.ఆదర్శ్ 75.04, ఎన్.రాజేశ్, 75.35, ఎస్.వెంకటేశ్వర్ 72.66, బి.ప్రవీణ్కుమార్ 73.67, బి.అంజిబాబు 72.30, జీ.చరణ్ 63.87, కె.రామ్ చరణ్తేజ 62.39 పర్సంటైల్ సాధించారు. సదరు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గం రమాదేవి, లెక్చరర్లు అభినందించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు బెల్లంపల్లి సీవోఈ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సారి కూడా జేఈఈ మెయిన్స్లో 15 మంది విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ సాధించారు. సమష్టి కృషితోనే విజయం సాధ్యమైంది. నిరుపేద విద్యార్థులైనా చదువులో తామేమీ తక్కువ కాదని నిరూపించారు. – ఆకిడి విజయ్సాగర్, సీవోఈ ప్రిన్సిపాల్, బెల్లంపల్లి షేక్ అమన్ -
శోక సంద్రంలో సోన్
సోన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అష్టపు ప్రేమ్సాగర్ మృతదేహం శనివారం స్వగ్రామం చేరుకుంది. వారం రోజుల క్రితం దుబాయిలోని ఓ ప్రముఖ బేకరీలో పనిచేస్తున్న అష్టపు ప్రేమ్సాగర్ను పాకిస్తాన్కు చెందిన యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిరెడ్డి, బీజేపీ నాయకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్నగారి భూమ య్య, ముత్కపల్లి నరేష్ పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాల అభివృద్ధి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కనేరడిగొండ: ప్రజా ప్రభుత్వంలో పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే రోప్వే నిర్మిస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ పనులను ప్రారంభించామని, జూన్ నాటికి రిసార్టు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణం దెబ్బతినకుండా కుంటాల జలపాతాన్ని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు. నిజాం కాలంలోనే కుంటాల జలపాతం వద్ద అప్పటి అధికారులు ఇక్కడ సేద తీరినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటాల జలపాతానికి, పర్యాటక రంగానికి చేసిందేమి లేదన్నారు. మంత్రి వెంట కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, నాయకులు తుల అరుణ్ కుమార్, ఆత్రం సుగుణ, తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్రావు, తిత్రే నారాయణసింగ్, జాదవ్ కపిల్, ఆడే సతీశ్, బద్దం పోతారెడ్డి, నాయిడి రవి, తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు తానూరు/భైంసాటౌన్: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
‘గిరిజన’ విద్యార్థుల సత్తా
నిర్మల్: నర్సాపూర్ (జి) మండలంలోని అంజనీతండాకు చెందిన రాథోడ్ విజయ–సంతోష్ దంపతుల కుమారుడు రాథోడ్ సతీశ్, చవాన్ సేపాబాయి–అంబాజీ దంపతుల కుమారుడు చవాన్ సుధీర్ కుమార్ శుక్రవారం వెలువడిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తా చాటారు. రాథోడ్ సతీశ్ 89.018 పర్సంటైల్ సాధించి ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 1,744 ర్యాంకు సాధించగా సుధీర్ కుమార్ 81.105 పర్సంటైల్ సాధించి ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 4,086 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సదరు విద్యార్థులను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు. -
నిర్మల్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్రూరల్: జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు పోతుల్వార్ సురేష్–స్వప్న దంపతుల కుమారుడు సృజన్ కుమార్ జేఈఈ మెయిన్లో 99.96 శాతం పర్సంటైల్తో ఆలిండియాలో 683 కామన్ ర్యాంక్, ఓబీసీ విభాగంలో 105 ర్యాంక్ సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన అటోలి సంజీవ్ కుమార్, చింతప్రభ దంపతుల కుమారుడైన రుతిక్ కుమార్ 99.89 శాతం పర్సంటైల్ సాధించి ఓబీసీ కోటాలో 301 ర్యాంకును కై వసం చేసుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నహిద్ పాష కుమారుడు సయ్యద్ రియాజ్ 99.88 శాతం పర్సంటైల్ సాధించాడు. -
ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్రూరల్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్లో మావల మండలంలోని ఎస్ఆర్ ప్రైమ్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాథోడ్ సచిన్ 3,333 ర్యాంకు, బి.శివసాయి 4,721, వాసు 6,876, ఎల్.శ్రీలేఖ 7,505, ఆక్షాద్ 8,071, జాదవ్ సాయిరామ్ 9,067, రాథోడ్ సంధ్య 9,156, రాథోడ్ పావని 11,113, రాథోడ్ హరీష్ 13,731 ర్యాంకుతో పాటు మరో 32 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం కళాశాల చైర్మన్తో పాటు డైరెక్టర్లు సదరు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు జయపాల్రెడ్డి, అరవింద్, లలిత పాల్గొన్నారు.