breaking news
Mancherial
-
జనసంద్రమైన జాతీయ బంజారా దీక్షభూమి
నార్నూర్: మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని కొత్తపల్లి–హెచ్ గ్రామంలో జాతీయ బంజారా దీక్షభూమి ఆదివారం జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి బంజారాలు తరలివచ్చారు. దీక్ష గురువు శ్రీ సద్గురు ప్రేంసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో పలువురు బంజారాలు సేవాలాల్ మహారాజ్ దీక్ష స్వీకరించారు. అనంతరం భోగ్బండారో పూజలు నిర్వహించారు. ఈ దీక్షలు శ్రీరామనవమి వరకు 41 రోజులు కొనసాగనున్నాయి. దీక్ష గురువు మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆశయసాధనకు ప్రతి బంజారా బిడ్డ ఈ దీక్ష స్వీకరించాలన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ వరల్డ్కప్ పోటీలకు ఎంపిక
రెబ్బెన: ఇండోనేషియాలో ఈనెల 16 నుంచి 20 వరకు జరగబోయే వరల్డ్కప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన దేవల్ల శ్రావణి ఎంపికై నట్లు అసోషియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. 2017లో కేరళలో సబ్ జూనియర్ నేషనల్స్, 2019లో ఎస్జీఎఫ్, 2022లో మహారాష్ట్రలో సీనియర్ నేషనల్, 2025లో తమిళనాడులో సీనియర్ నేషనల్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. ఇండోనేషియాలో వరల్డ్కప్ బాల్ బ్మాడ్మెంటన్ పోటీల్లో ఇండియా తరపున ఆమె పాల్గొంటుందని వివరించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్లపెల్లి శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, కోశాధికారి శంకర్, ఉపాధ్యక్షులు భాస్కర్, మహేందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, క్రీడాకారులు ఆమెను అభినందించారు. -
మంచిర్యాల మేయర్గా ‘ధర్ని’
● డిప్యూటీ మేయర్ కోసం ముగ్గురు మహిళా కార్పొరేటర్ల పోటీ సాక్షి ప్రతినిధి మంచిర్యాల: మంచిర్యాల మేయర్గా 32వ డివిజన్ కార్పొరేటర్ ధర్ని మధూకర్, డిప్యూటీ మేయర్గా 54 డివిజన్ కార్పొరేటర్ సల్ల రమ్య ఎన్నిక కానున్నారు. అనేక సమీకరణాల మధ్య చివరకు ఇరువురికి పదవులు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో 60 డివిజన్లకు 44 కాంగ్రెస్ కై వసం చేసుకుంది. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ కాగా నగరానికి చెందిన పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మున్నూరు కాపు కులానికి చెందిన ధర్ని వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో ఈ మేరకు పేర్లను సోమవారం అధికారికంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు సభ్యులకు వెల్లడించే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్గా ఎన్నికవుతున్న సల్ల రమ్య భర్త మహేష్ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. బీసీల్లో గొల్ల కురుమకు చెందిన మహేశ్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు వీరాభిమాని. దీంతో ఆయన సతీమణికి డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం వెలమ, వైశ్య సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఆదివారం రాత్రి వరకు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో డిప్యూటీ మేయర్ విషయంలో ఇంకా ఎవరికై నా ఇస్తారా? అని సందిగ్ధం నెలకొంది. కాగా ఫలితాల తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా షిరిడీకి వెళ్లగా ఆదివారం తెల్లవారుజామున మంచిర్యాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరుకానున్నారు. నేడు పాలకవర్గ ప్రమాణ స్వీకారంమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 60 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లు సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ కోసం ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించి, ఆయా అభ్యర్థులకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కార్పొరేట్ అభ్యర్థులు చేయి ఎత్తి ఓటు వేయడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్న హాలులో 60 మంది కార్పొరేటర్లు కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో కార్యాలయ ఆవరణలో టెంట్ వేశారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
జన్నారం డివిజన్లో అరుదైన పక్షి
జన్నారం: జన్నారం డివిజన్లో అరుదైన పక్షి పెరేగ్రిన్ పాల్కన్ కనిపించింది. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో కనిపించగా అత్యంత వేగంగా గంటకు 320 కి.మీ ప్రయాణం చేస్తాయి. 1.5 కి.మీ ఎత్తులో ఎగురుతూ కింద ఉన్న ఆహారం గమనిస్తుంది. ఆసియా వాటర్బర్డ్ సర్వే సందర్భంగా వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ అనగంధుల వెంకట్.. జన్నారం అటవీ డివిజన్ కిష్టాపూర్ సరస్సు సమీపంలోని సెల్టవర్పై కూర్చుని ఈ పక్షిని గుర్తించి, ఫొటో తీశారు. 2021లో జన్నారంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ పై ఉన్న పక్షిని గుర్తించగా, తిరిగి ఇప్పుడు చూసినట్లు వెంకట్ గెలిపారు. చాలా ఎత్తులో ఎగురుతూ కింద ఉన్న ఆహారాన్ని గమనించి ఒక్కసారిగా కిందకు దూకే విధానాన్ని ‘స్టూ ప్’అంటారని తెలిపారు. క్షిపణి లాంటి శరీర ఆకారం ఉండడం వల్ల గాలిని చీల్చుకుంటూ అత్యంత వేగంతో ప్రయాణిస్తుందన్నారు. -
ఈ పీడీ.. హాకీలో మేటి..
ఆదిలాబాద్: ఆయనో వ్యాయామ ఉపాధ్యాయుడు..చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ఆయన బాధ్యత.. వీటిని విజయవంతంగా నిర్వర్తిస్తున్నా..తనను గొప్పస్థాయిలో నిలబెట్టిన ఆటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. చిన్ననాటి నుంచే హాకీపై మక్కువ పెంచుకొని, ఆ ఆటలో నిష్ణాతుడిగా ఎదిగి, ప్రస్తుతం జాతీయస్థాయి క్రీడాకారుడిగా సత్తా చాటుతున్నాడు. ఓవైపు బోథ్ మండలం మర్లపెలి్ల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతూ, ఇప్పటికీ నాలుగుసార్లు సివిల్ సర్వీసెస్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం విశేషం. మరోవైపు ఎంతోమంది విద్యార్థులను క్రీడా మెరికలుగా మలుస్తూ.. తాను సైతం మేటి క్రీడాకారుడిగా రాణిస్తున్న జిల్లాకు చెందిన హాకీ స్టార్ షబ్బీర్ అలీపై కథనం. చిన్ననాటి నుంచే..జిల్లాకేంద్రానికి చెందిన షబ్బీర్ అలీ హాకీపై ఇష్టంతో ఆరో తరగతి నుంచే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాధన చేస్తున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఐదు జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అండర్–19 విభాగంలో మధ్యప్రదేశ్లోని తికంగర్ వేదికగా జరిగిన టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా అండర్–16 విభాగంలో హర్యానాలోని ఫరీదాబాద్ వేదికగా జరిగిన జాతీయస్థాయి పోటీల్లో, చైన్నె, చిదంబరం వేదికగా యూనివర్సిటీ జాతీయస్థాయి పోటీల్లో మూడుసార్లు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఉద్యోగిగానూ.. 2012లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికై న షబ్బీర్ అలీ..హాకీ ఆటను మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీల్లోనూ రాష్ట్రం తరఫున జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యోగులతోపాటు తాను శిక్షణనిచ్చే భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిమంత్రంగా నిలుస్తున్నాడు. 2017లో మొదటిసారి ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీకి ఎంపికయ్యాడు. 2018లో చత్తీస్ఘఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ వేదికగా జరిగిన టోర్నీలో రెండోసారి, 2023లో హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర వేదికగా మూడోసారి రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో రాష్ట్రం తరఫున మరోసారి బరిలోకి దిగుతున్నాడు. -
ధనమే అన్నింటికీ మూలం అంటారు పెద్దలు.. డబ్బుంటే ఏదైనా సాధ్యమే.. డబ్బులు ఉంటే వెంకన్న వెంకటేశ్వర్రావు అవుతాడు.. అన్నట్లు.. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నోళ్లు.. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినోళ్లు జిల్లాలో కార్పొరేటర్లు.. కౌన్సిలర్లుగా గెలవడం చర్చనీయాంశమైంది.
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 20 బీసీలకు, 30 జనరల్కు కేటాయించారు. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వు కావడంతో పోటీ చేసిన బీసీ అభ్యర్థులు ఎలాగైనా తమ డివిజన్లలో గెలవాలని శాయశక్తులు ఒడ్డారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున విందు, మందు ఏర్పాట్లతో పాటు, ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు పంచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 41 స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీలో గెలుపొందగా, అధికార కాంగ్రెస్ నుంచే 31 మంది విజేతలుగా నిలిచారు. వీరిలో మేయర్ స్థానం తమకు వస్తుందనే ధీమాతో అరకోటికి పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. బీజేపీ నుంచి ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించగా 58 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో సైతం ఒకరిద్దరు అరకోటికి పైగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మేయర్ స్థానం వస్తుందనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీసీ అభ్యర్థులు కార్పొరేటర్గా గెలిచేందుకు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచే మేయర్ స్థానం కోసం పోటీ పడిన వారిలో అరకోటికి పైగానే ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఒక్కసారి మేయర్ అయితే భవిష్యత్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఉండడంతో ఖర్చుకు వెనకాడలేదని తెలుస్తోంది. పాతమంచిర్యాల ప్రాంతంలో పోటీ చేసిన ఓ అభ్యర్థి ఏడాది ముందు నుంచే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు, కాలనీ ప్రజలకు నీటి సమస్య తీర్చేందుకు ఏడు బోర్లు సైతం వేయించారు. ఎన్నికల ఖర్చుతో పాటు, అభివృద్ధి పనులకే దాదాపుగా కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులు ఆలయం అభివృద్ధి పేరిటనే లక్షల రూపాయలు అందించారు. నస్పూర్ ప్రాంతంలోని ఇద్దరు అభ్యర్థులు మేయర్ పదవి తమకు ఎలాగైనా వస్తుందనే ధీమాతో ఎన్నికల్లో దాదాపుగా 60 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలకు చెందిన వారికి ఒక్కొక్కరికి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా కొందరు విజయం సాధించలేక పోయారు. వైశ్యభవన్ సమీపంలోని ఓ డివిజన్ అభ్యర్థి ఎన్నికలకు ఒకరోజు ముందే దాదాపుగా రూ.30 లక్షల వరకు ఓటర్లకు పంపిణీ చేయడంతో విజయం సాధించినట్లు డివిజన్ ప్రజలు చర్చించుకుంటున్నారు.లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుకోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో పోటీ త్రీవత ఎక్కువగా ఉండడంతో డబ్బులతో పాటు దావత్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ కై వసం చేసుకున్నాయి. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు సాధించారు. ఇందుకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థి రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఎనిమిదో వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో అభ్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకోసం తమ ప్లాట్లను అమ్మినట్లు తెలుస్తోంది.చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు 107 మంది బరిలో నిలిచారు. ఒక్కో వార్డుకు 5 నుంచి 8 మంది వరకు పోటీలో నిలిచారు. ఒక్కో వార్డులో 800 వందల నుంచి 1200 వరకు 18 వార్డుల్లో 19,903 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలోని కొన్ని వార్డులకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా రూ.30 నుంచి రూ.35 లక్షలు ఖర్చు చేసినా ఓటమి పాలయ్యారని చర్చ జరుగుతోంది. చైర్మన్ పదవిపై ఆశతో.. చెన్నూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఆరు స్థానాలు బీసీ మహిళకు రిజర్వేషన్కాగా మరో రెండు జనరల్ వార్డుల నుంచి బీసీ మహిళలను బరిలోకి దింపారు. ముఖ్యంగా చైర్పర్సన్ సీటుపై కన్నేసిన అభ్యర్థులే ఓటమిపాలు కావడం గమనార్హం. ఆరు బీసీ మహిళా రిజర్వేషన్ల స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు సుమారు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఓటర్లు వారికి నచ్చిన వారికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.అభ్యర్థుల విజయాన్ని శాసించిన ధనబలంబెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ధన ప్రవాహం ఉరకలెత్తింది. ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు తమ భార్యలను పోటీకి దింపి ఖర్చుకు వెనుకాడకుండా తలపడ్డారు. అభ్యర్థుల ఖర్చు ఇలా... మున్సిపల్ రాజకీయాల్లో తొలిసారిగా అరంగ్రేటం చేసిన ఓ యువకుడు దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి కౌన్సిలర్గా విజయం సాధించాడు. ఓ తాజా మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భార్య ను పోటీలో నిలబెట్టి గరిష్టంగా 45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన ఓ మహిళ చైర్పర్సన్ సీటుపై గురిపెట్టి దాదా పు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ నుంచి తన సతీమణిని పోటీ చేయించిన ఓ నాయకుడు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకుడు తన భార్యను పోటీలో నిలబెట్టి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. ఓ సీనియర్ మాజీ కౌన్సిలర్ తన రాజకీయ వారసురాలిని పోటీలో నిలబెట్టి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ ఆమె ఓటమి పాలైంది. ఓ మాజీ కౌన్సిలర్ రాజకీయ ఓనమాలు తెలియని ఓ మహిళను పోటీ చేయించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ ఓటర్లు ఆమెను ఓడించారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు తన భార్యను చైర్పర్సన్ చేయడానికి పోటీ చేయించి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయగా ఆమె ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ మాజీ కౌన్సిలర్ తన భార్యను పోటీ చేయించి రూ.25 లక్షలు ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. ఓ సామాజికవర్గానికి చెందిన యువకుడు ఎన్నికల్లో పోటీ చేసి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసి గెలుపొందాడు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయించి రూ.20 లక్షలకు పైగా ఖర్చు పెట్టి గెలిపించుకున్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఓ అభ్యర్థి తన గెలుపుకోసం రూ.25 లక్షలు ఖర్చు చేసి జయకేతనం ఎగుర వేశాడు. అసంఘటిత రంగానికి నాయకత్వం వహిస్తున్న ఓ యువనాయకుడు తన భార్యను పోటీ చేయించి రూ.20 లక్షలు ఖర్చు చేసినా ఆమె ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ యువకుడు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేసి ఓడిపోయాడు.అభ్యర్థుల ఖర్చు అరకోటి పైనేఅభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంఅనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి -
ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు
ఖానాపూర్: మహాశివరాత్రి సందర్భంగా పట్టణ సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహించే గోదావరి నది వద్ద పవిత్ర స్నానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షవర్లు ఏర్పాటు చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇందుకోసం ముందు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసరప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భక్తులకు తప్పని ఇక్కట్లు ఖానాపూర్లోని ఉత్తరవాహిని గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారు. మున్సిపల్ అధికారులు కనీసం కాలినడకన వెళ్లే మార్గంలో మరమ్మతు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు, పలుమార్లు బండరాళ్ల మధ్యలో పడి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. -
ఎక్స్అఫీషియోనే కింగ్మేకర్!
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈనెల 16న చైర్మన్, మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారనుంది. పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్న సందర్భాల్లో వీరి ఓట్లు ఫలితాన్ని తేలుస్తాయి. ఈనేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓటు అంటే, ఎవరు వేయగలరు? దాని ప్రాధాన్యంపై తెలుసుకుందాం.ఓటు హక్కు–కౌన్సిలర్లతో సమానంమున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్అఫీషియో సభ్యులకు వార్డు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో సమాన ఓటు హక్కు ఉంటుంది. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లెక్కింపులో వీరిని పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీ రాని సందర్భంలో వీరు కీలకంగా మారుతారు. స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ వేసే ఓటు ఏ పార్టీకి అనుకూలిస్తే, ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఓటు హక్కుపై రాతపూర్వకంగా తెలపాలిఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మంచిర్యాల కార్పొరేషన్తోపాటు మొత్తం 11 బల్దియాలకు ఎ న్నికలు జరగగా, కొన్నిచోట్ల స్పష్టమైన మెజార్టీ మార్కును చేరువ కాగా, మరికొన్నిచోట్ల స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది. ఇలాంటి చోట్ల ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. తమ పరిధిలో ఒకటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారో ముందుగా ఎన్నికల సంఘానికి రా తపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులపాత్రపై ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఏం జరుగుతుందో సోమవారం నాటికి తేటతెల్లమవుతుంది. సభ్యులు ఎవరంటే.. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా నమోదైన ప్రజాప్రతినిధులను ఎక్స్అఫీషియో సభ్యులుగా పరిగణిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే తాజాగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. పోటీ హక్కు లేదు..ప్రభావం మాత్రం ఎక్స్అఫీషియో సభ్యులు స్వయంగా చైర్మన్ లేదా మేయర్ పదవికి పోటీ చేయలేరు. అయితే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా పరోక్షంగా పాలన దిశను నిర్ణయించే శక్తి వారికి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం వచ్చినా వారి ఓటు కీలకంగా మారుతుంది. జిలాల్లో మున్సిపల్ రాజకీయాల్లో చైర్మన్ ఎన్నిక సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య సమీకరణాలపై చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. కౌన్సిలర్ల సంఖ్యతోపాటు వీరి మద్దతు ఎటు ఉంటుందన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్పష్టమైన మెజార్టీ లేని పరిస్థితుల్లో వీరి ఓటు ‘కింగ్మేకర్’పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాసిపేట: జిల్లాకేంద్రంలో రసవత్తరంగా సాగుతున్న సీఎం కప్–2026 జిల్లా స్థాయి పోటీల్లో కాసిపేట మండలం నుంచి ముగ్గురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు మండల ఇన్చార్జి పీడీ భుక్య రాజన్న తెలిపారు. శనివారం నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో మండల జట్టు తరఫున సోమగూడంకు చెందిన భుక్య సాయితేజ, బుగ్గగూడంకు చెందిన రాజేష్, పల్లె రఘువరన్ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుంచి 23 వరకు నిర్వహించే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, కాసిపేట కాంప్లెక్స్ హెచ్ఎం మామిడిపల్లి సాంబమూర్తి, పలువురు సర్పంచులు, నాయకులు వారిని అభినందించారు. -
కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల గుండాలు తల్వార్లు, కత్తులతో బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ అభ్యర్థి డేగ బాపు, హైటెక్సిటీలో అభ్యర్థి సురభి రవి, కుటుంబసభ్యులను కాంగ్రెస్ నాయకుడు కిషోర్రావు బెదిరింపులకు దిగారన్నారు. హమాలివాడ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ తన అనుచరులతో బీజేపీ నాయకులు ఆకుల సంతోష్, సాతిని రాజును బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. దొరగారిపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. -
ముగ్గురు దొంగలు పట్టివేత
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లోని పెంబి స్టాఫ్ వద్ద ముగ్గురు మహిళ దొంగలను కండక్టర్, ప్రయాణికులు శనివారం పట్టుకున్నారు. బస్లో ఉన్న పెంబి గ్రామానికి చెందిన పర్వతాల నీల వద్ద రూ.3700, ఎడ్ల నర్సవ్వ వద్ద రూ.2650, మరో మహిళ వద్ద రూ. వెయ్యి, బ్యాగులు, కవర్ కట్చేసి చోరీకి పాల్పడ్డారు. తమ బ్యాగుల్లో డబ్బులు లేవని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను కండక్టర్, ఇతర ప్రయాణికులు పట్టుకున్నారు. మరో మహిళ పరారీ అయ్యారు. చోరీ చేసిన మహారాష్ట్రకు చెందిన శ్రీవాణి, విజేత, రాణికి దేహశుద్ధి చేసి ఆర్టీసీ కంట్రోల్ రూంలో ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను వాహనంలో పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. కాగా, బస్టాండ్లో కొన్నినెలలుగా వరుసచోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈనెల 11న బస్టాండ్లో ఆదిలాబాద్కు చెందిన స్వామి విలువైన సెల్ఫోన్ చోరీకి గురైంది. చెరువులో పడి ఒకరి మృతి ఆదిలాబాద్రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన చింతల్వార్ శ్రీరాం (25) శుక్రవారం బహిర్భూమికని చెరువు వైపు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆచూకీ కోసం గాలించారు. చెరువు వద్ద బైక్ ఉండడంతో గమనించి చెరువులో చూడగా మృతదేహం లభ్యమైంది. తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాపర్ వైర్ చోరీ బాసర: మండలంలోని టాక్లి, కిర్గుల్(బి) గ్రామ పరిధిలోని పంట చేల నుంచి గుర్తుతెలియని దుండగులు శనివారం ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేశారు. బాసర ఏఈ సి నాయక్, రైతులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు టైర్లో పొగలు లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు టైర్లో పొగలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టైర్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చాయని, వెంటనే ప్రయాణికులకు దింపి వేరే బస్సులో పంపించినట్లు డ్రైవర్ తెలిపారు. బస్టాండ్ వద్ద బస్సును నిలిపివేశారు. -
రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా
కాసిపేట: రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాసిపేట గ్రామస్తులు శనివారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు అధ్వానంగా మారిందంటూ భారీ వాహనాలను అడ్డుకున్నారు. మందమర్రి వద్ద ఉన్న టోల్ప్లాజాను తప్పించుకునే క్రమంలో భారీ లోడ్తో ఓరియంట్ సిమెంట్ కంపెనీ, సింగరేణి వాహనాలు కాసిపేట నుంచి బైపాస్ గుండా వెళ్లడంతో ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్కాస్ట్ మట్టిని రోడ్డుపై పోయడంతో దుమ్ముధూళి ఇళ్లలోకి వస్తోందన్నారు. ఆర్అండ్బీ, సింగరేణి అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరు రిమాండ్ ఇంద్రవెల్లి: అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎఫ్ఆర్వో సంతోష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇంద్రవెల్లి అటవీశాఖ దనోరా(బి) సెక్షన్ పరిధి కొయల్పాండ్రి సమీపంలో శుక్రవారం సాయంత్రం డొంగర్గాం గ్రామానికి చెందిన రాథోడ్ ప్రవీణ్, చవాన్ మున్నలు అక్రమంగా చెట్లను నరికివేస్తూ పట్టుబడ్డారు. కొయల్పాండ్రి బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 387లో మొత్తం 117 చెట్లను అక్రమంగా నరికినట్లు నిర్ధారించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శనివారం ఉట్నూర్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ మౌనిక ఎదుట హాజరపర్చగా రిమాండ్ చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్వో నరేష్,ఎఫ్బివో జంగు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
సారంగపూర్: మండలంలోని వంజర్ గ్రామంలోని మహాలక్ష్మీ దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి చొరబడి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయం తెరిచి ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా, బంగారం పుస్తెలు, ముక్కుపుడుక, వెండి హారం, వడ్డాణం, భక్తులు అమ్మవారికి సమర్పించిన వెండి కళ్లు, తదితర వాటిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గర్భగుడిలో ఉన్న బీరువా పగులగొట్టి అందులో వెండి వస్తువులతో కలిపి సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలను చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీమ్ను రప్పించి వివరాలు సేకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా సరిగా పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగానే మారింది. ఘటన స్థలంలో లభించిన దుండగుల వేలిముద్రలు, వారు వదిలివెళ్లిన వస్తువులను సేకరించి వాటి ఆధారంతో కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
కొత్తవారికే పట్టం
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు వి భిన్న తీర్పునిచ్చారు. మున్సిపాలిటీలో 19,903 ఓ టర్లకుగాను 15,095 ఓట్లు పోలు కాగా, 75.85 శా తం నమోదైంది. 90 శాతం పైగా ఓటర్లు కొత్తవారికే పట్టం కట్టారు. సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు, సమర్థవంతుడు, వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి ఓటర్లు మద్దతు పలికారు. అభ్యర్థుల ఎంపిక కీలకం..అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీల రెబల్స్ బెడద లేకుండా పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇవ్వడంతో అధికార పార్టీకి మేలు జరిగింది. 18 వార్డులకు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి 11 స్థానాలు ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ గెలిచిన 11 సీట్లలో కొత్తతరం గెలువడం గమనార్హం. ఇకపోతే బీఆర్ఎస్ 18, బీజేపీ 18 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 2 చోట్ల గెలుపొందగా ఒకటి మాజీ కాగా, మరోచోట కొత్తగా పోటీ చేసిన వ్యక్తి విజయం సాధించారు. బీఆర్ఎస్ 4 స్థానాలు గెలుచుకోగా ఒక సీటు మాజీ కై వసం చేసుకోగా మూడు చోట్ల కొత్త వారికి చోటు దక్కింది. 1 వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ భార్య మొదటి సారి పోటీ చేసి విజయం సాధించగా, 16 స్థానాలను కొత్తవారికే దక్కింది. రెండు సీట్లలో పాతవారికి అవకాశం దక్కింది. 18 వార్డుల్లో గెలిచిన 13 మంది కౌన్సిలర్లు 45 ఏళ్లలోపు కావడం విశేషం. ఈనెల 16న గెలిచినవారు మున్సిపాలిటీలో అడుగుపెట్టనున్నారు. -
0,1,2,3,4,5,6,7,8,9,10
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీచేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవి. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో స్వతంత్రులు ఏఐఎఫ్బీ తరపున పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు పది లోపు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఐదుగురు స్వతంత్రులుగా విజయం సాధించినప్పటికి మెజార్టీ వార్డులో వారి ప్రభావం నామమాత్రమే. కనీస ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. సున్నా, ఒకటి, రెండు, 3 ఇలా పదిలోపు ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 38వ వార్డు నుంచి పోటీ చేసిన నస్రీన్ సుల్తానకు ఒక్క ఓటు రాలేదు. ఆమె తన ఓటు వేసుకోనట్లుగా తెలుస్తోంది. 9వ వార్డు నుంచి పోటీ చేసిన శీల చౌహాన్కు ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా తన ఓటు వేసుకుంది. 1వ వార్డులో వాగ్మారే శాంభవికి, 9వ వార్డులో సురేఖ రహతేకు 2 ఓట్ల చొప్పున మాత్రమే వచ్చాయి. 4వ వార్డులో ఏఐఎఫ్బీ అభ్యర్థి సయ్యద్ ఖుర్షీద్కు 16వ వార్డులో రుఖియా బేగం, 26వ వార్డులో అమ్రీన్ బేగంకు 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 8వ వార్డులో దులే ఉజ్వల, 21వ వార్డులో జబీనా షేక్కు 4 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2వ వార్డులో షేక్ మహమూద్కు, 5వ వార్డులో దార్శ రుక్మాకు 5 ఓట్ల చొప్పున రాగా 17వ వార్డులో భవిత పవల్కర్కు 6, 40వ వార్డులో నవనందుల నర్సయ్యకు ఆరు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 22వ వార్డులో అబ్దుల్ ఇమ్రాన్కు 7, 23వ వార్డులో ఏఐఎఫ్బీ అభ్యర్థి అబ్దుల్ ఖయ్యూం రజాకు ఏడు ఓట్లు పోలయ్యాయి. 18వ వార్డులో జీవ్నే రవీందర్, 42వ వార్డులో తుర్పటి పద్మకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. 24వ వార్డులో అశోక్ దీకుండ్వార్, 29వ వార్డులో సఫియా బేగంకు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. 25వ వార్డులో పనకంటి వర్షాజోషి, 42వ వార్డులో ముత్యాల రాధకు పది ఓట్ల చొప్పున పోలయ్యాయి. 39వ వార్డులో లాంటిలే వర్షకు 11 ఓట్లు వచ్చాయి. -
పట్టించుకోవాలి
సీతారాముల స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం, ఏడు రోజలు పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి – అత్తిని మహేందర్ శర్మ, ప్రధాన అర్చకుడునిధులు మంజూరు చేయాలి సీతారామచంద్ర స్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తా. ఆలయ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్ర భుత్వం నిధులు మంజూరు చేయాలి.– డోంగిరి స్వప్న, సర్పంచ్, సుద్దాల -
● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులు
ఆలయ అభివృద్ధిపై పట్టింపేది ?చెన్నూర్రూరల్: చెన్నూర్ మండలంలోని సుద్దాల గ్రామంలోని ఎంతో చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిపై పట్టింపు లేకుండా పోతోంది. ఇక్కడ ధూప, దీప నైవేద్యాలకు డబ్బులు అందని పరిస్థితి. దీంతో అర్చకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయం లోపల వర్షపునీరు ఊరుస్తుంది. చర్యలు చేపట్టాల్సిన ఉన్న సంబంధిత శాఖల అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దాతలు ముందుకు రావాలని, దేవాదాయ, ధర్మాధాయశాఖ అధికారులు పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. చరిత్ర ఇలా.. గ్రామానికి వచ్చిన ఒక ముని వాగుఒడ్డున చింతచెట్టు కింద సీతారాములు, లక్ష్మణుడు, అంజనేయస్వామి రాతి విగ్రహాలను బయటకు తీసినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ వాగు ఒడ్డున ఒక పందరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన రామగుడు కిష్టయ్య అనే భక్తుడి కలలో శ్రీరాముడు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని చెప్పగా, గ్రామస్తుల సహాయంతో డంగు సున్నంతో 1910లో మందిరం నిర్మింపజేశారు. సీతా, రామ, లక్ష్మణుడు, ఆంజనేయుల పంచలోహ విగ్రహాలు తెప్పించి ప్రతిష్ఠించారు. అప్పుడు ఆయన వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. 2004లో పంచలోహ విగ్రహాలన్నీ చోరీకి గురయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టిన వాటి జాడ తెలియలేదు. తిరిగి మళ్లీ కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతీరోజు ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా ఇక్కడ శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. ఏడు రోజలపాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తాము కోరిన కోర్కెలు తీరాలని, కొబ్బరికాయలు ముడుపులు కడితే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. -
● బెల్లంపల్లిలో మ్యాజిక్ ఫిగర్ లేక మంతనాలు ● మంచిర్యాల కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిపై సస్పెన్స్ ● తెరపైకి పలువురి పేర్లతో విస్తృతంగా ప్రచారం ● మిగతా చోట్ల కొలిక్కి వచ్చిన చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుర పీఠాలపై పీటముడి వీడడం లేదు. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్తో సహా క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బెల్లంపల్లిలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో హంగ్ కారణంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. మెజార్టీ స్థానాలు ఎవరికి దక్కితే వారికే అవకాశం ఉంది. ఇక మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచే చైర్పర్సన్, వైస్ చైర్మన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిలో లక్సెట్టిపేట మున్సిపాల్టీలో ఎన్నికలకు ముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా చెన్నూర్లో పెద్దింటి పద్మను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్, సీపీఐ పొత్తుతో మున్సిపల్ పీఠం దక్కించుకున్న క్యాతనపల్లిలో గొడిసెల సంధ్యారాణికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లతోనూ.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు తమ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా ఎక్స్ అఫీషియో కోటాలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపిక సమయంలో స్పష్టమైన మెజార్టీ రాకపోతే ప్రజాప్రతినిధుల ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. జిల్లాలో బెల్లంపల్లిలో మాత్రమే హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఓటు కీలకంగా మారింది. ఆయనకు పట్టణంలో ఓటు హక్కు లేనప్పటికీ ఎక్స్ అఫీషియో ఓటు చైర్పర్సన్ ఎంపికలో కాంగ్రెస్ పార్టీకి మేలు చేయనుంది. ప్రస్తుతం స్వతంత్రులను పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఓటు ప్రాధాన్యత కలిగి ఉండనుంది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మంచిర్యాల కార్పొరేషన్లో ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. కాపు వర్గం నుంచే మేయర్..? మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నేతృత్వంలో 60 డివిజన్లలో 44చోట్ల విజయ ఢంకా మోగించడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక సునాయాసంగా మారింది. ఇక మేయర్ ఎవరవుతారనేది ఆసక్తి రేపుతోంది. బీసీ జనరల్ కావడంతో నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్న కాపుల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కలిసొచ్చిన వారి ప్రకారం పార్టీలో సీనియర్, జూనియర్లు, యువతతోపాటు మహిళలు ఆశిస్తున్నారు. అయితే ఎవరు పీఠం అధిష్టిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఎవరి పేరు వెల్లడించనప్పటికీ నలుగురైదుగురి పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. వీరిలో 14డివిజన్ నుంచి తూముల నరేశ్, 32నుంచి దర్ని మధూకర్, 46నుంచి పెంట రజిత, 54నుంచి సల్ల రమ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్లు సైతం పదవి ఆశిస్తున్నారు. -
సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ ఆటపోటీలు శనివారం నిర్వహించారు. పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. హ్యాండ్బాల్, ఆటియా పాటియా, ఫెన్సింగ్, నెట్బాల్, కరాటే, ఓషో, జోడో, కిక్బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని తెలిపారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఏడీ దుర్గాప్రసాద్, ఎంఈవో రమేష్, సీఐ రమేష్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి రమేష్, బాస్కెట్ బాల్ సెక్రెటరీ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ బాలురు, బాలికల కళాశాల వసతిగృహం విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. మంచిర్యాల బాలుర హైస్కూ ల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో అండర్–18 విభాగంలో 1000మీటర్ల పరుగు పందెంలో అజ్మ బంగారు పతకం, 400 మీ టర్ల పరుగు పందెంలో దుర్గం అనిల్ వెండి, షాట్పుట్లో పవన్ బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను సోషల్ వెల్పేర్ ఆఫీసర్(డీడీ) దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమాధికారులు చందన, కుమారస్వామి అభినందించారు. దండేపల్లి: సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఎంఈవో మంత్రి రాజు తెలిపారు. వాలీబాల్ పోటీల్లో బాలికలు, బ్యాడ్మింటన్ పోటీల్లో రామ్చరణ్ జిల్లాస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారని పేర్కొన్నారు. -
బీజేపీ ఫ్లోర్ లీడర్గా ముఖేష్గౌడ్
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా గాజుల ముఖేష్గౌడ్ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ సన్మానించారు. అనంతరం కార్పొరేటర్లు బొట్ల అనిత, తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేత, లక్సెట్టిపేట కౌన్సిలర్లు గర్రెపల్లి శాంతరాణి, ఏతం శివకృష్ణలకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై కౌన్సిల్లో గళం విప్పి పరిష్కారం, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీజేపీ.. గాజుల ముఖేష్గౌడ్ గతంలో మున్సిపాల్టీలోనూ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2005లో అప్పటి మంచిర్యాల మున్సిపాల్టీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత మేయర్ ప్రతిపాదిత అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు. మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వస్తోంది. బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్గా వ్యవహరించనున్నారు. -
క్రీడానైపుణ్యం వెలికితీసేందుకే పోటీలు
మంచిర్యాలటౌన్: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ పోటీలకు శనివారం ఆయన హాజరయ్యారు. బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని, నాయకత్వ లక్షణాలతో టీం వర్క్ ప్రాధాన్యత తెలుస్తుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంతరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వేలాల జాతరకు వేళాయె..
మహిమాన్విత క్షేత్రం ‘బుగ్గ’ బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: మండలంలోని కన్నాల గ్రామ శివారులో ఉన్న బుగ్గ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా పేరొందింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే జాతరకు ఆలయం ముస్తాబైంది. లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బారికేడ్లతో క్యూ లైన్లు నిర్మించారు. ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజాభజంత్రీలతో పాలపొరకను ఎదుర్కొని పచ్చని పందిరి వేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున ప్రత్యేక పూజల తర్వాత స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 10గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఆల య పరిసరాల్లో జాగారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరునాడు ఆలయ పరిసరాల్లోనే వంటలు వండి ఇప్ప ఆకుల్లో శివునికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.జైపూర్: ఉత్తర తెలంగాణలో మరో కొమురవెల్లి మల్లన్నగా వెలుగొందుతున్న వేలాల మల్లన్న స్వామి జాతరకు వేళయింది. ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించే జాతరకు ఆలయం ముస్తాబైంది. జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గోదావరి తీర ప్రాంతంలో 200 ఏళ్ల క్రితం మల్లన్న స్వామి స్వయంభూగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. దొణలో స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని పూజిస్తూ గ్రామంలో ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రికి వైభవంగా జాతర నిర్వహిస్తారు. యాదవుల ఆరాధ్యదైవమైన మల్లికార్జున స్వామికి ఒగ్గు పూజారులు సంప్రదాయంగా పట్నాలు వేసి, బోనాలు పోసి పూజలు నిర్వహిస్తారు. కొరిన కోర్కేలు తీర్చే దైవంగా పేరొందిన మల్లన్న స్వామి వద్ద జరిగే జాతరకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని సిరోంచ, గడ్చిరోలితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. సుమా రు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేశారు. గుట్టపైన, కింద చలువ పందిళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గుట్టపైన, కింద రూ.50 ప్రత్యేక దర్శనం, రూ.100తో సుల భ దర్శన సౌకర్యం కల్పించారు. గ్రామ శివారులో పార్కింగ్, గుట్ట కింది వరకు వీఐపీ వాహనాలు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించారు.బ్రహ్మణులు పూజలు చేపడుతున్నా ఒగ్గు పూజాలు వారి సంప్రదాయబద్దంగా పెద్దపట్నం వేసి మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం, నాగవెల్లి జరిపిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఒగ్గు పూజారులతో పసుపు, కుంకుమ, కుడక, రైకబట్టతో మల్లన్న స్వామికి పట్నాలు వేసి పట్టువస్త్రా లు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.గట్టు మల్లన్నస్వామి చెలిమె నీటికి ప్రత్యేకత ఉంది. ఎత్తయిన గుట్టపై దొణలో శివలింగం ఉండి ఆ పక్కనే ఊట చెలిమె ఉంటుంది. చెలిమెలో అన్ని కాలాల్లో నీరుంటుంది. మలన్నస్వామిని దర్శించుకున్న భక్తులు నీటిని తీర్థంగా స్వీకరిస్తారు. శారీరక రుగ్మతలు తొలిగిపోతాయని, పొలాల్లో చల్లుకుంటే పంటలు సంవృద్ధిగా పండుతాయని, ఇంట్లో చల్లుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. జాతరలో తొలి రోజున గుట్టపై దొణలో గట్టు మల్లన్నస్వామికి భక్తులు మొక్కులు చెల్లిస్తారు. బోనాలు పోసి, పట్నాలు వేసి రాత్రంతా జాగారం చేస్తారు. వేదపండితులు, ఒగ్గు పూజారులు సంప్రదాయబద్దంగా మల్లికార్జునస్వామి భ్రమరాంభికలకు పట్నం వేసి వైభవోపేతంగా కల్యాణం జరిపిస్తారు. మరుసటి రోజు వేలాల గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద జాతర సాగుతుంది. భక్తులు గుట్టపై నుంచి కిందకు చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మళ్లీ స్వామికి మొక్కులు చెల్లించి బోనాలు పోస్తారు. మూడో రోజు జాతర ముగుస్తుంది.భారీ బందోబస్తు జాతరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ వెల్లడించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్తోపాటు ముగ్గురు ఏసీపీలు, 10మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 400 మంది పోలీసు సిబ్బందితో ఐదు రూట్లుగా బందోబస్తు నిర్వహిస్తారు. ప్రధాన ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థలను పటిష్టం చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వేలాలకు 100ఆర్టీసీ బస్సులు కేటాయించారు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వేలాలకు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తెలిపారు.పూజల్లోనూ ప్రత్యేకమే..ఊట చెలిమె నీరే తీర్థంవైభవంగా కల్యాణం -
ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు
తాండూర్: ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా మహిళలు ముందుకు సాగాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మవిజయభాస్కర్రెడ్డి అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియా మాదారంటౌన్షిప్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మగ్గం, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులను ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ శిక్షణ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తెలిపారు. ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్కుమార్, పర్సనల్ హెచ్ఓడీ ఎం.శ్రీనివాస్, శిక్షకులు పాల్గొన్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వేకు సన్నద్ధం
జిల్లాలో సర్వే వివరాలు క్లస్టర్లు గ్రామాలు సర్వేయర్లు ఎకరాలు 55 371 371 3,52,077 దండేపల్లి: జిల్లాలో పంటల సాగుకు సంబంధించి కచ్చితమైన వివరాల సేకరణకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) చేపడుతోంది. ప్రస్తుత యాసంగి సాగు వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందితోపాటు ప్రైవేటు సర్వేయర్ల ద్వారా ప్రత్యేక యాప్లో నమోదుకు నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సర్వేలో కొంత మార్పులు చేయాలని సూచించారు. 45 రోజులపాటు సర్వేకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో క్లస్టర్ల వారీగా ఏఈవోలు పంటల నమోదు చేపట్టగా ఈసారి రెవెన్యూ గ్రామాల వారీగా డిజిటల్ క్రాప్ సర్వేకు ఆదేశించారు. క్లస్టర్కు ఒక ఏఈవో ఉండడంతో రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే చేయాలంటే ఇబ్బంది అవుతుందని, అలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ గ్రామానికో ప్రైవేటు సర్వేయర్ను నియమించుకోవాలని మండల వ్యవసాయ అధికారులకు సూచించారు. బీఎస్సీ అగ్రికల్చర్, అగ్రికల్చర్ డిప్లొమా, సైన్స్ డిగ్రీ చదివిన వారికి మొదటి ప్రాధాన్యతగా, లేనిపక్షంలో కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని సర్వే చేసేందుకు నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కో ఫొటో తీసి సర్వే వివరాలు యాప్లో నమోదు చేసినందుకు రూ.7చొప్పున చెల్లిస్తారు. సర్వేయర్ల ఎంపిక పూర్తవగానే.. డిజిటల్ క్రాప్ సర్వే కోసం ప్రైవేటు సర్వేయర్ల ఎంపిక ప్రక్రియ పూర్తవగానే సర్వే ప్రారంభించనున్నారు. ఏ సమస్యా లేని వాటిని మాత్రమే ప్రైవేటు సర్వేయర్లు సర్వే చేస్తారు. సమస్యాత్మక సర్వే నంబర్ల(అటవి, నాన్ డిజిటల్)కు సంబంధించిన వాటిని ఏఈవోలు చేస్తారు. ప్రయోజనాలు అనేకం..డిజిటల్ క్రాప్ సర్వేతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్ట పరిహారం చెల్లింపులు, రాయితీల కల్పన, బీమా అమలు సులభం అవుతుంది. పంటల ఉత్పత్తుల విక్రయాలు, రైతుల సమస్యల పరిష్కారానికి వీలవుతుంది. దిగుబడి అంచనాలతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి విషయాల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
సీల్డ్ కవరులోనే అభ్యర్థిత్వం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. 60 డివిజన్లకు గాను 44 కై వసం చేసుకుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరవుతారనే దానిపై చర్చ జరుగుతోంది. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వు కాగా.. ఆ పార్టీ నుంచి 31మంది బీసీలు గెలుపొందారు. ఎవరో ఒకరికే మేయర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో గెలిచిన అభ్యర్థులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు అందరినీ ఇప్పటికే క్యాంపు పేరిట షిర్డీకి తరలించారు. ఈ నెల 16న ఉదయం 11గంటలకు నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్లో పెట్టి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సమయంలో వెల్లడించే అవకాశం ఉంది. 16వ తేదీనే ప్రకటనమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరనేది ఈ నెల 16న ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికీ పార్టీ పరంగా ఎవరి పేరును ప్రకటించలేదు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎవరిని ఎంపిక చేసిందో 16న ఉదయం 11 గంటలకు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలోనే ప్రకటిస్తాం. – కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే -
అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం రైల్వే భద్రత కమిషనర్ మాధవి, రణధీర్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దర్శించుకున్నారు. వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు. బాసర సరస్వతీ అమ్మవారికి రూ.68.35లక్షల ఆదాయంబాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి 51రో జులు ఆలయ హుండీల ద్వారా రూ.68లక్షల 35వే ల 880 నగదు, 71 గ్రాముల మిశ్రమ బంగారం, కి లోన్నర మిశ్రమ వెండి, 30 విదేశీ కరెన్సీ నోట్లు వ చ్చినట్లు ఆలయ ఈవో అంజనీదేవి, శ్రీనివాస్, శివరాజ్, సిబ్బంది తెలిపారు. టీజీబీ, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, లలిత సే వా ట్రస్టు సభ్యులు, కోరుట్ల భక్తులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు
ఇంద్రవెల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మర్కగూడ గ్రామపంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొడప రమేశ్ అలియాస్ కొడప గంగు, కుంర గంగారాం, మర్కగూడ కొలాంగూడకు చెందిన కుంర కృష్ణ కలిసి నవగూడ నుంచి ద్విచక్ర వాహనంతో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై సాయన్న సిబ్బందితో ఇంద్రవెల్లి గ్రామ పోలిమేరలో తనిఖీ చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కానిస్టేబుల్ జాదవ్ రాహుల్, సిబ్బంది ఉన్నారు. -
పాత కక్షలతో దాడి
ఆదిలాబాద్టౌన్: పాత కక్షతో దాడికి పాల్ప డిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన షేక్ అలీపై అదే కాలనీకి చెందిన మాస్ అలీ శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నేత చౌక్ ప్రాంతంలో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాధితుడు మసీదులో నమాజ్ పూర్తి చేసుకుని బైక్పై కూర్చుని ఉండగా, మాస్ అలీ అక్కడికి వచ్చి పాత విభేదాలను మనసులో పెట్టుకుని దుర్భాషలాడి బైక్ కీతో తల, చేతిపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలి పారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు పాత కక్షలతో చంపుతానని బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన మాస్ అలీ శుక్రవారం నేతాజీ చౌక్ వద్ద గల మసీద్లో నమాజ్ చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఖలీల్ అనే వ్యక్తి పాత కక్షలు మనసులో పెట్టుకుని దుర్భాషలాడినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖలీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తతబెల్లంపల్లి: బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 12వార్డుకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఆరు ఓట్ల తేడా ఉండటంతో రీకౌంటింగ్ నిర్వహించారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచారో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించక ముందే ఇరు పార్టీల శ్రేణులు ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థి గెలిచారని సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రీ కౌంటింగ్ జరుగుతోందని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కొద్ది నిమిషాల తేడాతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రభావితం చేయడానికి వచ్చారా? అని ఎమ్మెల్యే వినోద్ను నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం చెందారు. ఈక్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు ‘డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే వినోద్ జిందాబాద్’ అంటూ పోటీగా నినదించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే ఏసీపీ రవికుమార్, సీఐలు, ఎౖస్సైలు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులను లాఠీలతో చెదరగొట్టి గొడవ జరగకుండా నివారించారు. అంతలోనే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
చోరీకి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున చోరీకి ప్రయత్నించిన ఇద్దరు యువకులను సెక్యూరిటీ ఎంటీఎఫ్ టీమ్ గమనించి వెంబడించగా ఒకరు దొరికారు. మరొకరు పారిపోయారు. దొరికిన వ్యక్తి నుంచి బైక్, మూడు రూలర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. అతడి నుంచి కేబుల్ కట్ చేసే బ్లేడ్, టెస్టర్, డిటెక్టర్స్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చెంచు కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్అండ్పీసీ సిబ్బంది తెలిపారు. వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి మిర్యాల సంజీవ్ను పోలీసులకు అప్పగించినట్లు ఏఎస్వో రవి తెలిపారు. -
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ బాల, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు హాజరు కాగా విశేష ప్రతిభ కనబరిచిన వారిని జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యూత్ బాల, బాలికల వాలీబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. జట్ల ఎంపికలో డీవైఎస్వో హన్మంతరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బైరగోని సిద్ధయ్యగౌడ్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, పీడీలు రామ్మెహన్రావు, గోపాల్, సుదర్శన్, రాజయ్య, పీఈటీలు రాజా, విఠల్, సత్యనారాయణ వరలక్ష్మి, రెఫరీలు ప్రేమ్కుమార్, రమేశ్, మనోహర్ పాల్గొన్నారు. -
సర్వీస్ నిబంధనలు పాటించాలి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ డివిజన్ పరిధి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధిలోని ఉద్యోగులంతా ప్రభుత్వ సర్వీస్ రూల్స్ పాటించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ సూచించారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో జీసీసీ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. రెండోరోజు ఉద్యోగ నియమావళి, సర్వీస్ రూల్స్, సీసీఏ రూల్స్, ప్రాథమిక నియమాలు, బాధ్యతలు, లీవ్ రూల్స్, క్రమశిక్షణ చర్యలు లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ రవికుమార్, వేణు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగులు అంకితభావం కలిగి ఉండాలని, గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీసీసీని బలోపేతం చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎవరైనా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీనియర్ మేనేజర్లు సంతోష్కుమార్, తార చంద్, సూపరింటెండెంట్ గులాబ్సింగ్, మేనేజర్లు శ్రీనివాస్, ఇస్తారి, లక్ష్మణ్, మనోహర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డివిజనల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ తెలిపారు. రెండు రోజుల క్రితం కలపను తరలిస్తున్న ఇచ్చోడకు చెందిన నిందితుడు అబ్బు, ఘోట్కురికి చెందిన వామన్ను పట్టుకుని విచారించగా, ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి కలప తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం తిర్పెల్లిలో అధికారులు, ఉద్యోగులతో సోదాలు నిర్వహించగా, అల్లాబక్ష్ ఇంట్లో 23 టేకు సైజులు లభించినట్లు తెలిపారు. వీటి విలువ రూ.38వేలు ఉంటుందని పేర్కొన్నారు. దాడుల్లో ఎఫ్ఎస్వో రాథోడ్ గులాబ్, సిబ్బంది కృష్ణనాయక్, శరత్, అర్జున్ ఉన్నారు. -
బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మృతి
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో లక్సెట్టిపేట పదోవార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ (68) అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వచ్చి అనారోగ్యానికి గురై కింద పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కాగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించగా ఆమెకు 172 ఓట్లు రాగా, మూడో స్థానానికి పరిమితమైంది. కాగా, ఆమె మృతికి బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిలక్సెట్టిపేట: మండలంలోని శాంతాపూర్ గ్రామ స్టేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని దొనబండ గ్రామానికి చెందిన లక్ష్మయ్య (77) మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మయ్య గురువారం అంకతిపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి వేళ తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెండ్పెంచికల్పేట్: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈవో, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. చేడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని, అనుచిత భాషతో సంభాషిస్తున్నారని విద్యార్థినులు హెచ్ఎం రాకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై హెచ్ఎం ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుడిపైన వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో అతడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. భార్య వెంటే భర్తదహెగాం: వేద మంత్రాల సాక్షిగా నీ వెంట నేనుంటానని బాస చేసి భార్య మెడలో తాళి కట్టాడు. అనారోగ్యంతో ఆమె చనిపోగా తట్టుకోలేని అతడూ తనువు చాలించాడు. ఈ ఘటన మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్కు మంచిర్యాల జిల్లా గురిజాల గ్రామానికి చెందిన సువర్ణతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో సువర్ణ అనారోగ్యానికి గురైంది. ఆమెకు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కాగా, భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన వినోద్ (30) ఒక్కసారిగా సొమ్మిసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కమ్మర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వారి కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
కాంగ్రెస్ పతనానికి ఇది తొలి అడుగు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ● బీఆర్ఎస్, సీపీఐ శ్రేణుల సంబురాలు రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా కాంగ్రెస్ పతనానికి తొలి అడుగులాంటివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్–సీపీఐ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగి 14 స్థానాలను కై వసం చేసుకోవడంతో శుక్రవారం పట్టణంలో ఇరు పార్టీల నాయకులు సంబురాలు చేసుకున్నారు. స్థానిక సూపర్బజార్ ఏరియాలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని, బీఆర్ఎస్–సీపీఐ కౌన్సిలర్లతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్వయంగా డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తమవైపే నిలిచారని అన్నారు. ఏఐటీయూసీ నేత సీతా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేడిపెల్లి సంపత్, సుదర్శన్గౌడ్, మిట్టపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పొత్తుతో సీపీఐకి ఊరట
పాతమంచిర్యాలలో కాంగ్రెస్ నాయకుల సంబరాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు ఫలితాల్లో కనిపించాయి. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్తో పాటు లక్సెట్టిపేట, చెన్నూర్ మున్సిపాల్టీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. బెల్లంపల్లిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ఇక బీఆర్ఎస్ సీపీఐ పొత్తుతో క్యాతనపల్లి బల్దియాలో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. ము న్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా పట్టణ పౌరులు తమ తీర్పును వెలువరించారు. శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. బెల్లంపల్లి, క్యాతనపల్లిలో పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. మంత్రి చెమటోడ్చినా.. మంత్రి వివేక్వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు రెండు స్థానాల ఆధిక్యతతోనే చైర్పర్సన్ పీఠం దక్కింది. ఇక క్యాతనపల్లి పరిఽధిలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు కాంగ్రెస్ గెలుపును అడ్డుకున్నాయి. ఇక్కడ మంత్రి వివేక్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ నివాసం ఉన్న మున్సిపాలిటీలోనే ఆ పార్టీ ఓడిపోవడం మరింత ఇబ్బందిగా మారింది. గులాబీ పార్టీకి మిశ్రమ ఫలితం మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి గులాబీ పార్టీకి మిశ్ర మ ఫలితం వచ్చింది. మంచిర్యాల కార్పొరేషన్లో 8 డివిజన్లు, బెల్లంపల్లిలో 14లో సీట్లు రావడంతో కాంగ్రెస్ హంగ్ వచ్చేలా, క్యాతనపల్లిలో 10, చెన్నూరులో 4, లక్సెట్టిపేటలో 3చోట్ల గెలిచింది. ఇందులో క్యాతనపల్లిలో సీపీఐతో పొత్తుతో మున్సిపల్ పీఠం కై వసం చేసుకుంది. కార్పొరేషన్లో గెలుస్తామని ఆశించిన చోట్ల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. బీజేపీ ఆశలు గల్లంతుమంచిర్యాల కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ నాయకులకు ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మంచిర్యాల కార్పొరేషన్లో 20వరకు సీట్లు గెలుస్తామని చెప్పుకున్నారు. ఇందుకోసం క్యాంపులకు సైతం తరలివెళ్లారు. ఫలితాల్లో మాత్రం చాలామంది అభ్యర్థులు వెనుకబడి పోయారు. కార్పొరేషన్లో ఐదు చోట్ల, చెన్నూరులో రెండు, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో ఒకటి చొప్పున గెలిచింది. క్యాతనపల్లిలో ఒక్క చోట కూడా గెలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తమకు ఓటు బ్యాంకు పెరిగిందని ఆశించినప్పటికీ పట్టణ ప్రాంతంలోనూ కమలం పార్టీ ఇంకా బలంగా లేదని తేలిపోయింది.క్యాతనపల్లిలో సీపీఐ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్తో పొత్తుతో ఎన్నికలకు వెళ్లి అక్కడ నాలుగు స్థానాలు గెలుచుకుంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఓటమి పాలైంది. మంచిర్యాల నగరంలో ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఇద్దరు, జనసేన నుంచి ఒకరు గెలిచారు. -
ఓట్ల లెక్కింపు ప్రశాంతం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. 60 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడంచెల భద్రత మధ్య సాగింది. లెక్కింపు నెమ్మదిగా సాగడంతో సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్దీపక్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 265 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఒక్కో టేబుల్పై 1,000 ఓట్లకు ఒక్కో రౌండ్ చొప్పున 2, 3 రౌండ్ల వారీగా లెక్కింపు సాగింది. ఒక్కో టేబుల్కు ఒక కౌటింగ్ అధికారి, ఇద్దరు అదనపు కౌంటిగ్ అధికారులతోపాటు మొత్తం 300 మంది సిబ్బందితో పకడ్బందీగా నిర్వహించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి 399, బీజేపీకి 166, బీఆర్ఎస్కు 14, బీఎస్పీకి 2, సీపీఐకి 3, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 9, జనసేన పార్టీకి 3, ఎంఐఎం 3, నోటాకు 5 వచ్చాయి. 5 ఓట్లు చెల్లకుండా పోయాయి. స్వల్ప మెజారిటీతో.. మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో పలువురు స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. 9వ డివిజన్లో సురిమిళ్ల సౌమ్య(కాంగ్రెస్) సమీప ప్రత్యర్థి జాడి రమ్యకుమారి(బీఆర్ఎస్)పై 6 ఓట్ల తేడాతో గెలు పొందింది. 57 డివిజన్లో గాజుల ముఖేశ్గౌడ్(బీజేపీ) సమీప అభ్యర్థి బుద్దార్థి రాంచందర్(కాంగ్రెస్)పై 12 ఓట్ల తేడాతో విజ యం సాధించాడు. 34వ డివిజన్ అభ్యర్థి అగ్గు సాగర్(జనసేన) సమీప అభ్యర్థి అగల్డ్యూటీ రాజు(కాంగ్రెస్)పై 21 ఓట్లతో గెలుపొందాడు. 4వ డివిజన్లో గుమ్మడి శ్రీనివాస్(బీఆర్ఎస్) సమీప అభ్యర్థి అంగిడి రాజేశ్(కాంగ్రెస్)పై 38 ఓట్లతో గెలుపొందాడు. 56 డివిజన్లో నల్ల శంకర్(కాంగ్రెస్) తన సమీప అభ్యర్థి వెంగల కొమురయ్య(బీజేపీ)పై 62 ఓట్లతో, 55వ డివిజన్లో పెట్టం స్వరూప(బీఆర్ఎస్) కాంగ్రెస్ అభ్యర్థి గట్టు స్రవంతి(కాంగ్రెస్)పై 65 ఓట్లతో గెలుపొందారు. చెన్నూర్లో పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలలో ఓట్ల లెక్కింపు సందర్శించిన కలెక్టర్చెన్నూర్: చెన్నూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కౌంటింగ్ తీరుపై ఎన్నికల పరిశీలకులు కిషన్ను అడిగి తెలుసుకున్నారు. భద్రత, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామగుండం డీసీపీ(అడ్మిన్) కే.శ్రీనివాస్రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎన్నికల అధికారి మురళికృష్ణ పాల్గొన్నారు.భారీ మెజారిటీతో...14వ డివిజన్లో తూముల నరేశ్(కాంగ్రెస్) తన సమీప అభ్యర్థి ఒడ్నాల రవీందర్(బీఆర్ఎస్)పై 1,468 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. 42వ డివిజన్లో చిందం సత్యవతి(కాంగ్రెస్) సమీప అభ్యర్థి అంకం సంజీత(బీజేపీ)పై 637 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.భారీ బందోబస్తు మంచిర్యాలక్రైం: కౌంటింగ్ కేంద్రాల వద్ద మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పటిష్టమైన మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వరకే సెల్ఫోన్లు, వీడియోలను అనుమతించారు. కేంద్రంలోకి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. 300 మీటర్ల దూరంలో ప్రత్యేక తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించారు. ఫలితాల కోసం వివిధ పార్టీల అభిమానులు కౌంటింగ్ కేంద్రానికి మూడు వందల మీటర్ల దూరంలో పడిగాపులు కాశారు. డీసీపీ భాస్కర్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీసులను అప్రమత్తం చేశారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ఆకుల అశోక్, నరేష్కుమార్, సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు. -
హ్యాట్రిక్ విజేత
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్ల శంకర్ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వరుసగా రెండుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎన్నికై నప్పుడు వైస్ చైర్మన్గా పనిచేశారు. మూడోసారి కార్పొరేటర్గా గెలుపొందారు. అత్యధిక మెజారిటీ 14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తూముల నరేశ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2987 ఓట్లు డివిజన్లో ఉండగా, 2455 ఓట్లు పోలయ్యాయి. అందులో 1,999 ఓట్లు నరేష్కు రాగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వొడ్నాల రవీందర్కు 331 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేశ్, ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి కార్పొరేటర్గా భారీ మెజారిటీని సాధించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. -
పట్టు నిలబెట్టుకున్న పీఎస్సార్
● సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు ● స్వల్ప తేడాతో కొన్ని స్థానాల్లో ఓటమి మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) పట్టు నిలబెట్టుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా మంచిర్యాల కార్పొరేషన్, లక్సెట్టిపేట మున్సిపాల్టీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక సర్వే నిర్వహించారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వడంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మంచిర్యాల నగరంలోని డివిజన్లలో విజయం సాధించేలా పది డివిజన్లకు ఒక చోట కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సమయం తక్కువగా ఉన్నా తనను నమ్మి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చేసి చూపిస్తానని ఇచ్చిన హామీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 44 డివిజన్లలో గెలుపొంది పూర్తి మెజార్టీతో తొలి కార్పొరేషన్లో అధికారాన్ని కై వసం చేసుకుంది. ఓడిన స్థానాల్లో అతి తక్కువ ఓట్లతోనే కావడం గమనార్హం. లక్సెట్టిపేటలోనూ ప్రచారం నిర్వహించి అధికారాన్ని దక్కించుకున్నారు. -
‘పెద్దింటి’కే చైర్పర్సన్ పీఠం?
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం పెద్దింటి పద్మకే దక్కనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వు అయింది. మున్సిపాల్టీలో 18వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకే చైర్పర్సన్ స్థానం దక్కనుంది. ఆ పార్టీ నాయకుడు పెద్దింటి శ్రీనివాస్కు సౌమ్ముడిగా పేరుంది. మంత్రి వివేక్వెంకటస్వామికి నమ్మినబంటుగా ఉన్నారు. దీంతో శ్రీనివాస్ భార్య, రెండో వార్డు నుంచి గెలుపొందిన పద్మను చైర్పర్సన్గా ఖరారు చేసినట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన పద్మకు చైర్పర్సన్ పీఠం దక్కడ ఖాయమని తెలుస్తోంది. అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా..అధిష్టానం అవకాశం ఇస్తే చెన్నూర్ మున్సిపాలిటీని మంత్రి వివేక్ వెంకటస్వామి సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. మంత్రి ఇప్పటికే చెన్నూర్ మున్సిపాలిటీలో రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాపై నమ్మకంతో 2వ వార్డు అభ్యర్థిగా అవకాశం కల్పించారు. చైర్పర్సన్గా నియమిస్తూ మంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తా. – పెద్దింటి పద్మ, 2వ వార్డు కౌన్సిలర్ -
చెన్నూర్లో బీజేపీ బోణీ
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. 18వార్డులు ఉండగా.. రెండు స్థానాల్లో గెలుపొంది కమలం జెండా ఎగురవేసింది. 18వ వార్డు మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి 10వ వార్డు నుంచి పోటీచేశారు. 21 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ 18వ వార్డు నుంచి పోటీ చేసి 59ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. గత ఎన్నికల్లో ఒక్క స్థానం సాధించిన పార్టీ ఈసారి రెండు స్థానాల్లో విజయం సాధించడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా!
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా కొనసాగుతోందని, యూనియన్ల ద్వితీయశ్రేణి నాయకులు అధికారులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఈ నెల 10న ఇద్దరు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ గని అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని పలుమార్లు పత్రికల్లో రావడం, స్థానికంగా వివాదంగా మారినప్పటికీ అధికారుల్లో ఎటువంటి మార్పులు రావడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి సింగరేణిలో సర్ఫేస్ (గనిపైన) విధులు కేటాయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం డబ్బులు పెడితే ఎవరికై నా ఇవ్వడం సర్వసాధారణంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తులు కార్మికులతో కలిసి మీకు సర్ఫేస్లో పని కేటాయించాలంటే గని అధికారులతో నేను మాట్లాడుతా డబ్బులు ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసి విధులు కేటాయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సర్పేస్లో పనికి రూ.50 వేల వరకు మ్యాన్రైడింగ్ విధులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకోవడం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా షిప్ట్ మార్పులు, జనరల్ షిప్ట్ విధులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్, మెకానికల్, విభాగంలో విధులు కేటాయింపు.. ఇలా అన్నింటికీ డబ్బుతో ముడిపడి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. సీనియర్ కార్మికులు అనారోగ్యంతో ఉన్నవారు, అన్ఫిట్ స్థితిలో ఉన్న ఉద్యోగులకు ఇక్కడ అవకాశం లేదని, మ్యాన్రైడింగ్ వద్ద జనరల్ మజ్దూర్ చేతకాని కార్మికులను పెట్టాల్సి ఉండగా నూతనంగా వచ్చిన యువకులకు అవకాశం ఇవ్వడం ఇందుకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా సర్ఫేస్లో పనిచేసే జనరల్ మజ్దూర్లను కాదని అండర్గ్రౌండ్లో పనిచేసే వారికి సర్పేస్లో విధులు అప్పగించి అండర్గ్రౌండ్ అలవెన్స్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని వాపోతున్నారు. ప్రమోషన్ల పేరిట డబ్బులు వసూలు ప్రమోషన్లు వచ్చిన కార్మికుల నుంచి సైతం డబ్బులు ఇవ్వకుంటే వేరే వారికి పోతాయని, సర్ఫేస్లో విధులు ఇచ్చి ప్రమోషన్ రావడానికి కారణం మేమే అంటూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల గని అధికారి ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి సదరు ఏజెంట్లు మేకలు, మందు, ఇతర ఖర్చులు అంటూ సర్ఫేస్ వారి వద్ద, ఇతర కార్మికుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంతో పాటు ఓవర్మెన్ స్థాయి సూ పర్వైజర్లు సైతం సదరు అధికారి పేరు చెప్పి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల దందా అధికం కావడంతో పాటు కొందరు మస్టర్లు పడి వెళ్లిపోయిన సంఘటనపై విజిలెన్స్కు సమాచారం అందడంతో సదరు ఉద్యోగులను తీసుకెళ్లి ప్రశ్నించడంతో పాటు పూర్తి విచారణకు దిగినట్లు తెలిసింది. కాగా గతంలో సదరు అధికారి పుట్టిన రోజు వేడుకలు ఒకచోట నిర్వహించి వేడుకల ఖ ర్చు, బంగారం కానుక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్ర స్తుతం మళ్లీ పునరావృతం కావడంతో అధికారులు, యూనియన్ నాయకులు ఒక్కటయ్యాక చేసేదేముంది.. అని విమర్శలు ఉన్నాయి. గనిలో దెబ్బలు తాకిన కార్మికులకు రిపోర్ట్ రాయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించి మస్టర్లు వే యడం, స్వల్ప గాయాలకు పాల్పడిన వారికి మ స్టర్లు వేసి పైన ఉంచడంలాంటి కార్యకలాపాలు పూ ర్తిస్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి విధుల కేటాయింపులో సీని యర్లకు, అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
గోదావరితీరం ప్రక్షాళన ఎప్పుడు?
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ ముల్కల్ల శివారులోని గో దావరి తీరం, పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ నెల 15న మహాశివరాత్రి ప ర్వదినం పురస్కరించుకుని ఇప్పటి నుంచే పు ణ్యస్నానాలకోసం గోదావరికి భక్తుల రాక ప్రారంభమైంది. ప్రస్తుతం ముల్కల్ల గోదావరి తీరం, పుష్కర ఘాట్ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉంది. గోదావరి నదీ తీర ప్రాంతమంతా ఎటు చూసినా చెత్త చెదారంతో పాటు భక్తులు వదిలి వెళ్లిన దేవుడి చిత్రపటాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ కవర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఏటా మహాశివరాత్రికి ముల్కల్ల సర్పంచ్ ఆధ్వర్యంలో సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రస్తుతం కార్పొరేషన్లో విలీనం కావడంతో ఈ అపరిశుభ్రత ఎవరు తొలగిస్తారోనని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా శివరాత్రి రోజున గోదావరికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే మహిళలు బట్టలు మార్చుకునే తాత్కాలిక షెడ్డుకు సైతం మరమ్మతు చేయించాలని కోరుతున్నారు. -
మూడంచెల భద్రత
మంచిర్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, సంబరాలు, సమవేశాలు, డీజే సౌండ్స్పై నిషేధం విధించినట్లు తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెటిపేట, క్యాతనపల్లి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు 100 మీటర్ల పరిధిలో వెలుపలి రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనధికార వాహనాలు, వ్యక్తులకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, లైటర్లు, మొబైల్ ఫోన్లు, అగ్గిపెట్టెలకు అనుమతి లేదని, అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 33మంది సీఐలు, 96మంది ఎస్సైలు, 149మంది ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు, 518మంది కానిస్టేబుళ్లు, 263మంది స్పెషల్ ఫోర్స్ బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నట్లు ఆదిలాబాద్ ఎఫ్డీవో విశ్వనాథ చిన్నబూసరెడ్డి తెలిపారు. గురువారం అటవీశాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్కు మ్యాక్స్ వాహనంలో కలప తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దస్నాపూర్లో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలో 18 సైజులు ఉండగా వాటి విలువ రూ.64 వేల వరకు ఉంటుందన్నారు. వాహన డ్రైవర్ షేక్ అబ్బును అదుపులోకి తీసుకో గా, ఇచ్చోడకు చెందిన బిల్డర్ క్రాంతి, ఘోట్కురికి చెందిన వడ్రంగి వామన్, కర్ర సరఫరా చేసే స్మగ్లర్ గుండాలకు చెందిన హకీమ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఓ ఇంటి నిర్మాణం కోసం గుండాలలోని హకీమ్ను సంప్రదించి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, సెక్షన్ ఆఫీసర్ రాథోడ్ గులాబ్, ఎఫ్బీవో కృష్ణనాయక్ పాల్గొన్నట్లు వివరించారు. ఇచ్చోడ: మండలంలోని నవేగావ్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో పుండలిక్ తెలిపారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన కిషోర్ ఇంట్లో తనిఖీ చేయగా 150 సీఎంటీల టేకు కలప లభ్యమైనట్లు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి కలపను ఇచ్చోడ టింబర్ డిపోకు తరలించినట్లు తెలిపారు. కలప విలువ సుమారు రూ.13 వేలు ఉంటుందన్నారు. -
లింగనిర్ధారణ పరీక్షలు నేరం
మంచిర్యాలటౌన్: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, పుట్టబోయే శిశువు ఆడా, మగనా అని అడగడం, నిర్ధారణ చేసి చెప్పడం రెండూ నేరమేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని రేడియాలజిస్టులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని, వైద్యులు చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కోటేశ్వర్రావు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో వెంకటేశ్వర్లు, రేడియాలజిస్టులు వెంకటేశ్వర్రావు, రాంబాబు, కీర్తి, శ్రీనివాస్, సుధాకర్, రవి, రూపరమణి పాల్గొన్నారు. -
ప్రథమ పౌరులెవరో..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులతోపాటు నగర, పట్టణ వాసుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలిసారి నగరంగా అవతరించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి పట్టణాల్లోనూ ఏ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించలేదు. లక్సెట్టిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థిగా గాజుల ముఖేష్గౌడ్ను ప్రకటించింది. మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ మేయర్, చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించకుండా గోప్యతను పాటిస్తున్నాయి. ఓ వైపు ఓట్ల లెక్కింపు మొదలు కాకముందే పోటీ చేసిన అభ్యర్థులను పార్టీలు క్యాంపులకు తరలించాయి. ఈ నెల 16న మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రత్యక్షంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నికై న కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సమక్షంలో ఎన్నుకుంటారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ స్థానాలు గెలిస్తేనే పీఠాలు దక్కనున్నాయి. మొత్తం సభ్యుల్లో సగానికిపైగా ఉన్నవారికే మెజార్టీగా పరిగణిస్తూ ఎన్నుకోనున్నారు. అలాగే పార్టీ గుర్తులతో ఎన్నిక కావడంతోనూ ఆయా పార్టీల నుంచి విప్(ఆజ్ఞ) జారీ చేస్తారు. దీంతో ఏ ఒక్కరు కూడా ప్రలోభాలకు లోనుకాకుండా ముందుగానే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు క్యాంపులకు తరలించారు. ఎవరి ధీమా వారిదేమున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసకుంటుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మున్సిపల్ పీఠాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల నగరంలో 60డివిజన్లలోనూ మ్యాజిక్ ఫిగర్కు 31స్థానాల్లో కాకున్న కింగ్మేకర్గా అవుతామని బీజేపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులను చంద్రాపూర్కు తరలించి ముందు జాగ్రత్తపడింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను సైతం జిల్లా దాటించేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ నాయకులు సైతం జిల్లా ఆవలే ఉంటున్నారు. కొందరు క్యాంపులకు వెళ్లక స్థానికంగానే ఉన్నారు. చైర్పర్సన్, మేయర్ అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారు డబ్బులు ఖర్చు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అధికార పార్టీలో ఈ పోటీ అధికంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేలే ఈ పదవుల ఎంపికలో కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు అధి ష్టానం ఆశీర్వాదం కూడా ఉండేలా కొందరు గాంధీ భవన్ స్థాయిలోనూ లాబీయింగ్ మొదలు పెట్టిన ట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో పుర పీఠాల ను అధిష్టించే వారి పేర్లు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఎవరి పురమో..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లోనే వెలువడనుంది. విజేతలెవరో.. పరాజితులెవరో తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితాలు తేలిపోనున్నాయి. చెన్నూర్ రెండో వార్డులో 817 ఓటర్లు ఉండగా.. ఇక్కడ లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే ఫలితం రానుంది. ఇక మంచిర్యాల నగరం 52వ డివిజన్లో 4,047 ఓట్లు ఉండడంతో ఫలితం వెలువడే వరకు ఆలస్యం కానుంది. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట పురపాలక సంఘాల్లోని 149వార్డుల్లో ఏర్పాటు చేసిన 444 పోలింగ్ కేంద్రాల్లో 2,01లక్షల ఓట్లు పోలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య, శిక్షణ పొందిన సిబ్బందితో పకడ్బందీగా కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కుమార్ దీపక్ ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ పూర్తయినప్పటి నుంచి అభ్యర్థులు కంటినిండా కునుకు లేకుండా ఫలితాలపై ఆతృతతో ఉన్నారు. రెండు రౌండ్లలోనే పూర్తిమంచిర్యాల, క్యాతనపల్లిలో రౌండ్కు వెయ్యి చొ ప్పున ఓట్లు లెక్కింపు జరగనుంది. రెండు టేబుళ్లు లెక్కింపు ఉన్నప్పటికీ ఒకే డివిజన్, వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. మిగతా చోట్ల మాత్రం వార్డు కు ఒక టేబుల్ చొప్పున మొదటి రౌండ్లో సగం వా ర్డులు, రెండో రౌండ్ సగం వార్డులు లెక్కించనున్నా రు. ఇక ఒక టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. వీరికి అదనంగా మరో పది శాతం సిబ్బంది రిజర్వు ఉంటారు. ఉదాహరణకు మంచిర్యాల నగరంలో 60డివిజన్లకు 60మంది సిబ్బందికి, 66మంది సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ల చొప్పున 120కి మరో పదిశాతం అదనం కలిపితే 132మంది ఉంటారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు పోలీసు బందోబస్తు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలుతోపాటు పరిమిత సంఖ్యలో అనుమతి, ర్యాలీలు, విజయోత్సవ వేడుకలపై ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాలుమంచిర్యాల ఐజా ఇంజనీరింగ్ కాలేజీ, ముల్కల్ల లక్సెట్టిపేట పాత ఎంపీడీవో ఆఫీసు, లక్సెట్టిపేట బెల్లంపల్లి జెడ్పీ హైస్కూల్, బెల్లంపల్లి చెన్నూరు జెడ్పీ హైస్కూల్, చెన్నూరు క్యాతనపల్లి ఆర్కేసీవోఏ, క్లబ్ భవనం, క్యాతనపల్లిజిల్లాలో కౌంటింగ్ సిబ్బంది వివరాలుమున్సిపాలిటీ వార్డులు/డివిజన్లు సూపర్వైజర్లు అసిసెంట్లు టేబుళ్లు రౌండ్లు మంచిర్యాల 60 60 132 60 02 బెల్లంపల్లి 34 19 37 17 02 క్యాతనపల్లి 22 24 48 22 02 చెన్నూరు 18 10 20 09 02 లక్సెట్టిపేట 15 09 18 08 02 -
ప్రచారం ముగిసె.. కూలి లేకపాయె..
ఓవర్బ్రిడ్జి వద్ద అడ్డా కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ప్రచారంతో బోసిపోయిన కార్మికుల అడ్డాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. వారం రోజులుగా అడ్డా కార్మికులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. రోజూ కూలీతో పాటు భోజనం ఇతరత్రా లాభాలు పొందారు. దీంతో ఇన్నాళ్లు అడ్డాల వద్ద కూలీలు కనిపించలేదు. ఎన్నికల ప్రచారం ముగియడంతో మళ్లీ అడ్డాలు కార్మికులతో నిండి కనిపిస్తున్నాయి. కానీ పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. – మంచిర్యాలరూరల్ (హాజీపూర్) -
వరుస చోరీల గజదొంగ అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసచోరీ కేసులను ఛేదించినట్లు పేర్కొన్నారు. 7 కేసులు నమోదు కాగా గజదొంగను పట్టుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి గ్రామ పంచాయతీ నాగాపూర్కు చెందిన టేకం రామారావుపై ఇప్పటి వరకు 36 కేసులు నమోదైనట్లు చెప్పారు. కరీంనగర్, సిద్ధిపేటలో దొంగతనాలకు పాల్పడినందుకు రెండేళ్ల జైలుశిక్ష అనుభవించినట్లు తెలిపారు. జనవరి 6న విడుదలకాగా ఉట్నూర్ మండలంలోని పలు ఇళ్లల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఉట్నూర్కు వచ్చి ఊరు శివారులో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. గురువారం దొంగిలించిన బంగారం, వెండి, ఇతర సామగ్రితో మంచిర్యాల వైపు వెళ్తుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద పట్టుకుని అతని వద్ద 11.4 తులాల బంగారు, 20 తులాల వెండీ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి
నస్పూర్: కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసిన ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా 34వ డివిజన్ మార్టీన్ గ్రామర్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి శ్రీలత తిరుపతి తరుపున కోన ప్రసాద్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నాడు. పోలింగ్ అనంతరం రాత్రి కాంగ్రెస్ నాయకుడు అగల్ డ్యూటి రాజు, అతని ఇద్దరు కుమారులు, వడ్లకొండ రవి మరో 30 మంది తమ ఇంటిపై దాడి చేసి తన భర్త ప్రసాద్ను అన్యాయంగా చితక బాదారని, చంపుతామని బెదిరించారని ప్రసాద్ భార్య లక్ష్మి ఆరోపించారు. గాయపడిన ప్రసాద్ను స్థానికులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు అగల్డ్యూటి రాజు, అతని ఇద్దరు కుమారులు, వడ్లకొండ రవి, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకుభీర్: ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గొడ్సర గ్రామానికి చెందిన విద్యార్థిని (17) భైంసాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ (ఎంపీపీఎస్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతురాలి స్నేహితులను విచారించగా అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసగించినట్లు తేలింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోబోటిక్ పోటీల్లో ప్రతిభజన్నారం: గత నెల 10న నిర్వహించిన ఈ బోట్ ప్లస్ ఇన్నోవిటీ రోబోటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో జన్నారం మండల కేంద్రంలోని స్లెట్ ఎక్సలెన్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పోటీలలో ఏడోతరగతికి చెందిన శౌర్య, శ్రేయస్, వైభవ్ ప్రతిభ కనబర్చినట్లు విద్యాసంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సదరు విద్యార్థులకు రూ.5 వేల నగదు బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ సిరిన్ ఖాన్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. -
నిరుద్యోగుల ఉపాధికి టాస్క్
● కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ ర్పాటు చేసిన టాస్క్ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్– సీటీ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణను ప్రారంభించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.2లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సంస్థ జోనల్ కార్యాలయం చీ ఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు, కరీంనగర్ రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి, ఆర్–సీటీ సంచాలకులు అశీష్వార్లె, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తి రుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలిభీమిని: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీ, కేజీబీవీ సందర్శించారు. వైద్యుడు అనిల్కుమార్, హెచ్వీ ఇందిరా పాల్గొన్నారు. -
కూలీ పనికి వచ్చి తిరిగిరాని లోకాలకు...
జైపూర్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన తూర్పాటి అభి (19), పెంబట్లకు చెందిన పురాణం రవి, పస్తం అరుణ్ ముగ్గురూ స్నేహితులు. చెన్నూర్లో పత్తి లోడింగ్ చేసేందుకు ఈనెల 11న ముగ్గురూ కలిసి ఒకే బైక్పై కూలీ పనికి వచ్చారు. రాత్రంతా పనిచేసిన యువకులు గురువారం తెల్లవారుజామున లక్సెట్టిపేటకు బయలుదేరారు. రసూల్పల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. అభి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి, అరుణ్కు తీవ్రగాయాలు కావడంతో 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. అభి తండ్రి తూర్పాటి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
జైపూర్: జైపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠఽశాలలో పదో తరగతి చదువున్న ఈ.గణేశ్ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు సిరంగి గోపాల్ తెలిపారు. గత నవంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏపీ జట్టుకు ఆదిలాబాద్ క్రికెటర్ఆదిలాబాద్: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పొలమూరు మోక్షిత్ శ్రీ నైతిక్ ఆంధ్రప్రదేశ్ అండర్–14 క్రికెట్ టీం(బీ)లో స్థానం సంపాదించాడు. ఇటీవల నిర్వహించిన జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రజట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 13 నుంచి తమిళనాడులో జరగనున్న ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల్లో ముంబై, తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లితండ్రులు పొలమూరు సింహాచలం, అనిత, శిక్షకులు జయేంద్ర పటాస్కర్, నరోత్తం రెడ్డి, విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు. సుంకిడి వాగులో పురాతన విగ్రహం తలమడుగు: సుంకిడి గ్రామ సమీపంలో గురువారం చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు పురాతన విగ్రహం కనిపించింది. కొందరు వేంకటేశ్వరస్వామి విగ్రహమని, మరికొందరు సత్యనారాయణస్వామి అని, చెన్నకేశవస్వామి అని పేర్కొంటున్నారు. వేదపండితులు నేరెల్ల రంగాచార్యులుకు చూపించగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహంగా ఉందన్నారు. -
స్తంభించిన గనులు
శ్రీరాంపూర్: కేంద్రం కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సమ్మె కారణంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి రీజియన్లో మూడు డివిజన్ల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. బెల్లంపల్లి డివిజన్లోని కై రిగూడ ఓసీపీ, మందమర్రి డివిజన్లోని కేకే ఓసీపీ కేకే 1, కేకే 2, కేకే 5, శాంతిఖని భూగర్భగనులు, శ్రీరాంపూ ర్ డివిజన్లోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఆర్కే 5, ఆర్కే న్యూటెక్, ఆర్కే 7, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3, 3 ఏ, ఐకే 1ఏ భూగర్భ గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు, సివిల్ డిపార్టుమెంటు కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో మైనింగ్ ఆపరేషన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఓబీ పనులు కూడా జరగలేదు. కొన్ని గనులు, సీహెచ్పీల వద్ద సా్ట్క్ కోల్ ను రవాణా చేసిన అధికారులు వాటిని బొగ్గు ఉత్పత్తి లెక్కల్లో చూపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సింగరేణి సెక్యూరిటీ విభాగం, సివిల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనల హోరుగుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతోపాటు సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూలతో కూడిన జేఏసీ, మరో పక్క హెచ్ఎమ్మెస్తో కూడిన ఇతర సంఘాల జేఏసీ నేతలు వేర్వేరుగా సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క బీఎంఎస్ మాత్రమే సమ్మెకు దూరంగా ఉంది. దీంతో మెజారిటీ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికుల స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం కార్మికులు గనులపైకి వచ్చి మస్టర్ పడకుండానే బయటికి వచ్చారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు గనుల గేట్ల ముందు, కూడళ్ల వద్ద లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కేవీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, నాయకులు బాజీసైదా, ఐఎన్టీయూసీ కేంద్రం ఉపాధ్యక్షులు జే శంకర్రావు, గరిగే స్వామి, జీవన్జోయల్, సీఐటీయూఽ రాష్ట్ర కార్యదర్శి టీ.రాజారెడ్డి, గుల్ల బాలాజీ, చంద్రశేఖర్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందరెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేశ్, పోగాకు రమేశ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు డీ.బ్రహ్మానందం పాల్గొన్నారు. భారీ నష్టంరీజియన్ పరిధిలో మొత్తం 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. దీంతో కంపెనీ రూ.9.60కోట్లు నష్టపోయిందని అధికా రులు పేర్కొంటున్నారు. రీజియన్ పరిధిలో మొత్తం 14,034 మంది ఉద్యోగులు పని చే స్తుండగా అత్యవసర సిబ్బంది మినహా మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వారు సుమారు రూ.5 కోట్లు వేతనాలు కో ల్పోయారు. డివిజన్ల వారీగా శ్రీరాంపూర్లో 10 వేల టన్నులు, మందమర్రిలో 2 వేల ట న్నులు, బెల్లంపల్లిలో 12 వేల టన్నుల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ ఓసీపీల్లో కొంత మేర బొగ్గు తీశారు. -
చిన్నారుల సమాచారం ఇవ్వండి
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ఫాం నుంచి, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, మరో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులు సరైన ఆధారాలతో కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డిని 87126 85122 నంబరులో సంప్రదించాలని కమిషనర్ సూచించారు. -
క్యాంపునకు పోదాం చలో చలో
మంచిర్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను శిబిరాలకు తరలించాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం, ఫలితాలు ఎలా వస్తాయనేది అంచనాకు అందకపోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీ పడ్డాయి. బీజేపీ 58 స్థానాల్లో, బీఆర్ఎస్ 59స్థానాల్లో పార్టీ తరఫున, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 59మంది, సీపీఐ నుంచి ఒకరు పోటీపడ్డారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది అంచనా వేయలేకపోతున్నారు. ఎవరికి వారే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంచనాలు తారుమారై ఫలితాలు కొద్దిగా అటు ఇటు వస్తే పార్టీ మారే అవకాశాలు ఉండడంతో ముందుగానే శిబిరాలకు తరలిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గురువారం ప్రత్యేక బస్సులో చంద్రాపూర్కు తరలించారు. బీజేపీ మేయర్ అభ్యర్థి గాజుల ముఖేష్గౌడ్తోపాటు ఇతర అభ్యర్థులు చంద్రాపూర్కు వెళ్లి అక్కడి ఆలయాలు, తడోబా సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఓడిపోయిన అభ్యర్థులను ఇంటికి పంపించి గెలిచిన వారు చేజారకుండా ఈ నెల 16న మేయర్ ఎన్నిక జరిగే వరకు అక్కడే ఉంచేలా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా గురువారం రాత్రి శిబిరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఎక్కడికి అనేదానిపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కంటిమీద కునుకు లేకుండా గడిపిన అభ్యర్థులకు శిబిరాలతో కాస్త ఉపశమనం లభించింది. లక్సెట్టిపేట.. లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గురువారం క్యాంపులకు తరలివెళ్లారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తరలివెల్లారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించి రహస్య ప్రదేశాల్లో ఉంచినట్లు తెలుస్తోంది. చెన్నూర్ నుంచి.. చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 18 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనాల్లో శిబిరాలకు తరలివెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం తెల్లవారు జామున క్యాంపునకు వెళ్లగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాత్రి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థుల భర్తలను సైతం తరలించారు. ఈ నెల 16న చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పార్టీలు క్యాంపులు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. లక్సెట్టిపేట బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులుమాజీ ఎమ్మెల్యే చిన్నయ్యతో బీఆర్ఎస్ అభ్యర్థులు వేర్వేరుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం రాత్రి వేర్వేరుగా రహస్య శిబిరానికి తరలివెళ్లారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారిని శిబిరాలకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 23మంది ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యలయం నుంచి బస్సులో వెళ్లారు. మిగతా 11మంది వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఫలితాల వెల్లడి తర్వాత వెళ్లే యోచనలో కొందరు ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షణలో 34మంది అభ్యర్థులు తిరుమలహిల్స్ నుంచి బస్సులో వెళ్లారు. అభ్యర్థులంతా కలిసికట్టుగా వ్యవహరించాలని, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చే పిలుపులకు స్పందించవద్దని సూచించినట్లు తెలిసింది. ఈ నెల 15న రాత్రి, లేదా 16న తెల్లవారుజామున బెల్లంపల్లికి చేరుకునే అవకాశాలున్నాయి. ఆ రోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. క్యాతనపల్లిలో..రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాల్టీలో 22 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటే వారికే మున్సిపల్ పీఠం దక్కే అవకాశం ఉండడంతో పోటీ చేసిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్, సీపీఐ ఉమ్మడి అభ్యర్థులు వేర్వేరుగా శిబిరాలకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులను పోలింగ్ ముగిసిన బుధవారం రాత్రే తరలించగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను గురువారం తరలించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు తర్వాత బలాబలాలను పరిశీలించి మెజార్టీ సాధించన వారు నేరుగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్న తమ తమ పార్టీల అభ్యర్థులను మరెవరూ లాగేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి గడ్డం వివేక్ తన నియోజకవర్గంలోని చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాల్టీలను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుండగా.. మరోవైపు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అభివృద్ధి, సంక్షేమానికి ఓటేశారు
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు ఓటు వేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 52వ డివిజన్ 222 పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల తన కాలుకు శస్త్రచికిత్స జరగ్గా, ఇబ్బంది పడుతూనే పోలింగ్ కేంద్రానికి సహాయకులతో చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతీ పౌరుడు ఓటును బాధ్యతగా వినియోగించుకుని, పూర్తి ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు లక్సెట్టిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
స్ట్రాంగ్రూంలో బ్యాలెట్బాక్సులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నగరంలోని 60 డివిజన్ల పరిధిలోని 265 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులు ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య తరలించి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. 10 రూట్లలోని బస్సుల ద్వారా రాత్రి 7 గంటల నుంచి మొదలు రాత్రి వరకు కూడా అన్ని డివిజన్లలోని బ్యాలెట్ బాక్సులు తరలించగా.. కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూంలో భద్రపర్చి సీజ్ చేశారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా, ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల సీఐ ప్రమోద్రావు, పలువురు సీఐలు, ఎస్సైలు మొత్తం 300 మంది వరకు బందోబస్తులో పాల్గొన్నారు. -
మహిళపై అడవిపంది దాడి
వేమనపల్లి: అడవిపంది దాడిలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తొర్రెం మధునక్క బుధవారం తోటి కూలీలతో కలిసి పంటచేనుకు వెళ్తుండగా ఎంచ ప్రాంతంలో పిల్లల పంది ఆమైపె దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో వేమనపల్లి పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుశ్నపల్లి ఎఫ్ఆర్ఓ దయాకర్ ఆదేశాలతో బేస్ క్యాంప్ సిబ్బంది వెంకటి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సల్యాదలో మరొకరిపై.. ఇచ్చోడ: మండలంలోని సల్యాద గ్రామానికి చెందిన ఇస్రుబాయి బుధవారం తమ పంట పొలానికి వెళ్లింది. పనిలో నిమగ్నమైన ఉండగా వెనుక నుంచి వచ్చిన అడవి పంది ఆమైపె దాడికి పాల్పడింది. మహిళ కేకలు వేయడంతో చుట్టు పక్కల పొలాల్లో ఉన్న వారు రావడంతో అడవిపంది అక్కడి నుంచి వెళ్లిపోయింది. మహిళకు తీవ్రగాయాలు కావడంతో 108కు సమాచారం అందించగా ఈఎంటీ అనిల్, ఫైలట్ వినోద్ ప్రథమ చిక్సిత్స అందించి ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. -
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
ముల్కల్ల 16వ డివిజన్లోని పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బుధవారం ఉదయం 7గంటల నుంచే పలు చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లా కేంద్రంతో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల సవ్యంగా పోలింగ్ ముగిసింది. మంచిర్యాల నగరంలో ఉదయం 9గంటల వరకు పది శాతంలోపే పోలింగ్ నమోదు కాగా, మిగతా చోట్ల 11శాతానికి పైగా, తర్వాత 11గంటలకు 30శాతం వరకు, ఒంటి గంట వరకు సగం ఓట్లు పోలయ్యాయి. చాలా బూత్ల్లో మందకొడిగా మొదలైన పోలింగ్ పది గంటల తర్వాత సాయంత్రం 5వరకు చాలా చోట్ల ఓటర్లు కనిపించలేదు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా పటిష్ట బందోబస్తును నిరంతరం పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 2,94,297 ఓటర్లు ఉండగా, 201875మంది ఓటేశారు. మిగతా 92,422మంది ఓటుకు దూరంగా ఉన్నారు. వీరిలో మృతులు, వలసవెళ్లిన, డబుల్ ఓటర్లు కూడా ఉన్నారు. పోలింగ్ పదనిసలు పోలింగ్కు రెండు రోజుల ముందే పోల్ చీటిలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ చాలామందికి అందలేదు. దీంతో మంచిర్యాల నగరం, బెల్లంపల్లి, చెన్నూరు పట్టణాల్లో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీ అభ్యర్థులే చీటిలను పంపిణీ చేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తమ కుటుంబానికి స్థానిక బీఎల్వోలు పోల్ చీటిలు ఇవ్వలేదని వాపోయారు. మంచిర్యాల నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి తన ఫొటోతో కూడిన పోల్ చీటి పంపిణీ చేశారు. సీసీసీ నస్పూర్ మెయిన్ రోడ్డుపై ఇరువైపుల రాకపోకలకు వీలులేకుండా బారికేడ్లు అమర్చడంతో ఓటర్లు, అటువైపు వెళ్లే ప్రయాణికులు రోడ్డుపై ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడ్డారు. చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు పట్టణం అంబేడ్కర్ చౌరస్తా వద్ద నల్ల కండువాతో నిరసన తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి పోలింగ్ సమయంలో పలువురితో వాగ్వాదానికి దిగారు. బెల్లంపల్లి పట్టణం 19వార్డు అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు, మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ ఓటేసిన బ్యాలెట్పేపర్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. పోలింగ్ కేంద్రానికి సెల్ఫోన్తో ఎలా వెళ్లాడని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు పోలింగ్ చీటిపై కారు గుర్తుతో సహా పంపిణీ చేశారని 31, 32వ వార్డుల్లో వీల్చైర్లు అందుబాటులో లేవని ఓటర్లు వాపోయారు. 29వ వార్డులో స్థానికంగా లేని వారిని ఓటేసేందుకు తీసుకొచ్చారని బీజేపీ అభ్యర్థి కోడి రమేశ్ ఆరోపించాడు. 22వ వార్డులో చనిపోయిన వ్యక్తి స్థానంలో ఒకరు ఓటేసేందుకు వచ్చారని ఏజెంట్లు గుర్తించారు. లక్సెట్టిపేట ఐదోవార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ తనను పోలింగ్ కేంద్రానికి ఏజెంట్గా వెళ్లనీయడం లేదంటూ బైఠాయించగా, పోలీసులు అతన్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. డబ్బుల పంపిణీపై ఆరోపణలు జిల్లాలో పలు చోట్ల అభ్యర్థులు ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే ఓటర్లకు డబ్బులు పంచారు. చెన్నూరు పట్టణం రెండో వార్డు అభ్యర్థి భర్త ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్యాతనపల్లి 21వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దనే ఎర్ర కారులో ముగ్గురు మహిళలతో బీఆర్ఎస్ అభ్యర్థి భర్త నేరుగా ఓటేసిన వారికి పంచారని స్వతంత్ర అభ్యర్థి సౌజన్య ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంకా మద్యం, బిర్యానీ ఇతర కానుకలు భారీగా పంపిణీ చేశారు. పోలింగ్కు ముందు రోజు రూ.వెయ్యి చొప్పున ఇచ్చి, పోలింగ్ జరిగే సమయం మధ్యాహ్నం వరకు మరోసారి కొందరు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. కొందరు రెండు వేల చొప్పున పంచారు. జిల్లా కేంద్రం సహా, అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు కొనసాగింది.చంటి పాపతో పోలింగ్ కేంద్రంకు వస్తూశాతంఓట్లుమున్సిపాలిటీ మొత్తం పురుషులు సీ్త్రలు పోలైన ఓట్లు పురుషులు సీ్త్రలు శాతం మంచిర్యాల 181778 90646 91111 1,17,983 58,711 59,268 64.90 బెల్లంపల్లి 44554 21549 23002 33350 16337 17013 74.86 చెన్నూర్ 19903 9711 10191 15096 7412 7683 75.85 క్యాతన్పల్లి 29731 14732 14998 21368 10557 10811 71.87లక్సెట్టిపేట 18331 8765 9565 14078 6727 7351 76.80 మొత్తం 294297 145403 148867 2,01,876 99744 102126 68.60 నోట్ : ఇతర ఓటర్లు 27మంది ఉండగా, వీరిలో ఆరుగురు ఓటేశారు మన్సిపాల్టీల్లోని ఓటర్ల వివరాలుగెలుపుపై ఎవరి ధీమా వారిదేఎన్నికల కోసం ఎంతో శ్రమించిన అభ్యర్థులు, తమకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కించే పనిలో పడ్డారు. రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ పలువురు అభ్యర్థులకు ఆశించిన మేర ఓట్లు పడలేదనే నిరాశలో ఉన్నారు .మరికొందరు మాత్రం తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఈ మేరకు బూత్ల వారీగా తమకు వచ్చిన ఓట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ఎలా పోలింగ్ జరిగాయో ఆరా తీసుకుంటున్నారు. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అభ్యర్థులు కొందరు నిరాశలో పడ్డారు. సోషల్ మీడియాలో అభ్యర్థులు గెలుపోటములపై వాదనలు చేసుకుంటున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు తేలనున్నాయి. అయితే ఓ పార్టీ అభ్యర్థులు ఇప్పుడే క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.తొలి ఓటు వేసిన సాయి అనురాగ్, సాయి సహనలక్ష్మి ఐదేళ్ల క్రితం ఓట్లతో పోలిస్తే ప్రస్తుతం తగ్గుదల మున్సిపాలిటీ 2020(శాతం) 2026 (శాతం) బెల్లంపల్లి 77.99 74.86 లక్సెట్టిపేట 77.95 76.80 క్యాతనపల్లి 73.02 71.87 మంచిర్యాల 67.14 64.90మున్సిపాలిటీ 7–9గం. 9–11గం. 11–1 గం. 1–3గం. 3–5గం. మంచిర్యాల 17,650 9.71 38,572 21.22 69,970 38.49 99,318 54.64 1,17,982 64.90 బెల్లంపల్లి 5,543 12.44 13,621 30.57 22,457 50.40 28,743 64.51 33,351 74.86చెన్నూర్ 2,952 14.83 7,403 37.20 11,539 57.98 13,936 70.02 15,096 75.85క్యాతన్పల్లి 4,139 13.92 9,175 30.86 15,385 51.75 18,725 62.98 21,368 71.87లక్సెట్టిపేట 2,621 14.30 6,637 36.21 10,575 57.69 12,755 69.58 14,078 76.80 -
వాట్సాప్ స్టేటస్లో ‘బ్యాలెట్’
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లికి కేటాయించిన గుర్తుకు ఓటు వేసిన తనయుడు ఆ బ్యాలెట్ పేపర్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ తల్లి జయ 19వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసిన తనయుడు సురేష్ రహస్యంగా బ్యాలెట్ పేపర్ను ఫొటో తీసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎన్నికల అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ ఎలా తీసుకెళ్లాడని ఆరా తీస్తున్నారు. ఓటు ఎవరికి వేశారనే విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి ఉండగా బహిర్గతం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఫిన్లాండ్ నుంచి వచ్చా..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్కు చెందిన డాక్టర్ ఎడ్ల సంతోష్ కుమార్ ిఫిన్లాండ్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు వారం క్రితం కుటుంబ సమేతంగా జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం వంటిందని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. -
ప్రజాపాలనలో పారదర్శకంగా ఎన్నికలు
మంచిర్యాలటౌన్: ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించామని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం మంచిర్యాలలోని 52వ డివిజన్ హైటెక్సిటీ కాలనీలో నివాసం ఉంటున్న మంత్రి కిలోమీటరు దూరంలోని 227వ పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని, గత ప్రభుత్వంలోనే పోలీసులను ఉపయోగించి ఇష్టారాజ్యంగా ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 85శాతం కంటే ఎక్కువ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. -
నేడు బొగ్గు గనుల్లో సమ్మె
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల్లో సమ్మె జరుగనుంది. దీని కోసం జాతీయ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలన్నీ సమ్మెను విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. సింగరేణిలో కార్మిక శక్తిని చాటడం కోసం కార్మిక సంఘాల జేఏసీలు ఏర్పడి సమ్మెను ఎలాగైనా విజయవంతం చేయాలని సంకల్పించాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఇతర ప్రాంతీయ సంఘాల కూటమితో పాటు మరో జాతీయ సంఘం హెచ్ఎంఎస్తో పాటు జేఏసీ నేతలు కూడా సమ్మె పిలుపులో భాగస్వామ్యమయ్యారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికవర్గం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవని, వేతనాల పెరుగుదల జరుగదని, కార్మిక సంఘాలు పెట్టుకునే వీలుండదని, తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను కూడా చేయలేని దుస్థితిలో కార్మికవర్గం ఉండబోతుందని, ఈ లేబర్కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. సమ్మెకు బీఎంఎస్ దూరం.. నేటి దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంది. ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమని, కార్మికులు స మ్మెకు దూరంగా ఉండాలని జాతీయ సంఘమైన బీఎంఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ చట్టాలతో కార్మికవర్గానికి మేలు జరుగుతుందని వారు పే ర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సమ్మె వద్దని మ రోవైపు సింగరేణి యాజమాన్యం పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్యల పరి ష్కారం కోసం సింగరేణిలో సమ్మె చేసి కార్మికులు నష్టపోవద్దని, కంపెనీకి నష్టం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా నేటి సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. -
టెండర్ ఓట్లు వేశారు..
మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాలేజీ రోడ్ 41వ డివిజన్లో ఓటేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలకు చుక్కెదురైంది. గర్మిళ్ల హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో కవిత రాథోడ్, ఆకుల సరిత ఓటేసేందుకు వెళ్లారు. ఓటరు జాబితా పరిశీలించగా అప్పటికే వారి ఓటు నమోదైందని అధికారులు చెప్పారు. దీంతో అవాకై ్కన ఓటర్లు తమ ఓటు తమకు తెలియకుండా ఎవరు వేశారంటూ అధికారులను నిలదీశారు. దీంతో 15 నిమిషాలపాటు గందరగోళం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరూ టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు. కానీ వారిద్దరి పేరిట దొంగ ఓటు ఎవరు వేశారనేది పోలింగ్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. -
ఊరంతా ఏకమై.. ఆర్థికసాయం అందించి..
ఇంద్రవెల్లి: మండలంలోని సమాకా గ్రామ ఆదివాసీలు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన మడావి (కిరణ్) ధర్మరాజ్ వివాహం గురువారం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గ్రామస్తులంతా ఏకమై చందాల రూపంలో వసూలు చేసిన రూ.25 వేలు బుధవారం యువకుడి తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ పెందోర్ భగవత్రావ్ మాట్లాడు తూ గ్రామానికి చెందిన యువతీ యువకుల వివా హానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాలుగా ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొరెంగా యెశ్వంత్రావ్ మహరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మంత్రి అధికార దుర్వినియోగం
చెన్నూర్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉంటూ ప్రచారం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల కండువా కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మోటార్సైకిళ్లపై తిరుగుతున్న ఫొటోలను ప్రదర్శించారు. 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచారని తెలిపారు. జైపూర్ ఏసీపీ, చెన్నూర్ సీఐ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లెల దామోదర్రెడ్డి, మోతె తిరుపతి, నర్సింహచారి, విద్యాసాగర్, రాకేశ్గౌడ్, ఆసంపల్లి సంపత్కుమార్ పాల్గొన్నారు. -
వరి పొట్ట దశలో జాగ్రత్తలు పాటించాలి
చెన్నూర్రూరల్: యాసంగి సీజన్లో వరి సాగు చేసిన రైతులు పొట్టదశలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ తెలిపారు. వరిలో పొట్ట దశ చాలా కీలకమని, జాగ్రత్తలు పాటించకుంటే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. పొట్ట దశలో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగులు ఆశిస్తే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఈ పురుగులు సోకినట్లు గుర్తిస్తే నత్రజని ఎరువుల వాడకం పూర్తిగా నిలిపి వేయాలని, తెగులు సోకిన పొలం నుంచి ఇతర పొలానికి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రెండు నుంచి మూడు రోజులపాటు చేనును ఆరబెట్టిన తర్వాత ఎకరాకు 20 కిలోల మ్యూరేట్ పొటాష్ చల్లాలన్నారు. ఎకరాకు 500ల గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరో సెన్స్ శిలీంద్రాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం సమయంలో మాత్రమే పంటపై పిచికారి చేస్తే కొన్ని రకాల పొడ తెగుళ్లు, అగ్గి తెగుళ్లు, పొట్ట కుళ్లు తెగుళ్లను అరికట్ట వచ్చని ఆయన వివరించారు. కాండం కుళ్లు తెగులు నివారణకు చర్యలు కాండం కుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి వాలిడామైసిన్ 2 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ దశలో సూటి ఎరువులను వాడకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చిరు పొట్ట దశలో కాంప్లెక్స్ ఎరువులు వేస్తే సుడి దోమ ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీరోజు వరి పైరును గమనించి దుబ్బుకు 20కి మించిన సుడి దోమలు కనిపిస్తే నివారణ చర్యలు తీసుకోవాలి. పంట చేలో ఉన్న నీటిని బయటకు తీసి ఎకరాకు ఫెనుబ్యూకార్బ్ 400 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపిన దావ్రణం వరి దుబ్బు మొదళ్లలో పడేలా పిచికారీ చేయాలి. వరిలో ఎలుకల ఉధృతి నివారించేందుకు బ్రోమోడయోలిన్ వంటి విషపు ఎర, లేదా బుట్టలు, పొగ యంత్రాల ద్వారా ఎలుకల కన్నాల్లోకి పొగ బారించాలి. పై పద్ధతులు పాటిస్తే వరిలో మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన సూచించారు. -
అయ్యా.. నాకొడుకులు సాత్తలేరు
● పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు తిర్యాణి: నవమోసాలు మోసి కని పెంచిన కొడుకులు వృద్ధాప్యంతో తనను పట్టించుకోవడంలేదని ఓ వృద్ధురాలు బుధవారం స్థానిక పోలీసులను ఆశ్రయించిది. వివరాలు ఇలా ఉన్నాయి. నాయకపుగూడకు చెందిన ముత్తె గంగవ్వకు ముగ్గురు కుమారులు సంతానం. భర్త పోషమల్లు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. కొన్నిరోజుల పాటు కొడుకుల ఇళ్లలో ఉన్న గంగవ్వను ఇటీవల వెల్లగొట్టడంతో సమీపంలోని వ్యవసాయభూమిలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ నేపధ్యంలో గుడిసెకు సంబంధించిన భూమి కూడా తమదేనంటూ కూలగొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పోలీసులే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వర్క్షాపులో చోరీమందమర్రిరూరల్: మందమర్రి వర్క్షాప్లో నిలువ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కొన్ని రోజులుగా కాపర్ వైరు చోరీ జరుగుతున్న విషయం బుధవారం వెలుగుచూసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లలో వినియోగించిన ట్రాన్స్ఫార్మర్లను ఏరియా వర్క్షాపుల్లో నిలువ ఉంచుతారు. కొందరు దుండగులు బాక్స్లను తెరిచి అందులోని కాపర్ దొంగిలించి తిరిగి బాక్సుల కవర్లు బిగించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో అధికారులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన కాపర్ విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవిని వివరణ కోరగా చోరీ జరిగిన విషయంపై సీసీ ఫుటేజీ ద్వారా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. వివాహిత ఆత్మహత్యమందమర్రిరూరల్: పట్టణానికి చెందిన వివాహిత హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మందమర్రి పట్టణంలోని శ్రీపతినగర్కు చెందిన పొన్నం శ్రావణి (28)కి అదేకాలనీకి చెందిన రంజిత్తో ఇటీవలే వివాహమైంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రావణి ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. రంజిత్ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. బుధవారం శ్రావణి గడ్డిమందు తాగడంతో గమనించిన హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్కు వెళ్లారు. కాగా శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
‘విజయవంతం చేయాలి’
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం జరపతలపెట్టిన సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనులపై గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఇవి అమలైతే కార్మికులు కట్టు బానిసల్లాగా పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, చంద్రశేఖర్, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు డీ.బ్రహ్మానందం, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దుబాయి నుంచి వచ్చి.. ఓటేసి
ఖానాపూర్: ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లా. మరో రెండు నెలల తర్వాత ఇండియాకు రావాల్సి ఉంది. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ఉన్న విషయం తెలియడంతో రెండు రోజుల క్రితమే స్వగ్రామం ఖానాపూర్కు వచ్చా. ఓటుహక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉంది. నోటిఫికేషన్ రావడంతో తిరిగొచ్చాఖానాపూర్:ఇటీవల విజిట్ వీసాపై దుబాయ్కి వెళ్లా. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరికొద్ది రోజులు అక్కడే ఉండాల్సి ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే ఖానాపూర్కు తిరిగి వచ్చా. ఓటుహక్కు వినియోగించుకున్నా. -
పోలింగ్ చిట్టీల పంపిణీలో నిర్లక్ష్యం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు పోల్ చిట్టీల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీఎల్వో(బూత్ లెవల్ అధికారులు)లు ఏ ఎన్నికల్లో అయినా ఇంటింటికి వెళ్లి అందజేస్తుంటారు. ఈ ఎన్నికల్లో అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో 60 డివిజన్లలోని 265 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ కేంద్రం ఎక్కడు ఉందో తెలుసుకునేందుకు మున్సిపల్ సిబ్బందికి ఓటరు కార్డు చూపించి చిట్టీలు పొందారు. ఓటేసేందుకు ఇబ్బంది లేకున్నా పోల్ చిట్టీలు పొందడానికి ఓటర్లు వేచి చూడాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పలువురు తమ ఫొటో, గుర్తు, పేరుతో కూడిన పోల్ చిట్టీలను ఓటర్లకు అందజేశారు. తమకే ఓటు వేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం అభ్యర్థుల ఫొటోలతో కూడిన పోల్ చిట్టీలను తీసుకుని వెళ్లగా అధికారులు వాటిని తీసుకుని ఓటు వేయించారు. పాతమంచిర్యాల: ఓటరు స్లిప్లు పంపిణీ చేయకపోవడంతో ఓటు వేసేందుకు ఇబ్బంది పడ్డామని 42వ డివిజన్ ఎన్టీఆర్ నగర్కు చెందిన సుంకి పద్మావతి వాపోయారు. గతంలో బీఎల్వోలు ఓటరు స్లిప్లు పంపిణీ చేసేవారని, మున్సిపల్ సిబ్బంది చాలా డివిజన్లలో ఓటరు స్లిప్లు ఇవ్వలేదని తెలిపారు. -
పనుల పురోగతి పరిశీలించిన డీఆర్ఎం
మందమర్రిరూరల్: మందమర్రి–మంచిర్యాల పరిధిలోని నాన్ ఇంటర్ లాకింగ్ పనుల పురోగతిని బుధవారం మందమర్రి వద్ద సికింద్రాబాద్కు చెందిన డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణ పరిశీలించారు. అధికారులను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తయితే రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి బ్రేక్ పడనుంది. పనులు జరుగుతున్న కారణంగా కొన్ని రైళ్లు మంచిర్యాల వరకే నడుస్తుండగా మరికొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. తాండూర్ చేరిన సైకిల్ యాత్రతాండూర్: ధర్మ ప రిరక్షణ కోసం ఒడి స్సా రాష్ట్రానికి చెందిన సుబ్రత్ మహా రాణా అనే యువకుడు చేపట్టిన సైకి ల్ యాత్ర బుధవా రం తాండూర్కు చేరింది. ఒరిస్సా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లా బెల్బిహార్జురా గ్రామానికి చెందిన సుబ్రత్ తన తల్లిదండ్రులు సుకాంతి మహారాణా, పద్మనాభం మహారాణా స్ఫూర్తితో పది రోజుల క్రితం యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతంలో కూడా గోమాత పరిరక్షణ కోసం ఎనిమిది రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, శ్రీశైలం, తిరుపతి, తమిళనాడులోని అరుణాచలం, రామేశ్వరంలో పలు పుణ్యక్షేత్రాలతో పాటు ఉత్తరభారతదేశంలోని చార్దామ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో యాత్ర ముగుస్తుందన్నారు. రూ.35 వేలు సీజ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నల్ల రవి కుమారుడు విక్రమ్ దుబ్బపల్లిలోని 70వ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ చీటీలతో పాటు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు అతని వద్ద నుంచి రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి అప్పగించినట్లుతెలిపారు. వారి ఫిర్యాదు మేరకు విక్రమ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కత్తితో పోలింగ్ కేంద్రానికి మహిళ
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓ మహిళ కత్తితో పోలింగ్ కేంద్రానికి రావడం కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలోని 11వ వార్డు రాంనగర్లో ఓటు వేసేందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళను పోలీసులు తనిఖీ చేయగా ఆమె వద్ద కత్తి లభించింది. ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని మహిళను మావల పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత విచారించగా తన ఇంటివద్ద పిల్లలు ఉండడంతో కత్తితో ఆడుకుంటారనే ఉద్దేశంతో వెంట తెచ్చుకున్నట్లు చెప్పినట్లు మావల సీఐ స్వామి పేర్కొన్నారు. ఆ తర్వాత మహిళను వదిలిపెట్టారు. కాగా ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. -
పత్తి చేనులో అమర్చిన విద్యుత్ తీగలు
వేమనపల్లి: మండలంలోని బద్దెల్లి శివారు పత్తి చేనులో వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలు తాకిన రైతు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కల్మలపేట గ్రామానికి చెందిన పారగాని రాజ్కుమార్, దుర్గం రాజన్న, హనుమండ్ల సంతోష్ బుధవారం టకిరె బాపురావ్ పత్తి చేనులో విద్యుత్ తీగలు అమర్చారు. సదరు రైతు రాత్రి మోటార్ పైప్లు మార్చేందుకు పొలం వద్దకు వెళ్ళాడు. విద్యుత్ తీగలను తాకడంతో కిందపడిపోయాడు. కొద్ది సేపటికి తేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. విద్యుత్ సరఫరా నిలిపి వేసి అటవీ రేంజర్ హఫీజొద్దీన్, డీఆర్ఓ ప్రమోద్ కుమార్, బీట్ అధికారి మహిపాల్, ట్రాన్స్కో సిబ్బంది శంకర్ ఘటనా స్థలానికి వెళ్ళారు. గడ్డి వాములో దాక్కున్న ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విద్యుత్ తీగలు, గూట కర్రలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజర్ తెలిపారు. -
తండ్రి గెలుపు కోసం లండన్ నుంచి..
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన తండ్రి గెలుపు కోసం ఓ కుమార్తె లండన్ నుంచి వచ్చి ఓటేశారు. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని ఆరో వార్డు నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న పోటీ చేస్తున్నారు. అతని కుమార్తె చిలువేరు శ్రేయ లండన్లో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగాన్వేషణలో ఉంది. తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ముందుగానే స్వదేశానికి చేరుకుంది. స్థానిక జెడ్పీ ఉర్దూ పాఠశాలలో బుధవారం ఓటుహక్కు వినియోగించుకుంది. బాధ్యతగా ఓటు వేసిన శ్రేయను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు. -
తీర్థయాత్రలకు ‘స్పెషల్’ రైళ్లు..!
మంచిర్యాలఅర్బన్: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తీర్థయాత్రలు చేయాలనుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మార్చి 21, ఏప్రిల్ 14 తేదీలలో రెండు ప్రత్యేక ప్యాకేజీలతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. దివ్య దక్షిణయాత్ర జ్యోతిర్లింగం మార్చి 21న ప్రారంభమై 28న ముగియనుంది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 14న ప్రారంభమై 24న ముగియనుంది. సోమవారం మంచిర్యాలలో యాత్రకు సంబంధించిన వివరాలను టూరిజం మానిటర్లు కొక్కుల ప్రశాంత్, శ్రీకాంత్లతో కలిసి ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ వెల్లడించారు. ప్రయాణం ఇలా.. సీసీ కెమెరాలతో భద్రత.. తీర్థయాత్రకు వెళ్లే భక్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోచ్, సెక్యూరిటీ గార్డు, రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతను కల్పించనున్నారు. రైలు, బస్సు, హోటల్ అన్ని (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) తాగునీటి బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు ఉండనున్నాయి. ప్రయాణ బీమా, రైల్వేస్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా ప్రకటించారు. ప్రతీ రైలులో 639 మంది ప్రయాణికులు ఉండనున్నారు. ప్రతీ 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. తీర్థయాత్రకు వెళ్లే భక్తులు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 9701360701, 9281030727, 9281030759 నంబర్లలో సంప్రదించవచ్చు. -
● మున్సిపల్ ఎన్నికల్లో తాయిలాల పర్వం ● ప్రచారం ముగియడంతో డబ్బు, మద్యం, కానుకల పంపిణీ ● ఎవరు ఇచ్చినా తీసుకుంటున్న ఓటర్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్తో సహా బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో చివరి రెండ్రోజులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం ముగిసింది. దీంతో తెరవెనుక మంతనాలు మొదలు పెట్టారు. వలస వెళ్లిన ఓటర్లకు ఇప్పటికే ఆన్లైన్లో నగదు పంపిస్తున్నారు. రవాణా, ఇతర ఖర్చులు భరిస్తూ ఓటుకు కొంత మొత్తంలో ముట్టజెప్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్తోపాటు పలు చోట్లకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రీత్యా వెళ్లిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్న వారికి మద్యం సీసాలు, నగదు ఇస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు అందజేస్తున్నారు. అవసరమైతే మళ్లీ పంపిణీ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. బలహీనవర్గాలు, నిరుపేద, దినసరి కూలీ చేసుకునే ఓటర్లపై అధికంగా దృష్టి సారించి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక అభివృద్ధి చెందిన కాలనీల్లో మహిళలు, అపార్టుమెంట్లు, సంఘాల వారీగా గుర్తించి అందరికీ డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో దాదాపు భారీగా తాయిలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే అదునుగా ఓటర్లు సైతం ఎవరు ఇచ్చినా డబ్బులు తీసుకుంటున్నారు. మేయర్, చైర్పర్సన్ అభ్యర్థులు ఉన్న చోట్ల మంచిర్యాల కార్పొరేషన్లో మేయర్ పదవి ఆశిస్తున్న డివిజన్లలో ఓటు మరింత ఖరీదైంది. ఓటుకు రూ.2వేలకు పైగానే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పదవి రేసులోఉన్న ఐదుగురు అభ్యర్థుల వరకు ఈ మేరకు తమ డివిజన్లలో అందరికీ డబ్బుతోపాటు మద్యం పంపిణీలో నిమగ్నమయ్యారు. బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో చైర్పర్సన్ అభ్యర్థులు సైతం భారీగానే పంచుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.వెయ్యి పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి చెన్నూ రు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పలువురు అభ్యర్థులకు నగదు రూపంలో సాయం అందినట్లు స మాచారం. చైర్పర్సన్ అభ్యర్థులు మాత్రం అధికంగా సొంత డబ్బులే ఖర్చు చేసుకుంటున్నారు. ‘సర్.. డబ్బులు పంచుతున్నారు’ ఎన్నికల్లో డబ్బులు, మద్యం, కానుకలు పంచుతున్నారని ఎన్నికల నిఘా అధికారులకు ప్రతీరోజు పది వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థులపై కక్షతోనూ కొందరు సమాచారం ఇస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇటీవల నస్పూర్, శ్రీరాంపూర్, జిల్లా కేంద్రం, చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతనపల్లి పరిధిలో పలు ఫిర్యాదుల వచ్చాయి. అధికారులకు ఎలాంటి నగదు లభ్యం కావడం లేదు. బరిలో ఉన్న వారందరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తూ అధికారులకు పట్టించేందుకు కాల్స్ చేస్తున్నారు. స్థానిక తహసీల్దార్ ర్యాంకుతో కూడిన అధికారులు, పోలీసులు, వీడియో, ఫొటోగ్రాఫర్ సమక్షంలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా డబ్బులు గుర్తించలేదు.5 శాతం కమీషన్తో నగదుగా మార్పుఓటర్లకు డబ్బుల పంపిణీకి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్నారు. కొందరి డబ్బులు ఆన్లైన్లో ఉండడంతో లావాదేవీలు బయటపడకుండా ఉండేందుకు నగదుగా మార్చుతున్నారు. నగదు చేతిలో ఉన్న వారు ఐదు శాతం కమిషన్తో ఆన్లైన్ డబ్బును నగదుగా మార్పిడి చేసి ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలువురు అభ్యర్థులు డబ్బుల కోసం తిప్పలు పడుతున్నారు. -
బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలకు సోమవారం అధికారులు బహిరంగ, సీల్డ్ టెండర్లు నిర్వహించారు. ఘాట్ వద్ద పూజా సామగ్రి విక్రయానికి రూ.35.11 లక్షలు, ఆలయ ఆవరణలోని దుకాణానికి రూ.38.88 లక్షలు, వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపంలో భక్తుల ఫొటోలు తీసేందుకు రూ.40.16 లక్షలు, 150 రూపాయల మండపంలో ఫొటోలు తీసేందుకు రూ.41.70 లక్షలకు వ్యాపారులు టెండర్లు దక్కించుకున్నారు. 4 విభాగాల్లో జరిగిన వేలంలో ఆలయానికి రూ.1,55,85,888 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. హుండీ లెక్కింపు వాయిదా బాసర ఆలయంలో నేడు నిర్వహించనున్న హుండీ లెక్కింపును కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా చేసినట్లు ఈవో అంజనాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రెండుసార్లు వాయిదా పడినట్లు ఆమె పేర్కొన్నారు. -
ఓసీపీపై కార్మికుల ఆందోళన
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే–ఓసీపీపై గనిపై కాంట్రాక్టు కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. రెండు నెలలుగా డ్రైవర్లు, సూపర్వైజర్లు, సర్వే, బ్లాస్టింగ్ కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తూ ఈ నెల మొత్తానికి చెల్లించకపోవడం, సంవత్సరం బోనస్ కూడా ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులపై కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సుమారు 300మంది కార్మికులతో పని చేస్తున్న సంస్థ ముందస్తు సమాచారం లేకుండా పనులు నిలిపివేసినట్లుగా తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఓబీ పనుల తొలగించకుండా మట్టి తొలగించిన ప్రాంతాల్లో బొగ్గు వెలికి తీస్తూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోందని తెలిపారు. సింగరేణి అధికారులు మాట్లాడు తూ వేతనాలు అందించే విధంగా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
కలమడుగు వాసికి గోల్డ్మెడల్
జన్నారం: మండలంలోని కలమడుగుకు చెందిన బొంతల మధుకర్ పీహెచ్డీ పట్టాతో పాటు గోల్డ్మెడల్ సాధించాడు. గ్రామ సర్పంచ్ బొంతల నాగమణి, మల్లేష్ దంపతుల కుమారుడు మధుకర్ హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో మొక్కజొన్న పంటలో డ్రోన్ ద్వారా గడ్డిమందును చల్లే విధానంపై పరిశోధనలు చేశారు. పరిశోధన విజయవంతం కావడంతో సోమవారం యూనివర్సిటీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో యూఎస్ఏ కార్నల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రభు ఎల్.పింగళి, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాతో పాటు గోల్డ్మెడల్ అందుకున్నాడు. తీవ్రమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదంఖానాపూర్: ఖానాపూర్లో ఏర్పాటు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్కు తరలించారంటూ ఇంటిగ్రేటెడ్ సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించామని జేఏసీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, స్థలం లేకే స్కూల్ ఏర్పాటు కాలేదని, దీనిపై ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో జేఏసీ నాయకులు తాము సైతం ప్రమాణం చేస్తామంటూ సోమవారం స్థానిక ముత్యాల పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎమ్మెల్యే రాకపోవడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి తనస్థాయికి తగ్గ వ్యక్తులు కానప్పటికీ వారు వస్తే సవాల్ స్వీకరిస్తానని అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బొజ్జు ప్రకటించారు. -
ఐదంచెల భద్రత
మంచిర్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భదత్ర ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మద్యం, డబ్బు, బహుమతుల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహణకు భదత్ర ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 444 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఇందులో 179 సమస్యాత్మకంగా గుర్తించామని, వీటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుంటాయని అన్నారు. 168 మంది పాత నేరస్తులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని, అనుమతి లేకుండా నగదు తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రూ.2.58లక్షలు నగదు సీజ్ చేశామని, రూ.2.20లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని 51కేసులు నమోదు చేశామని అన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేశామని, జిల్లాలోని గూడెం, అర్జున్గుట్ట, ఇందన్పల్లి, తాండూర్ర్ వద్ద ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, ఎన్నికల ఫిర్యాదుల విభాగం టోల్ ఫ్రీ నంబర్ 08736 250501లో సమాచారం అందించాలని తెలిపారు.బందోబస్తు సిబ్బంది ఇలా..సీపీ డీసీపీ ఏసీపీ సీఐ ఎస్సై ఫోర్స్ 1 1 6 17 43 900 -
యువకుడి మృతిపై ఆందోళన
లక్సెట్టిపేట: ప్రైవేటు బ్యాంకులో గ్రూపు డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు వెంకట్రావుపేటకు చెందిన నాతరి ప్రశాంత్ (30) తల్లి నాతరి భాగ్య ఓ ప్రైవేటు బ్యాంకులో గ్రూపులోన్ తీసుకుంది. గతేడాది డిసెంబర్లో సభ్యురాలు సువర్ణకు కిస్తీ డబ్బులు చెల్లించింది. విషయం తెలియని ప్రశాంత్కూడా రూ.980 ఫోన్పే చేశాడు. డిసెంబర్ 2న ప్రశాంత్ వెళ్లి అడుగగా అక్కడే ఉన్న మరో సభ్యురాలు సంధ్యతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సంధ్య బంధువులు బైరం దినకర్, బైరం కృపాకర్ దాడికి దిగారు. అదేరోజు సాయంత్రం దాసరి సురేష్, బై రం దినకర్, బైరం కృపాకర్ మళ్లీ దాడి చేయడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 8న ప్రశాంత్ కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు, అటు తర్వాత కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయం చేయాలని రాస్తారోకో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచింది. సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుని తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుకింగ్ ద్వారానే యూరియా పంపిణీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా పంపిణీ పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని మంచిర్యాల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిడి కృష్ణ తెలిపారు. సోమవారం హాజీపూర్ మండలంలో ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రైతులు తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్లో నమోదు చేసుకుని సులభంగా యూరియా పొందవచ్చని తెలిపారు. పట్టా కలిగిన భూ యజమానులు, అటవీ హక్కుల పట్టాదారులు, కౌలుదారులు యారియా బుకింగ్కు అర్హులని, బుకింగ్ సమయంలో రైతుల గుర్తింపును నిర్ధారించేందుకు పట్టాపాస్ పుస్తకంతో అనుసంధానమైన మొబైల్ నంబర్కు ఒకసారి మాత్రమే ఉపయోగించే ఓటీపీ నంబరు ద్వారా యూరియా బుకింగ్ అవుతుందని, ఈ బుకింగ్ 24 గంటలు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. బుకింగ్ విధానంపై సందేహాలు ఉంటే ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. -
బరిలో బంధువులు
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తున్నారు. ముగ్గురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందేని చంద్రకళ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాందేని జమున వరుసకు పిన్ని, కూతురు అవుతారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గడికొప్పుల శీలారాణి జమునకు అత్తమ్మ, చంద్రకళకు వదిన అవుతారు. ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో ఎవరికి ఓటు వేయాలనే సంకోచంలో ఓటర్లు ఉన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చే సుకుంది. ఎస్సై ఇ.సాయన్న తెలిపిన వివరాల మేరకు దొడందా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చౌమాన్ హీరా లాల్ (28)కు రెండేళ్ల క్రితం కడెం మండలంలోని అల్లంపల్లి బాబానాయక్తాండకు చెందిన రాథోడ్ సరస్వతితో వివాహమైంది. కొంతకాలంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, తల్లితో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లి ఒక్కడే ఇంటికి వచ్చాడు. సోమవా రం తల్లి సుందబాయి పింఛన్ డబ్బుల కోసం న ర్సాపూర్ వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..కాసిపేట: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ రాంపూర్కు చెందిన తోటపల్లి శంకర్ (50) కూలీపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి అరగంట తర్వాత ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని పడుకున్నాడు. 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంతపిలిచినా తలుపులు తీయకపోవడంతో గడ్డపార సాయంతో తొలగించి చూడగా దూలానికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. మద్యం మానలేక, పనిచేయలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని భార్య దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగారంతెలిపారు. కొడుకు మరణం తట్టుకోలేక తల్లి..కెరమెరి: కొడుకు మరణం జీర్ణించుకోలేక మనోవేదనతో తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మగూడకు చెందిన చౌహాన్ అరవింద్ ఆర్నెళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి చౌహాన్ సుమత్రబాయి మనోవేదనకు గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. పొలం పనులకు వెళ్లిన భర్త గోవింద్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా మంచంపై విగతజీవిగా పడిఉంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సుధాకర్ తెలిపారు. కుల బహిష్కరణకు పాల్పడ్డారని ఫిర్యాదు కాగజ్నగర్(బెజ్జూర్): బెజ్జూర్ మండలంలోని చిన్న సిద్దాపూర్కు చెందిన టాకిరే వెంకటేష్ అనే దివ్యాంగుడు తన కుటుంబంపై కుల బహిష్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సర్తాజ్పాషా తెలిపారు. కిరాణా దుకాణం నిర్వహిస్తున్న వెంకటేష్ కుటుంబ పోషణ భారంగా ఉండటంతో మద్యం కూడా విక్రయిస్తున్నాడు. మద్యం విక్రయాలు నిర్వహించరాదని ఇటీవల గ్రామంలో దండోరా వేయించారు. అయినప్పటికీ ఆదివారం మళ్లీ మద్యం విక్రయించాడన్న కారణంతో సోమవారం కుల బహిష్కరణ చేయాలంటూ దండోరా వేయించినట్లు తెలిపాడు. ఎవరైనా అతని దుకాణానికి వస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నాడు. దీనిపై బెజ్జూర్ పోలీస్ స్టేషన్తో పాటు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సమ్మెకు దూరంగా ఉండాలి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలో ఏరియా ఉన్నత అధికారులతో కలిసి సమ్మైపె సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె సింగరేణిలో జరగకుండా చూడాలని తెలిపారు. సమ్మె జరిగితే సంస్థకు రూ.77 కోట్ల నష్టం వస్తుందని, ఉద్యోగులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఇంజనీర్ టీ.రమణారావు, ఏజీఎం(ఫైనాన్స్) సుమలత, డీజీఎం(పర్సనల్) అనిల్కుమార్ పాల్గొన్నారు. కాగా, కంపెనీ జీఎం(పర్సనల్) కవితానాయుడు సమ్మైపె పర్సనల్ డిపార్టుమెంటు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీరాంపూర్ నుంచి డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్ కుమార్ పాల్గొన్నారు. కార్మికులు పాల్గొనవద్దు.. మందమర్రిరూరల్: ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొనవద్దని ఏరియా జీఎం రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో ఏరియా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమ్మెకు సంబంధించి సింగరేణి యాజమాన్యం పరిష్కరించే అంశాలు లేవని వివరించారు. సమావేశంలో ఎస్వో టు జీఎం లితేంద్రప్రసాద్, కేకే–సీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీఝా, ఏజెంట్లు రాంబాబు, ఖాధీర్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను సోమవా రం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బా లాజీ వరప్రసాద్ తెలిపారు. పట్టణంలోని శ్రీలక్ష్మి హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్షాపు ని ర్వహిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ఉదయ్కిరణ్ ఆద్వర్యంలో హోటల్లో తనిఖీ చేపట్టగా రూ.87,720 విలువైన వివిధ రకాల మ ద్యం సీసాలు లభ్యమైనట్లు తెలిపారు. యజమాని రంజిత్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మద్యం స్వాధీనం ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కొత్త కుమ్మరివాడ కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 70 (క్వార్టర్) మద్యం బాటిళ్లను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తమకు అందిన స మాచారం మేరకు ఎఫ్ఎస్టీ బృందంతో కలిసి రామిలి పోశెట్టి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా మద్యం నిల్వలు గుర్తించామన్నారు. వాటి విలువ సుమారు రూ.7,699 ఉంటుందన్నారు. ఎఫ్ఎస్టీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి, మఫ్టీ బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నగదు, మద్యం పట్టివేత చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో సోమవారం నగదు, మద్యం పట్టుకున్నట్లు సీఐ బన్సీ లాల్ తెలిపారు. మున్సిపాలిటీలోని 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గుర్రం ఉమాదేవి అనుచరుడు పడమటింటి శ్రీనివాస్ నుంచి రూ.1.50 లక్షలు, 12వ వార్డు బీజేపీ అభ్యర్థి అడుప రేణుకాదేవి అనుచరుడు రాపర్తి కిరణ్ వద్ద నుంచి 94 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు, ఏవో యామిని, పోలీసులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం అవసరం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ రామకృష్ణాపూర్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి పాలనలో ప్రగతి ఆగిపోయి అవినీతి తాండవం చేస్తోందని విమర్శించారు. తాను గెలిస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45వేల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న మంత్రి వివేక్ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించకపోగా తన కుటుంబానికి మాత్రం మూడు ఉద్యోగాలు సాధించుకున్నారని అన్నారు. ఈ ప్రాంతానికి పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేకూరిందేమీ లేకపోగా ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను ఈ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయకుండా హరీశ్రావు వంటి వారు వారి ప్రాంతంలో స్టేడియంలు నిర్మించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త గనుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ దక్కాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లె రాజు, నీలం శ్రీనివాస్గౌడ్, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాది ఇంట్లో పోలీసుల సోదాలు
చెన్నూర్: బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది పొన్నం మల్లేశం గౌడ్ ఇంట్లో సీఐ బన్సీలాల్, పోలీసులు, ఎన్నికల అధికారులు తహసీల్దార్ మల్లికార్జున్, ఏవో యామిని సోమవారం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మల్లేశంగౌడ్ ఇంట్లోనే ఉన్నారు. మద్యం, నగదు, ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి లభించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రికి తొత్తులుగా మారిన అధికారులు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు మంత్రికి తొత్తులు గా మారారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. క్యాతన్పల్లిలో మున్సిపల్ ఎన్ని కల ప్రచారం ముగించుకొని పొన్నం మల్లేశంగౌడ్ ఇంటికి టీ తాగేందుకు వచ్చానన్నారు. మంత్రి ఆదేశాల మేరకు సోదాలు చేపట్టారన్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులనే పోలీసులు టార్గెట్ చేశారని మండిపడ్డారు. -
కంటోన్మెంటు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎమ్మెల్యే శ్రీగణేష్కు ప్రమాదం తప్పింది. సోమవారం మధ్యాహ్నం కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రం మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే కాన్వాయ్పై దూసుకొచ్చింది. దీంతో ఆయన వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బస్సు డ్రైవర్ జక్కుల మల్లేష్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. 150పాయింట్ల వరకు మద్యం సేవించినట్లు తేలింది. డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోరుట్ల బస్ డిపో అధికారులకు సమాచారం అందించినట్లు సీఐ ప్రమోద్రావు తెలిపారు. -
దావత్ మస్తు..
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు ముగియనుండడంతో, ఆదివారం పెద్దఎత్తున ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి, దావతులను ఏర్పాట్లు చేశారు. చికెన్, మటన్ బిర్యానీ, మద్యం, మాంసం కూరలతో పెద్ద ఎత్తున దావతులను నిర్వహించారు. సభలు, సమావేశాలు, ర్యాలీల విజయవంతానికి ఒక్కొక్కరికి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించి, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం పెట్టారు. నామినేషన్ వేసిన నాటినుంచే డివిజన్/వార్డుల్లో వారి బలగాన్ని ఎక్కువగా చూపించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. అధికార కాంగ్రెస్తోపాటు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ఓటర్లు ఇళ్ల వద్దనే ఉండడంతో పెద్దఎత్తున ర్యాలీగా అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వారి బలగాన్ని చూపించేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా చూస్తున్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, పార్టీల కార్యకర్తలకు మాంసహారంతో కూడిన భోజనాన్ని అందించారు. గెలుపు కోసం పార్టీల కసరత్తుమున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడంతోపాటు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ స్థానాన్ని చేజిక్కుంచుకోవాలని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతలను భుజస్కాందాలపై వేసుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మాత్రం విందు, మందుకు కొదువ ఉండడం లేదు. ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొనే వారు కొందరే ఉండగా, మిగతా వారికి రోజుకు ఇంతా అని లెక్కగట్టి తీసుకువస్తున్నారు. -
మద్యం పట్టివేత
ఆదిలాబాద్టౌన్: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం రాత్రి వన్టౌన్ ఎస్సై రమ్య ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న పట్టణంలోని మోచిగల్లికి చెందిన భూపతి వెంకటేశ్, గంటికళ్ళ ముఖేశ్ను గుర్తించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.9,120 విలువ గల 8.64 లీటర్ల 48 క్వార్టర్ల మద్యం బాటిళ్లతోపాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన అలిపెల్లి గంగమ్మ రూ.3620 విలువ గల 5 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన గోపతి శ్రీనివాస్ రూ.4080 విలువ గల 5.76 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు..ఆదిలాబాద్రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బార్ యజమాని కళ్లెం శ్రీనివాస్తోపాటు మద్యం తీసుకెళ్తున్న అబ్దుల్ ఫహీం, అభ్యర్థి అనిల్పై ఆదివారం కేసు నమోదు చేసిన్నట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టణంలోని దుర్గబార్ నుంచి అబ్దుల్ ఫహీం 48 క్వార్టర్లను మద్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 9,120 విలువ గల మద్యం 8.6 లీటర్లు పట్టుకున్నట్లు తెలిపారు. -
పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణకు మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఎన్నికల ఏర్పాట్లు చేశామన్నారు. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడం, ఒకటికి మించి వేయడం జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్రాల్లో లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, మూత్తశాలలు, తదితర వసతులు కల్పించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 11న పోలింగ్, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 12న రీపోలింగ్ ఉంటుందని, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో పీవోలు, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
45 వేల ఉద్యోగాల హామీ ఏమైంది
రామకృష్ణాపూర్: గత ఎన్నికల సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మంత్రి వివేక్కు ఓట్లు కొనడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని విమర్శించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, నాయకులు మేలిపెల్లి సంపత్, బడికల సంపత్, రామిడి కుమార్, తదితరులు పాల్గొన్నారు. ‘ఫైర్స్టేషన్ భూమి కబ్జాకు యత్నం’మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని ఫైర్స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫైర్స్టేషన్ను మరోచోటుకు మార్చి రూ.50 కోట్ల విలువచేసే ఆ స్థలాన్ని తప్పుడు పేపర్లు సృష్టించి కాజేయాలని చూస్తున్నాడన్నారు. అదే జరిగితే ఫైర్స్టేషన్ వద్దనే ఆమరణ నిరహారదీక్ష చేస్తానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఎర్రం తిరుపతి, ముత్తె రాజేశం, పెట్టం లక్ష్మణ్, కర్రు శంకర్, బండారి తిరుపతి, కలువల వెంకటసాయి, కృష్ణ, కుందారపు రమేశ్, రఫీఖాన్, దండేపల్లి మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, హాజీపూర్ మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, దండేపల్లి మాజీ ఎంపీపీ అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
అందరి చూపు ‘చెన్నూర్’ పైనే..
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల్లో అందరి చూపు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంపైనే ఉంది. మున్సిపల్ ఎన్నికలను మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైర్మన్ పీఠం కై వసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఏపార్టీ జెండా ఎగురవేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండోసారి ఎన్నికలు.. చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి మున్సిపాలిటీ ముందుగానే ఉన్నప్పటికీ 1/70 చట్టం ఉండడంతో మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలు 2018–19లలో ఏర్పాటు చేశారు. 2021లో రెండు మున్సిపాలిటీలకు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గత బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో పైచేయి అధికార కాంగ్రెస్సా, ప్రతిపక్ష బీఆర్ఎస్సా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్నర్ మీటింగ్లలో పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అన్నివార్డుల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు రావడంతో మంత్రి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటరు చేతిలోనే పార్టీల భవితవ్యం.. ఈ నెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు చేతిలోనే పార్టీల భవితవ్యం దాగి ఉంది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు.మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు చెన్నూర్ 18 19,903 క్యాతన్పల్లి 22 28,239 -
బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు
● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామకృష్ణాపూర్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. క్యాతనపల్లి మున్సి పాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కాంగ్రెస్ ప్ర భుత్వం గెలిచిన ఏడాదిలోనే అనేక హామీలు నె రవేర్చిందన్నారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే జీవో ఇప్పించామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు పనాస రాజు, పొలం సత్యం, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని తల్లి చెప్పినందుకు బాలుడు పురుగుల మందు తాగాడు. అప్పులు తీర్చే మార్గం లేక వ్యక్తి, చెల్లె కుమార్తె చూడడానికి భర్త తర్వాత తీసుకెళ్తానని చెప్పినందుకు భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో బాలుడు..పురుగుల మందు తాగి వివాహిత..చింతలమానెపల్లి: పురుగుల మందు తాగి వివాహి త ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలో ని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన సుచిత్ర రాయ్(27), పరేష్ రాయ్ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. భర్త పరేష్ రాయ్.. కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 2న సుచిత్ర రాయ్ తన చెల్లె కుమార్తెను చూడటానికి తీసుకెళ్లమని భర్తను కోరింది. ఈనెల 3న గ్రామంలో క్రికెట్ పోటీల ముగింపు ఉన్నందున బుధవారం వెళ్దామని భర్త చెప్పాడు. మనస్తాపం చెందిన సుచిత్ర రాయ్ ఈనెల 3న రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు కాగజ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి రాజేందర్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగుల మందు తాగి ఒకరు.. తాంసి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాలోది గ్రామానికి చెందిన సిరికొండ చందర్(42) ఐకేపీలో వీవోఏగా పని చేస్తున్నాడు. ఆయనకు ఉన్న సొంతభూమిలో వ్యవసాయం చేస్తున్నా డు. గత రెండేళ్ల క్రితం భార్యకు అనారోగ్యం గురి కాగా, వైద్యం, ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు చేశా డు. వ్యవసాయంలో పంట దిగుబడి రాక రెండేళ్లుగా అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు తీర్చే మా ర్గం లేక మనస్తాపం చెందాడు. శుక్రవారం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పురుగుల మందు తాగా డు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుమార్తె అఖిల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లా వాసికి బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఫొటో ఫినాఎక్స్పో ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఫొటో పరివార్ ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2026 వేడుకల్లో మంచిర్యాలకు చెందిన జక్కుల రాజుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ నిర్మాత భరద్వాజ్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, ఎడిట్ పాయింట్ రమేశ్, ఫొటోగ్రఫీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్గౌడ్, కలర్స్ సతీశ్ చేతుల మీదుగా బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. -
● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ● ఇతర డివిజన్లకు వెళ్లిన వారిపైనా దృష్టి ● ముందస్తుగా రవాణా ఖర్చులు చెల్లింపు ● అవసరమైతే వాహనం పంపుతామంటున్న అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. నేటి సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఓటు ఉండి విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిని రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓటరు జాబితా ఆధారంగా దూరంగా ఉంటున్న వారిని రప్పించేందుకు ఫోన్లు చేస్తున్నారు. ముందస్తుగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐదుగురు ఓటర్లు ఒకేచోట ఉంటే వాహ నం తీసుకుని రావాలని, కిరాయి చెల్లిస్తామని చెబుతున్నారు. -
కృష్ణా రివర్క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన స్విమ్మర్లు విజయవాడలోని దుర్గా ఘాట్లో ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. 10 నుంచి 15 ఏళ్ల వయస్సు విభాగంలో చరణ్తేజ 15వ స్థానంలో నిలవగా, 31 నుంచి 40 వయస్సుల విభాగంలో కొమ్ము కృష్ణ 12వ స్థానం సాధించాడు. వీరిద్దరు తండ్రి కొడుకులు కావడం విశేషం. అదేవిధంగా 41 నుంచి 50 ఏళ్ల విభాగంలో మేడిపల్లి అశోక్ 25వ స్థానం సాధించి మెరిట్ సాధించాడు. ప్రతిష్టాత్మక రివర్ క్రాసింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, పెటా సంఘం అధ్యక్షుడు పార్థసారధి, హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి హరిచరణ్ తదితరులు అభినందించారు. -
సల్లంగసూడు తల్లీ..
ఖానాపూర్ పట్టణం శాంతినగర్ కాలనీలోని శ్రీముత్యాల పోచమ్మ ఆలయం 20వ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పండితులు పాలెం మనోహరశర్మ, అర్చకులు నిమ్మగడ్డ శరత్చంద్రశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, సామూహిక కుంకుమార్చన, రుద్ర హవనం, మహాపూజ, హారతి నిర్వహించారు. అనంతరం ముత్యాల పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పోచమ్మ వేషధారణ, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కల్వకుంట్ల నారాయణ, తిమ్మాపూర్ వీడీసీ అధ్యక్షుడు బీసీ. రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – ఖానాపూర్ బాసరకు పోటెత్తిన భక్తులుఅ‘పూర్వ’ం..ఆత్మీయం -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
● ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మంచిర్యాలటౌన్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 19, 45, 46, 47, 48, 59వ డివిజన్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఆదివారం స్థానిక వైశ్యభవన్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే, రెండేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, ఇవ్వని హామీ పనులను సైతం చేపట్టానన్నారు. కార్పొరేషన్ పరిధిలో చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రజలకు పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమన్నారు. -
‘ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి’
చెన్నూర్: ఆరుగ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 14, 7, 6, 17వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారని, వారిని గెలిపిస్తే మన భూములు అమ్ముకుంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
‘కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం’
మంచిర్యాలటౌన్/నస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. మంచిర్యాల నగరంలోని 12, 13, 41, 42, 43, 44, 58వ డివిజన్ల కార్నర్ మీటింగ్ను శనివారం సాయంత్రం రాంనగర్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే గణేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పర్చుకుని నివాసం ఉంటున్న అర్హులందరికీ దసరాలోపు ఇళ్ల పట్టాలు పట్టాలు ఇప్పిస్తానని తెలిపారు. తాను చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కొక్కిరాల చరణ్రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి యాప్ ద్వారానే యూరియా
మంచిర్యాలఅగ్రికల్చర్: యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకే నేడు ఆదివారం నుంచి యూరియా బస్తాలు అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. పంట సాగు కోసం యూరియా బస్తాలు కావాల్సిన రైతులు ముందుగానే బుకింగ్ యాప్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రైతు పేరు, ఎంపిక చేసుకున్న డీలరు, షాపు, బుకింగ్ ఐడీ, పట్టా పాస్బుక్, ఆధార్కార్డ్ జిరాక్సు కాపీలు అందించి 24 గంటల్లోపు తీసుకోవాలని తెలిపారు. డీలర్లు కూడా యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే యూరియా బస్తాలు అందించాలని, నేరుగా విక్రయాలు చేయవద్దని హెచ్చరించారు.స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రత బెల్లంపల్లి/రామకృష్ణాపూర్: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత కల్పించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశించారు. శనివారం బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులు, రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్లో కౌంటింగ్ కేంద్రం పరిశీలించారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, తహసీల్దార్ కృష్ణ, వన్టౌన్ ఎస్హెచ్ఓ కే.శ్రీనివాసరావు, మందమర్రి సీఐ రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.‘బీసీల ద్రోహిని సస్పెండ్ చేయాలి’ పాతమంచిర్యాల: బీసీల ద్రోహి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో విడుదల చేస్తే అగ్రకులానికి చెందిన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో జీవోను కొట్టి వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీంసేన్, చంద్రమౌళి, వేముల అశోక్, సతీష్, సుధాకర్, నాగేందర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ
● మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్: రాష్ట్రాన్ని దోచుకున్న సంపాదనతో కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ నడుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి విమర్శించారు. చెన్నూర్ పట్టణంలోని 6, 7, 12వ వార్డుల్లో శనివారం ఆయన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థిక విధ్వంసానికి గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి ఆర్కే–5 గనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ జెడ్పీటీసీ పోటు చిన్నరాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆహార భద్రత శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివా రం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యతో జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారి వాసురామ్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, ఆహార సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి నమూనాలు సేకరించి నాణ్యత ప్రమాణాలు పరీక్షించాలని తెలిపారు. ఫిర్యాదులకు 7981904028 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి బెల్లంపల్లి: వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం బెల్లంపల్లిలోని ఎస్సీ సమీకృత బాలికల వసతిగృహంలో ఫుడ్ ఫాయిజన్ జరిగి అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సీహెచ్.దుర్గాప్రసాద్తో కలిసి సమీకృత బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ సందర్శించారు. వార్డులు, వంటశాల పరిశీలించారు. -
కేంద్రం నుంచి నేరుగా నిధులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా మంచిర్యాలకు నిధులు తీసుకొస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం మంచిర్యాల నగరంలోని లక్ష్మీనారాయణ మందిరం, ముఖరం చౌరస్తా, అర్చనటెక్స్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ రోడ్డు గుండా ఐబీ చౌరస్తా వరకు రోడ్డుషో నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని బహిరంగ సభలో ఆయన ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మంచిర్యాల మేయర్గా బీజేపీ నుంచి గాజుల ముఖేశ్గౌడ్ను ఎంపిక చేశామని, ఈ ఎన్నికల్లో కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేయాలని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ కేంద్ర నిధులతో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రాజెక్టులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మోదీ చేపట్టిన స్మార్ట్ సిటీలో మంచిర్యాలకు చోటు కల్పించి నేరుగా నిధులు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, గాజుల ముఖేష్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాలతో అనుబంధం ఉంది.. మంచిర్యాలకు రావడం తొలిసారి కాదని, కాలేజీ రోజుల్లో తరచూ వచ్చేవాడినని, కాలేజీ స్నేహితులతో ఎంతో ఉల్లాసంగా గడిపానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేసుకున్నారు. కాలేజీలో తన స్నేహితులు మంచిర్యాలకు చెందిన వారు ఉండడంతో ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు వస్తుండేవా డినని, ఈ ప్రాంతంలో సినిమాలు చూసేవాడినని, మంచిర్యాలతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. గోలి రాము నాగ్పూర్లో లా చదువుతున్నప్పుడు క్లాస్మేట్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులను మంచిర్యాలలో కలిశారు. -
మల్బరీసాగుపై అవగాహన కల్పించాలి
ఉట్నూర్రూరల్: గిరిజన రైతులకు మల్బరీ సాగు, పట్టుపురుగు పెంపకంపై అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ పేర్కొన్నారు. ఉట్నూర్లోని ఆయన కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావల్సిన రాయితీ వివరాలు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉట్నూర్లోని పట్టు పరిశ్రమ కేంద్రాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. అవసరమైతే ఇతర జిల్లాలకు సందర్శనకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారులు నర్సయ్య, ఉద్యానవన అధికారి సందీప్ కుమార్, సీపీఎఫ్ సత్యనారాయణ, విజయ్, బెయిఫ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రూ.1.08 లక్షలు పట్టివేత
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం సిర్పూర్ (టి)కి చెందిన బొడ్డు రాజయ్య నిర్మల్ నుంచి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నా రు. రెవెన్యూ డీటీ అతిష్, కానిస్టేబుళ్లు ఆనంద్, సునీల్.. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కారును తనిఖీ చేయగా రూ.1.08 లక్షలు లభ్యమయ్యాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు రాజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి దిలీప్కుమార్ తెలిపారు. -
ఎన్నికల ఉపాధి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతి, యువకులు, రోజు వారి కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఎన్నికల్లో గెలుపే ఆయుధంగా మలుచుకునేందుకు అభ్యర్థులు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. పోటీదారునికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారానికి కావల్సిన సామగ్రిని సమకూర్చుకున్నారు. ఖర్చులకు వెనకాడడం లేదు. అప్పులు సైతం చేసి ప్రచార సాధనల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాల్టీల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నామినేషన్ల నుంచి ప్రచార గడువు ముగిసే వరకు ప్రచారం పాల్గొనే పురుషులు, మహిళలకు ఉపాధి దొరుకుతుంది. ఈనెల 4 నుంచి ప్రచారం షురుతో అన్నివర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒక్కో వార్డుకు 100 నుంచి 150 మంది పాల్గొంటున్నారు. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం కలిసి రోజుకు 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిసి 107 మంది పోటీల్లో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి నుంచి రెండు ప్రచార వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపాలిటీలో సుమారు 120 ఆటోలు, టాటాఎస్ డ్రైవర్లకు అద్దె లభిస్తోంది. మైక్ సెట్లు, లౌడ్స్పీకర్లు డోర్ పోస్టర్లు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, ప్రింటర్లకు గిరాకీ పెరిగింది. ఒక్కో అభ్యర్థి వేలాది రూపాయలతో ఫ్లెక్సీలతోపాటు స్టిక్కర్లు, హ్యాండ్ పోస్టర్లు ఆర్డర్లు ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, స్టిక్కర్లు అంటించడం, తదిత వంటి పనుల ద్వారా అన్నివర్గాల వారికి ఉపాధి లభించింది. ఉపాధి వివరాలు వేటికి సంఖ్య ఒకరోజు కూలీ రూ. ఆటో 1 2000 ప్రచారం 1 300 ఓటరు స్లిప్పులు 1 200 స్టిక్కర్ల పేస్ట్ 1 500 మైక్సెట్ 1 1000వార్డుల వారీగా ఓటరు స్లిప్పుల పంపిణీకి యువతి, యువకులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఓటరు స్లిప్పునకు రూ.2 చొప్పున వంద స్లిప్పులు పంపిణీ చేస్తే రూ.200ల ఆదాయం వస్తోంది. ఒక్కొక్కరు 200 నుంచి 300ల ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తూ రోజుకు రూ.600 ఆదాయం పొందుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు తప్ప ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటరు స్లిప్పుల పంపిణీ చేపడుతున్నారు. దీంతో యువతకు రెండు నుంచి మూడు రోజులు కూలీ లభిస్తుంది. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిపై దాడి
భీమారం: ప్రేమ పెళ్లి చేసుకున్న దళిత యువకుడి ఇంటిపై యువతి బంధువులు దాడి చేసి నిప్పంటించారు. ఇంట్లోని సామగ్రి, వస్తువులు దగ్ధం కాగా..ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఈ సంఘటన మండలంలోని దాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దళితుడు పెద్ద పోశం కుమారుడు సులేమాన్ ఇదే గ్రామంలోని మరో సామాజిక వర్గానికి చెందిన చెర్కు అంజలిని ఈ నెల 6న కరీంనగర్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అంజలి సోదరులు చెర్కు అంజి, సంపత్, తండ్రి లచ్చలు కలిసి శుక్రవారం రాత్రి సులేమాన్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని వస్తువులు, సామగ్రికి నిప్పంటించారు. సంఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్రావు, సీఐ నవీన్కుమార్, ఎస్సై రాజేందర్ పరిశీలించారు. బాధితుడు పెద్ద పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం ఉదయం అంజి, సంపత్, లచ్చలును అవిడం ఎక్స్రోడ్డు వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ వెంకటేశ్వర్రావు తెలిపారు. -
సర్పంచ్.. ఇంటి పేరైంది..!
లక్సెట్టిపేట: ఊత్కూరు పంచాయతీ పరిధి గంపలపల్లి గ్రామానికి చెందిన వొడ్డపల్లి రాజలింగయ్య (67) సర్పంచ్గా సేవలందించారు. సుదీర్ఘంగా తన రాజకీయ జీవితం అంతా సర్పంచ్గా కొనసాగగా, సర్పంచ్ రాజలింగయ్యగానే ఇంటి పేరైంది. ఊత్కూరు పంచాయతీ పరిధి హామ్లెట్ గ్రామం గంపలపల్లి నుంచి నాలుగుసార్లు సర్పంచ్గా గెలుపొందారు. 1974లో పదో తరగతి పూర్తి చేసి 1981లో తొలిసారిగా సర్పంచ్గా విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో 1988లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1996లో ఓడి, 2001, 2013లో గెలుపొందారు. 2018లో ఊత్కూరు పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం కాగా, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఊత్కూరు నుంచి మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నప్పటికి ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని రాజలింగయ్య పేర్కొన్నారు. తాను గెలుపొందాక వార్డుల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
62 కిలోల గంజాయి దహనం
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో 14 కేసుల్లో పట్టుబడిన 62 కిలోల గంజాయిని జిల్లా గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం దహనం చేశారు. 52.5 కిలోల గంజాయి మొక్కలు (220 మొక్కలు), 9.5 కిలోల ఎండు గంజాయిను నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద ఉన్న శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్లో దహనం చేశారు. ఈ ప్రక్రియను అడిషనల్ ఎస్పీ బి.సురేందర్రావు పర్యవేక్షించారు. ప్రహరీని ఢీకొట్టిన లారీనర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ అదుపుతప్పి ఇంటి ప్రహరీని ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన లారీడ్రైవర్ సోయబ్..భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్నాడు. లారీని అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ మార్గమధ్యలో అయ్యవార్ల సుదర్శన్ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. ప్రహరీ కూలి డ్రైవర్ సోయాబ్కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అందించిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. -
ఫుడ్పాయిజన్ బాధ్యులపై కఠిన చర్యలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎస్సీ సమీకృత బాలికల వసతిగృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శనివా రం పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్తో కలిసి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వంట గది, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్ కుమార్ దీపక్కు ఫోన్లో మాట్లాడారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థినులను ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ రవిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ మనోజ్తో ఫోన్లో మాట్లాడారు. కాగా, ఏబీవీపీ ఇతర విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు విద్యార్థినులను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ఒకే ఇంట్లో ముగ్గురు కౌన్సిలర్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఓ మామ..ఓ కొడుకు..ఓ కోడలు ఇలా ‘గరిగంటి’కుటుంబానికి చెందిన ముగ్గురు మంచిర్యాల పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా గెలుస్తూ వస్తున్నారు. గత 35 ఏళ్లుగా విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఓటర్లు వరుసగా ఒకే కుటుంబంలో ముగ్గురిని గెలిపించి ఆ కుటుంబానికి అధికారం కట్టబెడుతున్నారు. గరిగంటి కనకయ్య 1987లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 13వ వార్డు(మొన్నటి వరకు 24 వార్డు) కౌన్సిలర్గా విజయం సాధించారు. ఐదేళ్లపాటు కౌన్సిలర్గా పని చేశారు. ఆయన సోదరుడి కుమారుడు గరిగంటి సాయిలు కూడా 1982–87 వరకు కౌన్సిలర్గా పని చేశారు. మూడుసార్లు సరోజ.. సరోజ 1995లో పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా విజయం సాధించింది. మామ కనకయ్య రాజకీయ వారసురాలిగా గెలిచింది. పాలనలో సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకుని వరుసగా నాలుగు సార్లు కౌన్సిలర్గా ఎన్నికై ంది. 2000లో సరోజ పోటీ చేసే వార్డు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఎన్నికలకు దూరమైంది. మళ్లీ 1995, 2005, 2014లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్గా వ్యవహరించింది. తాజాగా కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో 46వ డివిజన్ కార్పొరేటర్గా పోటీలో నిలబడింది. ఒకేసారి కొమురయ్య.. కనకయ్య తనయుడు గరిగంటి కొ మురయ్య రాజకీయప్రవేశం చేశాడు. సరోజ భర్త కొమురయ్య 2005లో జరిగిన పుర ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. 2005లోనే పక్కపక్క వార్డుల రిజర్వేషన్లు కలిసి రావడంతో భార్యాభర్తలు ఇద్దరూ పోటీ చేసి కౌన్సిలర్లుగా ఎన్నికై కౌన్సిల్లో అడుగు పెట్టారు. ఆ తర్వాత రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో కొమురయ్య ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. -
ముఖేశ్గౌడ్ ప్రచారరథంపై దాడి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికలు జిల్లా కేంద్రంలో తారాస్థాయికి చేరుతున్నాయి. నగరంలో పలు డివిజన్లలోని రాజకీయాలు వ్యక్తిగత గొడవల వరకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. 57 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నగర మేయర్ అభ్యర్థి గాజుల ముఖేశ్గౌడ్ ప్రచార రథంపై దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లే కొందరిని ఉసిగొల్పి తమపై ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్ గౌడ్ డీసీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ 58 మంది అభ్యర్థులు తమ పార్టీ నుంచి బరిలో ఉన్నారని వారికి ప్రచారంలో ఆటంకం కల్గించేవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
ధ్వని పెరిగితే దండనే..
మంచిర్యాలటౌన్: ఎన్నికలు వచ్చాయంటే వాడవాడల్లో మైక్ల మోత మార్మోగడం సాధారణమే. అభ్యర్థులు ప్రచారం కోసం లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుంటారు. వేదికలపై కాకుండా వాహనాలకు బిగించి వీధులు, ప్రధాన రహదారుల్లో ప్రచారం చేస్తుంటారు. దాదాపు మైకుల్లో ప్రచారం చేయడంతో పెద్దఎత్తున శబ్ధకాలుష్యం పెరిగిపోనుంది. ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్ల ప్రచారంతో విద్యార్థులు, చిన్నపిల్ల లు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మైకుల నిషేధం సాధ్యం కాకపోవడంతో ప్రమాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పట్టణాన్ని ఏ, బీ, సీ, డీ కేటగిరీగా విభజించింది. నిశ్శబ్ద మండలం, నివాసిత, వాణిజ్య, పారి శ్రామిక ప్రాంతాలుగా విభజించి అక్కడ విని యోగించే సౌండ్ ఎన్ని డెసిబుల్స్లో ఉండాలనేది నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం వాడవాడల్లో హోరెత్తించనున్న పోటీలో పాల్గొనే అభ్యర్థులు సౌండ్ విషయంలో మాత్రం ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆయా ప్రాంతాల్లో వినియోగించే సౌండ్ (డెసిబుల్స్లలో) ఏరియా పగలు రాత్రి నిశ్శబ్ద మండలం 50 40 నివాసిత ప్రాంతం 55 45 వాణిజ్య ప్రాంతం 65 55 పారిశ్రామిక ప్రాంతం 75 70 -
పరిమితికి మించి..!
నిర్మల్ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరి మితిని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ అభ్యర్థికి గరిష్టంగా రూ.5లక్షలు, కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థికి రూ.10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు ఈ పరిమితులను దాటుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధన ప్రవాహం మితిమీరకుండా ఎన్నికల అధికారులు కట్టడి చేయాలని పట్టణపౌరులు కోరుతున్నారు. అంతటా అంతే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కా ర్పొరేషన్తో పాటు నిర్మ ల్, భైంసా, ఖానాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, చెన్నూరు, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్పల్లి మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు కార్పొరేటర్/కౌన్సిలర్ పదవి కోసం కనీసం రూ.15లక్షల నుంచి గరిష్టంగా రూ.40లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉదయం, సాయంత్రం వేళ గడపగడపకూ ప్రచారం, జనసమీకరణ, రోడ్ షోలు, విందులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార వ్యయం భారీగా పెరిగిపోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాటల ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి అద్దెకు రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు అవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఖర్చులన్నీ కలిపితే ఎన్నికల వ్యయం నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్తోపాటు మరో పది మున్సిపాలిటీల్లోని 328 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరంతా విజయం కోసం తమశక్తిమేర అర్థబలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు కూడా.. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక సామర్థ్యాన్నే ప్రధాన ప్రమాణంగా తీసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. టికెట్లు కేటాయించే దశలోనే అభ్యర్థి ఎంతవరకు ఖర్చు చేయగలడన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో చా లామంది ఖర్చుకు వెనకాడని స్థితిలో ఉన్నవారేనన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతూ, అనుచర వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు ఎంత ఖర్చు చేస్తే అంత ప్రచార ఆర్భాటం కనిపిస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల వ్యయపరిమితిపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన గరిష్ట వ్యయపరిమితిమున్సిపాలిటీలు, వార్డులు, అభ్యర్థుల వివరాలు మున్సిపాలిటీ గ్రేడ్లు డివిజన్లు/వార్డులు అభ్యర్థులు మంచిర్యాల స్పెషల్గ్రేడ్ 60 122 ఆదిలాబాద్ 1 49 314 నిర్మల్ 1 42 182 భైంసా 1 26 115 బెల్లంపల్లి 1 34 77 కాగజ్నగర్ 2 30 130 ఖానాపూర్ 3 12 56 ఆసిఫాబాద్ 3 20 94 క్యాతన్పల్లి 3 22 80 చెన్నూరు 3 18 47 లక్సెట్టిపేట 3 15 97 మొత్తం – 328 1,314 కార్పొరేటర్ అభ్యర్థి రూ.10లక్షలు గ్రేడ్–1 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రూ.5 లక్షలు గ్రేడ్–2 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రూ.4లక్షలు గ్రేడ్–3 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రూ.3లక్షలు -
విధులకు ఆటంకం కలిగించొద్దు
ఖానాపూర్: అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని ఖానాపూర్ ఇన్చార్జి ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు హెచ్చరించా రు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. అటవీశాఖ అధికారులు ఎడ్లను నిర్బంధించారనే ఆరోపణలు అవా స్తవమని పేర్కొన్నారు. ఇటీవల తర్లపాడ్ గ్రా మానికి చెందిన బోసు భూమన్న అటవీశాఖ అ ధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, పొ ర్లు దండాలతో నిరసన తెలిపి అధికారులు, ప్ర జలను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. పోడు సాగు చేస్తుండడంతో పూచీకత్తుతో వచ్చి ఎడ్లను తీసుకెళ్లాలని కోరినా రాలేదని పేర్కొన్నారు. ఖానాపూర్ రేంజ్ పరిధిలోని సౌత్ బీట్లోని 877 కంపార్ట్మెంట్లో భూమన్నకు ఎక రం 10 గుంటల లావుని పట్టా భూమి మాత్ర మే ఉందని తెలిపారు. లావణి పట్టా భూమి ప క్కనే గల అటవీ భూమిలోకి అక్రమంగా చొ చ్చుకు వచ్చి ఇష్టారీతిన అటవీ భూమిలో పోడు సాగు చేస్తున్నాడని ఆరోపించారు. భూమన్న ఆరోపించినట్లు 40 ఏళ్ల నుంచి సాగులో లేడని తెలిపారు. 2014 నుంచి అటవీ భూమిలో పో డు వ్యవసాయం పేరుతో అటవీశాఖకు చెందిన భూమిని ఇష్టారీతిన ఆక్రమించుకుంటున్నాడని పేర్కొన్నారు. అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో పాటు ఆక్రమణలు, ఆందోళనలు చేయడంతో ఇప్పటికే భూమన్న పేరిట అటవీశాఖలో మూడు కే సులతో పాటు పోలీసు శాఖలో రెండు కేసులు, ఒక బైండోవర్ నమోదై ఉందని వివరించారు. ఇష్టారితిన అటవీ భూమిని ఆక్రమించుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్లో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ఎస్వో రవీందర్, ఎఫ్బీవో నరేందర్ తదితరులున్నారు. -
తుర్కం చెరువును సందర్శించిన ట్రైనీ ఎఫ్ఎస్వోలు
మామడ: తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీకి చెందిన 44 మంది ట్రైయినీ ఎఫ్ఎస్వోలు మండలంలోని నల్దుర్తి గ్రామ సమీపంలోని పర్యాటక ప్రాంతం తుర్కంచెరువును శుక్రవారం సందర్శించారు. ఇక్కడ గల వివిధ రకాల వృక్షజాతులు, జంతుజాతులు, పక్షిజాతుల గురించి స్థానిక అటవీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రకృతిలోని వివిధ జీవజాతులు, పర్యావరణ వ్యవస్థలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ రేఖాభాను, అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, ఎఫ్బీవోలు రాజు, లక్ష్మీనర్సయ్య, సరిత పాల్గొన్నారు. -
కొత్త గనులు ఎందుకు తేలేదో చెప్పాలి
రామకృష్ణాపూర్: గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిలో కొనసాగిన హరీశ్రావు సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఎందుకు తీసుకురాలేదో సమాధానం చెప్పాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రశ్నించారు. క్యాతనపల్లి ము న్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులు తీసుకురాకపోగా ఈ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్టీ నిధులను హరీశ్రావు సిద్దిపేటకు మళ్లించారని మండిపడ్డారు. బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి పాల్గొనకుండా గత సర్కార్ అడ్డుకుందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను మోసగించిన బీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గత ఎమ్మెల్యే బాల్క సుమన్ కేసీఆర్, కేటీఆర్లను కొలుస్తూ కాలం గడిపాడని విమర్శించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, అబ్దుల్అజీజ్, వొడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య పాల్గొన్నారు. -
పులి కదలికలపై నిఘా
తాంసి: భీంపూర్ మండల సరిహద్దు పెన్గంగ నది పరీవాహక గ్రామాలైన తాంసి(కే), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో పెద్దపులి సంచరి స్తున్న విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ అ ధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ ఆదేశాల మేరకు అటవీశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పులి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి రెండురోజుల క్రితం గొల్లఘాట్ శివారులో ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. ఈ ఘటనతో పులి సంచరిస్తున్న విషయం బయటకు వచ్చింది. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది పులి కదలిలకపై నిఘా పెట్టారు. రెండు రోజులుగా ఆయా గ్రామాల శివారులో అటవీశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పులి ఆనవాళ్లను పరిశీ లిస్తున్నారు. పులి ఎటు వైపు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు సెక్షన్ అధికారులతో కూడిన రెండు బృందాలు రాత్రి, పగలు పులి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పులి సంచరించినట్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాప్ కెమెరాలు కూడా ఏ ర్పాటు చేసి పులి కదలికలను సెక్షన్ అధికారి అహ్మద్ఖాన్, బీట్ అధికారి సాయికుమార్, ఎనిమల్ ట్రా కర్స్తో కలిసి పరిశీలిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి ఇక్కడే మకాం వేసింది. తిరిగి తిప్పేశ్వర్ అభయారణ్యం వెళ్లాలంటే పెన్గంగ నది దాటాలి. కానీ, ప్రస్తుతం కొరాటా–చనాఖా బ్యారేజీ కోసం నీటిని నిలిపివేయడంతో పెన్గంగ నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో పులి ఇటు వైపే ఉంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
గుప్త నిధుల మోసాల గుట్టురట్టు
ఆదిలాబాద్టౌన్: గుప్త నిధుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ బాబాతో పాటు అతడి గ్యాంగ్కు సంబంధించిన ఎనిమిది మంది సభ్యులను అరెస్ట్ చేశా రు. 26మంది బాధితుల నుంచి వీరు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం పిప్పల్కోటికి చెందిన దర్శనాల రాజ్కుమార్ మూడేళ్ల క్రితం తనకు దేవర వస్తుందని ప్రజలను నమ్మించాడు. దీంతో ప్రజలు అతడి వద్దకు వచ్చి కష్టసుఖాలు చెప్పుకొనేవారు. తన వద్ద మంత్రశక్తి ఉందని కష్టాలను దూరం చేస్తానని నమ్మించాడు. దీంతో చాలామంది పరిచయమయ్యారు. మంత్రశక్తితో బంగారం తవ్విస్తానని నమ్మబలికాడు. బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకున్నా డు. నిందితుడి భావ మహేందర్ స్నేహితులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్తో కలిసి గుప్తనిధుల తవ్వకాలకు పథకం పన్నాడు. గుప్తనిధులు ఉన్నాయంటూ చెప్పిన వారి ఇంటికి వెళ్లి గుంత తవ్వి అందులోనుంచి ముందుగా తమతో తీసుకువచ్చిన మట్టికుండలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నకిలీ నాణేలను వేసి ఎర్రని బట్టతో కట్టేవాడు. 41 రోజు ల పాటు దాన్ని ముట్టకుండా పూజలు చేయాలని నమ్మించేవాడు. తాను వచ్చి తీస్తానని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. ముందే బిందెను తీస్తే చనిపోతారని భయభ్రాంతులకు గురిచేసేవా డు. తన మిత్రులతో కలిసి 26మంది బాధితుల నుంచి ఇలా రూ.కోటి 3లక్షల 80వేలు కాజేశాడు. వీరిపై భీంపూర్ పోలీస్స్టేషన్లో ఆరు కేసులు, మావల పోలీస్ స్టేషన్లో ఒకటి, బోథ్లో రెండు, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, జైనథ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. నిందితుల నుంచి కారు, బైక్, ఏడు సెల్ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్, ఎస్సై విక్రమ్ తదితరులున్నారు. -
కళ్లలో కారం చల్లి పుస్తెలతాడు చోరీ
జన్నారం: ఇంట్లో ని ద్రిస్తున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని తపాలపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. ఎస్సై అనూష, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తపాలపూర్ గ్రామానికి చెందిన రామటెంకి లావణ్య, తన భర్త రాజన్న, కూతురు ఆరాధ్యతో కలిసి గురువారం తన ఇంటిలో నిద్రించింది. శుక్రవా రం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి రేకులు చప్పుడు చేశాడు. పక్షవాతంతో బాధ పడుతున్న రాజన్న లేవలేని స్థితిలో ఉండగా లావణ్య వెళ్లి తలుపు తెరిచి చూసింది. ముఖానికి మాస్కు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి లావణ్య కంట్లో కారం చల్లి ఆమెను కొట్టాడు. మెడలోని రెండు తు లాల బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కుభీర్: మండలంలోని రాంనాయక్ తండాకు చెందిన రాథోడ్ వనిత(35) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనిత శుక్రవారం ఉదయం వంటపాత్రలను శుభ్రం చేయడానికి రేకులపై ఉన్న బోళ్ల సబ్బు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. గాయపడ్డ ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆమె భర్త సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో ఆవు, దూడ మృతిఖానాపూర్: పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రైతు దాతుర్క శ్యామ్కు చెందిన ఆవుతో పాటు దూడ శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాయి. అంబేడ్కర్నగర్ శివారులోని పంట పొలాల్లో ఎప్పటిలాగే మేతకు వెళ్లి న ఆవు, దూడ అక్కడే ఉన్న రెంకోని వాగులోకి నీరు తాగేందుకు వెళ్లాయి. వాగులో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్ ద్వారా విద్యుత్ షా క్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ. 50వేలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. అధికారులు తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. షార్ట్ సర్క్యూట్తో నిత్యావసరాలు దగ్ధంమామడ: మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన సుంచు సుశీల ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. శు క్రవారం సుశీల కూలీ పనులకు వెళ్లగా కుమారుడు వేరే ఊరికి వెళ్లాడు. వారు వెళ్లిపోయాక ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సర్పంచ్ సునీత, రెవెన్యూ అధికారులు సందర్శించారు. వివరాలు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిజైపూర్: మండలంలోని కుందారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథనికి చెందిన పాపిట్ల రజిని (56) మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథనిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలో నివాసముండే పాపిట్ల విజయభాస్కర్–రజిని దంపతులు బైక్పై శుక్రవారం సాయంత్రం మంథని నుంచి సుందిళ్ల బ్యారేజీ మీదుగా మంచిర్యాలకు బంధువుల ఇంటికి వస్తున్నారు. కుందారం సమీపంలో కల్వర్టు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడడంతో వెనుక కూర్చున్న రజిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. విజయభాస్కర్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రజిని మృతదేహాన్ని మంచిర్యాల ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల సామగ్రి పంపిణీ, లెక్కింపు కేంద్రం పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ శుక్రవారం పరిశీలించారు. ముల్కల్ల శివారులోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయగా చేపట్టాల్సిన బందోబస్తు తదితర వాటిని పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
రక్తదాతలూ స్పందించండి..
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రధాన ఆస్పత్రిలో ఉన్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో గత నెల రోజులుగా రక్తనిల్వలు తగ్గిపోయాయి. దీంతో ప్రతీ పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి చేయించుకునే తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి చేయకుంటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలోని రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో 683మంది సికిల్సెల్, 235మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు రిజిష్టరై ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ ద్వారా పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారికి సరిపడా గ్రూపు రక్తం అందుబాటులో లేకపోతే దొరికే వరకు ఆగాల్సిందే. వ్యాధిగ్రస్తులను ఆపదలో ఆదుకుంటున్న రక్తనిధి కేంద్రంలో నెల రోజులుగా రక్త నిల్వల కొరత వేధిస్తోంది. రక్తదానానికి దాతలు ముందుకు రాకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఇటీవల సమ్మక్క–సారక్క జాతర ఒక కారణమైతే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించక సేకరణ జరగడం లేదని రక్తనిధి కేంద్రం ఇన్చార్జి మధుసూదన్రెడ్డి తెలిపారు. రక్తనిధి కేంద్రం నుంచే జీజీహెచ్, మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుంటారు. రక్తం అవసరమైన వారు దాతను తీసుకొచ్చి రక్తం ఇచ్చిన తర్వాత బదులుగా తీసుకెళ్తే కొరత కొంతవరకు తీరే అవకాశం ఉంది. కానీ చాలామంది దాతలు లేకుండానే రక్తం అవసరమని ఆస్పత్రుల రికార్డులతో వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రతియేటా అక్టోబర్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాల్లో పోలీసులు రక్తదానం చేస్తుంటారు. అప్పుడు వందల యూనిట్ల రక్తం సేకరించి కరీంనగర్, పెద్దపల్లి, కుమురంభీం, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చే తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వాలంటరీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేస్తేగానీ కొరత తీరేలా లేదు. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. శుక్రవారం హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు 20మంది ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేశారు. -
‘అప్పు’డే భరించలేం..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రచార వ్యయం తడిసి మోపెడవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు పైసా లేనిదే ప్రచారం ముందుకు సాగని పరిస్థితి నెలకొడంతో రోజుకు కనీసం రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కాలనీల్లో తిరిగే ప్రచార రథాల వాహనాలకు రూ.వేల కొద్దీ చెల్లించాల్సి వస్తోంది. అనుచరగణం, కార్యకర్తలు, నాయకులు ఉదయం అల్పాహారం, టీలు, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం, మద్యం వీటితోపాటు ప్రచారానికి వచ్చే కూలీలకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. జెండాలు, కండువాలు ఇంకా అనేక ఖర్చులు ఉంటున్నాయి. ఎవరైనా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల సభలు, సమావేశాలు, ర్యాలీలకు వస్తే ఈ ఖర్చు మరింత పెరిగిపోతోంది. ప్రచార రథాలు, సోషల్మీడియా కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ప్రచారం కోసం ఒక్కో డివిజన్లో ఒకటి, రెండు వరకు రథాలు తిరుగుతున్నాయి. డప్పులు, మైక్లు, కళాకారులకు చెల్లించాల్సి వస్తోంది. ప్రచార పోస్టర్లు, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. బైక్, వాహనాల ర్యాలీకి ఖర్చు చేయాల్సి వస్తోంది. వార్డులు, డివిజన్, జిల్లా ఎన్నికల ఇన్చార్జీలకు సైతం స్థానిక నాయకులే వసతి, భోజన ఖర్చులు భరించాల్సి వస్తోంది. దీంతో పోలింగ్ నాటికి ఈ ఖర్చులు భరించలేక చాలామంది అభ్యర్థులు చేతులేత్తేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్వతంత్రులు, ప్రధాన పార్టీల్లో కొందరు అభ్యర్థులు ఖర్చులు తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. బయటకు చెప్పుకోలేక తంటాలు పడుతూ ఉన్న డబ్బునే పొదుపుగా వాడుకుంటున్నారు.ఆస్తులు తాకట్టు పెట్టి ఆర్భాటాలుచాలామంది అభ్యర్థులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేతిలో నగదు లేకుండా పోయింది. చర, స్థిర ఆస్తులు ఉన్నప్పటికీ ప్రస్తుతం చేతిలో డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయి. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇతర ఆధారిత రంగాలు ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. మార్కెట్లో డబ్బు ప్రవాహం తగ్గింది. చాలామంది చేతిలో నగదు లేకుండా పోయింది. దీంతో రోజు వారీగా వ్యాపారస్తులు, పలు రంగాల్లో ఉన్నవారి నుంచి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది తమ ఇంట్లో బంగారం కుదువ పెట్టి, ఖర్చులు చేసుకుంటున్నారు. ఇంకా వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. పార్టీ ఫండ్పై ఆశలు పెట్టుకున్నవారికి ఇప్పటి వరకు ఎవరికీ పైసా అందకపోవడంతో అందరూ కష్టంగానే భరిస్తూ వస్తున్నారు. ఇక అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారికి మరింత ఖర్చులు ఉన్నాయి. మొదట స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఎంతో కొంత ఆశించారు. టికెట్ కోసమే పోటీ ఏర్పడడంతో ఆర్థికంగా బలంగా ఉన్న వారినే ఎంపిక చేశారు. ఖర్చు భరిస్తామని ముందే హామీ ఇస్తేనే టికెట్ ఇచ్చారు. దీంతో పార్టీ నుంచి ఎలాంటి పైసలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక పోలింగ్ నాటికి ఈ ఖర్చులకు తట్టుకుని చివరి వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేసుకోవాల్సి వస్తోందోనని వాపోతున్నారు. ఇక మేయర్, చైర్మన్ పదవులు ఆశిస్తున్నవారంతా మరింత ఎక్కువగా ఖర్చు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా పోలింగ్ ముందు రెండు రోజులు ప్రలోభాల కోసం మద్యం, నగదు, బహుమతులకు అధికంగా ఖర్చవుతుంది. -
గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ: గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ ఎకై ్సజ్ సీఐ జుల్ఫీకర్ అహ్మద్ తెలి పారు. శుక్రవారం ఇచ్చోడ సీఐ కార్యాలయంలో వి వరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మే రకు గురువారం సాయంత్రం బోథ్ మండలంలోని దన్నూర్ నాగ్పూర్ రోడ్డు మార్గంలో సిబ్బందితో క లిసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తని ఖీల్లో రాథోడ్ సచిన్ అనే వ్యకి బైక్పై సుమారు ఐదు లీటర్ల గుడుంబా తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీకి నల్లబెల్లం బోథ్ మండల కేంద్రంలోని శబరి కిరాణాషాపులో కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో సదరు కిరాణాషాపులో తనిఖీ చేయగా 30కిలోల నల్లబెల్లం లభించినట్లు తెలిపారు. గుడుంబా సరఫరా చేస్తున్న రాథోడ్ సచిన్తోపాటు కిరాణాషాపు యజమాని సిలారి నరసింహపై కేసు నమోదు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ట్రైనీ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది కార్తిక, మహ్మద్, దేవేందర్ పాల్గొనట్లు తెలిపారు. -
● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహిణులు, వ్యాపారుల దాక ● రాజకీయాలు తెలియకున్నా ప్రజాక్షేత్రంలోకి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళలు రాజకీయాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. వంటింటికే పరిమితం కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. మహిళలకు రిజర్వు చేసిన వార్డులతోపాటు జనరల్ వార్డుల్లోనూ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో మొత్తంగా పురుష అభ్యర్థులకు దీటుగా ఎన్నికల బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రతీ మున్సిపాల్టీల్లో సగం స్థానాలు మహిళలకు రిజర్వు చేయగా.. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ స్థానాల్లోనూ పోటీకి నిలిచారు. దీంతో అతివల సంఖ్య పెరిగింది. కుటుంబంలో రాజకీయాల్లో ఉన్న భర్తల ప్రోత్సాహంతో కొందరు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల తల్లులు, కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులను బరిలో నిలిపారు. కుటుంబ సభ్యులు వారి వెంట ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో క్యాతనపల్లి జనరల్ మహిళ, చెన్నూరు బీసీ మహిళా, బెల్లంపల్లి జనరల్ మహిళకు చైర్పర్సన్ స్థానాలు ఖరారయ్యాయి. జిల్లాలో కార్పొరేషన్తో సహా నాలుగు మున్సిపాలిటిల్లో మొత్తం 149వార్డుల్లో సీ్త్ర, పురుషులు కలిపి 693మంది పోటీ చేస్తున్నారు. వీరిలో మంది 324మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీలు, ఎల్ఎల్బీ, ఎంబీఏ వంటి ఉన్నత చదవుల వారున్నారు. కొందరు కనీసం రాయడం, చదవడం వరకు తెలిసిన వారు ఉన్నారు. రాజకీయాలు అంటే తెలియని గృహిణులు, వ్యాపారస్తులు ఉన్నారు. వయస్సు పరంగా చూస్తే కనీసం 21ఏళ్లు, గరిష్టంగా 60ఏళ్లు ఉన్న వారు బరిలో తలపడుతున్నారు. మరోవైపు అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో గెలుపోటములపైనా మహిళలే ప్రభావం చూపనున్నారు. బెల్లంపల్లిలో.. బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీల్లో 34వార్డులు ఉండగా.. వీటిలో ఎస్సీ మహిళకు 5, బీసీ మహిళకు 3, జనరల్ మహిళకు 9వార్డులు రిజర్వు చేశారు. వీటితోపాటు ఎనిమిది జనరల్ వార్డుల్లోనూ మహిళలు తలపడుతున్నారు. చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. కై వసం చేసుకోవడానికి భర్త, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మహిళలు ఎన్నికల్లో అమీ తుమీకి సిద్ధమయ్యారు. రాజకీయ వారసత్వంగా కొందరు మగువలు బరిలో ఉన్నారు.విద్యావంతుల లెక్క ఇలా.. బెల్లంపల్లిలో విద్యావంతులైన మహిళలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 98 మంది మహిళలు పోటీలో ఉండగా వీరిలో 8 మంది ఐదో తరగతి వరకు, 52 మంది పదో తరగతి పూర్తి చేశారు. 25 మంది ఇంటర్మీడియెట్, 8 మంది డిగ్రీ, ఒకరు బీకాం బీఎడ్, ఒకరు ఎల్ఎల్బీ పూర్తి చేయగా, మరొకరు ఎంఏ బీఎడ్ చదివారు. మరో ఇద్దరు మహిళలు చదవడం, రాయడం వరకు నేర్చుకున్నారు. వయస్సుల వారీగా.. బెల్లంపల్లిలో పుర ఎన్నికల్లో నవతరం పోటీ పడుతోంది. అతి పిన్న వయస్సు నుంచి వయోవృద్ధులు బరిలో ఉన్నారు. కనిష్టంగా 25 ఏళ్ల నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు పోటీ చేస్తున్నారు. 25–30 ఏళ్ల మధ్య 23 మంది, 31–40 ఏళ్ల వయస్సున్న మహిళలు 48 మంది, 41–50 ఏళ్ల మధ్య 19 మంది, 51–60 ఏళ్లు ఉన్నవారు 6, 60–65 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఇద్దరు ఉన్నారు.కార్పొరేషన్లో అతివలు ముందంజజిల్లా కేంద్రంలో అత్యధికంగా మహిళలు కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 60డివిజన్లలో 59ఏళ్ల వయస్సులో మహిళ అభ్యర్థి ఉండగా, కనిష్టంగా 21ఏళ్ల యువతి అభ్యర్థిగా ఉన్నారు. పోటీలో ఉన్నవారిలో 98మంది గృహిణులు, ఐదుగురు వ్యాపార రంగం, మరో ఐదుగురు ఒకరు ప్రైవేటు ఉద్యోగిగా ఉన్నారు. 15మంది నిరాక్ష్యరాసులు, మిగతా వారంతా డిగ్రీలోపు, డిగ్రీపై చదివిన వారున్నారు. జిల్లా కేంద్రంలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఇంకా చదువుకునే విద్యార్థులు ఉండడం గమనార్హం.మున్సిపల్/నగరం డివిజన్లు అభ్యర్థులు మహిళలు మంచిర్యాల 60 240 126బెల్లంపల్లి 34 173 98క్యాతనపల్లి 22 113 25చెన్నూరు 18 107 50లక్షెట్టిపేట 15 60 24మొత్తం 149 693 324 -
స్కాములతో సింగరేణి ప్రైవేటు పరమే..!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం స్కాముల కేంద్రంగా మార్చి రాబోయే కొన్నేళ్లలో ప్రైవేటు పరం చేసే దిశగా నడిపిస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్చౌక్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను కుంభకోణాలకు నిలయంగా మార్చిందని ఆరోపించారు. సింగరేణి ఓబీ కాంట్రాక్ట్ టెండర్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, టెండర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. తమ హయాంలో నెలనెలా మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెడికల్ బోర్డులే లేకుండా పోయాయని విమర్శించారు. సింగరేణిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. సింగరేణి పరిరక్షణకు ఏఐటీయూసీ వంటి కార్మిక సంఘాలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డిపెండెంట్ ఉద్యోగాల ఘనత కేసీఆర్దే.. నస్పూర్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం ఆయన నస్పూర్లోని షిర్కే సెంటర్ వద్ద రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అక్రమ కాంట్రాక్టుల ద్వారా సీఎం రేవంత్రెడ్డి తన బావమరిది సృజన్రెడ్డికి వేల కోట్ల రూపాయల సింగరేణి సొమ్మును దోచి పెడుతున్నాడని విమర్శించారు. మంచిర్యాలలో పోలీసులు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వచ్చేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ మంచిర్యాలలో కూల్చివేతల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, ఏఐటీయూసీ నేత సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, మూల రాజిరెడ్డి, డాక్టర్ రాజరమేష్, రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు, టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కే.సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి బూతుపిత బెల్లంపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి నుంచి మంచి మాటలు రావని, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్న ఆయనను బూతుపిత అని పిలవాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లిలోని బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి రూ.51 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, చెల్లించలేక ఏ అదానికో, అంబానికో వచ్చే రెండేళ్లలో అప్పగిస్తాడని విమర్శించారు. రోడ్డు నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల ఖాతా నుంచి డబ్బులు కాజేసే రేవంత్రెడ్డి సైబర్ నేరగాడ ని తీవ్ర విమర్శలు చేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
దహెగాం: గుడి నిర్మాణం కోసం చందాలు వసూలు చేయడానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం. కన్నెపల్లి మండలం చింతపుడి లింగాల గ్రామానికి చెందిన ఎల్కరి అంకన్న (49), అగాడి మల్లయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై గురువారం దహెగాం మండలానికి వచ్చాడు. లింగాల గ్రామంలో శివాలయం నిర్మాణానికి తెలిసిన వారి వద్ద చందాలు తీసుకుని రాత్రివేళ ఇంటికి బయలుదేరాడు. మండలంలోని చంద్రపల్లి గ్రామంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభానికి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అగాడి మల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మల్లయ్యను అంబులెన్స్లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలి పారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నా రు. కాగా, చంద్రపల్లిలో విద్యుత్ స్తంభం రోడ్డుకు ఆనుకుని ఉండడంతోనే ప్రమాదం జరిగినందున దానిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పలుసార్లు కోరినా విద్యుత్ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. అయితే, అంకన్న హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు చెబుతున్నారు. -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం, యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు, సంకీర్తనలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రెండురో జులు ఉత్సవాలు కొనసాగనున్నట్లు వేదపండితుడు కళ్యాణ్ తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ చంటి, నాయకులు వసంత్రెడ్డి, సంజీవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పద్మాకర్రెడ్డి, అశోక్, అ భిరామ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కే.గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలసి ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఒక బృందానికి ఒక పీవో, ఎంపీవో, ముగ్గురు ఓపీవోల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68 బృందాలు, చెన్నూరుకు 36 బృందాలు, క్యాతనపల్లికి 45 బృందాలు, లక్సెట్టిపేటకు 30 బృందాలు, మంచిర్యాల నగరపాలక సంస్థకు 265 బృందాలు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించామని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీ కార్యాలయల్లోని ఏర్పాటు చేశామని, 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
‘నీల్వాయి’ నీరందేనా?
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్ట్ ఎడమ కాలువకు అనుబంధంగా నిర్మించిన 5ఆర్ కాలువ నిరుపయోగమైంది. 2005లో అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నీల్వాయి ప్రాజెక్ట్ నిర్మించారు. అప్పట్లో రూ.68 కోట్లతో ప్రారంభమై ఇప్పటివరకు రూ.224కోట్ల వరకు ఖర్చయినా పిల్ల కా లువకు సరిగా నీరందటంలేదు. కొన్ని చోట్ల అటవీ శాఖ అడ్డంకితో పనులు నిలిచాయి. ఇతర పెండింగ్ పనులు మిగిలిపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని సుమారు రూ.3కోట్ల వరకు నిధులు కేటాయించింది. ఇందులో భాగమైన 5 ఆర్ కా లువ పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఎడమ కాలువ పూర్తి చేశారు. 5ఆర్ కాలువ నిర్మాణంపై అ ధికారులు పూర్తిగా దృష్టి సారించటం లేదు. ఆరు నె లల క్రితం వరకు తూతూ మంత్రంగా పనులు చేప ట్టి వదిలి పెట్టారు. రూ.కోట్లు వెచ్చించి భూసేకరణ, కాలువ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. కానీ, రైతు ల పంట పొలాకు సాగునీరందే పరిస్థితి లేదు. 5ఆర్ కాలువకు కేవలం రాజారం–మంగనపల్లి క్రాస్ రో డ్డు వరకే సాగునీరు అందుతోంది. మిగతా మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ నిరుయోగంగానే ఉంది. దశాబ్దాలు గడిచినా ఇదే పరిస్థితి ఉంది. 5ఆర్ కాలువ వెంట సాగునీరు ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ర్ట్ స్పందించి పెండింగ్ పసులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ వరకై నా 5ఆర్ కాలువ వెంట సాగునీరందించాలని కోరుతున్నారు. -
‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’
శ్రీరాంపూర్: కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కార్పొరేషన్ పరిదిలోని 6వ వార్డులో సీపీఐ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో తిరుగుతూ సీపీఐని గెలిపించాలని కోరారు. సింగరేణిపై గడ్డపై ఎర్ర జెండాకు ఒక ప్రత్యేక ప్రస్థానం ఉందన్నారు. కార్మిక వర్గానికి, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, నాయకులు బొడ్డు లక్ష్మణ్, రాజ్కుమార్, మిర్యాల రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
నేలబారు చదువులు
నెన్నెల: సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు నేటికీ నేలచూపులే చూస్తున్నాయి. విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, తరగతి గదుల సమస్యలే కాకుండా కూర్చోవడానికి బెంచీలూ లేకుండాపోయాయి. విద్యార్థులు నేలపైనే కూర్చోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 60శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారు. మౌలిక వసతుల కల్పనకు స్కూల్ గ్రాంట్ నిధులు, కాంప్లెక్స్ నిధులు మంజూరవుతున్నా సరిపోవడం లేదు. మండలంలో ఉన్నత పాఠశాలలు 5, ప్రాథమికోన్నత 9, ప్రాథమిక పాఠశాలలు 18 ఉన్నాయి. మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 60శాతానికి పైగా పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవు. కొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. బడికి వచ్చిన నిధులతో సమకూర్చడానికి ఉపాధ్యాయులందరూ ఎస్ఎంసీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు. వచ్చిన నిధులు స్కూల్ అవసరాలకే సరిపోతున్నాయని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు, దాతలు, నాయకులు స్పందించి బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఇంటికి చేరిన బండి దాదా
మందమర్రిరూరల్: సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శిగా పనిచేసి ఇటీవల అజ్ఞాతం వీడిన బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా బుధవారం రాత్రి మందమర్రి మూడోజోన్లోని తన ఇంటికి భార్య హేమతో కలిసి చేరుకున్నారు. 25 ఏళ్ల ఆజ్ఞాత వాసం, పదిపహేనేళ్ల జైలు జీవితం అనుభవించిన ఆయనను గురువారం ‘సాక్షి’తో పలు విషయాలు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇంటిస్థలం ఇవ్వాలని కోరుతున్నాడు. బండి ప్రకాష్ దంపతులు మందమర్రికి వచ్చిన విషయం తెలియడంతో అతని సన్నిహితులు, చిన్ననాటి మిత్రులు కలిసి గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్రూరల్: మండలంలోని రాణాపూర్ గిరిజన పాఠశాల విద్యార్థులు సికిందర్, కృష్ణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు భూక్య రమేశ్ తెలిపారు. ఈ నెల 4న మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లిలో జరుగనున్న పోటీల్లో సదరు విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, జిల్లా క్రీడల అధికారి భూక్యా రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. జెట్టక్కను సాగనంపిన గ్రామస్తులుకడెం: ఊరు కీడు తొలగిపోయి, అంతా మంచే జరగాలని మండలంలోని సారంగపూర్ గ్రామస్తులు గురువారం జెట్టక్కను సాగనంపారు. పాత బట్టలు ధరించి, చీపుర్లు, చాటలతో నృత్యం చేస్తూ గ్రామ పొలిమేర దాటించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ కోల తేజస్విని శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నమ్మించి మోసగించిన ఒకరికి పదేళ్ల జైలు ఆసిఫాబాద్రూరల్: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఆసిఫాబాద్కు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు బొమ్మెన ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగిసిన రోబోటిక్స్ శిక్షణమంచిర్యాలఅర్బన్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ (ఆర్ఐఏ) కార్యక్రమం గురువారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న 101 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, పాఠశాలకు రోబోటిక్స్ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధి నవ్యశ్రీ, హెచ్ఎం రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
దండేపల్లి: జన్నారం మండలం సింగరాయిపేటకు చెందిన బొజ్జిరావ్ అనే యువకుడిని గురువారం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తాళ్లపేట రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కారణం లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. బొజ్జిరావ్తో పాటు కొమ్ముగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్దకు అధికసంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తహసీనొద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి గిరిజనులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు మాట్లాడుతూ బొజ్జిరావ్ సింగరాయిపేట బీట్పరిధిలోని 345 కంపార్ట్ మెంట్లో 8 చెట్లను నరికాడని, పైగా గతంలో అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని, సుధాకర్ గతంలో తానిమడుగు బీట్లో చెట్లునరికి తప్పించుకు తిరుగుతుండడంతో గురువారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి ఇద్దరి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
చెన్నూర్: ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని హెల్త్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వర్రావు అన్నారు. గురువారం చెన్నూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. వివాహిత అదృశ్యంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. గతనెల 31న ఉద యం తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ సోదరుడు గురువారం టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. -
ఢిల్లీలో ఉపాధ్యాయుల ధర్నా
నిర్మల్రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానం పునఃసమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, నాగభూషణ్, బాజారెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ఆదిలాబాద్: రైల్వేలో మౌలిక సదుపాయాల కల్ప నకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపడుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా క్రూలాబీ, రన్నింగ్ రూమ్, వంటశాలను నిర్మించినట్లు తెలిపారు. ఆయన వెంట నాందేడ్ డివిజన్ డీఆర్ఎం ప్రదీప్ కామ్లే, తదితరులు ఉన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలి ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు గణేశ్ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం ఉన్నారు. -
కఠినంగా కోడ్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) రూపొందించింది. భారత రాజ్యాంగంలోని 243–కె, 243–జెడ్ఏ విభాగాల కింద స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈ మార్గదర్శకాలు అమలు చేస్తోంది. అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ నియమావళి ఉపయోగపడుతుంది. ఎన్నికల్లో నేరాలు, అక్రమాలు, అవినీతి, వంచన, లంచగొండి తనం, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులను నివారించడం నిబంధనల లక్ష్యం. ఈ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటినుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తారు. నిబంధనలు ఇవే.. -
ఎన్నికల విధుల్లో ఉన్నారా?
నిర్మల్ఖిల్లా: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తు ఫారం–12కు ఎన్నికల విధుల ధ్రువీకరణపత్రాన్ని జతచేసి సంబంధిత మున్సిపాలిటీలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి ఫారం–15, 16, 17, 18 పత్రాలను దరఖాస్తుదారులకు అందిస్తారు. వీటిలో ఫారం–15 ఓటర్ వివరాలతో కూడిన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. దానిపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరం. ఫారం–16 కవర్–ఏ లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండి దానిపై బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య ఉంటుంది. ఫారం–17 కవర్ బిలో రిటర్నింగ్ అధికారి చిరునామా ఉంటుంది. దీనిపై ఓటరు సంతకం చేసి అందజేయాల్సి ఉంటుంది. ఫారం–18లో ఓటరు తన ఓటుహక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేసే పూర్తి వివరాలు ముద్రితమై ఉంటాయి. సంబంధిత ఎన్నికల సిబ్బంది దరఖాస్తులు సమర్పించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. -
ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేయాలి
దండేపల్లి: ఇంటిపన్ను వసూళ్లు వందశాతం పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్ను వసూళ్లు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. వసూళ్లలో వెనుకబడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలన్నారు. నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మండలంలోని కొర్విచెల్మ గ్రామాన్ని సందర్శించారు. జీపీ కార్యాలయంలోని రికార్డులు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. నర్సరీని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై పంచాయతీ సిబ్బంది, జీపీ కార్మికులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో జె.ప్రసాద్, ఎంపీవో కేవీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్లో పొరపాట్లకు తావు లేకుండా చూడాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తాగునీరు, మూత్రశాలలు, విద్యుద్దీపాలు, ఫ్యాన్లు వంటి తదితర అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 11న పోలింగ్, 12న అవసరమైతే రీ పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటాయని వివరించారు. పోలింగ్కు 48గంటల ముందు ప్రచారాన్ని నిలిపి వేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, జూనియర్ అకౌంటెంట్ అనితాదేవి, అధికారులు పాల్గొన్నారు.


