Mancherial
-
టోల్ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది
చౌటుప్పల్/రఘునాథపల్లి/దేవరుప్పుల/మంచిర్యాల: హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్–వరంగల్, జనగామ–సూర్యాపేట రూట్లో స్వల్పంగా పెరిగాయి. తగ్గిన, పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ధరలు కూడా ఒక టోల్ప్లాజా వద్ద తగ్గితే మరో టోల్ప్లాజా వద్ద యథావిధిగా ఉన్నాయి. ⇒ పంతంగి టోల్ప్లాజా వద్ద త్రీ యాక్సల్ వాహనాలకు మాత్రమే ఇరువైపులా 5 రూపాయలు తగ్గనుంది, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. ఇక్కడ త్రీ యాక్సల్ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది. ⇒ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్ వాహనాలకు మాత్రమే ఐదు రూపాయలు తగ్గనుంది. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గుతుంది. ⇒ ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్ మోటారు వాహనాలకు ఐదు రూపాయలు తగ్గించారు. ఇక్కడ వీటికి ఒకవైపునకు రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. రెండు యాక్సల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కు, మూడు యాక్సల్ వాహనాలకు 24గంటల్లో ఇరువైపులా రూ.570 నుంచి రూ.565కు తగ్గించారు. ⇒ మంచిర్యాల–చంద్రాపూర్ జాతీయ రహదారి 363పై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరండి టోల్ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్లపై గరిష్టంగా 25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా, 145కు తగ్గించారు. 3 జతల టైర్ల వాహనాలకు రూ.340 ఉండగా, ప్రస్తుతం రూ.335కు తగ్గింది. అలాగే నెలవారీ పాస్లు సైతం ఒక్కో పాస్కు రూ.25 నుంచి గరిష్టంగా ఏడు జతల భారీ వాహనాల వరకు రూ.160 వరకు తగ్గాయి. ⇒ జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ చార్జీలు పెరిగాయి. కారు (నాలుగు టైర్ల వాహనాలు)కు రూ.35 నుంచి రూ.40, లైట్ కమర్షియల్ వాహనాలకు ప్రస్తుత రేటు రూ.60 ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు ప్రస్తుతం రూ.125 ఉండగా 130కి పెరిగింది. రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనానికి ప్రస్తుతం రూ.135కి 140 పెరగగా, రిటర్న్ జర్నీకి రూ.5, ఫోర్ టూ సిక్స్ యాక్సల్స్ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి 300కు పెరగగా రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. సెవన్ టూఓహెచ్సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా 245కి, రిటర్న్ జర్నీకి రూ.355 నుంచి 365కి పెరిగింది. ⇒ వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు ఒకవైపునకు రూ. 5 పెరిగింది. లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు సింగిల్ జర్నీకి రూ. 5పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.10 పెరిగింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్ జర్నీకి రూ.15 పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.25 పెరిగింది. పెరిగిన వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము టోల్ప్లాజాల వద్ద స్వల్పంగా టోల్ రుసుమును తగ్గించినా, వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుమును సైతం స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము రూ.3000 ఉండగా దానిని రూ.3075కు పెంచారు. ట్రిప్పుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సోమవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలను స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎత్తు, బరువు, నైపుణ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్టు, 800 మీటర్ల పరుగుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. -
స్టెప్పులేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీవీఏజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్లు పసుల తిరుపతి, తోట నగేష్ మాట్లాడుతూ విద్యార్హతలను బట్టి ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈడీ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గొర్రె రమేష్, చిందం వెంకటేష్, ఉస్మాన్, దేవేందర్రెడ్డి, శ్రావణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, మధుకర్, రాజు, ర మేష్, రాజేష్, దత్తు, తదితరులు పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని 14ఏళ్లు దాటి 15ఏళ్లలోపు ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపడుతోందని, అర్హులైన ఆడపిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పాతమంచిర్యాలలోని అర్బన్ హెల్త్సెంటర్లో సోమవారం ఆడపిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టగా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్తోపాటు ఆర్థో, డెంటల్, సీ్త్ర వైద్య నిపుణులు, ఫిజీషియన్ ఇతర ప్రత్యేక వైద్యులు శిబిరంలో అందుబాటులో ఉంటారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ తూముల నరేష్, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, వైద్యాధికారి డాక్టర్ స్నేహిత, సీహెచ్వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, దీక్షిత రాణి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. -
విద్యార్థుల విద్యాప్రమాణాలపై సర్వే
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు బోధన, చదువు కొనసాగింపు గుర్తించేందుకు సోమవారం సర్వే మొదలైంది. ఎంపిక చేసిన పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాల అంచనాకు ఈ నెల 30, 31న పరఖ్ జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) పేరిట సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులతో సర్వే ప్రారంభించారు. హాజీపూర్ మండలం నాగారం మండల పరిషత్ పాఠశాల, మంచిర్యాలలో స్ప్రింగ్ ఫీల్డ్ హైస్కూల్, వేమనపల్లి మండలం ముల్కల్పేట, కోటపల్లి మండలం దేవులవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. రెండ్రోజులపాటు ఒక్కో పాఠశాలలో 12 మంది విద్యార్థుల చొప్పున 48 మందిని పరీక్షిస్తారు. దీనిద్వారా విద్యావ్యవస్థపై అంచనా ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో చేపట్టే విద్యా కార్యక్రమాల ప్రణాళికకు సమాచారం దోహదపడుతుందని డీఈవో యాదయ్య తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మార్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: ఇటీవల జరిగిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సన్మానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి సత్కరించారు. టీఎంఎస్ఎస్ ఉట్నూర్, ఖానాపూర్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పతకాలతో సత్తా చాటారు. రా బోయే రోజుల్లో మరిన్ని వేదికల్లో సత్తా చాటాలని ఆ కాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులకు నెహ్రూ జువాలజీకల్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శింపజేశారు. ఉత్సాహంగా గడిపిన ఎమ్మెల్యే వారితో డిన్నర్ చేశారు. సన్మానం పొందిన వారిలో పతకాలు సాధించిన ఎస్.నవీన్, యు.గణేశ్, ఎం.మారుతి, ఎమ్.నిఖిల్ కుమార్, ఎస్.శంకర్, కె.సురేందర్, ఆర్.శివసాయి, ఏ.యాదవ్ శావ్, పి.హనుమంతరావు, హెచ్ కె.నగేశ్ ఉన్నారు. క్రీడాకారులతోపాటు జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, నిర్మల్ డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, శిక్షకులు శివ, రాజకుమార్, హెచ్డబ్ల్యూఓ గంగారం ఉన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝాజైపూర్: రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మండలంలోని దుబ్బపల్లి పీఎల్ఎన్ఆర్ గార్డెన్లో సోమవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ మూడో విడతలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్యశిబిరాలు, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వవద్దని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు నవీన్కుమార్, బన్సీలాల్, కృష్ణ, స్థానిక ఎస్సై రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
చెన్నూర్: గోదావరి పుష్కరాల దృష్ట్యా చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పుష్కరాలకు రూ.500 కోట్లు మంజూరు చేయించాలని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులను గుర్తించాలని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, నాయకులు వెంకటనర్సయ్య, జాడి తిరుపతి, బుర్ర రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
కాన్కూర్లో జల సంరక్షణ చర్యలు
జైపూర్: మండలంలోని కాన్కూర్ అటవీప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు. టీజీఎఫ్డీసీకి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలోని వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేశారు. టీజీఎఫ్డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్లో వేసవిలో నీటి వృథాను అరికట్టి జల సంక్షరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ తప్పనిసరి
మంచిర్యాలటౌన్: జిల్లా నుంచి హజ్కు వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో సోమవారం హజ్ యాత్రికుల వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పరిశీలించారు. 15 మంది యాత్రికులకు వ్యా క్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్, వైద్యాధికారులు డాక్టర్ తబిసియ, డాక్టర్ ముస్తాఫా, డీపీవో ప్రశాంతి, సీహెచ్వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్ పాషా, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
కొరవడిన క్రమశిక్షణ..కరువైన పర్యవేక్షణ
చెన్నూర్: గురుకుల విద్యాలయాలు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు పెట్టింది పేరు. గతంలో విద్యాబ్యాసం కఠినతరంగా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ విద్యార్థుల్లో కొరవడిందా, ఉపాధ్యాయుల వేధింపులు ఎక్కువయ్యయా అనే అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. వాచ్మెన్ నుంచి పాఠశాలల వరకు పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల తినుబండారాలను తనిఖీ చేసి లోనికి పంపిస్తారు. పాఠశాలకు గడ్డిమందు వచ్చిందంటే పర్యవేక్షణ కొరవడిందని చెప్పుచ్చు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గాడితప్పుతున్నారా అనే అనుమానులకు తావిస్తున్నాయి. మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం పట్ల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురుకులాల్లో విద్యార్థులు బయటికి వెళ్లాలంటే కేవలం దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగతారోజుల్లో మాత్రమే ఇళ్లకు పంపిస్తారు. నెలలో రెండు ఆదివారాల్లో తల్లిదండ్రులు వస్తే ఔటింగ్కు పంపిస్తారు. ఇన్ని నిబంధనలు ఉన్న విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న విషయం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మృతుల వివరాలు ఇలా.. చెన్నూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి చెన్నూర్ గురుకుల పాఠశాలలోనే మూడేళ్లలో ముగ్గురు మృతువాత పడ్డారు. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్కు గురయ్యారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో జరుగుతున్న వరుస ఘటనలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలల పై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలలో అధ్యాపకురాలు, విద్యార్థిని, మైనార్టీ గురుకులంలో విద్యార్థి చొప్పున ముగ్గురు మృతి చెందారు. మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో తోటి విద్యార్థిని కొడుతూ సెల్ఫోన్లో వీడియో తీసిన పది మంది విద్యార్థులు సస్పెన్స్కు గురికాగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ను విధుల నుంచి తొలగించారు. -
లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలి
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని మండలంలోని అఖిలపక్ష నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఐబీ ఆవరణలో అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్సెట్టిపేట పట్టణానికి గతంలో నియోజకవర్గ హోదా ఉన్నదని తెలిపారు. దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాలను కలుపుతూ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్లో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నియోజకవర్గ ఏర్పాటుకు పోరాటం చేస్తామని, సాధన కమిటీని నిర్ణయించి ముందుకు సాగుతామని అన్నారు. మండల అఖిలపక్ష నాయకులు నల్మాస్ కాంతయ్య, పొట్టేలు శ్రీనివాస్గౌడ్, లింగయ్య, సుధాకర్, దండేపల్లి, జన్నారం, నాయకులు పాల్గొన్నారు. -
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: మండలంలోని గుండి శివారులో నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. సోమవారం హత్య కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. 2022లో పెంచికల్పేట్ మండలానికి చెందిన సాగర్ ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికివెళ్లే దారిలో శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును ఎస్పీ చొరవతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సాగర్ను కాగజ్నగర్కు రమ్మని పిలిచి, ఆటోలో ఎక్కించి ఆసిఫాబాద్ మండలం గుండి శివారు పంట పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసును హత్యగా నిర్ధారించారు. కౌటాల బాలుర వసతి గృహం కుక్ కొండూరి మల్లేశ్వరి, కాగజ్నగర్ ద్వారాకానగర్కు చెందిన ఎన్నం అశోక్, పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చెన్నూరి స్వామి నేరాన్ని ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, చెన్నూరి స్వామి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు, వీరిలో సీఐ బాలాజీ వరప్రసాద్, డీసీఆర్బీ సీఐ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌటాల ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఐటీకోర్ కానిస్టేబుల్ మహేశ్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
ఇద్దరు పార్ట్టైం ఉపాధ్యాయుల తొలగింపు
● కాళేశ్వరం జోన్ జోనల్ అధికారి గిరిజ ● గురుకుల పాఠశాలలో విచారణ చెన్నూర్: చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పార్ట్టైం ఉపాధ్యాయులు సిహెచ్.సువర్ణ, శ్రీవాణిలను విధుల నుంచి తొలగించినట్లు కాళేశ్వరం జోన్ జోనల్ అధికారి గిరిజ తెలిపారు. సోమవారం గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు మృతిపై జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణితో కలిసి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా విచారణ చేపట్టామని తెలిపారు. విద్యార్థిని గడ్డిమందు సేవించిన విషయాన్ని హౌజ్టీచర్, సూపర్వైజర్లకు తెలియజేసినట్లయితే సరైన వైద్య సేవలు అందించేవారమని అన్నారు. విద్యార్థిని ద్రావణం సేవించిన విషయం చెప్పకపోవడంతో దురదృష్టకర సంఘటన జరిగిందని తెలిపారు. శ్రీహిందుకు మెరుగైన వైద్యం అందించాలని ఖర్చుల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి రూ.26 వేలు ప్రిన్సిపాల్ అందజేశారని తెలిపారు. విద్యార్థిని మృతి విషాదకరమని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వ సహాయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే ఊరుకోంమంచిర్యాలటౌన్: అక్రమ టెండర్లు వేసి ప్రజాధనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరర్రావు దోచుకుంటున్నారని, వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు పేరిట పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని, ప్రజాధనాన్ని వృథా చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జూలై 13న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇండస్ట్రీయల్ పార్కు నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినప్పుడు హడావుడిగా పనులు చేశారని, దాదాపు ఏడాది తర్వాత చేసిన పనులకు ఈ నెల 11న రూ.1.48 కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. ఇప్పటికే దళితులు, బీసీలను బెదిరించి రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల విలువైన 200 ఎకరాల భూములను కేవలం ఎకరాకు రూ.13.50లక్షలు ఇచ్చి సంతకాలు సేకరించారని ఆరోపించారు. ఆ భూములను ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చిన వారికి కేటాయించేలా భారీ కుంభకోణానికి ప్రణాళిక సిద్ధం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్ మాట్లాడుతూ పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్రూంలను అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్, ఆడ సంపత్, సలహాదారుగా పుర్క ఉద్దవ్, మడావి గంగారాం, పూసం ఆనంద్ రావు, ఎన్నికయ్యారు. గవర్నర్ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడుపాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్రెడ్డి కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలిపాతమంచిర్యాల: రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సంక్షేమానికి రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, గత బడ్జెట్లో రూ.183 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలిపారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని, భవిష్యత్లో ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజుల రామచంద్ర, నాయకులు ఓదెలు, చందు, భాగ్య, శనిగారపు సత్యం, మామిడి రమేష్, కోటిపల్లి కళావతి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్గా ఆదిలాబాద్
కై లాస్నగర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్–2025 (సెకండ్ ఎడిషన్) పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, కోచ్లు, సిబ్బంది వారు సాఽధించిన కప్తో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిఽశారు. వారిని అభినందించారు. క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల విజయవంతంలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియ, మండల, జిల్లాస్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ విజయానికి క్రీడాకారులతోపాటు కోచ్లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, చిల్లగింజలు మొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురుచూడకుండా, వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలని కోరారు. నూతన డీఆర్ డిపోల్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, రమేశ్, మనోహర్, ఇస్తారి, లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ బోర్డు పునరుద్ధరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో సంవత్సరం కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జీఎం ఎం.శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డ వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. మెడికల్ ఫిట్ అయిన 300 మంది డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, కేంద్ర కమిటీ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ నాయకులు అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు గొర్ల సంతోష్, బుస్స రమేశ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన లేకే..
నేరం చేసినవారెవ్వరూ చట్టం చేతిలో నుంచి తప్పించుకోలేరు. ఈ విషయంపై అవగాహన లేకే నేరాలకు పాల్పడుతూ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా మద్యం, డ్రగ్స్కు బానిసైన యువత భ్రమల్లో ఉంటూ అసూయతో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివారు సైకాలజిస్ట్ను సంప్రదించాలి. హత్యలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలున్నాయి. చట్టం చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. – బండవరం జగన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంచిర్యాల -
సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి కృషి
నస్పూర్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఆర్పీ 3, ఎస్ఆర్పీ ఓసీ, సీహెచ్పీ, ఎస్సార్పీ 1, ఐకే 1, ఐకే ఓసీలలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతన రెస్టురూమ్ల ఏర్పాటుతోపాటు పాత వాటిని మరమ్మతు చేయాలన్నారు. ఎస్సార్పీ ఓసీ, సీహెచ్పీలో నూతన ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. సర్వే జనరల్ పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇప్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది, సర్పేస్ ఉద్యోగులకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని జీఎం తెలిపారు. గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రెటరీ బాజీసైదా, ఎస్ఓటూ జీఎం సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రమణారావు, అధికారులు రాజన్న, అనిల్కుమార్, ప్రశాంత్, అన్ని గనుల ఏజెంట్లు, గుర్తింపు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మాయమై పోతున్నడమ్మా..
‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకై నా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అంటూ ఓ కవి స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. సందర్భం ఏదైనా నేటి సమాజంలో కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. అనుమానాలు, వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు.. కారణలేవైనా అంతిమంగా మానవ మృగాలుగా మారి మనుషులను మనుషులే చంపేసుకుంటున్నారు. మానవ విలువలకు తిలోదకాలిస్తున్నారు. మంచిర్యాలక్రైం: క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్యను హత్య చేయడం, ఆస్తులకోసం జన్మనిచ్చిన తండ్రిని కొడుకులు, కూతుళ్లు హతమార్చడం లాంటి ఘటనలెన్నో సమాజంలో చూస్తున్నాం. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొంందరు పథకం ప్రకా రం హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడి చట్టం చేతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ.. పోలీసులు టెక్నాలజీ సాయంతో చిన్న ఆధారంతో నైనా నేరస్తులను పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. ఆ తరువాత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి బె యిల్పై బయటకు వచ్చినా సమాజం వారిని హంతకులుగా చిన్నచూపు చూస్తుంది. కేసు విచారణ తర్వాత శిక్షలు కూడా పడే అవకాశముంది. బాధిత కుటుంబాలవారే కాకుండా హంతకులకుటుంబాలవారు కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇటీవల జరిగిన మూడు హత్యలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేక కౌన్సిలింగ్తోనే సరినేరాల్లో యువత భాగస్వామ్యం ఉండకూడదని పోలీస్శాఖ భావిస్తోంది. ఇదే లక్ష్యంతో వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తోంది. యువత, విద్యార్థులకు సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న ఇబ్బందులు, గంజాయి వినియోగం, విక్రయాలతో తలెత్తే సమస్యలను వివరిస్తోంది. ఇదే సమయంలో మానవ సంబంధాలపైనా సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. మహిళలు, మానవ సంబంధాలు, నేరాలు తదితర అసాంఘిక ఘటనల వైపు దృష్టి మళ్లకుండా చూస్తోంది. ఎంతటి సమస్యనైనా కూర్చుండి పరిష్కరించుకునే అవకాశమున్నా ఒకరిలో ఒకరికి తగ్గింపు స్వభావం లేకనే హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీం కోర్టు రాజీ మార్గమే రాజమార్గమని భావించి లోక్ అదాలత్ల ద్వారా పెండింగ్ కేసుల్లో కక్షిదారులను రాజీ కుదిర్చేలా చూస్తోంది. ఇటీవలి ఘటనల్లో కొన్ని.. -
బైక్ను ఢీకొట్టిన లారీ: మహిళ మృతి
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44 సీతాగొంది సమీపంలో బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ చెందిన అప్పర్ఖాన్, రుమాన బేగం (43) దంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న రుమానా బేగంను జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు శనివారం బైక్పై బయల్దేరారు. చింతగూడ కార్నర్ వద్ద భారీ కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రుమానా బేగం తలకు తీవ్రంగా, అప్పర్ఖాన్కు స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్కు తరలించగా అప్పటికే రుమానాబేగం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, రెండురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సాద్వి కుమారి అశ్విని మృతి చెందింది. పోలీసులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు, బాధితులు పేర్కొన్నారు. -
యువకుడి దారుణహత్య
ఆదిలాబాద్టౌన్: ఆదిలా బాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్కు చెందిన మహ్మద్ అర్బాజ్(25) ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ వివాహితతో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం గతంలోనే ఇంట్లో తెలియడంతో పలుసార్లు అర్బాజ్ను మహిళ కుటుంబీకులు, భర్త మందలించారు. గతంలో కత్తితో దాడి చేసేందుకు వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కాలనీలో అర్బాజ్పై కర్రతో దాడి చేశారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి మహ్మద్ ఆరీఫ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునిల్కుమార్ను సంప్రదించగా.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రాంగ్రూట్లో బైక్ను ఢీకొట్టిన లారీ
కడెం: లారీ, బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అల్లంపల్లి పంచాయతీ పరిధి గుర్రంమదిర గ్రామానికి చెందిన ఉయిక భీంరావు(23), అదే గ్రామానికి చెందిన కుమురం రాంబాయి(47) రైతుబంధు డబ్బులు కోసం శనివారం బైక్పై మండల కేంద్రంలోని బ్యాంక్కు వెళ్లారు. శనివారం బంద్ ఉండడంతో తిరుగుపయనమయ్యారు. ఉడుంపూర్ అటవీప్రాంతంలో అల్లంపల్లి నుంచి ఆవుపేడ లోడుతో వస్తున్న లారీ, బైక్ను రాంగ్రూట్లో ఎదురుగా ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరిని కొద్దిదూరం మేర ఈడ్చుకెళ్లగా అక్కడిక్కడే మృతిచెందారు. లారీడ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణామని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలు రాంబాయికు ముగ్గురు పిల్లలు కాగా, ఒకరికి వివాహామైంది. భర్త నాగోరావు గతంలో చనిపోయాడు. -
నాలుగు లేబర్కోడ్లు రద్దుచేయాలి
నస్పూర్: కేంద్రపభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆ యన నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. లేబర్కోడ్ల అమలు ను నిరసిస్తూ ఏప్రిల్ 1న ఆందోళనలు చేపడుతామని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో సింగరేణి మనుగడ, భవిష్యత్తు ప్రశ్నాత్మకంగా మారిందన్నారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మారుపేర్ల సమ స్య పరిష్కరించాలని, పెర్క్స్ పై ఇన్కాం టా క్స్ యాజమాన్యమే భరించాలన్నారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. రాబోయే పదేళ్లలో అన్ని భూగర్భ గనులు మూతపడే ప్రమాదం ఉందన్నారు. సేవ్ సింగరేణి పేరుతో ఏఐటీయూసీ చేస్తున్న కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపా రు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కక్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం, రాష్ట్ర నాయకులు మేకల రామన్న, దేవయ్య, కిష్టయ్య, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు. -
సెల్ పోయిందా.. సీఈఐఆర్లో ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల కు శనివారం జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నెల రోజుల్లో 105 ఫోన్లు రికవరీ చేశామని, వీటి విలువ రూ.15 లక్షల పైబడి ఉంటుందని తెలిపారు. ఏడాదిలో 1100 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందించామన్నారు. జిల్లా కేంద్రంలో రైతుబజార్, బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ తదితర ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంట నే వెబ్సైట్లో ఫిర్యాదు చేసి సమీప పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, ఆర్ఎస్సై గోపికృష్ణ, రియాజ్, మజీద్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సులో ఖానాపూర్ వాసి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెకు చెందిన ఎదులాపురం సత్యనారాయణచారి.. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయంలో ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ప్రతినిధిగా హాజరయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి త్వ, యువజన సేవల శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో ‘ప్రపంచ వేదికపై భారత్: సాఫ్ట్ ప వర్, విధానాలు, యువ దౌత్యం’అనే అంశంపై మూడు రోజులపాటు వర్క్షాప్ నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అలోక్ దిమిరి కార్యక్రమాన్ని ప్రా రంభించగా, నలంద వీసీ సచిన్ చతుర్వేది స మక్షంలో సదస్సు జరిగింది. భారత్తో పాటు సుమారు పది దేశాల దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్న సదస్సులో సత్యనారాయణ చా రి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తు తం ఆయన మెగా ఇన్ఫ్రా సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న అతన్ని గోసంపల్లె సర్పంచ్ కొక్కుల సుభద్రతోపాటు జిల్లావాసులు అభినందించారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 7,8,9 తేదీల్లో మహబూబా బాద్లో రాష్ట్రరస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో వి ష్ణు, స్నేహ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు త రపున ఆడి ప్రతిభ కనబర్చారు. వారి ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి 17వ తేది వరకు జాతీయస్థాయి పోటీలు జరగనున్నా యి. పాఠశాల హెచ్ఎం, ఎంఈవో పోచయ్య, ఇన్చార్జి శిరీష, పీడీ బండి రవి, ఉపాధ్యాయులు సదరు విద్యార్థులను అభినందించారు. -
సాంబార్ వేటాడిన కేసులో ఒకరికి రిమాండ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్):సాంబార్ వే టాడిన కేసులో ఒకరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ తీర్పునిచ్చారు.లక్సెట్టిపేట అట వీ రేంజ్ అధికారి అనిత కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లికి చెందిన జాడి రాజలింగు 2025 అక్టోబర్ 17న టీకానపల్లి అడవిలో విద్యుత్ వైర్ అమర్చి సాంబార్ను చంపాడు. పరారీ లో ఉన్న నిందితుడిని శనివారం పట్టుబడ్డాడు. జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. హాజీపూర్ డెప్యూటీ రేంజ్ అధికారి సునీత, ఎఫ్ఎస్ఓ అల్తాఫ్ హుస్సేన్, ఎఫ్బీఓలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి
నస్పూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి గని కార్మికుడు మాడుగుల రమేశ్(34) మృతిచెందాడు. ఈ ఘటన శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ ఆర్కే 7 గనిలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం గనిలో విధులు ముగించుకుని మోటార్సైకిల్పై క్యాతనపల్లిలోని తన ఇంటికి బయల్దేరాడు. శ్రీరాంపూర్ కొత్తరోడ్లోని సులభ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారి–363పై మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు ఆర్కే 8 డిస్పెన్సరీకి తరలించగా వైదులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కామోల్లో కుస్తీపోటీలు
భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలను ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు మల్ల యోధులు తలపడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన రాజు పటేల్ విజేతగా నిలిచారు. గ్రామ, ఆలయ కమిటీ, ఎస్సై సుప్రియలు విజేతకు ఐదు తులాల వెండి కడియంతోపాటు రూ.6100 నగదు అందించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
6న ఆదిలాబాద్కు సీఎం
కైలాస్నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరిలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 99 రో జుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించ నున్న సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధి కారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకు న్న సందర్భాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటలకు పి ప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సభను జయప్రదం చేసేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎ మ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొ జ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సు ల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ ఉ ప్పల్, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితారాణా, ఆదిలా బాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్దీపక్ పాల్గొన్నారు. -
నగర బడ్జెట్ రూ.74.76 కోట్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ 2026–27 సంవత్సరపు ముసాయిదా బడ్జెట్ను శనివారం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేశ్ సమక్షంలో కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. అంచనా బడ్జెట్ను రూ.74.76కోట్ల 31వేలుగా నిర్ణయించి ప్రకటించారు. సాధారణ ఆదాయం రూ.50.37కోట్ల 58 వేలు, గ్రాంట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్లు రూ. 24.38కోట్ల 56వేలుగా నిర్ణయించారు. ఏప్రిల్ 1, 2026 నాటికి మిగులు బడ్జెట్ కింద ప్రారంభ విలువ రూ.8.89 కోట్లుగా చూపించారు. 2025 –26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను గతేడాది రూ.66.32కోట్ల 32వేలుగా అంచనా వేయగా, ఈ నెల 31నాటికి అయిన ఖర్చు రూ.72.51కోట్ల 66వేలుగా వివరించారు. ఆదాయం రూ.50.37కోట్లు కార్పొరేషన్కు పన్నులు, ఇతరత్రాల రూపంలో రూ.50.37కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్నుల రూపంలో రూ.21.84 కోట్లు, కేటాయించిన ఆదాయాలు రూ.6.82కో ట్లు, అద్దె ద్వారా రూ.3.48కోట్లు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం రశీదుల ద్వారా రూ.1.83 కో ట్లు, పట్టణ ప్రణాళిక విభాగం రశీదుల ద్వారా రూ.12.59కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.3.81కోట్లు, మొత్తం రూ.50.37 కోట్ల ఆదా యం రానున్నట్లు అంచనా వేశారు. వీటితోపాటు కాపిటల్ ఫండ్ (సీపీఎస్) నాన్ ప్లాన్ నిధులు రూ.11.80 కోట్లు, ప్రణాళిక నిధులు రూ.3.60 కోట్ల 24వేలు, డిపాజిట్లు రుణాలు రూ.41.30లక్షలు, ఇతర నిధులు రూ.8.56కోట్ల 87వేలు.. మొ త్తంగా రూ.23.97కోట్ల 26వేలు వస్తాయని భా వించారు. పన్ను వనరులు, కాపిటల్ ఫండ్ ని ధులన్నీ కలిపి రూ.74.76కోట్ల 14వేల బడ్జెట్గా అంచనా వేశారు. వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ వ్యయం, ఇంజినీరింగ్ విభాగాల ని ర్వహణ, సాధారణ పరిపాలన, నగర ప్రణాళిక విభాగం, వసతులు, వార్డులవారీగా నాన్ప్లాన్, ప్రణాళిక, ఇతర నిధుల ఖర్చు అంచనా వేశారు. నిరసన తెలిపిన ప్రతిపక్షాలు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్పై తమను మాట్లాడించలేదంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు సమావేశం అనంతరం నేలపై కూర్చుని నిరసన తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్గౌడ్ నోటికి గుడ్డ కట్టుకుని నిరసన వ్యక్తంజేశారు. బీజేపీ కార్పొరేటర్ బొట్ల అనిత, బీఆర్ఎస్ కార్పొరేటర్ పెట్టెం స్వరూపకు మాత్రమే మాట్లాడే అవకాశమివ్వగా, తమకూ ఇవ్వాలని మిగతావారు డిమాండ్ చేశారు. పట్టణ ప్రగతి నిధులు ప్రతీనెల మంచిర్యాలకు రూ.75లక్షలు, నస్పూరుకు రూ.65లక్షలు రావాల్సి ఉండగా, 28 నెలలుగా పెండింగ్లో ఉంటే ఎందుకు తెప్పించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్పొరేట ర్లు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన జిరాక్స్ల ఖర్చు ఏడాదికి రూ.12.50 లక్షలను బయటి వ్యక్తులకు ఎందుకు చెల్లిస్తున్నారని, రూ.4లక్షలకు కొత్త జిరాక్స్ మిషన్ వస్తుందని సూచించారు. అనవసర ఖర్చులు చేయడంపై వారు నిరసన వ్యక్తంజేశారు. -
‘నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం’
నస్పూర్: డ్రైవర్ల నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గెడి భాస్కర్ తెలిపారు. శనివారం నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి హా జరై సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లు, విద్యార్థులకు శంకర్ నేత్రాలయ కంటి ఆస్పత్రి ద్వా రా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, నిర్లక్ష్య పు డ్రైవింగ్, సీటు బెల్ట్ ధరించక పోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బాధ్యత రాహిత్యపు డ్రైవింగ్ కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2025లో152 మంది రోడ్డులో ప్రమాదాల్లో మృతి చెందారని, వందలాది మంది వికలాంగులయ్యారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మంది 40 ఏళ్లలోపువారే ఉన్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ని గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణా లు కాపాడిన వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహవీర్ పథకం’ కింద రూ.25వేల నగదు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అనంతరం డాక్టర్ అభిషేక్ చిందం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, న స్పూర్, మంచిర్యాల లారీ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం, హుస్సేన్ తదితరులున్నారు. -
‘రాజీ పడితే ఇరువర్గాలూ గెలిచినట్లే..’
మంచిర్యాలక్రైం: రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లాల్సింగ్ శ్రీనివాస్నాయక్ పేర్కొన్నారు. దేశ ఉన్నత న్యా యస్థానం ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో తొమ్మిది బెంచ్లు ఏర్పాటు చేసి జాతీ య లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల కు సమయం వృథా కాకుండా, అప్పీలు లేకుండా కేసులు పరిష్కారమవుతాయని తెలిపారు. లోక్ అదాలత్లో క్రిమినల్, సైబర్ క్రైం, సివిల్ తగాదాలు, చెక్బౌన్స్, కొ ట్లాట, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన తొమ్మిది బెంచీ ల్లో 3,200 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 15 వా హన పరిహారం కేసులు, తొమ్మిది క్రిమినల్ కేసులు, 3,150 ఇతర కేసులు, 24 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో రూ.2.86లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు చెప్పారు. 28 బ్యాంక్ఫ్రీ లిటికేషన్ కేసుల్లో రూ.4.50లక్షలు పరిహా రం రూపంలో ఇప్పించినట్లు వివరించారు. జిల్లా న్యా య సేవాధికార సంస్థ ఎ.నిర్మల, రామ్మోహన్రెడ్డి, జూని యర్ సివిల్ జడ్జిలు కవిత, నిరోషా, కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, ఉపాధ్యక్షుడు భుజంగ్రావు, పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
● నిర్వహణలో ఆర్టీసీ నిర్లక్ష్యం! ● పరిమితికి మించి ప్రయాణం ● కానరాని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రయాణికులకు తప్పని పాట్లు
మంచిర్యాలఅర్బన్: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..’ అని యాజమాన్యం ప్రకటనలు గుప్పిస్తున్నా ప్రథమ చికిత్స బాక్స్ల ఏర్పాటులో అలసత్వం ప్రదర్శిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే తాత్కాలిక వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్స్ బాక్స్లు మందులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులకు చిన్న గాయమైనా చికిత్స చేసే పరిస్థితి కానరావటం లేదు. ఆ స్పత్రికి తీసుకెళ్లేవరకు చికిత్స అందకుండా పోతోంది. ఇటీవల తరచూ ఏదోచోట జరుగుతున్న రహదారి ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలు మరువకముందే మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన విషాద ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. చాలా బస్సుల్లో కనిపించని కిట్లు మంచిర్యాల డిపోలో 148 బస్సులుండగా 62వేల కిలోమీటర్లు తిప్పుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) పెట్టెలు కచ్చితంగా ఉండాలనే నిబంధనలున్నాయి. టించర్ అయోడిన్, యాంటీ సెప్టిక్ క్రీం, దూది, కత్తెర, కాటన్ బ్యాండేజ్, గాయాలకు ఎలస్టిక్, వాటర్ప్రూప్ఫ్లాస్టర్ ఉండాలి. ‘సాక్షి’ పరిశీలనలో మంచిర్యాల డిపోకు చెందిన చాలా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్స్ బా క్స్లున్నా మందులు లేవు. ఆ పెట్టెల్లో కాగితాలు, గుడ్డలు, ఖాళీ బాక్స్లు కనిపించాయి. ఫైర్ ఎక్స్ టింగ్విషర్ పరికరం కూడా కొన్నింట్లో కనబడలేదు. బస్సుల్లో ప్రయాణికులు గాయపడితే కండక్టర్ ప్రథమ చికిత్స చేయాల్సి ఉండగా అవగాహన లేక మందులున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అద్దె బస్సుల్లో ఉండాల్సిన అగ్ని మాపక సిలిండర్ను ఫిట్నెస్ కోసం వెళ్లిన బస్సుల్లో ఉంచినట్లు ఓ డ్రైవర్ చెప్పడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిస్థాయిలో అగ్నిమాపక పరికరాలుండగా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం దశలవారీగా అమర్చుతున్నట్లు తెలుస్తోంది. బస్సుల్లో ప్రయాణికులకు పౌచ్ కిట్ పంపిణీ కూడా ఊసే లేకుండా పోయింది.ప్రమాదాలకు బాధ్యులెవరు? ఖాళీ సీట్లతో రాకపోకలు సాగించిన ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. పండుగ వేళల్లో రద్దీ మరీ అధికం. పల్లెవెలుగు బస్సుల్లో 55 మంది, ఎక్స్ప్రెస్లో 39, రాజధానిలో 36, లగ్జరీలో 36, లహరిలో 48 మంది ప్రయాణికుల కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం ఏ బస్సులో చూసినా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు వెళ్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో నడిచే సంస్థ బస్సులకు మినహాయింపు ఇవ్వగా.. అద్దె బస్సులకు మాత్రం ఇన్సూరెన్స్ చేయిస్తోంది. బాధిత కు టుంబాలు కోర్టుల్లో పోరాడి ఆర్టీసీ నుంచి పరిహారం పొందటం మినహా చేసేదేమీ లేకుండా పోతోంది. అద్దె బస్సుల్లో కెపాసిటీకి తగినట్లు ప్రయాణికులు వెళ్తేనే బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం 80నుంచి 100మందికి పైగా ప్రయాణిస్తుండగా ఏదైన ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సంస్థ చేతుతెల్తే అవకాశాలు లేకపోలేదని అద్దె బస్సుల యజమానులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు.ఏటా పెరుగుతున్న మరణాలుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో 630 ఆర్టీసీ, అద్దె బస్సులున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు ప్రయాణికులకు కనీసం ప్రథమ చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంది. 2021లో 44 ప్రమాదాలు జరగగా 15 మంది మృత్యువాత పడ్డారు. 2021–22లో 44 ప్రమాదాల్లో 25 మంది, 2022–23లో 43 ప్రమాదాల్లో 16 మంది, 2023–24లో 36 ప్రమాదాల్లో 16 మంది, 2024–25లో 46 ప్రమాదాల్లో 25మంది మృతి చెందారు. -
నేడు బడ్జెట్ సమావేశం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు కమి షనర్ అన్వేష్ తెలిపారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన కల్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై తిలకించారు. మందమర్రిలోని రామాలయంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, సరోజ దంపతులు, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మంచిర్యాలలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు తదితరులు పాల్గొన్నారు. -
సీవోఈ గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడో!
బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) గురుకుల కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేశారు. మెరిట్ వచ్చిన విద్యార్థులకు ప్రీమియర్ సీవోఈ గురుకుల కళాశాలల్లో సీటు లభించగా మిగతావారికి నాన్ ప్రీమియర్ సీవోఈ గురుకులాలు, సాధారణ గురుకులాల్లో ప్రవేశం పొందుతారు. కాగా, గతేడాది ప్రవేశ పరీక్షకు బదులు పదోతరగతి మార్కుల ప్రాతిపదికన అడ్మిషన్ కల్పించారు. దీంతో అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు రాణించలేక పోతున్నారనే అసంతృప్తి అధ్యాపకుల్లో ఉంది. అయితే, ఈసారి గతంలో మాదిరిగా ప్రవేశ ప్రకటన జారీ చేసి పోటీ పరీక్ష నిర్వహిస్తారా? లేక.. పదోతరగతి మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బాలబాలికలకు రెండు నాన్ ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి కేంద్రంగా బాలుర, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల గురుకుల సీవోఈ కళాశాలలు ప్రారంభించారు. సీవోఈ గురుకుల కళాశాలల విద్యార్థులు ఏటా జాతీయ, రారష్ట్రస్థాయి పోటీ పరీక్షలు రాసి ఐఐటీ, నీట్, నిట్, క్లాట్ తదితర అంశాలు, ఎంసెట్లో మెరుగైన ర్యాంక్లు తెచ్చుకుని ఇంజినీరింగ్, వ్యవసాయ తదితర కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. అయితే, ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం జారీ కాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇతర విద్యాసంస్థల్లో చేరుతున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఎస్సీ సంక్షేమ సాధారణ గురుకుల, సీవోఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాని పరిస్థితి ఉంది. ఏప్రిల్ మొదటివారంలో రావొచ్చు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలోని సీవోఈ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీనిపై గురుకుల విద్యాలయ సొసైటీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రవేశ ప్రకటన వస్తుందనే భరోసాతో ఉన్నాం. – రమాకళ్యాణి, డీసీవో, మంచిర్యాల -
బీమా చెక్కు అందజేత
శ్రీరాంపూర్: ప్రమాదవశాత్తు రెండు కాళ్లు కో ల్పోయిన ఎస్ఆర్పీ–1 గని ఉద్యోగి సాధం స త్యనారాయణకు రూ.కోటి బీమా చెక్కు అందించారు. కంపెనీకి యూనియన్ బ్యాంక్కు మ ధ్య ఉన్న బీమా సౌకర్యం ఒప్పందంలో భాగంగా మంజూరైన మొత్తం శుక్రవారం జీఎం కా ర్యాలయంలో జీఎం శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు ప్ర మాదవశాత్తు మృతి చెందితే.. వారు నేషనల్ బ్యాంకుల్లో వేతనాల ఖాతాలు కలిగి ఉంటే వా రికి రూ.కోటి 25లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. శాశ్వత వైకల్యానికి కూడా ఈ భారీ మొత్తం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఏరియా ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కా ర్యదర్శి కొమురయ్య, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ అధికారి అపర్ణారెడ్డి, జోనల్ అధికారి రవీంద్రబాబు, సీనియర్ పీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వలాభం కోసమే బడ్జెట్’
మంచిర్యాలటౌన్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, ఇది వారి స్వలాభం కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో మంచిర్యాల కార్పొరేషన్లో విలీనమైన మారుమూ ల ప్రాంతాల అభివృద్ధిని మరిచారని విమర్శించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీలో జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వర్క్ ఆర్డర్, వర్క్ ఎస్టిమేషన్ లేకుండా అభివృద్ధి పేరిట రోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారుల షెడ్లు కూల్చివేయడం దారుణమన్నారు. ఇటీవల బీజేపీలో గెలిచిన ప్రజాప్రతినిధులను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో ఆంక్షలు విధిస్తూ ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇ లాంటి చర్యలు మానుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, దుర్గం అశోక్, వెంకటేశ్వర్రావు, శ్రీదేవి, కమలాకర్రావు, పొన్నవేణి సదానందం, నాంపల్లి శ్రీనివాస్, తుమ్మేటి సరిత, గుర్రాల లావణ్య పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితుల అరెస్ట్
నిర్మల్ టౌన్: ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని శ్యామ్ఘడ్ సమీపంలో జరిగిన హత్య కేసును నిర్మల్ పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, గజానంద్ వీరంతా.. ఓ మహిళతో ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. విషయం బయటకు రావడంతో తిరుమల తనకే సొంతమని గజానంద్ భావించి మిగతా వారితో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 24న శ్రీనివాస్, వెంకటేశ్, రాజు కలిసి గజానంద్కు బాగా మద్యం తాగించారు. శ్యామ్ఘడ్ సమీపంలోని కోట వెనుక ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెలతోకొట్టి, బీరు సీసాలతో గాయపరిచి హత్య చేశారు. శవాన్ని నీటి గుంతలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతుడు గజానంద్ మేనత్త ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించి తిరుమల, శ్రీనివాస్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో వారినీ పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. టీటీడీ స్థలం ఆధ్యాత్మిక అవసరాలకు ఇవ్వాలిచెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధి పాత బస్టాండ్లోగల టీటీడీ స్థలాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు ఇవ్వాలని కోరుతూ.. శుక్రవారం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి హనుమాన్ భక్త మండలి సభ్యులు నూక శ్రీనివాస్, నడిపల్లి లక్ష్మణ్రావు వినతిపత్రం అందజేశారు. హనుమాన్ మంది రాల వద్ద స్థలం లేక జయంతి సందర్భంగా రో డ్డుపై అన్నదానం చేయాల్సి వస్తోందని తెలిపా రు. ఇందుకు మంత్రి సానుకులంగా స్పంది స్తూ.. సదరు స్థలాన్ని వెంటనే శుభ్రం చేయించి ఇవ్వాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తాన ని మంత్రి హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో హనుమాన్ భక్త మండలి సభ్యులు రెడ్డి మహేశ్, కొల్లూరి శంకర్ తదితరులున్నారు. -
‘జాతికుంట చెరువును అభివృద్ధి చేస్తాం’
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో రూ.1.56కోట్ల అంచనాతో జాతికుంట చెరువు సుందరీకరణ చేయబోతున్నామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం రడగంబాల బస్తీ పరిధిలోని జాతికుంట చెరువు సుందరీకరణ పనులకు అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ సుందరీకరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. చెరువు సుందరీకరణతో ఈప్రాంతం అందంగా తయారు కావడంతో పాటు పురప్రజల దృష్టిని ఆకర్శిస్తుందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, కౌన్సిలర్లు కంకటి ప్రణీత, కాంపల్లి రాజం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు రొడ్డ శారద, బస్తీవాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
వాంకిడి: మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా సకాలంలో స్పందించిన 108 సిబ్బంది అతడి ప్రాణాలు కాపాడా రు. 108 ఈఎంటీ ఎనగంటి ప్రవీణ్, పైలెట్ సా యి తెలిపిన వివరాల ప్రకారం.. ఇందాని గ్రా మానికి చెందిన దుర్గం వెంకటేశ్ అనే యువకు డు మద్యం మత్తులో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చే రుకున్న సిబ్బంది గొంతుకు కట్టు కట్టి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆసిఫాబాద్ ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. -
‘ఎస్పీ తీరును అసెంబ్లీలో ప్రస్తావిస్తా’
నిర్మల్ టౌన్: హిందువులపై ఎస్పీ జానకీ షర్మిల ప్రవర్తిస్తున్న తీరును అసెంబ్లీలో ప్రస్తావిస్తానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీరామ, హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎస్పీ జానకీ షర్మిల బాధ్యతలు తీసుకున్నాక హిందూ పండుగలపై వివక్ష కొనసాగుతోందని, ప్రతీ పండుగకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, హిందువులపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. హిందూ పండుగలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినుల మీద ఎస్పీ దురుసుగా మాట్లాడడం సరికాదని, ఎస్పీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్లో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్యుడిపై గురువారం జరిగిన దాడిని ఖండించారు. ఎస్పీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
సోలార్ కంచెల వరుస చోరీలు
వేమనపల్లి: మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ కంచె జట్కా మిషన్లను వరుసగా చోరీ చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి మండల కేంద్రానికి చెందిన పాలె శ్రీనివాస్కు చెందిన సుమారు రూ.12వేల విలువైన జట్కా మిషన్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు ప్రాణహిత వైపు ఆరెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సాగు చేశాడు. పంట రక్షణకు సోలార్ జట్కామిషన్తో కంచె ఏర్పాటు చేసుకున్నాడు. సోలార్ దొంగతనం చేసిన వ్యక్తులు అక్కడే మందు సేవించి ఖాళీ సీసాలు వదిలి వెళ్లారు. మూడు నెలల వ్యవధిలో మండల కేంద్రంలో పోటు వెంకటయ్య, ఎల్లెల గోపాల్, రామగిరి సాయి, రమేశ్రెడ్డి జట్కా మిషన్లు చోరీకి గురయ్యాయి. అలాగే, నాగారంలో మూడు, ఒడ్డుగూడెంలో రెండు, నీల్వాయిలో రెండు, గొర్లపల్లిలో రెండు.. జట్కా మిషన్లు ఎత్తుకెళ్లారు. వీటిని చిల్లర దొంగలు ఎత్తుకెళ్తున్నారా? లేదా.. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు చోరీ చేస్తున్నారా? అనేది అంతుచిక్కటం లేదు. బాధితులు కొందరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా అనుమానితుల ఆచూకీ దొరకటం సవాల్గా మారింది. -
అతివేగం.. అనర్థం
మంచిర్యాలక్రైం: వాహనదారులు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే ప్రయత్నంలో రహదారి నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ నియంత్రణ కోల్పోతున్నారు. ప్రమాదాలను పసిగట్టలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జాతీయ రహదారులపై వేగ పరిమితి గంటకు 80కిలో మీటర్లు ఉండగా చాలామంది 100–130 వేగంతో వాహనాలు నడుపుతున్నారు. జిల్లాలో గతేడాది 429 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 136 మంది మృతి చెందగా, 435 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు, డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించండి.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండంటూ.. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఎదురుగా వచ్చేవారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఉంది. అతి వేగం.. మద్యం మత్తు అతి వేగం, మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని అంచనా వేయలేక పోతున్నారు. ముందున్న వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించే క్రమంలో సడెన్గా బ్రేకులు వేస్తుండడంతో అదుపు తప్పి వాహనాలు బోల్తా పడుతున్నాయి. వేగంపై అంచ నా లేకపోవడంతో వాహనదారులు ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొడుతున్నారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవర్లు నియంత్రణ కోల్పోతుండడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపకూడదన్న నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణాలివే.. ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇటీవల రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ క్షేత్రస్థాయిలో ప్రమాదాలు జరిగిన స్థలాలను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్లు, ఓనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. -
బిలోలిలో ‘కుస్తీమే సవాల్’
లోకేశ్వరం: ఓ వైపు ఉప్పొంగే పౌరుషం.. మరోవైపు ఈలలు, కేకలతో ప్రోత్సహించే యువతరం.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ మట్టికరిపించే విన్యాసం.. ఇవన్నీ ప్రేక్షకుల కాలు కదపనివ్వకుండా ఆసాంతం నిలబడి ఆస్వాదించేలా మల్లయోధులు కుస్తీలో తలపడ్డారు. మండలంలోని బిలోలి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తానూర్, ముథోల్, లోకేశ్వరం మండలాలతోపాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నాందేడ్ జిల్లా అర్ధపూర్ గ్రామానికి చెందిన సతీశ్యాదవ్ అనే మల్లయోధుడు ప్రథమ స్థానంలో నిలువగా వీడీసీ సభ్యులు రూ.8,016 నగదు బహుమతి అందజేశారు. విజేతలకు రూ.100 నుంచి రూ.8వేల వరకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు మండలంలోని హవర్గ, సాత్గాం, హథ్గాం, లోకేశ్వరం తదితర గ్రామాల ప్రజలు వచ్చారు. ఎల్వోసీ అందజేతశ్రీరాంపూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 31వ డివిజన్కు చెందిన పీ లక్ష్మి వైద్యఖర్చుల నిమిత్తం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు రూ.2.50లక్షల మొత్తానికి ఎల్వోసీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం తన నివాసంలో అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ్ల సంపత్రెడ్డి, నాయకుడు బుద్ది మహేశ్ పాల్గొన్నారు. -
నేరడిగొండలో బంగారం చోరీ
నేరడిగొండ: మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ జరగగా పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జాదవ్ భీంరావు ఇంట్లో లేని సమయం చూసి గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడ్డారు. ఇంట్లోని ఐదు తులాల బంగారం, రూ.10వేల నగదు అపహరించుకుపోయారు. చోరీ జరిగినట్లు తెలుసుకున్న బాధితుడు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో లభించిన సీసీ టీవీ ఫుటేజీలను ఎస్సై క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దావుల సుమన్, భోగి శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తామే చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చోరీకి గురైన సొత్తులో రూ.7.20లక్షలు రికవరీ చేశామని తెలిపారు. త్వరగా కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దుర్మరణం
ఇచ్చోడ: మండలంలోని తలమద్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అక్కెపెల్లి లక్ష్మణ్ (54) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ ఉదయం నిర్మల్ నుంచి ఇచ్చోడకు కారులో వస్తుండగా కుప్టిఘాట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని కుంటుంబ సభ్యులు వెంటనే ఇచ్చోడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం నిర్మల్లోని పైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్లో చురుకుగా పనిచేస్తున్న లక్ష్మణ్ వారంక్రితం పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. లక్ష్మణ్ మృతి చెందడంతో మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఇచ్చోడ సర్పంచ్ జలైజాకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంజేశారు. చెరువులో పడి వృద్ధుడి మృతిబెల్లంపల్లి: బెల్లంపల్లి పోశమ్మ చెరువులోపడి బూడిదగడ్డ బస్తీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకా రం.. కూలీ పనులు చేసుకుని జీవించే శీలం రాజం (65) కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం లేక తిరుగుతున్నాడు. ఈనెల 25న ఉదయం 5గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పోశమ్మ చెరువు వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి శుక్రవారం పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. మృతుడి కొడుకు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 30న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూ ల్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని జెడ్పీ బా లుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి గుర్రాల హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే https:// tgss. telangana. gov. in ద్వారా రిజి స్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నా రు. నాలుగో తరగతిలో ప్రవేశం కోసం ఎనిమిదేళ్లలోపు (01.09.2017 నుంచి 31.08.2018 మధ్యలో జన్మించాలి) ఉండాలని తెలిపారు. మూడోతరగతి పూర్తి చేసుకుని నాలుగో తరగతి చదువబోతున్న విద్యార్థులే అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ ప్రతులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం, ప్రస్తుత పాఠశాల నుంచి వయస్సు, స్టడీ సర్టిఫికెట్, తహసీల్దార్/పంచాయతీ/మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి జనన నమోదు ధ్రువీకరణ పత్రం, మూడోతరగతి పురోగతి నివేది కల కాపీలు, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయి ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6 గీ10 మీటర్ షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఒక కేజీ మెడిసిన్ బాల్ఫుట్, 800 మీటర్ల రన్, మెడికల్ టెస్ట్ (ఏజ్ వెరిఫికేషన్) ఉంటుందని తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరటరామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ వారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు హాజరై సంతకం చేయాలన్న షరతును హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్యేకు ఊరట లభించింది. -
ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి
దండేపల్లి: మండల కేంద్రమైన దండేపల్లిలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. దండేపల్లి గ్రామానికి చెందిన 110మంది ఉపాధి కూలీలు గురువారం ఉదయం దండేపల్లి అడవిలో అటవీ ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లారు. పనులు చేపట్టిన కొద్దిసేపటికే కూలీలపై తేనేటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు. 20మందిపై దాడి చేయడంతో 108అంబులెన్స్లో దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న జిల్లపెల్లి గంగ, శశికుమార్, చీపిరిశెట్టి సత్తన్న, పద్మ, భీమోజు సుజాతలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
డ్రైవర్లకు మెరుగైన చూపు అవసరం
చెన్నూర్: ప్రతీ డ్రైవర్కు మెరుగైన కంటి చూపు అవసరమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కంటి చూపే కీలకమని అన్నారు. 150 మందికి పరీక్షలు నిర్వహించి 24 మందికి కళ్లద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఐదుగురిని కంటి శస్త్రచికిత్సకు ఎంపిక చేశామని తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు బన్సీలాల్, కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీ భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు పరిశీలించిన తర్వాత ఫిర్యాదులపై ఎస్సై రాజేందర్ను అడిగి తెలుసుకున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు. ఇంధనంపై గందరగోళం సృష్టిస్తే చర్యలు మంచిర్యాలక్రైం: ఇంధనం కొరత ఉందంటూ గందరగోళం సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇంధనం కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ముందస్తుగా వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించడం, క్యాన్లలో తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయడం చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ ఇళ్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
క్రీడా పాఠశాల ఏర్పాటుతో సత్ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ పరిధిలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఏర్పాటుతో ఫలితాలు సాధిస్తున్నామని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ అన్నారు. ఉట్నూర్ కొమురం భీమ్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ఎంపిక కోసం వివిధ క్రీడాపోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించారని తెలిపారు. ఏపీవో (పీవీటీజీ) భాస్కర్, ఏజెన్సీ డిప్యూటీ ఈవో గొడం చందన్, జిల్లా గిరిజన క్రీడల అధికారి కె.పార్థసారథి, ఏటీడీవో సదానందం, ప్రధానోపాధ్యాయులు ఉత్తం, శ్రీనివాస్, రవీందర్, శిక్షకులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
దండేపల్లి: చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మత్స్యకారుడు మృతిచెంది నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం..మండలంలోని పెద్దపేటకు చెందిన మత్స్యకారుడు నర్ముల లింగయ్య(64) బుధవారం తోటి మత్స్యకారులతో కలిసి గ్రామంలోని ఎర్రకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో కుంటలో చేపలకు విసిరిన వల నీ టిలో పిచ్చిమొక్కలకు తట్టుకు ంది. దాన్ని బయటకు లాగే క్ర మంలో నీటిలో బోల్తాపడిపోయాడు. గమనించిన తోటి మ త్స్యకారులు అతన్ని బయట కు తీసేసరికి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దు చేయాలి
నిర్మల్చైన్గేట్: కేంద్రప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసి లింగన్న అన్నారు. బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్ల సంఘ భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వి నతిపత్రం అందజేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా బాధ్యులు లోలం గంగన్న, డాక్టర్ నాగేశ్వరరావు, కరీం, కూన పోశెట్టి, డాక్టర్ రజిని, రామాగౌడ్, రాజేశ్వర్, యూనిట్ బాధ్యులు రమేశ్, జనార్దన్, బాలకిషన్, జగదీశ్వర్, రాములు, బొడ్డు లక్ష్మణ్, జాప రాములు, పోతన్న, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
స్వగ్రామానికి మృతదేహాన్ని రప్పించాలి
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లికి చెందిన కందుకూరి రాజేశ్వర్(54) బహ్రెయిన్లో గత ఫిబ్రవరి 26న గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయింది. మృతదేహాం స్వగ్రామానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోంది. స్వగ్రామానికి వెంటనే తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎన్ఆర్ఐ కమిటీ రాష్ట్ర సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల ఇప్పటికే ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర్ (పి.బి.ఎస్.కే)కు ఈ–మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ విభాగానికి మరోసారి వివరాలు పంపి ప్రయత్నాలు చేపట్టారు. అతడు కూలీగా పనిచేస్తున్న అర్దోస్ కాట్రాక్టింగ్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ, రాయబార కార్యాలయ అధికారులు దహన సంస్కారాలు బహ్రెయిన్లో చేయమని కుటుంబీకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ పుష్ప, రాష్ట్ర సభ్యులకు తెలుపగా బుధవారం స్వదేశ్, ఉప సర్పంచ్ విద్య సాగర్రెడ్డి, న్యాయవాది ఫసియొద్దీన్ కుటుంబ సభ్యులను కలిసి మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వదేశ్..ఎన్ఆర్ఐ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్రెడ్డి ద్వారాసీఎం రేంవత్రెడ్డిని కలిసి విన్నవిస్తామని తెలిపారు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
నర్సాపూర్(జి): మహిళా (నారీశక్తి) పోలీసుల చొరవతో మండల కేంద్రంలోని వారసంతలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. జిల్లా కేంద్రంలోని గొల్లపేట్కు చెందిన సంగీత తన నాలుగేళ్ల కుమారుడు సిద్దూతో కలిసి బుధవారం నర్సాపూర్ (జి)లోని బంధువుల ఇంటికి వచ్చింది. తల్లితో కలిసి వారసంతకు రాగా, బాలుడు తప్పిపోయాడు. నారీశక్తిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు షహన భాను, వినితకు బాలుడు ఏడుస్తూ కనిపించాడు. అతడితో మాట్లాడి తల్లి కోసం వెతికిన దొరకలేదు. బాలుడిని పోలీస్స్టేషన్ తీసుకెళ్లి ఆహారం అందించారు. బాలుడి ఆచూకీ తెలుసుకున్న తల్లి పోలీస్స్టేషన్కు రాగా, అతన్ని అప్పగించారు. ఎస్పీ జానకి షర్మిల ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు. -
తమ్ముడిపై దాడి చేసిన అన్న అరెస్ట్
చెన్నూర్రూరల్: భూతగాదాల కారణంగా తమ్ముడిపై దాడి చేసిన అన్న, అతని కుమారులను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెన్నూర్ సీఐ బన్సీలాల్ తెలిపారు. చెన్నూర్ పోలీస్స్టేషన్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన జోగురు లక్ష్మిమల్లు, రాజయ్య అన్నదమ్ములు. వారి తాతలకు చెందిన భూమిలో వాటాల కోసం గతంలో పంచాయితీలు జరిగాయి. బుధవారం ఈ విషయమై వీరి కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తన కుమారులతో కలిసి లక్ష్మి మల్లు గొడ్డలి, కర్రలతో రాజయ్యపై దాడి చేశారు. తీవ్రగాయాలైన రాజయ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజయ్య కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్య నుంచి తహసీల్దార్ మల్లికార్జున్, ఎస్సై సుబ్బారావు వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నిందితులు జోగురు లక్ష్మిమల్లు, కుమారులు సమ్మయ్య, రవిలను అంగ్రాజ్పల్లి సమీపంలో అరెస్టు చేశారు. వారి నుంచి గొడ్డలి, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై శ్యామ్పటేల్, పోలీసులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని శ్యాంఘడ్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరైన హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్యాంఘడ్ కోట వెనకాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని కిన్వట్కు చెందిన పోలే గజానంద్ (36)గా గుర్తించారు. గత పదేళ్ల నుంచి నిర్మల్లో ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ జీనవం సాగిస్తున్నాడు. భార్య వదిలివేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో శ్యాంఘడ్ కోట వద్ద ముఖంపై గాయాలు, రక్తంతో ఉండడంతో ఎవరైన హత్య చేసి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. సారంగపూర్: వరి పొలం గట్లపై గడ్డి కోస్తున్న యువకుడు మూర్చ వ్యాధితో మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన మొగలి రాము(28) మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం పశువుల మేతకోసం గడ్డి కోసుకుని వచ్చేందుకు గ్రామ శివారు వరిపొలాల వద్దకు వెళ్లాడు. పొలం గట్లపై గడ్డి కోస్తుండగా మూర్చవ్యాధి రావడంతో పక్కనే బురదలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాము కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతికారు. బుధవారం పంటపొలంలో పడి మృతిచెందినట్లు రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. భార్య రూప ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తాంసి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాంసి ఆర్ఐ సంతోశ్ చికిత్సపొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం కరంజి(టి) కి చెందిన ఎం.సంతోశ్(49) తాంసి తహసీల్దార్ కా ర్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 21న సొంత పని నిమిత్తం బైక్పై మహారాష్ట్రలోని యావత్మాల్కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా పిప్పల్కోటి సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. సంతోశ్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు అతన్ని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహన్ని మహారాష్ట్రలోకి పాండ్రకవడ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేశారు. కరంజి(టి)లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాక్పల్లికి చెందిన ఒకరు.. నర్సాపూర్(జి): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక రు మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని చాక్పల్లికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ (40) తన భార్య కౌసర్తో తరచూ గొడవపడేవాడు. భార్య రెండేళ్ల క్రితం ఇద్దరు కుమారులతో పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఇస్మాయిల్ మద్యం మత్తులో కిందపడడంతో చెవికి గాయమైంది. చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి మలన్ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది
భైంసా: రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతితోపాటు తత్సమాన పరీక్షల్లో రెగ్యులర్గా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం క్యాంపస్ నోటిఫికేషన్ వెలువరించింది. బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు రాసేవారు హాల్టికెట్ల, మొబైల్ నంబర్, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో విడుదలకానున్న పది ఫలితాల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను సీట్లు భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు. ప్రవేశ అర్హతలు.. విద్యార్థులు తొలి ప్రయత్నంలో పదో తరగతి, తత్సమాన పరీక్షలో రెగ్యులర్ ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్ 31, 2026 లోపు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక సీట్ల కింద దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు ఎస్సీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ విద్యార్థులకు గల్ప్దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. తెలంగాణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబంధించి రూ.3500 ఇతరులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3 వేలు చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజి ట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2 వేలు చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసేవారి పిల్లలు ఏడాదికి రూ.1.38 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. మార్కులు సమానమైతే.. ట్రిపుల్ ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల మార్కులు సమానమైతే వరసగా గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ ఫస్ట్ లాంగ్వేజ్లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రసీదు, పదో తరగతి హాల్టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువవీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతోపాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్టాప్లు ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. బాసర ట్రిపుల్ఐటీ ప్రవేశాల షెడ్యూల్.. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ సేవ, మీ సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలతో ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1500 చెల్లించాలి. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణలోకి తీసుకుంటారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ https:// www. rgukt. ac. in/ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
మారుతోంది భో‘జనం’
నెన్నెల: బాబు బగర్ చక్కెర చాయ్ ఇవ్వు..జొన్న రొట్టె ఉందా... చపాతీ ఇవ్వండి..రాగిజావ కావాలి..నానా ఈ దోశ వెయ్యి.. ఇవీ ఇటీవల హోటళ్లు, కర్రీ పాయింట్ల వద్ద వినిపిస్తున్న మాటలు. నిత్యావసర దుకాణాలకు వెళ్తే ముందుగా డ్రైప్రూట్లు, మిల్లెట్లు, శనిగలు, పెసర్లు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు. షుగర్, బీపీ, గుండె సంబంధిత బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు నగరాలనే కలవరపెట్టిన వ్యాధులు కరోనా తర్వాత క్రమంగా గ్రామాలకు విస్తరించాయి. వీటిన బారినపడకుండా ఆహారంపై నియంత్రణ పాటిస్తున్నారు. పాత తరహా ఆహారపు అలవాట్లకు మళ్లుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు చిరుధాన్యాలు, జొన్నరొట్టెల వైపు మొగ్గుచూపుతుండటంతో రోడ్ల పక్కనే రొట్టెల విక్రయ కేంద్రాలు, కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. వ్యాధిగ్రస్తులతోపాటు 30 ఏళ్లు దాటిన వారు ఆహారపట్టికలో మార్పులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒకపూట అన్నం తింటూ ఉదయం, సాయంత్రం చపాతీ, జొన్నరొట్ట, మక్క గట్కా, రాగిజావ ఉండేలా చూసుకుంటున్నారు. వందలో నలుగురు బెల్లంపల్లికి చెందిన ఓ వైద్యుడి వద్దకు నిత్యం 80 నుంచి 100 మంది రోగులు వైద్యపరీక్షల కోసం వస్తున్నారు. వీరిలో కొత్తగా నలుగురైదుగురు మధుమేహ, రక్తపోటు బారినవారు ఉంటున్నారు. గతంలో 70 ఏళ్లు పైబడిన వారికే బీపీ, షుగర్ వచ్చేవి. ప్రస్తుతం 30–50 ఏళ్ల మధ్య వారే 50 శాతం ఉంటున్నారు. ప్రతీ వందమంది వ్యాధిగ్రస్తుల్లో 15 మంది కచ్చితమైన ఆరోగ్య నిమయాలు పాటిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతీ వందమందిలో 40 మంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్లో ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంటే ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఇవి మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. -
పండోక్న మహాభారత్ కథ పుస్తకావిష్కరణ
ఆదిలాబాద్రూరల్: ఢిల్లీలో నిర్వహిస్తున్న 10వ జాతీయ జనజాతి, లోక్ సంస్కృతి సాహిత్య ఉత్సవంలో బుధవారం మావల మండలం వాఘాపూర్కు చెందిన తొడసం కై లాష్ మాస్టర్ దేవనాగరి లిపిలో రాసిన పండోక్న మహాభారత్ కథ పుస్తకాన్ని కేంద్రమంత్రి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కై లాష్ మాట్లాడుతూ మహాభారతంలో తాను 2024లో తెలుగు లిపితో గోండిభాషలో ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని కొందరు హిందీ లిపిలో రాస్తే మాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. రెండు నెలల్లో తెలుగు లిపిలో ఉన్న ఈ పండోక్న మహాభారత్ కథ పుస్తకాన్ని దేవనాగరి హిందీ లిపిలో కన్వర్ట్ చేసినట్లు తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఈ పుస్తకం అందుబాటులో ఉందన్నారు. గోండిభాషలో అమెజాన్ విడుదలైన తొలి పుస్తకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్–కళానిధి విభాగం ఢిల్లీ, ఇంది రాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం భోపాల్తో సంయుక్తంగా కార్యక్రమం కొనసాగింది. జిల్లా రచయితలు డాక్టర్ మెస్రం మనోహర్, జాదవ్ ఇందల్ సింగ్, తొడసం దేవ్రావ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై గోపి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్లకు చెందిన బండారి శ్రీను (36) మంగళవారం రాత్రి గ్రామ శివారు వద్ద కుంచెపు నానితో ఉన్నారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆమ్లె వెంకటేశ్, శంకర్ బైక్పై అతివేగంగా వచ్చి శ్రీనును ఢీకొట్టారు. ఆమ్లె వెంకటేశ్, శంకర్ స్వల్పంగా, శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం శ్రీను మృతిచెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘పది’ జవాబు పత్రాల మూల్యాంకనం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే జవాబు పత్రాలు మూల్యాంకనానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. సీబీఎస్ఈ తరహాలో పరీక్షల నిర్వహణతో ఎనిమిది పేపర్ల పరీక్షలు 33 రోజుల వ్యవధిలో పూర్తి కానున్నాయి. అయినప్పటికీ పరీక్ష ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. పరీక్షలు పూర్తయ్యే నాటికి మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28నుంచి కోడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ ఒకటి నుంచి 23వరకు మంచిర్యాలలోని కార్మెల్ హైస్కూల్ వేదికగా మూల్యాంకనం చేస్తారు. ఈ కేంద్రాన్ని పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మల్లేశంతో కలిసి డీఈవో యాదయ్య బుధవారం పరిశీలించారు. జిల్లాకు చేరిక.. ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. గతేడాది 1.20లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయగా ఈ ఏడాది ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బెండలు జిల్లాకు వచ్చాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు వస్తేనే పూర్తి లెక్క తేలనుంది. పటిష్టమైన భద్రత మధ్య ఏడు సబ్జెక్టుల్లో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్రక్రి య, స్పాట్ వాల్యూయేషన్ చర్యలు చేపట్టారు.. మూడు దఫాల్లో.. ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు ఉపాధ్యాయులు జవాబుపత్రాలు దిద్దనున్నారు. ఈ ఏడాది మూడు దఫాల్లో మూల్యాంకనం చేయనున్నారు. మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి 9వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, రెండో విడత 10 నుంచి 17వరకు ఫిజికల్సైన్స్, బయోసైన్స్, మూడో విడత ఏప్రిల్ 17నుంచి 23వరకు సోషల్ సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సాగనుంది. అవసరమైన ఆయా సబ్జెక్టుల వారీగా టీచర్లకు విధులు కేటాయించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరిన జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్లో రూమ్లో భద్రపర్చారు. -
క్యాతనపల్లిలో ఎన్నికలు నిర్వహించాలి
● ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రామకృష్ణాపూర్: హైకోర్టు తీర్పును అనుసరించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా బుధవారం ఆమె రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు హాజరై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను రెండుసార్లు వాయిదా వేయడం సరికాదని, ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, రామిడి కుమార్, తిరుపతిరెడ్డి, మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పుష్కర’ పనులకు సన్నద్ధం
చెన్నూర్: జిల్లాలో గోదావరి నది పుష్కరాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.500 కోట్లు కేటాయించింది. జిల్లాలో వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పుష్కర పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చెన్నూర్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కరఘాట్లు, వాహనాల పార్కింగ్, పోలీ సు కంట్రోల్ రూమ్లు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే షెడ్లు, వీఐపీ పార్కింగ్ కోసం డీపీఆర్ సిద్ధమైంది. భక్తుల సౌకర్యార్థం రోడ్లు, ఇతర ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతోపాటు జిల్లాలో జరిగే పుష్కరాల కోసం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నదికి ప్రాముఖ్యత చెన్నూర్ గోదావరి నది పుష్కరాలకు ప్రాముఖ్యత ఉంది. గోదావరి నది కాశీ అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాశీలోని గంగానది ఉత్తర దిశగా రెండు మైళ్లు ప్రవహిస్తుంది. చెన్నూర్ గోదావరి ఉత్తర దిశగా ఐదు మైళ్లు ప్రవహిస్తుండడంతో పంచక్రోశ ఉత్తరవాహిని నదిగా పేరుంది. చెన్నూర్ గోదావరి నదిలో పిండ ప్రదా నాలు చేస్తే కాశీ నదిలో చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పుష్కర స్నానాలు ఆచరణకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తోపాటు కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత పుష్కరాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ సమయంలో జాతీయ రహదారి లేకపోవడంతోపాటు సిరోంచ ప్రాణహిత నది వంతెన పూర్తి కాలేదు. అయినప్పటికీ సుమారు 80 వేల నుంచి లక్షా మంది భక్తులు వచ్చినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనే లక్షా మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. చెన్నూర్ నియోజకవర్గంలోనే 2 లక్షల పైగా జనాభా ఉంది. ప్రస్తుతం జాతీయ రహదారితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది చెన్నూర్ గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెన్నూర్తోపాటు మండలంలోని సుందరశాల, జైపూర్, మందమర్రి, మంచిర్యాల గోదావ రి నదులతో కలిసి సుమారు జిల్లాలో పది లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలు లేకపోలేదు. అధికార యంత్రాంగం రానున్న పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. -
ఆసుపత్రిలో భయం భయం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) భవనం శిథిలావస్థకు చేరింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, సహాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడపాల్సి వస్తోంది. నిత్యం 400కు పైగా ఓపీ సేవల కోసం రోగులు వస్తుండగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే వారు 200 మంది వరకు ఉంటారు. వైద్యులు, సిబ్బంది మరో 200 మంది వరకు విధులు నిర్వర్తిస్తుండగా.. పారిశుద్ధ్య సిబ్బంది, వాచ్మెన్ ఇతరత్రా సిబ్బంది 150 మంది ఉంటారు. రోగులతో వచ్చే సహాయకులు 500 మంది వరకు ఉండగా.. నిత్యం ఆస్పత్రిలోని వార్డులు, వరండా కిటకిటలాడుతుంటాయి. అరకొర వసతులతోనే కొన్నేళ్లుగా ఆస్పత్రి నిర్వహణ ఉండగా.. మూత్రశాలలు సక్రమంగా లేక, ఉన్నవాటినే రోగులు, సహాయకులు వినియోగిస్తున్నారు. బుధవారం ఓ రోగి సహాయకురాలిగా వచ్చిన మహిళ మూత్రశాలలో ఉన్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులూడి పడడంతో గాయాలయ్యాయి. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో నూతన భవనంలోకి..మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో నూతన భవనంలోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరి స్లాబు పెచ్చులూడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కొనసాగిస్తున్నాం. – డాక్టర్ వేదవ్యాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
సరఫరాలో జాప్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ఎల్పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కొరత ఫుడ్ బిజినెస్ చేసే వారిని వేధిస్తోంది. మరోవైపు పెట్రోల్ బంక్ల్లోనూ బుధవారం ఇంధన నిల్వలు లేవంటూ వచ్చిన వదంతులతో వినియోగదారులు తిప్పలు పడాల్సి వస్తోంది. ఎక్కడా స్టాక్ నిల్వల్లో సమస్యలు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎల్పీజీ సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఇప్పటికే రోజువారీగా వంటలకాలపై ప్రభావం పడుతోంది. మరోవైపు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ తిప్పలు పడుతున్నారు. గ్యాస్పై సులువుగా చేసే వంటలు కట్టెల పొయ్యి కారణంగా ఆలస్యం అవుతున్నాయి. ధరలపై ప్రభావం గ్యాస్ ధరలకు తోడు నిత్యావసరాలైన నూనె, పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధానంగా ఫుడ్ బిజినెస్పై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే స్వీట్లు, హోటళ్లలో టిఫిన్స్, భోజనంలో కూరలు తగ్గించేశారు. హోటళ్లలో మెనూలో కూరలు, ప్రత్యేక వంటకాలు తగ్గాయి. ఇంతకుముందు పలు హోటళ్లలో భోజనంలో ఇచ్చిన రకాలు ప్రస్తుతం వినియోగదారులకు ఇవ్వడం లేదు. ఇక ప్రభుత్వ హాస్టళ్లు, ఆస్పత్రుల్లో భోజనాలకు ఇబ్బంది కలుగకుండా సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. వార్షిక పరీక్షలు రాసే వరకు హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి సెలవులు ఇచ్చే వరకు సరఫరా కొనసాగించనున్నారు. వదంతులతో ఇబ్బందులు యుద్ధం కారణంగా ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడంతో పెద్దయెత్తున వాహనదారులు తరలివస్తున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పలు బంకుల్లో బారులు తీరారు. పెట్రోల్ బంక్ల్లో కొరత లేదని ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు చెబుతున్నారు. గతంలో కంపెనీల డిపోల్లో అరువు తెచ్చుకుని పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం నగదు చెల్లింపులకే ఇవ్వడంతో డీలర్లకు ఇబ్బందులు వస్తున్నాయి. నగదు సర్దుబాటు కాని పెట్రోల్ బంక్ల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. కాగా, జిల్లాలో ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.బ్లాక్ మార్కెట్లో విక్రయాలుజిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో హోటళ్ల యజమానులకు సిలిండర్ల డిమాండ్తో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఒక్కో సిలిండర్ను బ్లాక్లో రూ.500 అధిక ధరకు విక్రయిస్తున్నారు. మరోవైపు సొంత అవసరాలకు వాడే కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ అమ్ముతున్నారు. గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్గా వాడితే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారుల తనిఖీల్లో 85 సిలిండర్లు పట్టుబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 15వరకు 6ఏ కేసులు నమోదు చేశారు. ఇంకా ఫిర్యాదులు వచ్చిన చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.ఎల్పీజీ సరఫరాలో జాప్యంతో ఇప్పటికే నిల్వ తగ్గుతోంది. రోజువారీగా గృహావసర సిలిండర్లు ఇప్పటివరకు జిల్లాలో నాలుగు వేలకు పైగా బుకింగ్ నమోదవుతోంది. వీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఒక్కోరోజు సగటున 3800 నుంచి 3,900 సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. మిగతా సుమారు 200 వరకు కొరత ఏర్పడుతోంది. -
బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్రావు, బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్తో కలిసి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు, పరిష్కారం బాధితులకు న్యాయం అంశాలపై సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ దండేపల్లిలోని పీవీ టీజీ, తాండూర్లో ఎస్టీ వసతిగృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అందరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. 2023 డిసెంబర్ వరకు నమోదైన అట్రాసిటీ కేసుల్లో బాధితులకు గత సంవత్సరం రూ.1.34 కోట్లు నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ 2025లో 117 అట్రాసిటీ కేసులు న మోదు అయ్యాయని, కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపా రు. ఈ సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, కిరణ్కుమార్, వెంకటేశ్వర్లు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గప్రసాద్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నారాయణ, ఎల్లయ్య, రాజన్న, డీపీఆర్వో కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘డిగ్రీ’లో ఎఫ్ఆర్ఎస్ హాజరు
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి కళాశాల విద్యాశాఖ అమలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు(ఎఫ్ఆర్ఎస్) ప్రారంభమైంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చింది. కళాశాల హాజరు ప్రక్రియను సులభతరం చేసేందుకు నిర్ణయించింది. డిజిటల్ హాజరు, పారదర్శకత, సులభంగా యాక్సెస్ కానుంది. విద్యార్థుల హాజరు పరిశీలించడానికి, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు ఎఫ్ఆర్ఎస్ హాజరు దోహదం చేయనుంది. అధునాతన సాంకేతిక టెక్నాలజీ (ఏఐ) ఉపయోగించి విద్యార్థులను నమో దు చేస్తున్నారు. మొదట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్తో విద్యార్థుల హాజరు నమోదు చేసిన తర్వాత ప్రైవేటులోనూ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అమలుతో.. డిగ్రీ విద్యార్థులు నిజంగా తరగతులకు వచ్చే వారెందరో ఇట్టే తెలిసిపోనుంది. మాన్యువల్ అటెండెన్స్ తీసే అవసరం ఉండదు. టీచర్లు బోధనపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అనధికార వ్యక్తుల ప్రవేశం తగ్గుతుంది. విద్యార్థులు సక్రమంగా రావాల్సి ఉంటుంది. 75శాతం హాజరు ఉంటేనే విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంటుకు అవకాశం ఉటుంది. లేదంటే బీకాం విద్యార్థులు రూ.6,300, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ విద్యార్థులు రూ.4,350, బీఏ విద్యార్థులు రూ.3,350 చెల్లించాల్సి ఉంటుంది. హాజరు శాతం(75శాతం కంటే) ఏమాత్రం తగ్గినా ప్రైవేట్ డిగ్రీ విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తే ఫీజులు కోర్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు, హాజరు ప్రక్రియ సాగుతోంది. వచ్చే వి ద్యాసంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు కానుంది.విద్యార్థులు ఇలా..కళాశాల ప్రథమ ద్వితీయ తృతీయ మంచిర్యాల 196 115 106 చెన్నూర్ 231 146 144 లక్సెట్టిపేట 246 356 434 బెల్లంపల్లి 202 239 186ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో.. ప్రయోగాత్మకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేసి తర్వాత ప్రైవేట్లో ముఖ ఆధారిత హాజరు ప్రవేశ పెట్టనున్నారు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో 417 మంది విద్యార్థులు, చెన్నూర్లో 521మంది, బెల్లంపల్లిలో 627 మంది, లక్సెట్టిపేటలో 1038మంది ఉన్నారు. వీరందరికి ఎఫ్ఆర్ఎస్ అమలు చేయనున్నారు. -
పెట్రోల్ బంకుల్లో బారులు
మంచిర్యాలఅగ్రికల్చర్: పెట్రోల్ కొరత వదంతులతో బుధవారం పలుచోట్ల బంక్ల్లో వినియోగదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడంతో మిగతా చోట్ల ఎగబడ్డారు. కొందరు మోటారుసైకిళ్లు, కార్లలో ఐదు లీటర్ల నుంచి 20లీటర్ల వరకు పోయించుకున్నారు. మరికొందరు వ్యాపారులు పెట్రోల్, డీజిల్ క్యాన్లలో 50 నుంచి వంద లీటర్లు విక్రయించారు. లీటర్కు అదనంగా రూ.30 నుంచి రూ.50వరకు గల్లీల్లో వాహనదారులకు విక్రయిస్తున్నారు. పెట్రోలియం చట్టం 1934 ప్రకారం క్యాన్లు, ఇతరత్రా డబ్బాల్లో వందల లీటర్లు నింపుకోవడం నేరం.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉదయం నుంచే బారులు జిల్లాలో 78 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. ఒక్కో బంక్లో 4వేల నుంచి 10వేల లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఉంటాయి. ఈ లెక్కన నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల వరకు విక్రయిస్తారు. 20వరకు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. లభించిన చోట వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. బుధవారం ఒక్క రోజే 5.5లక్షల లీటర్లు విక్రయించడం గమనార్హం. కొరత వదంతులతోనే విక్రయాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదు..జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. వదంతులు నమ్మొద్దు. అవసరాల మేరకు బంకుల్లో ఉంది. కొన్ని బంక్లు పాత బకాయిలు చెల్లింపు చేయనందున వాళ్లకు మాత్రమే పెట్రోల్, డీజిల్ ఇంధన కంపెనీ నుంచి ఇవ్వడం లేదు. అంతర్గత సమస్యలు, అలాంటి వాటి వద్ద మాత్రమే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. క్యాన్లలో నింపుతున్నట్లు మా దృష్టికి వస్తే ఆ బంక్లపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) -
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
పాతమంచిర్యాల: ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, విద్యుత్ బస్సుల ను ఆర్టీసీకే ఇవ్వాలని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిందని, పెరిగిన అవసరాల మేరకు బస్సులు, కార్మికుల సంఖ్య పెరగలేదని తెలిపారు. విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు, కార్మి కుల సంఖ్య పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాసు, గోమాస ప్రకాష్, రబీయా, కుమరస్వామి, సంతోష్, సాగర్రెడ్డి పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఇంద్రవెల్లి/బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలోని ఇన్కార్గూడలో షేక్ జాకీర్, రేఖాబాయి, అనిల్రెడ్డితో పాటు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్యార్డులో కంది పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బజార్హత్నూర్లో సల్ల ముత్తన్న, సల్ల సాయికి చెందిన మొక్కజొన్నపంట నేలకొరిగింది. కొలారిలో బుర్కులే నిర్మల, సల్ల రాములు, షెడ్కే మంతబాయి, షెడ్కె గంగా, తొర్కడే శకుంతల, బిస్సే సంగీత, డోలే అంజనాబాయి, దేశముక్ రుక్మబాయి, టార్పే వనిత, రేకేవాడ్ కుష్మాలకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగరిపడ్డాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
ఉచిత శిక్షణ.. దేశ రక్షణ
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీ కిష్టాపూర్ తండాకు చెందిన బానోత్ రాజునాయక్, లత దంపతుల ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, సాయికృష్ణ 2018లో ఒకేసారి ఆర్మీలో చేరారు. వంశీకృష్ణ జవాన్గా సాయికృష్ణ పూణేలోని ఆర్మీ మెడికల్ డిపార్టుమెంటులో రేడియాలజీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఇంటిని విడిచి వెళ్లడం ఇష్టంలేని తల్లిదండ్రులు పెద్దకుమారుడిని తిరిగి రావాలని కోరగా వంశీకృష్ణ ఉద్యోగం వదిలి వచ్చాడు. ఇంటివద్ద ఖాళీగా ఉండడం ఇష్టంలేక 2023లో ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న పరిసర గ్రా మాల్లోని పదిమంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. అందులో నలుగురు ఆర్మీకి ఎంపికయ్యారు. ఉచితంగా శిక్షణ ఇక్కడితో శిక్షణ ఆపకూడదనే సంకల్పంతో ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా డు. శిక్షణలో చేరిన కొందరు నగదు రూపేనా ఇవ్వడంతో వాటితో నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులకు శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించాడు. సెలవులపై ఇంటికి వచ్చిన సాయికృష్ణ ఖా ళీగా ఉండకుండా ఫిజికల్ ఈవెంట్లో వారికి మెలకువలు నేర్పించాడు. మూడేళ్లలో అతని వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలో ఉద్యోగం సాధించారు. దేశానికి సేవ చేసేందుకు వెళ్లి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి వచ్చిన యువకుడు తనలాంటి ఎందరినో దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ ఇచ్చి దేశ సేవ కోసం పంపిస్తున్నాడు. జన్నారం మండలానికి చెందిన ఈ యువకుడి వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలలో ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 26 నుంచి మరో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కథనం. -
ఆదిలాబాద్ జట్టుకు చాంపియన్షిప్
ఆదిలాబాద్: సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అన్ని అంశాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జట్టు చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన వేడుకలో జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చాంపియన్ ట్రోఫీ అందజేశారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్రచారం, నిర్వహణ, పతకాల్లో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మంగళవారం డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘వాహన్’ సేవలు షురూ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వాహనాల వివరా లన్నీ ‘వాహన్’లో తెలియనున్నాయి. వాహన్ పోర్టల్ను జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించగా.. ఇకపై వాహనదారులకు దీని ద్వారానే సేవలు అందనున్నాయి. రిజిస్ట్రేషన్, బదిలీలు, ఎన్ఓసీలు తదితర అన్ని రకాల వాహన సేవలు లభించనున్నాయి. ఫిట్నెస్, పర్మిట్, బీమా, ఇంజన్, ఛాసిస్ నంబర్ తదితర అన్ని రకాల వివరాలు నమోదై ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు 50 నుంచి 100 వరకు నూతన వాహన రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2,36,620 వరకు ద్విచక్ర వాహనాలు ఉండగా, 26,480 వరకు కార్లు, 45,510 ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి. షోరూమ్లలో బండి కొనుగోలు చేసిన సమయంలోనే ఆ వాహనానికి సంబంధించి పూర్తి డేటా ‘వాహన్’ పోర్టల్లో నమోదు చేస్తారు. కొత్త వాటితోపాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన మొత్తం వాహనాల వివరాలూ పోర్టల్లో నమోదు చేయనున్నారు. సేవలు ఇలా..‘వాహన్’ సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. నకిలీ బీమా పత్రాలతోపాటు పర్మిట్లు, ఫిట్నెస్ సేవలు, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లకు ఇక తావుండదు. బీమా సంస్థ, బ్రాంచి, బీమా పత్రాలు పక్కగా నమోదవుతాయి. ప్రతీ షోరూమ్ ‘వాహన్’తో అనుసంధానమై ఉండడం వల్ల వాహన ఇంజన్, ఛాసిస్ నంబర్లు, రిజిస్ట్రేషన్ వివరాలు, బీమా చెల్లబాటు గడువు వంటి వివరాలు తెలుస్తాయి. వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే ఫైనాన్స్ సంస్థల వివరాలు కూడా నమోదై ఉండడంతో బోగస్ ఫైనాన్స్ సంస్థ పేరిట రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఆటో రిక్షా తదితర వాహనాలకు రుణాల పేరిట దోపిడీకి పాల్పడే ఫైనాన్స్ సంస్థల ఆటకట్టవుతుంది. ఏ సంస్థ నుంచి ఎంత రుణం తీసుకున్నారనే హైపొతికేషన్ వివరాలూ ఉంటాయి. ‘వాహన్’ పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ ఫీజు చెల్లించిన వెంటనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులువుగా వాహనాల బదిలీ చేసుకోవచ్చు. డీలర్లు, బీమా సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు, కాలుష్య నియంత్రణ సంస్థలు ‘వాహన్’ పోర్టల్తో అనుసంధానమై ఉండడం వల్ల రవాణా సేవలు ఇకపై సులభంగా పొందవచ్చు. ఇప్పటికే వాహన షోరూం నిర్వాహకులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం పోర్టల్ వినియోగంలోకి రావడంతో ఆగిన షోరూం రిజిస్ట్రేషన్లు ముందుకు సాగనున్నాయి. వాహనదారులకు పారదర్శకంగా సేవలు అందడంతోపాటు వాహనదారుల ఇబ్బందులు తొలగిపోనున్నాయని మంచిర్యాల ఇంచార్జీ డీటీఓ రంజిత్రెడ్డి తెలిపారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
తాండూర్: మండలంలోని తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వేట్రాక్పై రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలి పిన వివరాల ప్రకారం... బెల్లంపల్లిలోని సుభాష్నగర్కు చెందిన ఫర్హానా(29) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. మంగళవారం రైల్వేట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు..కుభీర్: మండలంలోని హల్దా గ్రామానికి చెందిన కె.మారుతి(40) మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు..లక్ష్మణచాంద: ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని పాక్పట్లలో మంగళవారం చోటు చేసుకుంది. సోన్ మండలంలోని పాక్పట్లకు చెందిన ఓల్లెపు మహేష్ (36) కట్టెలు కొట్టడానికి వెళ్లి ట్రాక్టర్ పైన ముందుభాగంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఫిట్స్ రావడంతో కిందపడ్డాడు. గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఓల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. -
మూడునెలల తర్వాత పోస్టుమార్టం
తాంసి: గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని సాయినిఖిత మృతదేహనికి మూడు నెలల తర్వాత మంగళవారం తాంసిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన దేవునూరి లింగన్న కుమార్తె సాయినిఖిత (14) నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతి చెందింది. మృతదేహనికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించే వరకూ తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి లింగన్న రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బందిపై మెండోరా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం తాంసిలోని శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో వైద్యులు అంకిత్రావు, అరవింద్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక రావడానికి దాదాపు నెలరోజులు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి
మంచిర్యాలఅర్బన్: పాఠశాల విద్య–ఉపాధ్యాయులు–రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు 20శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలోమంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోడేటి సంజీవ్ మాట్లాడుతూ పీ ఆర్సీ ఫిట్మెంటు ప్రకటించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాలను ఏకమొత్తంలో విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, 2003 డీ ఎస్సీ టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయాలని పే ర్కొన్నారు. టీచర్ల పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలని తెలిపారు. కేజీబీవీ, మోడల్స్కూల్, గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు నగదు రహిత వైద్యసదుపాయం కల్పించాలని, కాంట్రాక్టు టీచర్ల వ్యవస్థ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మనోజ్, ఉపాధ్యక్షులు గాజుల శంకర్, రజిత, జిల్లా బాధ్యుడు దేవ రమేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు కార్తీక్, సికందర్ తదితరులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార వాహనాన్ని రెడ్ కో ఆదిలాబాద్ డీఎం ఎల్.శ్రీనివాస్, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాజన్న, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించి కరపత్రాలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇంట్లో రూఫ్ టాప్పై సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల 360 యూనిట్ల వరకు విద్యుత్ పొందవచ్చని తెలిపారు. 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్కు రూ.78 వేలు రాయితీ నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. మిగులు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేస్తే నెట్ మీటరింగ్ ద్వారా డిస్కం నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. జాతీయ పో ర్టల్ www.pmsuryaghar.gov.in ద్వారా ద రఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డీఈ(మంచిర్యాల) డి.మల్లేశం, ఏడీఈ(కమర్షియల్) జి.మోహన్రెడ్డి, ఏడీఈ(మంచిర్యాల రూరల్) రాజశేఖర్, కలెక్టరేట్ ఏవో పిన్న రాజేశ్వర్ పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలిమంచిర్యాలటౌన్: జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రావుతో కలిసి పరిశీలించారు. 63, 163జీ జాతీయ రహదారుల ఏర్పాటులో జిల్లాలోని దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు. -
‘పది’ సన్నద్ధతపై అనాసక్తి..!
మంచిర్యాలఅర్బన్: పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న సన్నద్ధత తరగతుల(విరామ సమయంలో)పై విద్యార్థులు అనాసక్తి చూపిస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 40శాతానికి మించడం లేదు. తరగతులకు రావాలంటూ ఉపాధ్యాయులు పదే పదే ఫోన్ చేసినా స్పందన కరువవుతోంది. ఎండ వేడిమో.. ఏమో గానీ విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇళ్లలో చదువుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది పరీక్షలు 33రోజులపాటు జరుగుతున్నాయి. దీంతో ఒక్కో పేపర్కు మధ్య విరామం సమయంలో ప్రత్యేక తరగతుల్లో చదివిస్తామంటే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పరీక్ష లేని రోజుల్లో పిల్లలు ఆటల్లో మునిగి గాడితప్పుతారని భావించి నిరంతరం పునశ్చరణ, క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయడం, సమాధాన రచన, నైపుణ్యాల బలోపేతంతోపాటు తప్పులు సరిదిద్దడం కోసం నిర్వహిస్తున్న తరగతులపై విద్యార్థులు, తల్లిదండ్రుల అనాసక్తితో మొక్కు‘బడి’గా మారుతోంది. జిల్లాలో ఇలా..జిల్లాలోని 296 సర్కారు పాఠశాలల్లో 6,296 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2,977 మంది బాలురు, 3,319 మంది బాలికలు ఉన్నారు. ఇందులో కేజీబీవీ, గురుకులాలు మినహాయిస్తే మిగతా లోకల్బాడీ, ఎయిడెడ్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో విద్యార్థులు విరామ సమయంలో ఆశించిన మేర బడిబాట పట్టడం లేదు. ఇప్పటికే ఇంగ్లిషు పరీక్ష వరకు పూర్తయ్యాయి. ప్రత్యేక తరగతులపై మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘సాక్షి’ వివరాలు సేకరించింది. ఎనిమిది పాఠశాలల్లో 540 మందికి గాను 198మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన 33.67శాతం విద్యార్థులు వచ్చారు. చెన్నూర్ రోడ్ పాఠశాలలో అత్యధికంగా 58 మందికి గాను 43మంది హాజరు కాగా, అత్యల్పంగా గర్మిళ్ల ఉన్నత పాఠశాలలో 39 మందికి గాను నలుగురే హాజరయ్యారు. పట్టణ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మిగతా పాఠశాలల్లో 20నుంచి 30శాతం దాటడం లేదేని తెలుస్తోంది. ప్రత్యేక తరగతులతో సాధనపరీక్షకు పరీక్షకు మధ్య విరామ రోజుల్లో విద్యార్థులు బడికి వస్తే సాధన చేసే వీలుంటుంది. ఇంటి వద్ద ఉంటే టీవీ, సెల్ఫోన్కు ఆకర్షితులై చదువులో వెనుకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులను ఉత్తీర్ణత సాధించే అవకాశం లేని వారు, సగ టు మార్కులు సాధించేవారు, ప్రతిభ చూపుతున్నవారు, వెనుకబడి ఉన్న విద్యార్థులుగా వర్గీకరించి సన్నద్ధతకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించడంతోపాటు స్వీయ అధ్యయనం, అభ్యసనం, సందేహాల నివృత్తికి తోడ్పాటు అందిస్తారు. రో జుకు మూడు తరగతుల చొప్పున సాధన చే యించడానికి ప్రధానోపాధ్యాయులు చొరవ చూ పుతున్నారు. మొదటి పీరియడ్ రివిజన్, భానలపై అవగాహన కల్పించడం, విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం కలుగుతుంది. రెండో పీరియడ్లో ప్రతీ రోజు అభ్యసన పరీక్ష నిర్వహిస్తున్నారు. మూడో పీరియడ్లో సమాధానాలు రాయడానికి సరైన పద్ధతి, నిర్మాణం, ప్రదర్శన, నివారించాల్సిన సాధారణ తప్పులు, జవాబులు ఎలా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చో అవగాహన కల్పించడంతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులకు సహకరించి తల్లిదండ్రులు శ్రద్ధ చూపితేనే విద్యార్థులు బడిబాట పట్టే వీలుంటుంది. జిల్లా కేంద్రంలోని పాఠశాలలు, విద్యార్థుల హాజరుపాఠశాల విద్యార్థులు హాజరు చెన్నూర్రోడ్ ప్రభుత్వ పాఠశాల 58 43 సినిమావాడ ప్రభుత్వ పాఠశాల 37 15 గర్మిళ్ల హైస్కూల్ 39 04 పాత మంచిర్యాల హైస్కూల్ 14 08 జెడ్పీహెచ్ఎస్(బాలికలు) 177 65 జెడ్పీహెచ్ఎస్(బాలురు) 77 09 కేజీబీవీ మంచిర్యాల 39 33 మోడల్స్కూల్ 99 21 -
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పెంచాలి
పాతమంచిర్యాల: మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలకు పెంచాలని, మెస్చార్జీలు పెంచాలని, గ్యాస్ కొరత లేకుండా చూడాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, కార్యదర్శి రఫీయా డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజనం, జీతాల పెంపునకు నిధులు పెంచకపోవడం దారుణమని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టిఫిన్, పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్ని నిధులు ఖర్చు చేస్తారనేది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సరిత, ఉమారాణి, మధునమ్మ పాల్గొన్నారు. -
దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు
సారంగపూర్: ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు నగదు రూపేణా సమర్పించిన రూ.53, 97,520 నగదు, 125.49 గ్రాముల మిశ్రమ బంగారం, 3 వేల గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కె.భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దండు సాయన్న, ఎస్సై శ్రీకాంత్, పాల్గొన్నారు. గూడెం ఆలయ హుండీ లెక్కింపుదండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి 2025 డిసెంబర్ 20 నుంచి 2026 మార్చి 23 హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 94 రోజులకు రూ.6,67,205 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నవీన్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిరాశే నిర్మల్ఖిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్)జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కేవలం 26 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని గుర్తుచేశారు. దానికి భిన్నంగా కేవలం 8 శాతం మాత్రమే కేటాయింపులు జరపడం ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్షీణిస్తోందని, విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, సౌకర్యాల కల్పనకు క్షేత్రస్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తుచేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం కేటాయింపులు చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత వైద్య సదుపాయాన్ని ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. -
షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
తాంసి: మండలంలోని పొన్నారిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. దేవల్ల ఓమక్క ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో కుటుంబసభ్యులు బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. స్థానికులు బిందెలతో నీళ్లుచల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫ్రిజ్తో పాటు ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఘటనలో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతోంది. -
పంటల సాగులో ఆధునికతను అందిపుచ్చుకోవాలి
బెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఆధునికతను అందిపుచ్చుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎం.యాకాద్రి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో కిసాన్మేళా నిర్వహించారు. బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. హెచ్డీపీఎస్ పద్ధతిలో పత్తి సాగు చేస్తే ఉపయో గం ఉంటుందని తెలిపారు. సమగ్ర కీటక నియంత్రణ పద్ధతులు, యాసంగి వరిలో చలిని ఎదుర్కొనే నిర్వహణ విధానాలు, అనువైన వరి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఆర్ డాక్టర్ హరీ ష్కుమార్శర్మ మాట్లాడుతూ యాసంగి సీజన్కు అ నుకూలమైన శనగ, నువ్వు పంటల సాగు లాభదా యకంగా ఉంటుందని తెలిపారు. శనగ, నువ్వులు, ఆవాలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయాలని సూచించారు. పలు ప్రైవేట్ కంపెనీలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రగతి శీల రైతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ మేళాలో జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ, శాస్త్రవేత్తలు రామ్గోపాల్వర్మ, శ్రీధర్చౌహాన్, వీర న్న, బి.శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్తలు, ఏడీఏ రాజనరేందర్, ఏవో ప్రేమ్కుమార్, భారత్ అగ్రి కన్సల్టెన్సీ సీఈఓ వెంకటేష్, ఆర్ఏడబ్ల్యూఈ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
‘హిందు ధర్మ పరిరక్షణకు కృషిచేయాలి’
దండేపల్లి: హిందు ధర్మ పరిరక్షణకు హిందువులంతా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. మండలంలోని మేదరిపేట నుంచి ముత్యంపేట వరకు బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములు మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తించారు. అనంతరం స్వాములందరికీ ముత్యంపేటలో భిక్ష ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బందెల రవిగౌడ్, పత్తిపాక సంతోష్, గోపతి రాజయ్య, నలిమెల మహేష్, సురేందర్, అశోక్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో సమస్యలు లేకుండా చూడాలి
తాండూర్: గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మంగళవారం తాండూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, నాయకులతో కలిసి వీధులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మురికి కాలువల్లో పూడిక తీయించాలని, ఓవర్హెడ్ ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వీధి దీపాల సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని, వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడడంతోపాటు పైపులైన్ లీకేజీలను అరికట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలన్నారు. సర్పంచ్ ముడిమడుగుల సురేష్, డీఎల్పీఓ సతీష్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీఓ అనిల్, పంచాయతీ కార్యదర్శి దివాకర్, ఉపసర్పంచ్ సత్యం, ఏఓ సుష్మ, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
లక్సెటిపేట: ఈ నెల 28న నిర్వహించే జాతీ య లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సా యికిరణ్ అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం పోలీస్ అధికారులతో స మావేశం నిర్వహించారు. లోక్ అదాలత్లో పరిష్కరించే కేసుల్లో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు. ఇరువర్గాల కక్షిదారుల సమన్వయంతో రాజీ కుదిర్చే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపా రు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్రావు, సీఐ రమణమూర్తి, ఎస్సైలు పాల్గొన్నారు. -
పెట్రోల్ కోసం బారులు..!
పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం సాయంత్రం నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. స్థానిక గీతా పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ ఉన్నా.. సిబ్బంది లేరంటూ వాహనదారులకు ఇంధనం పోయకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో వాహనదారులు గంటలతరబడి క్యూలో వేచి ఉన్నారు. రిలయన్స్ బంకు వద్ద సైతం వాహనదారులకు పెట్రోల్ పోయలేదు. బాసర రోడ్డులోని ఓ బంకు వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూలో కనిపించారు. పెట్రోల్, డీజిల్ కొరత విషయమై డీసీఎస్వో రాజేందర్ను ఫోన్లో సంప్రదించగా, కొరత లేదన్నారు. – భైంసాటౌన్ -
సారూ.. నేను సచ్చిపోయానట..
వేమనపల్లి: సారూ.. నేను సచ్చిపోయానట.. నాకు రైతు భరోసా సాయం అందడం లేదు.. అంటూ మండలంలోని దస్నాపూర్కు చెందిన తాల్లపల్లి పద్మ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంఏవో వీరన్నకు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. వివరాలు ఆమె మాటల్లోనే.. పద్మకు దస్నాపూర్ శివారు సర్వేనంబర్ 98లో 25 గుంటల భూమి ఉంది. ఆరేళ్ల క్రితం ఆమె భర్త తిరుపతి గౌడ్ మృతి చెందడంతో ఈ భూమి ఆమె పేరు మీద విరాసత్ పట్టా అయ్యింది. అప్పటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు సాయం ఆమె ఖాతాలో పడుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 11న ఆమె కుమారుడు రాకేష్ గౌడ్ తాటి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందాడు. అతని పేరుమీద పది గుంటలు పట్టా భూమి ఉంది. రైతుబీమా డబ్బుల మంజూరుకోసం ఏఈవో హెప్సిబాను సంప్రదించింది. మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్లు అందజేసింది. అయితే సదరు ఏఈవో మా త్రం పద్మ చనిపోయినట్లు నమోదు చేసింది. దీంతో గతేడాది నుంచి రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నిలిచిపోయాయి. ఈ విషయమై కలెక్టర్, ఏవో, ఏఈవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. సోమవారం ఏంఏవో వీరన్న రమ్మనడంతో పద్మ నీల్వాయి ఏఈవో కార్యాలయానికి వెళ్లగా ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయిందని బాధితురాలు వాపోయింది. -
బ్యాడ్మింటన్లో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. అండర్ 15, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జిల్లాస్థాయిలో ప్రాతినిధ్యం వహించి, పురుషుల విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేందుకు మూడుసార్లు ఎంపికయ్యాడు. ప్రస్తుతం మాస్టర్స్ 35 ప్లస్ విభాగంలో పోటీ పడుతూ గత రెండేళ్లుగా వరుసగా మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలుస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్లో విధులను నిర్వహిస్తూనే ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే అఖిల భారత రక్షణ ఖాతాల విభాగం బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొని తన సత్తా చాటుతున్నాడు. -
క్రీడల్లో మాస్టారు అదరహో!
దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు. ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నాడు. మూడేళ్లుగా సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 2018లో చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్లో నిర్వహించిన ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ పోటీల్లో ఐదోస్థానంలో నిలిచాడు. గత సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్ది వారిని సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, మహిళ సంఘ భవనం నిర్మించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా నియమించాలని, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందించాలని కోరారు. స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. డిజిటలైజ్ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ..ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేసినట్లు పీవో అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ప్రతీ ఫిర్యాదుదారునికి ఒక ’ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డు’ జారీ చేస్తామన్నారు. ఈ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి తన ఫిర్యాదు ప్రస్తుత స్థితిని నేరుగా తెలుసుకోవచ్చన్నారు. -
ఆటల్లో మెరికలు..!
బజార్హత్నూర్: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్ జాకేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం. తండ్రి కొట్నాక్ జంగు ఆటో డ్రైవర్ కాగా, తల్లి రేణుక వ్యవసాయ కూలీ. జాకేష్ సొంత గ్రామంలోనే గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాల ఉంది. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ తన స్వగ్రామం జాతర్లలో 2016లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయించారు. దీంతో మారుమూల గిరిజన విద్యార్థులకు క్రీడల్లో రాణించేందుకు అవకాశం దక్కింది. స్థానికంగా ఉన్న క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతూ క్రీడా అవకాశాలను జాకేష్ సద్వినియోగం చేసుకున్నాడు. జాకేష్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ సాహుల్ అతన్ని క్రీడల్లో శిక్షణ ఇచ్చి సానబెట్టారు. మంచిర్యాలఅర్బన్: పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తోంది గోలేటికి చెందిన తిమ్మయ్య– స్వరూప దంపతుల కుమార్తె శ్రీవాణి. ఆమె మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే మృతి చెందినా తల్లి వ్యవసాయ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గోలేటి సింగరేణి పాఠశాలలో పరుగు పందెం, ఖోఖోలో శ్రీవాణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు బ్యాడ్మింటన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే స్కూల్ గేమ్ ఫెడరేషన్, జిల్లా బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ తరఫున జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ చాటింది. కష్టాలు అధిగమిస్తూ..సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీవాణి డిగ్రీ చదువుతూనే పార్ట్టైంగా బ్యాంకులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇప్పటి వరకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెమొంటోలతో పాటు ప్రశంసలు అందుకుంది. శ్రీవాణి ప్రతిభను గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి ప్రోత్సహించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెరిసింది. నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నైపుణ్యత ప్రదర్శించి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇండోనేషియాలో బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 19వ వరకు నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి దేశానికే వన్నె తెచ్చింది. దేవల్ల శ్రీవాణి ప్రభుత్వం సహకారం అందించాలి కోచ్ సాహుల్ శిక్షణ, ప్రధానోపాధ్యాయులు కిషన్రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేశ్, వార్డెన్ కృష్ణరావుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి ఆటుపోటులు లేకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పట్టుదలతో కృషి చేస్తా. – కోట్నాక్ జాకేష్, క్రీడాకారుడు సాధించిన ఘనతలు.. -
సుద్దవాగులో పడి ఒకరి మృతి
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని కోల్గాం గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా నిగ్వాలో ఉండి పాలేరుగా పనులు చేస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయం సుద్దవాగులో వెతకగా వాగు గట్టున చెప్పులు, నీళ్లలో మృతదేహం లభ్యమైంది. భార్య దేవికాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నారు. ఉరేసుకొని వృద్ధురాలి ఆత్మహత్య నస్పూర్: ఒంటరి జీవితాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి గురైన ఓ వృద్ధురాలు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బల్లార్షకు చెందిన పల్లపు సుబ్బమ్మ(70) బతుకు దెరువు కోసం సీసీసీలోని ఆర్టీసీ కాలనీలో ఓ హోటల్లో పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు సోమవారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో ఉరేసుకోగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. సుమారు మూడు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. బైక్ కొనివ్వలేదని యువకుడు.. కడెం: బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రాకేశ్ (27) తన తండ్రి రమేశ్ను పొలాలకు వెళ్లడానికి బైక్ కొనివ్వాలని కోరాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా బైక్ కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తానని చెప్పి గోదావరి ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ ప్రమాణం
నెన్నెల: జంక్ఫుడ్ జోలికి వెళ్లమంటూ మండలంలోని గంగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రమాణం చేశారు. ఉపాధ్యాయుల ప్రేరణతో గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడళ్ల వద్ద ‘ఇంటి వంటలు ఒంటికి మేలు, ఈట్ వెల్ న్యూ హెల్దీ, జంక్ ఫుడ్ కీల్స్ చూజ్ లైఫ్’ అంటూ నినాదాలు చేశారు. చిప్స్ప్యాకెట్లు, బింగోలాంటి తినుబండారాల ప్యాకెట్లను కాల్చివేసి వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వీటితో పాటు పలు రకాల కూల్డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో వివరించారు. చిన్నారుల్లో వెల్లివిరిసిన ఆరోగ్య చైతన్యాన్ని చూసి గ్రామస్తులు మెచ్చుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోట్పల్లి (ఎం) గ్రామానికి చెందిన కల్యాబాయి –వినాయక్రావుల కూతరు లిఖిత కొంత కాలంగా అనారోగ్యంతో పెళ్లి చేసుకోకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి నయం కాలేదు. ఈక్రమంలో ఆదివారం రాత్రి అన్నం తినకుండానే పడుకుంది. సోమవారం ఉదయం చూసే సరికి లిఖిత మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలు సోదరి అర్చన అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తైక్వాండోలో ‘రాణి’ంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచే క్రీడల్లో మక్కువ ఉన్న అస్మిత మూడేళ్లుగా తైక్వాండోలో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో పసిడి పతకం, రాష్ట్రస్థాయిలో తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో రజత పతకం, జెఎన్టీయూహెచ్ ఎంపిక పోటీల్లో బంగారు పతకం సాధించి, తన సత్తా చాటుతోంది. ఆసక్తితో పట్టు..మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ –లతల కుమార్తె కార్ల శ్రీజ తైక్వాండోపై ఉన్న ఆసక్తితో క్రీడలో పట్టు సాధించింది. మూడో తరగతిలో ఉండగానే శిక్షకుడు మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తాను చాటి, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. 2016లో జాతీయస్థాయిలో పాల్గొని తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ తరువాత కేరళలో నిర్వహించిన సౌత్జోన్ నేషనల్స్లో ఆడి మొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. ఎస్జీఎఫ్ పోటీల్లోనూ పాల్గొని రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. స్పోర్ట్స్ కోటాలో కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సీటు పొందింది. -
నాసిరకం భోజనం పెడితే చర్యలు
నెన్నెల: ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ అన్నారు. ‘నాసిరకం భో జనం మాకొద్దు’ అంటూ ఆదివారం విద్యార్థులు ధర్నా చేసిన విషయం తెలుసుకుని సోమవారం కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠి న చర్యలు తప్పవని హాస్టల్ వార్డెన్ను హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ అబ్దుల్హై ఉన్నారు. రైతుల ఖాతాల్లోకి భరోసా నగదు మంచిర్యాలఅగ్రికల్చర్: రైతులకు యాసంగి పెట్టుబడి సాయం మొదటి విడత రైతు భరోసా నగదు ప్రభుత్వం సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్ని ఎకరాలతో సంబంధం లేకుండా ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున 1,52,002 మంది రైతులకు రూ.76,91,79,355 నగదు విడుదల చేసింది. 20 రోజుల తర్వాత రెండోవిడత ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు, మూడో విడత ఏప్రిల్ నెలాఖరులో అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పర్శలేని మచ్చలు ఉంటే తెలపాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎలాంటి స్పర్శలేని మచ్చలుంటే వెంటనే సమీప వైద్య సిబ్బందికి తెలియజేయాలని కుష్టు నివారణ కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. సోమవారం ముల్కల్ల డివిజన్ కార్యాలయం వద్ద కుష్టు నివారణ కార్యక్రమ నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే తెలియజేస్తే తగిన చికిత్స అందించి పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. కుష్టు వ్యాధిపై అపోహలు, భయాలు వీడాలన్నారు. డివిజన్ కార్పొరేటర్ బియ్యాల త్రివేణి, డెమో వెంకటేశ్వర్లు, డీపీఎం రాఘవయ్య, సీహెచ్వో వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, హెచ్ఈవో రఘుపతి, ఎంఎల్హెచ్పీ డాక్టర్ సాయిప్రసన్న, ఏఎన్ఎంలు పద్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలిమంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సో మవారం జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పశువులకు టీకాలు వేయించాలిపాడిరైతులు పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ అవరణలో జిల్లా పశుసంవర్థక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల సంచార వాహనాన్ని జిల్లా పశువైద్యాధికారి యాకుబ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ఎనిమిదో విడత టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలిమంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అన్నారు. సోమవారం శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. -
ఆత్మకు ఊపిరి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వ్యవసాయంలో సాంకేతికత, పరిజ్ఞానంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పోసింది. పదేళ్లుగా ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో ‘ఆత్మ’ అలంకారప్రాయంగా మారింది. దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లాకు రూ.16.06 లక్షల నిధులు కేటాయించడంతో శిక్షణ, క్షేత్ర పర్యటనలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రైతులకు చేకూరుతున్న ప్రయోజనాలుఆత్మ సంస్థ ద్వారా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలతో రైతులకు ఎనలేని ప్రయోజనాలు దరి చేరాయి. జిల్లాకు రూ.16.06 లక్షల నిధులు కేటాయించగా జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షణలో రైతులకు విస్తృత సేవలు అందుతున్నాయి. వ్యవసాయ సాగుపై రైతులకు శిక్షణ ఇప్పించడం, పంట క్షేత్రాలకు తీసుకువెళ్లి సాగులో మెలకువలు, భూసార పరీక్షలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్ధతులు వివరిస్తూ రైతులను చైతన్యం చేస్తున్నారు. త్వరలో కిసాన్ మేళాలు ఏర్పాటు చేసి రైతులను మరింత చైతన్యం చేయనున్నారు. రైతుల ప్రయోజనం కోసమే ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రైతులకు శిక్షణ, అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆత్మ ద్వారా రైతులకు ఇకపై సేవలు రెగ్యులర్గా అందుతాయి. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించే దిశగా ఆత్మ కార్యక్రమాలు ఉండనున్నాయి. త్వరలోనే కిసాన్ మేళా ద్వారా రైతులను సాగులో మరింత చైతన్యం చేయనున్నాం. – సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి -
ట్రాన్స్ఫార్మర్ దొంగతనం.. నిందితుడి అరెస్ట్
తాండూర్: మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న తంగళ్లపల్లికి చెందిన గోగు బాలకృష్ణ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్సెట్టిపేట జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి కోర్టు వాయిదాలకు నిందితులు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. -
‘గుర్తింపు సంఘం విఫలం’
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం నాయకులు విఫలమయ్యారని ఐఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు వారు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రాతినిధ్య సంఘంగా తాము కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, యజమాన్యంతో తమ యూనియన్ నేత జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ డి మాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. సింగరేణిని అధోగతి పాలు చేసిన టీబీజీకేఎస్కు తమను విమర్శించే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్, నాయకులు భీంరావు, గరిగే స్వామి, తిరుపతిరాజు, బాపు, సత్యనారాయణ, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
నో సెట్బ్యాక్!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పలు ఇళ్లు, భవన నిర్మాణాల్లో యజమానులు నిబంధనలు పాటించడంలేదు. ఆయా కాలనీలు, ప్రధాన రహదారుల వెంట పలువురు సెట్బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో రోడ్ల విస్తరణ, డ్రెయినేజీల నిర్మాణ సమయంలో ఈ నిర్మాణాలు అడ్డంకిగా మారుతున్నాయి. మున్సిపల్ అనుమతి సమయంలోనే రోడ్డు నుంచి సెట్బ్యాక్ తప్పనిసరిగా తీసుకుని ఇళ్లు, భవనాలు నిర్మించాల్సి ఉంది. పెద్ద భవనాలకు సెల్లార్లు తప్పనిసరిగా ఉండాలి. అయితే, అనుమతుల సమయంలో అధికారులు ఈ నిబంధనలు విస్మరిస్తున్నారు. దీంతో పలువురు రోడ్డు వర కు నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్బ్యాక్ వదిలేయాల్సిన ప్రాంతం వరకు చేపట్టిన నిర్మాణాలు, రోడ్లపై నిర్మించిన మెట్లు ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులకు అడ్డంకిగా మారుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న రోడ్ల వెడల్పును మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపడుతుండగా, పలు భవనాలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆక్రమణల తొలగింపులో ఇబ్బందినగరంలోని మార్కెట్లో రోడ్ల విస్తరణకు గతేడాది స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెడల్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గాను రూ.78కోట్ల నిధులు మంజూరు చేయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. గతేడాది అర్చనటెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియాలో 60 ఫీట్లతో రోడ్డు వెడల్పులో అడ్డంకిగా ఉన్న ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం శ్రీనివాస థియేటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు 60 ఫీట్లు, రైల్వేస్టేషన్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు 108 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. దారి పొడవునా దాదాపు అన్ని భవనాలు సెట్బ్యాక్ లేకుండానే నిర్మించడంతో ఆక్రమణలు తొలగించడం ఇబ్బందిగా మారింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వేయాలంటే ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సిందే. ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనుల ప్రక్రియ వేగవంతం కాగా, ఆక్రమణల తొలగింపుతో ప్రజల రాకపోకలు ఇబ్బందిగా మారుతోంది. భవనాలకు అనుమతి ఇచ్చినప్పుడే నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా? లేదా? అని అధికారులు పరిశీలించి ఉంటే ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదని, నూతనంగా నిర్మించే భవనాలైనా నిబంధనల మేరకు నిర్మించేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం నగరపాలక సంస్థ పరిధిలో ఇకపై నిర్మించే భవనాలు, ఇళ్లు నిబంధనల మేర కు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సెట్బ్యాక్ వదిలేసేలా, సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగించేలా చూస్తాం. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలోని రోడ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణాలు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా చూస్తాం. – దర్ని మధుకర్, మంచిర్యాల మేయర్ -
‘ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రాజకీయాలకు అ తీతంగా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని రా ష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీర న్న పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిప ల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలోగల మంచిర్యాల గార్డెన్స్లో పెరిక ప్రజాప్రతినిధులను సన్మానించారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు లగిశెట్టి రాజన్న, బియ్యల త్రివేణి, పెట్టెం స్వరూప, ఎంబడి కుమారస్వామితో పాటు జిల్లాలోని పెరిక ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ.. కుల సంఘం బలోపేతమైతేనే భవి ష్యత్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశముంటుందని తెలిపారు. కులస్తులంతా ఏకతాటిపై కి వచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పి లుపునిచ్చారు. ఈ సందర్భంగా పెరిక యువత జి ల్లా అధ్యక్షుడిగా కారుకూరి మనోజ్, సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలిగా అత్తి సరోజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చుంచు రాజ్కిరణ్, కోశాధికారి నెల్కి మల్లేశ్, మంచిర్యాల నగర అధ్యక్షుడు బొడ్డు తిరుపతి, మంచిర్యాల ఏఎంసీ చైర్పర్సన్ పద్మ, నాయకులు డాక్టర్ రమణ, మురళి, సరోజ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడవుల్లో శివంగులు
చెన్నూర్రూరల్: ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమతం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. టీచర్లు, పోలీసులు, అటవీశాఖ, ఎకై ్సజ్శాఖ ఇలా అనేక రంగాలలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారు. అటవీశాఖలో మహిళలు మగవారికి తీసిపోకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ డివిజన్, చెన్నూర్ రేంజ్ పరిధిలో ఏడుగురు మహిళలు వివిధ పోస్టుల్లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీవైఆర్వో (డిప్యూటీ రేంజ్ అధికారులు), ఒక్కరు ఎఫ్ఎస్వో(ఫారెస్టు సెక్షన్ అధికారి), నలుగురు ఎఫ్బీవో (ఫారెస్టు బీట్ అధికారులు)లు ఉన్నారు. విధులు, బాధ్యతలు.. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరేడ్ చేయడంతోపాటు పురుషులతో సమానంగా ప్రతీరోజు అడవుల్లో కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్లను గమనించడంతో పాటు వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు, ఉరులు, ఉచ్చులు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అడవిలో స్మగ్లర్లు కలప దొంగతనం చేయకుండా అప్రమత్తంగా ఉండడం, వన్యప్రాణుల మేత కోసం గడ్డి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తొట్లు, కుంటలు ఏర్పాటు చేయడం, అడవిని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అటవీ సంపద కాపాడేందుకు రాత్రి పెట్రోలింగ్ చేయడం, అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టడం, అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల, అడవుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారు గోదావరి నదిలో మొసళ్ల కేంద్రం సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. జంతుగణన, బర్డ్వాచ్, బటర్ఫ్లై వాచ్లో పాల్గొంటున్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద, ఆకుల కల్లాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. -
‘సుందిళ్లకు నీటి తరలింపు మరో విపత్తు’
పాతమంచిర్యాల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు కాళేశ్వరం వంటి మరో విపత్తుగానే పరిగణించాలని వామ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్స్క్ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే క్రమంలో సంభవించే పరిణామాలు, విపత్తులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా సుందిళ్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కొండగట్టుకు మేయర్ మహాపాదయాత్ర
నస్పూర్: గతంలో అనారోగ్యానికి గురైన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు నగర మేయర్ ధర్ని మధుకర్ ఆదివారం కొండగట్టుకు మ హాపాదయాత్ర ప్రారంభించారు. ముందుగా సీతారాంపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తన కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు దీక్షాపరులతో కలిసి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిమానంతో 2029లోనూ ప్రేంసాగర్రావు ఎ మ్మెల్యేగా గెలవాలని ఆంజనేయస్వామిని వే డుకోనున్నట్లు పేర్కొన్నారు. నస్పూర్ ఇన్చా ర్జి నూకల రమేశ్, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమారస్వామి తదితరులున్నారు. -
జాబ్మేళాకు స్పందన
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్లో బీట్సెల్ సాఫ్ట్ సొల్యూషన్ ఆ ధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్మేళాకు స్పందన లభించింది. 1,264 మంది వి ద్యార్థులు, నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకో గా, 776 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా బీట్సెల్ సీఈవో సన్ని మాట్లాడు తూ.. పదోతరగతి నుంచి బీటెక్ వరకు చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించాలనే ల క్ష్యంతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. 40 కంపెనీల ప్రతినిధులు మేళాకు హాజ రై ఇంటర్వ్యూలు నిర్వహించగా 268మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మిగతావారు రెండో రౌండ్లో పాల్గొంటారు. జీవీకే బ్రదర్స్ సీఈవో గుండాల విజయ్కుమార్, కంపెనీ ని ర్వాహకులు అరవింద్, ప్రవీణ్సిద్దు, ప్రభాకర్ చౌటి, వశిష్ట, రాహుల్, మధుకర్, చందర్, మ ధుకర్, సుమన్, సూర్యప్రసన్న పాల్గొన్నారు. -
‘ఎన్నికల హామీలు నెరవేర్చాలి’
శ్రీరాంపూర్: ఎన్నికల్లో ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుందన్నారు. కార్మికులకు సాధారణ ఎన్నికల్లో, గు ర్తింపు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, వంగ తిరుపతి, బాకం నగేశ్, గుంట జగ్గయ్య, జనార్ధన్, కాటం రాజు, పొగాకు రమేశ్, ఆకునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోన్ ఎస్సై గోపి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఎలుగు సుధాకర్ జనవరిలో తన బైక్ని కడ్తాల్ గ్రామ శివారులో పార్క్ చేసి పని నిమిత్తం వెళ్లగా కుచంపల్లి లక్ష్మణ్ బైక్ని దొంగతనం చేశాడు. ఎలుగు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లక్ష్మణ్ని ఆదివారం గంజల్ టోల్ప్లాజా వద్ద పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పు కున్నాడు. అతని వద్ద నుంచి మూడు మో టార్ సైకిల్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ఆరు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఎస్సై దేవన్న, పీసీలు రాజు, వినోద్ ఉన్నారు. -
అడవిలో కార్చిచ్చు
సిర్పూర్(టి): మండలంలోని సిర్పూర్(టి) –కాగజ్నగర్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతాల్లో ఆదివారం కార్చిచ్చు ఏర్పడింది. దీంతో ప్రధాన రహదారి గుండా రోడ్డుకు ఇరువైపులా అంటుకున్న మంటల్లో చెట్లు దగ్ధమయ్యాయి. దీంతో పాటు కలప కూడా అగ్నికి ఆహుతైంది. కాగా ప్రధాన రహదారి గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. హరిత వనంలో.. దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెం గ్రా మ పంచాయతీలోని కేసీఆర్ హరిత వనంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిగూడెం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ఆనుకొని కేసీఆర్ హరిత వ నం ఉండటంతో రహదారిపై వెళ్లే గుర్తుతెలి యని వ్యక్తులు పొగతాగి అగ్గి వేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. వెంటనే అక్క డ ఉన్న వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో స్వల్ప మొక్కలు ధ్వంసమైనట్లు అటవీ క్షేత్రఅధికారిణి గీతారాణి తెలిపారు. -
సాహిత్య ఫెస్టివల్కు ఆహ్వానం
ఆదిలాబాద్రూరల్: న్యూఢిల్లీలో ఈ నెల 25, 26వ తేదీలలో నిర్వహించనున్న 10వ రాష్ట్రీయ జనజాతీయ, లోక్ సంస్కృతి సాహిత్య ఫెస్టివల్కు తనకు ఆహ్వానం అందినట్లు మావల మండలంలోని వాఘాపూర్ గ్రామానికి చెందిన గోండి భాష రచయిత తొడసం కై లాష్ తెలిపారు. మానవహక్కుల చైర్మన్కు ఘన స్వాగతంజన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
కాసిపేట: సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభించకముందు ఇచ్చిన హామీల మేరకు ఓపెన్కాస్ట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత యువకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని కోమటిచేను, పల్లంగూడ, సోమగూడం ప్రాంతాలలో ఇంటికో ఉద్యోగం, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి రైతుల వద్ద భూమిని యాజమాన్యం కాసిపేట –2 ఓపెన్కాస్ట్లకు సేకరించి నేడు నిర్వాసితులకు మొండి చేయి చూపించిందన్నారు. ఓపెన్కాస్ట్లో గత పదేళ్లుగా దుర్గ, ఆర్వీఆర్ కంపెనీలలో డంపర్ ఆపరేటర్లుగా పని చేసిన తమను మరిచి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్ప్రెస్వే కంపెనీ కార్మికులను తీసుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు దుర్గం గోపాల్, బాధిత యువకులు కుమ్మరి శ్రీకాంత్, కుడిమెత చంద్రమౌళి, వెడ్మ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు. -
‘హైకోర్టు ఆదేశాలు పాటించరా’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఈ నెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు హాజరై సంతకం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్ను కలుస్తామని తెలిపారు. అసెంబ్లీ, కౌ న్సిల్లో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతామ ని పేర్కొన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. క్యాతనపల్లిలో 14 స్థానాలు బీఆర్ఎస్–సీపీఐ గెలుచుకు న్నా ఏడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అధికార, పోలీ స్ బలాన్ని ఉపయోగించి తమపై లాఠీచార్జీ చేయించి అన్యాయంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ స్థానాలు బీఆర్ఎస్, సీపీఐ కూటమివేనని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్, రామిడి కుమార్, సంపత్ తదితరులున్నారు. -
సెల్ఫోన్ గొడవ.. స్నేహితుడి హత్య
మంచిర్యాలక్రైం: సెల్ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. సంబంధిత వివరాలను సీఐ ప్రమోద్ రావు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో సంజీవ్, సిడం దీపక్లు దీపక్ను రాడుతో తలపై మోదీ హత్య చేశారు. నిందితులు సంజీవ్, సిడం దీపక్లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి 14 రోజుల రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
‘అన్ని వర్గాలను వంచించే బడ్జెట్’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి న బడ్జెట్ అన్ని వర్గాలను వంచించేలా ఉందని మా జీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలు, మైనార్టీలకు నిధులు కేటాయించలేదని, సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని తెలిపారు. మెడికల్ బోర్డు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించడం లేదని, ప్రారంభించిన వాటిని పూర్తి చే యడంలేదని విమర్శించారు. హైదరాబాద్ తరహా లోనే మంచి ర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కూల్చివేతలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు అ మలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించా రు. పార్టీ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, కార్పొరేటర్లు అబ్దు ల్ సత్తార్, పెట్టెం స్వరూప, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, సందెల వెంకటేశ్ తదితరులున్నారు. ‘విద్యారంగానికి అన్యాయం’మంచిర్యాలఅర్బన్: విద్యారంగానికి బడ్జెట్ కేటా యింపులో తీవ్ర అన్యాయం జరిగిందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన డీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకపోవటం విచారకరమని, సవరణ చేసి హామీ మేరకు 15శాతం నిధులు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, ఉపాధ్యక్షులు కుమార్, పత్తి సంతోష్, కార్యదర్శులు అప్పారావు, ప్రకాశ్, ఆడట్ కమిటీ సభ్యులు విష్ణువర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గోదావరిలో మృతదేహాల కలకలం
బాసర: గోదావరి నదిలో బాసర వద్ద ఆదివారం రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు బాసర బ్రిడ్జి కింద గోదావరిలో తేలియాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఒక మృతదేహం నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజులపేటకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. లభ్యమైన మహిళ మృతదేహం వివరాలు ఇంకా తెలియరాలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
బడ్జెట్ ప్రతులు దహనం
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించలేదని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కే టాయిస్తామని హామీ ఇచ్చి వివక్ష చూపిస్తుందన్నా రు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అశోక్, రాజన్న, చారి, అలేఖ్య, నటేశ్వర్, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో చే పట్టిన అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న పార్టీ శిక్షణ తరగతులు ఆదివారం ముగియగా రఘునాథ్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో స్థానిక సమస్యలపై కూడా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి ఓదెలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్గౌడ్, నాయకులు అమిరిశెట్టి రాజ్కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, రంగ శ్రీశైలం, వంగపల్లి వెంకటేశ్వర్రావు, కమలాకర్రావు, జోగుల శ్రీదేవి, ఆకుల అశోక్వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ పనిని పూర్తి చేసి చూపిస్తాం
రామకృష్ణాపూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కో సమే శిలాఫలకాలు వేసిందని, తాము శిలాఫలకం వేసిన ప్రతీ పనిని పూర్తి చేసి చూపిస్తామని రాష్ట్ర కా ర్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతనపల్లిలోని పలు వా ర్డుల్లో ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అ భివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోయారని ఆ రోపించారు. చెన్నూర్, క్యాతనపల్లి, మందమర్రి ప ట్టణాల్లో ఎక్కడా సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవని తెలి పారు. డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నా రు. అమృత్ స్కీం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.40 కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ.. రూ.30 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో క్యాతనపల్లిలో చేపట్టిన పనుల్లో 20శాతం పూర్తయినట్లు తె లిపారు. పట్టణంలో హైమాస్ట్ సోలార్ లైట్లు ఏర్పా టు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీనివాసగార్డెన్స్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు రూ.కోటి 80 లక్షలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, 8, 9 వార్డుల్లో రూ.13లక్షలతో, ఐదోవార్డులో రూ.27 లక్షలతో చే పట్టిన సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. 14వ వార్డులో రూ.24 లక్షలతో, 15వ వార్డులో రూ.31 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. 10వ వార్డులో రూ.2.09 కోట్లతో చేపట్టిన కుర్మపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నాయకులు రాజు, శ్రీనివాస్, సమ్మయ్య ఉన్నారు. చెరువు సుందరీకరణ పనులు ప్రారంభంమందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరి ఽధి పాత బస్టాండ్ సమీపంలోగల ఊరు మందమర్రికి వెళ్లే మార్గంలోని ఊరచెరువు మినీ ట్యాంక్బాండ్ సుందరీకరణ పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రూ.2.31కోట్లతో చెరువును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజలింగు, అధికారులు, కాంగ్రెస్ నాయకులున్నారు. -
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వస తి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. మండల కేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాల, కేజీబీవీని ఆయన ఆదివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, నిత్యావసరాల నిల్వలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాజరు రిజిష్టర్లు, వసతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శివరాజం, కేజీబీవీ ఎస్వో శ్రావణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘నాసిరకం భోజనం మాకొద్దు’
నెన్నెల: నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వి ద్యార్థులు ఆదివారం ప్రధాన గేటు ఎదుట ధర్నా చే శారు. వీరికి ఏఐఎస్బీ నాయకులు, సర్పంచ్ కొండగొర్ల గంగారాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కనుకుంట్ల సన్నిగౌడ్, ఢీకొండ జతిన్గౌడ్ మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై అ ధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చి హాస్టల్ సమస్యలు బయటకు ఎందుకు తెస్తున్నారని వారిని బెదిరించారని ఆరోపించారు. నాణ్యత లేని భోజ నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని, మెడికల్ క్యాంపులు నిర్వహించ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు రూ.75వేల గ్రాంట్ వస్తే ఎలాంటి పనులు చేపట్టలేదని, కనీస సౌకర్యాలు కానరావడం లేదని తెలిపా రు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో అబ్దుల్హై పాఠశాలకు చేరుకుని విద్యార్థుల సమస్య తెలుసుకుని సిబ్బందిని మందలించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే క లెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. డీటీడబ్ల్యూవో రమాదేవి, ఏటీడబ్ల్యూవో సురేశ్ ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడి సిబ్బందిపై చర్యలు తీ సుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉపసర్పంచ్ బైరి సాయి, వార్డు సభ్యుడు దేవాజీ తదితరులున్నారు. -
‘ఇంటింటికీ సీపీఐ’ని విజయవంతం చేయాలి
పాతమంచిర్యాల: ఏప్రిల్ 1నుంచి 10వరకు జిల్లాలో చేపట్టను న్న ‘ఇంటింటికీ సీీపీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ.. నిధి సేకరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో సీపీఐ జిల్లా సమితి సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సింగరేణి పరిరక్షణకు ‘సేవ్ సింగరేణి’ (జాత) ఈ నెల 18న శ్రీ రాంపూర్లో ప్రారంభం కాగా, 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడితో ము గుస్తుందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమి తి సభ్యులు వెంకటస్వామి, దాసు, చంద్రశేఖర్, మల్లేశ్, లింగయ్య, సమ్మయ్య, నర్సయ్య, రాజమౌళి, దుర్గారాజ్, లక్ష్మీనారాయణ, బానేశ్ పాల్గొన్నారు. -
నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
చెన్నూర్: నియోజకవర్గంలో శాశ్వత నీటి కరువు లేకుండా చూస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. శనివారం కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి రూ.1.87కోట్లతో చేపట్టిన చెన్నూర్ కుమ్మరికుంట పునరుజ్జీవ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుమ్మరికుంటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు రూ.45 కోట్లతో గోదావరి నుంచి లింక్ కనెక్టివిటీకి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మైనార్టీలను పట్టించుకోని బీఆర్ఎస్పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి వివేక్ ఆరోపించారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్హాల్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముందుగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కమిషనర్ మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ప్రసాద్, కౌన్సిలర్లు నజీమొద్దీన్, మంత్రి లక్ష్మణ్, అంబటి శంకర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
నార్నూర్: జొన్న పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మాడవి ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని మాలేపూర్ గ్రామానికి చెందిన మేర్ట్కర్ బాలాజీ తన పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులతో కలిసి దాడి చేసి 24 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.2.40 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందంతో గాలించి అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సై శ్రీసాయి, సిబ్బందిని సీఐ అభినందించారు. -
నాడు తండ్రి..నేడు కొడుకు
జైపూర్: నాడు తండ్రి, నేడు కొ డుకు లారీ రూపంలో మృత్యు వు కబళించింది.ఊహించని ప్ర మాదం ఆ కుటుంబలో తీరని విషాదం మిగిల్చింది. పదేళ్ల క్రితం తండ్రిని లారీ ప్రమాదంలో మృతిచెందగా, ఇప్పుడు కుమారుడి బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరణించాడు. జైపూర్ మండలం టేకుమట్ల వాగు బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. స్థానికులు, బంధవులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన లక్ష్మి–మల్లేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడు పోరడ్ల సాయికుమార్(23) హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోస ం ఇంటికి వచ్చిన ఆయన ఇక్కడే రెండ్రోజులుగా ఉన్నాడు. తన అమ్మమ్మ స్వగ్రామం జైపూర్ మండలం కుందారం. తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో శనివారం రంజాన్ వేడుకలకు హాజరయ్యేందుకు బైక్పై వచ్చి తిరిగివెళ్తున్నాడు. ఇందారం నుంచి హైవే రోడ్డుకు మట్టి లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి వార్త తెలియగానే తల్లి గుండెపగిలేలా రోదించింది. లారీ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనస్థలం వద్ద మృతదేహంతో రాత్రివరకు రా స్తారోకో చేపట్టారు. హైవేరోడ్డు పనులు చేపడుతున్న కంపెనీతో కుటుంబీ కులు రాత్రివరకు చర్చలు జరిపారు. ఈమేరకు కే సు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
మూడు సిలిండర్లు స్వాధీనం
కై లాస్నగర్: సబ్సిడీపై అందించే గృహావసర ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం పట్టణంలోని టీచర్స్కాలనీలోని రోడ్ నంబర్ 16లో గల ఓ ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి బాదంమిల్క్, ఐస్క్రీమ్, వివిధ రకాల స్వీట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. వాటి తయారీకి కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వివిధ ఆయిల్ కంపెనీల గృహావసర సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మూడు ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకుని వాటిని వినియోగిస్తున్న వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీపై అందించే గృహావసర సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టరీత్యా నేరమని డీటీ మహేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దత్తత చట్టబద్ధంగా ఉండాలి
సంతానం లేని వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. చిన్న పిల్లలను అమ్మిన వారిపై, కొన్నవారిపై కేసు నమోదు చేస్తాం. దళారులను నమ్మి పోసవద్దు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాలదళారులను నమ్మి మోసపోవద్దు దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దు. పిల్లలు లేని వారు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. సీడబ్ల్యూసీ అధికారులను కలిస్తే వివరాలు అందిస్తారు. సీఏఆర్ఏ కింద దత్తత ఏజెన్సీ కేంద్రాలు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉంది. – రౌఫ్ఖాన్, జిల్లా శిశు సంక్షేమ అధికారి -
గంగాపూర్ శివారులో ఉద్రిక్తత
● అటవీ అధికారుల తవ్వకాలను అడ్డగింత ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులుచింతలమానెపల్లి: గంగాపూర్ శివారులో అట వీ అధికారులు శనివారం తవ్వకాలు నిర్వహించారు. ఆ స్థలంలో సాగు చేస్తున్న రైతులు తవ్వకాలను అడ్డుకోవడంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. గంగాపూర్ నర్సరీ సమీపంలోఅధికారులు సర్వే నిర్వహించగా కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో కందకాల తవ్వకానికి చర్యలు తీసుకుంటుండగా పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమకు ప్రభుత్వం కేటా యించిందని, పనులను నిలిపివేయాలని కోరారు. ఈ భూమి అటవీశాఖదని సర్వేలో తేలినట్లుగా అధికారులు తెలుపగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏండ్లకు పైగా భూమిని సాగు చేస్తున్నామని భూమి లో కందకాలు తవ్వడంతో తాము నష్టపోతా మని వాపోయారు. ఈవిషయమై ఎఫ్ఆర్వో సుభాష్ మాట్లాడుతూ ఈ భూమి అటవీ ప్రాంతంలో ఉందని అటవీ పరిధి మేరకు పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతంలో త్వరలో ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తామన్నారు. అటవీ అభివృధ్ధి పనుల్లో భాగంగా కందకాలు తవ్వుతున్నట్లు వివరించారు. -
మద్యానికి బానిసై వృద్ధుడు ఆత్మహత్య
సారంగపూర్: మద్యానికి బానిసై వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని చించోలి(బి) గ్రా మానికి చెందిన పల్లెర్ల పె ద్ద సాయన్న(61) గత కొ ంతకాలం క్రితం అప్పులపాలై ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. గత మూడు నెలలుగా ఎలాంటి పని చేయకుండా ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం స్థానిక కల్లు దుకా ణంలో అధిక మద్యం తాగాడు. ఆ మత్తులో గ్రామశివారు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. భార్య నర్సవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉండగా చిన్నకుమారుడు నిర్మల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఉరేసుకుని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.. తాండూర్: మండలంలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన జాడి మొండయ్య(80) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. జాడి మొండయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కుమారుడు పోశం వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శనివారం బాత్రూం వెళ్లిన మొండయ్య ఎంత సేపటికి బయటకు రాలేదు. తలుపు బద్దలుకొట్టి చూడగా బాత్రూంలో ఉన్న రాడ్కు ఉరేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పిల్లల కిడ్నాప్..అమ్మకం!
మంచిర్యాలక్రైం: అభం..శుభం.. తెలియని పిల్లలను తల్లి పొత్తిళ్ల నుంచి దూరం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎంతకై నా తెగిస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి ఎంతో కొంత ముట్టజెప్పి కొనుగోలు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్, ఫుట్పాత్ల వద్ద చిన్నారులను కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేట, హన్మకొండ జిల్లా కాజిపేట పోలీసులు చిన్నపిల్లలను విక్రయిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసిన ఘటనలో జిల్లాకు చెందిన మూడు కుటుంబాలు దళారులు చేతిలో మోసపోయి చిక్కుల్లో పడిన ఘటనలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్నారులను శిశుగృహాంలోకి తరలించి పైగా వీరిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకరి ఆశ.. మరొకరికి సంపాదనసంతానం కోసం ఏళ్ల తరబడి వేచిచూసి చివరికి దత్తత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలు చెప్పి చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్నారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఏ తల్లి కన్నబిడ్డనో ఎత్తుకొచ్చి విక్రయిస్తూ అడ్డదారిలో లక్షలు సంపాదిస్తున్న ముఠాలు ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాయి. విక్రయించినవారితోపాటు కొనుగోలు చేసి వారి కుటుంబాలు కొద్ది రోజుల్లోనే వారి అనందం ఆవిరైంది. చిన్న పిల్లలను విక్రయిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడగా కేసు నమోదు చేశారు. దళారుల వద్ద దత్తత తీసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఎవరో తెలియక పోవడంతో శిశుసంక్షేమశాఖ సంరక్షణలో ఉంచారు. తెలియక దళారుల చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని న్యాయం చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్రమ రవాణా గుట్టురట్టుమంచిర్యాల, రామగుండం, కాజీపేట రైల్వేస్టేషన్ల వద్ద ఫుట్పాత్పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానం లేనివారిని విక్రయిస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు గత జనవరి 9న గుట్టురట్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్కు చెందిన కొడుపాక నరేశ్, వల్లెపు యాదగిరితోపాటు మరో మహిళ ఒక ముఠాగా ఏర్పడ్డారు. నరేశ్ కాజీపేట రైల్వేస్టేషన్లో గతేడాది డిసెంబర్ 28న ఫుట్పాత్పై నిద్రిస్తున్న కన్నానాయక్ కుమారుడు మల్లన్న(5 నెలలు)ను ఎత్తుకెళ్లాడు. తండ్రి ఫిర్యాదుతో నరేశ్ గుట్టు రట్టయింది. నరేశ్ ముఠా.. మంచిర్యాల, జన్నారం, సీసీసీ, జగిత్యాల ప్రాంతాల్లో చిన్నారుల విక్రయించినట్లు ఒప్పుకుంది. లక్సెటిపేట పోలీసులు జిల్లాకు చెందిన మరో ముఠా సీసీసీ నస్పూర్ తీగల్పహాడ్కు చెందిన విజయలక్ష్మి, లక్సెట్టిపేట మండలం సూరారానికి చెందిన స్వరూపను గుర్తించారు. గతంలో విజయలక్ష్మిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారంట్ మీద తీసుకువచ్చి జనవరి 23న రిమాండ్ తరలించారు. స్వరూప, విజయలక్ష్మికి చెందిన ముఠా లక్సెట్టిపేట మండలం మోదెలకు చెందిన కుటుంబానికి మూడేళ్ల చిన్నారిని విక్రయించారని సమాచారంతో విచారణ చేపట్టారు. స్వరూప, విజయలక్ష్మి..రాష్ట్రవ్యాప్తంగా పసి పిల్లల అక్రమ రవాణా చేసినట్లు వెలుగులోకి రావడం గమనార్హం.దత్తత చట్టబద్ధత ఇలా..దత్తత తీసుకునే దంపతుల వయసు, దత్తత ఎందుకు తీసుకుంటున్నారో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. కేరింగ్స్ పోర్టల్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన తర్వాత జిల్లా శిశు సంక్షేమ శాఖ, పి ల్లల సంరక్షణ కమిటీ 60 రోజుల్లో పోర్టల్లో నమోదు చేస్తుంది. సీరియల్ నంబర్ ఆధారంగా చిన్నారులను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నాక ఏడాది నుంచి మూడేళ్ల గడువు పట్టే అవకాశం ఉంటుంది. హిందు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకా రం బంధువుల పిల్లలను దత్తత తీసుకోవా లంటే సెంట్రల్ అడప్షన్ రిసోర్స్ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ముఠా ఈజీమనీకి అలవాటుపడి సంతానం లేనివారిని, పిల్లల్ని కని పెంచే స్థోమత లేని వారిని టార్గెట్ చేస్తోంది. రైల్వేస్టేషన్లు, పట్టణ కేంద్రాల్లోని ఫుట్పాత్లపై రాత్రి నిద్రిస్తున్న చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాయి. పాపకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు, బాబు అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయించేలా ఒప్పందం ముందుగానే దళారులు మంతనాలు జరుపుకుంటారు. మాకే అనాథ ఆశ్రమం ఉంది అందులో నుంచి తెచ్చి ఇస్తామని, ఆన్లైన్ ద్వారా పాప దొరకడం ఆలస్యమవుతోందని మాయమాటలు చెప్పి బోల్తా కొట్టిస్తారు. నకిలీ ఐడీ ప్రూఫ్ చూపించి నమ్మించి మోసాలకు ఽపాల్పడ్డారు. -
యాపలగూడ టూ కలెక్టరేట్
పెంబి: తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని మండలంలోని యాపలగూడ గ్రామస్తులు కలెక్టరేట్కు శనివారం పాదయాత్రగా బయల్దేరారు. కడెం వాగు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి బండారి రవికుమార్ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మల్కు చేరుకుంటుందని తెలిపారు. గిరిజనుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. మారుమూల పెంబి మండలంలోని 15 గ్రామాలకు రోడ్డు, తాగునీరు, కరెంట్ సౌకర్యం లేవని తెలిపారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులు తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. దోత్తి, కడెం వాగులపై, పస్పుల వాగుపై వంతెనలు నిర్మించినా వరద దాటికి కొట్టుకుపోయాయన్నారు. మూడేళ్లయినా కొత్తవి నిర్మించడం లేదని తెలిపారు. పుల్గంపాండ్రి నుంచి సిరిచెల్మ వరకు రోడ్డు నిర్మాణం చేపడితే మండల ప్రజలకు ఆదిలాబాద్కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రకమిటీ సభ్యులు ఉడత రవీందర్, పూసం సచిన్, జిల్లా కార్యదర్శి గౌతంకృష్ణ, సీపీఎం జిల్లాకార్యదర్శి నూతన్కుమార్, బొమ్మెన సురేశ్, వ సుధ, జిల్లాకమిటీ సభ్యులు తోడసం శంభు, కామా క్షి, నాగెల్లి, నర్సయ్య, ఆదివాసీలు పాల్గొన్నారు. పాదయాత్రగా బయల్దేరిన గిరిజనులు, నాయకులు -
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
గుడిహత్నూర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రంగా, పలువురి స్వల్ప గాయాలయ్యాయి. మండల కేంద్రానికి 2 కి.మీ దూరంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎండీకే ట్రావెల్స్ బస్సు కేవలం 18 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ దాబా వద్దకు చేరుకుంది. బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్సు వెనుక బైక్పై వెళ్తున్న మండలంలోని డోంగర్గావ్ చెందిన ఇరువురు యువకులకు గాయాలయ్యాయి. కాగా బస్సులో క్లీనర్ ప్రభుదాస్తోఆటు గిత్తే భరత్, షేక్ ఆతిక్లకు తీవ్రగాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని హైవే అంబులెన్సులో రిమ్స్కు తరలించి చికిత్స అందజేశారు. కాగా ఈ స్లీపర్ బస్సులో సుమారు 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్స్ డ్రైవర్ మహ్మద్ మహబూబ్ఖాన్ అతివేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి
నెన్నెల: మండలంలోని కొనంపేట శివారు చిన్నవాగులో జేసీబీతో తవ్విన నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనంపేటకు చెందిన డోలె బక్కయ్య(63) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లాడు. పొద్దుపోయినక నీటిగుంతలో విగత జీవిగా ఉన్న బక్కయ్యను చూసిన యువకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిగుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మల్లయ్య శనివారం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వలస కూలీ దారుణహత్య మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో వలస కూలీ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సీఐ ప్రమోద్రావు కథనం ప్రకారం.. స్థానిక చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద మహారాష్ట్రకు చెందిన దీపక్ (35)తోపాటు మరో ఇద్దరు కాంక్రీట్ మిల్లర్ పని చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని కాలేజీరోడ్ వైన్స్ సమీపంలో ఓ ఇంట్లో ముగ్గురు అద్దెకుంటున్నారు. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ముగ్గురు మద్యం మత్తులో గొడవపడినట్లు తెలిసింది. మరో ఇద్దరు రాడ్తో దీపక్పై దాడి చేసి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న దీపక్ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీపక్తోపాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు. ఒకరు మహారాష్ట్ర ఐరి రాంపూర్కు చెందిన దీపక్, మరొకరు కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి సంజీవ్గా గుర్తించారు. ఇద్దరు కనిపించకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
బెల్లంపల్లి: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీ జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో తగినంత నిధుల కేటాయింపు జరగలేదని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ విమర్శించారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అత్తెసరు నిధులు కేటాయించడం సరికాదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.12,500 కోట్లు కేటాయించి మోసం చేసిందన్నారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేష్గౌడ్, కౌన్సిలర్ దొంగల రాజ్కుమార్, నాయకులు బండారి ప్రవీణ్కుమార్, పాయవేణ మల్లేశ్, మధు తదితరులు పాల్గొన్నారు. నిరాశ మిగిల్చిన బడ్జెట్ జన్నారం: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు నిరాశ మిగిల్చిందని తె లంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న ఆరోపించారు. మండలకేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం నిధి, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తాజా బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుమల్ల ఎల్లయ్య (రెడ్డి), ఉపాధ్యక్షులు ప్రశాంత్, జన్నారం టౌన్ అధ్యక్షుడు రాజేష్, కోశాధికారి అంజయ్య పాల్గొన్నారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి
చెన్నూర్: బీజేపీ సిద్ధాంతాలపై ప్రతీ కార్యకర్త కు అవగాహన ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ సూచించారు. స్థానిక ఫంక్షన్హాల్లో శనివారం రాత్రి కోటపల్లి, వేమనపల్లి మండలాల బూత్స్థాయి అధ్యక్షులకు ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఇస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా చెన్నూర్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పట్టి కృష్ణ, చెన్నూర్ పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘సింగరేణి పరిరక్షణ ఏఐటీయూసీ లక్ష్యం’
బెల్లంపల్లి: సింగరేణిని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ అన్నారు. భారత కమ్యూనిస్టుపార్టీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్సుజాత శనివారం రాత్రి బె ల్లంపల్లికి చేరింది. బీఆర్ అంబేడ్కర్(కాంటా) చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఈ నెల 30న కొత్తగూడెంలో నిర్వహించనున్న ము గింపు సభను విజయవంతం చేయాలని కోరారు. సభలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డెప్యూటీ కార్యదర్శి వైవీరావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
ఈద్ ముబారక్
జైపూర్: ఇందారంలో సర్పంచ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి వివేక్వెంకటస్వామిమంచిర్యాలఅర్బన్/జైపూర్: జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. నెలపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసదీక్షలు చేసి శనివారం ఉదయం నుంచే మంచిర్యాల బస్టాండ్, ఆండాళమ్మ కాలనీ వద్ద గల ఈద్గాలు, ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు సందేశమిచ్చారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు తదితరులు ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండల కేంద్రంతోపాటు ఇందారం, టేకుమట్ల తదితర గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ఇందారం సర్పంచ్ ఎండీ ఫయాజొద్దీన్ ఇంట్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు -
‘ఓట్ల కోసం అభివృద్ధిని ఆపం’
మంచిర్యాలటౌన్: ఓట్లు నష్టపోతామని అభివృద్ధిని ఆపలేమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. నగరంలోని మా ర్కెట్ ఏరియాలో రోడ్డు వెడల్పు పనుల్లో భా గంగా ఆక్రమణల కూల్చివేతలను శనివారం పరిశీలించారు. హిందూ పండుగల నేపథ్యంలోనే రాజకీయ కక్షతోనే మార్కెట్లో కూల్చివేతలు చేపడుతున్నట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రూ.78కోట్లతో పూర్తిస్థాయిలో రోడ్ల వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ వి ద్యుత్ కనెక్షన్ పనులు చేపడుతున్నట్లు తెలిపా రు. రోడ్డు వెడల్పు పనులతో గతంతో పోలిస్తే వ్యాపారం మరింత పెరిగిందని, జీఎస్టీ లెక్క లే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మంచిర్యాల ఫైర్స్టేషన్ ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించిందని, ఆరు ఫైరింజన్లను అందుబాటులో ఉంచేందుకే నస్పూరు లేదా గుడిపేట్కు దానిని తరలించాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్స్టేషన్ స్థలం ఫారెస్ట్ డిపార్టుమెంట్కు ఇచ్చి, ప్రస్తుత ఫారెస్ట్ కార్యాలయమున్న చోట కార్పొరేషన్ షాపింగ్ కాంప్లె క్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ భూములు తాను స్వాధీనం చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. -
తలంబ్రాలపై అవగాహన
మంచిర్యాలఅర్బన్: వివాహాలు, గృహప్రవేశాలు, పుట్టినరోజు వేడుకలు తదితర శుభకా ర్యాల్లో రాములోరి తలంబ్రాలు వాడటం శు భప్రదమని ఆర్టీసీ మంచిర్యాల డీఎం శ్రీనివా సులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల బస్టాండ్లో రాములోరి తలంబ్రాల పంపిణీ పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలు అత్యంత విశిష్టమైనవని చెప్పారు. రాములోరి తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు కార్గో ద్వారా ముందుస్తు బుకింగ్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు మంచిర్యాల కార్గో సెంటర్ను సంప్రదించాలని సూచించారు. అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత, ట్రాఫిక్ సూపర్వైజర్లు వెంకటేశ్వర్లు, మాధవి, భారతి తదితరులున్నారు. -
జనసంద్రమైన దీక్షభూమి
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి హెచ్ గ్రామంలోని బంజారా జాతీయ దీక్షభూమి జనసంద్రమైంది. సేవాలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన భక్తుల మహాపాదయాత్రను దీక్షగురువు శ్రీ సద్గురు ప్రేమ్సింగ్ మహరాజ్ శుక్రవారం ప్రారంభించారు. రాష్టం నుంచే కాక మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో దీక్షభూమికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దీక్షగురు వు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సేవాలాల్ దీక్ష చేపట్టారని తెలిపారు. ఈనెల 27న శ్రీరామనవమి రోజు మహారాష్ట్రలోని పౌరఘడ్లోని పుణ్యక్షేత్రానికి వారు చేరుకుని దీక్ష విరమిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక భావంతో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రను ప్రారంభిస్తున్న ప్రేమ్సింగ్ మహరాజ్ యాత్రలో భక్తులు -
సంరక్షిస్తేనే మనుగడ
జన్నారం: పర్యావరణం, అడవులు, వన్యప్రాణులు సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అడవిపై గొడ్డలివేటు ఈప్రక్రియకు ఆటంకం కలిగిస్తోంది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వన్యప్రాణుల కలయికకు నిలయంఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ విభిన్న జీవవైవిధ్యానికి నిలయంగా మారుతుంది. సుమారు 2,015 చదరపు కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కవ్వాల్ అడవి, అ రుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నిలయం. ఇ క్కడి టేకు అడవులు రాష్ట్రంలోనే నాణ్యమైనవిగా పే రుగాంచాయి. 2012లో కవ్వాల్ అభయారణ్యాన్ని కేంద్రప్రభుత్వం ’టైగర్ రిజర్వ్’గా ప్రకటించింది. ఇక్కడ కేవలం పులులే కాకుండా చిరుత, జింకలు, సాంబార్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు అడవి పందులు తదితర వన్యప్రాణులు, సరిసృపాలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో ఇక్కడ వందలాది జాతుల పక్షులు, విదేశీ వలస పక్షులు సందడి చేయడం విశేషం. జీవవైవిధ్యంలో ముఖ్యపాత్రఅడవులు భూమికి ఊపిరితిత్తులు లాంటివి. కార్బన్ డై ఆకై ్సడ్ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంది. మనిషి మనుగడకు దోహదపడే అడవులు జీవవైవిధ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పక్షులు, జంతువులు, వివిధ రకాల కీటకాలను అ వాసాలుగా మారిన అడవులు అంతరించిపోతే అనర్థాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. పిచుకలు అంతరించిపోవడం వల్ల మిడుతలు వచ్చినట్లు, కరోనా లాంటి కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి. ప్రాణకోటికి అవాసంగా ఉన్న అడవుల రక్షణ అత్యంత అవసరం. పెరిగిన అడవుల శాతంగతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్ ప్రాంతంలో అడవుల శాతం పెరిగాయి. రాష్ట్రం ఏర్పడక ముందు పోడు సాగుకు, స్మగ్లింగ్ కోసం అడవులు నరికివేతకు గురయ్యాయి. దీంతో అడవుల శాతం తగ్గుతూ వచ్చింది. 2020 ముందు 21 శాతానికి పడిపోయింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి ప్రస్తుతం 21 నుంచి 33 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న స్మగ్లింగ్!గతంతో పోలిస్తే కవ్వాల్ టైగర్జోన్లోని పలు ప్రాంతాల్లో స్మగ్లింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్లో ఆరు నెలల్లో సుమారు రూ.5లక్షల పైగా కలప స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అధికారులు పలు వాహనాలను పట్టుకున్నారు. -
ప్రకృతికి ప్రోత్సాహం
మంచిర్యాలఅగ్రికల్చర్: రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని నేల, జీవ వైవిధ్యం, వాతావరణం, ఆహార పంటలు విషతుల్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయ వైపు మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ సేంద్రియ వ్యవసాయ పథకం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, మత్స్యశాఖల సమన్వయంతో సేంద్రియ వ్యవసాయం 2025–26, 27 సంవత్సరాలకు గాను ఎంపిక చేసిన రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి సంవత్సరానికి పెట్టుబడి కింద రూ.4వేల చొప్పున అందిస్తారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సాగు వ్యయాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ముఖ్య ఉద్దేశంతో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద జిల్లాలో 1875 మంది రైతులను ఎంపిక చేశారు. ఐడీ కార్డు, భూముల భూసార పరీక్షలు చేయించి వాటి ఫలితాల కార్డు, సలహాల బుక్, బ్యాగ్, క్యాప్, తదితర వివరాలతో కూడిన కిట్లు అందజేశారు. జిల్లాలో 15 క్లస్టర్లుప్రకృతి వ్యవసాయానికి జిల్లాలో 15 క్లస్టర్లు ఏర్పా టు చేసి.. ఒక్కో క్లస్టర్లో 125మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరు ఒక్కో ఎకరం సాగు చేసే లా సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను వివరించి ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో క్లస్టర్లోని రైతులకు సలహాలు అందించేందుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన ప్రగతిశీల మహిళా రైతులు(కృషి సఖీస్) వాలంటీర్లుగా 30మందిని నియమించారు. కమ్యూనిటీ బేస్గా పని చేసేందుకు వేతన ఇతరత్రా కలిపి రూ.5వేలతోపాటు ప్రత్యేక మొబైల్ అందజేసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ద్వారా 16 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. వర్షాకాలానికి ముందే సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సేంద్రియ వ్యవసాయ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే సూచనలు, సలహాలు, పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. భూసార పరీక్షలకు అనుగుణంగా నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు, వాతావరణ మా ర్పులకు అనుగుణంగా పంటలు విత్తుకోవడం, ప్ర కృతిపరంగా లభించే ఎరువులు ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, పప్పుల పిండి, రైజోస్పియర్ మట్టి, వేప, కానుగ, బొప్పాయి, జామ ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి సహాజసిద్ధంగా లభించే వాటితో తయారు చేసే వర్మీ కంపోస్టులు బీజామృతం, జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నాస్త్రం, దశపర్ణికషాయం వంటి ద్రా వణాలు, కషాయాల సేంద్రియ ఎరువులను విని యోగిస్తూ ఆనాటి సనాతన పద్ధతిలో పంటల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. మొదటి విడతలో 1875 ఎకరాలు..జిల్లాలో 3.60లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 1.58లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా పత్తి, వరి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంటలతోపాటు కూరగాయల పంటల దిగుబడి కోసం రైతులు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తుండడంతో పెట్టుబడి పెరిగిపోతోంది. ఖరీఫ్, రబీ సీజన్లో వందలాది మెట్రిక్ టన్నుల ఎరువులు, వందల లీటర్ల చీడపీడల పురుగు మందులు వినియోగిస్తున్నారు. వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం, నేల నిస్సారం అవుతోంది. రసాయనిక మందులు పిచికారీ చేస్తున్న రైతులతోపాటు వినియోగిస్తున్న ప్రజలూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో రసాయనిక ఎరువుల వినియోగం విడతల వారీగా తగ్గించేందుకు ప్రభుత్వం సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో.. -
రేషన్ బియ్యం పట్టివేత
నస్పూర్: నగర పరిధిలోని తోళ్లవాగు సమీపంలో శుక్రవారం పోలీసులు తనిఖీ నిర్వహించారు. మంచిర్యాల నుంచి అక్రమంగా బోలెరో వాహనంలో మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.1.50 లక్షలు విలువ గల 19 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సివిల్ సప్లై డీటీ స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రేషన్ బియ్యాన్ని సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు ఉట్నూర్రూరల్: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉట్నూర్ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని శంకర్తండాకు చెందిన జాదవ్ శ్రీనివాస్ మద్యం తాగి బైక్పై రాగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో ఆవు మృతి మందమర్రిరూరల్: మండలంలోని మామిడిగట్టులో విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతు గుడికందుల భూమయ్యకు చెందిన ఆవు గురువారం ఉదయం మేతకు వెళి్ల్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా చెరువు పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. పశువైద్యాధికారి తిరుపతి శుక్రవారం ఆవును పరిశీలించారు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. రెండురోజుల క్రితం సారంగపల్లిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్తో గేదె మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఇంటర్లో ‘మధ్యాహ్న’ం ఊరట
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీరనుంది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం 2026–27 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. కళాశాలలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో దూర ప్రాంత విద్యార్థులు ఉదయాన్నే వస్తుండడంతో భోజ నం తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఆకలితో తరగతులకు హాజరు కాలేక మధ్యాహ్నం ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో డ్రాపౌట్లు పెరిగిపోవడం, విద్యార్థుల హాజరు శాతం తగ్గడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులకు ఊరట కలుగనుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం 2,433, రెండో సంవత్సరం 1,676మంది విద్యార్థులు ఉన్నారు. ఐదేళ్లుగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనంపై పాలకులు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుండడంతో విద్యార్థుల ఆకలి తీరి కళాశాలల్లో సంఖ్యతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. సీఎం చిత్రపటానికి పాలాభిషేకంప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం విస్తరించడంపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు విజిత్కుమార్, ఆసిఫ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి అంజయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అంగట్లో అడవి బిడ్డలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పేదరికం, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అడవి బిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా ఉన్నా పెళ్లి కాని యువకుల కోసం ఇక్కడి అమ్మాయిలను తరలిస్తున్నారు. ఈ దందాలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను పని కల్పిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించి పెళ్లి చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇతర రాష్ట్రాలే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలు సామాజిక వర్గాల వారు సైతం గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ల పేరుతో డబ్బులు పోసి కొనుక్కుంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులకు ఎంతో కొంత ఎదురిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు జరిగాక ఆ కుటుంబాల్లో పరిస్థితులకు తట్టుకోలేక తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. పేదరికమే శాపంనిరుపేద గిరిజన కుటుంబాల్లో అమ్మాయిలు చాలా వరకు పది, ఇంటర్ వరకు చదివి ఆపేస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఉన్న వారు, విడాకులు పొందిన, భర్త చనిపోయిన వారిని పెళ్లిళ్ల కోసం మధ్యవర్తులు అమ్మాయిల తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు. పెళ్లి ఖర్చులతో సహా కుటుంబీకులకు డబ్బులు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా మహిళలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాలకు ఇక్కడి మహిళలతో పెళ్లిళ్లు జరిగాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ఇష్టంతోనే జరుగుతున్నాయి. గోండి భాషతో సహా మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం సులువు కావడంతో గిరిజన మహిళలను ఉత్తరాదికి పంపుతున్నారు. ఇందులో గ్రామంలో ఉన్న మధ్యవర్తులు, పలు రాష్ట్రాల్లోని మధ్యవర్తులు వ్యవహారమంతా నడుపుతున్నారు. ఇవి కొన్నిసార్లు మాత్రమే బయటపడుతున్నాయి. పెళ్లిళ్లు, పని కల్పన పేరుతోగతేడాది మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ, స్థానిక మధ్యవరులు కలిసి ఆసిఫాబాద్కు చెందిన ఓ యువతిని మధ్యప్రదేశ్కు పెళ్లి పేరుతో విక్రయించారు. అక్కడ వారి బారి నుంచి తప్పించుకుని బయటపడి ఫిర్యాదు చేయడంతో 9మందిపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది మహిళల అక్రమ రవాణా కేసుపై విచారణ జరుగుతోంది. బాధిత మహిళలను సురక్షితంగా తీసుకొచ్చాం. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తాం. –నితిక పంత్, జిల్లా ఎస్పీ


