ధ్వని పెరిగితే దండనే.. | - | Sakshi
Sakshi News home page

ధ్వని పెరిగితే దండనే..

Feb 8 2026 3:54 AM | Updated on Feb 8 2026 3:54 AM

ధ్వని పెరిగితే దండనే..

ధ్వని పెరిగితే దండనే..

● ఆసుపత్రులు, విద్యాసంస్థలు, న్యాయస్థానాలు, మతపరమైన ప్రదేశాలు, అధీకృత అధికారితో ప్రకటించిన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని నిశ్శబ్ద మండలంగా విభజించారు. మిగతా ప్రాంతాలను మిశ్రమ ప్రాంతాల కేటగిరీగా ప్రకటిస్తారు. ● జనావాసాల్లో లౌడ్‌స్పీకర్లు, మైక్‌లు, డీజేలు, నిబంధనల ప్రకారం 10 డీబీ(డెసిబుల్స్‌) నుంచి 75 డీబీల్లోపు శబ్ధాన్ని వినియోగించేందుకు అనుమతులు ఉన్నాయి. ● బహిరంగ సమావేశాల్లో రోడ్‌షోలో మాత్రమే లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. ● ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉంటుంది. ● ఎన్నికల్లో వినియోగించే మైక్‌లు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వాహనాలు సీజ్‌ చేస్తారు. ● పోలింగ్‌కు 48 గంటల ముందు మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల ప్రచారాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ఈనెల 11న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం నిలిపివేయనున్నారు. ● ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశిత ధ్వనికన్నా తీవ్రత పెరిగితే సదరు పార్టీలపై కేసులు నమోదు చేయవచ్చు. ● జాగ్రత్త పడకపోతే ప్రజల ఫిర్యాదు మేరకు ఇక్కట్లకు గురికావల్సి ఉంటుంది. ● ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు జైలుశిక్ష విధించవచ్చు.

ప్రాంతాలవారీగా శబ్ధ కాలుష్యంపై నిబంధనలు అనుమతులుంటేనే మైక్‌లు వినియోగించాలి లేకపోతే చర్యలే

మంచిర్యాలటౌన్‌: ఎన్నికలు వచ్చాయంటే వాడవాడల్లో మైక్‌ల మోత మార్మోగడం సాధారణమే. అభ్యర్థులు ప్రచారం కోసం లౌడ్‌ స్పీకర్లు వినియోగిస్తుంటారు. వేదికలపై కాకుండా వాహనాలకు బిగించి వీధులు, ప్రధాన రహదారుల్లో ప్రచారం చేస్తుంటారు. దాదాపు మైకుల్లో ప్రచారం చేయడంతో పెద్దఎత్తున శబ్ధకాలుష్యం పెరిగిపోనుంది. ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్‌ స్పీకర్ల ప్రచారంతో విద్యార్థులు, చిన్నపిల్ల లు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మైకుల నిషేధం సాధ్యం కాకపోవడంతో ప్రమాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పట్టణాన్ని ఏ, బీ, సీ, డీ కేటగిరీగా విభజించింది. నిశ్శబ్ద మండలం, నివాసిత, వాణిజ్య, పారి శ్రామిక ప్రాంతాలుగా విభజించి అక్కడ విని యోగించే సౌండ్‌ ఎన్ని డెసిబుల్స్‌లో ఉండాలనేది నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం వాడవాడల్లో హోరెత్తించనున్న పోటీలో పాల్గొనే అభ్యర్థులు సౌండ్‌ విషయంలో మాత్రం ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

ఆయా ప్రాంతాల్లో వినియోగించే సౌండ్‌

(డెసిబుల్స్‌లలో)

ఏరియా పగలు రాత్రి

నిశ్శబ్ద మండలం 50 40

నివాసిత ప్రాంతం 55 45

వాణిజ్య ప్రాంతం 65 55

పారిశ్రామిక ప్రాంతం 75 70

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement