International
-
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది. -
ఇజ్రాయెల్కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది. -
చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇద్దరు మృత్యువాత గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.నేలమట్టమైన 13 భవనాలుభారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే వ్యవస్థపై ప్రభావంభూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు. -
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! -
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్మెయిలింగ్కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది. -
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. -
అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్ యంత్రాంగం
ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హోండురాస్ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోండురాస్ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్ రెయెస్ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను హొండురస్కు బలవంతంగా పంపేశారు. బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే. గతంలో నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్ చేశారు. అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. -
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది. -
సహకారమే మన బలం
గోథెన్బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్సన్తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్లోని గోథెన్బర్గ్కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్పోర్స్ విమానాలు ఎస్కార్ట్గా వచ్చాయి. గోథెన్బర్గ్ ఎయిర్పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా -
60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో..
బీజింగ్: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.ఆ బామ్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? షెంగ్ ఏకైక కుమార్తె టింగ్టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.షెంగ్ ఆన్లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్లైన్లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది. -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్లో ప్రముఖ దేశంగా స్వీడన్కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి
మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి చనిపోయాడు.మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. -
యువతులపై ఆగని ఆగడాలు.. అలా చేస్తే పెళ్లికి అంగీకారమే
కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు. మహిళలపై కఠిన చట్టాలు కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.పార్కులు, జిమ్లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు -
విజృంభిస్తున్న ఎబొలా.. WHO హెల్త్ ఎమర్జెన్సీ
కాంగోలో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 87 మంది మృతిచెందారు. దీంతో వరల్డ్ హల్త్ ఆర్గనైజేషన్ (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబొలా వైరస్తో అట్టుడుకిపోతుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 87 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 347 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు నమోదైన 87 మరణాలలో... 57 మోంగ్వాలులో, 27 ర్వాంపారాలో, బునియా మూడు మరణాలు సంభవించాయి. అయితే (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి (Pandamic) గా మాత్రం ప్రకటించలేదు. ఈ వైరస్ లక్షణాలుప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. -
మసాజ్ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్ అనే వ్యక్తి 61మందిని మసాజ్ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై 97 అభియోగాలను నమోదు కాగా అన్నింటిని కోర్టులో అంగీకరించాడు.అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే సుమిత్కు సుమిత్కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్ సెంటర్లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. -
హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!
న్యూఢిల్లీ: క్రూయిజ్ షిప్లలో వరుసగా నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడిన అరుదైన ‘హంటా’ వైరస్ ఉదంతాలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు కోవిడ్-19 నాటి చీకటి రోజులను గుర్తుచేస్తున్నాయి. అయితే ఈ మూడు వైరస్లు వ్యాప్తి చెందే విధానం, లక్షణాలు, వాటి వల్ల పొంచి ఉన్న ప్రాణాపాయం ఒకదానికొకటి పూర్తి భిన్నం. ఆ వ్యత్యాసాలు ఏమిటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.హంటా వైరస్: అరుదైనప్పటికీ ప్రాణాంతకంఎలుకల ద్వారా మనుషులకు సోకే ‘హంటా వైరస్’ చాలా అరుదైనదే అయినప్పటికీ, ప్రాణాపాయం కలిగించడంలో దీని తీవ్రత చాలా ఎక్కువ. ఎలుకల వ్యర్థాలు, మూత్రం లేదా లాలాజలం ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి ప్రాథమిక ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది. తరువాత క్రమంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదకరమైన ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’కు దారితీసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం చాలా తక్కువ కావడం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూలాంశం.నోరోవైరస్: వేగంగా చుట్టుముట్టే కడుపు ఫ్లూపాఠశాలలు, ఆఫీసులు క్రూయిజ్ షిప్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ‘నోరోవైరస్’ అత్యంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలను తాకడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక వాంతులు, అతిసారం, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఇది రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోయినప్పటికీ, పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతక డీహైడ్రేషన్కు (శరీరంలో నీరు శాతం పడిపోవడం) దారితీసే ప్రమాదం ఉంది. దీనికి నిర్దిష్టమైన మందు లేదు, విశ్రాంతి , ద్రవాహారం తీసుకోవడమే ఏకైక మార్గం.కోవిడ్-19: దీర్ఘకాలిక ప్రభావం చూపే శ్వాసకోశ వ్యాధిగాలి ద్వారా, తుంపర్ల ద్వారా అత్యంత సులభంగా వ్యాపించే కోవిడ్-19 నేరుగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్ల రాకతో చాలా వరకు దీని తీవ్రత తగ్గినప్పటికీ, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఇంకా ముప్పుగానే పరిణమిస్తోంది. కొందరిలో నెలల తరబడి వేధించే ‘లాంగ్ కోవిడ్’ సమస్యలు కూడా ఉన్నాయి. నోరోవైరస్ నివారణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కోవిడ్ను అడ్డుకునేందుకు మంచి గాలి ఆడేలా చూసుకోవడం, హంటా వైరస్ దరిచేరకుండా ఎలుకల సంచారాన్ని నివారించడం అత్యంత ఆవశ్యకం.ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా? -
చైనా కంత్రీ వేషాలు.. తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేతులెత్తేశారు. తైవాన్కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ట్రంప్.. చైనా పర్యటన అనంతరం తైవాన్కు భారీ షాకిచ్చారు. చైనా నుంచి తైవాన్ను రక్షించలేమని నాలుక మడతేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు తైవాన్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల అనంతరం, తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది. మరోవైపు, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను సార్వభౌమ దేశంగా చూస్తామని ప్రకటించారు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు చైనా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. కాగా, అమెరికా, చైనా ఒత్తిడుల మధ్య తైవాన్ తన స్వీయ గుర్తింపును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉండగా.. చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయమై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్కు సూచించారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్పింగ్కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. చైనా–తైవాన్ సమస్య ప్రధానంగా “సార్వభౌమాధికార” (sovereignty) పై వివాదం. చైనా తైవాన్ను తన ప్రావిన్స్గా భావిస్తే, తైవాన్ ప్రజాస్వామ్యంగా స్వతంత్ర దేశంలా పనిచేస్తోంది. ఈ విభేదం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణకు కారణమవుతోంది. ఇక, తైవాన్లో అమెరికా పాత్ర ప్రధానంగా రక్షణ, వాణిజ్యం, మరియు రాజకీయ మద్దతు చుట్టూ తిరుగుతుంది. 1979లో చైనాతో అధికారిక సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, అమెరికా Taiwan Relations Act ద్వారా తైవాన్కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది. ఇది చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ఉద్రిక్తకర అంశం.చరిత్రాత్మక నేపథ్యం1895: షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్కు అప్పగించబడింది.1945: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC)కు అప్పగించారు.1949: చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, నేషనలిస్టులు తైవాన్కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1971: ఐక్యరాజ్యసమితిలో చైనా స్థానాన్ని బీజింగ్లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్వీకరించింది. తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది.చైనా తైవాన్ను “విభిన్న ప్రావిన్స్”గా భావిస్తుంది.ఒక దేశం, రెండు వ్యవస్థలు (హాంకాంగ్ మోడల్) ప్రతిపాదించింది కానీ తైవాన్లో ప్రధాన పార్టీలు దీనిని తిరస్కరించాయి.బలప్రయోగం ద్వారా అయినా తైవాన్ను కలుపుకోవాలని హెచ్చరిస్తోంది.తైవాన్లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం ఉంది, సుమారు 2.3 కోట్ల జనాభా.ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుత స్థితి (status quo) కొనసాగాలని కోరుకుంటున్నారు. అంటే పూర్తిగా స్వతంత్రత ప్రకటించకుండా, చైనాకు లోబడకుండా ఉండాలనుకుంటున్నారు.అంతర్జాతీయ ప్రభావంఅమెరికా: తైవాన్కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది.ఐక్యరాజ్యసమితి: తైవాన్ సభ్యత్వం లేదు; కేవలం 12 చిన్న దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నాయి.ప్రాంతీయ భద్రత: తైవాన్పై దాడి జరిగితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
మరో వివాదానికి తెరలేపిన ఎలాన్ మస్క్
ఇన్స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమేనంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్లైన్ ట్రెండ్స్పై జరుగుతున్న ఒక వైరల్ చర్చకు స్పందిస్తూ పురుషులను ఎగతాళి చేసే విధంగా కామెంట్స్ చేశారు. మనుషుల ఆన్లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై చర్చ నడిచింది.రోజంతా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో వండిన వంటకాల ఫోటోలను అప్లోడ్ చేయడం, ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ను ఆ థ్రెడ్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కొంతమంది మగవాళ్లు తమ ఇన్స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుందంటూ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.LmaoInstagram is for girls— Elon Musk (@elonmusk) May 15, 2026దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వగా.. మస్క్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ అంతా ఫేక్ మాత్రమే కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు. -
ఆ డీల్ ఓకే అయితేనే భారత్తో సంబంధాలు.. బంగ్లాదేశ్
ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్పై ఒత్తిడి తెచ్చారు.1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.గంగా నది వివాదంభారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.కాగా కోల్కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది. భారత్స్పందన ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు. -
బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో ఊహించని సంఘటనలను ముందే పసిగట్టిన బల్గేరియా అంధురాలు, ‘నొస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరుగాంచిన బాబా వంగ పేరు ఇప్పుడు వార్తల్లో మరోమారు మార్మోగుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె వెల్లడించిన కొన్ని భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు తెరతీస్తున్నాయి.అంతుచిక్కని రోగాల ముప్పుప్రిన్సెస్ డయానా మరణం నుండి కోవిడ్-19 మహమ్మారి వరకు అనేక ప్రధాన ప్రపంచ పరిణామాలను కచ్చితంగా అంచనా వేసిన ఘనత బాబా వంగకు దక్కుతుంది. కొందరు నెటిజన్లు తాజాగా ఉదహరిస్తున్న వివరాల ప్రకారం.. 2025 మరియు 2027 మధ్యకాలంలో మానవాళి ‘ పూర్తిగా అంతుచిక్కని వైద్య పరిస్థితులను’ ఎదుర్కొంటుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ, ఎలాంటి మందులు లేదా చికిత్సకు లొంగకుండా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకరమైన వైరస్లు దాడి చేస్తాయని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు.హంటా, నోరో వైరస్లతో లింక్?బాబా వంగ హెచ్చరించిన ఈ ‘కల్లోల సమయం’ ఇప్పుడు నిజంగానే మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అకస్మాత్తుగా వెలుగుచూస్తున్న ‘హంటా వైరస్’ ‘నోరో వైరస్’ వ్యాప్తిని ప్రజలు ఆమె అంచనాలతో ముడిపెడుతున్నారు. అప్పట్లో ఆమె చెప్పిన చికిత్సకు లొంగని భయంకరమైన వైరస్లు ఇవేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.నిజానిజాలు ఏంటి?అయితే నెట్టింట పెరుగుతున్న ఈ తీవ్ర ఆందోళనల మధ్య ఒక ముఖ్యమైన వాస్తవాన్ని అందరూ గమనించాలి. బాబా వంగ తన భవిష్యవాణిలో ఎక్కడా ‘హంటా వైరస్’ లేదా ‘నోరో వైరస్’ పేర్లను నిర్దిష్టంగా ప్రస్తావించినట్లు ఎలాంటి అధికారిక లేదా ప్రామాణిక రికార్డులు లేవు. ఆగస్టు 11, 1996న బల్గేరియాలో మరణించిన ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలకు, ప్రస్తుత వ్యాధుల వ్యాప్తికి ప్రజలే స్వయంగా పోలికలు తెస్తున్నారు తప్ప, ఇందులో కచ్చితమైన ఆధారాలు లేవని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిరియా టు గల్ఫ్.. ఇండియా మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
రోడ్డుపై లక్ష దిర్హామ్ల నోట్ల కట్ట.. ప్రవాసి నిజాయితీ
దుబాయ్: రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు.. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా అటూ ఇటూ చూసి వెంటనే జేబులో పెట్టేసుకుంటారు. చాలా మంది చేసేదిదే. అయితే దుబాయ్లో ఓ ప్రవాసుడు దీనికి భిన్నంగా నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న లక్ష దిర్హామ్ల (భారత కరెన్సీలో రూ. 25 లక్షలకు పైగా) భారీ నగదు కట్టను చూసి ఆశపడకుండా, వెంటనే పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.అసలేం జరిగిందంటే?దుబాయ్లోని కరామాలో నివసిస్తున్న రాజ్ అనే ప్రవాస వ్యాపారవేత్త, తన వ్యాపార అవసరాల కోసం స్థానిక బ్యాంకు నుండి 2,60,000 దిర్హామ్ల చెక్కును విత్డ్రా చేసుకున్నాడు. ఆ నగదును ఒక కవరులో పెట్టుకుని వస్తుండగా, మార్గమధ్యంలో కవరు కొద్దిగా తెరుచుకుని అందులోని ఒక లక్ష దిర్హామ్ల కట్ట కింద పడిపోయింది.ఇంటికి వెళ్లాక గానీ రాజ్ ఈ విషయాన్ని గమనించలేదు. గత 15 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్న తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారని, ఆ సమయంలో తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన తెలిపాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బ్యాంకు లోపల నగదు అంతా సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే రఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తాను వచ్చిన మార్గంలో వెతకడం ప్రారంభించాడు.అదే సమయంలో 'అల్ సియారా డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్' యజమాని, ప్రవాసుడైన మహ్మద్ అలీకి రోడ్డుపై పడి ఉన్న నగదు కట్ట కనిపించింది. యుఏఈలో అతి తక్కువ జీతంతో జీవితాన్ని ప్రారంభించి, ప్రస్తుతం ఒక చిన్న టైపింగ్ సెంటర్ నడుపుకుంటున్న అలీ.. ఆ భారీ మొత్తాన్ని చూసి ఎంతమాత్రం సంకోచించకుండా వెంటనే దుబాయ్ పోలీసులకు సమాచారం అందించి, నగదును వారికి భద్రంగా అప్పగించాడు.మరోవైపు, రోడ్డుపై కారు పక్కన ఆందోళనగా నిలబడి ఉన్న రాజ్ను చూసి సమీపంలోని ఒక రెస్టారెంట్ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించారు. రఫా పోలీస్ స్టేషన్ హ్యాపీనెస్ డివిజన్ అధికారులు కెప్టెన్ అలీ హాజీ హసన్ యూసుఫ్, ఫస్ట్ సార్జెంట్లు ముస్తఫా అబ్దుల్వాలు, అలీ ఖల్ఫాన్లు రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ అలీ అప్పగించిన నగదు వివరాలను, రాజ్ కోల్పోయిన వివరాలను సరిపోల్చి, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆ సొమ్మును అసలు యజమాని అయిన రాజ్కు సురక్షితంగా అందజేశారు. -
మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: చైనా బారి నుంచి తమ మిత్రదేశం తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. తైవాన్కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ తర్వాత మాట మార్చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్కు సూచించారు. శుక్రవారం ఫాక్స్న్యూస్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్పింగ్కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని ట్రంప్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకొనే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. అమెరికా, చైనా.. జి–2 డొనాల్డ్ ట్రంప్ చైనాలో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం స్వదేశానికి తిరిగివచ్చారు. చైనా అధినేత షీ జిన్పింగ్తో జరిగిన చర్చలను రెండు గొప్ప దేశాల నాయకుల సమావేశంగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలతో సహా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘అమెరికా చైనాలు గొప్ప దేశాలు. నేను దీన్ని జి–2 అని పిలుస్తాను’’ అని అభివర్ణించారు.చైనా బహుమతులు బుట్టదాఖలు బీజింగ్: కీలకమైన ఒప్పందాల కోసం తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఉత్తచేతులతోనే వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పినప్పటికీ వాటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఒక దేశాధినేత మరో దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు బహుమతులతో సత్కరించడం ఆనవాయితీ. పుస్తకాలు కూడా బహూకరిస్తుంటారు. అధినేత బృందంలోని సభ్యులకు కూడా బహుమతులు లభిస్తాయి. వాటిని స్వదేశానికి తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడికి వచ్చినవి ప్రభుత్వ ఆస్తి. వాటిని వేలం వేయడమో లేదా మ్యూజియంలో భద్రపర్చడమో చేస్తుంటారు. కానీ.. ట్రంప్, ఆయన బృందం మాత్రం చైనా నుంచి ఏమీ తీసుకెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం బీజింగ్లో ఎయిర్పోర్టులో ఎయిర్ఫోర్స్ వన్ విమానం సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తకుండిలో వాటిని వదిలేశారు. చైనా వస్తువులేవీ తమ దగ్గర ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ట్రంప్ ప్రతినిధి బృందం, వైట్హౌస్ సిబ్బంది, ఆఖరికి అమెరికా జర్నలిస్టులు కూడా చైనా బహుమతులను ఇక్కడే విడిచిపెట్టారు. చైనా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా సిబ్బంది ఇలా చేయడం మొదటిసారి కాదు. కానీ, బహిరంగంగా అందరూ చూస్తుండగా బహుమతులను పక్కనపారేయడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికా నుంచి వచ్చిన సిబ్బందికి చైనా అధికారులు ఫోన్లు, ఎల్రక్టానిక్ పరికరాలు, బ్యాడ్జ్లు, జ్ఞాపికలను గిఫ్ట్గా ఇచ్చారు. కానీ, అవన్నీ చైనాలోనే చెత్తకుండి పాలయ్యాయి. తమపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న భయంతోనే బహుమతులను వదిలేశారని తెలుస్తోంది. -
దుబాయ్ లాటరీ: ముగ్గురికి లక్కీ ఛాన్స్!
దుబాయ్: యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రాలో శనివారం పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకున్నారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ జాక్పాట్ బహుమతిని మాత్రం ఈసారి ఎవరూ దక్కించుకోలేకపోయారు.డ్రా వివరాలు శనివారం రాత్రి జరిగిన డ్రా (డ్రా నెం: 260516)లో విజేతలను నిర్ణయించిన సంఖ్యలు ఇలా ఉన్నాయి..'డేస్' (Days) సెక్షన్ సంఖ్యలు: 20, 17, 14, 18, 24, 12నెల' (Month) సెక్షన్ సంఖ్య: 5గ్యారెంటీడ్ 'లక్కీ ఛాన్స్ ఐడీ' ప్రైజ్ కేటగిరీ ద్వారా ముగ్గురు నివాసితులు ఒక్కొక్కరు 50,000 దిర్హమ్ల (సుమారు రూ.11 లక్షలకు పైగా) నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు. గెలిచిన లక్కీ ఛాన్స్ ఐడీలు ఇవే.. AX2216481, BZ5027000, AP1481503.నెక్స్ట్ డ్రాకు చేరిన భారీ జాక్పాట్ఈ రౌండ్లో 30 మిలియన్ దిర్హమ్ల (సుమారు రూ.68 కోట్లకు పైగా) గ్రాండ్ ప్రైజ్తో పాటు, 5 మిలియన్ దిర్హమ్ల రెండో బహుమతిని కూడా ఎవరూ గెలుచుకోలేదు. దీంతో ఈ రెండు భారీ మొత్తాలు తదుపరి డ్రాకు బదిలీ (రోల్ఓవర్) అయ్యాయి.అయితే, లక్కీ డే విభాగంలో ఇద్దరు పాల్గొనేవారు మూడో బహుమతిని దక్కించుకున్నారు. 'డేస్' విభాగంలోని ఐదు సంఖ్యలను, సింగిల్ 'నెల' సంఖ్యతో సరిపోల్చినందుకు గాను వీరికి ఒక్కొక్కరికి 100,000 దిర్హమ్ల (సుమారు రూ.22.6 లక్షలు) చొప్పున లభించాయి.మే 20న తదుపరి డ్రావారానికి రెండుసార్లు జరిగే ఈ షెడ్యూల్లో భాగంగా.. తదుపరి యూఏఈ లాటరీ డ్రా వచ్చే బుధవారం (మే 20) జరగనుంది. జాక్పాట్ మొత్తం మరింత పెరగడంతో, రాబోయే డ్రాలో పెద్ద బహుమతులు గెలుచుకునేందుకు మరో సువర్ణావకాశం లభించనుంది. -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్లో పర్యటించారు. రాజధాని ద హేగ్లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్లోనూ సూపర్ ఎల్నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్లో ఈసారి జూన్లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
కువైట్ కీలక నిర్ణయం: ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు తగ్గింపు
దుబాయ్: వేసవి కాలంలో దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేయడం, నేషనల్ పవర్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి నెలల్లో ప్రభుత్వ సంస్థల్లో పని గంటలను రోజుకు ఆరు గంటలకు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇప్పటివరకు రోజుకు ఏడు గంటలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను, ఆరు గంటలకు కుదించాలనే ప్రతిపాదనకు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. వేసవిలో ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలో ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విపరీతంగా పెరిగి విద్యుత్ నెట్వర్క్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పీక్ అవర్స్లో పవర్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వ విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ పని వేళల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, విద్యుత్ లోడ్ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పలు కర్మాగారాలు (ఫ్యాక్టరీలు) సైతం గరిష్ట డిమాండ్ ఉన్న సమయాల్లో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.మూడు నెలల పాటు అమలుఈ తగ్గించిన పని గంటలు వేసవి కాలంలో మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు, కార్యాచరణ యంత్రాంగాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ మార్నింగ్ అటెండెన్స్ విండోను (ఉదయం ఆఫీసుకు వచ్చే సమయం) ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు (ఒక గంటకు మాత్రమే) పరిమితం చేయనున్నారు. అలాగే సాయంత్రం షిఫ్టులు 5 గంటల నుండి ప్రారంభం కానున్నాయి.మరోవైపు, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నీటిని, విద్యుత్ను హేతుబద్ధంగా వినియోగించుకునేలా కువైట్ విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు అదనపు చర్యలను కూడా అమలు చేస్తోంది. ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ, గరిష్ట వినియోగ సమయాల్లో గ్రిడ్ దెబ్బతినకుండా చూసేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగ అలవాట్లను అలవర్చుకోవాలని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. -
వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య సీజ్ఫైర్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.చైనా రాగం పాడిన ట్రంప్చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్పింగ్, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్పింగ్ వ్యక్తిగతంగా ట్రంప్ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. -
జపాన్ వీసా పాలసీ.. భారతీయుడికి తీవ్ర కష్టాలు
జపాన్లో నూతనంగా తీసుకవచ్చిన వీసా నిబంధనలు అక్కడే స్థిరపడిన విదేశీయుల పట్ల శాపంగా మారాయి. గత 30 ఏళ్లుగా జపాన్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న ఓ భారతీయునికి అక్కడి అధికారులు వీసా పునరుద్ధరణకు నిరాకరించారు. దీంతో ఆయన ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారత్కు చెందిన మనీష్ కుమార్ గత 30 ఏళ్లుగా జపాన్లో నివాసం ఉంటున్నారు. అక్కడి సైతామా ప్రిఫెక్చర్ ప్రాంతంలో గత 18 ఏళ్లుగా ఓ భారతీయ రెస్టారెంట్ను నడుపుతున్నారు. అయితే ఆ దేశంలో ఇటీవల వీసా నిబంధనలు తీవ్ర కఠినతరం చేయడంతో అధికారులు తన బిజినెస్ మేనేజర్ వీసా పునరుద్ధరణను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా నడుపుతున్న రెస్టారెంట్ మూసివేయవలసి వచ్చిందని కన్నీటితో కుప్పకూలిపోయారు.టోక్యోలో జరిగిన వీసా నిబంధనల నిరసన ర్యాలీలో మాట్లాడుతూ "రెండు వారాల క్రితం, నా సొంత దేశానికి తిరిగి వెళ్ళమని ఐఎస్ఏ నాకు చెప్పింది. నా పిల్లలు జపాన్లోనే పుట్టి పెరిగారు, వారికి జపనీస్ మాత్రమే అర్థమవుతుంది, వారి స్నేహితులు కూడా జపనీయులే. అయినా మమ్మల్ని భారతదేశానికి తిరిగి వెళ్ళమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి?" అని కన్నీటీ పర్యంతమయ్యారు. ఈ నిర్ణయంతో తాను తీవ్రంగా కుంగిపోయానని, జపాన్లో తన కుటుంబ భవిష్యత్తు గురించి భయపడుతున్నానని కుమార్ అన్నారు.కాగా గతేడాది జపాన్ తన బిజినెస్ మేనేజర్ వీసా విధానంలో సమూలంగా మార్పులు ప్రవేశపెట్టింది. దీంతో అక్కడే ఉన్న విదేశీ చిన్న తరహా వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా అధికారిక సమాచారం ప్రకారం, అక్టోబర్ 2025లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీసా దరఖాస్తులు 96 శాతం తగ్గాయి. నెలవారీ దరఖాస్తులు గతంలో సూమారు 1,700 వరకూ వస్తుండగా ఇప్పుడు 70కి పడిపోయినట్లు సమాచారం.అయితే అక్కడ నిజమైన వ్యాపారాలు నిర్వహించకుండా, దీర్ఘకాలిక నివాసం కోసం వీసాను సులభ మార్గంగా ఉపయోగించుకునే వారిని అరికట్టడానికే ఈ కఠినమైన నిబంధనలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.【署名提出🤝】日本に30年間暮らし、18年間カレー店を経営してきたクマールさんは、要件厳格化でビザの更新が不許可に……。「子どもたちは日本で生まれて、日本語しか話せない。妻も娘も泣いています」友人の@TsuruVoiceNet が、ビザ厳格化の撤回を訴え、5.3万筆の署名を入管庁に提出しました。 pic.twitter.com/eXHCDhdqKk— Change.org Japan(チェンジ・ドット・オーグ) (@change_jp) May 14, 2026 -
‘‘ప్రతి ఏడాది భారత్లో ఆ రికార్డులు బద్దలవుతున్నాయి’’
ది హేగ్: ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ ఆర్నాల్డస్ జెట్టెన్తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో రియర్ అడ్మిరల్ లుడ్గర్ బ్రుమ్మెలార్, అజుటెంట్ జనరల్, హిస్ మజెస్టీ ది కింగ్ సైనిక విభాగం చీఫ్, డచ్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండ్సెన్, నెదర్లాండ్స్లో భారత రాయబారి కుమార్ తుహిన్, డచ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు.వాణిజ్యం, పెట్టుబడులు, నీరు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకే పరిమితం కాకుండా భారత్-నెదర్లాండ్స్ సహకారం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, విద్య, సముద్ర రంగాల్లో భాగస్వామ్యం బలపడిందని విదేశాంగ శాఖ తెలిపింది.నెదర్లాండ్స్లోని ది హేగ్లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. “ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80–90% ఓటింగ్ నమోదైంది. మహిళలు కూడా భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు... ప్రతి ఏడాది ఓటింగ్ రికార్డులు బద్దలవుతున్నాయి. 2014లో భారత్లో కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవి. ఇప్పుడు భారత్లో దాదాపు 125 క్రియాశీల యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. స్టార్టప్లు ఇప్పుడు కృత్రిమ మేధస్సు, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విశేషంగా పని చేస్తున్నాయి. పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతి ఇప్పుడు మరింత విస్తరిస్తోంది.ఇప్పుడు భారత్ పెద్ద పెద్ద కలలు కంటోంది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ల రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత యువత ఆశిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్లోనే ఉంది. ఆధునిక భారత్ ఎన్నడూ లేని మార్పుల దశలో సాగుతోంది. ప్రపంచంలోనే ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని దేశం అమలు చేస్తోంది.సరిగ్గా ఇదే రోజు 2014 మే 16న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీతో స్థిర ప్రభుత్వాన్ని భారత్ పొందబోతోందని అప్పుడే స్పష్టమైంది. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం నన్ను ఆగనివ్వకుండా చేస్తోంది.. అలసట చెందకుండా చేస్తోంది.. నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా... 12 ఏళ్లు ప్రధానమంత్రిగా సేవలు అందించాను... ప్రజాస్వామ్య ప్రపంచంలో 25 ఏళ్ల పాటు కోట్లాది ఓటర్ల మద్దతు దక్కింది... ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మీ ఆశీర్వాదం. అదే నా అతిపెద్ద సంపద’’ అని మోదీ అన్నారు. -
టెక్ దిగ్గజాల మధ్య చైనా ‘కున్ఫీ’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జిన్పింగ్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలై యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ల మధ్య కూర్చున్న ఒక చైనా మహిళ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. దాంతో తనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఆమె.. చైనాలోనే అత్యంత ప్రతిభావంతురాలైన స్వయంకృషి గల మహిళా పారిశ్రామికవేత్త, ‘లెన్స్ టెక్నాలజీ’ వ్యవస్థాపకురాలు జౌ కున్ఫీ. తన కంపెనీకి అత్యంత కీలకమైన ఇద్దరు గ్లోబల్ కస్టమర్ల మధ్య ఆమె కూర్చోవడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అట్టడుగు స్థాయి నుంచి బిలియనీర్ వరకు..టెక్ దిగ్గజాల మధ్య సముచిత స్థానం సంపాదించుకున్న జౌ కున్ఫీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆమె ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు..1970లో హునాన్ ప్రావిన్స్లోని ఒక పేద గ్రామంలో జన్మించిన జౌ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 15 ఏళ్ల వయసులోనే చదువు మానేశారు. బతుకుదెరువు కోసం షెన్జెన్ నగరానికి వలస వెళ్లి అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మికురాలిగా పనిచేశారు.1993లో, 23 ఏళ్ల వయసులో తన బంధువుల సహాయంతో కొంత మూలధనాన్ని సమకూర్చుకుని బావోన్ జిల్లాలోని ఒక నివాస భవనంలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. రిస్ట్ వాచ్ గ్లాస్లపై స్క్రీన్ ప్రింటింగ్ చేయడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలైంది.ఆ తర్వాత దశాబ్ద కాలానికి, ఆమె కష్టార్జితంతో ‘లెన్స్ టెక్నాలజీ’ సంస్థ రూపుదిద్దుకుంది.యాపిల్తో భాగస్వామ్యం2007లో స్మార్ట్ఫోన్ రంగాన్నే విప్లవాత్మకంగా మార్చేసిన ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరుణంలో లెన్స్ టెక్నాలజీకి అదృష్టం వరించింది. ఐఫోన్ స్క్రీన్ కవర్ గ్లాస్ సరఫరాదారుగా యాపిల్ సప్లై చైన్లో లెన్స్ టెక్నాలజీ చోటు దక్కించుకుంది. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు విక్రయాలు సాధించడంతో యాపిల్ సంస్థ లెన్స్కు అతిపెద్ద కస్టమర్గా మారింది. 2010ల ప్రారంభం నాటికి లెన్స్ టెక్నాలజీ వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా యాపిల్ నుంచే రావడం విశేషం.ఈ విజయంతో మార్చి 2015లో షెన్జెన్లోని ‘చినెక్స్ట్ ఇండెక్స్’లో లెన్స్ నమోదైంది. తద్వారా జౌ కున్ఫీ చైనాలోనే అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్-మేడ్ మహిళగా అవతరించారు. అనంతరం 2025లో ఈ సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్ సాధించింది.మస్క్ కంపెనీలతో బంధం2016 నుంచి టెస్లా సంస్థతో ప్రారంభమైన అనుబంధం లెన్స్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్మార్ట్-కాక్పిట్, బాహ్య నిర్మాణ విడిభాగాల తయారీలో గ్లాస్, మెటల్, టచ్ మాడ్యూల్స్ విభాగాల్లో లెన్స్ తన నైపుణ్యాన్ని చాటుకుంది. గత డిసెంబర్లో ఇన్వెస్టర్ల వేదికగా లెన్స్ టెక్నాలజీ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఒక ప్రధాన ఉత్తర అమెరికా కస్టమర్తో తాము దశాబ్ద కాలంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ కస్టమర్ ప్రధాన వ్యాపారాలైన స్మార్ట్ కాక్పిట్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు (ఆప్టిమస్), కమర్షియల్ ఏరోస్పేస్ (స్పేస్ఎక్స్)ల్లో తాము భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొంది. శాటిలైట్ గ్రౌండ్ రిసీవర్ల కోసం బాహ్య నిర్మాణాత్మక మాడ్యూల్స్, అంతరిక్ష ప్రయోగాల కోసం అల్ట్రా-థిన్ ఫోటోవోల్టాయిక్ గ్లాస్ మాడ్యూల్స్ను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ అది ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.గ్లోబల్ టెక్ మహారథులైన టిమ్ కుక్, ఎలాన్ మస్క్ల నమ్మకాన్ని గెలుచుకున్న జౌ కున్ఫీ రాబోయే రోజుల్లో ఏఐ హార్డ్వేర్ తయారీ వ్యూహాలతో ముందుకెళ్లనున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
మీకు తిక్కుంటే.. వాళ్లు తొక్క తీసి లెక్క తేలుస్తారు!
చిన్నపాటి అసహనం పలు సందర్బాల్లో తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని అంటారు కదా.. అలాగే, ఘటనే ఒకటి థాయ్లాండ్లో చోటుచేసుకుంది. ఆవేశం, అసహనంతో ఓ చైనా టూరిస్ట్ చేసిన తప్పిందం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వెళ్లింది. అలాగే, సదరు చైనా టూరిస్ట్ మరోసారి తమ దేశంలోకి రాకుండా జీవిత కాల నిషేధం కూడా విధించారు. ఇక, అతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ చైనా టూరిస్ట్ ఏం చేశాడంటే.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన జెంగ్ లివేయ్(30) తన భార్యతో కలిసి థాయ్లాండ్ పర్యటనకు వచ్చాడు. అనంతరం, బుధవారం మధ్యాహ్నం చైనాకు తిరిగి వెళ్లే విమానం కోసం బ్యాంకాంక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఆటోమేటెడ్ పాస్పోర్ట్ నియంత్రణ వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పుడు అసహనానికి గురయ్యాడు. చెక్ పాయింట్ వద్ద ఆటోమేటెడ్ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయలేదు. దీంతో, ప్రయాణ పత్రాన్ని స్కానర్కు పదేపదే విసిరి, ఆటోమేటిక్ అడ్డంకులను తన్ని, గేట్ల గుండా బలవంతంగా వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.అనంతరం, క్లియరెన్స్ తీసుకోకుండా అతను చెక్పాయింట్ దాటిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. థాయ్ వార్తాపత్రిక 'ది నేషన్' ప్రకారం, ఆ తర్వాత జెంగ్ చైనీస్ భాషలో అధికారులను దూషించి, వారి వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా, అతని భార్య అతన్ని నిలువరించింది. దీంతో, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న అధికారులను అవమానించడం, అనుమతి లేకుండా ఇమ్మిగ్రేషన్ చెక్పాయింట్ దాటడం వంటి ఆరోపణలతో అధికారులు అతనిపై పలు ఫిర్యాదులు నమోదు చేశారు.🚨🇹🇭 Thai police arrested a Chinese traveler named Zheng Liwei for allegedly kicking and damaging two automated passport control gates at Suvarnabhumi Airport. The disturbance in the terminal resulted in charges being filed against him.The consequences:- The suspect agreed to… pic.twitter.com/oZbfkgyXh5— Jeab (@Jeab1030599) May 14, 2026అంతేకాకుండా.. జెంగ్ కారణంగా ఆటోమేటెడ్ గేట్లకు సుమారు 4,80,000 బాత్(భారత కరెన్సీలో దాదాపు రూ.14 లక్షలు) నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో రెండు పాస్పోర్ట్ కంట్రోల్ గేట్లు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. అనంతరం, థాయ్ అధికారులు అప్పటి నుండి జెంగ్ వీసాను రద్దు చేసి, అతడిని జీవితకాల బ్లాక్లిస్ట్లో చేర్చారు. దీనివల్ల భవిష్యత్తులో అతను థాయ్లాండ్లోకి తిరిగి ప్రవేశించకుండా సమర్థవంతంగా నిరోధించబడ్డాడు. SCMP నివేదిక ప్రకారం చట్టపరమైన విచారణలు పూర్తయిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరిస్తారు.నిఘా కఠినతరం..మరోవైపు.. థాయ్లాండ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల దుష్ప్రవర్తనపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, థాయ్ అధికారులు విదేశీ సందర్శకులపై నిఘాను కఠినతరం చేస్తున్నారు. ఈ తరుణంలో జెంగ్ ఘటన వెలుగుచూసింది. దీంతో, ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా థాయ్లాండ్ 93 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత బసను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి సిహాసక్ ఫువాంగ్కెట్కియో ప్రకారం.. నేర కార్యకలాపాలను అరికట్టడం మరియు దీర్ఘకాలిక బసల దుర్వినియోగాన్ని నివారించడం ఈ చర్య యొక్క లక్ష్యం.ఇదిలా ఉండగా.. పలు దేశాల్లో టూరిస్ట్లు అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఇతర దేశాల్లో పర్యాటకులు విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ, జరిమానాలు, జైలు శిక్షలు, లేదా జీవితకాల నిషేధాలు విధిస్తున్నారు.ఇతర దేశాల్లో జరిగిన సంఘటనలుస్పెయిన్ (2025): రయనైర్ విమానంలో అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు అత్యవసర గేట్లను బలవంతంగా తెరిచి, విమానాశ్రయ భద్రతా పరికరాలను ధ్వంసం చేశారు. దీనిపై జరిమానాలు విధించారు.యూరప్ (వివిధ దేశాలు): పర్యాటకుల అసభ్య ప్రవర్తనపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా, విమానాశ్రయాల్లో ఆస్తి ధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాలు అమెరికన్ పర్యాటకులపై ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నాయి.శిక్షలు ఇలా.. జరిమానాలు: నష్టం విలువ ఆధారంగా భారీ జరిమానాలు.జైలు శిక్ష: ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, అధికారులపై దాడి వంటి కేసుల్లో 1–3 సంవత్సరాల జైలు శిక్ష.వీసా రద్దు: వీసా తక్షణమే రద్దు చేసి, దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు.జీవితకాల నిషేధం: తిరిగి ఆ దేశంలోకి ప్రవేశించకుండా బ్లాక్లిస్ట్లో చేర్చడం.జరిమానాలు: వెనిస్లో కాలువల్లో ఈత కొట్టడం, చెత్త వేయడం వంటి చర్యలకు ₹50,000 వరకు జరిమానా.డిపోర్ట్మెంట్: బాలి (ఇండోనేషియా)లో వీసా ఉల్లంఘనలు, పవిత్ర స్థలాల్లో అసభ్య ప్రవర్తనకు విదేశీయులను డిపోర్ట్ చేస్తున్నారు.జైలు శిక్షలు: UAE, సింగపూర్లో మత్తులో అసభ్య ప్రవర్తనకు జైలు శిక్షలు.వీసా రద్దు/నిషేధం: థాయ్లాండ్లో విమానాశ్రయ ఆస్తి ధ్వంసం చేసిన చైనా పర్యాటకుడికి జీవితకాల ప్రవేశ నిషేధం విధించారు.యూరప్లో పర్యాటకుల జరిమానాలుస్పెయిన్ (మాలాగా, మయోర్కా):చెత్త వేయడం, శబ్దం చేయడం, సరైన దుస్తులు లేకుండా తిరగడం.జరిమానా: €750 (₹70,000 సుమారు).పోర్చుగల్ (అల్బుఫీరా, ఆల్గార్వే):ప్రజా ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, అసభ్య ప్రవర్తన.జరిమానా: €150–€1,800 (₹13,000–₹1.6 లక్షలు).ఫ్రాన్స్ (పారిస్, బీచ్ ప్రాంతాలు):మద్యం తాగి ప్రజా ప్రదేశాల్లో తిరగడం.జరిమానా: €38–€135. -
ఐసిస్కు బిగ్ షాక్.. ట్రంప్ ప్రకటన
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్రకమాండర్ అబు బిలాల్ మనూకీ హతమయ్యాడు. అమెరికా బలగాలు-నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అబు బిలాల్ మనూకీ (ఐసిస్ రెండో ఖలీఫా) ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపించేవాడు. అయితే తన ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించిందని.. అత్యంత క్లిష్టమైన ఈ మిషన్ను జాగ్రత్తగా అమలు చేసి అతని చంపేసిందని ట్రంప్ శనివారం తన సోషల్ మీడియాలో ప్రకటించారు. “ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు” అని ట్రంప్ పేర్కొన్నారు.ఐసిస్లో నెంబర్ 2(రెండో ఖలీఫా) అయిన అబుల్ బిలాల్ చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఆఫ్రికాలోని లోకల్ గ్యాంగ్లే అతని ఆచూకీ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనూకీ మరణంతో ఐసిస్కు పెద్ద దెబ్బేనని.. ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్లు బలహీనపడొచ్చనే ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఐసిస్ నేపథ్యం.. ఇరాక్ యుద్ధం తర్వాత “అల్-ఖైదా ఇన్ ఇరాక్” (AQI) అనే గ్రూప్ నుంచి విడిపోయి.. 2014లో అబూ బకర్ అల్-బగ్దాది నేతృత్వంలో “ఇస్లామిక్ స్టేట్”గా ఖలీఫత్(రాజకీయ-మతాధికార వ్యవస్థ) ప్రకటించింది. కాలక్రమంలో.. 2015 పారిస్ దాడులు, 2016 బ్రస్సెల్స్ బాంబులు, 2016 ఒర్లాండో షూటింగ్, మిడిల్ ఈస్ట్.. ఆఫ్రికాలో అనేక ఆత్మాహుతి దాడులు జరిపి తన మూలాలను విస్తరించుకుంది.అబూ బకర్ అల్-బగ్దాది (2013–2019), అబూ ఇబ్రాహీం అల్-హషిమీ అల్-ఖురైషీ (2019–2022), ఆపై అబూ అల్-హసన్ అల్-ఖురైషీ (2022), అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సైనీ అల్-ఖురైషీ (2022–2023)లు ఖలీఫాలుగా పని చేశారు. ప్రస్తుతం అబూ హఫ్స్ అల్-హషిమీ అల్-ఖురైషీ (2023 నుండి) కొనసాగుతున్నాడు. అమెరికా, భారత్, ఇరాక్ తోపాటు పలు దేశాలు ఐసిస్ను ఉగ్రసంస్థగా గుర్తించాయి. క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చిన ఐసిస్ నెట్వర్క్.. ప్రస్తుతం ఆఫ్రికా–ఆసియా ప్రాంతాల్లో చిన్నచిన్న గుంపులుగా కొనసాగుతోంది. -
చైనా ఇచ్చినవి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో స్నేహపూర్వకంగా మెలిగిన ట్రంప్.. మూడురోజులపాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ఒప్పందాల మొదలు తైవాన్, ఇరాన్ యుద్ధం-హర్ముజ్ జలసంధి లాంటి సంక్లిష్టమైన అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అయితే.. పర్యటన ముగింపు వేళ జరిగిన ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పర్యటన ముగిసి.. మొత్తం బృందం ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో భద్రతా సిబ్బంది నుంచి మైక్ ద్వారా ఓ ఆదేశం వచ్చింది. అందులో.. Nothing from China allowed on the plane అని చెప్పారు. అంటే చైనా నుంచి ఏ వస్తువును తాము విమానంలోకి అనుమతించబోమని. అలా సిబ్బంది వాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వాటిని సేకరించి అక్కడే ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో పడేశారు. అలా పడేసిన వాటిల్లో.. ప్రెస్ పాస్లు, వైట్హౌస్ సిబ్బందికి ఇచ్చిన బర్నర్ ఫోన్లు, ప్రతినిధుల గుర్తింపు పిన్లు ఉన్నాయట. ఈ విషయాన్ని వైట్హౌస్ ప్రెస్ పూల్ ధృవీకరించింది.‘‘చైనా అధికారులు ఇచ్చిన ప్రతిదాన్ని అమెరికా సిబ్బంది సేకరించి, ఎయిర్ఫోర్స్ వన్ ఎక్కే ముందు చెత్తబుట్టలో వేసేశారు. చైనాలో ఇచ్చిన ఏ వస్తువూ విమానంలోకి రాకూడదని ఆ సమయంలో వాళ్లు స్పష్టం చేశారు’’ అని న్యూయార్క్ పోస్ట్ వైట్హౌజ్ ప్రతినిధి ఎమిలీ గూడిన్ తెలిపారు. అయితే ట్రంప్నకు చైనా నుంచి ఏమైనా కానుకలు వచ్చాయా? వస్తే వాటిని అనుమతించారా? లేదంటే చెత్త బుట్టలోనే పడేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుల విషయంలోనే కాదు.. రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఇలా చాలా దేశాల అధినేతల విషయంలో సిబ్బంది కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనల్లో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను(ఎలక్ట్రానిక్ పరికరాలు, గుర్తింపు వస్తువులు) వాడకూడదనే నియమాలు ఉంటాయి. ఒకవేళ వాడినా.. క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే అనుమతిస్తారు. అలాగే కానుకల విషయంలోనూ అంతే. పరిస్థితిని బట్టి వాటిని అనుమతించకపోవడం ఉంటుందేమోగానీ.. మునుపెన్నడూ లేని రీతిలో చైనా పర్యటనలో అమెరికా అధ్యక్ష భద్రతా సిబ్బంది చెత్త బుట్టలో పడేయడం గమనార్హం. ట్రంప్ చైనా పర్యటనలో జరిగింది.. ఇంతదాకా ఏ అధినేత విషయంలో జరగలేదు. బహుశా చైనా ఇచ్చిన వస్తువులతో సర్వైలెన్స్ లేదంటే స్పైవేర్ ప్రమాదం ఉండొచ్చని అమెరికా భద్రతా బృందం భావించి ఉండొచ్చు. అమెరికా–చైనా సంబంధాల్లో ఉన్న అనుమానాలు, గూఢచర్య భయాలు కారణంగా తీసుకున్న నిర్ణయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారని ఆంక్షలు..ఈ పర్యటనలో ఇరు దేశాల అధ్యక్షుల సమావేశాలు స్నేహపూర్వకంగా కనిపించినా.. భద్రతా, ప్రెస్ బృందాల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి. టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద ట్రంప్–షీ సమావేశం సమయంలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కి ఆయుధం కారణంగా ప్రవేశం నిరాకరించడం చర్చనీయాంశమైంది. అలాగే అధ్యక్షుడు వెంట ప్రెస్ పూల్కి మోటర్కేడులోకి చైనా సిబ్బంది అనుమతించలేదు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అమెరికా సిబ్బంది ఒత్తిడి చేసి వారిని లోపలికి తీసుకెళ్లారు. 2016 అప్పటి అధ్యక్షుడు ఒబామా పర్యటన (హాంగ్జౌ, G20 సదస్సు సందర్భంగా)లో అమెరికా–చైనా సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగాయి. “ఇది మా దేశం, మా విమానాశ్రయం” అంటూ ఓ చైనా అధికారి చెప్పిన మాట.. ఆ సమయంలో చాలా పాపులర్ అయ్యింది. -
అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో..
న్యూఢిల్లీ: ఒకవైపు అప్పుల భారం సరికొత్త రికార్డుకు చేరుకోవడం, మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతుండటం, ద్రవ్య లభ్యత కఠినతరం కావడం.. ఇవన్నీ దాయాది దేశం పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తీవ్రమైన ఆర్థిక మాంద్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ తాజా పరిణామాలు పెను ముప్పుగా పరిణమించాయి. అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయిన పాక్కు ఇక భవిష్యత్తు ఉందా? అనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి.రికార్డు స్థాయిలో ప్రపంచ అప్పులుప్రముఖ ‘బిజినెస్ రికార్డర్’ పత్రిక ప్రచురించిన తాజా ఆర్థిక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు నిరంతరాయంగా, భారీగా రుణాలు తీసుకుంటుండటంతో గ్లోబల్ డెట్ (ప్రపంచ అప్పులు) మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఈ ఊహించని అప్పుల గమనం అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తూ, చిన్న దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.పాకిస్తాన్కు ముంచుకొస్తున్న ముప్పుఅభివృద్ధి చెందిన దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేస్తున్నప్పటికీ, మార్కెట్లో తక్షణమే ఎలాంటి పెద్ద అంతరాయాలు రాకుండా ఆ రుణాలను సులభంగా తట్టుకోగలుగుతున్నాయి. కానీ ఆర్థికంగా అత్యంత బలహీనంగా ఉండి, పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్ లాంటి దేశాలపై ఈ పరిణామాల ప్రతికూల ప్రభావం స్పష్టంగా పడుతోందని నివేదిక హెచ్చరించింది. ఈ ప్రపంచ అప్పుల పెరుగుదల పాక్ పాలిట శాపంగా మారి, ఆ దేశపు బలహీనమైన రికవరీకి అడ్డంకిగా నిలుస్తోంది.ద్రవ్యోల్బణం, కమ్ముకొస్తున్న చమురు సెగభౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా రవాణా చార్జీలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతూ, సుదీర్ఘకాలంగా రోజువారీ జీవన వ్యయం పెరిగి సతమతమవుతున్న పాకిస్తాన్ సామాన్యులపై ఈ పరిణామాలు మరింత భారాన్ని మోపుతున్నాయి.విధానపరమైన నిర్ణయాలపై తీవ్ర ఒత్తిడిపాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ ప్రధానంగా విదేశీ నిధులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రపంచ ద్రవ్య పరిస్థితులు కఠినంగా మారడం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం లాంటివి ఆ దేశ ఆర్థిక విధానాల సరళతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్వేచ్ఛగా, అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం పాక్ ప్రభుత్వానికి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో లోపాలుఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాగిన నిర్మాణాత్మక అసమానతలను ఈ నివేదిక ప్రముఖంగా ఎత్తిచూపింది. పెద్ద దేశాలు నిరంతరం అప్పులు చేస్తూ కూడా ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సుస్థిరంగా కొనసాగుతుంటే, పాకిస్తాన్ లాంటి వర్ధమాన దేశాలు మాత్రం మూలధన ప్రవాహంలో అస్థిరత, అధిక రీఫైనాన్సింగ్ ఖర్చులు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వాతావరణం కఠినంగా మారినప్పుడు చిన్న దేశాలు అత్యంత వేగంగా ఈ సర్దుబాటు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.ఆర్థిక స్థిరీకరణ మార్గంలో సవాళ్లుపాకిస్తాన్ చేపడుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలు, సంస్కరణలు ప్రధానంగా మల్టీలేటరల్ సపోర్ట్ (బహుపాక్షిక మద్దతు), బాహ్య ఆర్థిక ప్రవాహాలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ సున్నితమైన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగినా, కమోడిటీ సైకిల్స్లో ఏ చిన్న మార్పు వచ్చినా పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఈ తాజా అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లతో పాకిస్తాన్కు ఇక భవిష్యత్ ఉంటుందా? అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.ఇది కూడా చదవండి: మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది? -
18 సార్లు లాటరీ విన్.. లక్కీ మ్యాన్ ‘జాక్పాట్’ సీక్రెట్ ఇదే..
కొందరి జీవితాల్లోకి అదృష్టం ఎప్పుడో ఒకసారి అతిథిలా వస్తుంది. కానీ అమెరికాకు చెందిన రాబర్ట్ బెవాన్ విషయంలో మాత్రం అదృష్టం ఆయన ఇంటి సొంత మనిషిలా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 సార్లు లాటరీ గెలుచుకుని ఆయన సృష్టించిన రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, గెలిచిన ఈ లాటరీ డబ్బు కంటే కూడా, తన అసలైన అదృష్టం ఏదో ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.18వ సారి మెరిసిన అదృష్టంఇడాహో లాటరీ నిర్వహించిన "1,000,000 డాలర్ల కింగ్ స్క్రాచ్ గేమ్"లో రాబర్ట్ బెవాన్ తన 18వ విజయాన్ని నమోదు చేశారు. ఒకే వ్యక్తి ఇన్నిసార్లు లాటరీ గెలవడంపై ఇడాహో లాటరీ సంస్థ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. "ఒక్కరే 18 సార్లు మెరవడం సాధ్యమా? రాబర్ట్ బెవాన్ విషయంలో అది నిజమైంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లాటరీ అధికారులు పాత రికార్డులను పరిశీలించగా ఈయన ‘శాశ్వత విజేత’ అనే విషయం వెలుగులోకి వచ్చింది.1997లోనే మొదలైన ప్రయాణంరాబర్ట్ అదృష్ట ప్రయాణం నిన్న ఈరోజు మొదలైంది కాదు. 1997లోనే ఇడాహో లాటరీ వారి "బ్లేజర్ బక్స్" ప్రమోషన్ ద్వారా ఆయన మొదటిసారి ఒక లగ్జరీ ‘చేవ్రొలెట్ బ్లేజర్’ కారును గెలుచుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రకరకాల లాటరీల్లో 1,000 నుండి 2,00,000 డాలర్ల వరకు అనేక బహుమతులను సొంతం చేసుకున్నారు.‘నా అసలైన జాక్పాట్ నా భార్యే!’ఇటీవల లాటరీ కార్యాలయానికి బహుమతి డబ్బు తీసుకోవడానికి వచ్చిన రాబర్ట్ను అధికారులు ఒక ప్రశ్న అడిగారు. "మీ వరుస విజయాల రహస్యం ఏమిటి?" అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం అందరి కళ్లు తెరిపించింది. "నా నిజమైన అదృష్టం ఈ లాటరీ డబ్బు కాదు. గత 40 ఏళ్లుగా ప్రతి కష్టంలో, సుఖంలో నాకు తోడుగా నిలిచిన నా ప్రియమైన భార్యే నా అసలైన జాక్పాట్. చాలా ఏళ్లుగా సరదా కోసం ఇద్దరం కలిసి లాటరీ టికెట్లు కొనడం మా జీవితంలో ఒక అలవాటుగా మారింది" అని రాబర్ట్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు.వ్యసనం కాదు.. కేవలం ఒక వ్యాపకంలాటరీ అనేది చాలామందికి ఒక వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంటే, రాబర్ట్ దంపతులు మాత్రం దీన్ని కేవలం ఒక చిన్న కాలక్షేపంగా, వినోదంగా మాత్రమే చూశారు. గెలిచిన డబ్బు జీవితంలో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, అదే జీవిత పరమార్థం కాదని ఆయన స్పష్టం చేశారు.మరో విశేషమేమిటంటే, తాము కొనే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల అభివృద్ధికి ఉపయోగపడుతుందనే సంతృప్తి కూడా ఈ దంపతుల్లో ఉంది.నెటిజన్ల ప్రశంసలుడబ్బు కంటే కుటుంబ బంధాలే మిన్న అని చాటిచెప్పిన రాబర్ట్ వైఖరిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. "డబ్బు ఉన్నవాడు కాదు, ఇంత మంచి మనసున్న ఈయనే నిజమైన మిలియనీర్" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లక్కీ మ్యాన్ రాబర్ట్ బెవాన్ కథ మనకు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుచేస్తోంది. ప్రేమించే జీవిత భాగస్వామి తోడుగా ఉండటాన్ని మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి లేదు! View this post on Instagram A post shared by 🅘🅓🅐🅗🅞 🅛🅞🅣🅣🅔🅡🅨 (@idaholottery) -
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
మా చర్చలు చరిత్రాత్మకం
బీజింగ్: చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. స్వదేశానికి పయనమయ్యారు. ఆయన గురువారం, శుక్రవారం చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. తమ చర్చలను చరిత్రాత్మకమైనవి, మైలురాయిగా ఇద్దరు నేతలు అభివర్ణించారు. ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్య ఘర్షణలతో సహా పలు అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని బీజింగ్లో చైనా అధినేతలు నివసించే, అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన జోంగ్నాన్హయ్లో చివరిరోజు ట్రంప్, జిన్పింగ్ సమావేశమయ్యారు. తమ చర్చలను ముగించారు. వారిద్దరూ ఆ ప్రాంగణంలో నడుస్తూ, మాట్లాడుకుంటూ, మధ్యమధ్యలో ఆగి తోటలోని చెట్లను, పువ్వులను చూస్తూ ముందుకు కదిలారు. చైనా పర్యటన విజయవంతమైందని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇది మరపురాని పర్యటన అని అభివరి్ణంచారు. అనేక విషయాలపై చైనాతో అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఇరుదేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అనేక సమస్యలను పరిష్కరించుకున్నాయని వెల్లడించారు. ఇది రెండు దేశాలకు, ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు. అయితే, ఆ ఒప్పందాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. జిన్పింగ్ తన పాత స్నేహితుడేనని, ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని, తమ మధ్య ఒక మంచి సంబంధాలున్నాయని ట్రంప్ స్పష్టంచేశారు. అమెరికా–చైనా సంబంధం చాలా ముఖ్యమైందని, అది మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఉమ్మడి అవగాహనకు వచ్చాం ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమని జిన్పింగ్ ఉద్ఘాటించారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాన్ని నిర్మించుకోవడానికి ఇరుపక్షాలు ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయని వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను స్థిరంగా ఉంచడం, వివిధ రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించడం, వివాదాలను సముచిత రీతిలో పరిష్కరించుకోవడం, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సంప్రదింపులు, సమన్వయాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఉమ్మడి అవగాహనకు చేరుకున్నామని స్పష్టంచేశారు. బోయింగ్ నుంచి చైనాకు 200 విమానాలు! అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి చైనా రాబోయే పదేళ్లలో 200 విమానాలు కొనుగోలు చేయనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన స్వదేశానికి తిరిగివెళ్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. బోయింగ్ నుంచి విమానాల కొనుగోలుకు చైనా అంగీకరించిందని, జిన్పింగ్తో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో 750 విమానాలను చైనా కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా కంపెనీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. తైవాన్కు అమెరికా ఆయుధాలు విక్రయించే ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. పాకిస్తాన్కు మేలు చేయడానికే.. పాకిస్తాన్కు మేలు చేసే ఉద్దేశంతో ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై ఇక ఎలాంటి బాంబు దాడులు జరగవని స్పష్టం చేశారు. మరో దేశం(పాక్) చేసిన అభ్యర్థన మేరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని చెప్పారు. పాకిస్తాన్కు సహాయం చేయాలనే ఉద్దేశంతో అలా చేశామని అన్నారు. త్వరలో అమెరికాకు జిన్పింగ్ షీ జిన్పింగ్ మరో ఐదారు నెలల్లో అమెరికాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. సమావేశాలు, ఫోన్కాల్స్, లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. -
భారత్కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్పోర్టు దాకా ఎస్కార్ట్గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
కాంగోలో ఎబోలాకు 65 మంది బలి
కిన్షాసా: కాంగోలోని మారుమూల ఇటురి ప్రావిన్స్లో ప్రమాకర ఎబొలా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు కనీసం 65 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోగా, మరో 246 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. మొంగ్వాలు, ర్వాంపర ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు బయటపడుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. -
ఒమన్లో సుదీర్ఘ సెలవులు!
మస్కట్: ఒమన్ నివాసితులకు ఈద్ అల్ ఫితర్ (బక్రీద్) సందర్భంగా ఈసారి సుదీర్ఘ సెలవులు లభించే అవకాశం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలో వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వచ్చే వారం విడుదల చేయనుంది.ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. 'అరాఫా డే' మే 26 (మంగళవారం) వచ్చే అవకాశం ఉంది. దీంతో మే 26 నుండి మే 31 (ఆదివారం) వరకు సెలవులను పొడిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, దుల్ హజ్ మాసపు చంద్రదర్శనం ఆధారంగానే ఈ సెలవుల తుది తేదీలపై స్పష్టత రానుంది.పర్యాటక రంగానికి ఊపు..వరుస సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో ఒమన్లోని స్థానికులు, ప్రవాసీయులు ఇప్పటికే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దేశీయంగా ఉండే పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఈ లాంగ్ వీకెండ్ ఎంతగానో ఉపయోగపడనుంది. సాధారణంగానే ఈద్ పండుగ రోజుల్లో ఒమన్లోని తీరప్రాంతాలు, పర్వత ప్రాంత పర్యాటక స్థలాలు సందర్శకులతో కిక్కిరిసిపోతాయి.చంద్రదర్శనం ఆధారంగా తేదీలను ఖరారు చేసిన వెంటనే, కార్మిక మంత్రిత్వ శాఖ సెలవులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను జారీ చేయనుంది. -
లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపు
వాషింగ్టన్: సరిహద్దుల్లో తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, లెబనాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా జరిపిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది."సరిహద్దుల్లో మరింత పురోగతిని సాధించేందుకు వీలుగా.. ఏప్రిల్ 16 నాటి శత్రుత్వాల నిలిపివేత (కాల్పుల విరమణ) ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించాం" అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తాత్కాలిక గడువు ఆదివారంతో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఊరట లభించింది.శాశ్వత శాంతి వైపు అడుగులు..రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తదుపరి చర్యలు ఇలా ఉండనున్నాయి..మే 29న రెండు దేశాల సైనిక ప్రతినిధులతో పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 2, 3 తేదీల్లో ఇరు దేశాల మధ్య శాశ్వత రాజకీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికా విదేశాంగ శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరపనుంది."ఈ చర్చలు ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీస్తాయని మేము ఆశిస్తున్నాము. ఒకరి సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరొకరు పూర్తిగా గౌరవించుకుంటూ.. భాగస్వామ్య సరిహద్దు వెంబడి నిజమైన రక్షణను ఏర్పాటు చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం" అని టామీ పిగోట్ ఆశాభావం వ్యక్తం చేశారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుమరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఇజ్రాయెల్ రక్షణ దళాలు లెబనాన్లోని పలు లక్ష్యాలపై మళ్లీ దాడులు చేశాయి. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ఈ కాల్పుల విరమణ అమలులోనే ఉందని భావిస్తున్నాయి.కాగా, ఇరాన్కు సంఘీభావంగా తమపై దాడులు చేస్తున్న షియా సాయుధ బృందం 'హిజ్బుల్లా'ను లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే వాషింగ్టన్లో జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో హిజ్బుల్లా భాగస్వామిగా లేదు. -
హైదరాబాద్లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్వర్క్లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
నమ్మండి ప్లీజ్..ముగ్గురు కవలలకు జన్మనిచ్చా..! కంగుతిన్న వైద్యులు
డాక్టర్లు అనునిత్యం ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తుంటారు. కానీ వాళ్ల అనుభవంలో ఏదో ఒక విచిత్రమైన కేసు సవాలు విసురుతూనే ఉంటుంది. కొన్ని వాళ్ల వైద్య వృత్తికే అందని విధంగా ఉంటే..మరికొన్ని అత్యంత మిరాకిల్గా ఉంటాయి. అలాంటి వింత కేసే ఈ టీనేజర్ పేషెంట్ది. ఆమె చెబుతున్న మాటలకు వైద్యులు సైతం ఒక్క క్షణంపాటు అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. ఫ్రాన్స్లోని లియాన్కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి క్లేలియా వెర్డియర్ మూడువారాల కోమా తర్వాత కళ్లు తెరిచింది. ఆమె పలికిన మొదటి మాటలకు ఒక్కసారిగా వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు ఆ అమ్మాయి అడుగుతున్న మాటలకు సమాధానం చెప్పలేక గందరగోళానికి గురైంది ఆస్పత్రి సిబ్బంది. కోమా నుంచి మేల్కోని తొలిసారిగా ఆమె ఏం మాట్లాడిందంటే.." ప్లీజ్ నా కుమార్తెలను తీసుకురండి నేను వాళ్లని చూడలంటూ తల్లడిల్లిపోయింది". ఇదేంటి ఈ యువతికి పెళ్లికాలేదు, పైగా పిల్లలు అంటూ వాళ్లని పేర్లతో పిలవడంతో ఒక్కసారిగా వైద్యులు విస్తుపోయారు. ఒక్క క్షణం అసలు ఏం జరుగుతోందో తెలియక సతమతమయ్యారు. ఆ యువతి వాళ్లను ఒక్కసారి తన వద్దకు తీసుకురమ్మని అర్ధించడం అందర్నీ కలవరపాటుకు గురిచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు గర్భవతి కాలేదని వైద్యులు ధృవీకరించారు. పైగా ఆమె ఏడేళ్లుగా తన పిల్లలను చూసుకుంటున్నట్లు చెబుతోందంతా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె మెదడు సృష్టించుకున్నదేనని తేల్చేశారు వైద్యులు. ఆమె గతేడాది జూన్ 2025లో అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మాహత్యయత్నంకు ప్రయత్నించిందని, ఆ మందుల ప్రభావం కారణంగా మూడు వారాలపాటు కోమాలో ఉందని చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే ఆ యువతి మాత్రం వైద్యులు తనని ప్రేరేపిత కోమాలో ఉంచారని, తనకు పిల్లలు ఉన్నారని, ప్రసవ వేదన కూడా అనుభవించానని చెబుతుంది. పైగా ఆమెకు ముగ్గురు కవల కుమార్తెలు పుట్టారని చెబుతోంది. కేవలం పుట్టుక మాత్రమే కాదు ఆ తర్వాత జీవితం గురించి అలవోకగా చెప్పేస్తుంది. వాళ్లను ఎలా పెచ్చింది, వాళ్లకు పెట్టిన పేర్లతో సహా చెప్పయడంతో విస్తుపోవడం వైద్యులు వంతైంది. పైగా తన కూతుళ్ల పేర్లు మిలా, మైల్స్, మైలీ అని పెట్టినట్లు తెలిపింది. అయితే మైలీ పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో చాలా ఏడ్చానని, మిగతా ఇద్దరికి తానే పాలివ్వడం నుంచి పెంచి పెద్ద చేయడం వరకు గుర్తుందని వాళ్లకు ఏడేళ్లు ఉంటాయని చెబుతూ ప్లీజ్ వాళ్లని పిలవండి చూడాలి అంటూ అడగడం అందర్నీ కంటతడి పెట్టించింది. అచ్చం అమ్మలా తల్లడిల్లిన తీరు అందరి హృదయాలను మెలిపెట్టింది. కానీ వైద్యలు మాత్రం మెదడుకు తీవ్రమైన గాయం అయితే.. తర్వాత కోమాలో కలలు రావడం సర్వసాదరణమేనని చెబుతున్నారు. కోమాలో ఉన్న రోగులకు చీకటి గానీ, నిద్ర గానీ అనుభవంలోకి రావు. చాలామందికి స్పష్టమైన, వివరమైన కలలు వస్తాయని, అవి పూర్తిగా రియల్గా అనిపిస్తాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం అసలు ఏ జ్ఞాపకం లేకుండా మేల్కొంటారు. అయితే సదరు యువతి క్లేలియా మాత్రం నా కూతుళ్లు ఇప్పటికీ గుర్తొస్తున్నాంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అంతేగాదు ఆమెకు కోమాలోంచి మేల్కోగానే పిల్లల పేర్లే కలవరించింది గానీ తన పేరుగానీ, తన తల్లిదండ్రుల పేర్లుగానీ ఆమెకేం గుర్తులేకపోవడం బాధకరం. పైగా తను తల్లిగాదని, పిల్లలు లేరని వైద్యులు చెప్పిన వెంటనే షాక్కి గురయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా తన తల్లిదండ్రులను, తన పేరుని గుర్తు తెచ్చుకుంది. కానీ ఇది జరిగి ఏడాది కావొస్తున్నా..ఇప్పటికీ క్లేలియా మాత్రం తాను పిల్లల తల్లిననే అని భావిస్తోంది, వాదిస్తోంది. పైగా ఇంకా ఆ బాధ తన నుంచి పోలేదని అంటోంది.(చదవండి: స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..) -
ఇంధన సంక్షోభం.. ప్రభుత్వం బ్లాక్ అవుట్ ప్రకటన
పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యుద్ధం, దాడుల ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన హార్మూజ్ జలసంధి మూతపడింది. దీంతో, ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం పీక్ స్టేజ్కు చేరుకుంది. పరిస్థితి ఎంతకు దిగజారిదంటే.. ఇంధన సంక్షోభంతో క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. అయితే, క్యూబా పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కారణమే.. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా చాలా వరకు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ హార్మూజ్ మూసివేతతో ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని దేశాలు ఇంధన కోటాను విధిస్తున్నాయి. అలాగే, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల్లో వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఇక, పలు దేశాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాయి.అయితే తాజాగా ఇంధన సంక్షోభం కారణంగా క్యూబా పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు.. క్యూబాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. దేశం మొత్తం అంధకారంలోకి మునిగిపోయింది. సంక్షోభం కారణంగా చేసేదేమీ లేక క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. దీంతో, క్యూబా రాజధాని హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కోతల కారణంగా ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇంధన ప్రభావం పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతింది.Cuba has completely run out of diesel and fuel oil, the country's energy and mines minister said, as the capital Havana faces its worst rolling blackouts in decades amid a US blockade that has strangled the island of fuel. pic.twitter.com/jzzrwQyQRZ— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) May 14, 2026మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల కారణంగా క్యూబాకు చమురు సరఫరా చేసే వెనిజులా, మెక్సికో దేశాల సరఫరాను నిలిపివేశాయి. క్యూబాకు ఇంధనం పంపే దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే ఇందుకు కారణం. మరోవైపు క్యూబాలో ప్రస్తుతం భారీ విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇదే విషయంపై క్యూబా ఇంధన మంత్రి విసింటే డి లా ఓ లెవీ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఏ దేశం ఇంధనం అమ్మేందుకు ముందుకు వచ్చినా కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.కారణాలు..అమెరికా ఆంక్షలు: 2026 జనవరిలో ట్రంప్ ప్రభుత్వం క్యూబాకు ఇంధనం సరఫరా చేసే దేశాలపై టారిఫ్లు, ఆర్థిక శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.జలసంధి బ్లాకేడ్: అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి.సరఫరా తగ్గుదల: మెక్సికో, వెనిజులా వంటి ప్రధాన సరఫరాదారులు ఇంధనం పంపడం ఆపేశారు.రష్యా సహాయం: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు క్యూబాకు ఒకే ఒక్క పెద్ద రష్యన్ ఆయిల్ ట్యాంకర్ (Anatoly Kolodkin) మాత్రమే ఇంధనం అందించింది.ప్రత్యామ్నాయాలుదేశీయ ఉత్పత్తి: క్యూబా ప్రస్తుతం దేశీయ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.సౌర శక్తి: గత రెండు సంవత్సరాల్లో 1,300 మెగావాట్ల సౌర శక్తి ఏర్పాటు చేశారు. కానీ గ్రిడ్ అస్థిరత కారణంగా దీని సామర్థ్యం తగ్గింది.అంతర్జాతీయ చర్చలు: క్యూబా ఇంధనం అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఏ దేశం నుండైనా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. Cuba Runs Out of Diesel and Fuel Oil as Trump's Oil Blockade Causes Severe Humanitarian Crisis and Nationwide Blackouts pic.twitter.com/rUTz6rYJ5P— The Matrix is Glitching (@TMisGlitching) May 14, 2026ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా క్యూబా మాత్రమే కాదు, ప్రస్తుతం ఇంధన సంక్షోభం అనేక దేశాలను ప్రభావితం చేస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో 40% తగ్గుదల వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్, ఇటలీ, జర్మనీ, బంగ్లాదేశ్ వంటి దేశాలు హార్మూజ్ జలసంధి మూసివేత మరియు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.పాకిస్తాన్పెట్రోల్ ధరలు రూ. 414.78 లీటరుకు, డీజిల్ ధరలు రూ. 414.58 లీటరుకు చేరాయి. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే ఇది అత్యధికం.ప్రభుత్వం వారానికి ఒకసారి ధరలు సవరించాల్సి వస్తోంది.మధ్యతరగతి, రైతులు, రవాణా రంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి.ఇటలీదేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులు తగ్గించడం ద్వారా వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.జర్మనీవిమానయాన రంగం ప్రపంచ యుద్ధం-II తర్వాత అత్యంత తీవ్రమైన జెట్ ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.ఇంధన ధరలు $85–90/bbl నుండి $150–200/bbl వరకు పెరిగాయి.అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.విమాన సర్వీస్ రద్దులు, విమానయాన రంగం సంక్షోభం.బంగ్లాదేశ్ఇంధన కొరతతో విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి.ప్రభుత్వ ప్రయాణాలు పరిమితం చేయబడ్డాయి.వాహనాలకు ఇంధన సరఫరా పరిమితులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సాహం.ఈజిప్ట్..ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రోజు రిమోట్ వర్క్ తప్పనిసరి.వాణిజ్య, పబ్లిక్ లైటింగ్ పరిమితులు.విద్యుత్, ఇంధన పొదుపు చర్యలు ప్రభుత్వ ప్రయాణాలు, లైటింగ్ పరిమితులు. -
ప్లాస్టిక్ను ఉతికి ఆరేస్తుంది!
చైనాలో పర్యావరణహితమైన ప్లాస్టిక్ తయారవుతోంది. షెన్జెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింథటిక్ బయాలజీ శాస్త్రవేత్తలు బాసిల్లస్, సబ్టిలిస్ అనే బ్యాక్టీరియాను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును వాడి పారేసిన తర్వాత ఈ బాసిల్లస్ బ్యాక్టీరియా పాలిమర్ చైన్ని కొరికి ముక్కలు చేసి చిన్న అణువులుగా మారుస్తుంది. ఆ రేణువులను సబ్టిలిస్ బ్యాక్టీరియా నమిలి మోనోమర్ ఖండాలుగా విడదీస్తుంది. ఎంజైమ్లను స్రవించి ప్లాస్టిక్ని పూర్తిగా హరించి వేస్తుంది.ఆరు రోజుల్లో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కూడా మిగలకుండా చేస్తుంది. ప్లాస్టిక్కు బలాన్నిచ్చేవి పాలిమర్ గొలుసులు. ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయిన తర్వాత రేణువులు వాటంతట అవి క్షీణించిపోకుండా వందల ఏళ్లపాటు అలాగే ఉంటాయి. మట్టిని, నీటిని కలుషితం చేస్తుంటాయి. చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ప్లాస్టిక్లో సూక్ష్మజీవుల బీజాంశాలను నిద్రాణ దశలో పొందుపరుస్తున్నారు. పాలీ క్యాప్రోలాక్టోన్ (పీసీఎల్) ప్లాస్టిక్ మీద వాళ్లు చేసిన ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. బ్యాక్టీరియా ఎప్పుడు నిద్రలేస్తుంది? వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా ఉత్తేజితం కాని విధంగా ప్లాస్టిక్ను రూపొందించారు. బ్యాక్టీరియా బీజాంశాలను నిద్రాణ స్థితిలో ఉంచి దానిని పీసీఎల్లో ఒక పొరలాగ నిక్షిప్తం చేస్తారు. ఆ ప్లాస్టిక్ వస్తువు వాడకం పూర్తయిన తర్వాత నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా ఆ వస్తువును 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసిన ఒక పోషక ద్రావణాన్ని కలుపుతారు. అప్పుడు నిద్రాణంగా ఉన్న బ్యాసిల్లస్, సబ్టిలిస్ బ్యాక్టీరియా బీజాంశాలు ఉత్తేజితమవుతాయి. ఎంజైమ్లను స్రవించే స్థితికి చేరతాయి. ఆ తర్వాత ఆరు రోజుల్లో ఆ ప్లాస్టిక్ వస్తువు మోనోమర్ యూనిట్లుగా విచ్ఛిన్నమవుతుంది.చదవండి: తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమేనన్న చైనాప్యాకింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ విచ్ఛిన్నం కోసం క్యూటినేసెస్, లైపేసెస్, ఎస్టరేసెస్, హైడ్రోలేసెస్ వంటి మరికొన్ని ఎంజైమ్ల వాడకం ప్రయోగదశ దాటి వాడుకలోకి వచ్చింది. కానీ ప్రస్తుత పరిశోధన ప్లాస్టిక్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు అవశేషాలను కూడా వదలకుండా క్షయం చేసే ప్రక్రియలో విజయం సాధించింది. ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి హితకారిణి. దీనిని బయోప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ అనవచ్చు.- సాక్షి స్పెషల్ డెస్క్ -
ట్రంప్, జిన్పింగ్ భేటీపై వివాదం.. గీతా గోపీనాథ్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్, జిన్పింగ్ మధ్య వరుస కీలక భేటీ జరిగాయి. ఈ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్ను విస్తరించడం, యూఎస్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు.ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్పింగ్ నొక్కిచెప్పారు. హార్మూజ్ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్పింగ్ స్పష్టంచేశారు.భవిష్యత్తులో హార్మూజ్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్పింగ్ బీజింగ్ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు.మీటింగ్ వివాదం.. బీజింగ్లో జరిగిన ట్రంప్-జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశంలో మహిళల గైర్హాజరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో పూర్తిగా పురుషులే ఉండటం విమర్శలకు దారితీసింది. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్, జిన్పింగ్తో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశ టేబుల్ వద్ద ఒక్క మహిళ కూడా లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రవేత్త గీతా గోపీనాథ్ ఈ ఘటనను “మెరిటోక్రసీ ముగింపు చిత్రపటం”గా అభివర్ణించారు.మరోవైపు.. కొందరు విశ్లేషకులు కూడా స్పందించి లింగ సమానత్వం లోపం స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. అమెరికా–చైనా వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మహిళల ప్రాతినిధ్యం లేకుండా సమావేశం జరపడం ప్రతీకాత్మకంగా ప్రతికూల సంకేతం అని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సంఘటన అంతర్జాతీయ దౌత్యంలో మహిళల పాత్రపై కొత్త చర్చలకు దారితీసింది.🚨JUST IN: The White House has just released new details from President Trump’s bilateral sit-down with Xi JinpingSeveral major wins are already being highlighted:- Cracking down on the flow of fentanyl precursors from China into the United States - Pushing China to buy… pic.twitter.com/8Y1Sgr81cF— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 14, 2026భేటీ సందర్భంగా ప్రధానాంశాలుసైబర్ భద్రతా హెచ్చరికలు: అమెరికా ప్రతినిధులకు చైనాలో కమ్యూనికేషన్లు పర్యవేక్షణలో ఉండవచ్చని హెచ్చరించారు. అందుకే బర్నర్ ఫోన్లు, కొత్త పరికరాలు వాడారు.ఇరాన్పై చర్య సంకేతాలు: ట్రంప్ “to be continued!” అంటూ ఇరాన్పై సైనిక చర్యలు కొనసాగవచ్చని సూచించారు.తైవాన్ ఉద్రిక్తతలు: తైవాన్ సమస్యను తప్పుగా నిర్వహిస్తే అమెరికా–చైనా సంబంధాలు “ప్రమాదకర స్థితి”లోకి వెళ్తాయని షీ హెచ్చరించారు.ఆర్థిక ఒప్పందాలు: చైనా 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.థూసిడైడ్స్ ట్రాప్: షీ, అమెరికా “థూసిడైడ్స్ ట్రాప్”ను అధిగమించాలి అని సూచించారు.ఇరాన్ మధ్యవర్తిత్వం: షీ, ఇరాన్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని తెలిపారు.ప్రధాన ఆర్థిక ఒప్పందాలుబోయింగ్ విమానాల కొనుగోలుచైనా 200 బోయింగ్ జెట్లు కొనుగోలు చేయడానికి అంగీకరించింది.ఇది దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా విమానాలపై చైనా చేసిన మొదటి పెద్ద ఆర్డర్.వ్యవసాయ ఉత్పత్తులుఅమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది అమెరికా రైతులకు పెద్ద మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది.అమెరికా చమురు కొనుగోలుచైనా అమెరికా నుండి మరిన్ని క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది.దీని లక్ష్యం హార్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించడం.మార్కెట్ యాక్సెస్అమెరికా కంపెనీలకు చైనా మార్కెట్లలో విస్తృత యాక్సెస్ ఇవ్వబడింది.ఇది టెక్నాలజీ, ఎనర్జీ, మరియు తయారీ రంగాలకు కొత్త అవకాశాలు తెస్తుంది.చైనా పెట్టుబడులుఅమెరికాలో పెట్టుబడులు పెంచడానికి చైనా అంగీకరించింది.ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. -
తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమే!
బీజింగ్: తైవాన్ విషయంలో చైనా అధినేత షీ జిన్పింగ్ తన మనసులోని మాటను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నేరుగా చెప్పేశారు. తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకోక తప్పదని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరు అడ్డుతలిగినా లెక్కచేయబోమని పేర్కొన్నారు. తైవాన్ అంశంలో సరిగ్గా వ్యవహరించకపోతే చైనా, అమెరికాల మధ్య వివాదాలు, తీవ్ర సంఘర్షణలు తలెత్తవచ్చని ట్రంప్తో జిన్పింగ్ అన్నారు. తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలిచ్చారు. రాజధాని బీజింగ్లో ట్రంప్, జిన్పింగ్ గురువారం సమావేశమయ్యారు. ఇరాన్ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు విస్తృతస్థాయిలో చర్చించుకున్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఉమ్మడిగా తేల్చిచెప్పారు. ఈ ఏడాది సెపె్టంబర్ 24న వైట్హౌస్ను సందర్శించాలంటూ జిన్పింగ్ దంపతులను ట్రంప్ ఆహ్వానించారు. నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడమే ధ్యేయంగా చైనా, అమెరికాలు ఒక నూతన విధానంపై అంగీకారానికి వచ్చాయని జిన్పింగ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా–అమెరికా సంబంధాలను నిర్మించాలనే కొత్త విధానంపై ట్రంప్తో ఏకీభవించానని ఉద్ఘాటించారు. ఈ నూతన విధానం రాబోయే మూడేళ్లు, ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని, దీనిని ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం కూడా స్వాగతించాలని చెప్పారు. చైనా–అమెరికా సంబంధాల్లో తైవాన్ సమస్య అత్యంత ముఖ్యమైన అంశంగా మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరత్వం నెలకొంటుందని.. లేనిపక్షంలో సంఘర్షణలను ఎదుర్కోవాల్సి రావొచ్చని, ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని జిన్పింగ్ వెల్లడించారు. అందుకే తైవాన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు సూచించారు. ఇది చరిత్రాత్మక సంవత్సరం ట్రంప్, జిన్పింగ్ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా నిరోధించడం వంటి వాటిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరాన్కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు అందకూడదని ఇరువురు నేతలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనాలో అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్ను విస్తరించడం, యూఎస్ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా ఇరువురు చర్చించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల(ఫెంటానిల్) ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదే సమయంలో చైనాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని ట్రంప్, జిన్పింగ్ నొక్కిచెప్పారు. హార్మూజ్ స్వేచ్ఛాయుత నౌకాయానానికి అవకాశం ఉండాలని పేర్కొన్నారు. జలసంధి సైనికీకరణకు, వినియోగానికి సుంకం విధించే ఏ ప్రయత్నానికైనా చైనా వ్యతిరేకమని జిన్పింగ్ స్పష్టంచేశారు. భవిష్యత్తులో హార్మూజ్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేయడానికి ఆయన ఆసక్తి వ్యక్తంచేశారు. 2026 సంవత్సరం చైనా–అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చరిత్రాత్మక సంవత్సరం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ట్రంప్ అన్నారు. చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, జిన్పింగ్ బీజింగ్ సిటీలోని ప్రఖ్యాత టెంపుల్ ఆఫ్ హెవెన్ను సందర్శించారు. ట్రంప్ గౌరవార్థం జిన్పింగ్ విందు చైనా పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం జిన్పింగ్ ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడుతూ.. చైనా, అమెరికాలు సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని చెప్పారు. సంబంధాలను విజయవంతం చేయాలి, ఎప్పటికీ చెడగొట్టకూడదని అన్నారు. పరస్పర సహకారం వల్ల రెండు దేశాలూ లాభపడతాయని, ఘర్షణ వల్ల నష్టపోతాయని వ్యాఖ్యానించారు. మన రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పని చేయాలన్నారు. అమెరికా–చైనా సంబంధం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధమని ట్రంప్ ఉద్ఘాటించారు. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వివరించారు. జిన్పింగ్ను చాలా గొప్ప నాయకుడిగా ట్రంప్ అభివరి్ణంచారు. ఇదిలా ఉండగా, ఒక అమెరికా అధ్యక్షుడు చైనాను సందర్శించడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2017లో అప్పడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ చైనాలో పర్యటించారు. -
హార్మూజ్ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్ను దాటగా ఎన్వీ సన్షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.మిస్సౌరీకి చెందిన సెనేటర్ ఎరిక్ ష్మిత్, ఎక్స్ (X) వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా కార్యక్రమాలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే “గ్లోబల్ వీసా కార్టెల్”గా మారిందని పేర్కొన్నారు.“అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సబ్సిడీలతో బిలియన్ల డాలర్లు ఇప్పుడు భారతదేశానికి ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్లకు కాకుండా విదేశీ కార్మికుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి” అని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. తన వాదనకు ఉదాహరణగా చిలుకూర్ బాలాజీ ఆలయ చిత్రాన్ని షేర్ చేసిన ష్మిత్, దీనిని “వీసా టెంపుల్”గా అభివర్ణించారు. అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పాస్పోర్ట్లకు ఆశీర్వాదాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.“హైదరాబాద్లో ‘వీసా కార్టెల్’కు సొంతంగా ఒక వీసా దేవాలయం కూడా ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.ఇక విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ష్మిత్ ఆరోపించారు. “వారు తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే, భారీ విద్యారుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని, పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మళ్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. “మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుంది” అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్లోని చిలుకూర్ బాలాజీ ఆలయం ఎన్నో ఏళ్లుగా “వీసా దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.కాగా, అమెరికా హెచ్-1బీ వీసా ఆమోదాల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుండగా, చైనా వాటా సుమారు 12 శాతంగా ఉంది.The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
కువైట్లో విషాదం: భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి
కువైట్: కువైట్లో నివసిస్తున్న ఒక భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. అబ్బాసియా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతురాలిని కేరళలోని ఎర్నాకులం జిల్లా, పెరుంబావూర్ సమీపంలోని చిరక్కర ముట్టం ప్రాంతానికి చెందిన ఫేబా బిజు మణి (14)గా గుర్తించారు. ఆమె అబ్బాసియాలోని 'యునైటెడ్ ఇండియన్ స్కూల్'లో 9వ తరగతి చదువుతోంది. అబ్బాసియా హైవే మార్కెట్ సమీపంలో ఉన్న ఒక నివాస భవనం పైనుంచి ఆమె కింద పడిపోయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు మృతదేహాన్ని తదుపరి న్యాయ, వైద్య ప్రక్రియల నిమిత్తం ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విద్యార్థిని మృతితో స్థానిక భారతీయ సమాజంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
సౌదీలో 7,200 వర్క్ వీసాలు రద్దు
జెడ్డా: సౌదీ అరేబియాలో నకిలీ “సౌదీకరణ” (fake saudization)కు పాల్పడుతున్న సంస్థలపై కేంద్ర మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 7,200కు పైగా వర్క్ వీసా ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో, సంబంధిత ప్రైవేట్ సంస్థలకు జారీ చేసిన 7,200కు పైగా వర్క్ వీసాలను అధికారులు రద్దు చేశారు. అదనంగా, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై మంత్రిత్వ శాఖ సేవలపై తాత్కాలిక నిషేధం కూడా విధించారు.స్మార్ట్ నిఘా వ్యవస్థల సహాయంతో మొత్తం 91 వేల అనుమానిత కేసులను పరిశీలించగా, అందులో 13,509 నకిలీ సౌదీకరణ కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని సంస్థలు సౌదీ పౌరులను కేవలం పేరుకే ఉద్యోగాల్లో చూపించి “నితాఖత్” పథకం ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో మోసపూరితంగా నమోదు చేసిన ఉద్యోగులను నితాఖత్ జాబితా నుంచి తొలగించి, వారికి నిజమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మానవ వనరుల అభివృద్ధి నిధికి బదిలీ చేశారు.మొదటి త్రైమాసికంలో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సుమారు 2.5 లక్షల సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 1.68 లక్షల కార్మిక నిబంధనల ఉల్లంఘనలు గుర్తించాయి. సంస్థలు తమ హోదాను సరిచేసుకోవాలని ఆదేశిస్తూ 2.30 లక్షల సంస్థలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.ఇక రిక్రూట్మెంట్ కార్యాలయాలపై నిర్వహించిన తనిఖీల్లో 3,522 ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. గృహ కార్మికుల సేవలను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసినందుకు 238 సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు తీసుకున్నారు.అదేవిధంగా, అనుమానిత మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 54 వేల కేసులను మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన 15,563 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. -
ఈజిప్టు తీరంలో విషాదం.. కొట్టుకొచ్చిన 12 మంది మృతదేహాలు
కైరో: ఈజిప్టు వాయువ్య మధ్యధరా తీరంలో విషాదం వెలుగు చూసింది. సిడి బరానీ నగర సమీపంలోని అబు గలీలా బీచ్లో 12 మంది అనుమానిత అక్రమ వలసదారుల మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.స్థానిక సమాచారం ప్రకారం.. సముద్రపు అలల తాకిడికి మృతదేహాలతో పాటు ఒక చెక్క పడవకు సంబంధించిన శిథిలాలు కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన పడవ ద్వారా వీరు ప్రయాణిస్తూ ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.సమాచారం అందిన వెంటనే మాట్రౌహ్ అంబులెన్స్ అథారిటీ రంగంలోకి దిగింది. మార్సా మాట్రౌహ్ నగరం నుండి పశ్చిమాన సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి అత్యవసర వాహనాలను పంపారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలను పోస్ట్మార్టం, తదుపరి ప్రక్రియ కోసం మాత్రౌహ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.లభ్యమైన మృతదేహాలన్నీ బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీనివల్ల బాధితుల వయస్సును, వారి వివరాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. మృతదేహాలు గుర్తించలేనంతగా పాడైపోవడంతో, బాధితులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. సముద్రంలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందన్న ఆందోళనతో తీరప్రాంతం వెంబడి అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.మధ్యధరా సముద్రం గుండా ఐరోపా దేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో అక్రమ వలసదారులు తరచూ ఇలాంటి ప్రమాదాల బారిన పడుతుండటం విషాదకరం. -
యూకే ఆరోగ్య మంత్రి రాజీనామా
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్పై మంత్రుల తిరుగుబాటు కొనసాగుతోంది. ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పలువురు ఉప మంత్రులు వైదొలిగారు. తాజాగా, ఆయన కేబినెట్లోని ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ రాజీనామా చేశారు. స్టార్మర్పై తిరుగుబాటు ప్రకటించిన మొదటి సీనియర్ మంత్రి స్ట్రీటింగ్ కావడం గమనార్హం. ‘ప్రపంచ వేదికపై మీరు ధైర్యాన్ని, రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ పాల్గొనకుండా చేయడంలో మీ పాత్ర కీలకం. కానీ, మనకు ఒక స్పష్టమైన దూరదృష్టి, సరైన దిశానిర్దేశం లేకుండాపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు లేబర్ పార్టీని నడిపించలేరనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. అందుకే వైదొలుగుతున్నాను’అని రాజీనామా లేఖలో స్ట్రీటింగ్ పేర్కొన్నారు. ప్రధాని పీఠంపై ఎప్పటినుంచో కన్నేసిన వెస్ స్ట్రీటింగ్.. స్టార్మర్ నాయకత్వాన్ని సవాల్ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. అదేవిధంగా, మాజీ ఉపప్రధాని అంజెలా రేనార్ కూడా ప్రధాని రేసులో ఉంటానని ప్రకటించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై రాజీనామా చేసిన అంజెలా అభియోగాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ప్రధాని పదవి కోసం అవసరమైతే స్ట్రీటింగ్తోనూ పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. వీరిద్దరితోపాటు గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హమ్ కూడా స్టార్మర్కు గట్టి పోటీదారుగా మారే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఆయన ముందుగా పార్లమెంట్కు ఎన్నికవ్వాల్సి ఉంది. అందుకుగాను ఒక సభ్యుడు రాజీనామా చేస్తే ప్రత్యేకంగా ఎన్నిక జరిపి ఆండీని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. గత వారం స్థానిక ఎన్నికలకు జరిగిన అధికార లేబర్ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించినప్పటి నుంచి ప్రధాని స్టార్మర్పై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. అయితే, వైదొలిగేది లేదంటూ గురువారం ఆయన మరోసారి ప్రకటించడం గమనార్హం. లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం..ప్ర«దానమంత్రికి ప్రధాన పోటీ దారుగా నిలవాలనుకునే నేత కామన్స్ సభలోని 403 మందికిగాను కనీసం 81 మంది మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. గతంలో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉండగా, ప్రధానిని గద్దె దించిన సందర్భాలున్నప్పటికీ, లేబర్ పార్టీ అటువంటి పరిస్థితి రావడం చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్లో రికార్డు స్థాయిలో 400కు పైగా ఎంపీలను గెల్చుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే స్టార్మర్ పదవి కోల్పోవాల్సి వస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. -
పశ్చిమాసియా శాంతి.. అందని ద్రాక్ష కానివ్వం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో గురువారం మొదలైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సదస్సులో పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇకనైనా హార్మూజ్ జలసంధి తెరచుకునేలా, సముద్రమార్గంలో సరకుల రవాణా సవ్యంగా జరిగి ముడిచమురు, నిత్యావసరాల ధరలు దిగొచ్చేలా ప్రపంచదేశాలు సమష్టి నిర్ణయాలు తీసుకుని పశ్చిమాసియా యుద్ధమేఘాలను చెల్లాచెదురుచేయాలని భారత్ ఆశాభావం వ్యక్తంచేసింది. అగ్రరాజ్యాల అసంబద్ధ ఆంక్షల కత్తిని తొలగించేలా ఉమ్మడి పోరాటం చేయాలని బ్రిక్స్ దేశాలకు భారత్ పిలుపిచ్చింది. రెండ్రోజులపాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో తొలిరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించారు. ఇరాన్పై దాడికి తెగబడిన అమెరికానుద్దేశించి జైశంకర్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తోటి దేశాలు గౌరవించాలని హితవు పలికారు. ‘‘శాంతి అనేది కలగా మిగిలిపోనివ్వం. అంతర్జాతీయ చట్టాల ఉనికి శాంతే కీలకం. ప్రజలను కాపాడాన్నా, మౌలిక వసతుల పరిరక్షించాలన్నా శాంతి వెల్లివిరియాలి. సంఘర్షణలకు సంప్రతింపులు, దౌత్యమే అత్యుత్తమ మార్గం. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో సముద్రమార్గంలో సరకు రవాణా కష్టమైంది. ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హార్మూజ్ తెరచుకోవాలి. ఎర్రసముద్రం గుండా రవాణా కొనసాగాలి. ఇక గాజాలో మానవతా సాయం ఊపందుకోవాలి. శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సాయం పెంపు, విశ్వసనీయ మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని సాధించం అనేవి ఎంతో కీలకం. పాలస్తీనియన్ల భవిష్యత్తు దృష్ట్యా రెండు దేశాల విధానానికి భారత్ ఓటేస్తోంది’’అని జైశంకర్ అన్నారు. గురువారం బ్రిక్స్ సెషన్స్లో ఒక దాంట్లో చర్చవేళ యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జోక్యంచేసుకోవడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, యూఏఈ విదేశాంగ మంత్రి ఖలీఫా షాహీన్ అల్ మరార్లు శాంతించారని తెలుస్తోంది. ఈ సెషన్లో బ్రెజిల్ విదేశాంగ మంత్రి మారో వియేరా, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియానో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా తదితరులు పాల్గొన్నారు. తమదేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంపై యూఏఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విస్తరణవాదానికి మేం బలయ్యాం ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడారు. ‘‘యుద్దకాంక్షతో రగిలిపోతున్న దేశాల అక్రమ రాజ్యవిస్తరణవాదానికి మేం బలైపోతున్నాం. నేటి సమాజంలో ఇలాంటి ధోరణులకు చోటివ్వకూడదు. హేయమైన దాడులు జరుగుతున్నా ఇరాన్ ప్రజలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ మాపై యుద్ధానికి కాలు దువ్విన అమెరికా, ఇజ్రాయెల్ను బ్రిక్స్ సభ్యదేశాలు తప్పుబట్టాల్సిందే’’అని అరాఘ్చీ డిమాండ్చేశారు. -
భారత నౌకపై దాడి: ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా మునిగిపోయినప్పటికీ, అందులోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.సోమాలియా నుండి బయలుదేరిన ఈ నౌక బుధవారం ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా దాడికి గురైంది. దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగి, చివరకు అది సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి, సిబ్బందిని రక్షించి 'దిబా' నౌకాశ్రయానికి తరలించారు.భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంఈ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడం "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేసింది. "భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాణిజ్య నౌకల స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం వంటి చర్యలను భారత్ సహించదు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.యూఏఈ సంఘీభావంఈ ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర నావిగేషన్కు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించిందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నౌకల భద్రత కోసం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ ప్రకటించింది.ఆందోళన కలిగిస్తున్న ప్రాంతీయ పరిస్థితులుఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి భారత నౌకలపై దాడి జరగడం ఇది మూడవసారి. హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఈ తాజా దాడి చోటుచేసుకోవడం గమనార్హం. వాణిజ్య మార్గాలను ఆర్థిక బ్లాక్మెయిల్ కోసం వాడుకోవడం పైరసీ చర్యలతో సమానమని, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.UAE Strongly Condemns Terrorist Attack on Indian-Flagged Ship off the Coast of Oman pic.twitter.com/gRArK2tniB— MoFA وزارة الخارجية (@mofauae) May 14, 2026 -
భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!
ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త ఎరిక్ రిచిన్స్ను విషమిచ్చి హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని ఆధారాలు ఆర్థిక కారణాల ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం. అసలు కేసు ఏంటి?2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా, 2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఎరిక్ రిచిన్స్ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే తరహా ఆరోపణలతో విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్మీదే పెళ్లికోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్విచ్లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని, కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ, మామూలే అనుకొని నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.నేను నిర్దోషినిఅయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను చేయని నేరానికి నిందించవద్దని, తన ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. స్వయంగా రైటర్ అయిన కౌరీ భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. -
పిల్లాడు కదా అని ఆఫీసుకి తీసుకెళ్తే, కొంప ముంచేశాడు!
చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాన్ని వెల్లడించలేదు.నెటిజన్ల స్పందనలుఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో బాగా గారాబం ఎక్కువై ఉంటుంది అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. -
ఉగాండా గతి మార్చిన భారత్
అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.గణాంకాలు ఇలా..1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.1972లో 740 మిలియన్ షిల్లింగ్లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.ముసెవెని పిలుపుతో మారిన దశ1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణతిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.సుధీర్ రుపారేలియాబహిష్కరణ సమయంలో లండన్కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.మధ్వానీ గ్రూప్గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.మెహతా, ముక్వానో గ్రూప్స్మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎంతో ఎదిగింది.భారత్ - ఉగాండా సంబంధాలుప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య -
"అదే జరిగితే చైనా-అమెరికా మధ్య యుద్ధం"
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తైవాన్ విషయంలో గనుక అమెరికా తలదూర్చితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని జన్పింగ్ ట్రంప్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీజింగ్ మీడియా కథనాలు పేర్కొన్నాయిప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఆయన చైనా బయిలుదేరారు. ఈ రోజు ఇరువురు అగ్రనేతల మధ్య భేటీ జరిగింది. అయితే తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి జిన్పింగ్ నేరుగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.జిన్పింగ్, ట్రంప్తో మాట్లాడుతూ.. స్వయంప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య "ఘర్షణ" తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా-అమెరికా సంబంధాల కంటే తైవాన్ అంశం చైనాకు అత్యంత కీలకమైనదని జిన్పింగ్ ట్రంప్తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. చైనా,అమెరికా పోటీదారులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని పరస్పర సహకారం రెండు దేశాలకు ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా తైవాన్ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. కాగా దీనిని చైనా తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో తొలిరోజు భేటీలోనే జిన్పింగ్ చైనా విధానాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. -
ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..!
ఒత్తిడి లేకుండా హాయిగా వందేళ్లు బతికేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే కోటీశ్వరుడే కానక్కర్లేదు. ఉరుకులు పరుగులతో రోజును గడపనక్కర్లేదు. చేయాల్సిందల్లా ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే. ఇది ఇంత సులువా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అలా బతకడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే దాన్నో జీవన విధానంగా మార్చుకోవచ్చు. దాన్ని నిరూపించి చూపిస్తున్నారు ఇకారియా ద్వీప ప్రజలు. అదెలాగో చూద్దాం.గ్రీస్లోని ఇకారియా ద్వీపం ప్రపంచంలోని ఐదు ’బ్లూ జోన్లలో ఒకటి. అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకుపైగా జీవిస్తారు. వారి సుదీర్ఘ ఆయుష్షు వెనకున్న రహస్యం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి విలక్షణమైన జీవనశైలి. వారి మంత్రం ‘నిదానమే ప్రధానం’.నిదానమైన జీవనశైలిఇకారియా ప్రజలకు ‘సమయం’ విషయంలో అస్సలు టెన్షన్ ఉండదు. వారు ఉదయం అలారం పెట్టుకొని పరుగు పరుగున లేవరు. నిద్ర లేవగానే నిదానంగా కాఫీ తాగుతూ కుటుంబంతో గడుపుతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా తమ ఇష్టానుసారం షాపులు తెరుస్తారు. కస్టమర్లు కూడా గంటల తరబడి వేచి ఉండటానికి ఇబ్బంది పడరు. ఈ ధోరణి వల్ల వారిలో గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) చాలా తక్కువగాఉంటోందని తేలింది.మధ్యాహ్న నిద్ర ఇకారియాలోమధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం ఒక అలవాటు. ప్రతిరోజూ మధ్యాహ్నంకనీసం 30 నిమిషాలనిద్ర వల్ల గుండె జబ్బుల ప్రమాదం 37% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతోంది.ఆహార రహస్యాలుఇకారియావాసులు తినే ఆహారం పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటారు. వారు ప్రతిరోజూ రోజ్మేరీ, సేజ్, పుదీనాతో చేసిన టీ తాగుతారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి రక్తపోటును తగ్గిస్తాయి. రెడ్ మీట్ చాలా అరుదుగా తీసుకుంటారు. చక్కెర వాడకంచాలా తక్కువ.శారీరక శ్రమ ఇకారియా ప్రజలు జిమ్కు వెళ్లి బరువులు ఎత్తరు. కానీ రోజంతా కదులుతూనే ఉంటారు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కాబట్టి పక్కింటికి వెళ్లాలన్నా మెట్లు ఎక్కాలి. తోట పని చేయడం, నడవడం వారి దైనందిన జీవితంలో భాగం. ఈ సహజమైన శ్రమ వారిని 90 ఏళ్లలో కూడా దృఢంగా ఉంచుతోంది.సామాజిక అనుబంధాలు ఇకారియాలో ఎవరూ ఒంటరిగా ఉండరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి నవ్వుతూ చిన్నచిన్న పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. వారిలో ఒంటరితనం అనే మాటే వినిపించదు. ఈ సామాజిక మద్దతు మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతోంది.మరి మనం ఏం చేద్దాం?హడావుడి పడకుండా నిదానంగా పనులు చేయడం, ఆస్వాదిస్తూ పనుల్లో మునిగిపోవడం, ప్రకృతితో గడపడం, అవకాశం దొరికినప్పుడు తోటపని లేదాచిన్ననడక అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సహజ సిద్ధమైనఆహారం, పానీయాలు తీసుకోవడం, మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం, కాసేపు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం, స్నేహితులను పెంచుకొని వారితో కొన్ని గంటలు సరదాగా గడపడం చేస్తే చాలు..మనమూ దీర్ఘాయుష్షుతో జీవించగలం. సాక్షి స్పెషల్ డెస్క్(చదవండి: రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..) -
మీరు గొప్ప వ్యక్తి.. బంగారు భవిష్యత్తు నిర్మిద్దాం: ట్రంప్
తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశంలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చైనా ఘన స్వాగతం పలికింది. రెడ్కార్పెట్ పరిచి సైనిక గౌరవ వందనం సమర్పించింది. అనంతరం గ్రేట్ హాల్ పీపుల్ వద్ద ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కరచలనం చేశారు. ఈ ఇద్దరూ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపై మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు గొప్ప వ్యక్తి. మీకు స్నేహితుడిని కావడం.. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మనం కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించబోతున్నాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే తనతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపార నాయకులను చూపిస్తూ.. “మీకు గౌరవం తెలిపేందుకు మాత్రమే అత్యుత్తమ వ్యక్తులు ఇక్కడికి తరలి వచ్చారు” అని ట్రంప్ జిన్పింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మనవి కామన్ ఇంట్రెస్టులు.. స్వల్ప విబేధాలు. ఇప్పటిదాకా.. సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను సంప్రదించేవారు, నేను మిమ్మల్ని సంప్రదించేవాడిని. చాలా త్వరగా పరిష్కారం కనుగొనగలిగాం. ఇక నుంచి మనం రైవల్స్గా ఉండకూదు అంటూ ట్రంప్ జిన్పింగ్ను ఆకాశానికెత్తారు. చైనా-అమెరికా ద్వైపాక్షిక చర్చల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. మన మధ్య జరగబోయే సమావేశం ఎంతో గొప్పది. ప్రపంచంలోని బెస్ట్ బిజినెస్ లీడర్స్ను తీసుకొచ్చా. రండి.. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అని ట్రంప్ ఉద్ఘాటించారు."It's an honor to be with you, it's an honor to be your friend, and the relationship between China and the USA is going to be better than ever before." - President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/WZkoGeVqhv— The White House (@WhiteHouse) May 14, 2026అనంతరం.. జీ జిన్పింగ్ మాట్లాడుతూ.. ‘‘ట్రంప్నకు, అమెరికన్లను ముందస్తుగా 250 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉంది. పాత ట్రాప్స్నుంచి బయటకు వద్దాం. ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కొందాం. ఇరాన్పై ఒత్తిడి పెంచి.. హర్ముజ్ తెరిపిస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా పర్యటనలో ట్రంప్తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్తో సహా 16 మంది సీఈవోలు వెళ్లారు. నేడు, రేపు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించినప్పటికీ, టారిఫ్స్, టెక్నాలజీ, ట్రేడ్తో పాటుగా తైవాన్పై అమెరికా వైఖరి, ఇరాన్ యుద్ధం వంటి అంశాలపైనా చర్చలు జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు!
సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లాలంటే బైకో, కారో లేదా మెట్రో రైలో ఎక్కుతారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువైతేనే విసిగిపోతుంటారు. కానీ, ఈ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఏకంగా ఒక నగరం నుండి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ‘సూపర్ కమ్యూటర్’గా వార్తల్లో నిలిచారు. గూగుల్ సంస్థలో ‘ఫ్లో-AI’ (ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్) విభాగంలో పనిచేస్తున్న హాంగ్ (జాసన్) వై, తన వినూత్న జీవనశైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ప్రేమ కోసం సాహసోపేత నిర్ణయంఈ కఠినమైన ప్రయాణాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరాలని ఆశపడ్డారు. అయితే, ఆయన జీవిత భాగస్వామి సీటెల్లోని అమెజాన్ కార్యాలయంలో మంచి కెరీర్ వృద్ధిలో ఉన్నారు. "ఆమె కెరీర్ను దెబ్బతీయకుండా, నా వృద్ధిని కొనసాగిస్తూనే మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ ‘ఫ్లైట్ కమ్యూటింగ్’" అని వై పేర్కొన్నారు.షెడ్యూల్, ఖర్చుల లెక్కలు ఇలా..ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సంపాదించే మొత్తాన్ని ఈయన తన ప్రయాణాల కోసం నెలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ నుండి శాన్ జోస్ (కాలిఫోర్నియా)కు విమాన ప్రయాణం. తిరిగి గురువారం లేదా శుక్రవారం మళ్లీ సీటెల్ పయనం. ఇదీ వై షెడ్యూల్.రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు సుమారు 3,000 డాలర్లు (సుమారు రూ.2.8 లక్షలు) ఖర్చు అవుతోంది. "సౌకర్యం కంటే ఎదుగుదలను ఎంచుకోవాలి" అనే సిద్ధాంతాన్ని వై నమ్ముతారు. 16 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా నుండి అమెరికాకు వలస వచ్చిన ఆయనకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.బిజీ లైఫ్.. అయినా సైడ్ హజిల్!ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ, వై తన సృజనాత్మకతను వదులుకోలేదు. గూగుల్లో AI ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో సుమారు 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక పర్సనల్ న్యూస్లెటర్ కూడా నడుపుతున్నారు. "కాగితం మీద చూస్తే ఇది అర్థం లేని నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రయాణం వల్ల నేను పొందుతున్న వృద్ధి, అనుభవం.. నేను పెట్టే ఖర్చు కంటే చాలా విలువైనవి" అని వై ధీమాగా చెబుతున్నారు. నేటి తరం యువత కెరీర్, రిలేషన్ షిప్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనడానికి జాసన్ వై ఒక నిదర్శనం. -
దుబాయ్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
దుబాయ్: ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. సెలవులు మే 25న ప్రారంభమై మే 29 వరకు కొనసాగనున్నాయి. మే 30, 31 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో కార్యాలయాలు జూన్ 1నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.అయితే, షిఫ్ట్ విధానంలో పనిచేసే సంస్థలు, అలాగే కస్టమర్ సేవలు, ప్రజా సేవా సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే విభాగాలు తమ కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా పని వేళలను నిర్ణయించుకోవచ్చని డీజీహెచ్ఆర్ స్పష్టం చేసింది. సెలవు కాలంలో ప్రజలకు సేవలు అంతరాయం లేకుండా కొనసాగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించింది.ఈ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ పవిత్ర పర్వదినం అందరికీ శాంతి, సుభిక్షం, ఆనందం, ఆశీర్వాదాలను తీసుకురావాలని ఆకాంక్షించింది.ఇదిలా ఉండగా, ధు అల్ హిజ్జా నెల చంద్రవంక దర్శనానికి సంబంధించి దుబాయ్ అధికారులు 2026 మే 17న ప్రత్యేక బహిరంగ చంద్ర వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, అలాగే అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపిన వివరాల ప్రకారం, ధు అల్ హిజ్జా అమావాస్య 2026 మే 17 ఆదివారం యూఏఈ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు సంభవించనుంది.ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్ హిజ్జా 10వ రోజున ఈద్ అల్ అధా జరుపుకుంటారు. అరాఫా మే 26 మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈద్ అల్ అధా పర్వదినం మే 27 బుధవారం ఉదయం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని రహస్య పర్యటన
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత రహస్యంగా పర్యటించారు. 'ఆపరేషన్ లయన్స్ రోర్' కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఈ పర్యటన చేపట్టారని, అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారని నెతన్యాహు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.ఇరాన్తో యుద్ధం జరుగుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ తన 'ఐరన్ డోమ్' గగనతల రక్షణ వ్యవస్థలను, సంబంధిత సిబ్బందిని యూఏఈకి పంపినట్లు ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి మైక్ హకాబీ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే నెతన్యాహు పర్యటన వార్త బయటకు రావడం గమనార్హం.హకాబీ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు కార్యాలయం నేరుగా ధృవీకరించనప్పటికీ, ఈ పర్యటన ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలలో ఒక "చారిత్రక పురోగతి" అని పేర్కొంది.ఫిబ్రవరి చివరలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో, ఇరాన్ ఇతర అరబ్ దేశాల కంటే యూఏఈనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంది. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరాన్ నుండి నిరంతరం క్షిపణి, డ్రోన్ దాడులు ఎదురవుతున్నట్లు యూఏఈ వెల్లడించింది.2020లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన 'అబ్రహం ఒప్పందాల' తర్వాత, ఇజ్రాయెల్తో అధికారిక దౌత్య సంబంధాలు కలిగి ఉన్న అరబ్ దేశాలలో చమురు సంపన్న దేశమైన యూఏఈ అత్యంత కీలకమైన మిత్రదేశంగా ఎదిగింది.ఈ రహస్య భేటీ మధ్య ప్రాచ్యంలో మారుతున్న రాజకీయ, రక్షణ సమీకరణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
యూఏఈ లాటరీ: ఇద్దరికే అదృష్టం
దుబాయ్: యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ (డ్రా నెం. 260513) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ డ్రాలో పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకోగా, అత్యంత భారీ బహుమతి అయిన 30 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ను మాత్రం ఎవరూ దక్కించుకోలేకపోయారు.'డేస్' విభాగంలోని ఐదు సంఖ్యలను, 'నెల' విభాగంలోని సంఖ్యతో సరిపోల్చిన ఇద్దరు వ్యక్తులు తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి 1,00,000 దిర్హమ్లు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) లభించాయి. డ్రా నెం. 260513 సమయంలో, డేస్ విభాగం నుండి 9, 25, 2, 16, 23, 5, నెల విభాగంలో 7 విన్నింగ్ సంఖ్యలుగా వచ్చాయి.ఇక గ్యారెంటీడ్ ప్రైజ్ కేటగిరీ కింద ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్కరు 50,000 దిర్హమ్లను సొంతం చేసుకున్నారు. వారి లక్కీ ఛాన్స్ ఐడీలు BE2946839, AT1839187, AY2300136.మరోసారి జాక్పాట్ రోల్ఓవర్ఈ వారంలోనూ 30 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్తో పాటు, 5 మిలియన్ దిర్హమ్ల రెండో బహుమతిని కూడా ఎవరూ గెలుచుకోలేదు. దీంతో ఈ రెండు భారీ బహుమతి మొత్తాలు తదుపరి డ్రాకు బదిలీ (Rollover) అయ్యాయి.తదుపరి డ్రా ఎప్పుడంటే?యూఏఈ లాటరీ తదుపరి డ్రా మే 16, శనివారం జరగనుంది. వారానికి రెండుసార్లు జరిగే ఈ డ్రాలో పాల్గొనే వారికి కోట్లాది రూపాయల బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
భారత్కు చమురు సంక్షోభం తలెత్తనివ్వం.. రష్యా కీలక ప్రకటన
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. భారత్కు రష్యా నుండి సరఫరా అవుతున్న చమురులో ఏటువంటి ఆటంకం రానివ్వమన్నారు. తమ మిత్రదేశమైన భారత ఇంధన ప్రయోజనాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యంత శక్తివంతమైన నాయకులలో భారత ప్రధాని మోదీ ఒకరని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు విషయంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్తో ఒప్పందం చేసుకున్న విధంగా రష్యా చమురు అందిస్తుందని తెలిపారు.ఇంధన సరఫరా విషయంలో భారత్తో పాటు వేరే ఏదేశానికి ఇచ్చిన హామీని రష్యా ఎన్నడూ తప్పలేదన్నారు.కుడంకుళంలో నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రం భారత్ విద్యుత్ అవసరాలను గణనీయంగా తీరుస్తుందన్నారు. భారత-రష్యా మధ్య సంబంధాలు ఎంతో స్నేహపూర్వకమైనవని ఈ మైత్రి తరతరాలదన్నారు. హిందీ-రుసీ భాయ్-భాయ్ (భారతీయులు- రష్యన్లు సోదరులు) అనే నినాదం సరదాది కాదని అది ఇరు దేశాల సంస్కృతిలో భాగమైందన్నారు. -
అమెరికాలో సూది చీమల కలకలం.. ఎందుకంత డేంజర్?
అమెరికాలో ఆసియా నీడిల్ యాంట్ కలకలం రేపుతోంది. అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా 20కి పైగా రాష్ట్రాల్లో ఈ చీమలు వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా, జపాన్, కొరియా దేశాలకు చెందిన నీడిల్ యాంట్ దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణ చీమలు మాదిరిగా పెద్ద పెద్ద పుట్టలను నిర్మించుకోలేవు. వరుసగా కూడా ప్రయాణించవు.. దీంతో వీటిని గుర్తించడం కష్టం. ఇవి సాధారణంగా ఇళ్ల దగ్గర ఉండే చెక్కలు, రాళ్లు, ఆకులు, తోట సామాగ్రి కింద దాక్కుంటాయి.ఆసియా నీడిల్ యాంట్ అంటే..ఇవి లేత నారింజ-గోధుమ రంగు కాళ్లు, యాంటెన్నాల చివరలు కలిగిన ఒక చిన్న ముదురు గోధుమ, నలుపు రంగు చీమలు. కూలీ చీమలు సాధారణంగా సుమారు 0.2 అంగుళాల పొడవు ఉంటాయి. అవి చిన్నవిగా ఉన్నప్పటికీ.. వాటి కాటు అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఈ చీమల విషం.. అలెర్జీ ఉన్నవారికి చాలా ప్రమాదకరం.. ఈ చీమలు 1930లలో మొదటిసారిగా అమెరికాలో కనిపించాయని.. ఇప్పుడు ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించాయి.ఈ చీమలు తేమగా, నీడగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. ఇవి సాధారణంగా కంపోస్ట్, కుళ్ళిపోతున్న కలప, రాళ్ళు, పూల కుండీలు, ఆకుల కుప్పల కింద కనిపిస్తాయి. అవి నిశ్శబ్దంగా కదులుతూ, సాధారణంగా ఒంటరిగా ప్రయాణిస్తాయి కాబట్టి, చాలా మంది అవి కుట్టేంత వరకు వాటిని గమనించరు. ఇతర చీమల జాతులతో పోలిస్తే.. వీటిని నియంత్రించడం కష్టతరం.ఎందుకు ప్రమాదకరం?ఆసియా నీడిల్ యాంట్ కుట్టినప్పుడు సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సాధారణంగా కుట్టిన చోట ఎర్రబడటం, వాపు, మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొందరిలో కొద్ది నిమిషాల్లోనే గొంతు వాపు, కళ్లు తిరగడం, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి.తేనెటీగలు, కందిరీగల వల్ల అలర్జీ ఉన్నవారికి దీని వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ చీమల కుట్టు కొందరిలో తీవ్రమైన అలర్జీలు రావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల విపరీతమైన నొప్పి, వాపు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఇది అనాఫిలాక్సిస్ (anaphylaxis) ప్రాణాంతక అలర్జీకి దారితీయవచ్చు. -
చైనాలో అడుగుపెట్టిన ట్రంప్.. ఎవరు స్వాగతం పలికారంటే?
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. ట్రంప్తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పలు సాంకేతిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులు ఉన్నారు. బీజింగ్లోని విమానాశ్రయంలో ట్రంప్నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. చైనా అగ్రనేతల్లో హాన్ ఒకరు.ట్రంప్కు స్వాగతం పలికేందుకు ఆయనను పంపడం ద్వారా అమెరికా అధ్యక్షుడికి చైనా అమిత ప్రాధాన్యం, గౌరవం ఇస్తోందని భావిస్తున్నారు. గతసారి 2017 పర్యటన సమయంలో స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీ అనే తక్కువ స్థాయి నేతను పంపారు. గత ఏడాది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాన్ హాజరయ్యారు. కాగా, విమానాశ్రయ రన్వే నుంచి మోటర్కేడ్లో ట్రంప్ వెళ్లారు. బీజింగ్లో వచ్చే రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం సహా పలు అంశాలపై షీ జిన్పింగ్తో ట్రంప్ చర్చించనున్నారు. ద్వైపాక్షిక చర్చలు, అధికారిక విందులో పాల్గొంటారు. “మేము రెండు మహాశక్తులం. సైనిక బలంలో భూమిపై అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. చైనాను 2వ స్థానంలో భావిస్తారు” అని ట్రంప్ కొన్ని గంటల క్రితం చెప్పారు.బీజింగ్లో జరుగుతున్న ఈ సదస్సు దాదాపు 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో చేస్తున్న తొలి పర్యటనగా నిలిచింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సున్నితమైన వాణిజ్య సంధిని కొనసాగిస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చైనాలో ట్రంప్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో స్వాగత కార్యక్రమం, యునెస్కో వారసత్వ కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన, అధికారిక విందు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
రష్యా అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. కెపాసిటీ తెలిస్తే షాక్..?
మాస్కో: రష్యా తన సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. తన అణ్వాయుధ సంపత్తిని మరింత మెరుగుపరిచే విధంగా నిన్న (మంగళవారం) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించిన కొద్ది రోజులకే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శక్తివంతమైన క్షిపణిని ప్రదర్శించడం విశేషం.ఇది సుమారు 35,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమి చుట్టూ ఉప-కక్ష్యలో ప్రయాణించి, శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించగలదని రష్యా పేర్కొంది. ఇవి పాత సోవియట్ కాలం నాటి 'వొయెవోడా' క్షిపణుల స్థానంలో రానున్నట్లు తెలిపింది. దీనికి అమర్చిన వార్హెడ్లు పశ్చిమ దేశాలకు చెందిన క్షిపణుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని పేర్కొంది. కాగా ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా అణ్వాయుధ క్షిపణులు అవంగార్డ్ ధ్వని కంటే 27 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్.ఒరేష్నిక్ : ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది ఐరోపాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు.పోసిడాన్ : ఇది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్ వాటర్ డ్రోన్. ఇది సముద్రతీరంలో పేలి 'రేడియోధార్మిక సునామీ'ని సృష్టించగలదు.బ్యూరెవెస్ట్నిక్ : అణుశక్తితో పనిచేసే ఈ క్రూయిజ్ క్షిపణికి అపరిమితమైన పరిధి ఉంటుంది.కాగా అమెరికా, మధ్య ఉన్న చివరి అణ్వాయుధ ఒప్పందంఅమెరికా మరియు రష్యాల మధ్య ఉన్న చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్' కాలపరిమితి ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఫిబ్రవరిలో ముగిసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణు దేశాల ఆయుధ సంపత్తిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇది కొత్త అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని నిపుణులు భయపడుతున్నారు.కాగా 2024లో పుతిన్ రష్యా యొక్క అణు సిద్ధాంతాన్ని సవరించారు. దీని ప్రకారం, అణ్వాయుధాలు లేని దేశం (ఉక్రెయిన్ వంటివి) అణ్వాయుధ దేశాల మద్దతుతో రష్యాపై దాడి చేస్తే, దానిని ఆ రెండు దేశాల ఉమ్మడి దాడిగా పరిగణించి రష్యా అణ్వాయుధాలతో స్పందించవచ్చు. -
ట్రంప్ ఈ విషయాల జోలికి రాకండి..!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్కు బయిలుదేరారు. అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్లైన్ అంశాలు చర్చించకూడదని చైనా పేర్కొంది. నాలుగు ప్రధానమైన అంశాలుతైవాన్ అంశం ఇది చైనాకు అత్యంత కీలకం.ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
పండు తెంపితే లక్షల్లో జరిమానా.. జైలుకు!
చెట్టుకు కాసే పండ్లలో ఒకటో, రెండో కోసుకోవడం నేరమా?.. కింద పడిన పండ్లు తీసుకోవడం పాపమా?.. కానీ, అక్కడ ఈ రెండూ చేస్తే లక్షల్లో జరిమానా విధించడమే కాదు.. ఒక లిమిట్ దాటితే జైలుకు కూడా పంపుతారు. ఇదెక్కడి రాజ్యం..? అనుకునేరు. అంతకంటే ముందు ఇదొకసారి చదివేయండి.. పబ్లిక్ ప్లేసుల్లో పెరిగి చెట్ల పండ్లు కోయడమో లేదంటే వాటి కింద గాలికి కిందపడిన కాయల్ని తీసుకోవడమో అక్కడ నేరంగా పరిగణిస్తారు. ఆ నేరానికి మూడున్నర లక్షల నుంచి 12 లక్షల రూపాయల దాకా జరిమానా, జైలు శిక్ష.. ఒక్కోసారి రెండూ విధిస్తారు. నిజంగా అది అంత తీవ్ర నేరమని మీరు భావిస్తున్నారా?.. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా?సింగపూర్.. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ, కఠినమైన చట్టాలకు కేరాఫ్ కంట్రీ. అక్కడి ప్రభుత్వం ప్రజల ప్రవర్తనలో చిన్న విషయాలకే పెద్ద ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలూ ఇబ్బందిగా ఫీలవ్వకుండా ఆ నియమాలను గౌరవిస్తుంటారు. అందుకే అక్కడి వీధులు చెత్తాచెదారం కానరాకుండా అద్దంలా తళతళ మెరిసిపోతుంటాయి. ఈ క్రమశిక్షణ వెనుక ఉన్న కఠినమైన జరిమానాలు, శిక్షలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి.సింగపూర్ ప్రభుత్వం ప్రకృతి సంపదను పబ్లిక్ ప్రాపర్టీగా భావిస్తుంది. అందుకే వాటిని కాపాడటానికి అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక చెట్టు, ఒక పండు కూడా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. అయితే.. ఈ జరిమానాల వెనుక ఉద్దేశ్యం ప్రకృతి సంరక్షణ. చెట్లు, పండ్లు మాత్రమే కాదు పూలు కూడా ఈ సంపదలో భాగమే. వాటిని దోచుకోవడం అంటే.. వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజా ఆస్తిని దోచుకోవడంగా భావిస్తుంది. కాబట్టి చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే నియంత్రించడం కోసం ఈ కఠిన చట్టం తెచ్చింది. పార్క్స్ ట్రీస్ యాక్ట్సింగపూర్లో ప్రకృతి సంరక్షణ కోసం రూపొందించిన చట్టం.. పార్క్స్ అండ్ ట్రీస్ యాక్ట్(Parks and Trees Act). 2005 ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పబ్లిక్ ల్యాండ్, పార్కులు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు, నేచర్ రిజర్వ్లకు ఈ చట్టం వర్తిస్తుంది. పబ్లిక్ ప్లేసుల్లో పెరిగే చెట్ల నుంచి పండ్లు కోయడం లేదంటే కింద పడిన పండ్లు తీసుకోవడం నేరం. ఇందుకుగానూ 5,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.3.5 లక్షలు) జరిమానా పడుతుంది. నేచర్ రిజర్వ్ లేదంటే నేషనల్ పార్క్లో ఈ తప్పు చేస్తే జరిమానా 50,000 సింగపూర్ డాలర్లు (రూ12.5 లక్షలు) వరకు పెరుగుతుంది, అలాగే 6 నెలల జైలుశిక్ష కూడా ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ప్రియాంక సిన్హా అనే భారతీయురాలి పోస్ట్ వైరల్ అయింది. View this post on Instagram A post shared by Priyanka Sinha (@ppriyankasinha)సింగపూర్లో నివసించే వారు ఏ నియమాలనైనా చాలా జాగ్రత్తగా పాటిస్తారు. ఒక పండు తీసుకోవడం వల్లే లక్షల రూపాయల జరిమానా పడుతుందని తెలిసి, ఎవరూ ఆ ప్రయత్నం చేయరు. ఇది ప్రజల్లో భయం ద్వారా క్రమశిక్షణను పెంచుతుంది.ఇలాంటి చట్టాల వల్లే ఆ దేశం ప్రపంచంలో అత్యంత శుభ్రంగా, క్రమశిక్షణతో ఉన్న దేశంగా నిలుస్తోంది. -
అమెరికాలో భారతీయ షెఫ్కు అరుదైన గౌరవం
న్యూయార్క్: భారత్లోని అమృత్సర్ వీధుల నుంచి మొదలైన ఒక సాధారణ యువకుడి ప్రయాణం ఇప్పుడు అమెరికాలోని అత్యున్నత వేదికలపై సగర్వంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాల కమ్మదనాన్ని చాటిచెబుతున్న ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆహారం, కళలు, సంస్కృతికి ఆయన చేసిన విశేష కృషికి గాను న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరుదైన గౌరవంతో సత్కరించింది.అరుదైన గౌరవం.. తొలి భారతీయుడిగా రికార్డుఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏపీఐ)హెరిటేజ్ మంత్ సందర్భంగా న్యూయార్క్ రాజధాని అల్బానీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ కాథీ హోచుల్ ఈ ప్రతిష్టాత్మక ‘స్పెషల్ సైటేషన్’ను వికాస్ ఖన్నాకు అందజేశారు. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఒక భారతీయుడికి ఈ స్థాయి గుర్తింపు దక్కడం ఇదే తొలిసారి. ఈ పురస్కారం కేవలం తన వ్యక్తిగత విజయం కాదని, ఇది భారతీయ గుర్తింపు, ప్రాతినిధ్యం, భిన్నత్వానికి దక్కిన గౌరవంగా ఖన్నా అభివర్ణించారు.అన్నం మాత్రమే కాదు.. ఆత్మగౌరవం కూడామే 9న జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో వికాస్ ఖన్నా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘ఒక భారతీయ షెఫ్ను ఈ వేదికపై నిలబెట్టడం నా ఒక్కడికే కాదు, మన సంస్కృతికి, మన కథలకు దక్కిన గౌరవం’ అని ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. ముఖ్యంగా వలసదారుల గురించి ప్రస్తావిస్తూ, కొత్త దేశంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని జీవితాన్ని నిర్మించుకుంటున్న వారికి న్యూయార్క్ నగరం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రశంసించారు. ఆయనను ‘గ్లోబల్ కలినరీ ఐకాన్’గా అభివర్ణించిన అక్కడి అధికారులు, పాకశాస్త్రంలో ఆయన అద్భుత నైపుణ్యాన్ని కొనియాడారు.టైమ్ మ్యాగజైన్ గుర్తింపు తర్వాత మరో ఘనతఈ అరుదైన పురస్కారం వికాస్ ఖన్నా కీర్తికి మరో మణిమకుటంలా నిలిచింది. గత నెలలోనే, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ ప్రకటించిన ప్రపంచంలోని ‘100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నారు. -
NEET వివాదం: చైనా మోడల్తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
గల్ప్ దేశాల సీక్రెట్ ఆపరేషన్.. ప్లాన్ బీ?
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. తాజాగా గల్ఫ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మద్య రహస్య దాడుల అంశం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆందోళన నెలకొంది. గల్ప్ దేశాలు ఇలా రహస్య దాడులు చేయడంతో ప్రపంచమే షాకైంది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు సమయంలో ఇరాన్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భయంకర దాడులు చేసింది. దీంతో, గల్ప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్పై గల్ప్ దేశాలు ప్రతి దాడులు చేశాయి. అయితే, ఇదంతా రహ్యసంగా జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ గానీ.. ఇరాన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. యూఏఈ కూడా ఇరాన్పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా.. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి, బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. కానీ, ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, కువైట్లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం . ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది.🇸🇦🇮🇷Reuters Exclusive: SAUDI ARABIA secretly launched strikes against IRAN in retaliation for attacksSaudi Arabia carried out multiple airstrikes on Iran in late March in retaliation for missile and drone attacks against the Kingdom, according to Reuters, citing Western and… pic.twitter.com/kVpUuAcgcQ— Global Surveillance (@Globalsurv) May 12, 2026ప్రధాన పరిణామాలు..యూఏఈ దాడులు:ఏప్రిల్ 2026లో ఇరాన్లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రంపై దాడి.ఈ దాడి వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగి, శుద్ధి కేంద్రం తాత్కాలికంగా నిలిచిపోయింది.ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, కువైట్పై 2,800 క్షిపణులు, డ్రోన్ల దాడులు చేసింది.సౌదీ దాడులు:మార్చి చివరలో సౌదీ వైమానిక దళం ఇరాన్పై "tit-for-tat" దాడులు చేసింది.లక్ష్యాలు స్పష్టంగా వెల్లడించకపోయినా, ఇరాన్పై ప్రతీకార చర్యగా ఈ దాడులు జరిగాయి.అనంతరం రియాద్–తెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు జరిగి, ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన కుదిరింది.చైనా పాత్ర.. ఇదిలా ఉండగా.. చైనా గల్ఫ్ దేశాలకు నేరుగా సైనిక అండ ఇవ్వలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం, ఆర్థిక సహకారం, సాంకేతిక మద్దతు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా భద్రత, హార్మూజ్ జలసంధి స్థిరత్వం చైనాకు ప్రధాన ప్రాధాన్యం. చైనా పాత్రను మూడు కోణాల్లో చూడవచ్చు. ఇరాన్కు సాంకేతిక సహాయం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, అమెరికా–చైనా పోటీ ప్రభావం.BREAKING: According to reports, the UAE has launched heavy airstrikes on Iran following Iran’s blockade of the Strait of Hormuz, escalating tensions across West Asia.The Strait of Hormuz remains one of the world’s most critical oil shipping routes, and the latest developments… pic.twitter.com/cHani8lAU8— Diplomat Times (@diplomattimes) May 13, 20261. ఇరాన్కు సాంకేతిక సహాయంచైనా ఇరాన్కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ, మరియు మిసైల్ భాగాలు వంటి ద్వంద్వ వినియోగ సాంకేతికతను అందించింది.ఈ సహాయం ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచి, అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే శక్తిని ఇచ్చింది.అమెరికా దీనిపై ఆంక్షలు విధించి, చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.చైనా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, చమురు దిగుమతుల్లో కీలకం.2. గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలుUAE, సౌదీ అరేబియాతో చైనా మౌలిక వసతులు, ఎనర్జీ ప్రాజెక్టులు, మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ–ఇరాన్ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.యుద్ధ సమయంలో కూడా చైనా గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ, “శాంతి అవసరం” అని మాత్రమే పేర్కొంది.3. అమెరికా–చైనా పోటీ ప్రభావంఅమెరికా గల్ఫ్ ప్రాంతంలో సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఆర్థిక భాగస్వామిగా ఎదుగుతోంది.గల్ఫ్ దేశాలు అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి, చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి.ఇది భారతదేశానికి కూడా వ్యూహాత్మకంగా కీలకం, ఎందుకంటే అమెరికా–చైనా పోటీ మధ్య ప్రాచ్యంలో భౌగోళిక సమీకరణాన్ని మార్చుతోంది.భారత్కు ప్రాధాన్యంఎనర్జీ భద్రత: చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.వాణిజ్య మార్గాలు: హార్మూజ్ జలసంధి స్థిరత్వం భారత వాణిజ్యానికి కీలకం.విదేశాంగ వ్యూహం: అమెరికా–చైనా పోటీ, గల్ఫ్ దేశాల మారుతున్న సంబంధాలు భారత విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయి.ప్రభావం..అమెరికా–చైనా పోటీ: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం, అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించగా, చైనా “ప్రత్యామ్నాయ భాగస్వామి”గా నిలబడే అవకాశం పెరిగింది.గల్ఫ్ దేశాల వ్యూహం: అమెరికా ఆధారపడటం ప్రమాదకరమని భావించి, గల్ఫ్ దేశాలు చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. -
అమెరికా కొలువుల స్కామ్.. భారత్లో మూలాలు?
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) భారీ షాక్ ఇచ్చింది. ఎఫ్-1 (ఎఫ్-1) వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కింద ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 10,000 మంది విద్యార్థులు నకిలీ కంపెనీల ఉచ్చులో ఉన్నట్లు దర్యాప్తులో తేలడం తీవ్ర సంచలనంగా మారింది.ఓపీటీ అక్రమాల పుట్టఐసీఈ డైరెక్టర్ టాడ్ ఎమ్ లియోన్స్ ఈ భారీ స్కామ్ వివరాలను వెల్లడిస్తూ, ఓపీటీ ప్రోగ్రామ్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుష్, ఒబామా హయాంలో కొద్ది మంది కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)ఆధ్వర్యంలో మొదలైన ఈ పథకం.. నేడు లక్షలాది మంది వలస కార్మికులకు అక్రమ దారిగా మారిపోయిందన్నారు. ట్రంప్, బైడెన్ పాలకుల సమయంలో ఈ నకిలీ ఉద్యోగాల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, అస్సలు ఉనికిలోనే లేని కంపెనీల్లో వేలాది విద్యార్థులు పనిచేస్తున్నట్లు కల్పిత ఆధారాలు సృష్టించారని ఆయన తెలిపారు. కేవలం టాప్ 25 ఓపీటీ యాజమాన్యాలను పరిశీలించగా, 10 వేల మంది విద్యార్థులు అనుమానాస్పద కంపెనీల్లో ఉన్నట్లు బయటపడిందని, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని లియోన్స్ అన్నారు. Another great win for our fraud task force. We will not tolerate foreign nationals abusing our visa system at the expense of the American people. https://t.co/smFBgxha3w— JD Vance (@JDVance) May 12, 2026తాళం వేసిన ఆఫీసులు.. గుట్టు రట్టుదర్యాప్తు అధికారులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వందలాది మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారని చెబుతున్న కంపెనీల చిరునామాలకు వెళ్లి చూడగా, అక్కడ కేవలం ఖాళీ భవనాలు, తాళం వేసిన తలుపులు మాత్రమే కనిపించాయి. ఒకే అడ్రస్పై పలు కంపెనీలు రిజిస్టర్ కావడం, ఏ ఒక్కరికీ లీజు అగ్రిమెంట్లు లేకపోవడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా అనుమానాస్పద నగదు లావాదేవీలు జరగడం మొదలైనవి అధికారులను విస్మయానికి గురిచేశాయి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) బృందం టెక్సాస్లో ఇటీవల 18 ఓపీటీ వర్క్సైట్లపై దాడులు చేయగా, ఈ నకిలీ కంపెనీల వెనుక ఉన్న భారీ కుట్ర బట్టబయలైంది. MASSIVE #OPT FRAUD We have identified over 10,000+ foreign students identified with fake jobs. We’re taking it this very seriously. Full video of the @ICEgov director speaking.#F1 #studentvisa pic.twitter.com/8MNysI1apO— M9 USA🇺🇸 (@M9USA_) May 12, 2026తీగ లాగితే ఇండియా డొంకటెక్సాస్ దాడుల్లో బయటపడిన విషయాలు ఈ స్కామ్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక వర్క్సైట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీటీ విద్యార్థులు ఉన్నారని యాజమాన్యం చెప్పగా, రికార్డుల్లో మాత్రం ఏకంగా 500 మంది ఉన్నట్లు తేలింది. అధికారుల ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని అక్కడి సిబ్బంది.. ఇండియాలో ఉన్న తమ హెచ్ఆర్ (హెచ్ఆర్) ప్రతినిధులను అడగాలంటూ దాటవేశారు. ఈ నెట్వర్క్ అంతా వెబ్సైట్లలో ఒకే విధమైన జాబ్ పోస్టింగులు ఇస్తూ, ముఠాగా ఏర్పడి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయింది.ఇది కూడా చదవండి: నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’ -
చైనా పర్యటనకు ట్రంప్.. ఇరాన్పై కొత్త వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ ఇంకా తమ కంట్రోల్నే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్, జిన్పింగ్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరిపేందుకు ట్రంప్ మంగళవారం వైట్హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్పింగ్తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.నాటోపై ట్రంప్ అసంతృప్తిఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.President Donald J. Trump departs Washington D.C. for a historic visit to China! pic.twitter.com/8Qok0Xcqcd— The White House (@WhiteHouse) May 12, 2026చైనా పర్యటనలో ట్రంప్తో మస్క్, టిమ్ కుక్.. బీజింగ్తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.తైవాన్, అమెరికా సంబంధాలపై.. ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. -
కూలిపోయిన అమెరికా ఎయిర్ఫోర్స్ విమానం
పశ్చిమ అలబామాలో మంగళవారం అమెరికా వైమానిక దళానికి చెందిన శిక్షణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని సైనిక అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన టి-38 టాలోన్ 2 శిక్షణా విమానం మిస్సిసిప్పిలోని కొలంబస్ ఎయిర్ ఫోర్స్ బేస్కు చెందినదిగా తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.భద్రతా విచారణ బోర్డు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడుతుందని అధికారులు పేర్కొన్నారు. పైలట్ల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలను కొలంబస్ ఎయిర్ ఫోర్స్ బేస్ పబ్లిక్ అఫైర్స్ కార్యాలయం వెల్లడించలేదు. ఈ స్థావరంలో ప్రధానంగా 14వ ఫ్లయింగ్ ట్రైనింగ్ వింగ్ అధికారులకు వివిధ రకాల విమానాలపై శిక్షణ ఇస్తారు. టి-38 టాలోన్ ఒక సూపర్సోనిక్ జెట్ ట్రైనర్గా ప్రసిద్ధి చెందింది.ఇక మరో ఘటనలో, ఫ్లోరిడా సమీపంలోని బహామాస్ సముద్ర ప్రాంతంలో 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కూలిపోయింది. అయితే విమానంలో ఉన్న అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. బహామాస్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ప్రకారం, విమానం కూలే ముందు అమెరికా కోస్ట్ గార్డ్ సహాయంతో శోధన చర్యలు చేపట్టారు. అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు.శోధన, రక్షణ చర్యల్లో బహామాస్కు చెందిన పలు ఏజెన్సీలతో పాటు అమెరికా కోస్ట్ గార్డ్ కూడా పాల్గొంది. కూలిపోయిన బీచ్క్రాఫ్ట్ 300 కింగ్ ఎయిర్ టర్బోప్రాప్ విమానం కోసం యూఎస్ కోస్ట్ గార్డ్ సి-27 విమానాన్ని వినియోగించింది. రక్షించిన ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. -
పాక్ వైమానిక స్థావరంలో ఇరాన్ యుద్ధ విమానాలు
వాషింగ్టన్: పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య మధ్యవర్తిగా పాకిస్తాన్ ప్రదర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఇరాన్ సైనిక విమానాలను నిలిపి ఉంచడానికి పాకిస్తాన్ తన కీలక వైమానిక స్థావరాల్లో ఒకదానిలో అనుమతించిందని ఓ నివేదిక వెల్లడించింది. రావల్పిండికి కొద్ది దూరంలో ఉన్న నూర్ ఖాన్లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరానికి ఇరాన్ అనేక కీలక రక్షణ ఆస్తులను తరలించిందని పేర్కొంది. అధికారికంగా కాల్పుల విరమణ ప్రయత్నాలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్ తన సైనిక, విమానయాన ఆస్తులను రక్షించుకోవడానికి ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక స్థావరం ఆశ్రయాన్ని కల్పించింది.ఈ సైనిక పరికరాలలో, లాక్హీడ్ సంస్థ తయారు చేసిన సి–130 హెర్క్యులస్ వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన నిఘా, గూఢచార సేకరణ వేరియంట్ అయిన ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సి–130 కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్–అమెరికా సంక్షోభ సమయంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, ఇరాన్కు గానీ, దాని మిత్రదేశం, పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనాను గానీ దూరం చేసుకునే చర్యలకు పాక్ దూరంగా ఉండటాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న వైమానిక, సైనిక ఆస్తులను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ తరలింపునకు కారణమై ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. నివేదికపై తీవ్ర వ్యతిరేకత.. ఈ నివేదిక అమెరికాలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాక్ తటస్థతను అమెరికా చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహిత మిత్రుడు, సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ఎక్స్లో స్పందించారు. ఈ సంక్షోభంలో పాకిస్తాన్ దౌత్య పాత్రను పునఃసమీక్షించాలని పిలుపునిచ్చారు.‘ఈ నివేదిక కచ్చితమైనదైతే, ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్పై పాకిస్తాన్ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను గమనిస్తే, ఇది నిజమైనా నేను ఆశ్చర్యపోను’అని గ్రాహం పేర్కొన్నారు. అయితే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు సంబంధించిన ఆరోపణలను పాకిస్తాన్ సీనియర్ అధికారి ఖండించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఆ బేస్ ఉన్నందున అటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు. కాబూల్లోనూ.. అంతేకాదు, ఇరాన్ పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ విమాన ప్రయాణాల్లో సైనిక విమానాలు ఉన్నాయో, లేదో స్పష్టంగా తెలియదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఘర్షణలు ప్రారంభం కావడానికి కొద్ది ముందే మహాన్ ఎయిర్ విమానం ఒకటి కాబూల్లో దిగిందని, ఇరాన్ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని ఆఫ్ఘన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల తర్వాత కాబూల్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు పెరగడంతో, ఆ విమానాన్ని ఇరాన్ సరిహద్దు సమీపంలోని హెరాత్ విమానాశ్రయానికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిడ్ తోసిపుచ్చారు. -
ఒబామాను అరెస్టు చేయాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పరోక్ష పిలుపునిచ్చారు. 2016 ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై జరిగిన దర్యాప్తును ఒక ‘కుట్ర’గా అభివర్ణిస్తూ, ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టును ట్రంప్ రీ-షేర్ చేశారు.2016లో తన ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీసేందుకు ఒబామా నేతృత్వంలోని యంత్రాంగం కల్పిత ఇంటెలిజెన్స్ సమాచారంతో ‘మోసపూరిత’ దర్యాప్తుకు తెరలేపిందని సదరు పోస్టులో పేర్కొన్నారు.రష్యా దర్యాప్తును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణంగా ట్రంప్ పదేపదే అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలను వెల్లడించినందుకు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ను ఆయన ప్రశంసించారు.కాగా ట్రంప్ చర్యను డెమొక్రాట్లు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఒబామా తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఇవన్నీ కేవలం ‘కుట్ర సిద్ధాంతాలే’నని కొట్టిపారేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు ఈ పోస్టును స్వాగతించారు. ‘డీప్ స్టేట్’ అవినీతిని అంతం చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని చూస్తున్నారు. దీని ప్రభావంతో సోషల్ మీడియాలో #ArrestObama అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్గా మారింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలు అమెరికా రాజకీయాల్లో నెలకొన్న లోతైన విభజనను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
నైజీరియాలో వైమానిక దాడి: 100 మంది పౌరుల మృతి?
అబూజా: నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరిపిన వైమానిక దాడి పెను విషాదాన్ని మిగిల్చింది. జాంఫారా రాష్ట్రంలోని తుమ్ఫా గ్రామంలో ఆదివారం ఒక మార్కెట్పై జరిగిన ఈ దాడిలో సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' వెల్లడించింది. మృతుల్లో అత్యధికులు కౌమార బాలికలు, చిన్న పిల్లలే ఉన్నట్లు పేర్కొంది.సైన్యం ఖండనఈ ఆరోపణలను నైజీరియా సైన్యం తీవ్రంగా ఖండించింది. తాము కేవలం సాయుధ ముఠాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను పొరపాటున కూడా లక్ష్యంగా చేసుకోలేదని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ మైఖేల్ ఒనోడా స్పష్టం చేశారు. అయితే, ఒక్క గ్రామంలోనే 80 మందికి పైగా సామాన్య పౌరుల అంత్యక్రియలు జరిగాయని, అక్కడ తిరుగుబాటుదారులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమ్నెస్టీ నైజీరియా డైరెక్టర్ ఇసా సనుసి ధ్వజమెత్తారు.పునరావృతమవుతున్న పొరపాట్లుబోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడుతున్న నైజీరియాలో.. క్షేత్రస్థాయి సిబ్బంది, వాయుసేన మధ్య సమన్వయ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత నెలలోనూ జరిగిన ఒక పొరపాటు దాడిలో 100 మంది మరణించారు. సాయుధ ముఠాలు స్థానిక ప్రజల్లో కలిసిపోయి ఉండటం వల్ల లక్ష్యాలను గుర్తించడం కష్టమవుతోందని సైనిక వర్గాలు వాదిస్తున్నాయి. -
దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్.. కీలక మార్పు
దుబాయ్: మారుతున్న కాలానికి అనుగుణంగా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డ్రైవింగ్ శిక్షణలో కీలక మార్పులు చేపట్టింది. ఆధునిక వాహనాల్లో అందుబాటులోకి వచ్చిన 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (ADAS) వంటి అత్యాధునిక సాంకేతికతను లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సిలబస్లో చేర్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.శిక్షణలో కొత్త అంశాలివే..నూతన సిలబస్ ప్రకారం అభ్యర్థులు వాహనాల్లోని కీలక భద్రతా వ్యవస్థలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.కొలిజన్ వార్నింగ్: వాహనం వేరే వస్తువును ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పుడు హెచ్చరించే వ్యవస్థ.బ్లైండ్ స్పాట్ మానిటరింగ్: డ్రైవర్కు కనబడని ప్రదేశాల్లోని వాహనాల గుర్తింపు.అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్: ముందటి వాహనం వేగానికి అనుగుణంగా స్వయంచాలక వేగ నియంత్రణ.వీటితో పాటు ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ డిటెక్షన్, నైట్ విజన్ సిస్టమ్, ఏబీఎస్ (ABS) వంటి సాంకేతికతలపై థియరీ, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు.ప్రమాదాల నివారణే ధ్యేయం"రహదారి భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్ల ప్రవర్తనలో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం" అని ఆర్టీఏ డ్రైవర్ లైసెన్సింగ్ డైరెక్టర్ సుల్తాన్ అల్ అక్రఫ్ తెలిపారు. డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో రూపొందించిన ఈ కొత్త సిలబస్ ఇప్పటికే హ్యాండ్బుక్స్లో అందుబాటులోకి వచ్చింది.గత కొన్నేళ్లలో సవరించిన సిలబస్ ద్వారా సుమారు 2.50 లక్షల మందికి పైగా శిక్షణ పొందారని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లకు ఈ సరికొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించేలా శిక్షకులకు ప్రత్యేక వర్క్షాపులు కూడా నిర్వహించినట్లు ఆర్టీఏ స్పష్టం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దుబాయ్ లక్ష్యమని వారు పేర్కొన్నారు. -
ఇరాన్కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
పాకిస్థాన్లో భారీ పేలుడు, ఏడుగురి మృతి
లక్కీ మార్వాట్: పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందారు. వాయువ్య పాకిస్థాన్లోని లక్కీ మార్వాట్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో జరిగిన శక్తిమంతమైన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.కాగా, గత శనివారం రాత్రి.. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. ఈ భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్కు పాక్ ఆశ్రయం
ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ యుద్ధంలో శాంతిదూతగా, మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ భారీ మోసానికి పాల్పడిందా? అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ తన గడ్డపై రహస్యంగా ఆశ్రయం కల్పించిందని తాజాగా అమెరికన్ అధికారులు వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. సీబీఎస్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.నూర్ ఖాన్ బేస్లో ఇరాన్ విమానాలుఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే, ఇరాన్కు చెందిన పలు విమానాలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిఘా సమాచారాన్ని సేకరించే ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఆర్సీ-130 (ఆర్సీ-130) విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని వారు ఈ వార్తలను కొట్టిపారేశారు.ఆఫ్ఘనిస్తాన్లోనూ రహస్య ఆశ్రయం?కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్లో దిగిందని ఆఫ్ఘన్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్కు అలా చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా సెనేటర్ ఫైర్ఈ సంచలన నివేదికపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాక్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్కు, దాని మిత్రదేశమైన చైనాకు దూరం కాకుండా పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు? -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?
ప్రెటోరియా: ఒక దేశ అధ్యక్షుడి ఫామ్హౌస్లోని సోఫాలో చోరీకి గురైన భారీ నగదు వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ముప్పు తెచ్చిపెట్టింది. ‘ఫామ్గేట్’ స్కామ్గా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణను నిలిపివేస్తూ, గతంలో ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని అక్కడి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడంతో, రామఫోసాపై అభిశంసన ప్రక్రియకు మరోసారి వార్తల్లోకి వచ్చింది.కుదిపేస్తున్న ‘ఫామ్గేట్’ స్కామ్2020లో రామఫోసాకు చెందిన ‘ఫల ఫల’ (Phala Phala) ఫామ్హౌస్లోకి చొరబడిన దొంగలు, అక్కడి సోఫాలో దాచిన భారీ విదేశీ నగదును ఎత్తుకెళ్లారు. అది గేదెల విక్రయం ద్వారా వచ్చిన 5.8 లక్షల డాలర్ల చట్టబద్ధమైన ఆదాయమేనని అధ్యక్షుడు చెబుతుండగా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాత్రం ఆ మొత్తం సుమారు నాలుగు మిలియన్ డాలర్లు(రూ. 38 కోట్ల పైమాటే) ఉంటుందని ఆరోపించారు. అంత భారీ నగదు దేశంలోకి ఎలా వచ్చింది? బ్యాంకులో కాకుండా సోఫాలో ఎందుకు దాచారు? అనే ప్రశ్నలు తీవ్ర దుమారం రేపాయి.అభిశంసనకు మళ్లీ ప్రాణం2022లో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఒక స్వతంత్ర ప్యానెల్.. రామఫోసా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. కానీ అధికార ఏఎన్సీ పార్టీ తనకున్న మెజారిటీతో పార్లమెంట్లో విచారణను అడ్డుకుంది. అయితే పార్లమెంట్ చర్య రాజ్యాంగ విరుద్ధమని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సెక్షన్ 89 కింద నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షునిపై అభిశంసన ప్రక్రియను తప్పనిసరిగా పునఃప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.తగ్గేదే లేదంటున్న రామఫోసాకోర్టు తీర్పు నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న రాజీనామా డిమాండ్లను రామఫోసా తీవ్రంగా తోసిపుచ్చారు. తాను ప్రజాధనాన్ని దోచుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్యానెల్ నివేదిక ఆధారాలు లేనిదని, దానిని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తానని వెల్లడించారు. కాగా, అభిశంసన నెగ్గాలంటే పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం అధికార పార్టీకి 40 శాతం సీట్లు ఉండటంతో అధ్యక్షుడి పదవికి తక్షణ ముప్పు లేదని, ఆయన ఈ గండం గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం -
రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.లావన్ ఐలాండ్ టార్గెట్గా దాడిగత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీయూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్బేస్ నూర్ ఖాన్ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్లో నిలిచిందని.. తర్వాత హెరాత్కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!
అందమైన పగడపు దీవులు.. అంతుచిక్కని నీలిరంగు సముద్ర తీరాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుత ప్రదేశం లక్షద్వీప్. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని కలలు కనేవారికి ఇప్పుడు ఒక శుభవార్త! ఇన్నాళ్లూ లక్షద్వీప్ వెళ్లాలంటే స్థానికుల స్పాన్సర్షిప్ కోసం వెతకడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం పడిగాపులు కాయడం లాంటి ఎన్నో కష్టాలు ఉండేవి. అయితే పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లక్షద్వీప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు సడలిస్తూ, ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు ప్రయాణికులకు పూల దారిలా మారాయి. ఇంతకీ భద్రతలో ఏమాత్రం రాజీపడని లక్షద్వీప్ యంత్రాంగం పెట్టిన కొత్త రూల్స్, అమలు చేస్తున్న సడలింపులు ఏమిటి?తొలగిపోయిన ప్రధాన అడ్డంకులుతాజా మార్గదర్శకాల ప్రకారం, పర్యాటకులకు అతిపెద్ద అడ్డంకిగా మారిన ‘లోకల్ స్పాన్సర్’ (స్థానిక వ్యక్తి లేదా సంస్థ హామీ) నిబంధనను యంత్రాంగం పూర్తిగా ఎత్తివేసింది. దీనితో పాటుగా, ప్రయాణికులు తమ సొంత రాష్ట్రం నుంచి సమర్పించాల్సిన ‘పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)’ అవసరం ఇకపై ఉండదు. అయితే భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, దరఖాస్తు చేసిన తర్వాత లక్షద్వీప్ పోలీసులే స్వయంగా అంతర్గత భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలు సజావుగా జరగడానికి, పర్యాటకులు తమ ప్రయాణ తేదీకి కనీసం 14 రోజుల ముందే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లక్షద్వీప్లో ఏ ఏ దీవులను సందర్శించాలనుకుంటున్నారు? ఏ ఏ తేదీల్లో అక్కడ ఉంటారనే వివరాలను అప్లికేషన్లో స్పష్టంగా పేర్కొనాలి. పర్మిట్ దక్కని ఏ ఇతర దీవిలోనూ అడుగుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లభించదు. ప్రయాణ మార్గంలో కవరత్తి లేదా అగత్తి దీవుల్లో గరిష్టంగా 12 గంటల పాటు మాత్రమే ట్రాన్సిట్ కోసం ఆగేందుకు అనుమతి ఉంటుంది.పర్మిట్ వచ్చాకే బుకింగ్స్ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులను అధికారులు కేవలం మెరిట్ ఆధారంగా, అన్ని అర్హతలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు. అధికారికంగా ఎంట్రీ పర్మిట్ చేతికి వచ్చేలోపు ఎలాంటి విమాన లేదా హోటల్ బుకింగ్స్ చేసుకోవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పర్మిట్ రాకపోతే చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ల వల్ల భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఉండే పీక్ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఇకపోతే లక్షద్వీప్ స్థానికులు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులకు మినహా.. భారతీయులతో సహా విదేశీయులందరికీ ఈ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. పర్యాటకులు అన్ని దీవులకు వెళ్లలేరు. భారతీయ పౌరులు కేవలం ఐదు దీవులను (కవరత్తి, అగత్తి, బంగారం, కద్మత్, మినికాయ్) మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన నియంత్రణలు కొనసాగుతాయి.దరఖాస్తు ఎలా చేయాలి? పర్యాటకులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతుల్లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ఎంచుకునేవారు అధికారిక ‘ఈ-పర్మిట్ (ePermit)’ పోర్టల్ లోకి వెళ్లి (https://epermit.utl.gov.in/pages/signup) అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ప్రయాణ తేదీలు, పర్సనల్ వివరాలు నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందితే ప్రయాణానికి సుమారు 15 రోజుల ముందు ఈ-మెయిల్ ద్వారా పర్మిట్ అందుతుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా లక్షద్వీప్ యంత్రాంగ వెబ్సైట్ నుంచి ఫారాలు డౌన్లోడ్ చేసుకుని, కవరత్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు. కానీ దీనికి ప్రాసెసింగ్ సమయం ఎక్కువ పడుతుంది. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్), ప్రయాణ టికెట్లు (ఫ్లైట్ లేదా పడవ), హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ (అవసరమైన చోట) డాక్యుమెంట్లను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ -
ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలికి బిగ్ షాక్
మనీలా: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టె ఉద్వాసనకు గురయ్యారు. ప్రతినిధుల సభ సోమవారం ఆమెను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. బయటికి వెల్లడించని ఆస్తులను కూడబెట్టారని, అధ్యక్షుడిని చంపుతామంటూ బెదిరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె కుమార్తె అయిన సారాపై ఆరోపణలున్నాయి.అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్తో విభేదాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రతినిధుల సభ 255–26 ఓట్ల భారీ తేడాతో సారా డ్యుటెర్టెను తొలగిస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై సెనేట్లో విచారణ జరగనుంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సారాకు ఇది పెద్ద షాక్ అని పరిశీలకులు అంటున్నారు.గతేడాది కూడా ప్రతినిధుల సభ సారా ఉద్వాసన తీర్మానం చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడంతో గండం గట్టెక్కారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను సారా డ్యటెర్టె ఖండిస్తున్నారు. అధ్యక్షుడు మార్కోస్ కుటుంబీకులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శిస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్కు పోటీగా మారరాదనే తనపై ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆరోపిస్తున్నారు. -
ప్రధానీ.. ప్లీజ్ రాజీనామా చేయండి!!
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 14 ఏళ్ల కన్జర్వేటివ్ల పాలనకు చరమగీతం పాడిన లేబర్ పార్టీ.. ఏడాది తిరగకముందే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ప్రధాని కీర్ స్టార్మర్పై సొంత పార్టీ నేతలే కత్తిగట్టారు. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని 70 మందికి పైగా ఎంపీలు, సీనియర్ క్యాబినెట్ మంత్రులు డిమాండ్ చేయడం ఇప్పుడు బ్రిటన్లో సంచలనంగా మారింది.ముదురుతున్న సంక్షోభంఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా వేల్స్ పార్లమెంటుపై 1999 నుంచి ఉన్న పట్టును కోల్పోయి, ‘ప్లాయిడ్ సిమ్రూ’కు అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. అటు స్కాట్లాండ్లోనూ పార్టీ ప్రాభవం తగ్గడం, రిఫార్మ్ యూకే, గ్రీన్ పార్టీలు పుంజుకోవడంతో స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.మంత్రుల ఒత్తిడివిదేశాంగ మంత్రి యెవెట్టే కూపర్, అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ వంటి కీలక నేతలు ఇప్పటికే స్టార్మర్తో చర్చలు జరిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ జరగాలని వారు సూచించినట్లు సమాచారం.సహాయకుల రాజీనామానలుగురు కీలక మంత్రుల పార్లమెంటరీ సహాయకులు (జో మోరిస్, టామ్ రట్లాండ్, మెలానియా వార్డ్, నౌషాబా ఖాన్) తమ పదవులకు రాజీనామా చేస్తూ.. స్టార్మర్పై ప్రజలకు నమ్మకం పోయిందని బహిరంగంగా విమర్శించారు.గండం గట్టెక్కేనా?లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం.. అధికారికంగా నాయకత్వ మార్పు కోసం ఓటింగ్ జరగాలంటే కనీసం 81 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం 70 మందికి పైగా సభ్యులు వ్యతిరేకిస్తుండటంతో, మరో పది మంది తోడైతే స్టార్మర్ కుర్చీకి ప్రమాదం తప్పదు. 2029 సాధారణ ఎన్నికల నాటికి స్టార్మర్ సారథ్యంలో పార్టీ గెలవడం అసాధ్యమని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు."ప్రధానిపై ప్రజలకు విశ్వాసం సడలిందని స్పష్టమవుతోంది. ఈ మార్పుకు ఆయన నాయకత్వం వహించలేరు" అని వెస్ స్ట్రీటింగ్ పార్లమెంటరీ సహాయకుడు జో మోరిస్ వ్యాఖ్యానించారు.తగ్గని స్టార్మర్.. వారసులెవరు?ఎంత ఒత్తిడి వచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "నాపై సందేహాలు ఉన్నాయని తెలుసు, వాటిని పటాపంచలు చేస్తాను. నేను బాధ్యతల నుంచి పారిపోను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, ఇంధన సంస్కరణలు, ఐరోపాతో సత్సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన మద్దతుదారులకు హామీ ఇచ్చారు.రేసులో వీరేనా?ఒకవేళ స్టార్మర్ దిగిపోవాల్సి వస్తే.. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ లేదా మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక స్తబ్దత మధ్య స్టార్మర్ ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
సౌదీ హజ్ యాత్రికులకు అలర్ట్: పేమెంట్ గడువులో మార్పు
దుబాయ్: పవిత్ర హజ్ యాత్రకు సిద్ధమవుతున్న స్వదేశీ యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ మే 15 (శుక్రవారం) నుంచి దేశీయ హజ్ బుకింగ్ చెల్లింపుల రెండో దశను ప్రారంభించనుంది. అయితే, ఈ దఫా సీట్ల లభ్యతను పెంచేందుకు చెల్లింపుల గడువు విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.గడువు 72 గంటల నుంచి 6 గంటలకు..ప్రస్తుతం ప్రాథమిక రిజర్వేషన్ పొందిన వారికి ఇన్వాయిస్ చెల్లించడానికి 72 గంటల సమయం ఇస్తుండగా, మే 15 నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. మే 15 నుంచి రిజర్వేషన్ పొందిన వారు కేవలం 6 గంటలలోపే చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుని చెల్లింపులు చేయకపోతే, ఆ సీటు బ్లాక్ అవ్వకుండా వెంటనే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఇతర దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత గడువు (6 గంటలు) ముగిసిన వెంటనే చెల్లించని రిజర్వేషన్లు సాఫ్ట్వేర్ ద్వారా స్వయంచాలకంగా రద్దవుతాయి.సదాద్ ద్వారానే చెల్లింపులుఇప్పటికే 'నుసుక్' (Nusuk) ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సౌదీ పౌరులు, నివాసితులు 'సదాద్' (SADAD) డిజిటల్ సిస్టమ్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యాత్రికుల సౌకర్యార్థం మినాలో 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కొత్త గుర్తింపు కలిగిన గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ 2026 సీజన్ కోసం చేపడుతున్న ఈ ఆధునికీకరణ పనుల వల్ల యాత్రికులకు మెరుగైన వసతులు లభించనున్నాయి. -
56 దేశాల్లో భారతీయులకు బంపర్ ఆఫర్!
వేసవి విడిదికి తోడు ఈద్ సెలవులు దగ్గరపడుతుండటంతో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్పోర్ట్ శక్తిసామర్థ్యాలపై తాజా 'హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్' ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఉన్న 75వ స్థానం నుంచి స్వల్పంగా పడిపోయినప్పటికీ, భారతీయులు వీసా ముందస్తు దరఖాస్తు అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు.ర్యాంకింగ్లో హెచ్చుతగ్గులు..గ్లోబల్ వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ ఈసారి క్యూబా, సెనెగల్ వంటి దేశాలతో కలిసి 78వ స్థానాన్ని పంచుకుంది. అయితే, గమ్యస్థానాల పరంగా చూస్తే భారత్ బలం స్థిరంగానే ఉంది. 2025లో 57 దేశాలకు వీసా లేకుండా ప్రవేశం ఉండేది. అది జనవరి 2026 నాటికి 55 దేశాలకు తగ్గింది. ప్రస్తుతం గాంబియా చేరికతో 56 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ పెరిగింది.ఎక్కడికి ఎలా వెళ్లొచ్చు?భారత పౌరులకు ప్రస్తుతం 30 దేశాలు పూర్తిస్థాయిలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' (వచ్చిన తర్వాత వీసా), మరో 3 దేశాలు 'ఈటీఏ' (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) పద్ధతిలో అనుమతిస్తున్నాయి.వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, జమైకా, కజకస్తాన్, కిరిబాటి, మకావో (ఎస్.ఎ.ఆర్ చైనా), మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, నేపాల్, నియు, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, థాయ్ లాండ్, ది గాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు ఉన్నాయి.వీసా-ఆన్-అరైవల్ (VOA) అనుమతిస్తున్న దేశాల్లో బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావు దీవులు, ఖతార్, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, తువాలు, జింబాబ్వే ఉన్నాయి.ఇక కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏ విధానంలో ప్రవేశం కల్పిస్తున్నాయి.పర్యాటకుల చూపు.. 'సమీప' దేశాల వైపు..ఈద్ సెలవుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, కనీస డాక్యుమెంటేషన్తో ప్రయాణించే వీలున్న ఆసియా, మధ్యప్రాచ్య దేశాలపై భారతీయులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా థాయ్లాండ్, మలేషియా, మాల్దీవులు వంటి దేశాలు వీసా సరళీకరణను ప్రకటించడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.ర్యాంకింగ్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇది మన పాస్పోర్ట్ బలహీనత కంటే ఇతర దేశాల వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల సంభవించినదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. -
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు 'డిజిటల్' ఉరి!
టెహ్రాన్: యుద్ధం మిగిల్చిన గాయం ఒకవైపు.. డిజిటల్ దిగ్బంధనం చేస్తున్న విధ్వంసం మరోవైపు! ఇరాన్లో గత 73 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి నెట్టివేస్తోంది. క్షిపణుల మోత కంటే భయంకరంగా ఈ 'డిజిటల్ సీజ్' సామాన్యుల ఉపాధిని బలితీసుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ప్రైవేట్ రంగాన్ని ఈ సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం శ్మశానవాటికగా మారుస్తోంది.నిశ్శబ్ద భూకంపంఅంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్డాగ్ 'నెట్ బ్లాక్స్' (NetBlocks) తాజా నివేదిక ప్రకారం, ఆధునిక సమాజంలో ఇంత సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ. 21,000 కోట్లకు పైగా) ఆర్థిక నష్టం వాటిల్లింది. నేరుగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిరోజూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 80 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఛానెళ్లు 90% వరకు మూతపడ్డాయి.కుప్పకూలిన డిజిటల్ సామ్రాజ్యంఒకప్పుడు ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 'డిజిటల్ ఎకానమీ' ఇప్పుడు ఆవిరవుతోంది. ఇరాన్ అమెజాన్గా పిలిచే 'డిజికాలా' వందలాది మందిని తొలగించగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ 'కామ్వా' తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "రెండు యుద్ధాలు, నెలల తరబడి ఇంటర్నెట్ బంద్ తర్వాత మేము నిలబడలేకపోతున్నాం" అని సంస్థ వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.పారిశ్రామిక రంగానికి పక్షవాతంసాంకేతిక రంగమే కాకుండా, పెట్రోకెమికల్, ఉక్కు, వస్త్ర పరిశ్రమలు సైతం కుదేలయ్యాయి. సరఫరా గొలుసు (Supply Chain) విచ్ఛిన్నం కావడంతో ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోయింది. ఒక్క పశ్చిమ ఇరాన్ ఫ్యాక్టరీలోనే 700 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. దాదాపు 35 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని పారిశ్రామిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తప్పని తిప్పలు.. తెగనమ్ముకుంటున్న ఆస్తులుమధ్యతరగతి ఇరానియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగాలు ఊడిపోవడంతో కనీస అవసరాల కోసం కార్లు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. టెహ్రాన్కు చెందిన బాబాక్ అనే ప్రొడక్ట్ డిజైనర్ మాటల్లో చెప్పాలంటే.. "జీవితాంతం కష్టపడి నేర్చుకుని ఎదిగాను, కానీ ఇప్పుడు నా కళ్లముందే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది."రాజకీయ చదరంగం.. ఆర్థిక బలిఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం కావాలని అమెరికా భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లొంగే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. కానీ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. విదేశీ ప్లాట్ఫారమ్లు బంద్ కావడంతో ప్రజలను బలవంతంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే దేశీయ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఇరాన్లో క్షిపణి దాడుల కన్నా 'డిజిటల్ ముట్టడి' వల్ల కలిగే నష్టం దీర్ఘకాలికంగా ఆ దేశ వెన్నుముకను విరిచేలా కనిపిస్తోంది. -
రన్వేపై సూసైడ్?? షాకింగ్ వీడియో వెలుగులోకి..
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం తాలుకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ వ్యక్తి రన్వేపైకి దూసుకురాగా.. విమానం అతన్ని ఢీ కొట్టి ఇంజిన్లోకి లాగేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొలరాడో స్టేట్ డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్కి బయల్దేరిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ విమానం(Airbus A321).. రన్వేపై వేగంగా దూసుకెళ్తూ హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది. దీంతో విమానంలో మంటలు వ్యాపించాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఎమర్జెన్సీ స్టయిడ్స్ ద్వారా అందరినీ బయటకు తెచ్చారు. 12 మందికి స్వల్పగాయాలు కాగా.. మరో ఐదుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే..రన్వేను మూసేసి దర్యాప్తు ప్రారంభించారు. రన్వేపై దూసుకెళ్తున్న సమయంలో బిగ్గరగా శబ్దం వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఓ వ్యక్తిని ఢీ కొట్టినట్లు పైలట్ చెప్పాడు. దీంతో విమానం ఇంజిన్ నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రన్వేపై జరిగిన ప్రమాదంలోనే అతను జరిగి ఉంటాడని భావించారంతా. ఈ నేపథ్యంలో షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ సిబ్బంది కాదని అధికారులు తేల్చేశారు. ‘‘దొడ్డిదారిన ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ దూకిన ఓ వ్యక్తి.. రన్వేపై ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలోనే 180 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన విమానం అతన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే అతన్ని ఇంజిన్లోకి లాగేయడంతో.. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. రన్వేపై విమానం దూసుకు రావడం అతను గమనించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని.. బహుశా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే వచ్చి ఉంటాడు’’ అని డెన్వర్ పోలీసులు ప్రకటించారు.ఫెన్సింగ్ దూకిన రెండు నిమిషాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. అతను ఎవరనేది తేలితేనే.. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది అని ఓ అధికారి చెబుతున్నారు. మరోవైపు.. ఉగ్ర దాడి, ప్రమాదవశాత్తూ మరణం కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి..ABD’de Frontier Airlines’a ait Los Angeles seferini yapan yolcu uçağı, Denver Uluslararası Havalimanı’nda kalkış sırasında pistte bulunduğu belirtilen bir kişiye çarptı.Motorun kısmen içine çekilen kişi yaşamını yitirirken, olay kısa süreli yangına neden oldu. Uçaktaki 231… pic.twitter.com/8xfpqn8shE— Dış Ses (@disseshaber) May 11, 2026 -
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt) -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జిన్పింగ్ ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్.. టార్గెట్ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలుఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్వర్క్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత -
థాయ్లాండ్ పాలిటిక్స్: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని, 76 ఏళ్ల టెలికాం బిలియనీర్ థాక్సిన్ షినవత్రా సోమవారం బ్యాంకాక్ జైలు నుంచి ముందస్తుగా విడుదలయ్యారు. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ రాజకీయ దిగ్గజం మళ్లీ తెరపైకి రావడం థాయ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.షరతులతో కూడిన స్వేచ్ఛఅవినీతి ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న థాక్సిన్ వయసును పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా విడుదల మంజూరు చేశారు. అయితే నాలుగు నెలల ప్రొబేషన్ పీరియడ్లో ఆయన తప్పనిసరిగా కాలికి ఎలక్ట్రానిక్ మానిటర్ ధరించాల్సి ఉంటుంది. జైలు వెలుపల తన కుటుంబ సభ్యులను కౌగిలించుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన నేత రాకతో అక్కడికి చేరుకున్న వందలాది ‘రెడ్ షర్ట్’ మద్దతుదారులు థాక్సిన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.వివాదాలు.. తగ్గని మద్దతు2023 ఆగస్టులో ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన థాక్సిన్కు మొదట ఎనిమిదేళ్ల శిక్ష పడినా, రాజ క్షమాభిక్షతో అది ఏడాదికి తగ్గింది. అయితే జైలుకు బదులుగా ఆసుపత్రిలో గడపడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన కుటుంబానికి చెందిన ‘ఫ్యూ థాయ్’ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోయినప్పటికీ, ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం థాక్సిన్ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?థాక్సిన్ విడుదల ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన కొంతకాలం దూరంగా ఉన్నా, రాజకీయాలను విడిచిపెట్టరని మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు, థాక్సిన్ వ్యతిరేకులు ఆయన తదుపరి అడుగులపై నిశితంగా దృష్టి పెట్టారు. అయితే ఆయన కూతురు, మాజీ ప్రధాని పీటాంగ్టార్న్ షినవత్రా మాత్రం జైలులో తమ తండ్రితో కేవలం కుటుంబ విషయాలే మాట్లాడామని, రాజకీయాలు చర్చించలేదన్నారు. ఏది ఏమైనా థాక్సిన్ తాజా విడుదల థాయ్లాండ్లో కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తోంది.ఇది కూడా చదవండి: సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు! -
పాక్ మునీర్ నోటి దురుసు.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్.. మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది. -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. శనివారం రాత్రి బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. అనంతరం సంభవించిన భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడిచేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్కు చెందిన 'స్టార్లింక్' టెర్మినల్స్ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
నెత్తురోడిన పోలీస్ చెక్పోస్ట్.. 12 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను ప్రాంతంలో గల ఓ పోలీస్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కారు బాంబు, ఆటోమేటిక్ ఆయుధాలు, డ్రోన్ల సహాయంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృత్యువులా దూసుకొచ్చిన కారు బాంబుఈ దారుణ ఘటన బన్నులోని ఫతే ఖేల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పోలీస్ చెక్పోస్ట్ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు బాంబు పేలుడు ధాటికి చెక్పోస్ట్ ధ్వంసం కాగానే, అప్పటికే పొంచి ఉన్న ఇతర ఉగ్రవాదులు ఒక్కసారిగా లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొక అధికారి ఆచూకీ గల్లంతైంది.దాడిలో డ్రోన్లు, భారీ ఆయుధాలుఈ దాడిని ఉగ్రవాదులు అత్యంత పకడ్బందీగా అమలు చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కేవలం తుపాకులకే పరిమితం కాకుండా, క్వాడ్కాప్టర్లను (చిన్న డ్రోన్లు), భారీ ఆయుధాలను సైతం వినియోగించడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారని, వెళ్తూ పోలీసుల ఆయుధాలతో పాటు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట తీసుకెళ్లారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ముమ్మరంగా గాలింపు చర్యలుఈ భీకర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ అధికారులు ఆ ప్రాంతం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు, గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాల చెక్పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతుండటం సరిహద్దుల్లో అస్థిరతకు దారి తీస్తోంది. -
ఓర్బన్ సామ్రాజ్యం బద్దలు.. హంగేరీ ప్రధానిగా పీటర్ మాగ్యార్
బుడాపెస్ట్: హంగేరీ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 16 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన విక్టర్ ఓర్బన్ అధికార సామ్రాజ్యం బద్దలైంది. ‘తిస్జా’ (Tisza) పార్టీ వ్యవస్థాపకుడు 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ హంగేరీ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన మాగ్యార్, ఒకప్పుడు ఓర్బన్ రాజకీయ కోటరీలో అత్యంత కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఆ కోటను బద్దలుకొట్టి, ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేయడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.పాలకునిగా కాదు.. సేవకుడిగానే ఉంటాశనివారం హంగేరీ పార్లమెంట్లో నూతన ప్రధానిగా మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘లక్షలాది మంది హంగేరీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను ప్రజలను పాలించడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో స్థాపించిన మధ్య-మితవాద ‘తిస్జా’ పార్టీ గత నెల ఎన్నికల్లో ఏకంగా 199 స్థానాలకు గాను 141 సీట్లు కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓర్బన్కు చెందిన ఫైడెజ్-కేడీఎన్పీ కూటమి కేవలం 52 స్థానాలకే పరిమితమైంది.మారనున్న విదేశీ విధానం.. వేడుకకు ఓర్బన్ దూరంఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ హాజరుకాకపోవడం గమనార్హం. 1990 తర్వాత ఆయన ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి. కాగా మాగ్యార్ విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో హంగేరీ సంబంధాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టబద్ధమైన పాలన, ఉక్రెయిన్కు మద్దతు వంటి అంశాల్లో ఈయూతో ఓర్బన్ సర్కార్కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ దక్కడంతో, పాత ప్రభుత్వ నిరంకుశ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నూతన ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.బుడాపెస్ట్లో సంబరాలు.. చట్టసభలో మహిళా శక్తినూతన ప్రధాని ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజధాని బుడాపెస్ట్లోని కొసుత్ స్క్వేర్ వద్దకు వేలాది మంది మద్దతుదారులు చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ‘పాలనా మార్పు’గా మాగ్యార్ అభివర్ణించారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, ఈసారి హంగేరీ చట్టసభలో రికార్డు స్థాయిలో 54 మంది మహిళలు అడుగుపెట్టారు. దేశ శాసనసభ చరిత్రలో ఇదే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం కాగా, వీరిలో అత్యధిక మంది మాగ్యార్కు చెందిన తిస్జా పార్టీ నుంచే ఎన్నికవడం విశేషం.ఇది కూడా చదవండి: శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత -
ట్రంప్ కంపెనీకి భారీ నష్టం.. వందల మిలియన్లు లాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన సోషల్ మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్'కు (TMTG) ఈ ఏడాది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఏకంగా 405.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,400 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విలువ పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని నివేదిక వెల్లడించింది.అవాస్తవిక నష్టాల వెల్లువట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన టీఎంటీజీ, గతేడాది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు క్రిప్టోకరెన్సీలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో డిజిటల్ ఆస్తులు, ఈక్విటీలలో ఏర్పడిన 370 మిలియన్ డాలర్ల వాస్తవీకరించని నష్టాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీశాయి.కంపెనీ ఖజానాలో ప్రస్తుతం 9,500 బిట్కాయిన్లు ఉన్నాయి. గత జూలైలో బిట్కాయిన్ విలువ గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక్కో కాయిన్ను సగటున 1,08,519 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి చివరలో బిట్కాయిన్ ధర 70,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న సమయంలో కంపెనీ 2,000 బిట్కాయిన్లను విక్రయించింది. దీనివల్ల భారీగా పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 80,000 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. గత అక్టోబర్లో 1,26,000 డాలర్ల వద్ద ఉన్న ధర, ఫిబ్రవరి నాటికి 60,000 డాలర్లకు పడిపోవడం కంపెనీ అంచనాలను తలకిందులు చేసింది.ఆర్థిక పునాది పటిష్టమేనా?భారీ నష్టాలు పీడిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ ఆర్థిక ఆస్తులు మూడు రెట్లు పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.9 మిలియన్ డాలర్లుగా నమోదైంది.క్రిప్టో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రస్తుతానికి కాగితంపై నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పకూలుతున్న స్టాక్.. సీఈఓ నిష్క్రమణఒకవైపు ఆర్థిక నష్టాలు, మరోవైపు నాయకత్వ మార్పులు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2022లో ఒకానొక దశలో 97.54 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ, ప్రస్తుతం ఏకంగా 90% పైగా క్షీణించి 8.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ సీఈఓ, మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ ఏడాది ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళన కలిగించింది.జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ట్విట్టర్ (ప్రస్తుత X) ట్రంప్పై నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ సొంతంగా 'ట్రూత్ సోషల్' నెట్వర్క్ను ప్రారంభించారు. రాజకీయంగా ఆదరణ ఉన్నప్పటికీ, ఆర్థికంగా లాభాల బాట పట్టడంలో ఈ సంస్థ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. -
అంగారక గ్రహంపై ‘మొసలి వంతెన’.. అసలేంటి రహస్యం?
అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతాన్ని నాసా గుర్తించింది. పెర్సెవరెన్స్ రోవర్.. ‘క్రొకోడైల్ బ్రిడ్జ్’గా పిలువబడే అద్భుతమైన భౌగోళిక ప్రాంతానికి సంబంధించి.. అద్భుతమైన 360 డిగ్రీల పనోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అంటే.. ఇది జెజెరో క్రేటర్ (Jezero Crater) అంచున ఉన్న వంపు ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం. ఈ ఉపరితలం మొసలి వీపును పోలి ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. రోవర్ తన Mastcam-Z కెమెరా సిస్టమ్ ద్వారా దృశ్యాలను బంధించింది.ఈ ప్రాంతంలోని రాళ్లు దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం (నోచియన్ కాలం) నాటివి. ఇవి సౌర కుటుంబంలోనే అత్యంత పురాతనమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై టెక్టోనిక్ ప్లేట్లు లేకపోవడం వల్ల.. బిలియన్ల ఏళ్ల నాటి ఈ పురాతన శిలలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది..ఈ 360 డిగ్రీల పనోరమాను పెర్సీవరెన్స్ రోవర్ తన కెమెరా ద్వారా 980 చిత్రాలను కలిపి రూపొందించింది. మానవ కన్ను ఎలా చూస్తుందో అలాగే సహజ రంగుల్లో నాసా దీనిని విడుదల చేసింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అనేది జెజెరో క్రేటర్ నేల నుండి దాని అంచుకు వెళ్లే దారిలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ ప్రాంతం నుంచి రోవర్ త్వరలో ‘లాక్ డి చార్మ్స్’గా పిలిచే మరో ప్రాంతంలోకి ప్రవేశించి.. పలు నెలల పాటు పరిశోధనలు కొనసాగించనుంది.అంగారక గ్రహం ఏర్పడిన కొత్తలో వాతావరణం.. ఉపరితలం ఎలా ఉండేవి? అక్కడ జీవం మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవో లేదో తెలుసుకోవడానికి ఈ టైమ్ క్యాప్సూల్స్ వంటి రాళ్లు శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడతాయి. జెజెరో క్రేటర్ ఒకప్పుడు సరస్సు, నది డెల్టాగా ఉండేదని శాస్త్రవేత్తల నమ్మకం.భవిష్యత్తులో భూమికి తీసుకురావడం కోసం రోవర్ ఇక్కడి రాళ్లు, మట్టిని సేకరిస్తోంది. ఈ అద్భుతమైన 980 దృశ్యాల్లో 971 చిత్రాలను డిసెంబర్ 18, 2025, మిగిలిన 9 చిత్రాలను జనవరి 25, 2026న తీశారు. ఈ చిత్రాల్లో ఎర్రటి మైదానం, రాళ్లు, కొండ అంచులు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను తీసిన Mastcam-Z కెమెరా జూమ్ చేయగలదు. 3D చిత్రాలను తీయగలదు.. చాలా దూరం నుండి రాతి పొరలను స్పష్టంగా పరిశీలించగలదు. మొత్తానికి.. ఈ 'క్రొకోడైల్ బ్రిడ్జ్' పనోరమా అంగారక గ్రహం రహస్యాలను ఛేదించడంలో కీలక అడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరంశత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అసలు ఇరాన్ను శాసిస్తున్నది ఎవరు?ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! -
ఇరాన్కు సపోర్టు.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ముగింపు దశకు వస్తోందని శుభవార్త చెప్పారు. విక్టరీ డే పరేడ్ అనంతరం పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాస్కో ఒక సంప్రదింపుల దశకు సిద్ధమవుతోందని అనడానికి ఇది ఆయన ఇచ్చిన అత్యంత బలమైన సంకేతం.రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా భయంకరమైన పోరాటం సాగింది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రారంభించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా చెరొక దేశం 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించిన తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ప్రకటన వెలువడిన సమయం వెంటనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రెమ్లిన్ సంవత్సరాలుగా సైనిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది, కానీ రష్యా నాయకుడి తాజా వ్యాఖ్యలు తెరవెనుక పెరుగుతున్న దౌత్యపరమైన కదలికలను సూచించాయి.మరోవైపు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య వివాదం చాలా క్లిష్టంగా మారింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాకు కూడా సవాలుగా మారింది. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా. దీన్ని కొనసాగించాలనే ఆసక్తి ఎవరికీ లేదని నేను భావిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఇంకా రాజీ అవకాశాలు ఉన్నాయి' అని అభిప్రాయపడ్డారు. -
స్టార్మర్కు గట్టి షాక్
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఊహించని షాక్కు గురైంది. తాజాగా జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంగ్లండ్లోని వెయ్యి సీట్లు సహా మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 1,400కుపైగా స్థానాలను కోల్పోయింది. అనూహ్యంగా రిఫార్మ్ యూకే తెరపైకి వచి్చంది. సీనియర్ రాజకీయ నేత నిగెల్ ఫరేజ్ సారథ్యంలోని వలస వ్యతిరేక అజెండా కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు 1,440 కౌన్సిల్ స్థానాలకు గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్పై అసమ్మతి స్వరం మరింతగా పెరిగింది. ఆయన పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రధాని కియర్ స్టార్మర్ పాలనపై అనధికారిక ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన పార్టీని అధికారం దిశగా నడిపించిన స్టార్మర్ ప్రజాదరణ ఆ తర్వాత వేగంగా తగ్గిపోతూ వచి్చంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆయన పదవికి ఇప్పటికిప్పుడు వచి్చన ముప్పేమీ లేదని విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆర్థిక పురోగతి మందగించడం, సంక్షేమ వ్యయం తగ్గించడం వంటివి లేబర్ పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. లేబర్ పార్టీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో దెబ్బతింది. అధికార లేబర్ పార్టీకి 50 ఏళ్లుగా కంచుకోటలుగా ఉన్న సుండర్లాండ్, బార్న్స్లే వంటి చోట్ల రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేసింది. కన్జర్వేటివ్లకు మంచిపట్టున్న న్యూకాజిల్–అండర్–లైమ్, సఫోక్, ఎస్సెక్స్ ప్రాంతాలు కూడా ఈ పార్టీ వశమయ్యాయి. ఎసెక్స్ నుంచే అరడజను మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీకి సంప్రదాయబద్ధంగా పట్టున్న ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ ఓట్లను చీల్చడం, నేరుగా గెలవడం ద్వారా ప్రభావాన్ని చాటుకుంది. ఇంతేకాదు, మొట్ట మొదటిసారిగా లండన్ పరిధిలో ఉన్న హవెరింగ్నూ రిఫార్మ్ యూకే పార్టీ గెల్చుకుంది. వేల్స్లో 27 ఏళ్ల తర్వాత ఓటమి అధికార లేబర్ పార్టీ వేల్స్లో 27 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. వేల్స్ జాతీయ పార్లమెంట్(సెనెడ్)లో ప్లాయిడ్ కమ్రీ పార్టీ ఘన విజయం సాధించింది. సెనేడ్లోని 96 స్థానాలకు గాను ప్లాయిడ్ కమ్రీ 43 సీట్లను గెల్చుకుంది. అయితే, మెజారిటీకి కొద్దిదూరంలో నిలిచింది. ఇక్కడా రిఫార్మ్ యూకే పార్టీ దూకుడు కొనసాగింది. ఎవరూ ఊహించని రీతిలో సెనేడ్లో ఈ పార్టీ 34 సీట్లు కైవసం చేసుకోగా లేబర్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. లేబర్ ఫస్ట్ మినిస్టర్గా ఉన్న ఎల్యునెడ్ మోర్గాన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటిదాకా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 22 మంది సభ్యులుండగా, తాజాగా ఏడుగురు మాత్రమే విజయతీరాలకు చేరారు. ఇంగ్లండ్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే లండన్లో మాత్రం లేబర్ మంచి ఫలితాలనే సాధించుకుంది. ప్రధాని స్టార్మర్ సొంత నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్కు పొరుగునున్న కామ్డెన్లో 16 సీట్లను కోల్పోయినప్పటికీ లేబర్ పార్టీ పట్టునిలుపుకుంది. ఇక్కడ గ్రీన్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఈ ఫలితాలు స్టార్మర్కు కొంత ఊరట కలిగించాయని చెప్పవచ్చు.పదవి నుంచి వైదొలగను: స్టార్మర్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలంటూ వెలుపలి నుంచి విని్పస్తున్న డిమాండ్లపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో నేను పదవి నుంచి తప్పుకోను. దేశాన్ని అస్థిరతలోకి నెట్టివేయబోను’అని స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనవసరమైన కొన్ని తప్పిదాలు చేసిందని, మొదటి రెండేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని అంగీకరించారు. మంత్రివర్గ సహచరులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎవ్వరూ వ్యతిరేక గళం వినిపించలేదు. గట్టి పోటీదారులుగా భావించే లేబర్ పార్టీ నేతలెవరూ ఆయన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో స్టార్మర్ తర్వాతి స్థానంలో ఉండే అండీ బర్న్ హామ్, ఏంజెలా రేనర్ వంటి వారు సైతం మౌనంగా ఉన్నారు.స్కాట్లాండ్లో ఎస్ఎన్పీకి ఆధిక్యం స్కాట్లాండ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) వరుసగా ఐదోసారి విజయం సాధించింది. అయితే, పూర్తి మెజారిటీ సాధనలో వెనుకబడిపోయింది. మొత్తం 129 సీట్లకుగాను ఎస్ఎన్పీ 58 స్థానాలను మాత్రమే సాధించింది. ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పెర్త్షైర్ నార్త్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయన ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రిఫార్మ్ పార్టీ కూడా లేబర్ పార్టీతో సమానంగా 17 సీట్లు గెల్చుకోగా, గ్రీన్స్ పార్టీకి 15 సీట్లు దక్కాయి. స్వతంత్ర స్కాట్లాండ్ నినాదానికి మద్దతిచ్చే పార్టీ కావడంతో ఎస్ఎన్పీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్ను బ్రిటన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చడం ఎస్ఎన్పీ ప్రధాన అజెండా. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం వల్ల రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కష్టం కానుంది. -
మాది న్యాయబద్ధమైన యుద్ధం
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే పరేడ్ వేదికగా నాటో కూటమిపై మండిపడ్డారు. ఉకెయ్రిన్ను దురాక్రమణ దారుగా అభివర్ణించారు. తాము చేస్తున్నది న్యాయబద్ధమైన యుద్ధమంటూ ప్రకటించుకున్నారు. శనివారం రాజధాని మాస్కోలోని ప్రసిద్ధ రెడ్ స్క్వేర్లో జరిగిన వేడుకల్లో వందలాది మంది సైనికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ‘అప్పటి విజేతలు సాధించిన గొప్ప విజయం, నేడు ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను నెరవేరుస్తున్న సైనికులకు స్ఫూర్తినిస్తోంది’ అంటూ ఉక్రెయిన్తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ‘నాటో కూటమి మొత్తం ఆయుధాలను అందిస్తూ మద్దతు ఇస్తున్న ఒక దురాక్రమణ శక్తిని మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మన హీరోలు ముందుకు సాగుతున్నారు’అని పుతిన్ పేర్కొన్నారు. సైనిక వ్యూహాలు ఎలా మారినప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ ఉత్సవాన్ని రష్యా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 25 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న పుతిన్ విక్టరీ డేను దేశ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించే వేదికగా మార్చుకున్నారు. అయితే, ఈసారి అటువంటివేమీ లేకుండా పరేడ్ సాదాసీదాగా సాగింది. ఉక్రెయిన్ దాడుల భయంతోనే భారీగా భద్రతా ఏర్పాట్లు సైతం చేపట్టారు. పెద్ద సంఖ్యలో సైనికులు రెడ్ స్క్వేర్లో కవాతు చేపట్టారు. వీరితో ఉత్తర కొరియా బలగాలు కలిసి పాల్గొనడం గమనార్హం. యుద్ధంలో బిజీగా ఉండటం వల్లే సైనికులు కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొనలేదని ప్రభుత్వం తెలిపింది. క్రెమ్లిన్లో జరిగిన వేడుకకు అతిథులుగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో, మలేసియా రాజు సుల్తాన్ ఇబ్రహీం, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో హాజరయ్యారు. విక్టరీ డే వేడుకలు సుదూరంగా మాస్కోకు 9 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాడివొస్టొక్తోపాటు సైబీరియాలోని క్రాస్నోయార్క్స్, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల్లోనూ జరిగాయి. -
కనీస వేతనాలు పెంచితేనే హెచ్–1బీ వీసాలు!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద ఉద్యోగులను నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను, గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30 శాతం దాకా పెంచాలని తాజాగా ప్రతిపాదించింది. విదేశీ ఉద్యోగులు అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించే పరిస్థితిని నివారించడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధననను అమెరికా కారి్మక శాఖ మార్చి 27వ తేదీన ప్రతిపాదించింది. ఎంట్రీ–లెవెల్ నుంచి మోస్ట్–ఎక్స్పీరియన్స్డ్ దాకా నాలుగు కేటగిరీల్లో కనీస వేతనాలు పెంచాలని అమెరికా కంపెనీలకు స్పష్టంచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలను 20 ఏళ్ల క్రితం ఖరారు చేశారు. ఇప్పుడున్న నిబంధనలు అమెరికా కారి్మకులకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా కంపెనీలు హెచ్–1బీ వీసా పథకం కింద తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దాంతో స్వదేశీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అధికారవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హెచ్–1బీ వీసాతో విదేశీయులకు ఉద్యోగం ఇవ్వాలంటే లెవెల్–1 వారికి ఏడాదికి కనీసం 73,279 డాలర్లు, లెవెల్–2 వారికి 98,987, లెవెల్–3 వారికి 1,21,979, లెవెల్–4 వారికి 1,44,202 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం కనీస వేతనాలు తప్పనిసరిగా పెంచాలి. అంటే లెవెల్–1 వారికి ఏడాదికి కనీసం 97,746 డాలర్లు(పెంపు 33.39 శాతం), లెవెల్–2 వారికి 1,23,212(పెంపు 24.47 శాతం), లెవెల్–3 వారికి 1,47,333(పెంపు 20.79 శాతం), లెవెల్–4 వారికి 1,75,464(పెంపు 21.68 శాతం) డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. నగరాలను బట్టి ఇందులో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కష్టమే! కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. అమెరికా కంపెనీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఇకపై విదేశీయులను నియమించుకొనే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. హెచ్–1బీతోపాటు హెచ్1బీ1, ఈ–3 వీసాల కింద ఉద్యోగాలు పొందే విదేశీయుల వేతనాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 2020లో కనీస వేతనాల్లో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించగా, చట్టపరంగా> సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది. హెచ్–1బీ వీసాలతో ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులు ప్రయోజనం పొందుతున్నారు. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతీయుల తర్వాత చైనా టెక్ నిపుణులు ఈ వీసాలను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. -
కాల్పుల విరమణపై సందేహాలు!
దుబాయ్: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ శనివారం ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం. మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది. -
భారత్పై చైనా బండారం బట్టబయలు.. పాక్కు సాయం
బీజింగ్: గతేడాది భారత్తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి ఝాంగ్ హెంగ్ తాజాగా అధికార చైనా టీవీకిచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయం వెల్లడించారు. ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్ల డిజైన్లను రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సిందూర్ ప్రకటించిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలతోపాటు వైమానిక, సైనిక స్థావరాలపైనా దాడులు చేసి, తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్కు సాంకేతిక మద్దతిచ్చామని ఝాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం. ‘ఆ నాలుగు రోజులపాటు జెట్ విమానాల శబ్ధాలు, హెచ్చరిక సైరన్ల మోతలతోపాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే, మేం తయారు చేసిన జె10సీఈ యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేసేలా చూడటం మా బాధ్యత’అని ఝాంగ్ వివరించారు. భారత్తో నాలుగు రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్కు సాయం అందించారన్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ, సైనికాధికారులు ఇప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వకపోకవడం గమనార్హం. -
బెంగాల్లో ముస్లింలు, మతువాలపై వేధింపులు
ఢాకా: పశ్చిమ బెంగాల్లో ముస్లింలు, మతువాలు వేధింపులకు గురవుతున్నారని, వారి ఓటు హక్కును కోల్పోయారని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ, ప్రతిపక్ష చీఫ్ విప్ నహీద్ ఇస్లాం వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, అక్కడి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముస్లింలు, దళితులు, మతువాలతో సహా అన్ని మైనారిటీ వర్గాలకు సమాన రక్షణ కల్పించి దక్షిణాసియాకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. చిట్టగాంగ్లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల బెంగాల్లో ఎన్నికలు జరిగా యి. ఎన్నికలు వారి అంతర్గత విషయం. దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే, ఎన్నికలకు ముందే లక్షలాది మంది ఓటర్లు తమ హక్కులను కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, మతువా వర్గానికి చెందినవారున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ ముస్లింలకు పౌరసత్వం నిరాకరిస్తున్నారని, వారిపై హింస పెరిగిందని ఆరోపణలొస్తున్నాయి’అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని మత సమూహాల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించాల్సిన బాధ్యతను బంగ్లాదేశ్పై ఉందన్నారు. బంగ్లాదేశ్ వ్యతిరేక కథనాల పట్ల, మత విద్వేష ప్రచారం, రెచ్చగొట్టే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. పారీ్టలో అంతర్గత విభేదాలను నివారించాలని, యోగ్యత, సామూహిక క్రమశిక్షణ ఆధారంగా సంస్థాగత బలాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారి హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ రాజకీయ ప్రక్రియలలో వారిని భాగస్వాములను చేయడం పార్టీ భవిష్యత్కు అత్యవసమని ఆయన పేర్కొన్నారు. -
యూఎఫ్వోలపై ఫైళ్లు బహిర్గతం
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్వో)లకు సంబంధించిన ఫైళ్లను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ బహిర్గతం చేసింది. వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పర్చుకోవచ్చని శుక్రవారం ఎక్స్లో తెలిపింది. పెంటగాన్తోపాటు వైట్ హౌస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇంధన శాఖ, నాసా, ఎఫ్బీఐలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఈ సమాచారాన్ని తక్కువ చేసి చూపడానికి, వారిని నిరుత్సాహ పర్చడానికి ప్రయత్నించాయన్న పెంటగాన్.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గరిష్ట పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. యూఎఫ్వోల ఫైళ్లను క్రమపద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ఫైళ్లను బహిర్గతం చేస్తామంటూ ట్రంప్ ఫిబ్రవరి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన కెన్నెడీ సోదరులు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీలతోపాటు, మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డులను విడుదల చేశారు. అయితే, ఇందులో అప్పటికే తెలిసిన విషయాలకు మించి మరేమీ కొత్తగా వెల్లడి కాలేదు. యూఎఫ్వోలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని పెంటగాన్ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సైనిక సిబ్బంది తాము చూసిన వింత ఎగిరే వస్తువుల గురించిన సమాచారాన్ని పంచుకోవడంతో దశాబ్దాల నాటి ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ 2022లో పెంటగాన్ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం 2024లో విడుదల చేసిన మొట్టమొదటి నివేదికలో..గుర్తు తెలియని దృగి్వషయాలకు సంబంధించిన ఘటనలు వందలాదిగా నమోదయ్యాయని తెలిపింది. గ్రహాంతర జీవుల సాంకేతికతను అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. కాగా, సైనిక సాంకేతికతపై అవగాహన లేని వారు తాజాగా వెల్లడి చేసిన వీడియోల విషయంలో పొరపాటుపడే అవకాశం ఉందని, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మయన్మార్ గనిలో 11 వేల క్యారెట్ల భారీ కెంపు లభ్యం
బ్యాంకాక్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ రత్నాల గనుల కేంద్రంలో 11,000 క్యారెట్ల, 2.2 కిలోల బరువున్న భారీ కెంపు బయటపడింది. ఇక్కడ లభించిన భారీ కెంపుల్లో ఇది రెండోదని చెబుతున్నారు. 1996లో ఏకంగా 21,450 క్యారెట్ల, 4.29 కిలోల కెంపు మయన్మార్లో బయటపడింది. అయితే, తాజాగా ఎగువ మాండలే ప్రాంతంలో దొరికిన కెంపు రంగు, నాణ్యత పరంగా ఎంతో మెరుగైందని చెబుతున్నారు. ఊదా రంగు కలిసిన ఎరుపు వర్ణంతో లేత పసుపు ఛాయలు ఉన్న ఈ కెంపు అత్యుత్తమ రంగును, మధ్యస్థమైన పారదర్శకతను, కాంతిని అధికంగా ప్రతిబింబించే ఉపరితలాన్ని కలిగి ఉంది. ఏప్రిల్లో గని కార్మీకులు ఈ కెంపును కనుగొన్నారని ప్రభుత్వం ఆదీనంలోని గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ కథనం పేర్కొంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పిజియన్ బ్లడ్ కెంపులకు మయన్మార్ పెట్టింది పేరు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే కెంపుల్లో 90 శాతం వరకు మయన్మార్లోనివే. ఇవి ఎక్కువగా దేశంలోని మొగొక్, మొంగ్ హెచ్సు రత్నాల గనుల్లో దొరుకుతాయి. ఇవే మయన్మార్కు ప్రధాన ఆదాయ వనరు. -
ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం
జకార్తా: ఇండోనేసియాలోని మారుమూల దీవి హల్మహెరాలో ఉన్న డుకొనొ అగ్ని పర్వతం అకస్మాత్తుగా బద్దలైన ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు చనిపోయారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండోనేసియాలోని అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న అగ్నిపర్వతాల్లో డుకొనొ ఒకటి. దీనిని అధిరోహించడం ప్రమాదకరమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కూడా. అయినప్పటికీ గురువారం విదేశీయులు సహా 20 మంది పర్వతారోహకులు 1,335 మీటర్ల ఎత్తయిన డుకొనొ అగ్ని పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం 7.41 గంటల సమయంలో అగ్ని పర్వతం బద్దలైంది. ఇది 16 నిమిషాలపాటు కొనసాగింది. దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తులో చిక్కని బూడిద గాలిలోకి ఎగజిమ్మింది. పర్వతారోహకుల నుంచి అత్యవసర సందేశం అందడంతో సహాయక సిబ్బంది అక్కడికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అప్పటికే సింగపూర్ వాసులు ఇద్దరు, ఇండోనేసియా వాసి ఒకరు చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్ననికి ఏడుగురు విదేశీయులు సహా 14 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. వీరిలో ఐదుగురు గాయాలపాలయ్యారు. కిందికి దిగే క్రమంలో గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో మృతదేహాలను తరలించ లేకపోయారు. డుకొనొ అగ్ని పర్వతం చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల మేర నిషిద్ధ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వీడియోల కోసం కొందరు పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నారని అధికారులు అంటున్నారు. -
బాధితుల్లో ఇద్దరు భారతీయులు
ప్రాణాంతకంగా భావిస్తున్న హంటావైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. క్రూయిజ్ షిప్లోని సిబ్బందిలో ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకింది. ముగ్గురి మరణానికి కారణమైన వైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్న ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్లో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్-19 కంటే భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఇది మహమ్మారి లాంటి ముప్పును కలిగించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.బీబీసి నివేదిక ప్రకారం అర్జెంటినా నుండి బయలుదేరిన 'MV హోండియస్' (MV Hondius) అనే డచ్ విహార నౌకలో భయంకరమైన హంటా వైరస్ (Hantavirus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉండటం ఆందోళన రేపుతోంది.ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటినాలోని ఉషువయా నుండి బయలుదేరింది. ఇది మే 10న స్పెయిన్లోని కానరీ దీవులకు చేరుకోవాల్సి ఉంది. ఈ విలాసవంతమైన నౌకలో మొత్తం 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఫిలిప్పీన్స్ (38), బ్రిటన్ (31), అమెరికా (23) దేశాల వారు అధికంగా ఉన్నారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంఅయితే మానుషులనుంచి మనుషులకు వ్యాపించే హంటావైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది.ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో నెదర్లాండ్స్కు చెందిన దంపతులతో పాటు ఒక జర్మనీ ప్రయాణికుడు ఉన్నారు. 69 ఏళ్ల డచ్ మహిళకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నౌకలో ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు . ఈ ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ద్వీపంలో సుమారు 29 మంది ప్రయాణికులు ఈ నౌక నుండి దిగిపోయారు. నౌకలో ఉన్న ఇద్దరు భారతీయుల ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతం మరింత సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంమానవుల నుండి మానవులకు వ్యాప్తి?సాధారణంగా హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ నౌకలో గుర్తించిన 'ఆండీస్ స్ట్రెయిన్' (Andes strain) రకానికి ఒక ప్రత్యేకత ఏంటంటే..మానవుల నుండి మానవులకు (పరిమితంగా) వ్యాపించే సామర్థ్యం ఉన్న ఏకైక రకం ఇదే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అంటువ్యాధిపై నిశితంగా నిఘా ఉంచింది.ఊరటనిస్తున్న WHO వివరణ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల నిపుణురాలు మరియా వాన్ కెర్ఖోవ్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఇది కోవిడ్ లేదా ఇన్ఫ్లుయెంజా వంటిది కాదు. దీని వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే ముప్పు లేదని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ, ముందుజాగ్రత్తగా నౌకలో ఉన్నవారందరూ మాస్కులు ధరించాలని, రోగులకు సేవలు అందించే వారు పిపిఇ (PPE) కిట్లు వాడాలని అధికారులు సూచించారు. -
ఐసా.. చికెన్ పీసా?
ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది? చల్లని ఐస్ ముక్క అనిపిస్తోంది కదా? కానీ కాదు.. ఇది వేడి వేడి ఫ్రైడ్ చికెన్ పీస్. ఎన్నో రకాల ఫ్రైడ్ చికెన్ చూశాం కానీ, ఈ ఐస్ ముక్కను పట్టుకుని ఫ్రైడ్ చికెన్ అంటారేంటి అనే కదా మీ డౌట్? ఎప్పుడూ ఎర్రగా ఉండే ఫ్రైడ్ చికెనేనా? పారదర్శకంగా ఉండే చికెన్ ఫ్రై చేస్తే పోలా అనుకున్నాడో ఫుడ్ బ్లాగర్. అంతే రకరకాల ప్రయోగాలు చేసి మరీ ఈ ఐస్ ముక్కలాంటి చికెన్ ఫ్రై చేసి ఔరా అనిపించాడు. చైనాకు చెందిన కై నాన్.. అచ్చం గాజుతో చేసినట్టుగా కనిపించే ఈ ఫ్రైడ్ చికెన్ చేసి ఆన్లైన్లో వైరల్ అయ్యాడు. ఈయన తన వంటల్లో మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అనే సంక్లిష్టమైన సాంకేతికతను ఉపయోగించి ఫేమస్ అయ్యాడు. తాజాగా గాజు కళాఖండాన్ని పోలిన ఫ్రైడ్ చికెన్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘నేను ఫ్రైడ్ చికెన్ను పారదర్శకంగా చేయాలనుకుంటున్నాను. కానీ ఫలితమే కొంచెం విచిత్రంగా ఉంది’అనే శీర్షికతో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. అది దాదాపు పది లక్షల వ్యూస్తో దూసుకుపోయింది. చూసేందుకు గాజు బొమ్మలా మెరిసిపోతున్న ఈ చికెన్ ముక్క వెనుక చాలా కసరత్తే ఉంది.ఎలా తయారు చేశాడంటే..? కై నాన్ ఈ గాజులాంటి ఫ్రైడ్ చికెన్ కోసం చికెన్ను ముక్కల వారీగా తిరిగి తయారు చేశాడు. ముందుగా చికెన్ ముక్కలను ఫ్రై చేశాడు. తర్వాత అందులోని ఎముకలను జాగ్రత్తగా తొలగించాడు. ఎముక మజ్జ, కొల్లాజెన్, కోల్డ్ జెల్ మిశ్రమాన్ని ఎముక ఆకారం ఉన్న అచ్చులలో పోసి గడ్డకట్టేలా చేశాడు. చికెన్ను ఒక ప్రత్యేక పరికరం ద్వారా ద్రవ రూపంలోకి మార్చాడు. ఆ తర్వాత ‘స్ఫెరిఫికేషన్’అనే పద్ధతిని ఉపయోగించి మాంసం పీచుల నిర్మాణాన్ని తిరిగి పారదర్శక రూపంలోకి తీసుకొచ్చాడు. చివరగా గాజులాంటి మాంసం, ఎముకలను మరో అచ్చులో ఉంచి ఫ్యూజ్ చేసి.. చికెన్ ముక్క ఆకారాన్ని తెచ్చాడు. అంతే.. అద్భుతమైన గాజు కళాఖండంలా కనిపించే ట్రాన్స్ పరెంట్ చికెన్ రెడీ అయిపోయింది. అయితే, కొందరు నెటిజన్లు దీనిని అద్భుతమైన కళాఖండమని, రుచి చూడాలని కుతూహలంగా ఉందని కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం దీన్ని చూస్తుంటేనే భయం వేస్తోందని, అసలు తినే వస్తువులా లేదని పెదవి విరిచారు. ఇంతకీ మీరేం అంటారు? -
హంటా వైరస్ కలకలం
వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్షిప్లో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్ గురించి ట్రంప్ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. హంటా కలకలంకాగా ఈ నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.హంటావైరస్ అంటే ఏమిటి ?హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. -
వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బీబీసీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు కథనాలు ప్రచురించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధ విరమణ విషయమై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం నేపథ్యంలో ఆ అవకాశాలు లేకుండా పోయాయి.కాగా గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రెండు రోజుల పాటు మే 8-9 (విక్టరీ డే) సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి. -
భారత్కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్సీఎంఆర్పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించింది. కానీ, ఇరాన్తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
చైనా మాజీ రక్షణ మంత్రులకు మరణ శిక్ష
బీజింగ్: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. వీ ఫెంఘ్, లి షాంగ్ఫులకు ఈ శిక్ష రెండేళ్ల తర్వాత అమలుకానుందని అధికార వార్తా సంస్థ జిన్హుమా గురువారం వెల్లడించింది. ఈ కాలంలో వీరి ప్రవర్తనను బట్టి, మరణ శిక్షను యావజ్జీవంగా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 2018–23 సంవత్సరాల్లో వీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత కొన్ని నెలలపాటు లి రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. వీ ఫెంఘ్పై లంచాలు తీసుకున్న ఆరోపణలు, లి షాంగ్ఫుపై లంచాలు తీసుకోవడంతోపాటు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, 2024లో వీరిద్దరినీ అధ్యక్షుడు జిన్పింగ్ పదవి నుంచి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తొలగించారు. జిన్ పింగ్ సారథ్యంలో పనిచేసే సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి కూడా ఉద్వాసన పలికారు. అంతకుముందు, వీరిద్దరూ చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ముఖ్యమైన రాకెట్ ఫోర్స్కు చీఫ్గా ఉన్నారు. కాగా, జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అమలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పలువురు సైనిక జనరళ్లు సహా కనీసం 10 లక్షల మంది అధికారులు శిక్షలకు గురవడం గమనార్హం. -
‘హంటావైరస్’ నౌక నుంచి డజను మందికి పైగా విముక్తి
ద హేగ్: ప్రాణాంతకర హంటావైరస్ గుప్పిట చిక్కిన విలాసవంత విహారనౌక ‘ఎంబీ హోండియస్’నుంచి డజను మందికిపైగా పర్యాటకులకు విముక్తి లభించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని రూఢీ చేసుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. ఈమెకు ఆ విమానంలో సేవలందించిన మహిళా ఫ్లయిట్ అటెండెంట్ను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచామని, లక్షణాలు ఆమెలో ఇంకా కని్పంచలేదని నెదర్లాండ్స్ వైద్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన నౌకలో తొలిసారిగా వైరస్ జాడను గుర్తించిన విషయం తెల్సిందే. అయితే మార్గమధ్యంలో నౌక పలు దేశాల్లో లంగరువేయడం, అక్కడ కొందరు ప్రయాణికులు దిగిపోయిన నేపథ్యంలో ఎంతమందికి వైరస్ సోకి ఉండొచ్చనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతలేదు. దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి. -
యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. 15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్ పోస్ట్’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది. గల్ఫ్లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్లోని మూడు స్థావరాలైన అలీ అల్–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్ అరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్లోని అల్–ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. ఫ్రెండ్లీ ఫైర్లోనూ భారీ నష్టం.. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్క్యూ–4సీ ట్రైటాన్ ఉన్నాయి. నాలుగు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఏ–10 వార్హాగ్ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. జిమ్లు, ఫుడ్ హాల్లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్’తెలిపారు. చవకైన షాహెద్ డ్రోన్లతో పోరాడటానికి విలువైన ఇంటర్సెప్టర్లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు. 50 బిలియన్ డాలర్ల ఖర్చు.. ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. -
సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత
ప్రపంచ టెలివిజన్ వార్తా ప్రసారాల రూపురేఖలను మార్చివేసిన మీడియా దిగ్గజం, సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) తుదిశ్వాస విడిచారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కన్నుమూసినట్లు టర్నర్ ఎంటర్ప్రైజెస్ అధికారికంగా ప్రకటించింది. 24 గంటల నిరంతర వార్తా ప్రసారాలు అనే అసాధ్యమైన ఆలోచనను సుసాధ్యం చేసి, ప్రపంచానికి ప్రతి క్షణం తాజా వార్తలను చేరవేసిన గొప్ప దార్శనికునిగా టర్నర్ పేరొందారు.వార్తా ప్రపంచంలో సంచలనం సీఎన్ఎన్1980లో సీఎన్ఎన్ను ప్రారంభించడం ద్వారా టెడ్ టర్నర్ వార్తా ప్రసారాల చరిత్రలో ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. ప్రారంభంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా, సీఎన్ఎన్ను ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల వార్తా నెట్వర్క్గా నిలబెట్టి తిరుగులేని విజయం సాధించారు. తన మాట తీరుతో ‘ది మౌత్ ఆఫ్ ది సౌత్’గా పేరొందిన ఆయన, అట్లాంటా బ్రేవ్స్ వంటి క్రీడా ఫ్రాంచైజీలతో పాటు, సినిమాలు, కార్టూన్ల కోసం ప్రత్యేక ఛానళ్లను సైతం ప్రారంభించి, అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రపంచ సమాచార ప్రవాహాన్ని శాసించినందుకు గాను 1991లో టైమ్ మ్యాగజైన్ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా కూడా ఆయన ఎంపికయ్యారు.బహుముఖ ప్రజ్ఞాశాలిటర్నర్ కేవలం మీడియా రంగానికే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప పర్యావరణవేత్త, దాత. ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ను స్థాపించడంతో పాటు, అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం ఎంతగానో పోరాడారు. అమెరికాలో అత్యంత ఎక్కువ ప్రైవేటు భూమి కలిగిన వ్యక్తులలో ఒకరైన ఆయన, అంతరించిపోతున్న ‘బైసన్’ (అమెరికన్ అడవి దున్న) జాతి సంరక్షణకు విశేష కృషి చేశారు. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్ సిరీస్ ‘కెప్టెన్ ప్లానెట్’ను సైతం ఆయనే సృష్టించడం విశేషం.ఆఖరి రోజుల్లో..తదనంతర కాలంలో తన మీడియా ఆస్తులను టైమ్ వార్నర్కు విక్రయించినప్పటికీ, సీఎన్ఎన్ ఏర్పాటునే తన జీవితంలో సాధించిన అత్యుత్తమ విజయంగా ఆయన ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవారు. 2018లో ‘లెవీ బాడీ డిమెన్షియా’ వ్యాధి బారిన పడిన టర్నర్, 2025లో న్యుమోనియాను కూడా జయించారు. ఆయనకు ఐదుగురు పిల్లలు, 14 మంది మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు. టెడ్ టర్నర్ భౌతికంగా దూరమైనా, ఆయన సృష్టించిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రపంచమంతటా ఎప్పటికీ నిలిచివుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఆపరేషన్ సింధూర్’ వీడియో విడుదల -
పాకిస్తాన్కు అమెరికా ఝలక్.. కీలక ప్రకటన
వాషింగ్టన్: దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పెషావర్లోని తమ కాన్సులేట్ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్ పఖ్తూంఖ్వాలోని దౌత్య సంబంధాల సంబంధిత విషయాలను ఇస్లామాబాద్లోని యూఎస్ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.పెషావర్లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు, అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. యూఎస్–పాకిస్తాన్ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్లోని యూఎస్ మిషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి శాఖ కట్టుబడి ఉందని పేర్కొంది.ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్, ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన అమెరికా కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్కు భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని అమెరికన్ పౌరులకు, ఆఫ్ఘన్ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్లో ప్రస్తుతం 18 మంది అమెరికన్ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు. -
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్కు కూడా మంచిది కాదు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు. 🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONSThis is HUGE! 🇺🇸"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026ట్రంప్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.ఇరాన్ కొత్త ప్లాన్.. మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది. -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం
ఇండోనేషియా: ఇండోనేషియాలోని ట్రాన్స్–సుమత్రా హైవేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సౌత్ సుమత్రా ప్రావిన్స్లోని నార్త్ ముసి రావాస్ రీజెన్సీలో ఈ విషాదం చోటుచేసుకుంది. లుబుక్లింగావ్ నుండి జంబీ నగరం వైపు ప్రయాణిస్తున్న బస్సు నుండి హఠాత్తుగా నిప్పురవ్వలు రావడంతో, డ్రైవర్ అదుపు తప్పి వాహనాన్ని కుడివైపు మళ్లించారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇంధన ట్యాంకర్ వేగంగా ఢీకొట్టడంతో, క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలిపోయి, లోహపు తుక్కుగా మారాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, 13 మంది ప్రయాణికులు, ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. -
వణికిస్తున్న హంటా వైరస్
జోహన్నెస్బర్గ్: అట్లాంటిక్ సముద్రంలో చిక్కుకున్న ‘ఎంవీ హోండియస్’క్రూయిజ్ నౌక నుండి ముగ్గురు వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్కు తరలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ బుధవారం ధ్రువీకరించారు. అర్జెంటీనాలో ఏప్రిల్ 1న బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవడం తెలిసిందే. క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేశారు. విషాద స్థావరంగా విలాస నౌక అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో కేప్ వర్డే తీరానికి చేరువలో, ‘ఎంవీ హొండియస్’అనే నౌక ఇప్పుడు ఓ విషాద స్థావరంగా మారింది. లోపల దాదాపు 150 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక, నేడు ఒక క్వారంటైన్ జైలుగా మారింది. షిప్ డాక్టర్ మొదలుకొని, సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్ నీడలో బందీలు. ఏప్రిల్ 1న మొదలైన ఆ యాత్ర, చివరకు సముద్రం మధ్యలో ఒక నిశ్శబ్ద సమరంగా మిగిలిపోయింది. ఎలుకల విసర్జితాల నుంచి వ్యాప్తి ఎలుకల నుంచి పుట్టి, ఇప్పుడు ’ఆండీస్’ రకంగా పరిణామం చెంది మనుషుల మధ్యే వ్యాపిస్తున్న ఈ వైరస్, ఒక అరుదైన విషాదం. తాకడం, కలిసి భోజనం చేయడం వంటి అత్యంత సన్నిహిత చర్యల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి, ప్రకృతి మానవాళికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు తీసిన ఈ వైరస్, మరికొందరి శరీరాల్లో తాండవిస్తోంది. కెనరీ దీవులకు తరలింపు ఏర్పాట్లు ప్రస్తుతం ఈ నౌక కేప్ వర్డే తీరంలో నిలిచి ఉంది. బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నౌక రాకపై కెనరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా అత్యవసర సమావేశానికి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రయాణికులలో ‘అండీస్ స్ట్రెయిన్’ను గుర్తించగా, వారిలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఐసీయూలో ఉండగా మరొకరు మరణించారు. స్విట్జర్లాండ్కు చెందిన ఒక ప్రయాణికుడు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. -
భారత్, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం. ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు. మా ద్రాక్ష రుచి చూస్తారు.. ‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు. -
మళ్లీ ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇరాన్పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం. గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్స్ట్రీట్ జనరల్లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
వామ్మో 500 కిలోల మొసలి... ఆరుగుర్ని మింగేసిందా?!
దక్షిణాఫ్రికాలోని కోమటి నది (Komati River) తీరాన వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల వ్యాపారవేత్త ఆచూకీ కోసం వెతుకుతుండగా వెలుగులోకి వచ్చిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. అనూహ్యమైన, అత్యంత భయంకరమైన విషాదం వైరల్గా మారింది. దక్షిణాఫ్రికాలో మొసళ్లు ఎక్కువగా ఉండే నది తీరాన విషాదం చోటు చేసుకుంది.అసలేం జరిగింది?ఒక వ్యాపారవేత్త తన కారుతో లోతట్టు వంతెన దాటుతుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఆయన నీటిలో కొట్టుకు పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారు ఖాళీగా ఉంది. పోలీసులు కోమటి నది ప్రాంతంలో గాలిస్తూనే ఉన్నారు, తమకు ఏమి దొరుకుతుందో లేదా అసలు ఏమైనా దొరుకుతుందో లేదో కూడా తెలియని అయోమయం నెలకొంది.కోమటి నది ఏదో మామూలు నది కాదు, స్థానికులు చాలా ప్రమాదకరమైనదిగా భావించే నది. అత్యంత భయంకరమైన ఆ జలాల్లోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ ద్వారా దించారు. డ్రోన్లను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. మొదట అంతా మామూలు గానే కనిపించింది. కానీ తనిఖీల సమయంలోనదిలోని ఒక చిన్న ద్వీపం దృష్టిని ఆకర్షించింది. ఆ పరిశీలనే ఆపరేషన్ దిశను పూర్తిగా మార్చేసింది. NEW: Police airlift a crocodile with the body of a 59-year-old businessman inside.Local police in South Africa say they suspected the crocodile ate the man after observing it from drones. They then shot it and airlifted it off.When they landed back on the ground, the… pic.twitter.com/12NBTQbmis— Collin Rugg (@CollinRugg) May 4, 2026fy"> అనుమానం తెప్పించిన మొసలి ప్రవర్తనగాలింపు సమయంలో నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై కొన్ని మొసళ్లు ఎండకు కాచుకుంటూ కనిపించాయి. అయితే, అక్కడ ఉన్న ఒక 4.5 మీటర్ల పొడవు, సుమారు 500 కిలోల బరువున్న భారీ మొసలి మాత్రం వింతగా ప్రవర్తించింది. హెలికాప్టర్ల శబ్దం వస్తున్నా అది కదలలేదు. సాధారణంగా భారీ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మొసళ్లు నిశ్చలంగా ఉంటాయని గుర్తించిన అధికారులు, ఆ మొసలిని చంపి పరీక్షల కోసం క్రూగర్ నేషనల్ పార్క్కు తరలించారు.భయంకరమైన నిజాలుమొసలి కడుపును కోసి చూడగా అధికారులకు గుండె ఆగిపోయే దృశ్యాలు కనిపించాయి మొసలి ప్రేవులలో మానవ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలు గతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల గాబ్రియేల్ బాటిస్టావిగా అనుమానిస్తున్నారు.అంతేకాదు మొసలి కడుపులో 6 రకాల వేర్వేరు బూట్లు లభించాయి. అయితే మొసళ్లు ఏది పడితే అది మింగుతాయి కాబట్టి, ఇతర బాధితులు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.కానీ గతంలో కూడా ఆ మొసలికి గతంలో కూడా బాధితులు ఉన్నారేమోనన్న ఆందోళన తలెత్తుతోంది.ప్రాణాలకు తెగించి డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ఈ ఆపరేషన్లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం కెప్టెన్ జోహన్ పాట్గీటర్ చేసిన రెస్క్యూ. మొసళ్లు నిండి ఉన్న ఆ ప్రమాదకర నదిలోకి హెలికాప్టర్ నుండి ఆయన కిందకు దిగారు. మొసలి అప్పటికే చనిపోయి నప్పటికీ, ఆ నది ప్రవాహం, చుట్టుపక్కల ఉన్న ఇతర మొసళ్ల వల్ల, ఎంతో ఒత్తిడి మధ్య అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా అవి ఎవరివో నిర్ధారిస్తారు. అయితే, నిపుణులు తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, అనేక బూట్లు లభించడం ఆందోళనకు తావిచ్చింది. దొరికిన అదనపు బూట్ల ఆధారంగా, ఈ మొసలికి గతంలో మరేవైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నది ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన అధికారులను సౌత్ ఆఫ్రికా పోలీస్ చీఫ్ అభినందించారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలను మిగిల్చింది.ఇదీ చదవండి: టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు -
బెంగాల్లో బీజేపీ.. బంగ్లాదేశ్కు భారీ గుడ్న్యూస్!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కమల దళం కల ఎట్టకేలకు నిజమైంది. రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్కు కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో, బంగ్లాదేశ్కు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇంతకీ తీస్తా నీటి విషయంలో కేంద్రం, మమత బెనర్జీ.. బంగ్లాదేశ్ వాదనలు ఎలా ఉన్నాయంటే..ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి, బంగ్లాదేశ్కు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ.. సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ అద్భుత పనితీరును కనబరిచే అవకాశముందని ప్రశంసించారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని హెలాల్ ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు.ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్ చాలాకాలంగా కోరుకుంటున్న తీస్తా ఒప్పందంపై కేంద్రంతో కలిసి పనిచేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. తీస్తా సమస్యపై హెలాల్ స్పందిస్తూ..‘గత ప్రభుత్వమే అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండూ గట్టిగా మద్దతు తెలిపాయి. అలాగే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో తీస్తా వివాదం ఒకటిగా మిగిలిపోయింది. 1996 గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే, నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.ఇప్పుడు, 1996 ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్లోనే ఉంది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, తీస్తా జలాల్లో బంగ్లాదేశ్కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేయబడింది. అయితే, ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది.తీస్తా ఒప్పందం ఇలా..2011లో డ్రాఫ్ట్ ఒప్పందంభారత్కి 42.5% నీరు.బంగ్లాదేశ్కి 37.5% నీరు.20% పర్యావరణ అవసరాలకు ఉపయోగం.అడ్డంకి: గత సీఎం మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు.సవాళ్లు..భారత్లో: ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత.బంగ్లాదేశ్లో: రెండు కోట్ల మంది ప్రజలు తీస్తా నీటిపై ఆధారపడుతున్నారు.జియోపాలిటిక్స్: చైనా భాగస్వామ్యం వల్ల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం.చైనా మద్దతు: నీటి కేటాయింపులపై ఆలస్యం జరిగితే, చైనా మద్దతుతో Teesta River Comprehensive Management and Restoration Projectను ముందుకు తీసుకెళ్తామని బంగ్లా హెచ్చరికలు. -
ప్చ్.. ట్రంప్ వల్లే కావడం లేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను పవర్ఫుల్ లీడర్గా చెప్పకుంటారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ.. శాంతి ఒప్పందాలు కుదురుస్తూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో “శాంతి దూత”గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సొంత దేశంలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దడం ఆయన వల్ల కావట్లేదు.. “నో కింగ్స్” నిరసనలు, ఐస్ (Immigration and Customs Enforcement) వ్యతిరేక ప్రదర్శనలు ఇందుకు ఉదాహరణలు. ఇవి అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, ఇవి చాలదన్నట్లు గన్ కల్చర్ మరింత పేట్రేగిపోవడం మరో తలనొప్పిగా మారింది. క్రమం తప్పకుండా అక్కడ సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండగా.. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో తమ భద్రతపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చివరికి.. వైట్హౌస్కు అత్యంత సమీపంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం.. అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. టెక్సాస్ కాల్పుల ఘటన దాకా..అమెరికాలో గన్ కల్చర్ ఏ రేంజ్కు చేరుకుందో తెలుసా?. తాజా టెక్సాస్ షూటింగ్ ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో.. 2026లో ఇప్పటివరకు 130 మాస్ షూటింగ్స్ ఘటనలు నమోదయ్యాయి. గన్ వైలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి మే దాకా 4,200 మందికి పైగా మరణాలు, 7,300 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ గణాంకాలు.. అమెరికా సమాజం ఎదుర్కొంటున్న భయానక వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. షాకింగ్ నిర్ణయం..అమెరికాలో గన్ కల్చర్ సమస్య కొత్తది కాదు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు. పైగా బ్యాక్గ్రౌండ్ చెక్స్, స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలకు నిధులు తగ్గించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది. అమెరికాలో గన్ వయలెన్స్ వల్ల పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ, ట్రంప్లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.గన్ లాబీ..అమెరికాలో ఇన్నేళ్లలో గన్ కల్చర్ కంట్రోల్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. గన్ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్హౌజ్ ఈ విషయంలో కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (NRA) వంటి సంస్థలు.. గన్ తయారీ పరిశ్రమ, అలాగే గన్ రైట్స్కు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు కలసి ఏర్పడిన వర్గమే ఈ గన్ లాబీ. గన్ కల్చర్కు అడ్డుకట్ట వేసే చట్టాలను అమెరికా కాంగ్రెస్ ఎదుటకు తీసుకొచ్చినప్పుడల్లా.. ఈ గ్రూప్ తెర మీదకు వచ్చి మోకాలు అడ్డుపెడుతూ ఉంటుంది. గన్ లేకుంటే ఎలా.. ?అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం.. ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్ లాబీ వాదిస్తుంటుంది. అలాగే.. తనను తాను రక్షించుకోవడానికి ప్రాణాంతక శక్తిని(తుపాకుల్ని) ఉపయోగించవచ్చనే చట్టాలకూ ఈ లాబీ మద్దతు ఇస్తుంటుంది.ఎంత పవర్ఫుల్ అంటే..1998–2020 మధ్య ప్రో-గన్ గ్రూపులు లాబీయింగ్ కోసం అమెరికాలో 171.9 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అందులో ఎన్ఆర్ఏ కంపెనీ ఒక్కటే 64 మిలియన్ డాలర్లు పెట్టింది. అలాగే అమెరికా ఎన్నికలనూ ఈ గ్రూపులు ప్రభావితం చేస్తుంటాయి. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎన్ఆర్ఏ ఏకంగా 30 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్ సెనేటర్లకు మద్దతుగా మరో 20 మిలియన్ డాలర్లు పెట్టింది. మనీ పవర్తోనే అమెరికా రాజకీయాల్ని ఈ గన్ లాబీ శాసించగలుగుతోంది. రిపబ్లికన్లు అయినా.. డెమొక్రాట్లు అయినా ప్రతిపాదించిన గన్ కంట్రోల్ చట్టాలు ఆమోదం పొందడం కష్టంగా ఉంటోంది. -
ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం
ఒహియో: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నవంబర్లో జరిగే తుది సమరానికి సమరశంఖం పూరించారు. బయోటెక్ వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి మంగళవారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, వ్యాపారవేత్త కేసీ పుచ్పై భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయం దరిమిలా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నామినేట్ అయిన ఒహియో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ ఎమీ ఆక్టన్తో ఆయన నేరుగా తలపడనున్నారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘన విజయం అనంతరం వివేక్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు, కానీ మన అసలు గమ్యం నవంబర్లో ఉంది’ అని అన్నారు. రామస్వామి గెలుపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వివేక్ యువకుడు, చాలా తెలివైనవాడు. దేశాన్ని ప్రేమించే మంచి వ్యక్తి. ఒహియోకు ఆయన గవర్నర్ అవుతారు. అతనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ప్రకటించారు. ప్రముఖ కన్జర్వేటివ్ నేత లారా లూమర్.. ఇది అతిపెద్ద విజయమని అభివర్ణిస్తూ, వర్ణ వివక్షతో ఆయనను అణగదొక్కాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.నవంబర్ సమరానికి సై 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వివేక్ రామస్వామి, ఆ తర్వాత వ్యూహాత్మకంగా ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రైమరీ దశలో రిపబ్లికన్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే, ఆయన తన ప్రచారాన్ని ప్రధానంగా డెమొక్రాట్ అభ్యర్థి ఎమీ ఆక్టన్ లక్ష్యంగా సాగించడం విశేషం. మరోవైపు కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఒహియో రాష్ట్రానికి సమర్థవంతంగా నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆక్టన్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ పదవీకాలం ముగియడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు బలమైన అభ్యర్థుల మధ్య నవంబర్లో జరగబోయే ఈ పోరు రసవత్తరంగా మారనుంది. -
‘హంటా’ వైరస్ విలయం.. WHO కీలక ఆదేశాలు
ప్రయా (కేప్ వర్డే): అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం రేపుతోంది. హంటా వైరస్ ఆనవాళ్లు బయటపడటంతో, ‘ఎంవీ హోండియస్’నౌకలో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు నౌకలోనే దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఈ విషాదకర ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.హంటా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుందన్న భయంతో, కేప్ వెర్డే అధికారులు నౌకను తీరానికి రానిచ్చేందుకు నిరాకరించడంతో, సముద్రపు అలల మధ్య ఆ నౌక దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయింది. ప్రయాణికులంతా తమ క్యాబిన్లకే పరిమితమయ్యారు. మాస్కులు, పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది తప్ప, ఎవరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రయాణికులందరూ తమ గదులకే పరిమితం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా నెదర్లాండ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించే యోచనలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ALERT: The WHO reports that the hantavirus cases on the quarantined cruise ship off Cape Verde probably include human-to-human spread. Maria Van Kerkhove, the head of WHO’s epidemic and pandemic preparedness: "We do believe that there may be some human-to-human transmission.” pic.twitter.com/LCddqbUGLH— WORLD NEWS (@_MAGA_NEWS_) May 5, 2026మరోవైపు.. సుదూర దక్షిణ అట్లాంటిక్ ద్వీపమైన సెయింట్ హెలెనా మరియు జోహన్నెస్బర్గ్ మధ్య విమానంలో ప్రయాణించిన 88 మంది ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. హంటా వైరస్ సోకడంతో ఒక క్రూయిజ్ షిప్ నుండి వెళ్లిన ప్రయాణికుడు మరణించాడని పేర్కొంది. కాగా, డబ్ల్యూహెచ్వో ప్రకారం, ఆ ప్రయాణికుడు సెయింట్ హెలెనా నుండి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కడానికి ముందు ఒక క్రూయిజ్ నౌకలో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్న తోటి ప్రయాణికులను, ఇతరులను గుర్తించి, సంప్రదించేందుకు ఆరోగ్య అధికారులు ఇప్పుడు కృషి చేస్తున్నారు.నౌకలో వైరస్ వ్యాప్తి టైమ్లైన్ఏప్రిల్ 1, 2026నౌక అర్జెంటీనాలోని ఉషుయా నుండి బయలుదేరింది.ప్రయాణికులు 20కి పైగా దేశాలవారు.ఏప్రిల్ 5–7, 2026కొంతమంది ప్రయాణికుల్లో జ్వరం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి.మొదట సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్గా భావించారు.ఏప్రిల్ 10, 2026ఒక డచ్ జంట తీవ్ర స్థితికి చేరి మరణించారు.వైద్యులు హంటా వైరస్ అనుమానం వ్యక్తం చేశారు.ఏప్రిల్ 12–15, 2026మరికొంత మందిలో శ్వాస సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు.ఒక జర్మన్ పౌరుడు మరణించాడు.ఒక బ్రిటిష్ పౌరుడు దక్షిణాఫ్రికాలో ఐసీయూలో చేరాడు.ఏప్రిల్ 18, 2026నౌక కేప్ వెర్డే తీరంలో నిలిపివేయబడింది.అక్కడి ప్రభుత్వం ప్రయాణికులను దిగనివ్వలేదు.ఏప్రిల్ 20–25, 2026WHO, EU జోక్యం.ప్రయాణికులు కేబిన్లలోనే ఉండాలని ఆదేశాలు.ఇద్దరు క్రూ సభ్యులు అత్యవసర వైద్య సహాయం అవసరమని ఆపరేటర్ తెలిపింది.మే 1, 2026స్పెయిన్ కానరీ దీవుల్లో డాక్ చేసేందుకు అనుమతి లభించింది.ప్రయాణికులు, సిబ్బందిని పరీక్షించి, చికిత్స చేసి, వారి దేశాలకు పంపే ప్రణాళిక. -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. డల్లాస్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, టెక్సాస్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో నిందితుడిని కొరియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డల్లాస్లో కారోల్టన్లోని కొరియన్ ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్లో మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన అనంరతం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కొరియాకు చెందిన సెయింగ్ హన్ హు(69)గా గుర్తించినట్టు పోలీసు అధికారి రాబర్టో అర్రెడోన్డో తెలిపారు.Two dead, three hospitalized after suspect opens fire during business meeting at K Towne Plaza in Carrollton pic.twitter.com/yYkpz3XwK2— Dallas Texas TV (@DallasTexasTV) May 5, 2026


