Mancherial
-
క్షయవ్యాధి నిర్మూలనకు చర్యలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన మందులు అందిస్తున్నామని, జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్బంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రారంభించారు. అనంతరం క్షయ నివారణకు ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకు రావాలని, నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి సురేందర్, డీపీఎం ప్రశాంతి, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
దొంగతనం కేసులో భార్యాభర్తలకు జైలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలకు జైలు శిక్ష పడింది. వన్టౌన్ ఎస్హెచ్ఓ ఎన్.దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పోస్టాఫీసు బస్తీకి చెందిన అజయ్కుమార్ సహానికి బజారు ఏరియా ప్రాంతంలో బట్టల దుకాణం ఉంది. 2022 నవంబర్ 6న రాత్రి దుకాణంలో చోరీ జరిగింది. 250 గ్రాముల బంగారు బిస్కెట్లు, రెండు సెల్ఫోన్లు, రూ.5000 నగదు దొంగిలించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్హెచ్వో ఎం.రాజు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. బెల్లంపల్లి హన్మాన్బస్తీకి చెందిన భార్యాభర్తలు ఎండీ.బద్రుద్దీన్, అస్పీయా సీరిన్పై కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ చేసి చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఏడుగురు సాక్షులను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.అజయ్కుమార్ ప్రవేశపెట్టగా జేఎఫ్సీఎం మేజిస్ట్రేట్ జే.ముకేష్ విచారణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులకు ఆరు నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. దాడికేసులో ముగ్గురి రిమాండ్ఆదిలాబాద్రూరల్: దాడి కేసులో ముగ్గురిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మావల పోలీసుస్టేషన్ పరిధిలోని పలువురు కార్మికులపై ఈనెల 9న కొందరు దాడిచేశారు. కార్మికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి భగత్సింగ్ కాలనీకి చెందిన అడ్లూరి రాజు, సమీర్, అర్ బాస్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో చోరీబోథ్: మండలంలోని పెద్దార్లగుట్టలో హనుమాన్ ఆలయం, వాగు వద్ద గల అయ్యప్ప సన్నిధానంలో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్థానికుడు.. అయ్యప్ప సన్నిధానానికి వెళ్లగా తలుపుల తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా ఉంది. అలాగే హనుమాన్ ఆలయం తాళం పగులగొట్టి ఉండడాన్ని భక్తుడు గమనించాడు. హుండీని పగులగొట్టి ఉండడంతో స్థానికులకు సమాచారం అందించాడు. అందులో నగదు ఎత్తుకెళ్లారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలోని పట్నాపూర్కు చెందిన మడావి కార్తీక్ చోరీ చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఐదు గంటల్లోనే దొంగను పట్టుకున్న ఎస్సై, పోలీసు సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. బైక్ చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ద్వారకానగర్లో ఆదివారం రాత్రి బైక్ చోరీకి గురైంది. నేరడిగొండ మండలంలోని వాగ్దారికి చెందిన సోయం వెంకటేశ్ ఆదిలాబాద్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసిన ఆయన ఉదయం చూసే సరికి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కలా గాలించినా కనిపించలేదు. సోమవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్టు
బెల్లంపల్లి: బెల్లంపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. సోమవారం వన్టౌన్ ఎస్హెఎచ్వో ఎన్.దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం... కన్నాల బస్తీ వద్ద కొందరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో వన్టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య, పోలీసు సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల్లో ఎండీ.తాజ్బాబా(హన్మాన్ బస్తీ–బెల్లంపల్లి), షేక్ ఇర్ఫాన్ బాబా (షంషీర్ నగర్–బెల్లంపల్లి ), వాసాల గిల్క్రిస్ట్(రాజీవ్నగర్–తాండూర్), మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సంతోష్ సామ్రాడ్ జాదవ్(కాల్టెక్స్ ఏరియా) ఉన్నారు. వీరి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా గంజాయి, తాగుడుకు బానిసగా మారి మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు చర్యలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన మందులు అందిస్తున్నామని, జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్బంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రారంభించారు. అనంతరం క్షయ నివారణకు ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకు రావాలని, నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్నాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి సురేందర్, డీపీఎం ప్రశాంతి, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
స్వర్ణకారులకు గడ్డు కాలం
● ఆర్నెళ్లుగా పసిడి ధరలు ౖపైపెకి ● నగల తయారీపై ప్రభావం ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు పాతమంచిర్యాల: పసిడి ధరలు రోజురోజుకూ ౖపైపెకి పోతున్నాయి. ఆర్నెళ్లుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం నగల తయారీపై పడుతోంది. దీంతో కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న స్వర్ణకారులు, బంగారు ఆభరణాల తయారీదారులు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. బంగారం ధర నిలకడగా ఉండకపోవడంతో కొనుగోలు దారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో చిన్నచిన్న ఆభరణాలు తయారు చేసేవారికి పని లేకుండా పోతోంది. పెరుగుతున్న బంగారం ధర ఒక కారణమైతే కార్పొరేట్ సంస్థలు తయారు చేసే ఆభరణాలు కొనుగోళ్లు కాగా బెంగాల్ నుంచి వ చ్చిన కొందరు నగల తయారీదారులు తక్కువ రేట్ల కే నగలు తయారు చేయడం మరో కారణంగా స్వర్ణకారులు పేర్కొంటున్నారు. కాగా వృత్తినే నమ్ముకుని బతుకుతున్న స్వర్ణకారులకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నామని వాపోతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలు గతేడాది నవంబర్లో బంగారం 10 గ్రాములకు రూ.78 నుంచి రూ.79 వేలకు మధ్యలో ఉంది. డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.90,900 ధర పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్లో కూడా నగల తయారీ కోసం అంతగా ఆర్డర్లు రాలేదని, తాళిబొట్టు, పుస్తెమెట్టెల తయారీకి కూడా ఆర్డర్లు దొరకడంలేదని వాపోతున్నారు. వాటి తయారీకి కూడా ఆర్డర్లు రావడంలేదని, అవి కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద దుకాణాలకే వెళ్తున్నారని స్వర్ణకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను బీసీ కార్పొరేషన్లో కాకుండా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందిస్తే కొంత చేయూత అందించినట్లవుతుందని స్వర్ణకార సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి స్వర్ణకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందించాలి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బంగారు నగల తయారీ చేస్తూ మాకు పనులు లేకుండా చేస్తున్న వారిని కట్టడి చేయాలి. – ధర్మవరం బ్రహ్మయ్య, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
వెద్య విద్యార్థుల జోష్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఫెస్ట్ 2.0లో వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. వైద్య విద్యలో నిత్యం బిజీగా ఉండే విద్యార్థులు ఈ నెల 27నుంచి కళాశాలలో క్రీడలు నిర్వహించగా, 21నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ఫెస్ట్లో ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు. 300మంది ఎంబీబీఎస్ విద్యార్థులు వారం రోజులపాటు నిర్వహించే ఫెస్ట్కు కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.సులేమాన్, ప్రొఫెసర్లు ప్రోత్సహిస్తూ, వారికి మెమెంటోలు అందజేస్తున్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డితో సోమవారం ట్రాఫిక్ అవగాహనతో కూడిన ప్లెక్సీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. పట్టణంలో సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడానికి ప్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు పోతారం శ్రీనివాస్, సీహెచ్.నాగేందర్ పాల్గొన్నారు. -
రూ.26.25లక్షలు పలికిన తైబజార్
కై లాస్నగర్: పట్టణ తైబజార్ వేలం ద్వారా మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరింది. పట్టణానికి చెందిన మీర్జా అమ్రీన్బేగ్, సయ్యద్ ఇస్రార్, కాళ్ల సాయికృష్ణలు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ సీవీఎన్.రాజు అధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఇస్రార్ గైర్హాజరు కాగా మిగతా ఇద్దరు హాజరయ్యారు. ఇందులో అధికంగా రూ.26.25 లక్షలకు మీర్జా అమ్రీన్బేగ్ తైబజార్ను దక్కించుకున్నారు. గతేడాది రూ.20.69 లక్షలకు వేలం వేయగా, ఈసారి బల్దియాకు రూ.5.56లక్షల ఆదాయం అదనంగా సమకూరింది. సదరు వ్యక్తికి ఏడాదిపాటు తైబజార్ నిర్వహించుకునే అవకాశముంటుంది. బల్దియా ఉద్యోగులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ ఎంపికపై ఫిర్యాదు
● ఒకే కేంద్రంలో 61 మంది ఎంపికపై విచారణకు తల్లిదండ్రుల వినతి ఖానాపూర్: భైంసా పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష కేంద్రంలో 61 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపిక కావడంపై విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లి దండ్రులు, నాయకులు కోరారు. హైదరాబాద్లో తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సోమవారం ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష జరిగిందని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ప్రోవిజినల్ లిస్టులో అధికారులు 68 మంది పేర్లు ప్రకటించగా, అందులో భైంసా కేంద్రానికి చెందిన వారే 61 మంది ఎంపిక కావడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. విచారణ చేసి మిగతా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదు చేసినవారిలో పుప్పాల గజేందర్, విద్యార్థుల తల్లి దండ్రులు ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీలో ‘త్రినయన’
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో త్రినయన సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే అనేక ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జానపదాల పాటలు, నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచయి. కళలు, సంగీతం, నృత్యం మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ప్రదర్శన ‘ఫ్యాషన్ ఫ్రెంజీ‘ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ‘త్రినయన’ పేరిట జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు తమలోని కళా నైపుణ్యం ప్రదర్శించారన్నారు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకతను ప్రోత్సహించే వేదికగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏఓ రణధీర్సాగి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. కన్వీనర్లు డాక్టర్ రాములు, డాక్టర్ అజ య్, ప్రభాకర్రావు అసోసియేటెడ్, డాక్టర్ విఠల్, డాక్టర్ మహేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు -
స్టాళ్ల నిర్మాణం... బల్దియాకు ఆదాయం
● ప్రభుత్వ, సింగరేణి ఖాళీ స్థలాల్లో చిరు వ్యాపారాలు ● స్టాళ్లు నిర్మించి అద్దెకు ఇస్తే మున్సిపాలిటీకి వనరులు బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి ఖాళీ స్థలాలకు కొదువలేదు. అంతర్గత ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో చిరు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. నిరుపేదలు, నిరుద్యోగులు, సింగరేణి రిటైర్డు కార్మికులు తోపుడు బండ్లపై, తాత్కాలికంగా చిన్నపాటి షెడ్లను ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, ఇతర రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిరు వ్యాపారం పేద కుటుంబాలకు జీవనాధారంగా మారగా శాశ్వత ప్రాతిపదికన నిర్వహించే అవకాశాలు లేకుండా ఉన్నాయి. మున్సిపాలిటీ పరంగా స్టాళ్లను నిర్మించి చిరు వ్యాపారులకు కేటాయిస్తే జీవనోపాధి కల్పించడంతో పాటు బల్దియాకు ఆదాయ వనరులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు ఆదిశగాసానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే ఉపయోగం మున్సిపాలిటీలోని స్టేషన్ రోడ్కాలనీ (చమ్రీస్ క్వార్టర్స్) అంతర్గత ప్రధాన రహదారి పక్కన చౌడేశ్వరి ముందు, కోర్టు ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో ప్రస్తుతం తోపుడు బండ్లు, షెడ్ల ఆధారంగా ప్రజావసరాలకు అనుగుణంగా మటన్, చికెన్, కట్టెలు, పండ్లు ఇతర రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరంగా స్టాళ్లను నిర్మించడం వల్ల చిరు వ్యాపారులకు లబ్ధిచేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ● ఏరియాలకు అనుగుణంగా అందుబాటులో స్టాళ్లను నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల వాసులకు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి సౌలభ్యంగా ఉంటుంది. బజారు ఏరియా ప్రాంతానికి రావడానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. కాలినడకన వెళ్లి సునాయాసంగా కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది. ● మున్సిపాలిటీలో నివసిస్తున్న యువతకు స్వయం ఉపాధి లభించడంతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు నివారించడానికి అవకాశాలు ఉంటాయి. ● రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల్లో దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఏర్పడుతుంది. ● స్టాళ్ల ఏర్పాటు వల్ల మున్సిపాలిటీకి స్థిరమైన ఆదాయం వస్తుంది. తద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి ఆర్థికభారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ● స్టాళ్లను నిర్మించడం వల్ల సాధ్యమైనంత వరకు ఖాళీ స్థలాలు దురాక్రమణకు గురి కాకుండా ఉంటాయి. ప్రజావసరాలకు దోహద పడతాయి. రెండు చోట్ల స్టాళ్ల నిర్మాణం మున్సిపాలిటీ తరపున ఇప్పటికే మూసివేతకు గురైన సింగరేణి వర్క్షాప్, స్టోర్స్ ముందు ప్రధాన రహదారి పక్కన, కాల్టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద స్టాల్ల నిర్మాణం జరిగింది. వాటిని చిరు వ్యాపారులు అద్దెకు తీసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. కాల్టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రెండువైపులా స్టాళ్లు ఉండగా ఒకవైపు ఉన్న వాటిని మాత్రమే అద్దెకు తీసుకున్నారు. రామకృష్ణ థియేటర్ పక్కన నిర్మించిన స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కాగా స్టాళ్లలో కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కొంతమంది కూరగాయలు అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం. స్టాళ్ల ద్వారా మున్సిపాలిటీకి స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నా సరిగా శ్రద్ధపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి సముచిత నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కార్మికులపై వేధింపులు మానుకోవాలి
● హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ జైపూర్(చెన్నూర్): అధికారులు కార్మికులపై వేధింపులు మానుకోవాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. జైపూర్ మండలం ఇందారం ఐకే1ఏ గనిని సెంట్రల్ కమిటీ సభ్యులు తిప్పారపు సారయ్యతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బెదిరింపు లెటర్లు, చార్జీషీట్లు ఇస్తూ కొంతమంది అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వేతనంలో కోత విధిస్తున్నారని, సమస్యల మీద ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మికులు తెలపగా అధికారులపై మండిపడ్డారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై దృష్టి సారించడంతో పాటు రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు అశోక్, కొమురయ్య, సాయికుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు విరాళం
ఇచ్చోడ: వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ సభకు ముఖరా కే గ్రామస్తులు సోమవారం రూ.1,02,003 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గేమీనాక్షి మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశారని తెలిపారు. అందుకని 25ఏళ్ల పార్టీ ఆవిర్భవ సభకు గ్రామస్తులంతా కలిసి ఖర్చుల కోసం విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు విరాళం చెక్కును అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గేసుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్నస్పూర్: జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్లోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ మంచిర్యాల ఆర్డీఓతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. – మందమర్రి శివారులోని తన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, ఈ విషయమై కోర్టులో కేసు కొనసాగుతున్నందున ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ చేయాలని మందమర్రి మండలం విలేజ్ రామకృష్ణాపూర్కు చెందిన మెంగని శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ● ఇందిరమ్మ ఇళ్లు ప్రతీ దివ్యాంగుడికి కేటాయించాలని, 40శాతం వైకల్యం కలిగిన వారికి అంత్యోదయ రేషన్ కార్డులు అందించాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో అవకాశం కల్పించాలని, సదరం శిబిరాల్లో స్లాట్లను 100కు పెంచాలని తెలంగాణ దివ్యాంగుల ఐక్యవేదిక ప్రతినిధి నగురారపు సుమన్ కోరారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
● విక్రయించే వారిపై పీడీ యాక్టు ● మంచిర్యాల డీసీపీ భాస్కర్ తాండూర్: మండలంలో 2.47 క్వింటాళ్ల నిషేధిత ప త్తి విత్తనాలను తాండూర్ పోలీసులు పట్టుకున్నా రు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్ల డించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మనోహర్ ఈ నెల 20న ఐచర్ వ్యాన్లో పల్లీల లోడును మధ్యప్రదేశ్లో దింపి తిరుగు ప్ర యాణంలో నాగ్పూర్లో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలతో పాటు 11 బ్యాగుల్లో 550 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను తాండూర్కు రవాణా చేశాడు. సోమవారం తాండూర్ మండలం అచ్చులాపూర్, గోపాల్నగర్ గ్రామాల మధ్య సన్యాసి మఠం అటవీ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను కారులోకి మారుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఐచర్ వ్యాన్, కారు డ్రైవర్లు సెగ్యం సందీప్, గాడిపల్లి సత్యనారాయణ, బోగే సాయికిరణ్, కుమార్లను, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చిన నారాయణ, రమేష్, వెంకటేష్, సత్యం, తిరుపతిలను అరెస్టు చేశారు. 2.47 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, కారు, ఐచర్వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల దందాలో ప్రధాన సూత్రధారి మనోహర్రెడ్డి, మరో కొనుగోలుదారు మల్లేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. విత్తనాల విలువ రూ.6,17,500 వరకు ఉంటుందని వివరించారు. నకిలీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నకిలీ పత్తినాల కేసులు ఐదు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, తాండూర్ సీఐ కుమారస్వామి, తాండూర్, మాదారం ఎస్సైలు కిరణ్కుమార్, సౌజన్య, మండల వ్యవసాయ అధికారి సౌమ్య పాల్గొన్నారు. కాసిపేట మండలంలో.. కాసిపేట: మండలంలోని కొండాపూర్లో 50కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నిందితులను రి మాండ్కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్ల డించారు. ఈ నెల 23న కొండాపూర్లోని గుడిమల్ల చెంద్రయ్య ఇంట్లో పోలీసులు వ్యవసాయ అధికారి ప్రభాకర్తో కలిసి సోదాలు చేయగా నిషేధిత పత్తి విత్తనాలు లభించాయని తెలిపారు. ఈ నెల11న చెంద్రయ్య, కిష్టంపేటకు చెందిన కూనారపు బాలకృష్ణ, మందమర్రికి చెందిన జాని, ముల్కాల సుధీర్, గోవిందుల శంకర్లు నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారని తెలిపారు. విత్తనాల విలువ రూ.1.25లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మంచిర్యాలలో పీఎస్టీ వసూళ్లు
● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుమంచిర్యాలటౌన్: దేశంలో పన్ను వసూలుకు జీఎస్టీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పీఎస్టీ(ప్రేమ్సాగర్రావు ట్యాక్స్) వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంచి మంచిర్యాలను వసూలు మంచిర్యాలగా మార్చారని విమర్శించారు. మంచిర్యాల ఉమర్మియా సొసైటీలో ఇంటికి రూ.6 లక్షలు, కలెక్టర్ కార్యాలయం వద్ద కూల్చిన ఇళ్లను మళ్లీ కట్టి, కోట్లు వసూలు చేశారని, మంచిర్యాల వ్యాపారుల వద్ద రూ.40 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. రోడ్డు వెడల్పు పేరిట భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు గాను ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున, ఒకచోట రూ.50 లక్షలు వసూలు చేశారని విమర్శించారు. ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్ పరిధి నెపంతో రూ.2 కోట్ల వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ, ప్రైవేటు భూములు, బెల్లంపల్లి చౌరస్తా భూమి, తిలక్నగర్ ప్రభుత్వ భూమి, నస్పూరులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తప్పకుండా కూల్చుతామని అన్నా రు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూల్చిన తర్వాత వచ్చిన మెటీరియల్ను అమ్మితే వచ్చిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. శ్మశాన వాటిక నిర్వహణ కోసం మార్వాడి సమాజం, వైశ్యులు, బంగారం దుకాణాల నుంచి నెలకు రూ.లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు అంకం నరేశ్, గోగుల రవీందర్, బేర సత్యనారాయణ, మొగిలి శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, పడాల రవీందర్, నాయకులు పాల్గొన్నారు. -
చెత్త సేకరణ అధ్వానం
బెల్లంపల్లి: ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీ బెల్లంపల్లిలో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. పట్టణంలో 34 వార్డుల్లో రోజువారీగా చెత్త సేకరించాల్సి ఉండగా.. పారిశుద్ధ్య సిబ్బంది, ఆటోట్రాలీల సమస్య కారణంగా మూడు నాలుగు రోజులకోసారి సేకరణ జరుగుతోంది. శివారు వార్డుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కనీసం పక్షం రోజులకోసారైనా చెత్త తొలగించడం లేదనే ఆరోపణలున్నాయి. రోజువారీగా 25టన్నుల చెత్త వెలువడుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుర ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖరారు కాని డంపింగ్ యార్డు మున్సిపాల్టీ ఏర్పడి 38ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు డంపింగ్ యార్డు లేకుండా పోయింది. ఒకటోవార్డు కన్నాల బస్తీ శివారులో రెండు దశాబ్దాల క్రితం ఐదెకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పరిధిలోకి వెళ్లడంతో అధికారికంగా మళ్లీ ఎక్కడ నిర్వహించాలో ఖరారు చేయలేదు. 65డీప్, శాంతిఖని బస్తీల మధ్య ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రతిపాదించి అక్కడ చెత్త వేస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. దీంతో గోల్బంగ్లాబస్తీ, గురిజాలకు వెళ్లే మార్గంలో ఉన్న హిందుశ్మశాన వాటికలో అనధికారికంగా చెత్త డంప్ చేశారు. దుర్వాసన వస్తుండడంతో తాజాగా గోల్బంగ్లాబస్తీ, నంబరు–2 ఇంకై ్లన్ బస్తీ వాసులు ఆందోళన చేశారు. అక్కడి నుంచి మళ్లీ కాసిపేట శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలో చెత్త వేస్తున్నారు. వార్డుల నుంచి సేకరించిన చెత్తను కోర్టు ముందు ఉన్న రైతుబజార్ స్థలంలో నిల్వ చేస్తున్నారు. అక్కడ దుర్వాసన వెదజల్లుతుండడంతో సమీప ఇళ్ల ప్రజలు భరించలేకపోతున్నారు. సమయానుకూలంగా ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల్లో అక్కడి నుంచి కాసిపేట శివారులోని ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారు. జనావాసాలకు చేరువలో డంప్ యార్డు వద్దని కాసిపేట ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డంప్యార్డును అధికారికంగా ఏర్పాటు చేయడంలో సతమతం అవుతున్నారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ● పోలీసుస్టేషన్లలో తనిఖీ కోటపల్లి/వేమనపల్లి/భీమిని: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆన్నారు. సోమవారం ఆయన కోటపల్లి, వేమనపల్లి మండలం నీల్వాయి, కన్నెపల్లి పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరి సరాలు, రికార్డులు పరిశీలించి సిబ్బందితో మా ట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే పోలీ స్స్టేషన్లో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారుల కు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలని, ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నీల్వాయిలో మ హారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై అడిగి తెలుసుకున్నారు. గతంలో జరిగిన ఘట నలు, మావోయిస్టుల కదలికలు, సానుభూతిపరులు, మిలిటెంట్లపై ఆరా తీశారు. కన్నెపల్లిలో పోలీసుస్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్పెషల్బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్, ఎస్సై గంగారాం పాల్గొన్నారు. -
క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్నస్పూర్: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్లోని కలెక్టరేట్లో సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్రావు, జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి, చెన్నూర్లో చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1,278 కేసులు గుర్తించి 871 మందికి మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ పథకంలో భాగంగా జిల్లాలో ఏడు ముక్త్ గ్రామ పంచాయతీలను నిర్ణయించామని, వాటిలో చెన్నూర్ మండలం పొక్కూర్, కాసిపేట మండలం పల్లంగూడ, వేమనపల్లి మండలం సుంపుటం, జైపూర్ మండలం నర్వ, హాజీపూర్ మండలం పడ్తనపల్లి, భీమిని మండలం వీగాం, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. క్షయ వ్యాధి నివారణలో ఉత్తమ సేవలు అందించిన 22 మంది వైద్యులు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు ప్రదానం చేశారు. హిందూ సేవక్ సమాజ్, పెన్నిధి వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓలు భీష్మ, ప్రోగ్రామ్ అధికారి సుధాకర్నాయక్, అధికారులు అనిత, సీతారామరాజు, ప్రసాద్, హరిశ్చంద్రారెడ్డి పాల్గొన్నారు. వడదెబ్బ నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి నస్పూర్: వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో సోమవారం మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా ఆరోగ్య వైద్యాధికారి హరీష్రాజ్, అధికారులతో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా త్రిసభ్య కమిటీలో వైద్యాధికారి, ఎస్సై, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారని, వడదెబ్బ కేసుల వివరాలు, మరణాలు ధ్రువీకరిస్తారని తెలిపారు. జిల్లాలో ఎస్సీడీ నోడల్ అధికారిగా డాక్టర్ ప్రసాద్ను నియమించినట్లు తెలిపారు. అనంతరం వడదెబ్బ నియంత్రణ వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అధికారులు పురుషోత్తం నాయక్, తిరుపతి, సుదానాయక్, అనిత, సీతారామరాజు, అనిల్, బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘ఒకే దేశం.. ఒకే ఓటు’
దండేపల్లి/లక్సెట్టిపేట: ఒకే దేశం, ఒకే ఓటు ఎంతో అనుకూలమైనదని, విద్యార్థులు జమిలీ ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన దండేపల్లి పద్మశాలి భవన్ వద్ద, లక్సెట్టిపేటలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగా హన కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రాల అ సెంబ్లీలు, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు ని ర్వహించడం వల్ల దేశప్రగతిపై ప్రభావం చూ పుతుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తె లిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్, దండేపల్లి మండల అ ధ్యక్షుడు రాజయ్య, నాయకులు ముకేశ్గౌడ్, ర వీందర్, సత్తయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, నరేష్ చంద్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి సంజయ్పై ఫిర్యాదులు
చెన్నూర్/కోటపల్లి/మందమర్రిరూరల్/మంచిర్యాలటౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అ నుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహా య మంత్రిపై జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, మంచిర్యాల పోలీసుస్టేషన్లలో బీ ఆర్ఎస్ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. చెన్నూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేశ్ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్రావు ఫిర్యాదు చేశారు. మాజీ మున్సి పల్ వైస్ చైర్మన్ నవాజ్, సాధనబోయిన కృష్ణ, మోతె తిరుపతి, మంత్రి బాపు, రెవెల్లి మహేశ్, జోడు శంకర్ పాల్గొన్నారు. కోటపల్లిలో మాజీ వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ సాంబగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. మందమర్రిలో ఎస్సై రాజశేఖర్కు బీఆర్ఎస్ చెన్నూ ర్ ఇంచార్జీ రాజారమేష్, పట్టణ అధ్యక్షుడు ర వీందర్, రాజశేఖర్, సంపత్, సూరిబాబు, మద్ది శంకర్, చిప్పకుర్తి రేఖ ఫిర్యాదు చేశారు. మంచి ర్యాలలో ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నా యకులు అంకం నరేశ్, శ్రీరాముల మల్లేశ్, అ క్కూరి సుబ్బన్న, మెరుగు పవన్, బేర సత్యనా రాయణ, పంబాల ఎర్రయ్య, పెరుమల్ల జనా ర్దన్, కుమ్మం రాజేశ్వర్రెడ్డి, కొండపర్తి శంకర్, కాటం రాజు, మహ్మద్ సాజిద్ ఉన్నారు. -
కవితా పోటీల్లో ప్రథమ బహుమతి
మందమర్రిరూరల్: మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన కాపురపు రవికుమార్కు కవితా పోటీల్లో ప్రథమ స్థానం దక్కింది. బోయి భీమన్న జీవితం–సాహిత్యంపై నిర్వహించిన కవితా పోటీలో రవికుమార్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ భీమన్న సాహితీ నిధి ట్రస్ట్, కళావేదికలో బోయి భీమన్న సతీమణి హైమావతి, కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతా ప్ తదితరుల చేతుల మీదుగా రవికుమార్ ఆదివారం బహుమతి అందుకున్నారు. -
నాణ్యమైన విద్యనందిస్తున్నాం
నస్పూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్)తెలిపారు. సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన 17వ వార్షికోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో విద్యాసంస్థల ద్వారా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, తెలంగాణలోని ఇతర విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యనందించి వారి బంగారు భవిష్యత్తుకు సంస్థ దోహదపడుతుందన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ రాజేశ్వర్, ప్రిన్సిపాల్ డి నరసింహస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ భూమిలో గంజాయి సాగు
● 17 మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కొర్టికల్ గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలో పడ్వాల్ దశరథ్ అనే రైతు అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా భూమిని కౌలుకు తీసుకొని మిరప, వంగ, బెండ పంటల్లో అంతరంగా గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దశరథ్తో పాటు ఆయన భార్య సాగర్బాయిపై కేసు నమోదు చేయగా, దశరథ్ పరారీలో ఉన్నాడు. సాగర్బాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పట్టుబడిన మొక్కల విలువ రూ.1లక్ష 70వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. రైతు అరెస్ట్ చెన్నూర్: మండలంలోని కొమ్మర శివారులోని పత్తి చేనులో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రైతు ను అరెస్టు చేసినట్లు సీఐ దేవేందర్ తెలిపారు. మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన రైతు జనగామ గట్టుమల్లు..కొమ్మర శివారులో రెండెకరాల భూ మిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అక్రమ ంగా గంజాయి పెంచితే డబ్బులు వస్తాయని ఆశతో చేనులో అక్కడక్కడ గంజాయి సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం చేను కు వెళ్లి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలి పా రు.గట్టుమల్లును రిమాండ్కు తరలించినట్లు పే ర్కొన్నారు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు తెలి పారు. ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టైటిల్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మూడోస్థానం కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం అభినందించారు. జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు జూమిడి కార్తీక్, శ్యామ్, సిద్ధార్థ్ ఎంపికై నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనె శ్యాంసుందర్రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. బీహార్ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి అలుగువెల్లి రమేశ్రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్రెడ్డి, పీడీలు రోజా వరకుమారి, రేణి రాజయ్య, ఎస్టీఎఫ్ కార్యదర్శి ఫణిరాజా, హ్యాండ్బాల్ కోచ్ సునార్కర్ అరవింద్, కళ్యాణ్ పాల్గొన్నారు. -
అనారోగ్యంతో ఏఎంసీ మాజీ చైర్మన్ మృతి
ఇంద్రవెల్లి: అనారోగ్యంతో ఏఎంసీ మాజీ చైర్మన్ సోమసే వెంకట్రావ్(76) మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన ఈయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 2005లో ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమించి మండలకేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఘటన స్థలానికి చేరుకుని వెంకటరావ్ భౌతికాయం వద్ద నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి లోటన్నారు. ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, కాంగ్రెస్ నాయకులు మీర్జా యాకుబ్ బేగ్, ఎండీ మసుద్, జహిర్, గ్రామపటేల్ మారుతి డొంగ్రె తదితరులు ఉన్నారు. -
ఇందన్పల్లి రేంజ్లో న్యాయమూర్తి
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్పల్లి రేంజ్లో ఆదిలాబాద్ జిల్లా సివిల్ న్యాయమూర్తి ప్రమీల జైన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పర్యటించారు. న్యాయమూర్తికి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మకుంట, ఘనిషెట్టి కుంట, వాచ్టవర్ ప్రాంతాలను పరిశీలించారు. అడవి అందాలను చూసి మురిసిపోయారు. అడవి అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను రేంజ్ అధికారి న్యాయమూర్తికి వివరించారు. సైబర్ వలలో యువకుడు●● రూ.2.12 లక్షలు పోగొట్టుకున్న వైనం ● మందమర్రిలో ఘటన..కేసు నమోదు మందమర్రిరూరల్: సైబర్ వలలో పడి యువకుడు రూ.2.12 లక్షలు పోగొట్టుకున్నాడు. మందమర్రిలో ఈఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం..పట్టణానికి చెందిన యువకుడికి గూగుల్లో రివ్యూ ఇస్తూ డబ్బులు సంపాదించవచ్చని ఒక టెలీగ్రామ్ పేరిట నేరగాళ్ల నుంచి మేసెజ్ వచ్చింది. దానికి అంగీకరించడంతో అతన్ని 3వేల మంది ఉన్న టెలీగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ముందుగా పెట్టుబడి రూపంలో కొన్ని డబ్బులు పెట్టాడు. అధిక మొత్తంలో ఆశచూపి తర్వాత రూ. 2.12 లక్షలు పెట్టించారు. తర్వాత నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉమ్మడి జిల్లా మహాసభపాతమంచిర్యాల: జిల్లాకేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో ఆదివారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉమ్మడి జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు సంజీవరావు మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద దేశాల మెప్పు కోసం పాలకులు పాటుపడుతున్నారని విమర్శించారు. ఓపెన్ కాస్టుల విధ్వంసం, టైగర్జోన్లతో ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారన్నారు. ఓపెన్కాస్టుల విధ్వంసాన్ని ఆపాలని, టైగర్జోన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా శ్రీ మన్నారాయణ, ప్రధాన కార్యదర్శి జైపాల్సింగ్, ఉపాధ్యక్షులుగా చంద్రయ్య, పోశం, అనంద్ సంతోష్, శ్రీనివాస్, సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో జైపాల్సింగ్, శ్రీమన్నారాయణ, ప్రజాకళామండలి నాయకులు సమ్మయ్య, చంద్రమౌళి, శ్రీనివాస్, రాజన్న, కుమార్ పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో ముగిసిన టెక్ఫెస్ట్బాసర: బాసర ఆర్జీయూకేటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంత:ప్రజ్ఞ టెక్ఫెస్ట్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఇంజినీరింగ్ విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సామర్థ్యాలను ప్రదర్శించేందుకు టెక్ఫెస్ట్ నిర్వహించినట్లు ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఇందులో విద్యార్థుల ప్రాజెక్టు నమూనాలు, పోస్టర్ ప్రజెంటేషన్లు, తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేటెడ్ డీన్స్, వివిధ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 26న మామిడిపండ్ల తోటల వేలంఉట్నూర్రూరల్: ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీలో మామిడిపండ్ల తోటల వేలం ఈనెల 26న నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. బంగినపల్లి, దసేరి, తోతాపరి, రసాలు, హిమాయత్, లాంగ్ర తదితర మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు రూ.10 వేల డిపాజిట్ చెల్లించి ఉదయం 10 గంటలకు జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. వేలంలో తోట దక్కించుకున్నవారు సగం నగదును వెంటనే చెల్లించాలని మిగతాది వారంలో చెల్లించాలని సూచించారు. ఆ తర్వాతే కాయలు కోయడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు సెల్ 8897478825, 9441020755 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కుమురం భీం పేరుతో అవార్డులు గర్వకారణం
● మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి ● సినీనటుడు సాయికుమార్కు భీం అవార్డు ప్రదానంఆసిఫాబాద్: కుమురం భీం పేరుతో జాతీయ అవార్డు ప్రదానం చేయడం ఆదివాసీ జాతికి గర్వకారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో భారత్ కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓం సాయితేజా ఆర్ట్స్, నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, హాస్యనటుడు బాబూమోహన్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, నవజ్యోతి వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్కుమార్, భీమ్ మనవడు సోనేరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులతో కలిసి సినీనటుడు సాయికుమార్కు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎన్నికల అధికారి పార్థసారథి మాట్లాడుతూ కుమురం భీం జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. అడవి మీద హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరుడు కుమురం భీం అన్నారు. అవార్డు గ్రహీత సాయికుమార్ మాట్లాడుతూ కుమురంభీం సినిమాలో నటించి, భీమ్ నడియాడిన ప్రాంతంలో జాతీయ అవార్డు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కళాకారుడిగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, కుమురంభీం చరిత్రను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తున్న డి సురేశ్కుమార్ను అభినందించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది ఉన్నత స్థాయి గిరిజన కళాకారులున్నారని, ఇటీవల గుస్సాడీ నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించిందని గుర్తు చేశారు. నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, ప్రముఖ దేవాలయాలు అభివృద్ధి చేయాలన్నారు. తొలుత జిల్లా కేంద్రంలోని సాయి మందిరం, అంకమ షా సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో యువ దర్శకుడు నక్క రాహుల్, నిర్మాత రాం సత్యనారాయణ, నటుడు రాంజగన్, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, ఆదివాసీ నాయకుడు సిడాం అర్జు, నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, కళాకారులు, ఆదివాసీలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
● డయాలసిస్ రోగులను పట్టించుకోని ప్రభుత్వం ● భారంగా బతుకీడుస్తున్న రోగులు ● ఆదుకోవాలని వేడుకోలు
ఈ ఫొటోలోని వ్యక్తిపేరు అట్టెల మల్ల య్య. కోటపల్లి మండలం రాపన్పల్లికి చెందిన ఇతనికి ఎని మిదేళ్ల క్రితం కిడ్నీ చెడిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆరేళ్లు మందులు వాడాడు. రూ.8 లక్షల వరకు చికిత్సకు ఖర్చు చేశాడు. అయినా మెరుగు పడకపోవడంతో రెండేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. నెలకు 15 రోజులు డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్కు ఒంటరిగా వెళ్లలేడు. మరో సహాయకుడిని తీసుకుని వెళ్లాలి. ఇందుకు కేవలం రవాణా చార్జీలకే రూ.4,500 ఖర్చవుతుంది. ప్రభుత్వం పింఛన్ ఇవ్వకపోవడంతో సొంతంగానే ఖర్చు పెట్టుకుంటున్నాడు. మందులకు అదనంగా ఖర్చవుతుందని తెలిపాడు.చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులుచెన్నూర్: జిల్లాలో డయాలసిస్ రోగుల ఆర్థిక కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకు ని జీవనం సాగిస్తున్న నిరుపేదలు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ కోసం రెండు రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్తున్నారు. ఒక కిడ్నీ చెడిపోయినవారు మరో కిడ్నీ బాగుండేందుకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. లేదంటే మరో కిడ్నీ కూడా చేడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రవాణా ఖర్చులు భారమైనా తప్పనిసరి పరిస్థితిలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు పింఛన్లు ఇస్తుంది. అయితే కొత్తగా వ్యాధిగ్రస్తులను ఎంపిక చేయడంలేదు. దీంతో పేద రోగులు పింఛన్లు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 145 మంది డయాలసిస్ పేషంట్లు ఉన్నా రు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 66 మంది, బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 34 మంది, చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 45 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. రోజు విడిచి రోజు ఉదయం ఆస్పత్రికి వస్తే సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి. వీరే కాకుండా వీరితో వచ్చే సహాయకులు కూడా నిరీక్షించాల్సిందే. ప్రభుత్వం గతంలో డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేది. కొత్తగా డ యాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితుల కు పింఛన్లు రావడం లేదు. దీంతో కిడ్నీ రోగులు ఇ బ్బంది పడుతున్నారు. తమ ప్రాణాలు అంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెన్ష న్లు మంజూరు చేసి అదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో డయాలసిస్ రోగుల వివరాలుసెంటర్ పేరు పెన్షన్ వస్తున్నవారు పెన్షన్ రానివారు మొత్తం మంచిర్యాల 32 34 66 చెన్నూర్ 15 30 45 బెల్లంపల్లి 14 20 34కట్టెపట్టుకుని నడుస్తున్నా..నాది కోటపల్లి మండలం నక్కలపల్లి. ఆ రేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్న. నడుము లేదు కట్టే పట్టుకుని నడుస్తున్నా.. ఆటోలో డయాలసిస్కు పోతున్న. నెలకు రూ.5 వేలు ఆటో చార్జీలకే అవుతున్నయ్. మావోళ్లు నానా కష్టపడి చార్జీ లకు డబ్బులు ఇస్తుండ్రు. ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలి. – ఆరె బానయ్య నక్కలపల్లికండ్లు కనిపిస్తలెవ్వు..నాది భీమారం మండలం కొత్తపల్లి. కిడ్నీలు దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేయించుకుని బతుకుతున్నా. రోజు రోజుకు అవయవాలన్నీ చెడిపోతున్నాయి. కళ్లు కనిపిస్తలెవ్వు. కిడ్నీ బాధితులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి. బస్సులలో ఉచిత పాస్లు అందజేయాలి. – సంజీవరెడ్డి, కొత్తపల్లి -
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర
బెల్లంపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ ప్రభుత్వం పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రా ల ప్రాతి నిధ్యం తగ్గించే కుట్రలు చేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్ ఆరోపించారు. సీపీఐ శత జయంతోత్సవాలు పురస్కరించుకు ని బెల్లంపల్లి గంగారాం విజ్ఞాన్ భవన్లో అసెంబ్లీ నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శంకర్ హాజరై మాట్లాడారు. 1925లో దేశంలో పురుడు పోసుకున్న సీపీఐ శతజయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పీడిత తాడిత అట్టడుగువర్గాలు, కార్మి కులు, కర్షకుల హక్కుల కోసం సీపీఐ అలు పెరుగని పోరాటాలు సాగిస్తోందని వివరించా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు అవలంభిస్తోందన్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతిస్తూ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతి నిధ్యం తగ్గించేందుకు కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. రైతు చట్టాలనుతుంగలో తొక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు ఎం.వెంకటస్వామి, బి.పూర్ణిమ, మేకల దాసు, ఆర్.చంద్రశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, దాగం మల్లేశ్, అక్కెపల్లి బాపు, సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, నాయకులు రాజేశ్, సంతోష్, మాణిక్యం, శ్రీధర్, బానేష్, రాజేశం, అమృత, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుల ప్రయోజనాలే ముఖ్యం
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్ నస్పూర్: సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల ప్ర యోజనాలే ముఖ్యమని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని సేవాభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సింగరేణి, కాంట్రాక్టు, రిటైర్డు కార్మికుల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ మూతపడితే దక్షిణ భారత దేశ పారిశ్రామిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అనేక భూగర్భ గనులు, ఓసీలు మూతపడ్డాయని ఆరోపించారు. జైపూర్ పవర్ ప్లాంటు ఏర్పాటు మాజీ సీఎం వైఎస్సార్ ఘనత అని, ఏటా రూ.500 కోట్ల లాభాలను సింగరేణి ఆర్జిస్తోందన్నారు. సింగరేణి మనుగడ కొనసాగాలంటే కొత్త గనులు రావాలన్నారు. ఇందుకు సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలన్నారు. డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, ఉద్యోగులకు రూ.1.50 కోట్ల ఇన్సూరెన్స్, కాంట్రాక్టు కా ర్మికులకు ఇన్సురెన్స్ సదుపాయం కల్పించామని, 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు దీపావళి బోనస్ రూ.5 వేలు ఇప్పించామని అన్నారు. ఏరియా ఉపాధ్యక్షుడు శంకర్రావు, కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, సమ్మయ్య, ధర్మపురి, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శులు తిరుపతిరెడ్డి, రమేశ్, శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి శ్యాం పాల్గొన్నారు. -
కోరలుచాస్తున్న ‘క్షయ’
రెండు వారాలకు మించి దగ్గు ఉందా..అయితే టీబీ అయ్యిండొచ్చు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యులు మందులిస్తారు. చిన్నపాటి దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే అదే రేపు ప్రాణాంతకం అవ్వొచ్చు. ముందుగా జాగ్రత్త పడితే ఆరోగ్యం మీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్షయ వ్యాధికి కళ్లెం వేయాలి. అందరం కలిసి క్షయను నిర్మూలించగలం అనే నినాదంతో ఈ ఏడాది ముందుకెళ్తున్నారు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. మంచిర్యాలటౌన్: టీబీ నిర్మూలనకు ప్రభుత్వం నడుంబిగించింది. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నా క్షయ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాపకింద నీరులా క్షయ విస్తరించడం, కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా, ఏటా బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా గత ఐదేళ్లుగా కృషి చేస్తున్నా, ఏటా వీరి సంఖ్య వెయ్యికి పైగానే నమోదవుతోంది. వ్యాధిని గుర్తిస్తారు ఇలా.. టీబీ.. మైకో బ్యాక్టీరియా ట్యూబర్కిలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85 శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు ఉండడం, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీనొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రత బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గినా, తుమ్మినా తుంపర్లు వాతావరణంలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు దీని బారినపడతారు. హెచ్ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, పిల్లల తల్లులు, సరైన పోషకాహారం తీసుకోనివారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారినపడే ప్రమాదం ఉంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతీరోజు ట్యాబ్లెట్లను వేసుకునేలా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్ధారణకు అధునాతన సీబీనాట్(క్యాట్రేజ్ బేస్డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఉండగా, బెల్లంపల్లి సీహెచ్సీలో టునాట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గదిని కేటాయించి, సీబీనాట్తో పరీక్ష చేసి, చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్ను ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించి, వ్యాధిని నిర్ధారిస్తున్నారు. చికిత్సతో పాటు నగదు క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స పూర్తయ్యే వరకు నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.వెయ్యి ఇస్తారు. ఈ డబ్బును వారి ఖాతాల్లో జమచేసి, ఆధార్, బ్యాంక్ ఖాతాలతో నిక్షయ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు నర్సింగ్హోంలు, ల్యాబ్లో పరీక్షలు చేసుకుని, వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తుల వివరాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ యూనిట్ సిబ్బందికి తెలియజేయాలి. ఈ డబ్బులతో వ్యాధిగ్రస్తుడు బియ్యం, పప్పుదినుసులు, గుడ్లు, పాలు, కూరగాయలు కొనేందుకు గాను ఈ మొత్తాన్ని ఉపయోగించాలి. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా దాతలు పౌష్టికాహార పదార్థాలు అందజేస్తారు. లక్షణాలుంటే పరీక్ష చేసుకోవాలి చిన్నారులకు బి.సి.జి టీకా వేయడం వల్ల వారు క్షయబారిన పడే అవకాశాలు తక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేసి, వ్యాధి సోకిన వారికి మందులు అందిస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు ఉండి, సాయంత్రం జ్వరం వచ్చే వారు ఈ వ్యాధి నిర్దారణ పరీక్షలు చేసుకోవాలి. క్షయ నివారణ జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం ఉండాలి. – హరీశ్రాజ్, డీఎంహెచ్వో, మంచిర్యాల ఏటా పెరుగుతున్న రోగుల సంఖ్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నిష్ప్రయోజనం నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం ఐదేళ్లలో గుర్తించిన టీబీ కేసులు సంవత్సరం మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ 2020 1,138 1218 1529 2021 1,284 1361 1208 2022 1,445 1565 1549 2023 1,413 1467 1378 2024 1,278 1602 1097 -
అమ్మో.. అబాస్!
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త హాజరు విధానం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ● వ్యతిరేకిస్తున్న వైద్యులు, సిబ్బందిమంచిర్యాలటౌన్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అ న్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్తగా అబాస్ (ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం) అమలుకు ప్రజారోగ్య కు టుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవా ఖానాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చే సేందుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ అభివృద్ధి చేసిన మొబైల్ ముఖ ఆధారిత, జియో ఫెన్స్డ్ విధానంలో నూతన సాంకేతికతను తీసుకువచ్చింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఖమ్మంలో అమలు చేశారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్తో పాటు, ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకునే వారు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ గానీ ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమలు లోకి తీసుకువచ్చిన అబాస్ హాజరుతో గైర్హాజర్కు పూర్తి చెక్ పెట్టవచ్చని, విధులకు డుమ్మా కొట్టేవారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకే దీనిని అమలులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానం ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత వైద్య ఆరోగ్య శాఖలోని వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్, ఫేస్ యాప్లను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ అబాస్ పేరిట తీసుకువచ్చిన నూతన విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులతో చర్చించకుండానే అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని వైద్యులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.జిల్లాలో అబాస్ హాజరు అమలు కానున్న ఆస్పత్రులుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 17 అర్బన్ హెల్త్ సెంటర్లు 4 బస్తీ దవాఖానాలు 3 పల్లె దవాఖానాలు 100 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 ఎంసీహెచ్ 1 ఆయూష్ ఆస్పత్రులు 33 జిల్లా ఆస్పత్రి 1 -
‘భూభారతి’తో రెవెన్యూలో మార్పులు
మంచిర్యాలటౌన్: భూభారతి చట్టం 2025తో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు 10,954 మంది గ్రామపాలన అధికారులు వచ్చారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సైనికులుగా పనిచేస్తామన్నారు. అనతికాలంలోనే ప్రభుత్వ సహకారంతో ఎన్నో విజయాలను సాధించుకున్నామని, తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను ఏర్పాటు చేసి, పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలను మాతృ సంస్థలోకి తీసుకోవడం గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, టీజీటీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆలం పోచయ్య, ప్రధాన కార్యదర్శి ఆత్రం ప్రహ్లాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు కె.శ్రావణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వీ.సంజీవ్ కుమార్, ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్డీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్కాస్ట్ ప్రాజెక్టును సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు ఆదివా రం సందర్శించారు. పని స్థలాలను ఏరియా జీఎం దేవేందర్తో కలిసి పరిశీలించారు. ప్రా జెక్టు అధికారులకు సూచనలు చేశారు. వారం రోజుల్లో ఆర్థిక లక్ష్యం పూర్తవుతుందని, సంస్థ నిర్దేశిత లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఎస్వో టూ జీఎం విజయ్ప్రాద్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ వెంకటరమణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ ఉన్నారు. -
అడవిలో అమ్మవారి విగ్రహం
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా, బావాపూర్(ఆర్), మామడ మండలం కప్పనపల్లి గ్రామాల మధ్య గల దట్టమైన అడవిలో చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహ పరిసర ప్రాంతంలో 14వ శతాబ్దానికి చెందిన కోట శిథిలాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, ఖానాపూర్ వాసి కరిపె రాజ్కుమార్ గుర్తించారు. కోట చుట్టూ చెక్కు చెదరని రాతి కంచె, ఇనుమును శుద్ధిచేసిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కో టకు ఆవల గుప్తానిధుల కోసం జరిపిన తవ్వకాల్లో ఇటీవల ఒక రాతి విగ్రహం బయటపడిందని వివరించారు. గ్రామాల ప్రజలు ఒక చిన్న చెట్టు కింద ఉంచారని, ఆ విగ్రహ ప్రతిమ చాముండేశ్వరి దేవతదని, కాకతీయ అనంతర శైలిలో విగ్రహం ఉందని తెలిపారు. దేవత చతుర్భుజి అని, పర(వెనుక) హస్తాలో ఢమరుకం, త్రిశూలం ఉన్నాయని, నిజ (ముందు) హస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలతో సుఖాసీనురాలై ఉందన్నారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ అమూల్యమైన విగ్రహాన్ని, కోట శిథిలాలను ప్రజలు సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పరిశోధక బృందంలో ఔత్సాహిక పరిశోధక విద్యార్థి కరిపె రాజశేఖర్, గ్రామస్తుడు చిట్నేని పోతన్న ఉన్నారు. -
● అప్గ్రేడ్ అయినా మారని వసూళ్ల తీరు.. ● మొండిబకాయిదారులపై దృష్టిసారిస్తే మేలు ● వారం రోజులే గడువు.. 47.12 శాతమే వసూలు
మూకుమ్మడిగా సత్ఫలితాలు..మున్సిపల్ అధికారులు, సిబ్బంది వేర్వేరుగా కాకుండా, మూకుమ్మడిగా పన్ను వసూలుకు వెళ్లడంతో, కొంతమేర సత్ఫలితాలు ఇస్తోంది. 80 శాతంకు పైగా పన్ను వసూలు చేస్తే ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉన్నందున, ఈనెల 31వ తేదీలోపు 70 శాతం దాటి పన్ను వసూలు చేయాలని అధికారులు, సిబ్బంది కార్యాలయాన్ని వదిలేసి, పన్ను వసూళ్లకు వెళుతున్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నవారు, పెద్ద మొత్తంలో బకాయి పడ్డవారికి రెడ్ నోటీసులను ఇచ్చి, వారిపై మున్సిపల్ చట్టప్రకారంగా చర్యలను తీసుకుంటేనే ఈ నెలాఖరులోపు అనుకున్న లక్ష్యం మేరకు పన్ను వసూలయ్యే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి పన్ను చెల్లించనివారిపై చర్యలు తీసుకోక పోవడం, ఏటా చెల్లిస్తున్న వారే తిరిగి చెల్లించడం వలన వంద శాతం లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. నగరపాలక సంస్థగా మారిన తర్వాత మంచిర్యాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు అవసరం అవుతాయి. 70 శాతంకు పైగా పన్ను వసూలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు మరిన్ని చర్యలను తీసుకోవాలి.మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీని న గరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేసినా.. పన్నుల వసూలు పరిస్థితి మాత్రం మారలేదు. ఆస్తి పన్ను వసూలుకు బల్దియా ఉద్యోగులు, సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం ఇటీవల నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేసింది. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీతోపాటు హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసింది. విస్తీర్ణం పెరగడం, ప న్ను బకాయిలు సైతం ఎక్కువగా ఉండడంతో, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సెలవు రోజుల్లోనూ పన్ను ల వసూలుకు పాట్లు పడుతున్నారు. ఒక్కొక్కరుగా వెళితే, పన్ను బకాయిదారులు చెల్లించడం లేదని, ఒకేసారి 30 మందితో వెళ్లి మరీ వసూలు చేస్తున్నారు. గత ఆదివారం(మార్చి 16న) 30 మంది మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలిసి శ్రీశ్రీనగర్లో మొండి బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రూ.52 వేల పన్ను వసూలు చేశారు. ఇంటి ఆవరణలోనే కూ ర్చుని పన్ను చెల్లించి, నగర అభివృద్ధికి సహకరించాలని యజమానులను కోరుతూ, పన్ను వసూలు చేశారు. కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న వారి జాబితాతోనే పన్ను వసూళ్లకు వెళ్తున్నారు. మార్చి 16న ఒక్కరోజే మొండి బకాయిలు రూ.3 లక్షలకు పైగా పన్ను వసూలు చేశారు. ఈ నెలాఖరు వరకు 70 శాతం టార్గెట్ పెట్టుకున్నారు. లక్ష్యం చేరడం కష్టమే.. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 27 వేల ఇళ్లు, రూ.18 కోట్ల పన్ను డిమాండ్ ఉండేది. నస్పూరు మున్సిపాలిటీలో 16 వేల ఇళ్లు, రూ.4.27 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కార్పొరేషన్గా ఏర్పడిన తరువాత ఈ రెండు మున్సిపాలిటీలతోపాటు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఇళ్ల సంఖ్య 45,327కు చేరగా, పన్ను డిమాండ్ రూ.26.04 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ. 12.66 కోట్లు(47.12 శాతం) మాత్రమే వసూలు చేశారు. వారం రోజుల్లో రూ. 14.21 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఏళ్ల తరబడి, పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులను ఇచ్చి, చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా బకాయిదారుల నుంచి స్పందన రావడం లేదు. -
కోర్టును పరిశీలించిన జిల్లా జడ్జి
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టును జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. రికార్డు గదులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్కు సూచించారు. కోర్టు గదులను శుభ్రంగా ఉంచాలని, రికార్డులను భద్రంగా కాపాడాలని, కోర్టు పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం సబ్జైల్ను పరిశీలించారు. అండర్ ట్రయల్ ఖైదీలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. క్రీడా వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జైలర్ తేజవాత్ స్వామి, కోర్టు సూపరింటెండెంట్ పాల్గొన్నారు. -
అకాల పంట నష్టం 335 ఎకరాలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం కురిసి న అకాల వర్షంతో 335 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు శనివారం ప్రాథమిక సర్వేలో గుర్తించారు. దండేపల్లి, జన్నా రం, హాజీపూర్ మండలాల్లో 45 మంది రైతులకు చెందిన వరి పంట 80 ఎకరాలు, 113 మంది రైతు ల మొక్కజొన్న 255 ఎకరాలు.. మొత్తంగా 158 మంది రైతులకు సంబంధించి 335 ఎకరాల్లో నష్టం వాటల్లినట్లు తేల్చారు. రూ.12కోట్ల వరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పూర్తి స్థాయిలో సర్వే చేపడితే గానీ నష్టం వివరాలు తెలుపలేమని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భీమిని, నెన్నెల, మందమర్రి, హాజీపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో 19 విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి విద్యుత్ శాఖకు రూ.12 లక్షల మేర నష్టం వాటల్లింది. దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న మండలాలు మండలం గ్రామాలు రైతులు ఎకరాలు దండేపల్లి 7 37 86 జన్నారం 7 42 92 హాజీపూర్ 6 79 157 -
‘పది’ పరీక్షలకు 99.76శాతం హాజరు
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా సాగాయి. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో సెకండ్ లాగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షకు 99.76శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 9,185మందికి గాను 9,163మంది హాజరు కాగా, 22మంది గైర్హాజరయ్యారు. గతంలో ఫెయిలైన విద్యార్థులు ముగ్గురికి గాను ఒక్కరే పరీక్ష రాశారు. మొదటి రోజు మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పేపరు తారుమారు, ఆలస్యంతో శనివారం పరీక్ష కేంద్రాలను అధికారులు వరుస తనిఖీలు చేశారు. గర్మిళ్ల పాఠశాల, జెడ్పీహెచ్ఎస్(జీ), ట్రినిటీ పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. జిల్లా ప్రశ్నపత్రాల స్టోరేజీ పాయింట్ను రాష్ట్ర పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి సందర్శించి ప్రశ్నపత్రాలు తీసుకునే విధానం పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటు అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలతో మరో ఏడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో యాదయ్య మంచిర్యాల, నస్పూర్లో పరీక్ష కేంద్రాలు పరిశీలించారు. దోషులకు శిక్ష పడేందుకు కృషి మంచిర్యాలక్రైం: దోషులకు శిక్ష పడేందుకు కోర్టు కానిస్టేబుళ్లు, లైసన్ అధికారులు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్లో కోర్టు కానిస్టేబుళ్లు, లైసన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుస్టేషన్ హెడ్కానిస్టేబుల్ కే.నాగరాజు గుండెపోటుతో మృతిచెందగా ఆయన భార్య విజయకుమారికి రూ.7.48లక్షల ఎక్స్గ్రేషియా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లరెడ్డి, లీగల్సెల్ సీఐ కృష్ణ, సీసీఆర్బీ సీఐ సతీష్, ఐటీ సెల్ సీఐ చంద్రశేఖర్గౌడ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు. -
● భూగర్భ జలాల వినియోగంపై చార్జీలు ● ఫ్లోమీటర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు ● వ్యాపార, వాణిజ్య సంస్థలకు నోటీసులు ● క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు
ఉమ్మడి జిల్లాలో 2024–2025 ఫిబ్రవరి వరకు భూగర్భ జల శాఖ వివరాలు జారీ చేసిన ఎన్వోసీలు 101రిజిస్ట్రేషన్ ఫీజులు(వాల్టా, పరిశ్రమ, మైనింగ్) రూ.15,12,448విధించిన జరిమానాలు రూ.1,65,000వసూలైన భూగర్భజల వినియోగ చార్జీలు రూ.3,02,64,788రిజిస్ట్రేషన్ చేసుకోవాలిభూగర్భ జలాలను వాడుతున్న ఆయా సంస్థలు, యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్లో మీటరు అమర్చుకోవాలి. ముందుగా యజమానులకు అవగాహన కల్పించి, తర్వాత నోటీసులు ఇచ్చి అవసరమైతే జరిమానా విధిస్తున్నాం. – జి.లావణ్య, భూగర్భ జలశాఖ అధికారి, మంచిర్యాలసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగాన్ని భూగర్భ జల శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గృహ, ప్రజావసరాలు మినహా వ్యా పార కేంద్రాల్లో ఇష్టారీతిన నీటి తోడకాన్ని తగ్గించేలా ప్రతీ నీటిబొట్టుకు లెక్కగడుతూ ఆ మేరకు చార్జీలు వసూలు చేస్తోంది. కమర్షియల్ కేంద్రాలైన కంపెనీలు, పరిశ్రమల నుంచి వినియోగ చార్జీలు తీసుకునేలా 2023లోనే తీసుకొచ్చిన నూతన విధానాన్ని అమలు చేస్తూ ప్రతీ 1కే ఎల్(వెయ్యి లీ టర్లు)కు ఒక రూపాయి చొప్పున చార్జి వసూలు చేయనున్నారు. గతంలో వాల్టా చట్టం ప్రకారం ఆ యా యాజమాన్యాలు నీటి వాడకం కోసం ధ్రువీకరణ పత్రం(ఎన్వోసీ)ని మూడేళ్లకోసారి పునరుద్ధరణ చేసేవారు. కొత్త నిబంధనల ప్రకారం ఎంత నీరు వాడితే అంత చార్జీలు చేస్తూ ప్రతీనెల విద్యుత్ బిల్లు మాదిరిగానే నీటి బిల్లు ఆన్లైన్లో చెల్లించేలా సిద్ధం చేశారు. సింగరేణి, దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీ వంటి సంస్థల్లో నిబంధనలు అమలవుతున్నాయి. ఫ్లో మీటర్లు బిగింపు.. నీటిని వాడుతున్న ఆయ సంస్థలు, కంపెనీలు కచ్చితంగా భూగర్భ జలాల వాడకంపై డిజిటల్ ఫ్లో మీటర్తో కూడిన టెలిమీటర్కు అనుసంధానం చేసుకోవాలి. ఈ ఫ్లో మీటరు ప్రతీ ఆరు గంటలకు ఎంత నీటిని వాడారో లెక్కించి ఆన్లైన్లోనే వివరాలు పంపిస్తుంది. దీంతో ప్రతీ నెల ఆయా సంస్థలు జల వాడకానికి తగినట్లుగా చార్జీలు చెల్లించాలి. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల్లో అమలవుతోంది. వీటితోపాటు సిమెంటు, ఇతర మైనింగ్ కంపెనీలు, నీరు అధికంగా వినియోగిస్తున్న సంస్థలకు ఆయా జిల్లాల భూగర్భ జల అధికారులు వెళ్లి తనిఖీ చేస్తూ ఫ్లో మీటర్లను బిగించుకునేలా చూస్తున్నారు. కొత్త విధానంపై ఇంకా చాలామందికి అవగాహన లేకపోవడం, డబ్బులు కట్టాల్సి వస్తుందని కొన్ని చోట్ల స్పందించడం లేదు. వాడకమున్నా వసూళ్లు లేవు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేటు తాగునీటి ప్లాంట్లు, కంపెనీలు, పరి శ్రమలు, ఖనిజ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. యా జమాన్యాలు తమ బోర్వెల్స్ను రిజిస్ట్రేషన్ చేసుకు ని ఫ్లో మీటర్లు అమర్చుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల వ్యాపారులు ముందుకు రావడం లేదు. అనధి కారికంగానూ బోర్వెల్స్, పంపుసెట్లు, వాగులు, వంకలు, చెరువుల నుంచి నీటిని తోడేస్తున్నారు. ఎండాకాలంలో ఈ వాడకం తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సంస్థ నిత్యం వేలాది లీటర్ల నీటిని వినియోగి స్తున్నా లెక్కాపత్రం లేకపోవడంతోపాటు వినియోగంపైనా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అలాంటి చోట్ల అధికారులు వెళ్లి మొదట నోటీసులు ఇస్తున్నారు. కొంత గడువు ఇచ్చాక జరిమానా విధిస్తున్నారు. చాలా చోట్ల యాజమన్యాలు ఈ నోటీసులను సైతం పట్టించుకోవడం లేదు. -
ఇంటర్ మూల్యాంకనం షురూ
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రా ల మూల్యాంకనం మంచిర్యాల ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలో శనివారం మొదలైంది. ఏప్రిల్ 5వరకు కొనసాగనుంది. డీఐఈవో అంజయ్య పర్యవేక్షణలో మూల్యాంకనం కోసం సమన్వయ సమావే శం అసిస్టెంట్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, సబ్జెక్టు విషయ నిపుణులతో నిర్వహించారు. మూల్యాంకనంపై అవగాహన కల్పించా రు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మూల్యాంకనం చేయనుండగా.. ఆదివా రం నుంచి పూర్తి స్థాయిలో సాగనుంది. ఇతర జిల్లాల నుంచి 2,04,251 జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరాయి. పటిష్ట భ ద్రత మధ్య సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్ర క్రియ పూర్తి చేశారు. ఆయా సబ్జెక్టులు 1, 2తోపాటు గణితం 1ఏ, 1బీ, 2ఏ, 2బీ పేపర్లు వ చ్చాయి. ఇందులో సంస్కృతం 544, తెలుగు 3973, హిందీ 3102, ఇంగ్లిష్ 43942, గణితం 42,909, సివిక్స్ 9443, ఫిజిక్స్ 26151, ఎకానమిక్స్ 11095, కెమిస్ట్రీ 24,941, కామర్స్ 10158, బోటనీ 11602, జువాలజీ 10724, హిస్టరీ 915 పే పర్లు ఉన్నాయి. డీఐఈవో అంజయ్య మూల్యాంకన కేంద్రం కన్వీనర్గా, మరో ఏడుగురు సబ్జెక్టుల అధ్యాపకులు సహాయ క్యాంపు అధికారులు(ఏసీవో)గా వ్యవహరిస్తారు. ఎగ్జామినర్(ఏఈ)లు 224, చీఫ్ ఎగ్జామినర్లు 44మంది, సబ్జెక్టు విషయ నిపుణులు(ఎస్ఈ) ఏడుగురికి బాధ్యతలు అప్పగించారు. పొరపాట్లకు తావులేకుండా మూల్యాంకనం చేయాలని డీఐఈవో అంజయ్య తెలిపారు. ఏప్రిల్ ఏడు నుంచి ‘పది’.. పదో తరగతి పరీక్షలు ఈ నెల 21నుంచి ప్రారంభం కాగా జవాబు పత్రాల మూల్యాంకనానికి చర్యలు వేగవంతం చేశారు. జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ ఏడు నుంచి 15వరకు మూల్యాంకనం చేస్తారు. ఆదివా రం నుంచి ఆయా పరీక్షల జవాబు పత్రాలకు జిల్లా కు చేరనున్నాయి. తొమ్మిది రోజులు మూల్యాంకనం సాగుతుందని డీఈవో యాదయ్య తెలిపారు. -
అధ్యాపకుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్
మంచిర్యాలఅర్బన్: అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థుల భ విష్యత్ ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అన్నారు. శనివారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ క్షేత్రాలు–అక్షర దర్శనం’ ముగింపు సదస్సుకు హాజరయ్యారు. ఇదే కళాశాలలో చదివిన రోజులు, అధ్యాపకులతో ఉన్న సంబంధాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సదస్సుకు సంబంధించి అంతర్జాలంలో 35 మంది, నేరుగా 25 మంది వివిధ క్షేత్రాలపైన పత్రాలను సమర్పించారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో రెండో బహుమతి సాధించిన ఐదుగురు విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంసపత్రాలు అందజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ప్రిన్సిపాల్ పట్వర్థన్, సురేష్, సదస్సు సంచాలకుడు హరీష్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: సాగు యోగ్యం కాని భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. శనివారం పీఎం కుసు మ్ యోజన పథకం లబ్ధిదారులకు జిల్లా వి ద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో అవగాహ న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58మంది ఔ త్సాహికులు రైతులతోపాటు పారిశ్రామికవేత్తలు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని, రైతులకు తొలి ప్రాధాన్యత ఇ వ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. విద్యుత్ను డిస్కంలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్ర భుత్వం 50శాతం రాయితీ అందించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యుత్ శాఖ ఎస్ఈ గంగాధర్, లిడ్ బ్యాంక్ మే నేజర్ తిరుపతి, టీఎస్ రెడ్కో, బ్యాంకు అధికా రులు పాల్గొన్నారు. -
స్క్రైబ్ సహాయంతో పరీక్షకు అంధులు
తాండూర్: ఆ విద్యార్థుల ఆత్మస్థైర్యం ముందు అంధత్వం చిన్నబోయింది. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే వారి దృఢ సంకల్పం ముందు విధి తలవంచింది. మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో గౌతూరి శ్రీవిద్య, తంగెడ శ్రీమాన్ పదో తరగతి చదువుతున్నారు. గోపాల్రావుపేట గ్రామానికి చెందిన శ్రీమాన్, తాండూర్ కొత్త గుడిసెల ఏరియాకు చెందిన శ్రీవిద్య 70శాతం అంధత్వానికి లోనయ్యారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల వినతి మేరకు స్క్రైబ్(సహాయకుల) సహాయంతో పరీక్షలకు హాజరయ్యేందుకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతించారు. శ్రీమాన్కు విద్యాభారతి పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని మైలారపు తరుణి, శ్రీవిద్యకు మరో తొమ్మిదో తరగతి విద్యార్థిణి పట్టి ప్రణవి స్క్రైబ్గా హాజరయ్యారు. దీంతో శుక్రవారం తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తొలి రోజు పరీక్షకు హాజరై స్క్రైబ్ల సహాయంతో రాశారు. తనిఖీకి వచ్చిన డీఈవో యాదయ్య ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు అడిగి శ్రీమాన్, శ్రీవిద్య చెప్పిన సమాధానాలతో అభినందించారు. -
తెలంగాణ క్షేత్రాలు– అక్షర దర్శనం సదస్సు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ క్షేత్రాలు–అక్షర దర్శనం అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండ్రోజులపాటు సదస్సు నిర్వహిస్తారు. 35 మంది పరిశోధకులు పత్రాలను సమర్పించా రు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల క్షేత్రాలపై పత్రాలను సమర్పించారు. రెండో రోజు శనివారం నాలుగు సెషన్లు కొనసాగనున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామకృష్ణ, ఆచార్య సంగనభట్ల నర్సయ్య, గండ్ర లక్ష్మణ్రావు, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరేందర్రెడ్డి, సదస్సు సంచాలకుడు శ్రీధర్ హరీష్కుమార్ పాల్గొన్నారు. -
● జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ● అనేక అవస్థల మధ్య విక్రయించిన రైతులు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్లో సాగు చే సిన పత్తి పంట సేకరణ ముగిసింది. మూడు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఎత్తివేసింది. సీసీఐ చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఐదు జిన్నింగ్ మిల్లులు, బెల్లంపల్లి మార్కెట్ పరిధిలో రెండు, లక్సెట్టిపేట మార్కెట్ పరిధిలో ఒకటి మొత్తం ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గత నవంబర్ రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఈ నెల మొదటి వారం నుంచి ఎత్తివేసింది. ఆలస్యంగా సాగు చేసిన, కూలీల కొరత కారణంగా ఇంకా అమ్మకుండా రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సీసీఐ 30,050 మంది రైతుల నుంచి రూ.564,14,90,798 విలువైన 8,95,859 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ప్రారంభంలో తేమ శాతం 8 వచ్చిన పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.7,521 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత తేమ తిరకాసు, దూది పింజ పొడవు, నాణ్యత పరిమాణాలతో మద్దతు ధరలో కోత విధిస్తూ రూ.7,120 నుంచి రూ.7,400 చెల్లింపులు చేసింది. దీంతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడం తదితర కారణాలతో తరచూ సీసీఐ పత్తి సేకరణ నిలిపివేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించి ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7000 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో ప్రైవేటు వ్యాపారులు 10,256 మంది రైతుల నుంచి 1,37,783 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. తరచూ నిలిపివేత జిల్లాలో 1.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. 12 నుంచి 13లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆలస్యంగా సాగు చేయడంతో డిసెంబర్లో దిగుబడి వచ్చింది. జనవరిలో కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. సంక్రాంతి పండుగ నుంచి పత్తి పోటెత్తడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేసింది. పది రోజుల పైగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనలు చేపట్టారు. కొందరు గత్యంతరం లేక దళారులకు విక్రయించారు. సీసీఐ తరచూ కొనుగోలు కేంద్రాలు నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. మద్దతు ధర లభిస్తుందని వస్తే రోజుల తరబడి పడిగాపులతో వాహనాలకు అద్దె చెల్లించాల్సి రావడంతో ఆర్థిక భారం పడింది. ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఎన్నో అవస్థల మధ్య రైతులు సీసీఐకి పత్తి విక్రయించారు. అక్రమాల ఆరోపణలు.. కౌలు రైతులు వ్యవసాయ అధికారుల నుంచి కౌలు ధ్రువీకరణ పత్రం, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ద్వారా టీఆర్(టెంపరరీ రిజిస్టర్) పత్రం ఉంటేనే సీసీఐ కొనుగోలు చేసింది. టీఆర్ పత్రాల జారీలో అక్రమాలు చోటు చేసుకోవడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. ఇతర జిల్లాలు, పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి దళారులు పత్తి తీసుకొచ్చి విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్క చెన్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలోనే టీఆర్ పత్రాల అక్రమాల ద్వారా రూ.80 లక్షల విలువైన పత్తి విక్రయాల్లో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అందని నగదు..సీసీఐ 30,050 మంది రైతుల నుంచి 8,95,859 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. రూ.564,14,90,798 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 26,211 మందికి రూ.495,30,24,807 ఖాతాల్లో ఫిబ్రవరి 28 వరకు నగదు జమ చేసింది. ఇంకా చెన్నూర్, లక్సెట్టిపేట పరిధిలోని 3,839 మంది రైతులకు రూ.68,84,65,991 అందాల్సి ఉంది. గత డిసెంబర్, జనవరిలో విక్రయించిన పత్తికి సైతం నగదు రాలేదని రైతులు వాపోతున్నారు. చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయానికి నెలల తరబడి తిరుగుతున్నారు. ఆలస్యం చేయకుండా నగదు పడేలా చూడాలని రైతులు కోరుతున్నారు.జిల్లాలో సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి మార్కెట్ కమిటీ సీిసీఐ ప్రైవేట్ మొత్తం లక్సెట్టిపేట 78,196 1,449 79,645చెన్నూర్ 3,75,963 96,661 4,72,624బెల్లంపల్లి 3,03,917 39,673 3,43,590మొత్తం 7,58,076 1,37,783 8,95,859 -
సీఎం రాకకు ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ఉన్న సింగరేణి థర్మల్ పవ ర్ ప్లాంట్(ఎస్టీపీపీ) ఆవరణలో సింగరేణి సంస్థ కొత్తగా నిర్మించనున్న 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్కు శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. మొదట ఈ నెల 23న సీఎం పర్యటన ఉంటుందని జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఆ మేరకు ప్లాంట్ సింగరేణి, పోలీసులు, స్థానిక అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదు. గతంలోనే మూడో యూనిట్ ని ర్మాణం చేపట్టాలని సింగరేణి నిర్ణయం తీసుకు ని, పనులు ప్రారంభించాలని ప్రణాళికలు వేసింది. నేటికీ సీఎం పర్యటన ఖరారు కాకపోవడంతో సింగరేణి అధికారులు ఎదురు చూస్తున్నారు. రూ.6700 కోట్లతో చేపడుతున్న కొత్త ప్లాంటు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పూర్తయి అంతా సిద్ధమైంది. అధికారికంగా పనులకు శంకుస్థాపనే మిగిలింది. గత పదేళ్లుగా ఇక్కడ మూ డో యూనిట్ ప్రారంభం చేయాలని ప్రణాళిక వేసినా, సాంకేతిక కారణాలతో తాత్సారం జరుగుతోంది. తాజాగా సీఎం పర్యటన ఖరారైతే మోక్షం కలగనుంది. అనుకూలించని వాతావరణం సీఎం పర్యటనకు బీజీ షెడ్యూల్తోపాటు హెలి కాప్టర్లో రాకపోకలు సాగించేందుకు వాతావరణం అనుకూలత లేకపోవడం ఓ కారణంగా కనిపిస్తోంది. గత రెండ్రోజులు వాతావరణ పరి స్థితులు మారిపోవడంతో హెలికాప్టర్ ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడుతున్నట్లు తెలిసింది. పరిశీలించిన అధికారులు జైపూర్: అధికారికంగా సీఎం పర్యటన వివరా లు వెల్లడించకపోయినా శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏసీపీ వెంకటేశ్వర్, ఎస్టీపీపీ ఈడీ శ్రీనివాసులు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివా స్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్తో కలిసి ఎస్టీపీపీలో కొత్త ప్లాంటు ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రాంతం, కొత్త ప్లాంటు నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న స్తూపం సందర్శించారు. అనంతరం ప్రాణహిత అతిథి గృహంలో ఎస్టీపీపీ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్లో మూడో యూనిట్కు శంకుస్థాపన ఇంకా అధికారికంగా ఖరారు కాని షెడ్యూల్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
● సీపీ అంబర్ కిషోర్ ఝూ మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిషో ర్ ఝా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై శుక్రవారం రామగుండం కమిషనరేట్లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికా రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీ య, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై 2022–24 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల వి వరాలు, మృతులు, కారణాలు, తీసుకున్న చ ర్యలు, బ్లాక్స్పాట్ గుర్తింపు తదితర అంశాలపై ట్రాఫిక్, పోలీస్ అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ స్పాట్స్, రోడ్డు ప్రమాదాలపై పవర్ గూగుల్ మ్యాపింగ్ ద్వారా వివరించారు. సీపీ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పీడ్ బ్రేకర్లు, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టి క్కర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీ పీ రాజు, ఎస్బీ ఏసీపీ రఘవేంద్రరావు, ట్రా ఫిక్ ఏసీపీ నరసింహులు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్, సివిల్ పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
● మంచిర్యాలలోని ఓ కేంద్రంలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం ● రెండు గంటల సమయం వృథా ● ఆ మేరకు సమయం పొడగింపు ● ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ● జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం సీఎస్, డీవోల సస్పెన్షన్ ● జిల్లాలోని మిగతా కేంద్రాల్లో ప్రశాంతం
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలి రోజు శుక్రవారం గందరగోళం ఏర్పడింది. ఓ పేపర్ ప్రశ్నపత్రాల బాక్స్కు బదులు మరో పేపర్ బాక్స్ తీసుకు రావడంతో రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష మొదలైంది. ఈ సంఘటన మినహా జిల్లాలోని మిగతా 48 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 9,183 మంది విద్యార్థులకు గాను 9,163మంది పరీక్షకు హాజరయ్యారు. నిర్ధేశిత సమయానికి ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించారు. విద్యార్థులు చేతి గడియారాలు వెంట తెచ్చుకోగా.. కొన్నిచోట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల సిబ్బందితోపాటు తనిఖీలకు వచ్చిన స్క్వాడ్ సెల్ఫోన్లు కూడా బయటనే ఉంచారు. ఇక్కడ గందరగోళం.. జిల్లా కేంద్రం మంచిర్యాలలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో సంబంధిత అధికారులు తెలుగు పేపర్ బాక్స్కు బదులు హిందీ పేపర్ బాక్స్ తీసుకు రావడంతో గందరగోళానికి దారి తీసింది. ఈ నెల 10న హైదరాబాద్ నుంచి కాటన్ బాక్స్లో ప్రశ్నపత్రాలు డీఈవో కార్యాలయానికి చేరగా రూట్ అధికారులతో పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆయా పోలీసుస్టేషన్లలో సీఎస్, కస్టోడియన్, డీవోల సమక్షంలో ట్రంక్ బాక్స్లో ప్రశ్నపత్రాలు భద్రపర్చారు. మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంకు సంబంధించిన డే–1 ప్రశ్నపత్రం తీసుకు రావాల్సి ఉండగా డే–2 ప్రశ్నపత్రం పార్సిల్ తీసుకొచ్చారు. వెంటనే పొరపాటును గుర్తించిన సీఎస్, డీవోలు పార్సిల్ తెరవకుండానే జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్కు సమాచారం అందించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య పరీక్ష కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి పోలీసుస్టేషన్కు వెళ్లారు. పేపరు పార్సిల్ మారిన విషయం ఉన్నతాధికారులకు తెలియజేసి తెలుగు ప్రశ్నపత్రం పార్సిల్ మార్చే క్రమంలో సమయం గడిచిపోయింది. ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.30 గంటలకు ప్రారంభమైంది. ప్రశ్నపత్రంపై విద్యార్థులు ప్రశ్నించగా.. తెలుగు పేపర్లో ఎర్రర్ వచ్చిదంటూ ఇన్విజిలేటర్లు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. పరీక్ష ఆలస్యం కావడంతో స్నాక్స్, తాగునీరు అందించారు. పరీక్ష సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. పరీక్ష ముగిసే సమయం 12.30గంటలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. మరో పశ్నపత్రం తీసుకు రావడం, మార్చడానికి ఆలస్యమైందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎండల నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. పది పరీక్ష కేంద్రాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్నం తరగతులు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష కేంద్రంలో ఆలస్యం కావడంతో విద్యార్థులకు సెలవు ప్రకటించారు. -
కుటుంబ తగాదాల్లో వ్యక్తి మృతి
భీమిని: మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో కుటుంబ తగాదాల్లో మామ, బావమరిది దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటపూర్ గ్రామానికి చెందిన చదువుల లక్ష్మణ్ (35) మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రోజ అలియాస్ సమతతో గొడవ పడేవాడు. శుక్రవారం కూడా భార్యతో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. ఈక్రమంలో రోజ తండ్రి పార్వతి రాజేశం, తమ్ముడు పార్వతి అనిల్లు లక్ష్మణ్పై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి, ఎస్సై గంగారాం తెలిపారు. -
విద్యార్థులకు వినికిడి పరికరాలు పంపిణీ
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో గల ఐటీడీఏ ఆశ్రమ వికాసం ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం ఆకృతి, హైదరాబాద్ సౌజన్యంతో గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రూ.10 లక్షల విలువ గల వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక కేబీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్ మండలాల పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించి, గిరిజన గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగం తీసుకోవాలన్నారు. ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లోని హ్యాబిటేషన్ గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. నీరు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని తెలిపారు. ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, డీఎల్పీవో ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘అధికారులు వేధింపులు మానుకోవాలి’
కాసిపేట: అధికారులు వేధింపులు మానుకోవాలని శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట 1గనిపై కార్మికులు మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. కార్మికుల డిమాండ్ మేరకు టీబీజీకేఎస్, ఏఐటీయూసీ యూనియన్లు నిరసనకు పిలుపునివ్వగా యూనియన్లకు సంబంధం లేకుండా కార్మికులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అధికారులు కార్మికులను వేధిస్తూ చార్జీషీట్లు, మెమోలు, సస్పెండ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, ఫిట్ కార్యదర్శి లక్ష్మినారాయణ, టీబీజీకేఎస్ నాయకులు భైరి శంకర్, అఫ్జలోద్దిన్, బానోత్ తిరుపతి, రావుల సతీశ్వర్మ, కార్మికులు పాల్గొన్నారు. -
ఎల్ఎండీ సమీపంలోని కాలువలో విద్యార్థి గల్లంతు
జన్నారం: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఎల్ఎండీ సమీపంలోని కాలువలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల లింగన్న, శంకరవ్వల కుమారుడు అరవింద్ (18) కరీంనగర్లోని ఎస్సార్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండీలో సమీపంలోని కాలువలోకి స్నానం కోసం వెళ్లి గల్లంతయ్యాడు. కాగా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి కేసీ కెనాల్లో శుక్రవారం అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు యువకుడి బంధువులు తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరి మృతి బెజ్జూర్: ఇటీవల మండలంలోని ఊట్పల్లి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరగ్గా తీవ్ర గాయాలపాలైన అందుగులగూడ గ్రామానికి చెందిన గేడం వెంకటి(45) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన వెంకటిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మృతుడి భార్య పద్మ తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
ట్రిపుల్ఐటీలో టెక్ఫెస్ట్
బాసర: బాసర ట్రిపుల్టీలో శుక్రవారం అంతఃప్రజ్ఞ టెక్ఫెస్ట్, 2025 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ ఎ.గోవర్ధన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణలను అన్వేషించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలన్నారు. బాసర ట్రిపుల్ఐటీని దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మారుస్తామని పేర్కొన్నారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఈ టెక్ఫెస్ట్ విద్యార్థుల ప్రతిభకు నిలయమని ప్రశంసించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో ప్రొఫెసర్లు మురళీధర్షన్, రణధీర్ సాగి, విట్టల్, మహేశ్, చంద్రశేఖర్, అజయ్, రాములు, స్వప్నిల్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీ సెంటర్ ప్రారంభం.. బాసర ట్రిపుల్ ఐటీలో యాక్టివిటీ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమం, పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలలో ఈ యాక్టివిటీ సెంటర్ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థి కేంద్రీకృత చొరవల ప్రాముఖ్యతను వివరిస్తూ సమగ్ర విద్య అనుభవాన్ని అందించడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ స్టూడెంట్ యాక్టివి టీ సెంటర్ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చే శామని ఇన్చార్జి వీసీ తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ అభివృద్ధి, సమాజ సేవను ప్రోత్సహించడం లక్ష్యమని పేర్కొన్నారు. -
బడుగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దండేపల్లి: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లి మండలం ధర్మరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు, దండేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిర మ్మ మోడల్హౌజ్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తుందన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సతీశ్, నాయకులు రాంచందర్, దుర్గప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బోరిగాంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ పర్యటన
లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వర్రావు మామడ, లక్ష్మణచాంద మండలాల పరిధిలోని బోరిగాం గ్రామంలోని గోదాములను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గోదాం నిల్వ సామర్థ్యం, వేబ్రిడ్జి సామర్థ్యం, రికార్డుల పరిశీలన చేసి మేనేజర్ శివరామకృష్ణకు పలు సూచనలు చేశారు. బీహార్ హమాలీలతో మాట్లాడి వారికి కల్పించిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి గోదాంలో మొక్క నాటారు. గోడౌన్లో బాగా కష్టపడే వారిని గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. పర్యటనకు ముందు నిజామాబాద్ రీజియన్ పరిధిలోని మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీ కోర్రా లక్ష్మి, జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎస్.సి శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, ఆర్ఎం రాజ్యలక్ష్మి, గోడౌన్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
శిలాజాలు తరలిస్తున్న వాహనం అడ్డగింత
వేమనపల్లి: శిలాజాలను తరలిస్తున్న వాహనాన్ని తహసీల్దార్ రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం అడ్డుకున్నారు. ప్రాణహిత నది తీరంలో వేల ఏళ్ల నాటి నత్తగుల్ల, తాబేలు, చేప ఆకృతిలోని శిలాజరాళ్లు ఉన్నాయి. శిలాజాలను ఎవరో వాహనంలో తరలించడం గమనించిన స్థానికులు తహసీల్దార్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఆర్ఐ ఖాలీక్ను సుంపుటం సమీపంలో ఉన్న ప్రాణహిత నదికి పంపి తహసీల్దార్ కార్యాలయానికి వాహనాన్ని తరలించారు. శిలాజాన్ని తీసుకెళ్తున్న వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఆర్కియాలజిస్ట్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఫోన్ మాట్లాడించాడు. శిలాజరాళ్లను భద్రపర్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిర్ధారించుకుని వాహనాన్ని వదిలిపెట్టారు. -
బాసరలో ప్రత్యేక పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసరలో బ్రహ్మశ్రీ శ్రౌతి రాజేశ్వరి శర్మ –సునీత దంపతులు మహారుద్ర సహిత అష్టోత్తర శత సువాసిని సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞానసరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, అర్చ న పూజలు నిర్వహించారు. అనంతరం గురుప్రార్థన ఉత్సవ సంకల్పం, 108 మంది బ్రాహ్మణోత్తములతో 1331 రుద్ర పారాయణం, 1000 శ్రీ సూక్తాపారాధనలు జరిపించారు. నా ట్యమండలి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో చిన్నారులతో భరతనాట్య ప్రదర్శన నిర్వహించగా, తొగుట పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు 108 సువాసినీ సమారాధన కార్యక్రమం, స్వామి వారి పాదపూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రౌతి రాజేశ్వర శర్మ తెలిపారు. -
యువతకు బాసట
● రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు ● రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంనిర్మల్చైన్గేట్/సిరికొండ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొని తమ కాళ్లపై తాము నిలబడి తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,600 మంది యువతీ, యువకులకు ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది. మూడు కేటగిరీల్లో ఆర్థిక సహాయం..కేటగిరీ– 1, 2, 3 వారీగా యువతకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కేటగిరీ –1 కింద రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూర్చుతుంది. 20 శాతం నగదును లబ్ధిదారులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ –2 కింద రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 70 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగితా 30శాతం లబ్ధిదారులు సమకూర్చుకోవాలి. కేటగిరీ 3 కింద రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 60 శాతం ప్రభుత్వమే సబ్సిడీ సమకూర్చనుండగా లబ్ధిదారులు 40శాతం భరించాల్సి ఉంటుంది. కేటగిరీ –1 కింద సహాయం పొందదల్చుకున్నవారు రూ. 20వేలు, కేటగిరీ –2 కింద సహాయం పొందదల్చుకున్నవారు రూ. 30వేల వరకు, కేటగిరీ 3 కింద సహాయం పొందదల్చినవారు రూ. 40వేల వరకు తమ వంతు పెట్టుబడిని స్వయంగా కానీ బ్యాంకుల నుంచి కానీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తాము నెలకొల్పదల్చుకున్న యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సంబంధిత కార్పొరేషన్లతోపాటు కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయిలోని అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది. మంజూరులో జాప్యం..గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరులో జాప్యం జరగడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురయ్యారు. అయితే వరుస ఎన్నికలు వచ్చిన స మయంలో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రు ణాల మంజూరు ఉంటుందనుకున్నారు. కానీ వరు స ఎన్నికల నేపథ్యంలో రుణాలకు బ్రేక్ పడింది. దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు.. తెలంగాణకు చెందిన స్థిరనివాసై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. నిరుద్యోగ యువతీయువకులకు మాత్ర మే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాలి. రేషన్కార్డు, ఎంప్లాయీమెంట్ ఎక్సేంజ్లో పేరు నమోదై ఉండాలి. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ..రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో భాగంగా మార్చి 17న దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆర్థిక సహాయం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ యువకులు చేస్తున్న దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి మే 31వరకు పరిశీలించి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
పంట దిగుబడి రాక రైతు ఆత్మహత్యతలమడుగు: పంట ఆశించిన దిగుబడి రాక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్నకు ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఈ ఏడాది పత్తి, కంది పంటలు సాగు చేశాడు. గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రావడం లేదు. పెట్టుబడి కోసం గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ కాకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. కుటుంబ పోషణ భారమై, అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. శుక్రవారం పొలానికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. అక్కడే లింగన్న(48) చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వంశీ, శరత్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అంజమ్మ తెలిపారు. వేధింపులు తాళలేక వ్యక్తి.. రెబ్బెన: ఇచ్చిన డబ్బులు అడగటమే తన పాలిట శాపంగా మారింది. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా తనకే డబ్బులు ఇవ్వాలని లేకుంటే కేసులు పెడతానని ఓ వివాహిత మహిళతో పాటు కొంతమంది నాయకులు వేధించడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగాపూర్లో చోటు చేసుకుంది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల ప్రకాశ్ (53) గంగాపూర్ గ్రామ పంచాయతీలో కారోబార్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గుర్లె సోనీ అనే వివాహిత ప్రకాశ్కు మద్యం అలవాటు చేయడంతో పాటు అప్పుడప్పుడూ ప్రకాశ్ వద్ద నుంచి అవసరానికి డబ్బులు తీసుకునేది. కొన్ని నెలల క్రితం సోనికి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ప్రకాశ్ కోరగా నిరాకరించడంతో పాటు తనకే రూ.లక్ష బాకీ ఉన్నావని ఎప్పుడు ఇస్తావంటూ వేధించింది. డబ్బులు ఇవ్వకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. సోనికి మద్దతుగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు డబ్బులు చెల్లించాలంటూ వేధించడంతో ప్రకాశ్ గురువారం రాత్రి గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన గ్రామస్తులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రకాశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రాకేశ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. రామకృష్ణాపూర్: పట్టణంలోని ఏజోన్ రామ్నగర్ ఏరియాకు చెందిన అడ్లకొండ శ్రీకాంత్(32) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్ స్థానిక ఓ కన్స్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. డబ్బుల లావాదేవీలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు వేధించడంతో భరించలేక తనువు చాలిస్తున్నట్లు సూసైడ్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆత్మహత్య ఘటన బయటకు వచ్చిందని ఎస్సై తెలిపారు. కాగా మృతుడి భార్య కరోనా సమయంలో మృతిచెందగా ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
TG SSC: పేపర్ 1 ప్లేస్ లో పేపర్ 2
మంచిర్యాల: తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఆరంభమైన తొలి రోజే జిల్లాలో గందరగోళం చోటు చేసుకుంది. ఒక ప్రశ్నా పత్రం ప్లేస్ లో మరొక ప్రశ్నా పత్రం ఇవ్వడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు(శుక్రవారం)ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇది రెండు పేపర్లు కింది విభజించారు. పార్ట్ 1(పేపర్ 1), పార్ట్ 2( పేపర్2) గా విడదీసి ఒకే రోజు జరపాలని షెడ్యూల్ చేశారు. అయితే పేపర్ 1 ప్లేస్ లో , పేపర్ 2 ఇవ్వడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు పేపర్ 2 ఇచ్చిన విషయాన్ని అధికారులు గమనించలేనట్లు సమాచారం. . ఆ తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకుని నాలుక్కరుచుకున్న అధికారులు పేపర్ ను మార్చారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు అదనపు సమయం కేటాయించారు. అయితే బయట వేచి చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రలకు ఈ విషయం తెలియక పోవడంతో ఆందోళనకు గురయ్యారు,. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి తీసుకున్నారు. ఈ ఘటనపై డీఈవో, జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
కాసిపేట గనిపై అస్వస్థతకు గురైన కార్మికుడు
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కాసిపేట 1గనిపై గురువారం శశికాంత్ అనే రూప్ లేసర్ కార్మికుడు ప్రీ షిప్టు, మొదటి షిప్టు విధులు నిర్వహించి కళ్లు తిరిగి పడిపోయాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం శశికాంత్ ఉదయం 5 గంటలకు ప్రీ షిప్టు విధులకు హాజరయ్యాడు. గనిలో తెగిపోయిన తాడును జాయింట్ చేసే పనిలో నిమగ్నంకాగా పని పూర్తికాక పోవడంతో అధికారుల ఒత్తిడి మేరకు మొదటి షిప్టు విధులు కూడా నిర్వర్తించాడు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గనిపైకి రాగా కళ్లు తిరిగి పడిపోయాడు. తోటి కార్మికులు ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి, అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదనంగా షిప్టు నిర్వహించే కార్మికుడికి కనీసం టిఫిన్, పండ్లు, భోజనం ఏదైనా పంపించాల్సి ఉండగా అలా చేయకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆరోపిస్తున్నారు. అధికారుల ఒత్తిడే కారణం కార్మికునికి ఇలా కావడానికి అధికారుల ఒత్తిడే కారణమని ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య విమర్శించారు. గురువారం రాత్రి కార్మి కుడిని పరామర్శించారు. గుర్తింపుసంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దా గం మల్లేశ్ మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి కారణంగానే కార్మి కులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. -
మాయ ‘లేడీ’
● యూట్యూబ్లో చూసి లాకర్ తెరిచి దొంగతనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: దొంగలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో గల నేషనల్ మార్ట్లో కటింగ్ గ్రైండర్తో ఓ దొంగ లాకర్ను పగలగొట్టి చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో ఓ మహిళ యూట్యూబ్లో చూసి గోద్రేజ్ లాకర్ను ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. టూటౌన్ పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన జాబు తిరుపతి ఈనెల 17న తన ఇంట్లో ఉన్న గోద్రేజ్ లాకర్లో భద్రపర్చిన ఆభరణాలు తెరిచి చూశాడు. అందులో ఉన్న రెండు తులాల బ్రాస్లెట్, తులంనర చొప్పున ఉన్న రెండు చైన్లు కనిపించకపోవడంతో టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి ఇంట్లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన కోట మమతను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకుంది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ పాషా వెల్డింగ్ పనిచేస్తున్నాడు. వీరిద్దరికి హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు పరిచయం ఉంది. పనిచేస్తున్న ఇంట్లో చోరీకి పాల్పడాలని సూచించాడు. తాను పనిచేస్తున్న ఇంట్లో గోద్రేజ్ లాకర్కు డిజిటల్ కీ ఉందని చెప్పడంతో సయ్యద్ ఇర్ఫాన్ యూట్యూబ్లో చూసి పాస్వర్డ్ కొట్టమని చెప్పాడు. ప్రయత్నించగా లాకర్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. ఇర్ఫాన్ను పిలిచి రెండు తులాల చైన్ అప్పగించగా హైదరాబాద్లో విక్రయించాడు. గురువారం ఆదిలాబాద్ బస్టాండ్కు మరోసారి బంగారాన్ని తీసుకెళ్లి విక్రయించేందుకు వచ్చిన ఆయనను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు తులాల బ్రాస్లెట్, 13 గ్రాముల చైన్, రూ.45వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న ఆదిలాబాద్ టూటౌన్ సీఐ కరుణాకర్రావు, ఎస్సై విష్ణుప్రకాష్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ బొట్టు రమేశ్, బబితా, రుక్మారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
ఆర్జీయూకేటీలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్
బాసర(ముధోల్): బాసరలోని ఆర్జీయూకేటీలో గురువారం ‘ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్’ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ యజమాని కే.లక్ష్మీరెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశ్రమల సందర్భనకు అవకాశం కల్పిస్తామనడం, శిక్షణ, ఇంటర్న్షిప్ కూడా అందిస్తామనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, ఏవో శ్రీ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ అకాడమిక్ అండ్ ప్లానింగ్ డాక్టర్ చంద్రశేఖరరావు, అసోసియేట్ డీన్ ఇంజినీరింగ్ డాక్టర్ కె. మహేష్, అసోసియేట్ డీన్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ డాక్టర్ విట్టల్, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టెక్ ఫెస్ట్ 2025 బాసర: బాసర ఆర్జీయూకేటీలో నేటి నుంచి మూడురోజుల పాటు టెక్ఫెస్ట్ 2025 ‘అంతఃప్రజ్ఞ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ఇంజనీరింగ్ విభాగాల నుండి విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు ప్రదర్శిస్తారన్నారు. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్ర విభాగాల నుండి హ్యాకథాన్లు, కోడింగ్ పోటీలు రోబోటిక్స్ సవాళ్లు వంటి ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్స్ డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ ఆర్.అజయ్, స్వప్నిల్, ప్రకాష్, డాక్టర్ రాములు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
● సాహితీఖిల్లాగా విరాజిల్లుతున్న నిర్మల్ ● సాహితీవేత్తలు, కళాకారులకు పుట్టినిల్లు ● నేడు ప్రపంచ కవితా దినోత్సవం
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా అనగానే మొదట గు ర్తుకు వచ్చేది కవులు, కళాకారులే.. సాహితీపరంగా చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మల్ సాహితీ జిల్లాగా పేరు గాంచింది. ఇప్పటికే ఇక్కడి నుంచి వందలాది మంది కవులు, రచయితలు సాహితీ రంగంలో తమదైన ప్రతిభ చాటుతున్నారు. జిల్లాలో తొలితరం కవుల నుండి మొదలుకొని ప్రస్తుతం ఉన్న పద్యకవులు, వచన కవులు, కళాకారులు సాహితీవేత్తల వరకు కొదువలేదు. ప్రాచీన కవులు బోయ ధర్మయ్య, మామడ మునిపంతులు, పొన్నకంటి రాజయ్య నేటితరాన్ని ప్రభావితం చేసిన మడిపల్లి భద్రయ్య ఉన్నారు. ఆధునిక కవులలో ప్రస్తుతం బొందిడి పురుషోత్తం, నేరెళ్ల హ న్మంతు, వెంకట్, చక్రధారి, దామెర రాములు, పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావు, కరిపె రాజ్కుమార్, పుండలీక్రావు, పోలీస్ భీమేష్, కృష్ణంరాజు, కామారపు జగదీశ్వర్, అబ్బడి రాజేశ్వర్రెడ్డి, తొడిశెట్టి పరమేశ్వర్.. ఇలా మరెందరో కవులు, రచయితలు తమ రచనలతో సామాజిక చైతన్య ప్రతీకలుగా కొనసాగుతున్నారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జిల్లా కు చెందిన పలువురు కవుల అభిప్రాయాలు. సమాజమంతా కవిత్వం మిళితమై... సమాజమంతా కవిత్వం మిళితమై ఉంటుంది. కవిత్వంలేని సమాజం ఊహించలేం. సమాజాన్ని చైతన్యవంతం చేయడమే కవిత్వం పని. పల్లె పదాలతో అల్లుకున్న కవిత్వపు పాట ప్రజల నాలుకలపై సజీవంగా నడయాడుతుంది. ఆహ్లాద జీవితానికి కవిత్వం దోహదపడుతుంది. ఇప్పటికీ గ్రామీణ జన బాహుళ్యంలో పాటలు, కోలాటాలు, బతుకమ్మ, భజన పాటలతో సమాజాన్ని చైతన్య పరుస్తోంది కవిత్వమే. – తుమ్మల దేవరావు, సాహితీవేత్త, చరిత్రకారుడు, నిర్మల్ -
కవిత్వం నిత్యాన్వేషణ..
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక...’ అన్న వాక్కులు అక్షర సత్యాలు. ప్రపంచం నిండా కవిత్వం నిబిడీకృతమై ఉంది. జీవితానికి, జీవన అనుభవానికి ఆలంబన కవిత్వమే. సంక్లిష్ట సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, నిద్రాణమైన జాతిని, మనిషిని మేల్కొల్పడానికి సరైన సాధనం కవిత్వమే. ‘కవియాత్ర’ పేరిట వర్ధమాన కవులను ప్రోత్సహించే నావంతు చిరు ప్రయత్నం చేస్తున్నా. – కారం శంకర్, ‘కవియాత్ర’ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, నిర్మల్ -
రూ.21 లక్షలు పలికిన స్విమ్మింగ్పూల్
కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల స్విమ్మింగ్పూల్కు రికార్డుస్థాయి ధర పలికింది. గురువారం ఖరారు చేసిన టెండర్లలో ఆదిలాబాద్ పట్టణం దుర్గానగర్కు చెందిన జబాడే రాష్ట్రపాల్ అత్యధికంగా రూ.21లక్షలు బిడ్ దాఖలు చేసి దక్కించుకున్నారు. 2025–26 సంవత్సరానికి గానూ స్విమ్మింగ్పూల్ నిర్వహణకు ఈ నెల 15 వరకు మున్సిపల్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఆఫ్లైన్లో ఆరుగురు కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేయగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సీవీఎన్. రాజు ఆధ్వర్యంలో రూ.10,89,500 ప్రారంభ ధరతో టెండర్లు ఆహ్వానించగా రాష్ట్రాపాల్ అనే కాంట్రాక్టర్ అత్యధికంగా రూ.21లక్షలు కోట్ చేశారు. రెండోస్థానంలో ప్రఽశాంత్ అనే కాంట్రాక్టర్ రూ.16.20 లక్షలు బిడ్ చేశాడు. అత్యధిక ధరకు కోట్ చేసిన వ్యక్తికి స్విమ్మింగ్పూల్ను అప్పగిస్తూ టెండర్ ఖరారు చేశారు. నివేదికను కలెక్టర్ రాజర్షిషాకు పంపించి త్వరలోనే నూతన కాంట్రాక్టర్కు స్విమ్మింగ్పూల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం సూపరింటెండెంట్ రఫీ, మసూద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలించిన కలెక్టర్
లక్సెట్టిపేట: ‘ఆస్పత్రి భవనం ప్రారంభమెప్పుడో’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. పనులను పరిశీలించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఆస్పత్రి ప్రారంభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యతను పరిశీలించి ఆపరేషన్ థియేటర్, ఇతర ప్రదేశాలు పరిశీలించారు. మార్చురీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాని, టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతామని అన్నారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహం అడ్డగింత
నేరడిగొండ(బోథ్): మండలంలోని బొందిడి గ్రామంలో గురువారం అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ సూపర్వైజర్ మంజుల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్లైన్ సహకారంతో గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులకు చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ యాక్ట్ గురించి వివరించారు. చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ సతీశ్, పీవోఐసీ స్వామి, సోషల్ వర్కర్ రవికాంత్, అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్ పాల్గొన్నారు. -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
జన్నారం: ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న కొత్తపేటలో 126 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన దుర్గం మధుమితకు రూ.4లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్(ఎల్ఓసీ) అందజేశారు. తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, మండల సీనియర్ నాయకులు సుభాష్రెడ్డి, మోహన్రెడ్డి, మిక్కిలినేని రాజశేఖర్, ఇందయ్య, ఇసాక్, షాకీర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఇద్దరి ప్రాణాలు కాపాడిన బాసర పోలీసులు
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరినది వద్ద గురువారం ఆత్మహత్యకు యత్నించిన వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన తిరుమనపల్లి సంపత్ గోదావరిలో దూకేందుకు యత్నిస్తుండగా విధి నిర్వహణలో అటుగా వెళ్తున్న పోలీసులు గమనించి అతన్ని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన కొమ్ము సుమలత గోదావరిలో దూకేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఎస్సై గణేశ్ ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అంతా సిద్ధం
● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● విద్యార్థులు 9,198 ● 49 పరీక్ష కేంద్రాలు ● సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు 7032463114, 9440688034మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల భవిష్యత్కు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 4వరకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షల్లో 24పేజీలతో కూడిన జవాబు పత్రం(ఆన్సర్ షీట్) ఇవ్వనున్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. సౌకర్యాలపై సూచనలు చేశారు. గురువారం పాఠశాలల్లో విద్యార్థులకు హాల్టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలను స్టోరేజీ పాయింట్ల నుంచి తరలించాలని ఇదివరకే ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 9,198మంది పరీక్షలకు హాజరు కా నున్నారు. జీఏహెచ్ఎస్ 14 పాఠశాల నుంచి 382 మంది, బీసీడబ్ల్యూఆర్ఈఐ 7పాఠశాలల్లో 439మంది, ఏడు ప్రభుత్వ పాఠశాలల నుంచి 208మంది, 18 కేజీబీవీల్లో 642మంది, 101 స్థానిక సంస్థల పా ఠశాలల నుంచి 2,815మంది, 80 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 3,346మంది పరీక్ష రాయనున్నారు. ఐదు టీఎస్ఎంఎస్ల నుంచి 445మంది, టీఎస్ఆర్ఎస్కు చెందిన 68మంది, 9టీఎస్డబ్ల్యూఆర్ఎస్కు చెందిన 672మంది, రెండు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 46మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తంగా 4,730 మంది బాలురు, 4,468మంది బాలికలు, ఒక్కసారి పరీక్ష తప్పిన విద్యార్థులు 221 మంది ఉన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు, సిట్టింగ్స్క్వాడ్లను 49మంది చొప్పున, 484మంది ఇన్విజిలేటర్లను, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ప్రశాంతంగా రాయండిపరీక్షలను ప్రశాంతం రాయాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యంగా పరీక్షలు రాయండి. సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతోనూ పరీక్షలకు హాజరుకావచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం హెల్లైన్ ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలు, సమాచారం కోసం సంప్రదించవచ్చు. – యాదయ్య, డీఈవో -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
బెల్లంపల్లి: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఆర్డీ వో పి.హరికృష్ణ అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏసీపీ రవికుమార్, భూ సమస్యల పరిష్కార వేదిక మండల స్థా యి కమిటీ అధికారులతో బెల్లంపల్లి సబ్ డివి జన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా భూ దరఖాస్తులు, వాటి పురోగతి, ఇప్పటివరకు పరిష్కరించిన వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 34 దరఖాస్తులు రాగా, 14 మండల స్థాయిలో పరిష్కరించామని, సబ్ డివిజన్ స్థాయి కమిటీకి 4 సిఫారసు చేయగా, మరో 16 నిర్ణీత 21రోజుల గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండలాల వారీగా ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారని వివరించారు. రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కే.శ్రీని వాసరావు, ఏడు మండలాల తహసీల్దార్లు, ఎస్సైలు, ఎంపీవోలు పాల్గొన్నారు. -
నేడు, రేపు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు, రేపు రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వారం రోజులుగా ఎండలు మండి పోతుండగా గురువారం జిల్లాలో కాస్తా మబ్బుపట్టి ఉంది. శుక్ర, శనివారాల్లో వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిల్చోరాదన్నారు. కోసిన పంటలను ముందస్తుగా సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయలు ముందస్తుగా కోసుకోవాలని, పురుగు మందుల పిచికారీ తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. విద్యార్థి అదృశ్యంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గురువారం అదృశ్యమయ్యాడు. బేల మండలంలోని గణేశ్పూర్కు చెందిన మడావి రాకేష్ ఆదిలాబా ద్ పట్టణంలోని గోపాలకృష్ణ విద్యామందిర్లో ఐదోతరగతి చదువుతున్నాడు. వసతిగృహంలో ఉంటూ విద్యాబోధన చేస్తున్నాడు. ఇంటర్వెల్ సమయంలో విద్యార్థి కనిపించకుండా పోవడంతో ప్రిన్సిపాల్ మాధవ్రావు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తాంసి(బోథ్): మండలంలోని కప్పర్లలో ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్య క్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు సలగంటి రాజలింగు (53) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 18న ఇంటివద్ద మద్యం మత్తులో పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతదేహన్ని ఎస్సై రాధిక పరిశీలించారు. మృతుని భార్య దేవత ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పరీక్షలంటే భయం వద్దు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్దండేపల్లి: పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం, ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దండేపల్లి కేజీబీవీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ‘పరీక్షలకు అంతా సిద్ధం అయ్యారా.. బాగా రాస్తారు కదూ..’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. అంతకు ముందు దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని నాగసముద్రం, మాకులపేట శివారులో పంట పొలాలను పరిశీలించారు. సాగునీరందక రైతులు పడే ఇబ్బందులపై తెలుసుకున్నారు. చివరి తడికి నీరందించేందుకు అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. దండేపల్లి పీహెచ్సీలో వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంపీడీవో ప్రసాద్, డీటీ విజయ, ఎంఈవో చిన్నయ్య, ఏవో అంజిత్కుమార్, ఆర్ఐ భూమన్న పాల్గొన్నారు. -
పిచ్చుకల రక్షణ పర్యావరణానికి మేలు
వేమనపల్లి: ఊరపిచ్చుకల సంరక్షణతో పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని నీల్వా యి రేంజ్ అధికారి అప్పలకొండ, డెప్యూటీ రేంజ్ అధికారి రూపేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని చెట్ల కొమ్మలు, భవనాలపై, కార్యాలయాల ఆవరణలో మట్టి పాత్రల్లో నీళ్లు పోసే కార్యక్రమం చేపట్టారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పిచ్చికలు నీరు, తిండికి అల్లాడుతున్నాయని అన్నారు. నీల్వాయి రేంజ్ పరిధిలోని 20 బీట్లలో సిబ్బంది మట్టిపాత్రలు చెట్లపై ఉంచి నీటితో నింపి పక్షుల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ప్రమోద్కుమార్, ఒడ్డుగూడం ఎఫ్ఎస్ఓ బేగ్, కొత్తపల్లి ఎఫ్బీఓ సోఫియా, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ మోతీలాల్ ● ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపుకాసిపేట: కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో జిల్లా వయోజనవిద్య, సఖి లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటల పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మండలాన్ని వందశాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో మహిళల పాత్ర అధికంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, సఖి లయన్స్క్లబ్ అధ్యక్షురాలు బండ శాంకరి, డీఆర్పీలు సుమన్, అశోక్రావు, అక్షర వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఎక్స్టెన్షన్ గ్రేడ్–1 ఉద్యోగానికి ఎంపిక
బెల్లంపల్లి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ గ్రేడ్–1 (సూపర్ వైజర్)పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లికి చెందిన సంహితరాజ్ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 21 ర్యాంక్, జోనల్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని జీఎం కాలనీలో నివాసం ఉంటున్న కారంపూడి శ్రీనివాసరాజు–కృష్ణవేణి దంపతుల కుమార్తె అయిన సంహితరాజ్ గత నవంబర్లో వెలువడిన గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్గా ఎన్నికై బెల్లంపల్లి మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో విధులు నిర్వహిస్తోంది. అంతటితో ఆగకుండా రోజుకు గరిష్టంగా 10 గంటల పాటు చదివి జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు హాజరై ఎక్స్టెన్షన్ గ్రేడ్–1 ఉద్యోగానికి ఎంపికై ంది. తల్లి కృష్ణ బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, తండ్రి శ్రీనివాసరాజు శాంతిఖనిగనిలో డెప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరాజు కుమారుడు గత డిసెంబర్లో ప్రకటించిన సింగరేణి మేనేజ్మెంట్ ట్రెయినీ(అండర్ మేనేజర్)ఉద్యోగానికి ఎంపికయ్యాడు. -
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ నెల 5న పరీక్షలు ప్రారంభం కాగా.. ఈసారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కాకుండా పరీక్షలు సాఫీగా సాగాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,823 జనరల్ విద్యార్థులకు గాను 5,656 మంది(97శాతం) హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చోట్ల విద్యుత్, నీటి సౌకర్యం, టేబుళ్లు, రవాణా సౌకర్యం కల్పించారు. క్షణం తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంలో మునిగితేలారు. చిరుదరహాసాలతో వెళ్తూ సెల్ఫీలు తీసుకోవడం, టాటాలు చెప్పుకోవడం కనిపించింది. హాస్టళ్లలో చదువే లోకంగా ఉన్న విద్యార్థులు పరీక్షలు పూర్తి కావడంతో పెట్టె సర్దుకుని ఇంటిబాట పట్టారు. 22న స్పాట్ వాల్యూయేషన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్, పౌరశాస్త్రం, మ్యాథ్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల22న మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య తెలిపారు. స్పాట్ వాల్యూయేషన్ ఎగ్జామినర్గా నియామక ఉత్తర్వులు అందుకున్న ఆసిఫాబా ద్, మంచిర్యాల జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిరావుపూలే, ఆదర్శ, కేజీబీ వీ, మైనార్టీ జూనియర్ కళాశాల అధ్యాపకులను రిలీవ్ చేసి మూల్యాంకనానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 97శాతం విద్యార్థులు హాజరు 167మంది గైర్హాజర్ -
ఐదు ఉద్యోగాలు సాధించిన సంకీర్తన
మంచిర్యాలటౌన్: చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన. పట్టణంలోని రాంనగర్కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో చదివిన సంకీర్తన 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్–1లో రెండు ఉద్యోగాలు సాధించింది. సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను బుధవారం ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్లో 1వ ర్యాంకు సాధించింది. -
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాజెక్ట్ల కింద చివరి ఆయకట్టు వరకు పంటలకు నీరందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం క లెక్టరేట్లో నీటి పారుదల శాఖ ఈఈ, డీఈఈ, ఏ ఈఈలతో సాగునీటి నిర్వహణపై సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ప్రస్తుత నీటి నిల్వ 11.4 టీఎంసీలు ఉందని, కార్యాచరణ ప్రకారం నీ టిని విడుదల చేస్తామని తెలిపారు. సుందిళ్ల, అన్నా రం, గూడెం ఎత్తిపోతల, ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్ల నుంచి నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నీల్వాయి ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జూన్ 15వరకు జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సిర్సా ఎత్తిపోతల పథకం, అర్జునగుట్ట, కిష్టాపూర్ ప్రాజెక్ట్లపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పంటల సాగుకు సహాయం జైపూర్: జిల్లాలో పంటల సాగుకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలో ని సుందిళ్ల బ్యారేజీ, శివ్వారం గ్రామ సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తహసీల్దార్ వనజారెడ్డి, మండల పరిషత్ అధికారి జి.సత్యనారాయణతో కలిసి పర్యటించి రైతులతో వ్యవసాయ పరిస్థితులపై సమీక్షించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం, ఇతర నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి, ఎల్ఆర్ఎస్ రుసుం, ఆస్తిపన్ను వసూలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఎస్సై నాగరాజు, ఏపీవో బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తాగు నీటిసమస్య తలెత్తకుండా చర్యలు భీమారం: వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలో ని దాంపూర్ గ్రామ పంచాయతీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల సంరక్షణ చర్యలను పరిశీలించారు. గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బన్సీలాల్, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో పరిశీలించి..
బెల్లంపల్లి: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన బాకం సత్తమ్మ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల తన వ్యకిగత సమస్యపై దరఖాస్తు చేసుకుంది. గుంట విస్తీర్ణం కలిగిన తాను నివాసం ఉంటున్న ఇంటిని తన తమ్ముడి కుమారుడు బాకం సుమన్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని పేర్కొంది. తహసీల్దార్ జ్యోత్స్న, తాళ్లగురిజాల ఏఎస్సై, గి ర్దావరు, ఇతర సిబ్బంది బుధవారం ఆ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరువర్గాలను విచారించారు. ఫిర్యాదుదారు ఇల్లు ఆక్రమణకు గురి కాలేదని, కూలగొట్టలేదని నిర్ధారణకు వచ్చా రు. సత్తమ్మ, సుమన్ మధ్య ఉన్న తగాదాను పరిష్కరించి ఉపశమనం కలిగించారు. తహసీల్దార్ ప్రత్యేక చొరవతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగాయి. -
● రాష్ట్ర ‘పద్దు’లో జిల్లా ప్రస్తావన కరువు ● విద్య, వైద్యం, పరిశ్రమల ఊసే లేదు ● ‘సాగునీటి’కి అరకొర కేటాయింపులే.. ● మంచిర్యాల నగరాభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఊరట
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్ జిల్లా వాసులను నిరాశపర్చింది. ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేవి లేకపోయినా మంచిర్యాల నగరాభివృద్ధి, పలు సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రతిపాదన కొంత ఊరటనిస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ జరగలేదు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు చేసినా ఆ మేరకు నిధులు రాబట్టలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు తదితర రంగాల్లో జిల్లా ప్రస్తావన కనిపించలేదు. ప్రత్యేక యూనివర్సిటీ, కాలేజీల ఏర్పాటుపైనా నిరాశే ఎదురైంది. నగరాభివృద్ధికి నిధులు కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసిన మంచిర్యాల నగరాభివృద్ధి కోసం నిధులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో మహబూబ్నగర్, కొత్తగూడెం, పాల్వంచ మున్సి పాలిటీలతోపాటు మంచిర్యాల కార్పొరేషన్కు మూ డు పథకాల్లో భాగంగా మొత్తం రూ.998కోట్లు కేటా యించారు. ఇందులో జిల్లా కేంద్రానికి ఎంత మొ త్తం కేటాయిస్తారనేది అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో జిల్లా కేంద్రంలో మాస్టర్ప్లాన్ అభివృద్ధి తోపాటు నగర వృద్ధికి దోహదపడనున్నాయి. మంచిర్యాల నగర ముంపు రక్షణ కోసం గోదావరి బ్యాక్ వాటర్ ముంపు కోసం రూ.100కోట్లు కేటాయించా రు. అయితే రాళ్లవాగుపై రక్షణ గోడకు రూ.255 కోట్ల ఖర్చుతో నిర్మించాల్సి ఉండగా, తాజాగా ఈ మేరకు నిధులు కేటాయించారు. సంక్షేమ పథకాలతోనే ఊరట రాష్ట్రంలో అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే జిల్లా ప్రజలకు ఊరట కలగనుంది. రూ.22500కోట్లతో ప్రతీ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు 3500 చొప్పున మంజూరు కావడంతో జిల్లాలో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో రూ.24,439కోట్లు ప్రతిపాదిస్తూ, ఆయిల్ ఫాం రైతులకు సబ్సిడీ, యంత్రాల సబ్సిడీపై జిల్లా రైతులకు అందే అవకాశం ఉంది. 119నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే జిల్లాలో మూడు చోట్ల యువతకు ఉపయోగపడున్నాయి. ఇక మహిళా సంఘ సభ్యులకు రుణ బీమా రూ.2లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపుతో జిల్లాలోని సభ్యులకు మేలు జరగనుంది. ఇక గిరిజనుల కోసం ‘ఇందిరా గిరి జల వికాసం’ కింద పోడు రైతులకు పంపుసెట్లు అందించి సాగుకు తోడ్పడనుంది. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ పద్ధతిలో 2028వరకు రాష్ట్రంలో మొత్తం 17000కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు బాగు చేస్తే, జిల్లాలోని రోడ్లకు మోక్షం కలిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ఎకో టూరిజం పరిధిలో ఉండడంతో పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంమంచిర్యాలకు మొండిచేయి మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపించింది. జిల్లాలో ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ లేదు. ఇక్కడ ఉన్న యువత ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. జేఎన్టీ యూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా మొండిచేయి చూపించారు. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వంతెనను రద్దు చేశారు. తిరిగి అక్కడే వంతె న నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి రాజీవ్నగర్ మధ్య రైల్వే వంతెన నిర్మాణానికి హా మీనిచ్చినా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడుసాగునీటికి అరకొరనే..వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో సాగునీటి ప్రాజెక్టులకు నిర్వహణ, సిబ్బంది జీ తభత్యాలు, మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు బడ్జెట్లో ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ప్రాయోజిత సాగునీటి ప్రాజెక్టులతోపాటు చి న్న, మధ్యతరహా ప్రాజెక్టులకు నిధులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిధులేవి కేటాయించలేదు. ఇక జిల్లాలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టుకు రూ.17కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినా ఆ మేరకు నిధుల ప్రస్తావన రాలేదు. ఇక మంచిర్యాల, చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలుగలేదు. -
శాఖాహార జంతువుల గణనపై అవగాహన
జన్నారం: శాఖాహార జంతువులను లెక్కించడం, వాటిని గుర్తించడంపై అటవీశాఖ సిబ్బందికి ప్రత్యే క్ష శిక్షణ ఇచ్చారు. ఇందన్పల్లి రేంజ్లో రేంజ్ అధికా రి కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం అడవి లో పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. వన్యప్రాణుల గణనపై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు ఎల్లం తెలియజేశారు. ప్రతీ బీట్లో రెండు కిలోమీటర్ల మేర ట్రాన్సెక్ట్ లైన్ ఏర్పాటు చేసుకుని, లైన్లో నేరుగా కనిపించిన జంతువులు, ఆనవాళ్లు, మలం, అడుగులు, చెట్లపై పడిన వెంట్రుకలు తదితర వివరాలను సేకరించి వన్యప్రాణులను లెక్కించాలని రేంజ్ అధికారి తెలిపారు. అన్ని రేంజ్లలో శిక్షణ సాగుతుందని తెలిపారు. -
ఏరియా స్టోర్స్లో రక్షణ చర్యలు చేపట్టాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా స్టోర్స్లో రక్షణ చర్యలు చేపట్టాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా బుధవారం ఏరియా స్టోర్ను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. స్టోర్స్లోని షెడ్లలో ఎలక్ట్రిక్ వైరింగ్ అస్తవ్యస్తంగా ఉందని, షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వీడి మరమ్మతులు చేయించాలని అన్నారు. ఏరియా స్టోర్స్లో అర్హత గల టెండాల్ సూపర్వైజర్ లేరని, అలా లేకపోవడం వల్ల మందమర్రి ఏరియా స్టోర్స్లో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మరణించారని, అయినా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్టోర్కు వచ్చే మెటీరియల్ నాణ్యత ప్రమాణాల పరిశీలనకు సరైన నాణ్యత ప్రామాణికలు లేవని, నామమాత్రంగా అప్రూవల్ ఇస్తూ కంపెనీకి రూ.కోట్లు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ఏరియా స్టోర్స్లో తక్షణమే రక్షణపై సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఫిట్ సెక్రెటరీ కుమారస్వామి, నాయకులు ఎడ్ల సమ్మయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు రాజకుమార్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
బొగ్గుగనుల టెండర్లలో పాల్గొనాలి
మందమర్రిరూరల్: నూతన బొగ్గు గనులను దక్కించుకునేందుకు నిర్వహించే టెండర్లలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఏరియాలోని కేకే–5 గనిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్లలో పాల్గొనాలనే విషయంపై సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం తరఫున రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనవద్దని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు రెండు గనులు అప్పగించిందని ఆరోపిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఏఐటీయూసీలో చేరగా యూనియన్ కండువా లు కప్పి ఆహ్వానించారు. గని ఫిట్ కార్యదర్శి సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, వెంకటేష్, బానయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యే’
కోటపల్లి: మండల అభివృద్ధిని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విస్మరించారని, సమస్యల పరి ష్కారంలో విఫలమయ్యారని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 100మంది నిరుపేదలు నేటివరకు సహాయం అందక ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నిరుపేదలను మభ్యపెట్టారని విమర్శించారు. మండల అబివృద్ధిపై పెద్దపల్లి ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి చి త్తశుద్ధి ఉన్నా తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్ప నకు ఫ్యాక్టరీని నెలకొల్పాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, నాయకులు కందుల వెంకన్న, శ్యాంసుందర్, రాకేశ్, రాజేశ్, నవీన్, నర్సింలు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పుష్కరమైనా పూర్తి కాని బ్రిడ్జి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ప్రజలు రైల్వేగేటు కారణంగా పన్నెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా మరో పది రోజులు గేటు తెరుచుకోదేనే విషయం తెలిసి ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. అటు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం, రైల్వేగేటు సమస్యలతో సతమతం అవుతూ అవాంతరాల మధ్య కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇబ్బందులు పడాల్సి వస్తోందనే విమర్శలు వస్తున్నాయి. క్యాతనపల్లి మున్సిపాల్టీలోని రామకృష్ణాపూర్ పట్టణం నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వేగేటు ఈ నెల 19నుంచి 28వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రధాన రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ గేటు మూసి వేయాల్సి వస్తోందని వెల్లడించారు. మంచిర్యాల–ఆర్కేపీ మార్గంలో రాకపోకలు సాగించే వారు పది రోజులపాటు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గంలో సరైన రోడ్డు లేకపోవడం, పైగా దూరభారం కూడా పెరుగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా పనులపై మంచిర్యాలకు వెళ్లేవారు, ముఖ్యంగా అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నత్తనడకన పనులు క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో రైల్వే గేటు ఉన్న దృష్ట్యా ఇక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2013లోనే అప్పటి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వివేక్వెంకటస్వామి నిధులు మంజూరు చేయించారు. రూ.33 కోట్ల వ్య యంతో పనులు ప్రారంభించారు. రైల్వేలైన్పై బ్రిడ్జి పనులను రైల్వే శాఖ అప్పట్లోనే పూర్తి చేయించగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలోని బ్రిడ్జి పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేయించిన అప్పటి ఎంపీ, ప్ర స్తుత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పనులు పూర్తి చేయించేందుకు పలుమార్లు స్వయంగా ప ర్యవేక్షించారు. అయినా ఫలితం లేదు. బ్రిడ్జి నిర్మా ణం పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి కొన్ని వాహనా లు, మరికొంతమందితో పనులు చేయించడం, త ర్వాత మళ్లీ అదే నిర్లక్ష్యం కనబరుస్తుండడం కాంట్రా క్టర్కు అలవాటైందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రైల్వేగేటు పదే పదే పడడం వల్ల ఒక్కోసారి 30 నిమిషాల వరకు నిరీక్షించాల్సిన దుస్థితి రా వడం ఒక సమస్య అయితే ఇప్పుడు ఏకంగా పది రోజులపాటు గేటు పూర్తిగా మూసివేస్తుండడం మ రో పెద్ద సమస్యగా మారింది. ఏదేమైనా ప్రజల ఇ బ్బందుల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతి న పూర్తి చేయించేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ప్ర త్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కొనసా..గుతున్న వంతెన పనులు మళ్లీ మంచిర్యాల–ఆర్కేపీ రాకపోకలు బంద్ తరచూ మరమ్మతులతో ఇబ్బందులు -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● సమన్వయంతో కలిసి పనిచేద్దాం.. ● పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ మంచిర్యాలక్రైం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్ద ని, అందరం కలిసి సమన్వయంతో పని చేద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. రామగుండం కమిషనరేట్లో బుధవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. సమస్యలు, విధి నిర్వహణలో ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించి అధికారులు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసీఆర్ పార్క్లో విద్యార్థికి పాముకాటు
● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ● గుట్టుచప్పుడు కాకుండా పార్క్ మూసివేసిన అధికారులు చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ పార్క్లో కాలక్షేపానికి ఆడుకునేందుకు వెళ్లిన విద్యార్థిని పాము కాటువేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూర్ పట్టణంలోని లైన్గడ్డ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న శనివారం సాయంత్రం అతని స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకుంటుండగా సమీర్ను పాము కాటు వేసింది. ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాలతో బయటపడ్డాడు. పార్క్ మూసివేత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్న కేసీఆర్ పార్క్లో పాములు సంచరిస్తున్నా అధికారులు పట్టి ంచుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విద్యార్థిని పాముకాటు వేసిన ఘటన వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పార్క్ మూసి వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పార్కులో అంతర్గత పనుల నిర్వహణ కారణంగా మూసివేసినట్లు అధి కారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఆటో ఢీకొని మహిళకు గాయాలు
బెజ్జూర్: ఆటో ఢీకొని మహిళకు గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్న సిద్దాపూర్కు చెందిన రెసే సత్యబాయి బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్కు వచ్చి ఇంటికి వెళ్తున్న క్రమంలో మండల కేంద్రానికి చెందిన గోర ంట్ల రమేశ్ మద్యం మత్తులో ఆటో నడుపుతూ రో డ్డు దాటుతున్న సత్యబాయిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కాగజ్నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుమార్తె కొట్రంగి పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మద్యం మత్తే కారణం! ఉదయం నుంచి మద్యం ఆటోలో పెట్టుకొని తా గుతూ జల్సాలు చేసినట్లు బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటన సమయంలో ఆటోలో 6 మద్యం సీసాలు, పల్లీలు, గ్లాసులు ఉన్నాయన్నారు. పెట్రోల్ బంక్ వద్ద ఆటోలో డెక్ పెట్టుకుని డ్యాన్సులు సైతం చేసినట్లు సమాచారం. ఆటోలో 6 మద్యం సీసాలు లభ్యం మద్యం మత్తే కారణమంటున్న బాధిత కుటుంబ సభ్యులు -
ఉద్యాన నర్సరీ రైతులకు వరంలాంటిది
ఉట్నూర్రూరల్: ఉద్యాన నర్సరీ రైతులకు వరం లాంటిదని జిల్లా ఉద్యాన అధికారి, పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సుధాకర్ అన్నా రు. బుధవారం ఉట్నూర్ ఉద్యాన నర్సరీని ఆ యన సందర్శించారు. నర్సరీలో చేపడుతున్న వివిధ రకాల పనుల గురించి ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి సందీప్కుమార్ వివరించారు. నర్సరీలో ఉన్న మామిడి, నిమ్మ, జామ, పుచ్చతోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటికుంటలు, చెరువులను సైతం పరి శీ లించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి క్రా ంతికుమార్, నర్సరీ సాంకేతిక అధికారి అర్షిత, సీపీఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ రైసింగ్ డేజైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రైసింగ్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ సీఐఎస్ఎఫ్ టౌన్షిప్ నుంచి జైపూర్ మీదుగా పెగడపల్లి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సీఐఎస్ఎఫ్ పాత్ర, సీఐఎస్ఎఫ్ సహకారాన్ని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
నెన్నెల: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మగ్గిడి రాజ్కుమార్(30)కు మంచిర్యాలకు చెందిన లావణ్యతో 2018లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మద్యానికి బానిసైన రాజ్కుమార్ తరచూ ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. గొడవ జరిగినప్పుడల్లా భార్య పుట్టింటికి వెళ్లగా సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఈ నెల 14న రాత్రి మద్యం సేవించిన రాజ్కుమార్ భార్యతో గొడవ పడటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యం మరింత ఎక్కువగా తాగుతుండేవాడు. భార్య రాదేమోనని బాధతో తాగిన మైకంలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన సోదరుడు ప్రసాద్ మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందారు. మృతుని తల్లి బాలక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
అడవులు కాలితే పర్యావరణానికి నష్టం
చెన్నూర్రూరల్: అడవులు, ప్లాంటేషన్ కాలితే చిన్నచిన్న జీవరాశులు చనిపోవడమే కాకుండా పర్యావరణానికి నష్టం వాటిళ్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్ కుమార్ పేర్కొన్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం మండలంలోని పొన్నారం నీలగిరి ప్లాంటేషన్ సమీపంలోని చాకెపల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు, ప్లాంటేషన్ మీదుగా రాకపోకలు సాగించే వారు సిగరెట్, బీడీలు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పొలాలు ఉన్న వారు సాగు తర్వాత మిగిలిన గడ్డి, చెత్తను తగులబెట్టి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారన్నారు. దీంతో గాలులు వీచిన సమయంలో ఆ మంటలు అడవిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అధికారులకు సమాచారం అందించి అడవుల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ సూపర్వైజర్ శ్రీనివాస్, వాచర్ ఓదెలు, సంజీవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపు లేదు
● టారీఫ్ పెంపుదల ప్రతిపాదించలేదు ● ప్రస్తుత ధరల్లో ఎటువంటి మార్పూ లేదు ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత వచ్చింది. బుధవారం హనుమకొండలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేసిన రిటైల్ సప్లయి వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ విచారణలో విద్యుత్ టారీఫ్ల ప్రతిపాదనలపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి టారీఫ్ పెంపుదలపై ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదన్నారు. ప్రస్తుత ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే సంబంధిత ఎల్టీ, హెచ్టీ వినియోగదారులకు సాధారణ టారిఫ్ కంటే యూనిట్కు రూ.0.66 గ్రీన్ టారీఫ్ విధింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ యాక్సెస్లో విద్యుత్ కొనుగోలు చేసి ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్లు వినియోగించుకున్న వినియోగదారులకు ఎనర్జీ చార్జీల్లో 10శాతం చొప్పున స్టాండ్ బై చార్జీల విధింపును కొనసాగిస్తున్నామని తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ నిర్వహణకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.19,814 కోట్ల ఆదాయ ఆవశ్యకత ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత టారిఫ్(టారిఫేతర ఆదాయం కలుపుకొని) రూ.9,421కోట్ల వస్తుందని అంచనా. దీంతో రూ.10,393 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. -
గేట్ ఫలితాల్లో ప్రతిభ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం దొనబండకు చెందిన గూడెల్లి శివకుమార్ గేట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 32వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన పద్మ, శంకరయ్య దంపతుల కుమారుడు శివకుమార్కు ఈ నెల 16న అనూషాతో వివాహమైంది. సోదరి ప్రవళిక వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎం–ఫార్మసీ, సోదరుడు ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన శివకుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనుదీప్రెడ్డికి 65వ ర్యాంకులోకేశ్వరం(ముధోల్): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హవర్గకు చెందిన అనుదీప్రెడ్డి బుధవారం వెలువడిన గేట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి–మనోహర్రెడ్డి దంపతుల కుమారుడు అనుదీప్రెడ్డి 100 మార్కులకు గానూ 71.33 మార్కులతో జాతీయస్థాయిలో 65వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నాడు. తల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ కాగా తండ్రి మనోహర్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. అనుమానాస్పదంగా మత్స్యకారుడు మృతిలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మత్స్యకారుడు మేడి లింగయ్య (65) చేపల వేటకు వెళ్లి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. లింగయ్య రోజు మాదిరిగానే బుధవారం ఉదయం చేపలు పట్టేందుకు సమీప గోదావరినదికి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గోదావరి వద్దకు వెళ్లిచూడగా ఒడ్డు సమీపంలో పడిపోయి ఉన్నాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతిముధోల్: ఈ నెల 18న ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని ముద్గల్ గ్రామానికి చెందిన సిందె సాధన (33) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. గ్రామానికి చెందిన సిందె సాధన కొంతకాలంగా మానసిక స్థితి కోల్పోయింది. మంగళవారం ఇంట్లో ఉరేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి దిగంబర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త దాసు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వన్యప్రాణులకు సహజ జలం
● ప్రతీ కిలోమీటర్కు ఒక నీటివనరు ఏర్పాటు ● సోలార్ పంపుల ద్వారా తాగునీటిని అందించే యత్నం ● చెలిమెలు, ర్యాంప్వెల్స్, సోలార్ పీటీలు, నీటికుంటలకు ప్రాధాన్యంజన్నారం: అడవిలో నివసించే వన్యప్రాణులకు వేసవిలో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అటవీశాఖ ముందస్తుగానే అప్రమత్తమైంది. అడవిలో ఉన్న నీటి వనరులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సహజసిద్ధమైన నీటితో సహా సోలార్ పంపుల ద్వారా నీటిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ఆశిష్సింగ్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ డివిజన్లోని మూడు అటవీ రేంజ్లు, 40 అటవీ బీట్లలో నీటిఎద్దడి నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈక్రమంలో అడవిలోని వాగులు, ఊటనీటిని సహజ సిద్ధంగా నీటిఎద్దడి ప్రాంతాల్లో సోలార్ పంపుల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. చెలిమెలు, ర్యాంప్వెల్స్, సోలార్ పీటీలు, నీటికుంటలతో పాటుగా ఊట నీటిని వన్యప్రాణులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. జన్నారం అటవీ డివిజన్లోని మూడు అటవీ రేంజ్లలో ఐదు చోట్ల సహజ నీటి వనరులు, 187 కుంటలు, 29 సోలార్ పంపులు, 30 ర్యాంప్వెల్స్ ద్వారా నీటిసౌకర్యం కల్పిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. సహజ సిద్ధమైన జలానికే ప్రాధాన్యత గతంలో సాసర్ వెల్లో ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణులకు అందించేవారు. ప్రస్తుతం ఈ పద్ధతికి స్వస్తి పలికారు. వాగునీరు, జలధారలతో పా టు నీటికుంటలు, ర్యాంప్వెల్స్, సోలార్ పంపులతో నీటిని అందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జన్నారం డివిజన్లోని మూడు అటవీ రేంజ్లలో ప్రతీ కిలోమీటర్ దూరంలో ఒక రకమైన నీటివనరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వాగుల్లో చెలిమెలు మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ జోన్ మాదిరిగా కవ్వాల్ టైగర్జోన్లో వాగులకు ఆనకట్టలు వేసి సహజ సిద్ధమైన నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రవహించే వాగునీటికి ఆనకట్టలు వేసి నీటిని ఆపుతున్నారు. జన్నారం డివిజన్లో గతేడాది 30 చోట్ల ఇలాంటి ఆనకట్టలు వేయగా ఈ ఏడాది వాటి సంఖ్య పెంచనున్నారు. వాగునీటికి అడ్డంగా బండరాళ్లు, ఇసుకతో కట్టకట్టడంతో నీరు నిలిచి చెలిమెలా తయారవుతుంది. పారేనీరు శుభ్రంగా ఉండడంతో వాటిని వన్యప్రాణులు ఇష్టపడుతాయి. నీటికుంటలు అడవిలో భూగర్భ జలాలను పెంచేందుకు వర్షపునీ రు వృధాగా పోకుండా నిర్మించిన నీటికుంటలపై అ ధికారులు దృష్టి పెట్టారు. కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో 300 వరకు నీటి కుంటలు ఉండగా అందులో 187కు కుంటల్లో ప్రస్తుతం నీరు ఉంది. ఏప్రిల్, మే వరకు 100 కుంటల్లో నీరు ఉండే అవకాశంఉందనిఅధికారులు చెబుతున్నారు. సాసర్ వెల్ ద్వారా నీటి సౌకర్యం నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంప్వెల్స్ లేని ప్రదేశాల్లో, ఎత్తయిన ప్రాంతంలో సాసర్వెల్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ట్యాంకర్ ద్వారా నీటిని నింపుతారు. ఆ శబ్ధానికి వన్యప్రాణులు పారిపోయే అవకాశం ఉండడంతో వాటి సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహజ సిద్ధంగా నీటిని అందిస్తున్నారు. ఒకవేళ నీటికొరత ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని నింపనున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం అడవిలో నివసించే వన్యప్రాణులకు ఆహారంతో పాటు నీటిసౌకర్యం కల్పించేందుకు పలురకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోలార్ పంపులతో కుంటల్లోకి నీటిని వదులుతున్నాం. వన్యప్రాణులకు స్వచ్ఛమైన నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. – కారం శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారి -
హైవేపై రోడ్డు ప్రమాదం●
● లారీ డ్రైవర్, క్లీనర్కు గాయాలు గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై బస్టాండ్ సమీపంలో బుధవారం మూడు లారీలు ఢీకొన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ రోడ్డుపై నిలిచి ఉండగా అతివేగంగా వచ్చిన లారీ సైడ్ తీసుకుంటూ అదుపుతప్పి కంటైనర్ను ఢీకొట్టింది. వెనుకనుంచి వచ్చిన మరోలారీ ఆ లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రసాద్, క్లీనర్ అమేద్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. కాగా ఈ నెల 8న ఇదే స్థలంలో రెండు లారీలు ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
నా చావుకు భార్య, అత్తమామలే కారణం..!
నిర్మల్: ‘నా చావుకు భార్య, అత్తమామలే కారణం.. నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి..’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాండ్రపు అంజన్న(26) కాసిపేటకు చెందిన శిరీషను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వారం రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో సోమవారం కూతురిని చూడడానికి అంజన్న కాసిపేటకు వెళ్లగా.. భార్య, అత్తమామలు దూషించారు. దీంతో ఆవేదనకు గురైన అంజన్న ఇంటికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు కారకులు అంటూ భార్య, అత్తమామలు, పెద్దమనుషులు పలువురి పేర్లు పేర్కొన్నాడు. రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. -
22న ట్రిపుల్ ఐటీలో ఎస్డీజీ సమ్మిట్
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఈనెల 22న ఎస్డీజీ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, కార్యాచరణ పరిష్కారాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీ విద్యార్థి జావేద్ నేతృత్వంలోని టీమ్ ట్రాన్స్ఫార్మ్ ఈ సమ్మిట్ నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సహకార చర్య, వినూత్న పరిష్కారాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ గోవర్ధన్ నొక్కి చెప్పారు. ఈ సమ్మిట్ థీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. అనంతరం సమ్మిట్ లోగో ను విడుదల చేశారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్, ఏవో రణధీర్ సాగి పాల్గొన్నారు. -
కొలిక్కి రాని హమాలీల వివాదం
● రెండో రోజు జైనథ్లో జరగని శనగ కొనుగోళ్లు ఆదిలాబాద్టౌన్: జైనథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీల వివాదం ఎటూ తేలలేదు. రెండోరోజు మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లు జరగలేదు. బుధవారం సైతం ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. ఇద్దరు గుత్తేదారుల మధ్య నెలకొన్న లొల్లి రైతుల పాలిట శాపంగా మారింది. ఆందోళనను సద్దుమణిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని జైనథ్ మార్కెట్యార్డుకు పంపించింది. సదరు అధికారులు దీనిపై ఎటూ తేల్చకుండానే వెనుదిరిగారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఎవరికి ఎమి చెప్పే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమి లేక ఉన్నాతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని అక్కడి నుంచి వెనుదిరిగారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ ఏడీ గజానంద్, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, డీసీవో మోహన్లు మార్కెట్ కార్యదర్శి దేవన్నకు సూచించారు. అక్కడున్న కాంటాల్లో ఇద్దరు గుత్తేదారులకు చెరిసగం చూసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే సదరు గుత్తేదార్లు దీనిపై అంగీకరించేందుకు ముందుకు రాలేదు. జైనథ్ వ్యవసాయ మార్కెట్ అధికారులు కొత్త గుత్తేదారుకు లైసెన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆయనకే హమాలీల బాధ్యతలను పూర్తిస్థాయిలో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత 15ఏళ్లుగా బిహార్కు చెందిన గుత్తేదారే హమాలీలను సరఫరా చేస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఉన్నఫలంగా తనను ఏ విధంగా తొలగిస్తారని వాపోతున్నారు. ఇద్దరు గుత్తేదార్లను పిలిచి నచ్చజెప్పినప్పటికి వారి మధ్య సయోధ్య కుదరలేదు. శనగ పంటను విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ కాంట్రాక్టర్ల లొల్లి కారణంగా తమను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నాతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొన్నారు. -
కర్బూజ సాగు..లాభాలు బాగు
● జిల్లా వ్యాప్తంగా 70 ఎకరాల్లో సాగు ● అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు ● వేసవిలో పంటకు డిమాండ్ చెన్నూర్రూరల్: పంట మార్పిడి విధానం అవలంభిస్తే అధిక లాభాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఒకేరకం పంటలు సాగుచేస్తే భూసారం దెబ్బతింటుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంట మార్పిడికి ముందుకు వస్తున్నారు. ఇందుకు ఉదాహరణ కర్బూజ సాగు. ఇతర పంటలు సాగు చేసి విసిగి పోయిన కొందరు రైతులు ఇందుకు భిన్నంగా ఆలోచించి వేసవిలో కర్బూజ సాగు వైపు దృష్టి సారించారు. వేసవిలో మార్కెట్లో కర్బూజకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ పంట వైపు దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 70 ఎకరాల్లో కర్బూజ పంట సాగవుతోంది. జిల్లాలోని చెన్నూర్, భీమారం, బెల్లంపల్లి, దండేపల్లి, కోటపల్లి, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల్లో పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు పెట్టుబడులు అవుతాయి. నవంబర్, డిసెంబర్ నెలలు సాగుకు అనుకూలం. గింజలు నాటిన సమయం నుంచి మూడు నెలల వరకు పంట కాపుకు వస్తుంది. ఎకరాకు సుమారు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కిలోకు రూ.12 నుండి 15వరకు ధర పలుకుతుంది. ఎకరానికి సుమారు రూ.60 వే ల నుంచి 70వేల వరకు లాభం వస్తుంది. స్వయంగా అమ్మితే లాభం మరింత ఎక్కువగా ఉంటుంది. చీడపీడల నివారణకు చర్యలు ఈ పంటను కాయ తొలుచు పురుగు (పండు ఈగ) ఎక్కువగా ఆశిస్తుంది. దీని యొక్క లార్వాలు కాయలోకి చొచ్చుకు పోయి కుళ్లి పోయేలా చేస్తాయి. పురుగు ఆశించక ముందే 10 లీటర్ల నీటిలో 100 ఎంఎల్ మలాథియన్, 100 గ్రాముల బెల్లం కలిపి వెడల్పాటి పల్లెంలో ఈ ద్రావణం పోసి పంట చేనులో అక్కడక్కడ ఉంచాలి. పురుగు ఆశించిన తర్వాత నివారణకు వెంటనే లీటరు నీటికి 2ఎంఎంల్ మలాథియన్ లేదా 2 ఎంఎల్ క్లోరిఫైరిపాస్ పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ నివారణకు జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను చేనులో ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 3ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 గ్రాముల ఎస్టమిప్రైడ్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఆశిస్తే లీటరు నీటికి 2 గ్రాముల పిప్రోనిల్ కలిపి పిచికారీ చేయాలి.మంచి లాభాలు ఉన్నాయి వరి, పత్తి పంటల సాగుకు భిన్నంగా వేరే రకం పంటలు సాగు చేయాలని అనుకున్నా. మూడేళ్లుగా రెండెకరాల భూమిలో కర్బూజ సా గు చేస్తున్నా. మంచి లాభాలు ఉన్నాయి. వేసవిలో పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. – కంకణాల లక్ష్మణ్రెడ్డి, కర్బూజ రైతు, ఒతుకులపల్లి సలహాలు, సూచనలు ఇస్తున్నాం కర్బూజ సాగులో మంచి లాభాలు ఉన్నాయి. రైతులు ముందుకు వచ్చి ఇలాంటి పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించాలి. నియోజకవర్గ వ్యాప్తంగా కర్బూజ సాగు చేస్తున్న రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
నేషనల్ మార్ట్లో చోరీ
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ మార్ట్లో చోరీ జరిగినట్లు ఎస్సై విష్ణు వర్ధన్ తెలిపారు. రోజు మాదిరిగానే నేషనల్ మార్ట్ సిబ్బంది సోమవారం రాత్రి తా ళాలు వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉద యం వచ్చేసరికి సేఫ్టీలాకర్ ఓపెన్ అయి ఉండడంతో మేనేజర్ తుకారాం పోలీసులకు సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.4.82 లక్షలు చోరీకి గురయ్యాయని మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. సీసీపుటేజీలో రికార్డయిన లాకర్ ఓపెన్ చేస్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐటీడీఏ పీవోకు స్కోచ్ అవార్డుఉట్నూర్రూరల్: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా గిరిజనులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచి గిరిజనులకు చేరువ కావడంతో పాటు గిరిజన విద్యార్థుల్లో పౌష్టికాహార నివారణకు రాష్ట్రంలో మొదటిసారిగా గిరిజన పోషణ మిత్ర, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు గిరిజన క్యాంటీన్ను ఏర్పాటు చేయడంలో పీవో ముందు వరుసలో నిలిచారు. ఈ నెల 29న న్యూఢిల్లీలో ఇండియా హబిటాట్ సెంటర్లోని జకరంద హాల్లో ఐటీడీఏ పీవో అవార్డు అందుకోనున్నారు. -
గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలి
కాసిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న మోసపూరిత కుట్రను రద్దుచేసి సింగరేణి టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి, ఇల్లందు మైన్లకు సింగరేణి టెండర్లలో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. తిరిగి అదే ప్రభుత్వం సింగరేణికి టెండర్ ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె చేసి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, బ్రాంచి ఇన్చార్జి చిప్ప నర్సయ్య, గని ఫిట్ సెక్రెటరీ మినుగు లక్ష్మీనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, నాయకులు నాగేశ్వరరావు, శ్రీహరి, రాజేందర్, సురేష్, సంతోష్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
చేపల వల చుట్టుకుని మత్స్యకారుడు..
సోన్: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన సస్కిన్ సాయికుమార్ (28) మంగళవారం వృత్తిరీత్యా చేపలు పట్టేందుకు సరస్వతి కెనాల్కు వెళ్లాడు. కాలువలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసులో మహిళ రిమాండ్లక్సెట్టిపేట: ఈనెల 16న పట్టణంలోని గోదావరి రోడ్లో నివాసముంటున్న కొత్త శ్యామల ఇంట్లో చోరీకి పాల్పడిన వసంత అనే మహిళను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. అదే కాలనీకి చెందిన వసంత బాధితురాలు శ్యామల ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి ఆమెను బాత్రూంలోకి నెట్టివేసి మెడలోని గొలుసు లాక్కుని పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను సోమవారం రాత్రి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఉట్నూర్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్రావు తెలిపిన వివరాల ప్రకారం జైనూర్ మండలానికి చెందిన కుమ్ర భక్కు (46) మంగళవారం ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి సమీపంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుండగా మారుతిగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన మరో బైక్ను ఢీకొట్టాడు. ఘటనలో భక్కుకు తీవ్రగాయాలు కావడంతో అటుగా వెళ్తున్న మాజీ ఎంపీపీ గమనించి 108కు సమాచారం అందించగా ముందుగా ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. చికిత్స పొందుతూ మహిళ..ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా కొతారి గ్రామానికి చెందిన రాథోడ్ జాముబాయి (55) మృతి చెందినట్లు టూటౌన్ ఏఎస్సై ముకుంద్రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఈనెల 16న రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పీడీఎస్ బియ్యం పట్టివేతఖానాపూర్: పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో కడమంచి లక్ష్మణ్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. నిరుపేద ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు ఇంటి వెనకాల ప్రహరీ వద్ద నిలువ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నిర్మల్రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్నగర్ కాలనీకి చెందిన చవాన్ కరణ్సింగ్ (22) మంగళవారం అదే కాలనీకి చెందిన స్నేహితులు సయ్యద్ అజీమ్, నర్సింగ్తో కలిసి బైక్పై సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయ సమీపంలోకి రాగానే టిప్పర్ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడిపోయారు. కరణ్సింగ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సయ్యద్ అజీమ్, నర్సింగ్ను 108లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఖాదీర్, కుభీర్ మండలానికి చెందిన సత్యనారాయణ మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఖానాపూర్ వైపు నుండి నిర్మల్ వెళ్తుండగా నిర్మల్ నుండి కనకాపూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఖాదీర్, సత్యనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
జైపూర్: ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని శివ్వారంలో చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల మేరకు శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు పోశక్క, దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్ (26) డిగ్రీ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి మానేశాడు. కొద్దిరోజులుగా ఇంటివద్దే ఉంటున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఏదైనా పని చేసుకోవాలని, లేదా వ్యవసాయం చూసుకోవాలని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం పంట పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గిన్నిస్ రికార్డులో స్థానం జిల్లాకే గర్వకారణం
ఆసిఫాబాద్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయమైన గుస్సాడీ నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరి జన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిర్యాణి మండలం దంతన్పల్లి గ్రామానికి చెందిన భీమయ్య కొలాం గుస్సాడీ బృందంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఢిల్లీలో 5 వేల మంది కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో దంతన్పల్లి పీవీటీజీ కొలాం గుస్సాడీ బృందం నృత్య ప్రదర్శన రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం సంపాదించిందన్నారు. గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అనంతరం గుస్సాడీ బృంద సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, ఆత్రం గంగారాం, మడావి భీమ్రావు, కుర్సింగ మోతీరాం, ఆత్రం సంతోశ్, చహకటి దసరు, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈలు, ఏఈఈలతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద రూ.43 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటివరకు రూ.22 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్ర భవనాలు, పాఠశాలల ప్రహరీలు, పశువుల పాకలు, మేకల షెడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీలు తదితర పనులు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 2,050 పనులు మంజూరు కాగా ఇప్పటివరకు 1,617 పనులు పూర్తి చేశామని, మిగతావి ఈ నెల 20లోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ ఇంజినీర్ రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఆకస్మిక పర్యటన మందమర్రిరూరల్: మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో ఏటీసీని సందర్శించారు. యంత్రాలను పరిశీలించి వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ దేవానంద్, టీటీఎల్ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో పలువురు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అన్ని రకాల మందులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మోడల్ స్కూల్లో ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. సారంగపల్లిలోని నర్సరీ, పొన్నారంలో జెడ్పీ హైస్కూల్ సందర్శించారు. తహసీల్దార్ సతీష్కుమార్, ఆర్ఐ గణపతి తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
● గత రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని విద్య, వైద్యారోగ్యం, ఉపాధి ● నేటి బడ్జెట్లో కేటాయింపులపై ఆశలు
మందమర్రిలో మూతపడిన తోళ్ల పరిశ్రమ జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు మాస్టర్ ప్లాన్కు నిధుల లేమి జిల్లా కేంద్రం మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక మాస్టర్ ప్లాన్ అమలుకు పట్టణాభివృద్ధి కోసం నిధులు కావాల్సి ఉంది. ఇందుకు కనీసం రూ.78కోట్లు అవసరం. దండేపల్లి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు అవసరమని సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలోనే ఎమ్మెల్యే పీఎస్సార్ నిధులు ఇప్పించాలని కోరారు. అలాగే రాళ్లవాగుపై కరకట్ట, వంతెన, ఆరు వరుసల దారికి నిధులు మంజూరయ్యాయి. మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జి రద్దు చేశాక, కొత్త వంతెన నిర్మాణంపై స్పష్టత రావాల్సి ఉంది. ‘వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం..’ అని సీఎం రేవంత్రెడ్డి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు, ఏర్పడ్డాక లోక్సభ, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి, నాటి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో అభివృద్ధిపై హామీలు ఇచ్చారు. గతేడాది బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులేవీ జరగలేదు. బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు నిధుల కేటాయింపులపై ఆశలు నెలకొన్నాయి. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామీణ మౌలిక వసతుల మెరుగు, రోడ్లు, విద్య, వైద్యారోగ్యం, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు నిధుల అవసరం ఉంది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల వైద్యారోగ్యంజిల్లాలో విద్య, వైద్యారోగ్యం ఎంతగానో మెరుగు పర్చాల్సి ఉంది. బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టుల ఖాళీలు ఉన్నాయి. పీహెచ్సీల్లోనూ వైద్యాధికారులు, సిబ్బంది కొరత ఉంది. ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ఉంటే ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖప్రస్తుతం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి. దండేపల్లిలో నిర్మాణ పనులు మొదలు కాగా, బెల్లంపల్లి, చెన్నూరులో ఇంకా స్థలం ఎంపిక కాలేదు. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలతోపాటు ప్రభుత్వ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ లేక ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్తున్నారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేయాలన్నా డిమాండ్లు అలాగే మిగిలిపోతున్నాయి. ఇక జిల్లాలో ప్రతీ మండలానికి జూనియర్ కాలేజీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. మన ఊరు–మన బడి పనులు ఇంకా పూర్తి కాలేదు. అంగన్వాడీ కేంద్రాలు 484 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. తీరని సాగునీటి గోస చుట్టూ నీరున్నా జిల్లాలో ఇప్పటికీ రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుతో బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు నీరందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కాలువలు తవ్వి వృథాగా మిగిలిపోయాయి. కడెం కాలువ ఆధునీకరణ, వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు రూ.17కోట్లు అవసరం ఉంది. మత్తడివాగుకు రూ.2.90కోట్లు అవసరం ఉంది. గొల్లవాగు, ర్యాలీ వాగు ఆయకట్టును స్థిరికరించాల్సి ఉంది. ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. వర్షాకాలం మొదలైతే చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన చెన్నూరు ఎత్తిపోతలు రద్దయాయి. ఆ స్థానంలో కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది. ఇక హాజీపూర్ మండలం పడ్తన్పల్లి ఎత్తిపోతలు రద్దయ్యాయి. వాటి స్థానంలోనే దండేపల్లి మండలం ద్వారక, గుడిరేవు, గూడెం, లక్సెట్టిపేట మండలం మోదలలో నాలుగు ఎత్తిపోతలు గోదావరి నుంచి నీటిని వాడుకునేలా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రణాళికలు వేశారు. నిధుల విడుదల లేమితో గతేడాది నుంచి అడుగు ముందుకు పడడం లేదు. పరిశ్రమలు, ఉపాధి పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా బెల్లంపల్లిలోని ఫుడ్ప్రాసెసింగ్ జోన్ పూర్తి చేయడం, మందమర్రిలో తోళ్లపరిశ్రమ పునరుద్ధరణ, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ పార్కు, ఇండస్ట్రీయల్ కారిడార్కు నిధులు కేటాయించాల్సి ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశమున్నా నిధుల లేమితో ముందుకు సాగడం లేదు. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై నీలినీడలు
● వార్షిక ఉత్పత్తికి దూరంగా శ్రీరాంపూర్ గనులు ● ఇప్పటికీ 89శాతమే ఉత్పత్తి శ్రీరాంపూర్: సింగరేణి వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈలోగా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. కానీ కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2024 ఏప్రిల్ 1నుంచి ఈ ఏడాది మార్చి 17వరకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 60.38 లక్షల టన్నులకు గాను 53.66 లక్షల టన్నులు మాత్రమే సాధించింది. దీంతో 89శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ ఉత్పత్తిలోటు పోను మిగిలిన రెండు వారాల్లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఇందారం ఓసీపీలో ఉత్పత్తి లక్ష్యం సాధించకపోవడంతో దాని ప్రభావం ఏరియా లక్ష్యాల సాధనపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఓసీపీలో ఓబీ పనుల్లో జాప్యం, కాంట్రాక్టర్ నిర్దేశిత ఓబీ తీయకపోవడం వల్ల అతి తక్కువగా 42శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. గత సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యానికి దూరంగా ఉన్న శ్రీరాంపూర్ ఓసీపీ ఈ ఏడాది లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఏరియాల్లోని అన్ని గనుల కంటే శ్రీరాంపూర్ ఓసీపీ 111శాతం బొగ్గు ఉత్పత్తితో ముందుంది. గనుల్లో ఇటీవల యువ కార్మికుల గైర్హాజరు ప్రభావం వార్షిక ఉత్పత్తి లక్ష్యంపై పడింది. మిగిలిన రోజుల్లో ఏరియాలోని గనులు రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ పోయిన కూడా వంద శాతం సాధించడం సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కోసం ఇన్సెంటివ్ స్కీం పెట్టిన అది నామమాత్రమే ప్రఽభావాన్ని చూపిందని అంటున్నారు.గనుల వారీగా మార్చి 17నాటికి సాధించిన ఉత్పత్తి వివరాలు (టన్నుల్లో)గని లక్ష్యం సాధించింది శాతం ఆర్కే 5 259440 236903 91 ఆర్కే 6 172800 182413 106 ఆర్కే 7 345600 295280 85 ఆర్కే న్యూటెక్ 153520 163831 107 ఎస్సార్పీ 1 115008 88315 77 ఎస్సార్పీ 3, 3ఏ 268960 226778 84 ఐకే 1ఏ 229920 185880 81 ఎస్సార్పీ ఓసీపీ 3056000 3381329 111 ఐకే ఓసీపీ 1437600 606997 42 మొత్తం 6038848 5367726 89 -
పిచ్చుకలతో జీవ వైవిధ్యం
● 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నస్పూర్: పిచ్చుకల సంరక్షణతోనే జీవ వైవిద్యం కొనసాగుతుందని నేటి ఆధునిక సమాజంలో ఎంతమందికి తెలుసు. ఈ భూగోళంపై నివసించే ప్రతీ జీ వి, మానవునితో పాటు సకల ప్రాణుల మనుగడ కు, జీవవైవిద్యానికి, ఆహార ఉత్పతికి సైతం పిచ్చుకల పరపరాగ సంపర్కమే కారణం. కనుమరుగవుతున్న కమనీయ పిచ్చుకల జాతులను కాపాడుకోకుంటే తీరని నష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పంట చేలల్లో, పల్లె ముంగిట్లో ధాన్యపు రాశుల్లో కిలకిల మంటూ సందడి చేసే పిచ్చుకలు మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటి మనుగడకు శాపంగా మా రిందని సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుండి కనుమరుగవుతున్నాయ ని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి ప్రేమకు నిదర్శనం జనావాసాలతో మమేకమై జీవిస్తున్న పిచ్చుకలు మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టుకోవడం, అందులో గుడ్లు పెట్టడం, వాటిపై పొదగడం, పుట్టిన పిల్లలకు ఆహారాన్ని నోటితో తెచ్చి అందించడం, వాటికి రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడడం వంటి దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను, తల్లి ప్రేమకు మరోపేరుగా గుర్తించిన ప్రపంచ దేశాలు పిచ్చుకల సంరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లును సైతం విడుదల చేసిందని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు. పిచ్చుకలను బతుకనిద్దాం పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే మానవ మనుగడపై తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. పిచ్చుకల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత. వాటి ఆవాసం కోసం ఇంటి ఆవరణలో వెదురు, కర్ర, అట్టడబ్బాలతో గూళ్లు తయారు చేయాలి. మట్టిపాత్రలో నీరు, ధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ఇంటి ముందు రసాయనాలు లేని బియ్యపు పిండి ముగ్గు వేస్తే వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకలు పదికాలాల పాటు పదిలంగా బతికేలా మానవులుగా మనవంతుగా సహకరిద్దాం.. పిచ్చుకలను బతుకనిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. – గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త, రిటైర్డ్ టీచర్, నస్పూర్ -
‘బీసీలకు రిజర్వేషన్లు చరిత్రాత్మక ముందడుగు’
పాతమంచిర్యాల: తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మక ముందడుగు అని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, బీసీ జేఎసీ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సేవాదళ్, బీసీ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, సంయుక్త కార్యదర్శి జంగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి రాజిరెడ్డి, బీసీ జేఏసీ జిల్లా నాయకుడు డాక్టర్ రాజ్కిరణ్, జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుతో న్యాయం మంచిర్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ క ల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతో బీసీలకు న్యాయం జరుగుతుందని ఏఐసీసీ రా ష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ ముత్తినేని రవికుమార్ ఒక ప్ర కటనలో తెలిపారు. బిల్లును అమలు చేస్తే రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం సాధించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. -
పన్ను చెల్లించకుంటే ఇంటికి తాళం
● రాత్రివేళ మున్సిపల్ అధికారుల వేధింపులు ● పన్ను వసూళ్లలో పాల్గొన్న కమిషనర్ ● అప్పు తెచ్చి పన్ను చెల్లింపు చెన్నూర్: ‘ఆస్తి పన్ను చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తాం..’ అంటూ మున్సిపల్ అధికారులు రాత్రివేళ హడావుడి చేశారు. కూలీ పనులు చేసుకునే తాము రాత్రి సమయంలో ఎలా చెల్లించేదంటూ వేడుకున్నా కనికరించలేదు. అప్పుటికప్పుడు అప్పు తెచ్చి ఇవ్వడంతో అక్కడి నుంచి కదిలారు. ఈ సంఘటన చెన్నూర్ మున్సిపల్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మార్చి నెల కావడంతో ఇంటి పన్ను డిమాండ్ మేరకు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా చెన్నూర్ మున్సిపల్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పన్నుల వసూలులో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో బొజ్జ పోచం, అకినపల్లి ఆనంద్ ఇళ్లకు వెళ్లి పన్ను చెల్లించకుంటే ఇళ్లకు తాళం వేస్తామని బెదిరించారు. ఆనంద్ ఇంటి పన్ను రూ.8వేలు బకాయి ఉంది. చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని హడావుడి చేశారు. ఇల్లు తమ తల్లి పేరున ఉందని, అన్నదమ్ములు డబ్బు ఇవ్వలేదని, కూలీ పని చేసుకుని జీవించే తాను రేపు చెల్లిస్తానని ఆనంద్ అధికారులను వేడుకున్నాడు. అయినా వారు వినకపోవడంతో అప్పటికప్పుడు రూ.2,200 అప్పు తెచ్చి అధికారులకు చెల్లించాడు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. కాగా, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను సంప్రదించగా.. పన్ను వసూలు లక్ష్యం చేరాలంటే రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు వసూలు చేస్తామని అన్నారు. మొండి బకాయిలు వంద శాతం వసూలుకు సమయంతో పని లేదంటూ పేర్కొనడం గమనార్హం. -
పెద్దబుగ్గ అడవిలో కార్చిచ్చు
బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని పెద్దబుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి కార్చిచ్చు రగిలింది. కన్నాల గ్రామం నుంచి బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో గుట్టను ఆనుకుని మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. విలువైన వృక్షాలు మంటల్లో మాడిపోయాయి. వేసవి తీవ్రత పెరగడంతో క్రమంగా ఆకులు రాలిపోయి మంటలు అంటుకుని కార్చిచ్చు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఎగిసి పడుతున్న మంటలతో పెద్దబుగ్గ అటవీ ప్రాంతం కారుచీకట్లో ఎరుపెక్కింది. కాగా నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే పులి సంచరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కార్చిచ్చు రగలడంతో అటవీ జంతువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
బీఏ, బీఈడీ.. నాలుగేళ్లు
● లక్సెట్టిపేట కళాశాలలో కొత్త కోర్సు ● జిల్లాలో ఒక్కటే కాలేజీలక్సెట్టిపేట: డిగ్రీతోపాటు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. గతంలోని కోర్సుల కంటే భిన్నంగా బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందుకోసం లక్సెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసి కోర్సు అందిస్తోంది. విద్యార్థులు ఉన్నత విద్య, మంచి భవిష్యత్ కోసం ఒకేసారి డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఇందుకు గాను సమీకృత బీఈడీ కోర్సును బీఏ గ్రూపుతో ఆన్లైన్లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 31లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా నాలుగేళ్లలోనే డిగ్రీతోపాటు బీఈడీ సర్టిఫికేట్ కోర్సును అందుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో కళాశాలమండల కేంద్రంలోని మోడల్ డిగ్రీ కళాశాల అన్ని సౌకర్యాలతో బీఈడీ కోర్సుకు జిల్లా నుంచి ఎంపికై న ఏకై క కళాశాల. బీఏ, బీఈడీ గ్రూపులో 50సీట్లతో 2023లో కోర్సును విద్యాశాఖ మంజూరు చేసింది. కళాశాలలో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు, పట్టణానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థుల జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని మూడు కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహణకు అనుమతి లభించగా.. ఇందులో లక్సెట్టిపేట డిగ్రీ కళాశాల ఒకటి కావడం గమనార్హం. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి డిగ్రీ కోర్సు చేస్తూ ఉపాధ్యాయ వృత్తిపై శ్రద్ధ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సీటు సాధిస్తే భవిష్యత్లో మంచి ఉపాధి అవకాశం ఉంటుందని కళాశాల అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు నూతన కోర్సు మంజూరై రెండేళ్లు పూర్తయింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో https:// exams. nta. ac. in/ NCET/ దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్ష రాయాలని సూచిస్తున్నారు. సంతోషంగా ఉంది.. కళాశాలకు సమీకృత బీఈడీ కోర్సు రావడం చా లా సంతోషంగా ఉంది. జిల్లాలోనే లక్సెట్టిపేట కళాశాలను ఎంపిక చేయ డం మంచి నిర్ణయం. నూతన కోర్సు కావడంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అర్హత పరీక్ష ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. – మహాత్మా సంతోష్, కళాశాల ప్రిన్సిపాల్ -
ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలటౌన్: మందుల పంపిణీ, వ్యాక్సి న్లు నిల్వ చేయడంలో ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో సోమవారం జి ల్లాలోని ఫార్మసిస్టులకు ఎనీమియా ముక్త్ భారత్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి ఫార్మాసిస్టులు సూపర్ చైన్ మేనేజ్మెంటు వ్యాక్సినేషన్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాతావరణ మార్పులతో కీటక జనిత వ్యాధులు, అసంక్రమణ వ్యా ధులు వచ్చే వీలుండడంతో వాటికి సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలని తెలిపా రు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో రోజూ తీసుకున్న మందులు, వ్యాక్సిన్ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత, జిల్లా ఫార్మాసిస్టు డాక్టర్ ప్రసాద్, డీపీహెచ్ఎన్ పద్మ, డెమో వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం రిలే నిరాహార దీక్ష
బెల్లంపల్లి: ఎస్సీ వర్గీకరణ పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఏఎంసీ క్రీడామైదానం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టా రు. పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో మాదిగ శ్రేణులు దీక్ష చేఽశారు. దీక్షా శిబి రాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సరిగా చే పట్టలేదన్నారు. ఏ, బీ, సీ, డీ చేయాల్సి ఉండగా ఏ, బీ, సీ చేసి చేతులు దులిపేసుకుందని అ న్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాల్సి ఉండగా అశాసీ్త్రయంగా చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగా మాదిగలు, ఉపకులాల కు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని స రి చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలకు మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జిలకర శంకర్, మచ్చ రాజేష్, నాతరి శివ, పుల్లూరి రా ము, బి.రవీందర్, బి.రాంచందర్, రామకృష్ణ, పద్మక్క, రాజలింగు, భూమయ్య పాల్గొన్నారు. -
వేలంలో పాల్గొంటేనే సింగరేణి మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య శ్రీరాంపూర్: బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొంటేనే సంస్థకు మనుగడ ఉంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం ఆయన ఆర్కే 5గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బొగ్గు గనుల చట్టం ప్రకారమే గనులు కేటాయిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి వేలంలో పాల్గొనేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని అన్నారు. డైరెక్టర్(పా), ిసీఎండీ, జేసీసీ సమావేశాల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లను యా జమాన్యం ముందుంచామని తెలిపారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, అలవెన్స్లపై ఆదాయ పన్నును సంస్థనే చెల్లించాలని, మెడికల్ అన్ఫిట్ మైనింగ్స్టాఫ్, టెక్నికల్ సూపర్వైజర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని, 11 రకాల అలవెన్స్లను పెంచాలని తదితర డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.33 వేల కోట్ల బకాయిలను సింగరేణికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఏరియా కార్యదర్శి ప్రసాద్రెడ్డి, ఫిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, నాయకులు అద్దు శ్రీనివాస్, గొల్లపల్లి రామచందర్, సత్తిరెడ్డి భోగ మదనయ్య పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ వార్డు, డయాలసిస్, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిష్టర్లు, హాజరు పట్టిక, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నూతన భవనం నిర్మాణం మరో మూడు నెలల్లోపు పూర్తయి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ భీష్మ పాల్గొన్నారు. -
పింఛన్ రావడం లేదు..
గత ఆరు నెలలుగా దివ్యాంగుల పింఛన్ రావడం లేదు. సదరం సర్టిఫికేట్ రెన్యూవల్ చేయలేదని నిలిపివేశారు. మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే సర్టిఫికేట్ రెన్యూవల్ చేసుకోవాలని అంటున్నారు. ఆ సైట్ ఎప్పుడూ బంద్ ఉంటుంది. దయచేసి నాకు పింఛన్ వచ్చేలా చూడాలి. – కే.తేజ, రాజీవ్నగర్, మంచిర్యాల రైతు బీమా రాలేదు..మా నాన్న తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబా న్ని పోషించేవాడు. గ త డిసెంబర్లో అనా రోగ్యం కారణంగా చనిపోయాడు. రైతుబీమా పరిహారం రాలే దు. వ్యవసాయ అధికారులను అడిగితే తిరస్కరణకు గురైందని చెబుతున్నారు. అన్ని అర్హతలున్నా ఎందుకు రావడం లేదో ఎవరు చెప్పడం లేదు. – డి.విక్రమ్, బెల్లంపల్లి -
లోఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు
భీమారం: వేసవి కాలంలో విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. భీమారంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో రూ.కోటితో ఏర్పాటు చేసిన 8ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వేసవి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లలో పలు పరికరాల ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామాలకు కూడా నిరంత రం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీఈ కై సర్, ఏడీఏ బాలకృష్ణ, ఏఈ శంకర్ పాల్గొన్నారు. -
● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వైనం ● నిరుపయోగంగా మామిడి మార్కెట్ ● రైతులకు దక్కని ప్రయోజనం
ప్రయత్నాలు చేస్తున్నాంమామిడి కాయల వి క్రయాల కోసం ఎంతగానో యత్నాలు చేస్తున్నాం. నాలుగు నెలల క్రితం ట్రేడర్ల, కమీషన్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవగా హన కల్పించాం. కానీ ఇంతవరకు ఏ ఒక్క రు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందువల్ల ట్రేడర్లు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. మరోసారి కూడా సమావేశం నిర్వహించి మామిడికాయల కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – మహ్మద్ షాబుద్దీన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్నో ఏళ్లుగా నష్టపోతున్నాం..ఎన్నో ఏళ్ల నుంచి మామిడికాయలు నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి వ్యాపారులు, దళారుల మో సానికి గురవుతూ గిట్టుబాటు ధర రాక మస్తు నష్టపోతున్నం. మోసపోతున్న మామిడి రైతుల ఇబ్బందులను గుర్తించి పదేళ్ల కిందట బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ నిర్మాణం చేసిండ్లు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క ఏడాది సుత కొనుగో ళ్లు చేపట్టలేదు. ట్రేడర్స్తో మాట్లాడి కొనుగో ళ్లు చేయించడంలో మార్కెటింగ్ అధికారులు పట్టింపు చేస్తలేరు. ఈసారైనా ట్రేడర్స్ను ఒ ప్పించి మ్యాంగో మార్కెట్లో మామిడి కా యలు అమ్ముకునే అవకాశాలు కల్పించాలి. – సాటపురి చందు, మామిడి రైతుబెల్లంపల్లిలోని మామిడి మార్కెట్ బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని మామిడి మార్కెట్లో మామిడి కాయల క్రయవిక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలి క్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రేడర్లకు అవగాహన కల్పించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరూ ట్రేడ్లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో యేటా మాదిరిగానే ఈసారి కూడా నాగ్పూర్ మార్కెట్కు తరలించి పంట దిగుబడి అమ్ముకోవా ల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుబాటులో మామిడి మార్కెట్ ఉన్నా క్రయవిక్రయాలు చేపట్టకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది. ఆది నుంచీ సమస్యే.. బెల్లంపల్లి పట్టణంలో మామిడి మార్కెట్ ఉన్న మాటే గానీ మామిడి రైతులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోతోంది. క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. మామిడి దిగుబడి కొనుగోలు చేయడానికి ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉండగా.. ఏళ్ల తరబడి నుంచి విముఖత చూపుతున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు గత డిసెంబర్లో ప్రత్యేక చొరవ తీసుకుని ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. నెలలు గడుస్తున్నా లైసెన్స్ తీసుకోవడానికి ట్రేడర్ల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడం నిరాశకు గురి చేస్తోంది. ట్రేడర్లు ముందుకు రాకపోవడం వల్లనే మామిడి మార్కెట్లో మామిడి దిగుబడుల క్రయవిక్రయాలు జరగడం లేదు. ట్రేడర్ల సమస్య ప్రతిబంధకంగా మారింది. సౌకర్యాలు కల్పించినా.. 2015 సంవత్సరంలో మ్యాంగో మార్కెట్ మంజూ రు కాగా నిర్మాణానికి రూ.1.26 కోట్లు వ్యయం చే శారు. రెండు మ్యాంగో కవర్ షీట్స్, ప్రహరీ ని ర్మించగా, అదనపు సౌకర్యాల కోసం 2023 సంవత్సరంలో మరో రూ.1.18 కోట్లు కేటాయించారు. వీటిలో నుంచి రూ.8 లక్షలతో ఆర్వో ఫ్లాంట్, రూ.36 లక్షలతో మ్యాంగో మార్కెట్ అంతర్భాగంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయగా మిగిలిన రూ.74 లక్షలతో మరో కవర్షీట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.పిందె దశలో తోటలు మామిడి తోటలు పూత దశను దాటి ప్రస్తుతం పిందెలు తొడుగుతున్నాయి. ఉగాది పండుగ నాటికి ఓ మోస్తరు పరిమాణం కాయలు మార్కెట్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి దాదాపు మామిడి కాయలు మార్కెట్కు రావడం మొదలవుతుంది. మామిడి దిగుబడుల అమ్మకాలకు సమయం ఆసన్నం అవుతుండగా మరోపక్క ట్రేడర్ల సమస్య మామిడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా రూ.వందల కోట్లకు పైగా సాగే మామిడి వ్యాపారంపై పాలకులు, ప్రభు త్వ అధికారులు శ్రద్ధ వహించకపోవడం రైతులకు శాపంగా మారింది. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, డీఈవో యాదయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, నలుగురు సీ సెంటర్ కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, అంతరాయం లేకుండా విద్యుత్, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఐదు రూట్లు ఏర్పాటు చేశామని, ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అంజయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ● కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామంలో గుడుంబా, బెల్ట్షాపుల నిర్వహణతో యువత పెడదారి పడుతున్నారని, గుడుంబా, మద్యం విక్రయాలు నియంత్రించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ● హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్మికులకు అందిస్తున్న వేతనాలను మంచిర్యాల మున్సిపల్ కార్మికులకు అందించాలని జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ● కుటుంబ సర్వే దరఖాస్తుల డేటా ఎంట్రీ డబ్బులు ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన సురేష్కుమార్ దరఖాస్తు అందజేశారు. ● విద్యార్థినులు, ఉపాధ్యాయినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ను విధుల్లో నుంచి తొలగించాలని, బెల్లంపల్లి ఎస్సీ బాలుర పోస్టుమెట్రిక్ వార్డెన్ కోరుట్ల శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతిచెందాడని, వార్డెన్ను సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్, సికిందర్, బ్రహ్మానందం, శంకర్ కోరారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● మృతుల్లో చెన్నూర్ మండల వాసి ● హన్మకొండ జిల్లాలో ఘటన ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం హసన్పర్తి: దైవదర్శనానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ జిల్లా పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్(18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి.వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జారతకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ను ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెనుకాల బైక్పై వస్తున్న స్నేహితులు 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే సుశాంత్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
సికిల్సెల్ నిర్మూలనే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: సికిల్సెల్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బ్లడ్ సెల్ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ హీన దీక్షిత్ అన్నారు. డీఎంహెచ్వో సమావేశ మందిరంలో సికిల్సెల్పై జిల్లా స్థాయి టీవోటీ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2047 వరకు సికిల్సెల్ (ఎనీమియా) అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సికిల్సెల్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఎలా అరికట్టాలో మాస్టర్ ట్రైనర్ హెమటలాజీ ప్రొఫెసర్ రాధిక ప్రొజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రొగ్రామ్ అధికారి శ్రీధర్, ఏటీడీవో అనిల్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
తొలికాత విద్యార్థులకే..
● పాఠశాలలో ఏటా పుచ్చకాయలు అందజేస్తున్న రైతు ఆనంద్ ఆ రైతుకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారిని దైవంగా భావిస్తాడు. ఏటా తన చేనులో సాగైన పుచ్చకాయల తొలికాతను వారికే అందజేస్తాడు. ఐదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. అతడే తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండె ఆనంద్. తనకున్న రెండెకరాల్లో ఏటా పుచ్చ సాగు చేస్తున్నాడు. దిగుబడి షురూ అయ్యే క్రమంలో తొలికాతను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదేళ్లుగా అందజేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు అందజేశాడు. ఇందులో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, ఉపాధ్యాయులు సరిత,శిల్ప సిబ్బంది ఉన్నారు. – తాంసి -
దోపిడీ దొంగల అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ భవన్ వద్ద ఈ నెల 14 దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ తెలిపారు. సంబంధిత వివరాలను ఆయన కార్యాలయంలో వెల్లడించారు. స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోశంపై దాడి చేసి ఆయన వద్ద ఉన్న బంగారు గొలుసును దోచుకున్నారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీ పుటేజీ ఆధారంగా బండి నంబర్ను గుర్తించి దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించామని తెలిపారు. స్థానిక సంజీవయ్య కాలనికి చెందిన ఎండీ.సమీర్, ఎండీ.జుబీర్లను అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించారని తెలిపా రు. నిందితుల నుంచి బంగారు గొలుసు, కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ ప్రమోద్రావు, ఎస్సై ప్రవీన్కుమార్, సిబ్బంది సుబ్బరావ్, మహేష్, ఉపేందర్లను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ అభినందించారు. -
హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక
బోథ్: మండలంలోని ధన్నూర్(బి) గ్రామానికి చెందిన మార రజినీకాంత్ రెడ్డి సోమవారం హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సిటీ బస్కండక్టర్ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. కాగా హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తా చాటిన సిరాజ్ఖాన్ బజార్హత్నూర్: టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో మండలంలోని కొలారి గ్రామానికి చెందిన పటాన్ సిరాజ్ఖాన్ సత్తా చాటాడు. రైతు పటాన్ అంజత్ఖాన్, షకీలాబేగంల కుమారుడు సిరాజ్ఖాన్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతనెన్నెల: ఆదిల్పేట కాలువ నుంచి మందమర్రి మండలం మామిడిగట్టుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ మోహన్ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ను నెన్నెల పో లీస్స్టేషన్కు తరలించి తహసీల్దార్కు అప్పగించామని పేర్కొన్నారు. డ్రైవర్తోపాటు ట్రాక్టర్ యజమాని మోర్లె మల్లేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అందుగులపేట జా తీయ రహదారి ఫ్లై ఓవర్బ్రిడ్జి ముగింపు సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ల భ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి ఒంటిపై నీలిరంగు చొక్కా, జీన్స్ ప్యాంట్ ఉన్నాయని, ప్యాంటు జేబులో ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సు టికెట్ లభించిందని తెలిపారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712656570 నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
సైకిల్ పై నుంచి పడి వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో సైకిల్ పై నుంచి కిందపడి ఓరియంట్ రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు గాసికంటి రాజయ్య(65) మృతిచెందాడు. దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజిపూర్ మండలం సబ్బపల్లికి చెందిన రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు రాజయ్య ఈ నెల 16న దేవాపూర్లోని తన కుమారుడు మల్లేష్ ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 5గంటలకు తన స్నేహితుడిని కలవడానికి కొత్త గడ్పూర్కు వెళ్లి తిరిగి ఏడు గంటల ప్రాంతంలో కుమారుడి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్దిమాడ శివారులోని కల్వర్టు వద్ద సైకిల్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అంబులెన్స్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తలరాతను మార్చేది చేతిరాతే
కెరమెరి(ఆసిఫాబాద్): అక్షరం విలువ తెలపడానికి.. మన భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయడానికి అందమైన దస్తూరి అవసరం. కానీ సాంకేతిక పుణ్యమా అని..ఆయుధం లాంటి అక్షరం అష్టవంకర్లు పోతోంది. ‘నేను క్షేమం.. మీరు క్షేమమా’అంటూ రాసే లేఖలు మాయమయ్యాయి. హలో.. హాయ్ అంటూ సంక్షిప్త సందేశాలు గిర్రున తిరుగుతున్నాయి. కంప్యూటర్లు, ట్యాబ్, మొబైల్ల కారణంగా కాగితంపై పెన్ను పెట్టాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ తరుణంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పాఠశాలల్లో చదివే సగం మంది విద్యార్థులు చేతిరాత గుండ్రంగా రాయలేక పోతున్నారు. ఫలితంగా మంచి మార్కులు పొందలేక పోతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చేతిరాత బాగుంటే పరీక్షల్లో విద్యార్థులు మంచి గ్రేడులు సాధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేతిరాత భవిష్యత్కు సోపానంలా ఉపయోగపడేందుకు అవసరమైన నియమాలు, సూచనలు. దోషాలు చిన్న చిన్న దోషాలే విలువైన మార్కులకు కోత పెడతాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి. సాధారణ విద్యార్థులు పరీక్షల్లో నాలుగు రకాల తప్పులు చేస్తుంటారు. అవి మార్కులకు తగ్గట్టు సమాధానాలు రాయక పోవడం, వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు, చేతిరాత గజిబిజిగా ఉండడం. ఇందులో ఎక్కువగా మార్కులకు గండి కొట్టేది దస్తూరి అని నిపుణులు పేర్కొంటున్నారు. ● ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు విరామ చిహ్నాలు మర్చిపోతుంటారు. ● అక్షరాల ఖాళీ స్థలాన్ని వదులుతారు. ● అక్షరాలు, సంఖ్యలను స్పష్టంగా రాయడం. ● కాగితంపై పెన్ను ఒత్తిపట్టి రాస్తే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ● కొట్టి వేతలు మనం పరీక్షకు సన్నద్ధం కాలేదని చెబుతాయి. ● ఏ4 సైజ్ కాగితంలో 20 నుంచి 25 వరుసలు రాస్తుంటారు. ● లైన్లు వంకర టింకరగా ఉంటాయి ● బొమ్మల్లో భాగాలను సరిగా గుర్తించరు. ● పదాల్ని కలిపేసి రాస్తుంటారు. ● కలాన్ని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోవడంతో చేతిరాత గజిబిజిగా ఉంటుంది. ● ఎర్ర రంగు సిరా కలాన్ని ఉపయోగిస్తారు. ● ఇలాంటివి చేయకపోవడం వల్ల అధిక మార్కులు పొందే అవకాశం ఉంది. అందమైన రాత.. భవితకు బాట విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అధిక మార్కుల సాధనకు ఉపయోగం పోషకులు దృష్టి సారించాలి‘మంచి చేతిరాత లేకపోతే చదువు పూర్తి కానట్లే. పెదవులపై చిరునవ్వు లేనిదే మేకప్ పూర్తి కాదు’ – ‘సత్యశోధన’లో మహాత్మాగాంధీనైపుణ్యం అలవర్చుకోవాలి రాసేటప్పుడు కూర్చునే భంగిమ, కలం పట్టుకునే విధానం, పుస్తక స్థాన విధానం, చేతిరాతపై ప్రభావం చూపుతాయి. బాల్పాయింట్ పెన్నుకన్నా సిరాపెన్నుతో చేతిరాత అందంగా వస్తుంది. సున్న, అరసున్న తెలుపు గీతలను బాగా సాధన చేయాలి. ఆంగ్లం, తెలుగు, చూచిరాత మెరుగుదల కోసం అపసవ్య దశలో రాసే నైపుణ్యం అలవర్చుకోవాలి. హింది రాత మెరుగుకోసం సవ్య దశలో రాయడం అలవాటు చేసుకోవాలి. చేతిరాతపై పిల్లలతో పాటు పెద్దలు దృష్టి సారించాలి. – పెందోర్ జైవంతా, తెలుగు పండితురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోయగాం సాధన చేస్తున్నా చక్కటి చేతిరాతపై సాధన చేస్తున్నా. ప్రతీరోజు తెలుగు, హింది, ఆంగ్లం చూచిరాత రాస్తున్నా. రాత పద్ధతులపై టీచర్ బాగా చెబుతున్నారు. పరీక్షల్లో గ్రేడులు అధికంగా సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పేపర్ దిద్దేవారికి కూడా ఎంతో సులభమవుతుంది. అందమైన రాత విద్యార్థి క్రమశిక్షణను తెలియజేస్తుంది. ప్రతీ విద్యార్థి చేతిరాతపై ప్రాక్టీసు చేయాలి. – మోహర్లే జయ, 9వ తరగతి, గోయగాం ఉపయోగాలు చేతిరాత అందంగా ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే. ఉపాధ్యాయుల ప్రశంసలు పొందాలన్నా, ఉద్యోగం చేసే చోట యజమాని మెప్పు పొందాలన్నా అందమైన రాత కీలకం. ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు స్వదస్తూరితో నింపిన దరఖాస్తులను మాత్రమే పంపాలని నిబంధన ఉందంటే చేతిరాత ప్రాముఖ్యత ఎంతగా ఉందో అవగతమవుతోంది. ప్రధానంగా మానవ వనరుల విభాగం బహుళజాతి సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో చేతి రాతను కూడా ప్రాతిపదికగా తీసుకుంటారు. మనసులో అలజడులు చేతిరాతతో ప్రతిఫలిస్తాయి. కనుకనే మానసిక వైద్యశాస్త్రంలో చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో చేతిరాతను బట్టి, మనస్తత్వాన్ని బట్టి అంచన వేసే గ్రాఫాలజి శాస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. చేతిరాతతో ఒక వ్యక్తిలోని 200 విషయాలను తెలుసుకోవచ్చని లిపి నిపుణులు పేర్కొంటున్నారు. -
చెరువులోపడి ఒకరు మృతి
నర్సాపూర్(జి): కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలని చర్లపల్లిలో సోమవారం జరిగింది. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ అనుబంధ గ్రామం చర్లపల్లికి చెందిన సుంకరి శ్రీనివాస్(45) సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లాడు. ఉదయం 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి వెతకగా ఒడ్డుపై శ్రీనివాస్ చెప్పులు కనిపించాయి. వెంటనే ఈతగాళ్లతో చెరువులో గాలించగా శ్రీనివాస్ మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు చెరువుల పడి మృతిచెందాడని శ్రీనివాస్ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● మృతుల్లో చెన్నూర్ మండల వాసి ● హన్మకొండ జిల్లాలో ఘటన ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం హసన్పర్తి: దైవదర్శనానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ జిల్లా పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్(18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి.వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జారతకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ను ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెనుకాల బైక్పై వస్తున్న స్నేహితులు 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే సుశాంత్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
తొలికాత విద్యార్థులకే..
● పాఠశాలలో ఏటా పుచ్చకాయలు అందజేస్తున్న రైతు ఆనంద్ ఆ రైతుకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారిని దైవంగా భావిస్తాడు. ఏటా తన చేనులో సాగైన పుచ్చకాయల తొలికాతను వారికే అందజేస్తాడు. ఐదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. అతడే తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండె ఆనంద్. తనకున్న రెండెకరాల్లో ఏటా పుచ్చ సాగు చేస్తున్నాడు. దిగుబడి షురూ అయ్యే క్రమంలో తొలికాతను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదేళ్లుగా అందజేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు అందజేశాడు. ఇందులో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, ఉపాధ్యాయులు సరిత,శిల్ప సిబ్బంది ఉన్నారు. – తాంసి -
సింగరేణి సీఎండీ ప్రోత్సాహం.. అమ్మానాన్నల ఆశీర్వాదం
● గ్రూప్–1 సాధించడమే నా డ్రీమ్ ● కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే.. ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ రాం సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే 19వ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. సింగరేణి సీఎండీ బలరాం ప్రోత్సాహం, అమ్మానాన్నల ఆశీర్వాదంతో విజయం సాధించానన్నారు. తన సక్సెస్కు కారణాలు, అనుభవాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఒకటవ తరగతి నుంచి పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానన్నారు. 2014లో బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్లో చేరానని, 2021లో ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించి నెలకు రూ.50 వేల వేతనం పొందానన్నారు. 2022లో సింగరేణి నిర్వహించిన పరీక్షలో పాసై జాబ్ సంపాదించా. ఆ సమయంలో సీఎండీ బలరాం నేను జీవితంలో ఉన్నతస్థాయికి చేరేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఒక్కోమెట్టు ఎక్కుతున్నా. జాబ్ చేస్తున్న సమయంలోనే 2023లో గ్రూప్–4లో రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించానన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డిస్ట్రిక్ ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నానన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–3లో రాష్ట్రంలో 12వ ర్యాంకు సాధించగా తర్వాత విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోనల్లో 4వ ర్యాంకు సాధించి తన లక్ష్యానికి చేరువవుతున్నానన్నారు. ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా ఇంటివద్దే ఉండి ఆన్లైన్లో తీసుకున్న పుస్తకాలనే చదువుతున్నానన్నారు. -
యూపీఎస్సీ టార్గెట్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్):ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో 2016 నుంచి యూపీఎస్సీ సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ గ్రూప్ పరీక్షలోనూ విజేతగా నిలిచాడు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల శ్రావణ్కుమార్. శ్రావణ్కుమార్ తండ్రి లింగయ్య విశ్రాంత సింగరేణి ఉద్యోగి. తల్లి కళావతి గృహిణి. అక్క స్రవంతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చెల్లె స్వర్ణలత డీఎస్సీకి సమాయత్తం అవుతోంది. శ్రావణ్కుమార్ భార్య సౌమ్య గృహిణి. వీరికి కూతురు స్నిగ్దశ్రీ, కుమారుడు వేదంశ్కృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు మంచిర్యాలలో చదివి, బీటెక్ ఈసీఈ హైదరాబాద్లో చదివాడు. 2016 నుంచి యూపీఎస్సీకి సమాయత్తం అవుతుండగా, 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. అయితే యూపీఎస్సీపై దృష్టి పెట్టాలని ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 2022లో మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాయగా, ప్రిలిమ్స్లో విజయం సాధించినా 4 మార్కులతో మెయిన్స్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే వరసగా గ్రూప్స్ నోటీపికేషన్లు వెలువడటంతో అన్ని పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్స్ పరీక్షలకు ఎలాంటి కోచింగ్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదివాడు. గ్రూప్–4లో జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గ్రూప్–3లో రాష్ట్ర స్థాయిలో 39 ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులతో అర్హత సాధించగా ర్యాంకులు ప్రకటిస్తే మంచి ర్యాంకు వస్తుందని ఆశగానే ఎదురు చూస్తున్నాడు. -
సింగరేణి ఉద్యోగం చేస్తూ..
రెబ్బెన(ఆసిఫాబాద్): డిగ్రీ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ వైపు విప్రోలో ఉద్యోగం సాధించా. కానీ ఎప్పుడూ కంప్యూటర్తోనే ఉండాల్సి వచ్చేది. ఎక్కడో చిన్న వెలితి. ప్రజలతో మమేకమై వారికి నేరుగా సేవలు అందించాలంటే గ్రూప్స్ కరెక్ట్ అనిపించింది. దీంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టా. చివరికి అనుకున్నది సాధించగలిగా.. అని గ్రూప్–2 రాష్ట్రస్థాయి 229 ర్యాంకర్ కామ్రే భాస్కర్ పేర్కొన్నా రు. గ్రూప్–2లో సాధించిన విజయం సాధించేందుకు కష్టపడిన తీరుపై సాక్షి పలకరించగా ఆయ న మాటల్లోనే... మాది కౌటాల మండలంలోని గుడ్లబోరి అనే చిన్నగ్రామం. అమ్మనాన్న లాహనుబాయి, రావూజీ. 1 నుండి పదోతరగతి వరకు మా ఊరికి సమీపంలోని విజయనగరంలో, ఇంటర్ ముధోల్ గురుకుల కళాశాలలో, డిగ్రీ హనుమకొండలో పూర్తిచేశా. గ్రూప్–2 సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2016లో మొదటి ప్రయత్నంలో గ్రూప్–2లో ఆశించిన ర్యాంకు రాలేదు. అదే సంవత్సరంలో సింగరేణిలో క్లర్క్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పరీక్ష రాయగా జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని డో ర్లిలో విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగించా. ఆన్లైన్లో కోచింగ్ తీసుకు న్నా. సింగరేణి ఆధ్వర్యంలోని గోలేటి లైబ్రరీ నా కు బాగా ఉపయోగపడింది. కష్టానికి ఫలితంగా గ్రూప్–2లో 381.06 మార్కులతో రాష్ట్రస్థాయిలో 229 ర్యాంకు వచ్చింది. గ్రూప్–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా ప్రతీ విజయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. గ్రూప్–3లోనూ 296 మార్కులతో రాష్ట్రస్థాయిలో 154వ ర్యాంకు వచ్చింది. అయితే గ్రూప్–2 జాబ్లోనే జాయిన్ అవుతా. -
ఆదర్శం.. అశోక్కుమార్
రోజుకు పది గంటలు చదివా.. ప్రిపరేషన్లో భాగంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నా. తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా చేసుకున్నా. రోజుకు ఎనిమిది నుంచి పదిగంటల వరకు చదివేవాన్ని. సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసకున్నా. ఆన్లైన్లో అశోక్ సార్ క్లాస్లు ఫాలో అయ్యా. అలాగే తెలంగాణ ఉద్యమం సంబంధించి వి.ప్రకాశ్ సార్ బుక్స్ కూడా చదివాను. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు భగవద్గీత, పంచతంత్ర కథలను చదివాను. కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించడంతోనే ఇది సాధ్యమైంది. తాంసి: సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–1,2,3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు తాంసి మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్. ప్రస్తుతం సాత్నాల మండలం సుందరగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2014న కార్యదర్శిగా ఎంపికై న ఈయన సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాడు. ఈ క్రమంలో 2016లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే త్రుటిలో కొలువు చేజారింది. అయినా నిరాశ చెందకుండా గ్రూప్స్పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. గ్రూప్–1లో 399 మార్కులు సాధించగా, గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంకు, అలాగే గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంకుతో సత్తా చాటాడు. -
అవసరం లేకున్నా ప్లేడేలు
● కిందిస్థాయి అధికారుల హవా ● మస్టర్ పడి వెళ్లిపోవడంపై కార్మికుల ఆగ్రహంకాసిపేట: సింగరేణిలో మస్టర్ పడి వెళ్లడం, విధులు తప్పించుకోవడం వదిలేయాలని, ప్రతీ కార్మికుడు ఉత్పత్తి, ఉత్పాదకతలో భాగస్వామి కావాలని సీ అండ్ఎండీ బలరామ్ సూచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. సాధారణ రోజుల్లో కొందరు మస్టర్ పడి వెళ్లిపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అవసరం ఉన్నవారి కి మాత్రమే ప్లేడే ఇవ్వాలని. కానీ, అధికారులు, సూపర్వైజర్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు ప్లేడేలు రాసి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నట్లు ఆ రోపణలు ఉన్నాయి. మందమర్రి ఏరియా కాసిపేట 2గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహించే కార్మికుడికి వరుసగా మూడు ఆదివారాలు ప్లేడే కే టాయించినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. సద రు కార్మికుడు ప్లేడే రోజు మస్టర్ పడి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. దీనిపై అతడి గురించి ఆరా తీసేందుకు మీడియా ప్రతినిధులు వెళ్లగా గనిపై కనిపించలేదు. దీంతో స్థానిక కార్మికులను అడగగా, మధ్యాహ్నం అతడిని అధికారులు పిలిపించినట్లు తెలిసింది. సదరు కార్మికుడు మూడు వారాలు మస్టర్ పడటం మినహా అవుట్ టైం పడిన సందర్భం లేదని గు ర్తించారు. ఉన్నతాధికారులు అవుట్ టైం సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరిపించాలని కార్మికులు కోరుతున్నారు. రెండు గనుల్లో ఇష్టారాజ్యం.. కాసిపేట, కాసిపేట 2 గనులలో మస్టర్ల విషయంలో ఇష్టారాజ్యం నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు కొందరికి మస్టర్ వేసి ఇంటికి పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇష్టమైనవారికి ప్లేడేలు ఇస్తున్నారని అంటన్నారు. బాధ్యతగా పనిచేసే కార్మికులకు కూడా వరుసగా మూడు ప్లేడేలు ఇవ్వరని, జనరల్ మజ్దూర్కు మాత్రం వరుసగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్న కార్మికులకే ప్లేడేలు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. ఈవిషయమై గని మేనేజర్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా, ఈవిషయం తనదృష్టికి రాలేదని తెలిపారు. వరుసగా మూడు ప్లేడేలు సాధ్యం కాదని వెల్లడించారు. కొందరు కార్మికులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపి వరుసగా మూడు మస్టర్లు ఇస్తే బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. -
పట్టుబట్టి.. కొలువు కొట్టి..
● గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లావాసులు ఎంపిక ● ఉద్యోగాలు చేస్తూనే రాష్ట్రస్థాయి ర్యాంకులు ● కోచింగ్ లేకుండానే సత్తా చాటిన వైనం.. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు సత్తా చాటారు. ఉన్నతస్థాయి కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఆ మేరకు కష్టపడ్డారు. కొందరు ఉద్యోగాలు చేస్తూనే ‘గ్రూప్’ కొలువులకు ఎంపిక కాగా, మరికొందరు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగానే చదివి సత్తా చాటారు. ఇంకొందరు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉద్యోగాలు సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి సర్కారు కొలువులకు ఎంపికై న పలువురి సక్సెస్ వారి మాటల్లో.. నెన్నెల: ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ కొ లువు సాధించడం సులువే అంటున్నారు గ్రూ ప్–2 55వ ర్యాంకర్ చీర్ల సురేశ్రెడ్డి. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల మూడో కుమారుడు సురేశ్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. తమది వ్యవసాయ కుటుంబమని, తాను ఇంటర్లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడని తెలిపారు. అమ్మ, అన్న కిషన్రెడ్డి ప్రోత్సాహంతో గ్రూప్– 2లో ర్యాంకు సాధించానని తెలిపారు. పదో తరగతి వరకు ఆవుడం ప్రభుత్వ పాఠశాలలో చదివానని, బీటెక్ విశాఖపట్నంలో అభ్యసించినట్లు వెల్లడించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా మొదట కానిస్టేబుల్, అనంతరం ఎన్పీడీఎల్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ కొలు వులు సాధించానని వెల్లడించారు. గ్రూపు–2లో ర్యాంకు సాధించేందుకు రోజుకు 8 గంటలు హైదరాబాద్లోని ప్రైవేట్ లైబ్రరీలో చదివానని తెలిపారు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, సొంతంగా నోట్స్ తయారు చేసుకుని ప్రపేర్ అయ్యానని చెప్పారు. ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీకి సంబంధించిన వివిధ రకాల స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ చదివానని వెల్లడించారు. గ్రూపు–3లో కూడా రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. గ్రూపు–1 ర్యాంకు సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కౌటాల: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళిక, లక్ష్యంతోనే విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నాడు కౌటాల మండలం తలోది గ్రామానికి చెందిన మండల సాయిరాం గౌడ్. తండ్రి రాజేశ్వంగౌడ్ వృత్తిరీత్యా గీత కార్మికుడు కాగా తల్లి తారక్క గృహిణి. పదోతరగతి వరకు కౌటాలలో, ఇంటర్ హన్మకొండలో, బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేశాడు. ప్రతీరోజు వార్తా పత్రికలు, ప్రామాణిక పుస్తకాలు చదవడం, ప్రభుత్వ వైబ్సైట్లో విషయాలు తెలుసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానన్నారు. తెలుగు అకాడమీ, ఇతర ప్రైవేటు పుస్తకాలు, కరంట్ అఫైర్స్కు ‘సాక్షి’ దినపత్రికతో పాటు పలు మ్యాగజైన్లపై ఆధారపడ్డానన్నారు. పత్రికల్లో ఎడిటోరియల్ చదవడం ద్వారా అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. చదువుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, అక్కా, బావ, మిత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. 2019 ఏప్రిల్లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించానన్నారు. అందరి సహకారంతోనే గ్రూప్స్ పరీక్షల్లో విజయం సాధించానని తెలిపారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంగా ఏర్పర్చుకున్నానన్నారు. కష్టపడితే కొలువు సులువేప్రణాళిక, లక్ష్యంతోనే విజయం -
చేపలు వేటకు వెళ్లి శవమయ్యారు
సోన్: చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. సోన్ మండల కేంద్రానికి చెందిన గుమ్ముల సాయన్న (48) ఎప్పటిలాగే శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి చేపలు పట్టడానికి వెళ్లాడు. రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాయన్న కోసం కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో సోన్ పాత బ్రిడ్జికి సమీపంలోని ఒక నీటి మడుగులో కాళ్లకు చేపల వల చుట్టుకొని వ్యక్తి చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్లినవారు గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో అక్కడకు వెళ్లి చూడగా సాయన్న చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిసింది. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిలావర్పూర్లో మరొకరు.. దిలావర్పూర్: మండల కేంద్రానికి చెందిన గూండ్ల నడిపి పోశెట్టి (46) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి శనివారం స్థానిక కొత్త చెరువు వద్దకు వల తీసుకువెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఆదివారం కొత్త చెరువులో మృతి చెంది ఉండడాన్ని బంధువులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదు
● ఎస్సీ, ఎస్టీ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్నజన్నారం: ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ న్న అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్లో బాదంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామేర రాజేశ్వర్–పద్మావతి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజన్న హాజరై రాజేశ్వర్ దంపతులను సన్మానించారు. ఉద్యోగ విరమణ అనంతరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పరస్పర బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఎస్సీ, ఎస్టీ టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకటరావు, ప్రముఖ కవులు మురుమడుగుల రాజారావు, రాజేశ్వర్, ఎస్సీ ఎస్టీ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బూక్య రాజేశ్నాయక్, పిట్ట మండల అధ్యక్షుడు తుంగూరు గోపాల్, జిల్లా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రకాశ్నాయక్, రాజారావు, ఎంఈవో విజయ్కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమమౌళి పాల్గొన్నారు. -
కోచింగ్ లేకుండా కొలువు..
నెన్నెల: ‘పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రపేర్ అయ్యాను. గ్రూపు–2లో రాష్ట్రస్థాయిలో 172వ ర్యాంకు సాధించాను’ అని తెలిపాడు. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన మండల సుమంత్గౌడ్. మండల మురళిగౌడ్–ఉషారాణి దంపతుల కుమారుడు సుమంత్గౌడ్ పదో తరగతి వరకు మంచిర్యాల కృష్ణవేణి టాలెంట్స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. ధన్బాద్లో ఐఐటీలో మైనింగ్ ఇంజి నీర్ పూర్తిచేసి ఐదేళ్లుగా ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు. జాబ్ చేస్తూనే గ్రూపు–4లో రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఎన్సీఈఆర్టీ టెక్ట్బుక్స్, తెలుగు అకాడమీ వివిధ రకాల పుస్తకాల ద్వారా హైదరాబాద్లో స్టడీ హాల్లో రోజుకు పది గంటలు చదివి ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో, అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే తాను గ్రూప్–2 ర్యాంకు సాధించానని వెల్లడించారు. -
కాలువలో పూడిక తొలగింపు
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ పూడికతో నిండి పంటలకు సాగునీరు అందడంలేదు. దీనిపై ‘పూడిక తీయించండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. డీఈ వెంకటస్వామి ఆదేశాల మేర కు ఏఈ విష్ణు, కాంట్రాక్ట్ కంపెనీ మేనేజర్ మల్లి కార్జున్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజలింగు ఆధ్వర్యంలో ఆదివారం గొర్లపల్లి వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద కు వెళ్లారు. పరిస్థితిని సమీక్షించి మీటర్నర లోతు ఉన్న మట్టి, తుంగ, పిచ్చి మొక్కలను జేసీబీ సహా యంతో తొలగించారు. బురద కారణంగా జేసీబీ దిగబడుతుండటంతో పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల్లో పూడికతీత పూర్తి చేయిస్తామని అధికారులు తెలిపారు. పొలాలకు సాగునీరు ఇచ్చేలా చొరవ చూపిన ‘సాక్షి’, ఇరిగేషన్ కాంట్రాక్ట్ సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.