Suryapet
-
2న మంత్రి ఉత్తమ్ రాక
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి మే 2వ తేదీన తిరుమలగిరి మండలానికి రానున్నారు. మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బిక్కేరు వాగుపై చేపట్టే బ్రిడ్జి నిర్మాణ పనులకు, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.ముగ్గురు అర్హత లేని డాక్టర్లపై కేసు నమోదుసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేకుండానే వైద్యం నిర్వహిస్తున్న మూడు హాస్పిటళ్లలో ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ కె.పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, ఆపిల్ స్కాన్ సెంటర్లలో అర్హత లేకుండా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని, ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించి అనుమతి పొందారని సూర్యాపేట ఐఎంఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్గా జాఫర్మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలోని కందిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ జాఫర్ సెక్రటేరియట్లో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మండలంలోని ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. ఈఏపీసెట్కు 379 మంది హాజరుఅనంతగిరి : అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం తెలంగాణ ఈఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది. రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలకు 400 మందికి అభ్యర్థులకుగాను 379మంది హాజరు కాగా 21మంది గైర్హాజరు అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 200 మందికి 191మంది , మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకు 188 మంది హాజరైనట్లు కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు చేశారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు.అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు. -
‘స్వాహా’కారమే..
అవినీతికి నిలయంగా కొన్ని సహకార సంఘాలు కోదాడ: అన్నదాతలకు అండగా నిలిచి కష్ట సమయంలో అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఏర్పాటు చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) అవినీతికి కేరాఫ్గా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చైర్మన్లు కుమ్మక్కవుతూ రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల రాయితీలను కూడా తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలు బయట పడినప్పుడు తాత్కాలిక విచారణ చేస్తున్న అధికారులు వారిని సస్పెండ్ చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఇక వీరిపై విచారణ సంవత్సరాల తరబడి కొలిక్కి రాకపోవడంతో కాజేసిన సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతకు అండేది.. సూర్యాపేట జిల్లాలో 39 సహకార సంఘాలున్నాయి. ఇవి అన్నదాతలకు అన్ని విధాలుగా చేదోడు, వాదోడుగా ఉండడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి ప్రాథమికమైన పనులను నిర్వర్తించడంతో విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతసేపటికీ సొసైటీ నిధులను ఎలా ఆరగించాలనే యావ తప్పా రైతులకు ఉపయోగపడే పనులు చేయడం లేదని రైతుల అంటున్నారు. జిల్లాలో ఉన్న 39 సహకార సంఘాలలో 18 సంఘాలపై వివిధ రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరిగిన సంఘాలలో సంవత్సరాల తరబడి విచారణ కొలిక్కిరావడం లేదు. దీనికి కాపుగల్లు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతే ఉదాహరణగా చెప్పవచ్చు. నడిగూడెం మండల పరిధిలోని తెల్లబల్లి సహకార సంఘంలో సీఈఓగా పని చేస్తున్న ఉద్యోగి, ప్రజాప్రతినిధులతో కలిసి సొసైటీలోని రైతుల పేర కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు. ఇందులో కొంతమందివి మాఫీ కాగా మరికొన్ని మాఫీ కాలేదు. దీంతో వారికి రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం బయట పడింది. అధికారులు ప్రాథమిక విచారణ చేసి సీఈఓను తొలగించారు. ఇది గడిచి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటి వరకు తుది విచారణ పూర్తి కాలేదు. ఈ లోగా సదరు సీఈఓ ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా ఇక్కడి సొసైటీ పెద్దకు చెందిన బంధువు ఒకరు అన్నీ తానై వ్యవహారాలను నడుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది.. మునగాల మండల పరిధిలోని తాడువాయి సహకార సంఘం. ఇందులో పనిచేస్తున్న సీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్లు కలిసి రైతుల రుణమాఫీ సొమ్మును తమ సొంత ఖాతాలోకి మార్చుకున్నారు. దాదాపు రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఈ సొసైటీ చైర్మన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలను తన సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. అక్రమార్కుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నా ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని రైతులు అంటున్నారు. సొసైటీ నిర్వాహకం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేవారే కరువయ్యారు. అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తాంజిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాం. వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం. సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. సంఘాల కార్యకలాపాలపై నిగా పెంచాం. – పద్మ, డీసీఓ, సూర్యాపేట -
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవ చేయాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో ఏప్రిల్ నెలలో వచ్చే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇలాంటి కార్య క్రమాలు వృద్ధాప్యంలో ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్కల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువరప్రసాద్, హనుమారెడ్డి, విద్యాసాగర్, పొట్టా జగన్మోహన్రావు, వెంకటేశ్వరరావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు
బేస్మెంట్ పూర్తయిన లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష చొప్పున జమకోదాడరూరల్: పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడత బిల్లులు వచ్చేశాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ముగ్గుపోసి బేస్మెంట్ వరకు పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున పడుతున్నాయి. ఇప్పటి వరకు 291 మంది ఖాతాల్లో రూ.2.91కోట్లు జమ అయ్యాయి. మొదటి విడత రూ.లక్ష చొప్పున.. మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలో 23 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమఅవుతున్నాయి. ఈ 23 గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నవారిలో 3,240 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. గ్రౌండింగ్ పూర్తి చేసిన వారు 791 మంది ఉన్నారు. వీరిలో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన 291 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం 2.91కోట్లు వారిఖాతాల్లో జమ అయ్యాయి. 600 చదరపు అడుగులకు మించి కట్టుకుంటే.. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం పెట్టుకొని ఇంటి నిర్మాణం చేపట్టి బేస్మెట్ పూర్తయిన లబ్ధిదారులందరికీ మొదటి విడత బిల్లులు పడ్డాయి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకున్న వారికి బిల్లులు పడలేదు. ప్రభుత్వ నిబంధల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారి వివరాలను, ఇంటి కొలతలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఆటోమెటిక్గా నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉందా లేదా అనే విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు లోబడి కట్టుకున్న వారికి వెంటనే బిల్లులు వస్తున్నాయని అంటున్నారు. వీరిలో కొందరు తెలియక ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే మరికొందరు తెలిసికూడా కట్టుకున్నవారు ఉన్నారు. అయితే 600 అడుగుల విస్తీర్ణం కంటే మించి నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడంలేదు. అర్హత జాబితాలో ఉన్నవారు వెంటనే పనులు మొదలు పెట్టాలి మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. పనులు మొదలు పెట్టి బేస్మెంట్ పూర్తి చేసుకుంటే మొదటి విడత బిల్లులు పడతాయని అంటున్నారు.ఫ జిల్లా వ్యాప్తంగా 291 మందికి రూ.2.91కోట్లు.. ఫ 3,240 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు ఫ 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు నిర్మించుకుంటున్న వారికే బిల్లులు ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు.. నియోజకవర్గం పైలట్ అర్హులు గ్రౌండింగ్ రూ. లక్ష జమ గ్రామాలు అయినవారు సూర్యాపేట 4 257 75 24తుంగతుర్తి 6 431 108 16కోదాడ 6 962 329 172 హుజూర్నగర్ 7 1590 279 79600 చదరపు అడుగుల లోపే నిర్మించుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇష్టానుసారంగా ఇళ్లను నిర్మించుకొని ఇబ్బందులు పడొద్దు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో కట్టుకోవాలి. ఈ నిబంధలమేరకు ఇళ్లు నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులులేకుండా ఉంటుంది. అదే విధంగా అర్హత జాబితాలో పేరున్న వారు కూడా ఇంటి పనులు ప్రారంభించాలి. – ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ సూర్యాపేట జిల్లా -
ఇక.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ
హుజూర్నగర్ : గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ) విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం ప్రవేశపెట్టే అంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు ఆర్థిక భారం తగ్గనుందని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, భోజనంప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటులో ప్రభుత్వ బడుల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలో మొదట దాదాపు సగానికిపైగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఎంపిక చేసిన బడులను గుర్తించి రాష్ట్ర విద్యా శాఖకు నివేదిక అందజేయనున్నారు. కొత్తగా ప్రీ ప్రైమరీ ప్రారంభించే చోట ఉపాధ్యాయులను నియమించే అవకాశం ఉంది. పిల్లలకు పుస్తకాలతోపాటు యూనిఫామ్, రాగిజావ, మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందించనున్నారు. ప్రాథమిక విద్య బలోపేతంపై దృష్టిప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సర్కారు దృష్టిపెట్టింది. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై మాట్లాడడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 78 వరకు ఉన్నాయి. వాటిల్లో 1–5 తరగతులు చదివేవారు 20 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభించినప్పుడు ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తుండడంతో అంగన్న్వాడీ కేంద్రాల నుంచి కొందరు ప్రైవేట్ పాఠశాలకు వెళుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్కారు ప్రీ ప్రైమరీ విధానం అమలుకు మొగ్గుచూపుతోంది.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు సన్నాహాలు తాజాగా నిర్ణయం తీసుకున్న సర్కారు వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచనవిద్యా సామర్థ్యాలు మెరుగుపడతాయి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేయ డం మంచిదే. ఈ విధానం అమలు అయితే సర్కారు పాఠశాలల్లోనే నర్సరీ నుంచి యూకే జీ వరకు విద్య అందనుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు మెరుగవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయి. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
గ్రామంలోనే భూ సమస్యల పరిష్కారం
మోతె : గ్రామంలోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం–2025 అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ధరణిలో చాలా సమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు ఆందోళనలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధరణిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, 18 రాష్ట్రాలలో పరిశీలించి, నిపుణులు, మేధావులు, అధికారుల సూచనలు తీసుకొని ఈ భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారన్నారు. తర్వాత ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో అమలు చేసి, జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ మామిడి తోరణాలతో పండుగ వాతావరణంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దారు శ్రీకాంత్ పీపీటీ ద్వారా భూ భారతి చట్టం గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్, ఎంపీడీఓ ఆంజనేయులు, జలసాధన కమిటీ ఫౌండర్ దుశ్చర్ల సత్యనారాయణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విజేత.. బాపట్ల జిల్లా గిత్తలు
మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఎద్దుల పందేల్లో కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా చండూరుకు చెందిన శిరీషాచౌదరి, శివరామకృష్ణచౌదరి గిత్తలు ప్రథమ బహుమతిని గెలుపొందాయి. రెండవ బహుమతిని పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన బ్రహ్మనాయుడు గిత్తలు, మూడవ బహుమతి పల్నాడు జిల్లా మాచవరంనకు చెందిన లక్ష్మయ్యచౌదరి గిత్తలు పొందాయి. విజేతలకు చర్చి కమిటీ యూత్ సభ్యులు నగదు, షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ ఆదూరి స్రవంతికిషోర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చిన్నపరెడ్డి, మధుసూదన్రెడ్డి, బాల్రెడ్డి, బాలశౌరిరెడ్డి, ఆంటోనిరెడ్డి, థామస్రెడ్డి, సోసఫ్రెడ్డి, కిరణ్రెడ్డి, రాకేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బండ లాగుతున్న బాపట్ల జిల్లా గిత్తలు -
సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం
రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్ రెగ్యూలేటరీని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్ బాక్స్లను బిగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. హెడ్రెగ్యూలేటర్ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్, అమర్, వర్క్ ఇన్స్పెపెక్టర్ రజినీకాంత్, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్రెడ్డి, చాడ రమేశ్చందర్రెడ్డి, దండ అశోక్రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, రైతులు తదితరులు ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
సాదాబైనామాకు మోక్షం!
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్పై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పోర్టల్లో సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్ల క్రితం సాదాబైనామా కింద భూముల మార్పిడి కోసం రైతులు వేలాది దరఖాస్తులు ఇచ్చారు. నాటినుంచి వీటికి అతీగతి లేకుండా పోయింది. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు చేతికి రావడం లేదు. ఈ నేపథ్యంలో భూభారతి పోర్టల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో 29,814 పెండింగ్ దరఖాస్తుదారులకు మోక్షం కలగనుంది. సాదాబైనామాకు అవకాశం ఇవ్వడంతో..2014 జూన్ 2 నాటికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల క్రమవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీనికి సంబంధించి 2020 నవంబర్ 10 వరకు జిల్లావ్యాప్తంగా దాదాపు 29,814 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉండగా.. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టారు. పాత చట్టం ప్రకారం సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించగా కొత్తచట్టం అమలులోకి రావడంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. పెండింగ్లో 29,814 దరఖాస్తులు ఐదేళ్లుగా కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు పట్టాలు రాక నానా అవస్థలు భూ భారతి పోర్టల్పై ఆశలుఆర్డీఓలకు బాధ్యతలు.. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ చట్టంలోనే ఈ సాదాబైనామా దరఖాస్తులపై 90 రోజుల్లోపు విచారణ చేపట్టాలని, ఈ బాధ్యతలను సైతం ఆర్డీఓలకు అప్పగించారు. విచారణ చేపట్టి దరఖాస్తుదారులకు హక్కులు కల్పించాలని చట్టంలో పేర్కొనడంతో వారికి ఊరట కలగనుంది. -
సస్యశ్యామలం చేస్తాం
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. బక్కతాయికుంట (రూ.20.22 కోట్లు), మునుగోడు (రూ.6.08 కోట్లు), నర్సింగ్బట్ల (రూ.19.95 కోట్లు) ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్కు ఎదుల ద్వారా నీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. తాము రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పిలిిప్పిన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రణాళికా బద్ధంగా జిల్లా అభివృద్ధి.. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్ అదనపు బ్లాక్, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్ సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నిర్మించే అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్కు తీసుకొస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నామన్నారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే ఎక్కువ సమయం కార్యాలయాల్లో ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, మందుల సామేల్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ శరత్చంద్రపవార్, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్కుమార్, నీటిపారుదల సీఈ అజయ్కుమార్, డీఆర్ఓ అశోక్రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈఈ సతీష్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణం సాగుతోంది : మంత్రి కోమటిరెడ్డి ఫ కలెక్టరేట్ అదనపు భవన సముదాయం, లిఫ్టు పనులకు శంకుస్థాన -
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్మార్, దోగిపర్తి సంతోష్, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు. -
ప్రతి కమతానికి ‘భూధార్’
హుజూర్నగర్ : భా భారతి చట్టంతో సులువుగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం హుజూర్నగర్లో భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కమతానికి భూధార్ కార్డు కేటాయించి దీనిలో హద్దులతో కూడిన మ్యాప్ పొందుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఫౌతి చేసేటప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన మ్యుటేషన్లపై అపీల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో మ్యుటేషన్ల అభ్యంతరాలు ఉంటే రెండు అంచెలుగా అపీల్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. భూభారతి చట్టంపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీఓ శ్రీనివాసులు భూభారతిలోని ఒక్కొక్క అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. సదస్సులో ఏఎంసీ చైర్పర్సన్ దేశ్ముఖ్ రాధిక, డీసీసీబీ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, ఏడీఏ రవి, ఇన్చార్జి తహసీల్దార్ నాగేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్లు జక్కుల నరేందర్, శౌరిరెడ్డి, గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సూర్యాపేటటౌన్ : ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్జీలు పరిష్కరించాలి● అదనపు కలెక్టర్ రాంబాబుభానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 80 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలు, హౌసింగ్పై దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. తహసీల్దార్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి లత, ఎల్డీఎం బాపూజీ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 10 నుంచి కల్యాణమహోత్సవాలుహుజూర్నగర్ : మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి 15 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకొని సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగ, ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేవ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మహానివేదన చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి , ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు
నకిరేకల్: వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్పై కాంగ్రెస్ మంత్రులు పొగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, వంటల చేతన్, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి.. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్, దొడ్డి మనోజ్ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
వరి కొయ్యలను కాల్చొద్దు
గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే.. ● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్తో పాటు 1400 కిలోల కార్బన్డైయాకై ్సడ్ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్ పాస్పేట్ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్డైయాక్సెడ్ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి. నేలలో కలియ దున్నితే అధిక లాభాలు గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్ -
కోతుల దాడిలో వృద్ధుడికి గాయాలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోదాడలో పిచ్చి కుక్క స్వైర విహారం ● 10 మందిపై దాడి ● ఓ బాలుడికి తీవ్రగాయాలు కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్నగర్, తిలక్నగర్, ఖమ్మం క్రాస్రోడ్ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్ విగతజీవిగా కనిపించాడు. హజరత్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ రెడ్డి, పరమేష్, నవీన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఆటో సీజ్ -
తీరని కషా్టలు
వడువని వడ్లు..భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వసతులు కల్పించలేదు. ఏ సెంటర్లోనూ రైతులకు నిలువ నీడ లేకుండా పోయింది. కేవలం చెట్ల నీడనే సేదదీరే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల తాగునీటి వసతి లేక వేసవిలో మండుతున్న ఎండలకు దాహార్తి తీర్చుకోవడానికి రైతులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. వీటితో పాటు టార్పాలిన్లు లేకపోవడంతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతోంది. గన్నీ బ్యాగులు, సరైన రవాణా సదుపాయంలేక కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. 4.07 లక్షల మెట్రిక్ టన్నలే లక్ష్యంగా..జిల్లాలో యాసంగి సీజన్లో అత్యధికంగా వరి సాగైంది. దొడ్డురకమే కాకుండా సన్నరకాలను రైతులు సాగు చేశారు. దాదాపు 4.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. రైతులు అవసరాలు, విత్తనాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా చివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను 286 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా మందకొడిగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తేమ పేరుతో చాలాచోట్ల కాంటాలను నెమ్మదిగా వేస్తున్నారు. మరికొన్నిచోట్ల గన్నీబ్యాగుల కొరత, రవాణా సదుపాయం లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. అసౌకర్యాలతో ఇబ్బందులు..ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కరెంటు, టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు, టెంట్ సౌకర్యం ఉండాల్సి ఉంది. అయితే జిల్లాలోని 286 సెంటర్లకు గాను ఏ సెంటర్లోనూ కనీస సౌకర్యాలను నిర్వాహకులకు కల్పించడం లేదు. చాలాచోట్ల నీడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టెంట్ కూడా వేయకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల నీడన ధాన్యం ఆరబోయడం, రాశి చేసేందుకు వచ్చి అలసిపోయిన రైతులు ఉంటున్నారు. కేవలం సెంటర్ల నిర్వాహకులు ఉండేలా చిన్నపాటి టెంట్ మాత్రమే వేస్తున్నారు. ఇక మంచినీళ్లు సైతం చాలా సెంటర్లలో అందుబాటులో ఉండడం లేదు. అలాగే టార్పాలిన్లు ఒక్క సెంటర్లోనూ అందుబాటులో లేవు. రైతులే స్వయంగా కొనుగోలు చేసి తమ పంటను కాపాడుకుంటున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా అకాల వర్షాల నేపథ్యంలో నిర్వహకులు ముందు జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం కొనుగోళ్లను సైతం ముమ్మరం చేయకపోవడంతో రైతులు రోజుల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు. రైతులపై టార్పాలిన్ల కిరాయి భారంకొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు టార్పాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు పట్టాలను కిరాయికి తెచ్చుకుంటున్నారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ.30కి తెచ్చుకొని ధాన్యంపై కప్పుకుంటున్నారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సుమారు 20 రోజులకుపైగా పడుతోంది. అయితే రెండు ఎకరాల్లో పండించిన ధాన్యం ఆరబోయడంతో పాటు కప్పడానికి ఐదు పట్టాలు అవసరం. వీటి కోసం రోజు రూ.150 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా 20 రోజుల పాటు ఉంటే రైతుపై రూ.3వేల అదనపు భారం పడుతుంది.ఇది.. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం. ఈ కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. నీడకోసం చిన్న గుడిసె వేసినప్పటికీ అది నిర్వాహకులు ఉండడానికే సరిపోతుంది. రైతులు మాత్రం చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. టార్పాలిన్ల సరఫరాలేక రైతులే కిరాయికి తెచ్చుకొని ఇలా కొప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఈ పరిస్థితే నెలకొందిఫ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు ఫ ఎండలో చెట్లను ఆశ్రయిస్తున్న రైతులు ఫ తాగునీటికీ ఇబ్బందే.. ఫ టార్పాలిన్లులేక వర్షాలకు తడుస్తున్న ధాన్యం ఫ మందకొడిగా ధాన్యం కొనుగోళ్లుచెట్ల కిందనే ఉంటున్నాం రామన్నగూడెం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 20 రోజుల కిందట 600 బస్తాల ధాన్యం అమ్మడానికి పోశాను. ఇంతవరకు కాంటాలు కాలేదు. లారీలు రాకపోవడం, మిల్లులలో తొందరగా దిగుమతి కాకపోవడం మూలంగా రోజుల తరబడి కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సౌకర్యాలు ఏమీ లేవు. నీడలేక చెట్ల కిందనే ఉంటున్నాం. ఈ కేంద్రంలో ధాన్యం పోయడానికి స్థలం లేక గంగ దేవమ్మ బండపైనే ధాన్యం పోశాను. వర్షం వస్తే ధాన్యం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. – వజ్జె శ్రీనివాస్, రైతు, రామన్నగూడెం -
ఫార్మసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ పాస్కు అడ్డదారులుకోదాడ: కోదాడ కేంద్రంగా కొద్ది రోజులుగా జరుగుతున్న జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల బీఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో భాగంగా బ్యాక్లాగ్ సబ్జెక్ట్లు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. పరీక్ష రాయాల్సిన విద్యార్థులను ఓ ఫంక్షన్ హాల్ వద్ద కూర్చోబెట్టి పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లును అక్కడికి తెచ్చి ఇచ్చి పరీక్ష రాసిన అనంతరం వాటిని తీసుకెళ్లి పరీక్షా కేంద్రంలో ఉన్న ఇతర విద్యార్థుల పేపర్లతో కలుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి కళాశాల యాజమాన్యాన్ని భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని భావించిన కళాశాల యాజమాన్యం దీనిలో కొంత మొత్తం ముట్టజెప్పినా ఈ విషయం బయటకు పొక్కి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందంటే... కోదాడలో ఉన్న ఐదు బీఫార్మసీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారు. వీరిలో కొందరు ఫైనల్ ఇయర్కు వచ్చినప్పటికి మొదటి సంవత్సరం సజ్జెక్ట్లు పాస్ కాలేదు. ఈ సారి కూడా పాస్ కాకపోతే విద్యాసంవత్సరం వృథా కావడంతో పాటు వచ్చే సంవత్సరం మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుందని భావించి సెంటర్ నిర్వాహకులతో మాస్కాపీయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలుంటాయి కాబట్టి అక్కడ కాకుండా వేరే చోట పరీక్ష రాసి ఆ జవాబు పత్రాలను తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలోని జవాబు పత్రాలతో కలపడానికి కోదాడలోని ఓ సెంటర్ నిర్వాహకులు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీని కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున సదరు సెంటర్ నిర్వాహకులు వసూలు చేశారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రహస్య ప్రదేశంలో.. ఒప్పందంమేరకు విద్యార్థులందరినీ ఒక రహస్య ప్రదేశం(ఓఫంక్షన్హాల్) లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తుండగా కొందరికి సమాచారం తెలిసింది. దీంతో దాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి కళాశాల యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు కొంత మొత్తం ముట్టజెప్పి విషయాన్ని బయటకు రాకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు స్థానిక విద్యార్థులు గమనించి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై జేఎన్టీయూహెచ్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అక్రమాలకు పాల్పడిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ ఫంక్షన్హాల్కు రహస్యంగా పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లు తెచ్చి రాయిస్తున్న సెంటర్ నిర్వాహకులు ఇతర రాష్ట్రాల బ్యాక్లాగ్ విద్యార్థుల నుంచి కళాశాల నిర్వాహకుల వసూళ్లు! కోదాడలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
సూర్యాపేట అర్బన్: ఆపరేషన్ కరాగ్ను నిలిపివేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపుమేరకు వామపక్ష పార్టీలతో కలిసి నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపి మాట్లాడారు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అడవులన్నీ బాంబుల మోతలతో తల్లడిల్లుతున్నాయని, కర్రెగుట్ట పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుంచి ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా వందలాదిమంది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్రె గుట్ట ప్రాంతం నుంచి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా స్పందించి ములుగు, చర్ల ప్రాంతాల్లో ఉన్న బలగాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ జిల్లా నాయకుడు దంతాల రాంబాబు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎల్. భద్రయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. లింగయ్య, ప్రజా ఫ్రంట్ నాయకులు కోటయ్య, కరీం, సీపీఐ జిల్లా నాయకులు బూర వెంకటేశ్వరు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దండ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
సూర్యాపేట టౌన్: బైక్పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గల అండర్ పాస్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మఠంపల్లిలో పందెం గిత్తల జోరు
● కొనసాగుతున్న ఎద్దుల పందేలుమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్రెడ్డి, గ్రేగోల్డ్ సిమెంట్స్ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్రెడ్డి, రవీందర్రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సోలార్ ప్లాంట్లు
పీఎం–కుసుమ్ పథకం కింద యూనిట్ల స్థాపన సబ్స్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరం.. వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. హుజూర్నగర్ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్ రెడ్కో అధికారులు ఎల్ఓ (లెటర్ ఆఫ్ అవార్డు) అందజేశారు. దీర్ఘకాలిక ఆదాయ వనరు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. ఫ విద్యుదుత్పత్తితో ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక ఫ మూడున్నర ఎకరాల పట్టాభూమి ఉన్నవారికి అవకాశం ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి. నిబంధనల ప్రకారం ఈఎండీ చెల్లించిన దరఖాస్తుదారులు డిస్కంలతో పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల అభీష్టం మేరకు ప్లాంట్లు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తున్నాం. బ్యాంకులు కూడా రుణాలు అందిస్తాయి. – ఎం.పాండురంగారావు, ఉమ్మడి జిల్లా మేనేజర్, టీజీ రెడ్కో నల్లగొండ జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్ఓ చెల్లింపులు ఇచ్చింది నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24యాదాద్రి 224 58 31 -
అందని హమాలీ చార్జీ
హమాలీ డబ్బులు చెల్లించాలి కాంటాలు వేసిన వడ్లకు హమాలీ ఖర్చు భారంగా మారింది. ఏటేటా హమాలీ కూలి పెంచుతున్నారు. ప్రభుత్వం ఈ డబ్బులను రైతుల అకౌంట్లలో వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సీజన్లో రూ.7నుంచి రూ.8వేల వరకు ఈ హమాలీలకే ఇవ్వాల్సి వస్తుంది. – బండి సత్యనారాయణ, కొత్తగూడెం, తుంగతుర్తి మండలం నేరుగా హమాలీలకే ఇవ్వాలి ప్రభుత్వం మొదట్లో హమాలీ ఖర్చులను రైతుల అకౌంట్లలో జమచేసింది. ఈ డబ్బులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. రైతులు కాకుండా నేరుగా హమాలీలకు ఇస్తే బాగుంటుంది. హమాలీ చార్జితో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. – బోళ్ల లక్ష్మయ్య, అనంతారం సూర్యాపేట : విత్తనం నాటిన నాటినుంచి పంటను అమ్మేదాకా రైతులకు ఖర్చుల భారం తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకుని ధాన్యం పండించిన రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామన్నా.. కష్టకాలంగానే మా రింది. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులు కాంటాలు వేసిన ధాన్యానికి హమాలీ ఖర్చును మొదట్లో ప్రభుత్వమే భరించింది. కానీ కొన్ని సీజన్లుగా హమాలీ ఖర్చు చెల్లించకపోవడంతో రైతులే హమాలీలకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారికి ఖర్చు తడిసిమోపడవుతోంది. ఈ యాసంగి సీజన్లోనైనా ప్రభుత్వం హమాలీ చార్జి చెల్లిస్తుందేమోనని రైతులు ఆశపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లక్ష్యం.. 4.07 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 4.07లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే గోనెసంచుల్లో వడ్లను నింపి లారీల్లో ఎత్తే హమాలీ ఖర్చును జిల్లాలో రైతులే భరిస్తున్నారు. ఈ సెంటర్లను నెలకొల్పిన తొలినాళ్లలో 2014, 2015 సీజన్లలో ప్రభుత్వం చెల్లించింది. మొదటగా రైతులు ఇస్తే వడ్ల బిల్లులు పడే సమయంలోనే హమాలీల డబ్బులను క్వింటాకు రూ.32 చొప్పునప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం అధికారులు ఈ లెక్కలు ప్రభుత్వానికి పంపుతున్నా.. డబ్బులు అందడం లేదు. ఏటేటా రైతులపై భారం వడ్ల కాంటా సమయంలో రైతులకు హమాలీల ఖర్చు విపరీతంగా ఉంటుంది. మొదట్లో క్వింటాకు రూ.30లకు వేసిన హమాలీలు సీజన్ సీజన్కు పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల క్వింటాకు రూ.50ల వరకు వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఉల్పాల పేరుతో వడ్లను బట్టి అదనంగా మరో రూ.500 నుంచి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఎకరం సాగు చేసిన వారికి హమాలీ ఖర్చు మొత్తంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అవుతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఈ లెక్కన హమాలీల ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రైతులపై భారం పడుతోంది. ఇలా ప్రతి సీజన్లోనూ రూ.20 కోట్ల వరకు హమాలీ చార్జీల రూపంలో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఫ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు భారంగా హమాలీ ఖర్చు ఫ ఏటా ఒక్కపైసా విడుదల చేయని ప్రభుత్వం ఫ ఇప్పటికై నా చెల్లించాలని అన్నదాతల వేడుకోలు కొన్న ధాన్యం.. హమాలీ చార్జీల వివరాలు ఇలా.. సీజన్ కొన్నధాన్యం హమాలీ ఖర్చు (లక్షల మెట్రిక్ టన్నుల్లో) (రూ.కోట్లలో..) వానాకాలం(2024–25) 2.40 12 వానాకాలం(2023–24) 2.80 14 యాసంగి(2023–24) 3.30 16.5 వానాకాలం(2022–23) 3.10 15.50 యాసంగి(2022–23) 3.80 19 -
దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : దొంగతనాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల్లో చాలామంది దూర ప్రాంతాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. ఎక్కువ రోజులు ఇళ్లు వదిలి వెళ్ళేవారు ఇరుగుపొరుగు వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటికి అలారం సిస్టమ్ పెట్టుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్ ఫోన్ ద్వారా చూసుకోవాలని సూచించారు. ఆరుబయట మేడపైన పడుకునే వారు మెడలో ఆభరణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, వాకిట్లో ముగ్గులు వేసే సమయంలో ఆభరణాలను చీర పైటతో కవర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా అపరిచితులు అడ్రస్ అడుగుతూ ఏమార్చి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరుచిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్వహించిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో రెండు నూతన గ్రామ శాఖ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ శాఖ కార్యదర్శులుగా బెజవాడ వినోద్, తాళ్లూరి వెంకటయ్య, సహా కార్యదర్శులుగా కడారి నరేష్, అలవాల రాజేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, చేపూరి కొండలు, సాహెబ్ అలీ, చిలువేరు అంజనేయులు, పిల్లుట్ల కనకయ్య, తాళ్లూరి మట్టయ్య, పెదమల్లయ్య, ఖాజామియా, నాగయ్య పాల్గొన్నారు. తొలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి సూర్యాపేట అర్బన్ : తెలంగాణ తొలిదశ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తొలిదశ ఉద్యమకారులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్య సదుపాయంతో పాటు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో తొలి తెలంగాణ ఉద్యమకారులు దేవత్ కిషన్ నాయక్, కక్కిరేణి వెంకన్న, వున్నం సత్యనారాయణ, హజారి రంగయ్య, కొల్లూరి రామారావు, బందు రుద్రమ్మ, చిత్రం భద్రమ్మ, బత్తుల మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని పూర్తిచేసి నిత్యకల్యాణం నిర్వహించారు. అదే విధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో భువనగిరి డీఆర్డీఏ పీడీగా పనిచేసి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లారు. మొదటిసారి ఐఏఎస్ అధికారి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) హోదాలోనే దేవాదాయ శాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయ శాఖ డైరెక్టర్గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా పధ్నాలుగు నెలలుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న భాస్కర్రావు బదిలీ అయ్యారు. -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆ తరువాత గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
బోనస్ డబ్బుల కోసం కక్కుర్తి!
చిలుకూరు: సన్నధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బుల కోసం కక్కుర్తిపడి అక్రమాలకు తెర తీశారు కొందరు. ఈ వ్యవహారం ఆదివారం చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2,300తోపాటు బోనస్గా రూ.500 కలిపి రూ.2,800 చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకే బోనస్ వస్తుంది. కానీ, నారాయణపురం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ఓ వ్యాపారి వద్ద ధాన్యం కొంటూ నిబంధనలు విరుద్ధంగా వ్యవహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. నారాయణపురం గ్రామానికి చెందిన ఒక వ్యాపారి స్థానిక పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను మచ్చిక చేసుకున్నాడు. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు లారీల్లో 600కుపైగా ధాన్యం బస్తాలను (70 కేజీల బస్తాలు) తీసుకొచ్చి కేంద్రంలో రాశులుగా పోశాడు. ఆ ధాన్యాన్ని కేంద్రం నిర్వాహకులు కాంటా వేశారు. వారం రోజుల క్రితం కూడా ఇదే వ్యాపారికి చెందిన మరో లారీ ధాన్నాన్ని కాంటా వేయించినట్లుగా తెలిసింది. ఈ విషయం గ్రామ రైతులు, సంఘం చైర్మన్కు తెలియడంతో నిబంధనలకు విరుద్ధంగా ఎలా కాంటా వేస్తారని కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. అయితే సదరు వ్యాపారి రైతుల నుంచి తక్కువ రేటుకు కొని మద్దతు ధరతోపాటు బోసస్ వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఈ కేంద్రంలో అమ్మినట్టు తెలుస్తోంది. అయితే బినామీ రైతుల పాస్ పుస్తకాలు చూపించి అమ్మడం, కేంద్రం నిర్వాహకులు ఆ వ్యాపారి ఇచ్చే కమీషన్కు ఆశపడి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో కూడా మండల పరిధిలోని కొండాపురం ఐకేపీ కేంద్రంలో ఇత ర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయడంతో అధికా రులు స్పందించి దిగుమతి కోసం మిల్లుకు వెళ్లిన సదరు లారీని వెనక్కి రప్పించారు. ఈ ఘటనపై విచారణ చేసి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయినా అధికారుల తనిఖీలు లేక మళ్లీ నారాయణపురంలో ఇలాంటి వ్యవహారమే కొనసాగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీలు చేయాలని, సదరు కొనుగోలు కేంద్రంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. ఫ బినామీ రైతుల పేరుతో ధాన్యం అమ్ముతున్న వ్యాపారి ఫ నారాయణపురం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు ఫ కమీషన్కు ఆశపడి సహకరిస్తున్న సెంటర్ నిర్వాహకులు -
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తోంది.తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్కుమార్తో కలిసి అదే బుల్లెట్పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్ను అచ్యుత్కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మండే కాలం.. జర భద్రం!
లోక రక్షణార్థమే ఏసు జననం లోక రక్షణార్థమే ఏసుక్రీస్తు జన్మించారని విజయవాడ మేత్రాసన పీఠాధిపతి జోసెఫ్ రాజారావు అన్నారు. శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదుల రక్షణ తప్పనిసరి ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు. కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి. ● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు. ● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి. ● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి. ● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి. ● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి. ● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో పాల్గొనాలి వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో అందరూ భాగస్వాములు కావాలి. – కనుకుంట్ల విద్యాసాగర్రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్ న్యూస్రీల్పెంపుడు జంతువులు – జాగ్రత్తలు.. -
ఏడాదైనా 20శాతం పనులే..
సూర్యాపేట పట్టణంలో నత్తనడకన యూజీడీ నిర్మాణందోమలు వృద్ధిచెందాయి రోడ్ల పక్కనే మురుగు కాల్వలు ఉండడంతో దుర్వాసన వస్తోంది. దోమలు వృద్ధిచెందుతున్నాయి. యూజీడీ ఏర్పాటు చేయడం సంతోషకరం. కానీ నెలల తరబడి పనులు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. – చిత్తలూరి నరేష్, శ్రీనివాస కాలనీనిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తాం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఇప్పటికీ 20శాతం మేర పూర్తయ్యాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తాం. అన్ని వార్డుల్లో పైప్లైన్ వేసిన తర్వాత మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తాం. – నరేందర్, ఏఈ ఫ రూ.316 కోట్లతో పనులకు శ్రీకారం ఫ మొదటి జోన్లో కొనసాగుతున్నా.. రెండో జోన్లో మొదలు కాలే.. ఫ డిజైన్ రూపకల్పనలో జాప్యం.. బిల్లులు అందక ఆలస్యంసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డిజైన్ సర్వే చేయడంలో జాప్యం.. కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు అందకపోవడం.. వెరసి రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది దాటినా 20శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2024 మార్చిలో ప్రారంభించినా.. సూర్యాపేట పట్టణంలో సుమారు రూ.316కోట్ల అంచనా వ్యయంతో 290 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇంటి నుంచి మెయిన్పైప్లైన్కు ఎనిమిది ఈంచుల వ్యాసం గలపైపులు, మెయిన్లైన్ కోసం ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రెండు నుంచి మూడు ఈంచుల వ్యాసం గల పైపులు వేయాలని నిర్ణయించారు. యూజీడీ పనుల కోసం పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. పనులకు 2023లో శంకుస్థాపన చేయగా 2024 మార్చిలో ప్రారంభించారు. మొదటి జోన్లో.. మొదటి జోన్లో భగత్సింగ్నగర్, జమ్మిగడ్డ, చింతలచెరువు, తిరుమలనగర్, చర్చికాంపౌండ్, అంబేద్కర్ నగర్, పాత ఎమ్మార్వో ఆఫీస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పైపులు వేసి వీటిని జమ్మిగడ్డలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన తర్వాత పుల్లారెడ్డి చెరువులోకి తరలించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ జోన్లో పనులు ప్రారంభమయ్యాయి. చర్చికాంపాండ్, బాలాజీ నగర్, భగత్సింగ్నగర్, అంబేద్కర్నగర్లో మొయిన్ పైప్లైన్ వేసే పనులు పూర్తయ్యాయి. ఇళ్ల నుంచి మెయిన్ పైప్లైన్కు పైపులు వేయలేదు. మిగతా చోట్ల మెయిన్పైప్లైన్ వేసే పనులు సాగుతున్నాయి. రెండో జోన్లో ఇలా.. రెండో జోన్ లో 9, 23, 24,25,29, 39, 40,41 42 వార్డుల్లో యూజీడీ పైపులు వేసి ఆ మురుగునీటిని నల్లచెరువు వద్ద నిర్మిస్తున్న ముగురునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నల్లచెరువులోకి తరలిస్తారు. కానీ ఈ జోన్లో పనులే మొదలు కాలేదు. ఇందిరమ్మ ఫేస్–1, ఫేస్2, ఫేస్–3, శ్రీనివాస కాలనీ, రాజీవ్నగర్ ప్రాంతాల్లో మెయిన్ పైప్లైన్ వేయడానికి మార్కింగ్ వేసి వదిలేశారు. బిల్లులు రాక.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ డిజైన్ రూపకల్పనలో ఆలస్యం కారణంగా పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. దీనికితోడు కాంట్రాక్టర్కు గతంలో సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రజలకు తప్పని ఇబ్బందులు బాలాజీ నగర్, శ్రీరాంనగర్, కాశీంపేట ప్రాంతాల్లో రోడ్డును తవ్వి మెయిన్పైస్ లైన్ వేసి పూడ్చారు కానీ రోడ్డును చదును చేయకపోవడంతో గుంతలుగుంతలుగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలి ఇందిరమ్మ ఫేస్–1 కాలనీలో ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. రోడ్డు మధ్యలో డ్రిల్లింగ్ మిషన్లతో రంధ్రాలు చేసి వదిలేశారు. చీకట్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేయాలి. – యాతాకుల రాజయ్య, ఇందిరమ్మ కాలనీసూర్యాపేట పట్టణంలో వార్డులు 48నివాస గృహాలు 39,800జనాభా 1.53 లక్షలు యూజీడీ అంచనా వ్యయం రూ.316 కోట్లు -
చిన్న పిల్లల రక్షణ ప్రధానం
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు సన్మానం
చివ్వెంల: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శారదను శుక్రవారం సూర్యాపేటలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఎక్స్ అఫీషియో సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఎక్స్అఫీషియో సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, నల్లపాటి మమత తదితరుల పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి భానుపురి (సూర్యాపేట): ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో కోదాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై నిర్వహించినసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రతిరోజూ విద్యార్థులకు తెలుగు రాయడం, చదవడం నేర్పించడానికి సమయం కేటాయిస్తూ నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అర్థంకాని విద్యార్థులకు వీడియోల ద్వారా తెలుగు, హిందీ భాషలు నేర్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ అశోక్, క్వాలిటీ కోఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్కుమార్, ఇంక్లూజివ్ కోఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కోఆర్డినేటర్ పూలమ్మ పాల్గొన్నారు. నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదు సూర్యాపేటటౌన్ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదని ఎస్పీ కె.నరసింహ అన్నారు. కన్న కూతురిని నరబలి ఇవ్వగా తల్లికి ఉరిశిక్ష విధించిన కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవిందర్ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పోలీస్ లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ గంపల శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్వహించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఆ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్రెడ్డి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ పాండు నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రెటరీ డి.స్వప్న, సీటీఓ విభాగం చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం.సైదులు, వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ పాల్గొన్నారు. -
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లా జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. - IIలోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు బాగా తాగాలి. – రమణ, జనరల్ ఫిజీషియన్, సూర్యాపేట -
కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా..
కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధికారులు. ● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి. ● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి. ● గ్రీన్మ్యాట్పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి. ● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు. కుండీల్లో పదును ఉండేలా చూస్తున్నా.. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ వేడిమికి మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. కుండీల్లో నాటిన మొక్కలకు ఎప్పుడు తడిగా ఉండేలా చూస్తున్నా. సూర్యరశ్మి తక్కువ సోకే ప్రాంతాల్లో మొక్కలను ఉంచుతున్నా. – దాత్రక్ పద్మ, భువనగిరి -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
హుజూర్నగర్ : వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్నగర్లో వాల్ పెయింట్ వేసి నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సభతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్స్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, నాయకులు పి.ఉపేందర్, డి.నరసింహారావు, ఆర్.రాము, నరసింహారావు, అంజి, చుక్కయ్య, నాగరాజు, కొరివీరయ్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి చట్టం.. రైతులకు వరం
మునగాల: భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిదని.. ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోదాడ ఆర్డీఓ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 279 రెవెన్యూ గ్రామాల్లో గ్రామపరిపాలన అధికారుల వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ సంద్భంగా స్థానిక తహసీల్దార్ చట్టం విధివిధానాలను సదస్సులో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శిరీష, కోదాడ ఏడీఏ డి.ఎల్లయ్య, ఏఓ బి.రాజు, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, ఐకేపీ ఏపీఎం నాగెల్లి నగేష్, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, పీఏసీఎస్ల చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, తొగరు సీతారాములు, వి.రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే.. నడిగూడెం: భూసమస్యల పరిష్కా రానికే భూ భారతి చట్టం వస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపట్టారని, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి భూ భారతి పోర్టల్లో మార్పుల అనంతరం ఈ చట్టాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి జిల్లా అటవీశాఖ అధికారి పి.సతీష్ కుమార్, కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ దాసరి సంజీవయ్య, ఏడీఏ యల్లయ్య, ఏఓ రాయపు దేవప్రసాద్, సహకార సంఘాల చైర్మన్లు కొల్లు రామారావు, గోసుల రాజేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హుజూర్నగర్ మార్కెట్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
హుజూర్నగర్ : హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది. గురువారం ఆ కార్యాలయములో ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీధర్ సమక్షంలో చైర్పర్సన్ దేశ్ముఖ్ రాధిక అరుణ్ కుమార్, వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి, సభ్యులు ముత్యాలంపాటి నాగుల్ మీరా, బత్తుల సైదిరెడ్డి, తొడేటి శ్రీనివాస రావు, మోదాల వెంకన్న, లచ్చిమల్ల నాగేశ్వరరావు, గజ్జెల కొండా రెడ్డి, నట్టె జానకిరాములు, నందిపాటి కోటయ్య, భూక్యా రాయ్సిల్, చెక్కర వెంకటరెడ్డి, మట్టపల్లి వెంకటనారాయణ, గుండా శ్రీనివాసరావు, జవ్వాజి రామ చంద్రయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి శర్మ, ఏడీఏ రవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారిని స్థానిక నాయకులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ ద్వితీయ శ్రేణి కార్యదర్శి, సిబ్బంది, రైస్ మిల్లుల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హతకు మించి వైద్యం!
సూర్యాపేటటౌన్ : నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏళ్లతరబడి అధికారుల కళ్లుగప్పి వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణిఅవుతున్న బాగోతం గుట్టురట్టు చేశారు. తాజాగా గురువారం నిర్వహించిన తనిఖీల్లోనూ నలుగురు డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది. అర్హత లేకుండానే 13 ఏళ్ల నుంచి వైద్యం అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్తో 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్లూ ఎండీ రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. అయితే గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం తనిఖీల్లో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. డాక్టర్ కిరణ్ తన తండ్రి వీరభద్రం పేరులోని ఇంగ్లిష్ అక్షరాలలోని ఎం.డీ. పదాలను ఎంబీబీఎస్ పక్కన చేర్చి ఎంబీబీఎస్ ఎం.డీ. రేడియాలజిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈసర్టిఫికెట్తో ఆపిల్ స్కాన్ సెంటర్ పేరుపై 2013 లో రిజిస్టర్ చేసుకోగా గతేడాది సెప్టెంబర్ నెలలో దీనిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుడ్డిగా రెన్యువల్ చేశారు. అంతేకాకుండా ఇదే స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న మరో రేడియాలజిస్ట్ జుల్ఫిఖర్ అలీ ఖాన్ అనే డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎం.డీ.గా చెప్పుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవహారం బయట పడడంతో వెంటనే బోర్డు మార్చేయడం గమనార్హం. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్ సీజ్.. సూర్యాపేటలో శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. గుండె సంబంధిత వైద్యం అందిస్తామని డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు. మేనేజ్మెంట్ డాక్టర్గా.. సూర్యాపేటలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెలనెలా జీతం చెల్లిస్తూ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. కమీషన్ల ఎరచూపి జిల్లాలోని ఆర్ఎంపీల ను తమ వైపు తిప్పుకొని రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్లు లేకుండానే వాళే్ల్ డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్లు సంపాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్య హాస్పిటల్ లో డాక్టర్ లేకుండానే కేవలం మేనేజ్మెంట్ హాస్పిటల్ నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తనిఖీల సమయంలో డాక్టర్ స్థానంలో మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తి ఉండడం గమనార్హం. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవి శేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా హాస్పిటల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పని చేస్తున్న రేడియాలజిస్ట్ సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉండడం కొసమెరుపు. రెన్యువల్ చేయకుండా రెండేళ్లుగా ప్రాక్టీస్... సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎం.డీ.గా చలామణి అవుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా.. రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినా.. మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఔట్ పేషెంట్ షీట్ లను పరిశీలించి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఫ చదివిందొకటి.. చేసేవైద్యం మరొకటి ఫ అర్హతలేకున్నా ఎండీ రేడియాలజిస్ట్గా ఒకరు.. ఫ ఎంబీబీఎస్ చేసి ఎండీగా మరో ఇద్దరు.. ఫ అనస్తీషియా డాక్టరే ఆపరేషన్లు చేస్తూ.. ఫ ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణి ఫ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బట్టబయలు -
రాత్రివేళ తెరిచి ఉన్న జీఎస్టీ కార్యాలయం
కోదాడ: కోదాడ పట్టణంలోని జీఎస్టీకార్యాలయం రాత్రివేళ తెరిచిఉండడం.. అధికారులు విధులు నిర్వహించడం.. ఆఫీస్ ఎదుట అధికారి వాహనం ఉండడం చర్చనీయాంశమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై జీఎస్టీ కార్యాలయం ఉంది. గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఆఫీస్కు సొంత వాహనంలో వచ్చిన అధికారి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నట్లు తెలిసింది. తెల్లవారే వరకు కార్యాలయంలోనే ఉన్నారని సమాచారం. అర్ధరాత్రి నుంచి అధికారి వాహనం కార్యాలయం ముందే ఉందని తెల్సుకున్న కొందరు 4 గంటలకు అక్కడికి వచ్చి చూసినట్లు సమాచారం. కార్యాలయం తాళం తీసి ఉండడమే కాకుండా లోపల గడియ పెట్టుకొని ఉండడంతో దాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోదాడకు చెందిన కొందరు జీఎస్టీ అధికారులు అర్ధరాత్రి రామాపురం క్రాస్రోడ్డు వద్ద అనధికార తనిఖీలు నిర్వహించి రెండు లారీలను పట్టుకున్నారని, వారి నుంచి భారీగా వసూలు చేసి కార్యాలయానికి చేరుకున్నారని, పంపకాల్లో తేడాలు రావడంతో వారిలో కొందరు ఈ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. జీఎస్టీ అధికారికి ప్రభుత్వం ప్రతినెలా వాహన అలవెన్స్ చెల్లిస్తున్నా సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై స్థానిక అధికారులు మాత్రం ఇది డ్యూటీలో భాగమేనని, ప్రత్యేకం ఏమీ లేదని స్పష్ట చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా బాత్రూం కోసం కార్యాలయానికి వచ్చినట్లు చెబుతున్నారు.ఫ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు ఫ కోదాడలో చర్చనీయాంశం -
భూ భారతితో రైతులకు సత్వర న్యాయం
అర్వపల్లి: భూ భారతి చట్టంతో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. భూ భారతి చట్టంపై అర్వపల్లిలో గురువారం నిర్వహించిన సదస్సుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి పాల్గొని మాట్లాడారు. భూ భారతి ద్వారా గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించవచ్చని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ధరణితో రైతులు పడిన కష్టాలను చూసిన సీఎం రేవంత్రెడ్డి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో రైతుల భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ భూసమస్యలను పరిష్కరించి రైతులు, ఇళ్ల యజమానులకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సదస్సులో ఆర్టీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు జక్కర్తి శ్రీనివాసులు, బ్రహ్మయ్య, హరిప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బైరబోయిన సైదులు, జలేందర్రావు, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేష్, నాయబ్ తహసీల్దార్ సీహెచ్. యాదగిరి, ఏపీఓ ఉపేందర్, గిర్దావర్లు జలేందర్రావు, వెంకట్రెడ్డి, ప్రసన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అవిలయ్య, నాయకులు గుడిపల్లి మధుకర్రెడ్డి, జీడి వీరస్వామి, బైరబోయిన మహరాజు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాడని, ఇప్పుడు సభలో ఏం చెబుతాడో, తమకు ఏం భరోసా ఇస్తాడో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా ఎండిపోయాయని, పండిన కొద్ది పంటను కొనక రైతులు తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. నాడు 14 ఏళ్లు ఉద్యమం చేసినా, పదేళ్లపాటు అభివృద్ధి చేసినా, నేడు 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని చెప్పారు. సభకు సూర్యాపేట జిల్లా నుంచి 40 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ సభకు పయనమైన రైతుల ఎడ్ల బండ్లకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సమావేశంలో గ్రంథాయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్షం, జిడి భిక్షం, బొమ్మ గాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ -
ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జిల్లా కోర్టు ప్రాంగణంలో జూన్ 9 నుంచి 14 వరకు జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులకు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరి నోట్ కేసులు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో తీసుకున్న లోన్కు సంబంధించిన కేసులను పరిష్కరించనన్నట్లు తెలిపారు. బ్యాంకుల కార్యకలపాలు, లావాదేవీలను నిలబెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయం చేకూర్చేలా జూనియర్ సివిల్ జడ్జిలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నగదు చెల్లించే క్రమంలో బ్యాంకులు వడ్డీమాఫీ చేస్తాయని సూచించారు. ఇతర ఆర్థిక సంస్థలు రెండు వాయిదాల్లో చెల్లిస్తే 20 నుంచి 25 శాతం వడ్డి తగ్గిస్తాయన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన శ్రీనివాస్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, డీఎల్ఎస్ఏ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలిసూర్యాపేటటౌన్ : కేసు దర్యాప్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు అవసరమైన వివరాలు అందించడంలో బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలని ఎస్పీ కె.నర్సింహ కోరారు. సైబర్ నేరాల నివారణ, సైబర్ కేసుల దర్యాప్తుకు సంబంధించి గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు లతో కలిసి బ్యాంక్ సంస్థల కంట్రోలర్స్, రీజనల్ మేనేజర్స్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు రోజూ పెరుగుతున్నాయని, సైబర్ మోసాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులతో కలిసి బ్యాంక్ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిఅర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లను నిర్వాహకులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి సూరారపు శ్రీను, రైతులు భద్రయ్య, రాములు, సంజీవ, పూల్సింగ్, రాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకొని గురువారం లక్ష పుష్పార్చన పూజను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు సుగ్రంథ పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం
భానుపురి (సూర్యాపేట) : క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకులను నియమించింది. సూర్యాపేట జిల్లా పీసీసీ పరిశీలకులుగా డాక్టర్ బి.మురళీనాయక్, శత్రు బిజ్జిలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధుల మధ్య సమన్వయం కోసం ఈ పరిశీలకులను నియమించారు. వీరు త్వరలో డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలోని విఽవిధ వర్గాలను సమన్వయం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికలు రూపొందించి అధిష్టానానికి అందజేయనున్నారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులను ఆశించే వారికి ప్రాధాన్యం ఉంటుందని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు. ఈ– ఫైలింగ్పై దృష్టి సారించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఈ– ఫైలింగ్ విధానంపై న్యాయవాదులు దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆన్లైన్ ఫైలింగ్ విదానం వల్ల పని తక్కువగా ఉంటుందని, మనకు కావాల్సిన కాగితాలు వెంటనే చూసుకోవచ్చన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ప్రవీణ్ సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్గా సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈయన పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి గా కూడా పనిచేస్తున్నారు. -
వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన తల్లి, కుమార్తె మరణ మిస్టరీ 11 రోజులవుతున్నా ఇంకా వీడలేదు. ఈ నెల 12వ తేదీన వారిద్దరు ఇంట్లో మృతిచెందగా.. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్గా బదిలీపై 15 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ఈ నెల 10వ తేదీన సీతారాంరెడ్డి కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో హైదరాబాద్కు వెళ్లి.. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి చిన్న కుమార్తె వేద సాయిశ్రీ గొంతుపై కత్తిగాటుతో, భార్య రాజేశ్వరి బెడ్రూంలో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. నాలుగు బృందాలతో దర్యాప్తు.. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఒక బృందం ఏపీలోని జమ్మలమడుగు, రొంపిచెర్ల, కుంబంపాడు, దాచేపల్లి, నకిరేకల్ ప్రాంతాలలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినా.. మరో బృందం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్ఫోన్స్ సిగ్నల్స్ వంటి అంశాలపై కూపీ లాగినా.. మరో బృందం మృతుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ తాను నిద్రలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కేసు మిస్టరీ వీడడంలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి క్లూ దొరకలేదా..? ఒకవేళ దొరికినా.. ఆ విషయాలను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో సేకరించిన విషయాలను పోల్చి చూసుకునేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఫ నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫ 11 రోజులవుతున్నా కొలిక్కి రాని కేసు -
చాడలో బౌద్ధ చరిత్ర
ఫ గతేడాదిగా పురావస్తు శాఖ తవ్వకాలు ఫ పెద్ద ఎత్తున బయటపడుతున్న బౌద్ధం ఆనవాళ్లు ఫ ఏడు రోజుల క్రితం తవ్వకాల పనులను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంఏడు రోజుల క్రితం చాడ గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కో–కన్వీనర్ భద్రగిరీష్, సభ్యులు ఎం. రవి, కుండె గణేష్, ఎండీ ఇమ్రాన్ సందర్శించారు. తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన సంపదను పరిశీలించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో తెలంగాణ వారసత్వశాఖ అధికారులు పి. నాగరాజు, సాగర్, పూణా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ ఘన్వీర్ శ్రీకాంత్, ఇతర సిబ్బంది ఉన్నారు. తవ్వకాల్లో దాదాపు 80మంది పాల్గొంటున్నారు. చాడను సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంతవ్వకాలను పరిశీలిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి తర్వాత అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇందులో బుద్ధ విగ్రహాలు, శిల్పాల శకలాలు, మట్టిపూసలు, బొక్కగాజులు, శాతవాహన కాలం నాటి డిజైన్న్ పెంకులు, పొడవైన పెద్ద ఇటుకలు, బౌద్ధ విహార గోడలు బయల్పడుతున్నాయి. 2003లోనే గుర్తింపు.. 2003లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాడ గ్రామంలో బౌద్ధం ఆనవాళ్లు గుర్తించింది. అంతేకాకుండా 2010లో గ్రామానికి చెందిన భూమయ్యగౌడ్ పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దీంతో పురాతన చరిత్రను బయటకు తీయడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఈ గ్రామంలో ఎన్నో బౌద్ధ మత ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని దేవతామూర్తులుగా పూజిస్తారు. 2024లో చాడ గ్రామంలో ఆర్కియాలజీ శాఖ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. భూమయ్యగౌడ్కు చెందిన రెండు ఎకరాల్లో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం వేసవిలో చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్కియాలజీ శాఖ అధికారులు, విద్యార్థులు తవ్వకాలను పరిశీలిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దొరికిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరుస్తున్నారు. గతేడాది బయటపడిన శాసనం 2024లో జరిపిన తవ్వకాల్లో బ్రహ్మీ లిపిలో ఉన్న శాసనం బయటపడింది. ఈ శాసనంలో చాడ పేరు సదరిక అని ఉంది. సదరిక క్రమంగా వాడుకలోంచి చాడగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాడ శాసనం గురించిన వివరాలు ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి గతంలోనే వెల్లడించారు. బిక్కేరు వాగు బౌద్ధం నుంచే.. ఆలేరు వాగు కాస్తా చాడ వరకు వచ్చేసరికి బిక్కేరు వాగుగా మారుతుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి బిక్కేరు అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ లభించిన నిలబడి ఉన్న బౌద్ధ విగ్రహం నల్లగొండలోని పానగల్ మ్యూజియంలో ఉంది. 2024 నుంచి జరుపుతున్న తవ్వకాల్లో మరికొన్ని విగ్రహాలు దొరికినా వాటి వివరాలు ఆర్కియాలజీ శాఖ అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ లభిస్తున్న వస్తువులు, మట్టిపొరలు, గాజులు, పూసలు, విగ్రహాలు, నాణేలు తదితర బౌద్ధం ఆనవాళ్లను ఆర్కియాలజికల్ విద్యార్థులు గ్రేడింగ్ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఇటుకల కుప్పలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అవి చెదిరిపోయాయి. తవ్వకాల్లో ఇంకా బౌద్ధ శిల్పాలు బయటపడే అవకాశం ఉంది. ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిగితే మరింత చరిత్ర బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లను అక్కడే భద్రపరిచారు. అయితే చాడలో లభిస్తున్న వాటిని ఇక్కడే భద్రపర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి చరిత్ర మరో ప్రాంతానికి తరలిపోకుండా ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత విడుదల చేసే సంపూర్ణ నివేదిక వచ్చినప్పుడు ఇక్కడి ప్రాముఖ్యత, విశిష్టత వెలుగు చూస్తుందని పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు. గాంధార శిల్ప సంపదఇక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలలో గాంధార శైలికి చెందిన బుద్ధుడి స్థానక భంగిమ శిల్పాలు, అర్ధ శిల్పాలు, బుద్ధ విగ్రహాల తలలు, విగ్రహాల శకలాలు, క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దపు నాణేలు, టెర్రకోట బొమ్మలు, దంతపు గాజుల ముక్కలు, శాతవాహన కాలం నాటి కుండ పెంకులు, శాతవాహనకాలం నాటి ఇటికెలు, పూసలు అనేకం వెలుగుచూస్తున్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మర్రిగూడ: ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కె. అజయ్కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూటనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూ.3లక్షల విలువైన రెండు ఆక్సిజనేటర్ మిషన్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డయాలసిస్ సెంటర్ను, రోగులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. ఓపీ థియేటర్ను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ఇంక్యూబేషన్ అన్నిరకాల పరికరాలు కూడా అందుబాటులోకి తేవాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మాత్రునాయక్, సూపరింటెండెంట్ శంకర్నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ -
శాస్త్రోక్తంగా శ్రీలక్ష్మీ నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక అర్చనలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేసి నిత్యకల్యాణం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
ఇంటర్ ఒకేషనల్లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా
సూర్యాపేటటౌన్: ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ హవా కొనసాగించారు. కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ కారింగుల బాలగౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థిని జి. హాసిని ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో 500 మార్కులకు గాను 494 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కంప్యూటర్ సైనన్స్లో నక్కల కీర్తన 500 మార్కులకు గాను 482, డెయిరీ గ్రూప్లో ముండ్ల మౌనిక 500 మార్కులకు గాను 475, ఎంఎల్టీ గ్రూప్లో ఎం. ఇందు 475, ఫిజియోథెరపీలో అష్మిత 466 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో కె.వంశవర్థిని 1000 మార్కులకు గాను 989 మార్కులు, ఎంఎల్టీ గ్రూపులో కారింగుల సౌజన్య 981, ఫిజియోథెరపీలో వి. గణేష్ 978 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు చైర్మన్ కారింగుల విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ స్వాతి, అధ్యాపకులు అభినందించారు. -
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
నాగారం : పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం నాగారం పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారథి, సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. చట్టాలను గౌరవించాలి తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, నాగారం సీఐ, రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
భూ భారతితో విప్లవాత్మక మార్పు
నూతనకల్: భూ భారతి చట్టం విప్లవాత్మక మార్పు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలోని వైఫల్యాలను గుర్తించి రైతులకు మేలు జరిగే విధంగా కోదండరాంరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేసి 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాల్లోని అంశాలను స్వీకరించి ప్రజలకు మేలు జరిగే విధంగా భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా 2లక్షల 46వేల దరఖాస్తులతో పాటు నేటి వరకు 3లక్షల 50వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతన్నలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. అన్ని రంగాల్లో వెనకబడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి, ఎంపీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామాలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రకటించిన 3500 ఇళ్లకు బదులు అదనంగా 1500 ఇళ్లను కేటాయించాలని మంత్రిని కోరగా స్పందించిన మంత్రి విడతల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మద్దిరాల, నాగారం, అడ్డగూడూరు మండలాలకు ప్రభుత్వ కార్యాలయాల కోసం నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధసుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, సుంకరి జనార్దన్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి దృష్టికి సమస్యలు నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బద్దం సత్తిరెడ్డి తన 20గుంటల భూమి మరొకరి పేర పట్టా కావడంతో దాని పరిష్కారం కోసం నాలుగు సంవత్సరాలు తిరిగినా పరిష్కారం కాలేదని, అదేవిధంగా సోమ్లాతండాకు చెందిన మోహన్నాయక్ తన భూమి గుండా వెళ్లిన ఎస్సార్ఎస్పీ కాల్వ కింద 19గుంటల భూమిని కోల్పోయామని వాటిని రెవెన్యూ అధికారులు తొలగించి పాస్పుస్తకం అందించినప్పటికీ మరలా 22గుంటల భూమిని రికార్డు నుంచి తొలగించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిల్పకుంట్ల గ్రామానికి చెందిన జటంగి సతీష్ తమ తాతల కాలంలో ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన జెన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డి దగ్గర భూ సంస్కరణ చట్టానికి పూర్వమే కొనుగోలు చేసినప్పటికీ నేటికి పట్టాలు కాలేదని వాపోయాడు. జెన్నారెడ్డి కుటుంబీకుల దగ్గర భూములు కొనుగోలు చేసిన సుమారు 2వేల మంది రైతులకు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో బ్యాంకుల్లో రుణాలు ఇచ్చారని, కేసీఆర్ హయాంలో ఇవ్వకపోవడంతో పాటు భూమిలేని రైతులుగానే చిత్రీకరించారని మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి జెన్నారెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూముల వివరాలను తీసుకురావాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. -
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. పాఠశాలలు జూన్ 12న తెరుచుకోనున్నాయి. ఫ చివరి రోజు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ఫ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్ఎస్ సభనా, లేక టీఆర్ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్రెడీ బీఆర్ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు. ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది. చరిత్రలో నిలిచిపోనుంది రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు ఫ కాంగ్రెస్కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది ఏ నోట విన్నా సభపైనే చర్చ ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు. -
రేపు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాక
నల్లగొండ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10గంటలకు నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11:30గంటలకు జిల్లా జైలుఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7గంటలకు తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. బుద్ధ జయంతికి రావాలని మంత్రి జూపల్లికి ఆహ్వానంనాగారం: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మే 12న నిర్వహించనున్న బుద్ధ జయంతి వేడుకలకు రావాలని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రం అందించినట్లు బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్ తెలిపారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో వీరమల్లుయాదవ్ మాట్లాడుతూ... ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ జయంతి రోజున ప్రపంచ సుందరీమణులతో హెరిటేజ్ వాచ్ కార్యక్రమం నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి జపాల్లోని హిరోషిమా ప్రభుత్వంతో బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. కుటుంబ తగాదాలతో దాడి ● ఇద్దరికి గాయాలునకిరేకల్: కుటంబ తగదాల కారణంగా అత్త, ఆమె తమ్ముడిపై అల్లుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో నివాసముంటున్న బోయింద జానమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను సూర్యాపేటకు చెందిన పెరుమాళ్ల రవికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య తగదాలు రావడంతో జానమ్మ నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో అల్లుడిపై మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో అల్లుడు రవితో పాటు మరో వ్యక్తి చింతమల్ల రాహుల్ జానమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తమ్ముడు ఎడ్ల ప్రకాష్పై దాడి చేసి గాయర్చారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చారి తెలిపారు. సీహెచ్సీని సందర్శించిన వరల్డ్ బ్యాంక్ బృందంఆలేరురూరల్: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులుకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కేసుల గురించి వివరాలు అడిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, మంచి ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్, కళ్యాణ్, డాక్టర్ యశోదా, డాక్టర్ శిల్ప, డీపీఓ నెహ్రూ, సీహెచ్సీ సూపరింటెండెంట్ స్వప్న, రజిని, రామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ కట్ట పంచాయితీ
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యాదగిరిగుట్ట ఆలయంలో 20 మంది నాయీ బ్రాహ్మణులను కొత్తగా నియమించడానికి కోర్టు ఆర్డర్ ఉందని ఈఓ చెబితే అది చూపెట్టాలని అడిగాం. కల్యాణ కట్టకు కొత్తగా ఎవరినైనా కేటాయిస్తే దేవస్థానం ఆధ్వర్యంలో మా సంఘానికి లెటర్ ఇస్తారు. కానీ ఎలాంటి కాపీ ఇవ్వలేదు. ఈఓతో పాటు కొంతమంది అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డర్ తయారు చేసి 20 మందిని నియమించారు. – రాచకొండ జానకిరాము, రాష్ట్ర దేవాలయ కల్యాణ కట్ట అధ్యక్షుడు మా కల నెరవేరింది కల్యాణ కట్టలో విధుల్లో చేరడంతో మా కల నెరవేరింది. కల్యాణ కట్టలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు మా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. తిరిగి మేము కూడా హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈఓకు ఇచ్చాం. దీంతో విధుల్లో చేర్చుకునేందుకు ఈఓ ఆదేశించారు. తోటి నాయీ బ్రాహ్మణులతో కలిసి పనిచేస్తాం. – జంపాల రాజు, యాదగిరిగుట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణుల మధ్య పాత.. కొత్త పంచాయితీ నెలకొంది. ప్రస్తుతం దేవస్థానం కల్యాణ కట్టలో 96మంది నాయీ బ్రాహ్మణులు కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 20మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించే విధంగా దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఈఓ భాస్కర్రావు నియమించారు. ఆ 20మంది నాయీ బ్రాహ్మణులు బుధవారం విధుల్లో హాజరయ్యేందుకు కల్యాణ కట్టకు చేరుకున్నారు. దీంతో అప్పటికే కొనసాగుతున్న 96మంది వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఏఈఓతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ఉండటంతో నూతనంగా 20 మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించేందుకు అనుమతించామని ఏఈఓ వివరించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించారు. అనంతరం కోర్టు ఆర్డర్, దేవాదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపెట్టిన తర్వాత 20 మంది ఉద్యోగంలో చేరారు. ఉత్తర్వుల కాపీలో ఇలా.. దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన 33 మంది నాయీ బ్రాహ్మణులకు కల్యాణ కట్టలో పని కల్పించేందుకు కమిషన్ పద్ధతిలో తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ మేరకు 20 మందిని అదనంగా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫ యాదగిరిగుట్ట క్షేత్రం కల్యాణ కట్టలో కొత్తగా 20 మంది నాయీ బ్రాహ్మణుల నియామకం ఫ ఇప్పటికే పనిచేస్తున్న వారి నుంచి అభ్యంతరం ఫ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన దాసరి యోగేంద్ర విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ప్రమాదాలు జరగకుండా వాహదారులకు సూచనలు చేసేందుకు గాను కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. బుధవారం పాలకేంద్రం సమీపంలో విధులు నిర్వహిస్తున్న యోగేంద్రను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నూతనకల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి.. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకన్న–సుమలత దపంతుల రెండో కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ఎంపీసీ విభాగంలో 467మార్కులు సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవిని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్రెడ్డి, జెన్నారెడ్డి వివేక్రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
పురాతన ఆలయాలకు నిలయం.. పిల్లలమర్రి
తాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లలమర్రి ఆ పేరు వింటే నే చారిత్రక కట్టడాలు గుర్తుకువస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన నామేశ్వర, ఎరకేశ్వర దేవాలయాలు దశాబ్దాలు దాటినా నేటికీ శిల్పకళా సంపద చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచాయి. గొప్ప కళాకృతుల సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలకు నేడు ఆదరణ కరువైంది. పాలకులు పట్టించుకోకపోవడంతో భావితరాలకు అందించాల్సిన ఆధ్యాతి్మక సంపదకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వం చొరవ చూపి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు. నామేశ్వర ఆలయ నిర్మాణ వృత్తాంతం కాకతీయ రాజు గణపతిదేవుడి పరిపాలనా కాలంలో రేచర్ల నామిరెడ్డి ప్రస్తుతం పిల్లలమర్రి గ్రామం ఉన్న ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవారు. వీరు శైవారాధికులు కావడంతో 11వ శతాబ్దంలో మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఆయన పేరు మీద పార్వతీ మహాదేవ నామేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉండటం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం ఉంటుంది.ఎరకేశ్వర ఆలయ వృత్తాంతం12వ శతాబ్దంలో రేచర్ల బేతిరెడ్డి నామేశ్వర ఆలయంలో పూజలు చేసి పరిసర ప్రాంతంలో సంచరిస్తుండగా.. వేటకు వచ్చిన ఎరుకల వ్యక్తి అక్కడ ఉన్న ఒకపెద్ద ఊడల మర్రిచెట్టు కింద సేద తీరుతున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు పైన ఉన్న పిట్టలు.. మరి కొన్నాళ్లకు ఈ చెట్టు కూలుతుందని దీని కింద అనంత నిధి నిక్షిప్తమై ఉందని మాట్లాడుకోవడాన్ని విన్నాడు. వీరు అడవిలో ఉండటం పక్షులతో సావాసం కారణంగా ఆ మాటలు ఎరుకల వ్యక్తికి అర్థంకావడంతో వేటగాడు స్పందించాడు. దీంతో ఆ పక్షులు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తల పగిలి చస్తావ్ అని శపిస్తాయి. ఇది గమనించిన బేతిరెడ్డి రాజు ఎరుకల వారిని విషయం చెప్పాల్సిందిగా కోరగా శాప భయంతో వేటగాడు సంకోచిస్తుండగా చెప్పకుంటే మరణ శిక్ష విధిస్తానన్నాడు. చెప్పినా చెప్పకపోయినా ప్రాణం పోతుందని భావించిన వేటగాడు రాజును ఓ కోరిక కోరతాడు. తన పేరున ఆలయం నిర్మిస్తే పక్షులు మాట్లాడుకున్న విషయం చెబుతానని రాజుతో అంటాడు. అప్పుడు రాజు అందుకు అంగీకరిస్తాడు. దీంతో పక్షులు ఏం మాట్లాడుకున్నాయో రాజుకు వివరించి ఆ ఎరుకలివాడు మరణిస్తాడు. కొంతకాలానికి ఆ మర్రి చెట్టు కూలి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులో 7 కొప్పెర్ల నిధి (ఆనాటి కొలతల ప్రకారం) బయటపడుతుంది. ఆ ధనంతో ఎరకేశ్వర ఆలయం నిర్మించారు. దానికి ఎరుకల వాని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ ఆలయం నిర్మించిందని ఆమె పేరు మీద ఎరకేశ్వరాలయం పేరు వచి్చందని కొందరి విశ్వాసం. ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ ఉన్న పెద్ద మర్రిచెట్టు ఊడలు పోసుకొని పెద్దగా విస్తరించడంతో ఈ గ్రామానికి పిల్లలమర్రి అని పేరు వచ్చింది. ఆలయ నిర్మాణ శైలి.. శిల్పకళా సౌందర్యం నామేశ్వర ఆలయాన్ని చతురస్రాకారంలో, ఎరకేశ్వరాలయాన్ని శ్రీచక్రం ఆకారంలో రాతితో నిర్మించారు. ఇవి కాకతీయుల కాలం నాటి సంస్కృతిని, శిల్పసంపదను ప్రతిబింబిస్తున్నాయి. గర్భాలయం, అంతరాలయం తోరణాలు నల్లని (క్రిష్ణశిల) ఏకశిలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాల్లో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడా లేని విధంగా నందిని ఆలయంపైన గోపురం ముందు ప్రతిష్టించారు.రేచర్ల రాజులు నాట్య కళాప్రియులు కావడంతో ఆలయాల్లో గర్భగుడి ఎదురుగా నందీశ్వరునికి బదులుగా నాట్యమండపం నిర్మించారు. నాట్యమండపం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్తంభాలపై చెక్కిన నాట్య శిల్పకళా రూపాలు సౌందర్యవంతంగా దర్శనమిస్తున్నాయి. ఈ స్తంభాల నుంచి సప్తస్వరాలు వినిపించేలా నిర్మించడం విశేషం. బ్రహ్మసూత్రంతో శివలింగంసాధారణంగా అన్ని శివలింగాల మీద గీత ఉండదు కేవలం కాకతీయుల కాలంలో నిర్మించిన కొన్ని శివలింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం అనే గీత ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో ఒక్కసారి రుద్రాభిõÙకం, జపం, ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోటి సార్లు చేసిన పుణ్యఫలం లభిస్తుందని, ఇలాంటి శివలింగాన్ని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం.ధ్వంసమైన కళారూపాలు వందల ఏళ్ల కిందట వచ్చిన అతిపెద్ద భూకంపం వల్ల శివలింగాలు ఉత్తరం వైపుగా ఒరిగాయి. ఆలయాలు కదలడంలో ఆలయ ప్రాకారాలు పైకప్పు జరిగిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయి. నామేశ్వరాలయం నుంచి సూర్యాపేట బర్లపెంట బజార్లోని శ్రీఅన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం వరకు సొరంగ మార్గం ఉంది. భూకంపం ప్రభావంతో కాలక్రమేణా పూర్తిగా పూడిపోయింది. పిల్లలమర్రి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వరాలయం కాలగర్భంలో కలిసిపోయింది. ఏటా శివరాత్రికి జాతరశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పిల్లలమర్రిలో 5 రోజుల జాతర.. శివరాత్రికి ఒకరోజు ముందు ప్రారంభం అవుతుంది. మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని రెండోరోజు శివరాత్రి లింగోద్భవకాలంలో కల్యాణం, మూడోరోజు ర«థోత్సవం, నాలుగవరోజు అగి్నగుండాలు, చివరి రోజున సాయంత్రం త్రిశూల స్నానం, ఏకాంత సేవ నిర్వహణతో జాతర ముగుస్తుంది. భారీగా భక్తుల రాకసూర్యాపేటకు ఆనుకుని ఉండటం, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి చేరువలో ఉండటంతో జాతర సమయంలో భక్తులు అ«ధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావటం విశేషం.పట్టించుకోని ప్రభుత్వంఈ ఆలయాలకు ఆదరణ కరువైంది. వర్షాకాలంలో నీళ్లు కారుతూ పాకురుపట్టింది. శిథిలావస్థకు చేరువలో ఉంది. ఆదాయం తక్కువగా ఉందని ఆర్థిక మిగులు బాటు లేదని ప్రభుత్వం దేవాదాయశాఖ పట్టించుకోకపోవడం శోచనీయం. ఆలయ ప్రాంగణంలో మంచినీటి బావులు.. ఇక్కడ మంచినీటి బావులకు ప్రత్యేక స్థానం ఉంది. 11వ శతాబ్దంలో రేచర్ల రాజులు బావులు తవ్వించారు. నాటి నుంచి నేటి వరకు అదే నీటితో అభిషేకాలు చేస్తున్నారు. కరువులోనూ ఈ బావులు ఎండకపోగా.. గ్రామస్తులు, రైతులు ఈ నీటిని తోడినా మళ్లీ అదే స్థాయిలోకి నీరు ఉండటం విశేషం. కరువు కాలంలో పక్కన ఉన్న మూసీ నది, చెరువులు అడుగంటినా ఈ బావి నీటిమట్టం తగ్గకపోవటం విశేషం.త్రికూటేశ్వరాలయం.. త్రికూటేశ్వరాలయం, సరస్వతీదేవి సమేత బ్రహ్మ దేవాలయాలను రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ నామేశ్వర దేవాలయం ప్రాంగణంలోనే నిర్మించారు. త్రికుటేశ్వరాలయంలో మూడు శివలింగాలు ఒకే నందీశ్వరునితో ప్రతిష్టించారు. ఇక్కడి నంది ఉత్తరం వైపుగా తలతిప్పి ఉంటుంది. ఎడమ కన్నుతో దక్షిణ, పడమర ఆలయంవైపు కుడి కన్నుతో ఉత్తరం వైపు ఉన్న ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. అన్ని శివాలయాలలో ప్రాణమట్టాలు ఉత్తరంవైపుగా ఉంటాయి. కానీ ఈ త్రికుటేశ్వరాలయంలో మాత్రం ఎదురుగా ఉన్న ఆలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న ఆలయాల్లో మాత్రం తూర్పువైపుగా ప్రాణమట్టాలు ఉన్నాయి.ప్రపంచంలోఈ విగ్రహం ఒక్కటే.. సరస్వతీదేవి సమేత బ్రహ్మ ఆలయంలో నెమలి వాహనంపై బ్రహ్మ సరస్వతీదేవి ఏకశిలపై ఒకే విగ్రహంగా దర్శనమిస్తారు. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఇది ఒక్కటి మాత్రమే ఉండటం విశేషం. కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు అమ్మవారిని దర్శించి కటాక్షం పొంది కవిగా ప్రసిద్ధి చెందాడని నానుడి. పిల్లలమర్రి గ్రామంలో పురాతన శ్రీచెన్నకేశవస్వామి ఆలయం, హనుమ ఆలయాలు కూడా ఉన్నాయి.ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి పిల్లల మర్రి ఆలయాలకు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై వచ్చే ధనాన్ని వెచ్చించి ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ–హైదరాబాద్ రహదారికి ఖమ్మం బైపాస్కి పిల్లలమర్రి గ్రామం మీదుగా లింక్ రోడ్డు వేస్తే భక్తుల రాకపోకలకు, ఆలయాభివృద్ధికి దోహదపడుతుంది. భక్తుల కోసం వసతి గృహాలు కట్టిస్తే బాగుంటుంది. వర్షాకాలంలో నీరు కారి ఆలయ పైకప్పు ప్రాకారాలు పాకురు పడుతున్నాయి. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. – మునగలేటి సంతోష్ శర్మ, ప్రధాన అర్చకుడు -
వాగు కషా్టలకు చెక్!
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కలనెరవేరనుంది. తమ పంటపొలాలతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లడానికి వాగుదాటే కష్టాలు త్వరలో తీరనున్నాయి. గ్రామ సమీపంలోని బిక్కేరువాగు(యశ్వంతపూర్వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఇటీవల రూ.16కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. పొలాల వద్దకు వెళ్లాలంటే..తాటిపాములకు చెందిన రైతుల పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. ఏటా వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు రైతులతో పాటు గ్రామస్తులు తమ పొలాల వద్దకు, అలాగే వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు వాగు నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎడ్ల బండ్లు, పశువులు, మేకలు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇచ్చినాఅమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్ బిక్కేరువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16కోట్లు, చెక్డ్యాం నిర్మాణానికి రూ.7.14కోట్లు మంజూరు చేయించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుతాటిపాములలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఉత్తమ్మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బిక్కేరు వాగుపై డబుల్ లేన్ రోడ్, బ్రిడ్జి, చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైతులకు బిక్కేరు వాగుపై ప్రయాణించడానికి 20కి.మీ. దూరం తగ్గుతుంది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల 750 ఎకరాల పంట భూములకు లబ్ధి చేకూరనుంది. అలాగే చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల 2కి.మీ. పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది. దీని వల్ల రైతులకు బోర్లు, వ్యవసాయ బావుల్లో నీళ్లు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. తన సొంత నిధులతో 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు.తాటిపాములలో బ్రిడ్జి నిర్మించే ప్రాంతం తాటిపాములలో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు నేడు మంత్రి ఉత్తమ్ చేతులమీదుగా శంకుస్థాపన నెరవేరనున్న ప్రజల కలబ్రిడ్జి నిర్మాణం ఇలా.. పొడవు : 120 మీటర్లు పిల్లర్లు : 12 వెడల్పు : 11 మీటర్లు ఇబ్బందులు తొలగనున్నాయిగ్రామ రైతుల పంట పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. వర్షా కాలంలో వాగుదాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఉత్తమ్నిధులు మంజూరు చేయడం శుభ పరిణామం. రాష్ట్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. బ్రిడ్జి నిర్మిస్తే ఇబ్బందులు తొలగనున్నాయి. – కోల రమేష్, తాటిపాములప్రజలకు ఎంతో మేలు వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. బ్రిడ్జి నిర్మించడం వల్ల ప్రజలకుఎంతో మేలు కలుగుతుంది. వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లే వారికి కూడా దూరా భారం తగ్గుతుంది. – కె.శ్రీనివాస్, రైతు, తాటిపాముల -
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోదాడరూరల్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలో పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయని, ప్రతి సమస్యను కలెక్టర్ లేదా కోర్టు ద్వారా పరిష్కరించే విధంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని తద్వారా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కల్టెకర్ స్థాయిలో పరిష్కారం కానునున్నట్లు తెలిపారు. 2014కు ముందు సాదా కాగితం, బాండ్ పేపర్పై భూమిని కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా సాగుచేస్తున్నవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టాదారు పాస్పుస్తకంలో అప్డేట్ చేస్తామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్31న అన్నిగ్రామాల్లో సభలు నిర్వహించి రైతులందరికీ 1బీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, ఎంపీడీఓ రాంచందర్రావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఏఓ రజిని, ఎంపీఓ పాండురంగన్న, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల పాల్గొన్నారు. 30 వరకు విచారణ పూర్తి చేయాలిభానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల విచారణ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 14,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వీటి పర్యవేక్షణకు కోదాడకు డీఎఫ్ఓ సతీష్ కుమార్, హుజూర్నగర్కు డీటీడీఓ శంకర్, సూర్యాపేటకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్నాయక్, తుంగతుర్తికి డీపీఓ యాదగిరిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఎఫ్ ఓ సతీష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీపీఓ యాదగిరి, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
న్యాయవాదులు అందుబాటులో ఉండాలి
చివ్వెంల: న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణిని బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్క్లాస్ మేసిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి -
నేడు ఉత్తమ్ పర్యటన
● అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న మంత్రికోదాడరూరల్ : కోదాడ నియోజకవర్గం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. చిలుకూరు మండలంలోని నారాయణపురం, కోదాడ మండలంలోని తొగర్రాయి, కూచిపూడిలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాన చేయనున్నారు. ఆతర్వాత కోదాడ పట్టణంలో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణ పనులు, జ్యోతిబాఫూలే విగ్రహాన్ని, బాలాజీ నగర్లో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 93 దరఖాస్తులు అందజేశారన్నారు. భారతి రంగా ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ సొసైటీ జిల్లాలోని 700 మంది టీబీ పేషెంట్లకు 3,000 న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అదనపు కలెక్టర్ రాంబాబు చేతుల మీదుగా అందించింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్కుమార్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీపీఓ ఎల్.కిషన్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, డీసీఓ పద్మ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్రెడ్డి, మార్కెటింగ్ డీఎం శర్మ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమలగిరిలో పార్కింగ్ కష్టాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీలో పార్కింగ్ స్థలం లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా కొనుగోలు చేసేందుకు స్థానిక తెలంగాణ చౌరస్తాకు వస్తే అవస్థలు తప్పడం లేదు. రోడ్డు కొందరు ఇంటి యజమానులు భవనాలు నిర్మించి వాటి ముందు ఉన్న స్థలాలను కూడా కిరాయిలకు ఇస్తున్నారు. దీనికి తోడు షాపులు, హోటళ్లు, ఇతర దుకాణాల ముందు వాహనాలు, ఇతర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపాల్సి వస్తుంది. దీంతో పోలీసులు ఆ వాహనాల ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. సాయంత్రం వేళ నరకమే.. సూర్యాపేట–జనగామ, మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారుల్లో సాయంత్రం సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా తొర్రూరు రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కొంత మంది ఇంటి యజమానులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు వందలాది వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. గతంలో పలువురు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, రోడ్లు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఫ సూర్యాపేట–జనగామ, మోత్కూరు–తొర్రూరు రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఫ హోటళ్లు, ఇతర దుకాణాల ఎదుట వాహనాల నిలిపివేత ఫ జరిమానా విధిస్తున్న పోలీసులు -
క్రీడా శిక్షణకు రంగం సిద్ధం
హుజూర్నగర్: చిన్నారులూ వేసవి సెలవుల్లో మీకు ఇష్టమైన ఆటలు ఆడాలనుకుంటున్నారా.. క్రీడల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ–డీఎస్ఏ) ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగు అంశాలు.. పన్నెండు శిబిరాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 14 ఏళ్లలోపు పిల్లలకు నాలుగు క్రీడా అంశాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతించారు. ఈ మేరకు ఆయా క్రీడా మైదానాల ఏర్పాటుకు డీఎస్ఏ సిబ్బంది నిమగ్నమయ్యారు. శిక్షణ శిబిరాలు ఎక్కడెక్కడంటే.. ● అథ్లెటిక్స్– పిల్లలమర్రి (సూర్యాపేట మండలం) ● కబడ్డీ– తుంగతుర్తి, చిలుకూరు, నడిగూడెం ● ఖోఖో– కూచిపూడి(కోదాడ మండలం) యడ్లపల్లి (సూర్యాపేట మండలం) ● వాలీబాల్– టేకుమట్ల(సూర్యాపేట మండలం), అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం మండలం), కొరమబండ, గుడిబండ(కోదాడ మండలం), పాలెఅన్నారం(చిలుకూరు మండలం) మేళ్లచెరువు. ఫ వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేకం ఫ అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్లో శిక్షణ ఫ పన్నెండు చోట్ల శిబిరాలు ఏర్పాటు ఫ మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. శిబిరాల నిర్వహణకు పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి వచ్చిన దరఖాస్తులు నుండి 12 మందిని ఎంపిక చేశాం. ఉచితంగా క్రీడా పరికరాలు అందించి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. శిక్షణ కాలానికి నిర్వాహకులకు గౌరవ వేతనం ఇస్తాం. ఆసక్తిగల చిన్నారులు శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన క్రీడలో శిక్షణ పొందాలి. – జి.రాంచందర్రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
సూర్యాపేటటౌన్, తిరుమలగిరి : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది. ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్ కుట్టేందుకు సంబంధించిన వస్త్రాన్ని దర్జీలకు అందజేశారు. పాఠ్య పుస్తకాలు సైతం ముందస్తుగానే జిల్లాకు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికే వాటిని అందించేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి కొన్ని రాగా మిగిలినవి విడతల వారీగా రానున్నాయి. జిల్లాకు 4.65లక్షల పుస్తకాలు అవసరం ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలతో పాటు సంక్షేమ గురుకులాలు మొత్తం 1050 ఉన్నాయి. వీటిల్లో 90వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందేవారితోపాటు ప్రస్తుతం చదువుతున్న వారికి పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వనున్నారు. యూడైస్ ప్లస్ వివరాల ప్రకారం వీటిలో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 4.65లక్షల పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విడతల వారీగా గోదాంకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో గల గోదాంలో జిల్లాకు సంబంబంధించి పాఠ్యపుస్తకాలు భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 87370 పైగా పుస్తకాలు చేరుకున్నాయి. జూన్ 12వ తేదీ లోగా పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు రానున్నాయి. పక్కదారి పట్టకుండా నంబర్లు వేసవి సెలవులు ముగిసే వరకు విడతల వారీగా గోదాంకు పుస్తకాలు చేరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస క్రమంలో నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఎన్ని మండలాలకు ఏయే పాఠ్య పుస్తకాలు వెళ్లాయని అధికారుల రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఫ పాఠశాలల పునఃప్రారంభం రోజునే అందించేందుకు సన్నాహాలు ఫ జిల్లాకు 4.65లక్షల పుస్తకాలు అవసరం ఫ ఇప్పటికే గోదాంకు చేరుకున్న 87,370 పాఠ్యపుస్తకాలు ఫ పుస్తకాలు పక్కదారి పట్టకుండా నంబర్ల ముద్రణ పాఠశాలల పునఃప్రారంభం రోజునే పంపిణీ చేస్తాం విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నాం. విడతల వారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. వచ్చిన వాటిని గోదాం నిల్వ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎంఈఓల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలలకు అందజేస్తాం. – అశోక్, డీఈఓ మీడియం వారీగా.. తెలుగు, ఇంగ్లిష్, ఉర్థూ మీడియంకు చెందిన పాఠ్య పుస్తకాలు పార్ట్ –1గా ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్లో పుస్తకాలు ముద్రించారు. ఆదర్శ, సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించే విద్యార్థులకు పూర్తిగా అదే మీడియంలో పుస్తకాలు అందజేసేలా కార్యాచరణ రూపొందించి వాటిని పంపిస్తున్నారు. వచ్చిన వాటిని మీడియం, తరగతుల వారీగా వేర్వేరుగా భద్రపరిచే బాధ్యతలను విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. అదేవిధంగా పుస్తకాల్లోని ప్రతి పాఠానికి బార్ కోడ్ ముద్రించడంతో సెల్ఫోన్లో స్కాన్ చేస్తే ఆ పాఠాన్ని వీడియో రూపంలో చూసుకునే సదుపాయం ఉంది. -
రేషన్ దందాలో ఆరితేరారు!
ఫ నెల రోజుల వ్యవధిలో 5 చోట్ల పట్టుబడిన తమ్మర గ్రామవాసులు ఫ అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ దందాను వదలని గ్రామస్తులు ఫ పోలీసులు నిఘా పెంచడంలో విఫలమవుతున్నారని విమర్శలుకేసులు నమోదు చేస్తున్నాం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిని ఇప్పటికే రిమాండ్ చేశాం. ఈ అక్రమ వ్యాపారం చేసేవారిపై బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్రోడ్, అన్నారం, గోండ్రియా, రెడ్లకుంటల వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రజితారెడ్డి, కోదాడరూరల్ సీఐ కోదాడరూరల్ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర గ్రామం రేషన్ దందాకు కేరాఫ్ అడ్రాస్గా మారింది. గత నెల 17 నుంచి ఇప్పటివరకు ఆ గ్రామానికి చెందిన వారే రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడగా 5 కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామానికి చెందిన పలువురు ఈ రేషన్ బియ్యాన్ని గత 15 ఏళ్లుగా యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఒకొక్కరిపై అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆటోల్లో సరిహద్దు దాటిస్తున్నారు గతంలో లారీల్లో రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటించేవారు. పెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే నష్టం జరుగుతుందని భావించిన రేషన్ వ్యాపారులు గత కొద్దికాలం వారి రూట్ మార్చారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని లారీల్లో కాకుండా ఆటోల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. నిఘా పెట్టని పోలీసులు చిలుకూరు, అనంతగిరి, కోదాడ, మోతె, నడిగూడెం గ్రామాల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామకు చెందిన రేషన్ మాఫియాకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని ఆటోల్లో జాతీయరహదారిపై కాకుండా మారుమూల గ్రామాల నుంచి వెళ్తూ రామాపురం క్రాస్రోడ్తో పాటు అన్నారం గ్రామాల మీదుగా రాష్ట్రం దాటిస్తున్నారు. అయితే సరిహద్దులో పోలీసులు నిఘా పెంచడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెల రోజుల్లో 5 కేసులు ఆ గ్రామం వారిపైనే.. మార్చి 17 నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలోనే పలు స్టేషన్లో 5 రేషన్ బియ్యం అక్రమ సరఫరా కేసులు నమోదు కాగా పట్టుబడిన వారందరూ తమ్మర వారే కావడం గమనార్హం. మార్చి17న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన రాముపై, అదే రోజు అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన ఉపేందర్, ఎస్.వీరబాబు 9 బస్తాల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 21న అనంతగిరి స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన వెంకటలక్ష్మి, నరేష్ 4.5 క్వింటాళ్ల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 25న మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద పట్టుబడిన బియ్యం తమ్మరకు చెందిన జానకిరాములివి. ఈ నెల 11న తమ్మరకు చెందిన షేక్. సికిందర్ కోదాడ మండలంలో నాలుగు క్వింటాళ్ల బిరయ్యాన్ని కొనుగోలు చేసి నందిగామకు తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇతనిపై ఇదివరకు కోదాడ టౌన్, రూరల్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న రేషన్ బియ్యం గత నెల 17న కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని కోదాడ మున్సిపాలిటీ, అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరకు చెందిన సుల్తానీ రాము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ఏపీలో విక్రయించేందుకు తరలిస్తుండగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.గత నెల 25నెల కోదాడ మండల పరిధిలోని మొద్దుల చెర్వు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎంలో 30 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను తమ్మరలోని ఆర్.జానకిరాములు వద్ద కొనుగోలు చేసి సిద్ధిపేటలోని సంజయ్కు విక్రయించేందుకు తరలిస్తున్నానని తెలిపాడు. దీంతో డీసీఎంను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు. -
సూర్యాపేట జిల్లా: ఆర్టీసీ బస్సు బోల్తా, 35 మందికి గాయాలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: చింతలపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బైక్ను తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగింది. దీంతో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. కోదాడ నుంచి చింతలపాలెం మండలం నక్కగూడెం వెళ్తుండగా జిల్లేడు గుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. -
అర్హులకు రుణసాయం అందించాలి
భానుపురి(సూర్యాపేట): రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులందరికీ రుణసాయం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 60,502 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీటీడీఓ శంకర్, డీఎండబ్ల్యూఓ జగదీశ్వర్రెడ్డి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఆర్.దినేష్ కుమార్, ఐఓబీ మేనేజర్ వి.నాగబాబు, యాక్సిస్ బ్యాంకు మేనేజర్ రవి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎం.సురేష్, కెనరా బ్యాంకు మేనేజర్ ఎస్.కళ్యాణ్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్, బ్యాంకు ఆఫ్ మలేషియా మేనేజర్ తిరుపతమ్మ, అధికారులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సన్న బియ్యం సరఫరా, యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహాన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్కు జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్ఓ రాజేశ్వరరావు, జిల్లా అధికారులు హాజరయ్యారు. -
6.17 లక్షల ఎకరాలు
వానాకాలం సాగు అంచనాభానుపురి (సూర్యాపేట): వ్యవసాయ శాఖ రానున్న వానాకాలం –2025 సాగు ప్రణాళి ఖరారు చేసింది. జిల్లాలో 6,17,480 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే జిల్లాలో 22,143 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా వచ్చే సీజన్కు సంబంధించి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కోసం ముందస్తుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మెట్టపంటలపై ఆశలు లేకుండానే..జిల్లాలో రానున్న వానాకాలం సీజన్లో 6,17,480 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్టు అంచనా వేసిన వ్యవసాయ శాఖ అత్యధికంగా వరి 4,85,215 ఎకరాలు, పత్తి 91,000 ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. గతేడాది వానాకాలం 6,34,400 ఎకరాల్లో పంటలు వేస్తారని భావించినా 6,13,888 ఎకరాల్లోనే సాగు చేశారు. ఆరుతడి పంటలైనా కంది 7,500 ఎకరాలు, పెసర 4వేలు, వేరుశనగ 1,250 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసినా సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కంది 2,650 ఎకరాలు, పెసర 2,700, వేరుశనగ 400 ఎకరాలకే పరిమితం చేశారు. విత్తనాలకు కొరత రాకుండా..జిల్లాలో సాగు కానున్న 4,85,215 ఎకరాలకు గాను 87,322 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం పడనున్నాయి. అలాగే కంది 2,650 ఎకరాలకు 159 క్వింటాళ్లు, పెసర 2700 ఎకరాలకు 108 క్వింటాళ్లు, జొన్నలు 45 ఎకరాలకు 5 క్వింటాళ్లు, వేరుశనగ 400 ఎకరాలకు 360 క్వింటాళ్ల చొప్పున విత్తనాలు కావాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత రెండోస్థానంలో ఉండే పత్తి విత్తనాలు 2,27,500 ప్యాకెట్లు (475 గ్రాములు) రైతులు వినియోగించనున్నారు. ఇక 8,580 ఎకరాల్లో పచ్చిరొట్టె విత్తనాలను విత్తనుండగా.. ఇందుకోసం 3,800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదించారు. విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిక పంపిన వ్యవసాయ శాఖ ఈ సారి మెట్టపంటల సాగు తగ్గే అవకాశం -
పని ఏదైనా.. చేసేది వారే!
ఈ ఫొటోలోని ఇద్దరు మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో హెయిర్ స్టూడియోలో పని చేస్తున్న ఢిల్లీకి చెందిన మున్నా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాీసీం. రెండేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే పని చేస్తుండటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ షాపునకు వెళ్లి వస్తుంటారు. ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల జీతం వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడ చూసినా వారే.. హోటళ్ల నుంచి వరినాట్ల వరకు పనులు చక్కబెడుతున్నారు రైస్ మిల్లులు.. మార్కెట్లలో హమాలీలుగా వారే అధికం తోటలు, డెయిరీఫామ్లు, సెలూన్లలో సైతం కష్టం ఎక్కువ.. కూలి తక్కువ కావడంతో ఈ రాష్ట్రాల కూలీలతో పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఇక్కడి కూలీల కంటే.. ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ మంది కనిపిస్తారు. ఫబిహార్, బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఇటుక బట్టీలు, మార్కెట్లు, తోటలు, రైస్ మిల్లులు, డెయిరీ ఫామ్, భవన నిర్మాణం, సెంట్రింగ్, పీఓపీ, వ్యవసాయం, పౌల్ట్రీఫాం, సెక్యూరిటీ గార్డ్ పనుల్లో ఉన్నారు. ఫ ఉత్తరప్రదేశ్కు చెందిన వారు మగ్గం వర్క్లు, పాల్ సీలింగ్, పెయింటింగ్, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కరెంట్ ఫిట్టింగ్, సోఫాల తయారీ, పెళ్లి మండపాల తయారీలో పని చేస్తున్నారు. ఫ రాజస్థాన్కు చెందిన వారు టీస్టాళ్లు, వస్త్ర వ్యాపారం, హోటళ్లు, ఐస్క్రీమ్, ఎలక్టిక్ షాపులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ రంగంలో చూసినా ఇతర రాష్ట్రాల వారే కీలకంగా మారారు. పనివాడిగా, కూలీగా, మేసీ్త్రలుగా, యజమానులుగా, వ్యాపారులుగా మారి వివిధ రంగాల్లో పనులను చక్కబెడుతున్నారు. వారి ప్రాంతాల్లో పనుల్లేక, వలస వచ్చిన వారు ఇక్కడ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. తక్కువ కూలితో, ఎక్కువ సమయం పనిచేస్తున్న వీరిని ఇక్కడి ప్రజలు సైతం అక్కున చేర్చుకుంటున్నారు. వరినాట్లు వేయడానికి కూడా బిహార్ నుంచి కూలీలను తీసుకొస్తున్నారంటే వీరి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. వలస కూలీలు ఇక్కడ భాషను నేర్చుకొని స్థానికులతో మమైకమవుతున్నారు. ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,42,686 మంది కూలీలు ఉండగా.. అందులో దాదాపు 32 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫ నల్లగొండ జిల్లాలో 46,030 మంది కూలీలు ఉండగా, అందులో దాదాపు 10 వేల మంది ఇతర రాష్ట్రాల వారే. ఫ సూర్యాపేట జిల్లాలో 79,329 మంది కూలీలకు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 వేల మంది ఉన్నట్లు అంచనా. ఫ యాదాద్రి భువనగిరి జిల్లాలో 17,327 మంది కూలీలు ఉండగా, అందులో ఇతర రాష్ట్రాల వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.భువనగిరి– చిట్యాల రోడ్డులో వలిగొండ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తున్న ఇతను అనిల్ చౌహాన్. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇదే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 వేల మంది -
కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
చిలుకూరు: తాను చదువు కుంటున్న కళా శాల భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరి ధిలోని రామాపురం వద్ద గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మంచి ర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడప ల్లికి చెందిన లింగయ్య–లక్ష్మి దంపతుల కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె కృష్ణవే ణి (21) గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) థర్డ్ ఇయర్ చదువు తూ హాస్టల్లో ఉంటోంది.ఉగాది రోజు ఇంటికి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి శుక్రవారం రాత్రి తన తల్లి లక్ష్మితో కాలేజీ హాస్టల్కు వచ్చి ఆమెతో కలిసి నిద్రపోయింది. ఉదయం 6 :30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి రూంలో నుంచి బయటకు వెళ్లి కళాశాల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దీంతో కృష్ణవేణి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తోటి విద్యార్థులు కళాశాల యాజమా న్యానికి, అధ్యాపకులకు తెలియజే యగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి వచ్చిన చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు మృతురాలి తల్లి, తోటి విద్యార్థులతో మాట్లా డి విచారణ చేశారు. ఉదయం వాష్రూ మ్కు అని వెళ్లిన తన బిడ్డ కొద్ది సేపటికే ఇలా మృతి చెందిందని తల్లి రోదించింది. కృష్ణవేణి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి గత కారణాల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
మద్దిరాల : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని డీఆర్డీఓ అప్పారావు సూచించారు. బుధవారం మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల, ముకుందాపురం గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న రైతులు ధాన్యంపై పట్టాలు కప్పుకొని తడవకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం గుమ్మడవెల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన పౌల్ట్రీఫాంను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యానారాయణరెడ్డి, ఏపీఓ గుండు వెంకన్న, ఏపీఎం మైసయ్య, ఈసీ చారి, సీసీ రమేష్, నాగార్జున్రెడ్డి, వీఓఏలు బాలయ్య, సుమన్ ఉన్నారు. -
రేషన్కార్డు మాకెప్పుడు!
భానుపురి (సూర్యాపేట) : రేషన్కార్డులు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ కార్డునే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. దీంతో కార్డులేని వారు పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రేషన్కార్డు కోసం జిల్లా వ్యాప్తంగా కొత్తగా 1,03,798 మంది దరఖాస్తుచేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2,350 మందికి మాత్రమే కార్డులు పంపిణీ చేశారు. ఈనెల 1నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో మిగిలినవారంతా కార్డు తమకెప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు. 1,03,798 దరఖాస్తులు పెండింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. గత పదేళ్ల కాలంలో ప్రజలు వివిధ సందర్భాల్లో అందించిన వినతులనే పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నూతన రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో 28వేల దరఖాస్తులు, మార్పులు, చేర్పుల నిమిత్తం 52వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల అమలుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల సమయంలో అధికారులు చదివి వినిపించిన జాబితాలో తమ పేరు లేదని మరో 23,798 దరఖాస్తులు ప్రజల నుంచి అందాయి. ఇలా మొత్తం 1,03,798 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. యాక్టివేషన్ చేయడంలో ఆలస్యంతో.. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 23 గ్రామాల్లో 2,350 మందికి రేషన్ కార్డులను అందించారు. వీరికి ఫిబ్రవరి నుంచే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన సన్నబియ్యం పథకం సైతం అందలేదు. కార్డులను పంపిణీ చేసినా.. యాక్టివేషన్ చేయడంలో ఆలస్యం కావడంతో ఏప్రిల్ మాసంలో గ్రామానికి 10 నుంచి 12 మందికే సన్నబియ్యం వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తుదారులందరికీ రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు పాతకార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.జిల్లాలో 1,03,798 మంది దరఖాస్తుదారుల ఎదురుచూపు ఫ ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2350 మందికే పంపిణీ ఫ పథకాలకు రేషన్కార్డే ప్రమాణికంగా తీసుకోవడంతో అర్హుల్లో ఆందోళన ఫ మార్పులు, చేర్పులకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వంజిల్లాలో రేషన్ కార్డులు 3,24,158 కొత్తగా వచ్చిన దరఖాస్తులు 1,03,798ఎంపిక చేసిన గ్రామాల్లో ఇచ్చినవి 2,350రేషన్ కార్డులు ఇవ్వాలి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు. కానీ ఇప్పటి వరకు రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఎన్నోసార్లు దరఖాస్తులు అందించాను. ఇటీవల గ్రామసభలో మా పేరు చదివారు. అయినా ఇప్పటి వరకు కార్డు మంజూరు కాలేదు. అధికారులు కార్డు మంజూరు చేయాలి. రేషన్తో పాటు వివిధ పథకాలు అందడం లేదు. – డేగల రాజు, ఆత్మకూర్ (ఎస్) -
మామిడి రైతు కుదేలు
ఈదుగాలులు, వడగండ్ల వర్షానికి 3,092 ఎకరాల్లో నష్టం కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి పదేళ్ల నుంచి మామిడిని కౌలుకి తీసుకొని సాగుచేస్తున్న. ఈ ఏడాది 35 ఎకరాలు తీసుకొని రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పూత సమయంలో తేనెమంచు తెగులు రావడంతో సరిగా కాత కాయలేదు. ఉన్న కాయ గాలిదుమారానికి రాలింది. ఇతర రాష్ట్రాల్లో టన్ను రూ.50వేలు ఉంటే మన దగ్గర దళారులు టన్ను రూ.20వేల నుంచి రూ.30వేలకు మించి పెట్టడం లేదు. ఈ ఏడాది రూ.15లక్షల వరకు నష్టం మిగలనుంది. గ్రామాల్లో అధికారులు సర్వే చేసి తోటలను కౌలుకు తీసుకున్న రైతులను గుర్తించి వారికే నష్టపరిహాం అందేలా చర్యలు తీసుకోవాలి. –బాలెబోయిన రాజుగౌడ్, కాపుగల్లు, కౌలు రైతు పూత, కాతలేక నష్టం 15 ఎకరాల్లో మామిడితోట సాగు చేస్తున్నాను. ప్రతి ఏడాది ఏదో విధంగా దిగుబడిలేక, ఉన్నా రేటు రాక నష్టపోతున్నా. అసలు ఈ ఏడాది పూత, కాతలేక వైరస్తో తీవ్రంగా నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి. ఇక మామిడిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. –ఇర్ల సీతరాంరెడ్డి, గణపవరం, రైతు కొర్రీలు పెట్టి.. ధర తగ్గించి.. మామిడి రైతులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ మార్కెట్కు తరలిస్తున్నారు. అక్కడికి వచ్చిన మామిడికాయలకు ఏదో ఒక రైతుకు మాత్రమే టన్నుకు రూ.50 వేల ధర చెల్లించి మిగిలినవారి కాయలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే కాయ సైజు లేదు, మంగు ఉంది అంటూ పలు రకాల కొర్రీలు పెడుతూ సరైన ధర చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్లిన కాయలు ఇంటికి తేలేక అక్కడే వచ్చిన రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫ దీనికితోడు ప్రైవేట్ మార్కెట్లో ధర లేక దిగులు ఫ సైజు, మంగు పేరిట దళారుల కొర్రీలు ఫ టన్నుకు రూ.25వేల నుంచి రూ.30వేలకు కొనుగోలు కోదాడరూరల్ : ఈ ఏడాది మామిడి తోటల్లో సరైన పూత, కాత లేకపోవడంతో పాటు ఉన్న కొద్ది కాయలు ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి నేలరాలాయి. దీంతో జిల్లాలో 3,092 ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు తోటల్లో ఉన్న కాస్త పంటలను అమ్ముకోవాలంటే ధరలేక దిగాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. డిసెంబర్, జనవరిలో పూత ప్రారంభమై ఫిబ్రవరి, మార్చి నుంచే దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది పూతే.. మార్చిలో వచ్చింది. అది కూడా సరిగా లేకపోవడంతో 20 నుంచి 30 శాతం మాత్రమే కాతకాసింది. అసలే కాత తక్కువ ఉంటే ఉన్న కొద్ది కాయలు కూడా వారం రోజులుగా వీస్తున్న ఈదురు గాలులు, వర్షాలకు రాలిపోయాయి. 1,730 మంది రైతులకు చెందిన.. జిల్లాలో 11,531 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి 1,730 మంది రైతులకు చెందిన 3,092 ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగి పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. సన్నగిల్లుతున్న ఆశలు సంవత్సరానికి ఓ సారి మాత్రమే వచ్చే మామిడి దిగుబడిపై రైతుల ఆశలు ఏటికేడు సన్నగిల్లుతున్నాయి. ఓ ఏడాది కాత ఉంటే ధర ఉండటం లేదు. మరో ఏడాది ధర ఉంటే కాత కాయడం లేదు. ఇంకో ఏడాది రెండు కూడా లేకుండా పోతున్నాయి, అదృష్టం బాగుండి కాత, దిగుబడి రెండు ఉన్నా ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలకు నష్టపోతున్నారు . దీంతో రైతులు మామిడి పంటపై నమ్మం కోల్పోతున్నారు. ఈ పంటలో మరో పంట సాగు చేయక పోవడంతో సంవత్సరం అంతా భూమిని ఖాళీగా ఉంచి ఈ ఏడాది అయినా లాభం రాకపోతదా అనే ఆశతో ఉంటే.. తీరా పంట చేలికొచ్చే సమయానికి ఏదో విధంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులు మామిడి కౌలురైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది వరకు ఎకరాకు రూ.40వేల వరకు కౌలు ఉంది. ఈ ఏడాది మాత్రం చెట్టు సంవత్సరాలను బట్టి రూ.50వేల నుంచి రూ. 60 వేల వరకు పెంచారు. దీంతో పెట్టుబడి ఎకరాకు రూ.40 వేల నుంచి 50వేల వరకు పెట్టారు. కౌలు రైతు ఎకరాకు దాదాపు రూ. లక్షవరకు పెట్టుబడుతులు పెట్టాడు. ఉన్న కొద్ది కాయలు కూడా గాలి దుమారానికి రాలడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమాపై రైతులకు అవగాహన ఉండడంలేదు. ఒక వేళ అవగాహన ఉన్న రైతులు వేల రూపాయలు బీమా కట్టినా పంట నష్టపోయినప్పుడు పరిహారం రావడంలేదు. దీంతో బీమా చెల్లించడానికి మామిడి రైతులెవరూ ముందుకు రావడంలేదు. -
పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి
పెన్పహాడ్: పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పరికరాలు, వివిధ రకాల నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఫిర్యాదుల నమోదు, ప్రాథమిక దర్యాప్తు తదితర అంశాలను పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డయల్ 100ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై త్వరగా స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టంగా పని చేయాలన్నారు. గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ప్రణాళికతో అమలు చేయాలన్నారు. రోజూ గ్రామాలను సందర్శించి ప్రజలకు సన్నిహితంగా ఉంటూ పోలీసు సేవలను అందించాలన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేయాలన్నారు. గంజాయి రవాణా కేసుల్లో ఉన్న నిందితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వారి కదలికలను నమోదు చేయాలన్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని, సామాజిక అంశాలను వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాధారణ కాన్పులు పెంచాలి అర్వపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్నవారికి పథకాలు వర్తిస్తాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం పేర్కొన్నారు.అర్వపల్లి పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిగేలా గర్భిణులను వైద్య సిబ్బంది ప్రోత్సహించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం. బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ అధికారిణి సునిత, కొమారి శైలజ ఉన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికహుజూర్నగర్ : భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధం) సూర్యాపేట జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపాలెం మండలం దొండపాడులో జరిగిన మహాసభలో మంగళ వారం రాత్రి పొద్దు పోయిన తర్వాత జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మేకల శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా మారుడి శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జెట్టి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా షేక్ హుస్సేన్, విద్యాచారి, సహాయ కార్యదర్శిగా యడవెల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సారెడ్డి రాఘవరెడ్డిలతో పాటు మరో 23 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు. న్యాయవాదిపై దాడిచేసిన వారిని శిక్షించాలిసూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణానికి చెందిన న్యాయవాది మంతాపురం కిషోర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, న్యాయవాదులు వసంత సత్యనారాయణపిళ్లై, బాణాల విజయ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జీజీహెచ్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. కిశోర్కు చెందిన భూమి గాంధీనగర్లో ఉంది. తన భూమి వద్ద సర్వే చేస్తున్నారని తెలుసుకుని ఆయన వెళ్లారు. అక్కడే ఉన్న బుచ్చిరాములు, కొందరు వ్యక్తులు కలిసి కిశోర్పై దాడి చేశారని, దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. సమావేశంలో అడ్వకేట్లు మాండ్ర మల్లయ్య, వీరేష్నాయక్, అబ్దుల్ లతీఫ్, కంచర్ల సతీష్, యాదగిరి, సందీప్, రాధాకృష్ణ, చంద్రకాంత్ ఉన్నారు. -
టెక్నీషియనే డాక్టర్గా చలామణి
సూర్యాపేటటౌన్: స్కానింగ్ టెక్నీషియనే డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్న ఉదంతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలో గల ఓ కార్డియాక్ సెంటర్పై వచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ వి. నరేష్కుమార్, డాక్టర్ ఎం. రాజీవ్ బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా రిజిస్టర్ చేసుకున్న కార్డియాలజిస్ట్ లేకుండానే టెక్నీషియన్ తాను కూడా డాక్టర్ అని పేర్కొంటూ పేషెంట్లకు రిపోర్ట్ అందిస్తున్నట్లు గుర్తించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ లీలకృష్ణ పేరు మీద అనుమతి తీసుకున్నారని, కానీ డాక్టర్ లేకుండానే టెక్నీషియనే 2డీ ఈకో పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు పేర్కొన్నారు. డాక్టర్ లీలకృష్ణ, డాక్టర్ శిరీషకు నోటీసులు జారీ చేశామని, వారు తమ పేరు వినియోగించడానికి సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ అని చెప్పుకుంటూ టెస్టులు నిర్వహిస్తున్న వనం శరత్చంద్రపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లో వెలుగులోకి ఫ కేసు నమోదు -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తుందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో ఎస్పీ నర్సింహ తో కలిసి ఇసుక విధానంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు జారీ చేసిన వేబిల్లులో సమయం, వాహనం నంబర్, ఫోన్ నంబర్, ఎక్కడ నుంచి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నారో అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో ఒక అధికారిని నియమించి ప్రతి వారం ఎన్ని అనుమతులు ఇచ్చారో సీ సెక్షన్కు నివేదిక సమర్పించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు, నీటి పారుదల శాఖకు మాత్రమే ఇసుక ఉచితంగా ఇస్తామని తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇతర జిల్లాలకు ఇసుక తరలిస్తే వాహనాలను బ్లాక్ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. మొదటి సారి అక్రమ రవాణాలో వాహనం పట్టుపడితే కలెక్టర్ అనుమతితో రూ.5వేల జరిమానా, రూ.లక్షా బైండొవర్ విధించి వదిలి పెట్టాలని, రెండవసారి పట్టుపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అక్రమ రవాణాలో ఏమైనా వాహనాలు పట్టుపడితే గతంలో ఉన్న కేసుల వివరాలతో తహసీల్దార్లకు అప్పగించాలని సూచించారు. జాజిరెడ్డిగూడెం ఇసుక రీచ్ నుంచి మాత్రమే ఇరిగేషన్ శాఖకు అనుమతి ఉందన్నారు. సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవరావు, మైనింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
మునగాల: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకువచ్చిన రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు కోరారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వస్తున్నందున ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త వహించాలని సూచించారు. మునగాల మండలం బరాఖత్గూడెంలో మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. కేంద్రానికి రోజూ ధాన్యం తీసుకువచ్చే రైతుల వివరాలను నిర్వాహకులు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. తేమశాతాన్ని పరిశీలించి నమోదు చేయాలని , ఏరోజు కాంటా వేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం రాశులపై తడవకుండా పట్టాలు కప్పి కాపాడుకోవాలని కోరారు. అంతకుముందు మునుగాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని, ఎస్సీ బాలికల వసతిగృహంలో వంట గదులు, సరుకులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ వి.ఆంజనేయులు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, మునగాల, బరాఖత్గూడెం గ్రామపంచాయతీల కార్యదర్శులు చంద్రశేఖర్, శ్వేత, ఏఈఓ రేష్మ, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సీఈఓ బసవయ్య, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి సుందరయ్య ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ అభాసుపాలు
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి హుజూర్నగర్: నెరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి విమర్శించారు. సోమవారం హుజూర్నగర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆపార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. అతి తక్కువ సమయంలోనే వైఫల్యం చెందింది సీఎం రేవంత్రెడ్డి అని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు బెల్లకొండ అమర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయబాబు, మాజీ వైస్చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ కేఎల్ఎన్.రెడ్డి, డి.అప్పిరెడ్డి, కె.వెంకట్రెడ్డి, ఎస్.బసవయ్య, ఐ.పిచ్చయ్య, ఎ.సురేష్, ఎం.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
యూ డైస్ ప్లస్ పై సర్వే
సర్వేను పకడ్బందీగా చేయిస్తాం విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు డైట్ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ సర్వే పకడ్బందీగా చేపట్టనున్నాం. మండలస్థాయిలో ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ ఎంలు, సీఆర్పీలను సమన్వయం చేసుకుంటూ శిక్షణ ఉపాధ్యాయులకు సహకరించాలి. ఈ సర్వేలో ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మౌలిక వసతుల వివరాలను సేకరించనున్నారు. – అశోక్, డీఈఓ సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) ప్లస్పై సర్వే నిర్వహించనున్నారు. పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని యూడైస్ ప్లస్లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేసిన సమాచారంపై విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. ఇందుకు డైట్ కళాశాల విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ నెల 15 నుంచి 21 వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో వారు వాస్తవ పరిస్థితులను పరిశీలించి ధ్రువీకరిస్తారు. అత్యంత ప్రామాణికమైన ఈ రిపోర్టు ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయిస్తున్నందున ఈ సర్వేకు ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో 885 పాఠశాలల్లో సర్వే యూడైస్లో నమోదు చేసే వివరాలు అత్యంత గోప్యంగా, ప్రామాణికంగా ఉంటాయి. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్లో వివరాలను సమగ్రంగా నమోదు చేస్తారు. జిల్లాలో 885 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు, మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా తదితర వివరాలు ఇందులో నమోదవుతాయి. పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ గా విభజించి సమాచారం నిక్షిప్తం చేశారు. పాఠశాలలో గదులెన్ని.. ఇంకా ఏమేం అవసరం.. ఫర్నిచర్, ల్యాబ్, ఇతర సదుపాయాలు ఉన్నాయా అమలవుతున్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. 89 మంది డైట్ కళాశాల విద్యార్థులతో.. పాఠశాల విద్యా వ్యవస్థ ప్రామాణికతను అందించే రిపోర్టు ఇది. ఈ రిపోర్టుపై సర్వే చేసేందుకు నల్లగొండ డైట్ కళాశాల విద్యార్థులను 89 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు రోజుల క్రితమే డైట్లో శిక్షణ కూడా ఇచ్చారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు రోజూ రెండు పాఠశాలల చొప్పున సర్వే చేస్తారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలను అప్పగించారు. తొలుత పాఠశాల రిపోర్టు కార్డు ఆధారంగా పరిశీలిస్తారు. పాఠశాలల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, వివరాలన్నీ యూడైస్లో ప్రధానోపాధ్యా యులు నమోదు చేశారా.. విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనేది రిపోర్టులో నమోదు చేసిన వివరాల ద్వారా భౌతికంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. తప్పులుంటే సరి చేయాలని ప్రధానోపాధ్యాయులకు రిమార్క్ రాసి ఇస్తారు. వాటిని అదే రోజు సీఆర్పీల సహకారంతో సరి చేయాల్సి ఉంటుంది. ఈ సర్వేను విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఫ నేటి నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ఫ సర్వే చేయనున్న 89 మంది డైట్ కళాశాల విద్యార్థులు ఫ ఒక్కో విద్యార్థికి రోజుకు రెండు స్కూళ్ల చొప్పున పరిశీలన బాధ్యత -
ధరణి ఆపరేటర్లకు అందని వేతనాలు
హుజూర్నగర్ : తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లకు ఏడాది కాలంగా వేతనాలు అందడంలేదు. దీంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోయిందని వారు వాపోతున్నారు.గత ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసేందుకు ధరణి పోర్టల్ను నూతనంగా ప్రవేశ పెట్టింది. అన్ని మండలాల్లో తహసీల్దార్లకు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విధులు తహసీల్దార్లకు అప్పగిస్తూ ఆయా కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్టీఎస్) పేరుతో ధరణి ఆపరేటర్లను నియమించింది. వారితో పని పూర్తి చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ధరణి ఆపరేటర్లకు వేతనాలు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1.56 లక్షల బకాయి జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 23 ఎఫ్టీఎస్ (ధరణి ఆపరేటర్)లు ఒక జిల్లా కోఆర్డినేటర్ (డీసీ) పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ 11,900 చొప్పున ఏడాదికి రూ1.56 లక్షల వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇలా జిల్లాలోని 23 మందికి కలిపి ఏడాదికి రూ 35.88 లక్షలు అవుతుంది. ఇంత మొత్తంలో బకాయి ఉండటంతో పేద, మధ్య తరగతి ఉద్యోగులకు కుటుంబాలు గడవడం ఇబ్బంది కరంగా మారింది. తమ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు స్పందించి సత్వరం వేతనాలు వచ్చేలా చూడాలని ధరణి ఆపరేటర్లు కోరుతున్నారు. ఫ బకాయిలు రూ.35.88లక్షలు ఫ ఏడాది కాలంగా ఎదురుచూపు ఫ కుటుంబాలు గడవక అవస్థలు -
ఇందిరమ్మ ఇంటికి రుణం
భానుపురి (సూర్యాపేట) : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజా పాలనలో దరఖాస్తులు ఆహ్వానించి ఇటీవల మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ అర్హులైన నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేసింది. మండలానికో మోడల్ ఇంటిని నిర్మిస్తున్నారు. కానీ లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం పనులు ప్రారంభం కాలేదు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదలు దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అంతంత మాత్రంగానే.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గ్రామస్థాయిలో ఎక్కడా జరగలేదు. మున్సిపాలిటీల్లోనే నిర్మాణాలు చేపట్టగా ఇవి కూడా వెయ్యి దాటలేదు. ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది పేదలు ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో.. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా జిల్లావ్యాప్తంగా ఏకంగా 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు గ్రామసభల సమయంలోనూ మరో 28,225 దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి 4,479 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్లను మంజూరు చేసి కూడా రెండునెలల కావొస్తున్నా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 623 ఇళ్లకు ముగ్గులు పోయగా మరో 136 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరాయి. భారీగా దరఖాస్తులు చేసుకున్నా.. ఇళ్ల నిర్మాణాల విషయంలో అంతంత మాత్రంగానే చేపట్టారు. ఫ ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు రూ.లక్ష రుణం ఫ స్వశక్తి సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి అవకాశం ఫ ఊపందుకోనున్న ఇళ్ల నిర్మాణాలుఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు.. వచ్చిన దరఖాస్తులు 3,37,287 మంజూరైన ఇళ్లు 4,479 ముగ్గు పోసినవి 623 బేస్మెంట్ లెవల్లో ఉన్నవి 136ఆర్థిక సమస్యలతో.. లబ్ధిదారుడు సొంత ఖర్చులతో బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే ప్రభుత్వం లక్షరూపాయలను లబ్ధిదారుడి ఖాతాలో వేస్తోంది. ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులు ఆర్థిక సమస్యల కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గుడిసెలు, షెడ్లలో నివాసమున్నవారు వాటిని తొలగించి ఇళ్లు నిర్మించాలి. ఈ ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లను నిర్మించేందుకు మరికొందరు ఆసక్తిగా లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించిన మేర జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు సాగడం లేదు. ఈ ఆటంకాలను అధిగమించాలంటే ముందుగా ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రుణం ఇప్పించాలని నిర్ణయించారు. లబ్ధిదారులు స్వశక్తి సంఘంలో సభ్యులై ఉండి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష వరకు పునాదుల వరకు అయ్యే ఖర్చు నిమిత్తం ఇవ్వనున్నారు. -
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్ధం కావాలి
సూర్యాపేటటౌన్ : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభ విజయవంతానికి సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ ఉంటుందని, కేటీఆర్ పిలుపుతో స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని, అతి తక్కువ సమయంలో వైఫల్యం చెందిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డి పాలన ఉందన్నారు. నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ అభాసుపాలయిందని, అన్ని రంగాల ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. రైతు బీమా లేదు.. రుణమాఫీ పూర్తికాలేదని మండిపడ్డారు. నీళ్లు లేక ఎండిన పంటలు.. చేతికొచ్చిన ఎంతోకొంత పంటకు మద్దతు ధరలేక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, రైతాంగం ఇలా అన్ని రంగాల్లో ఎవరి నోట విన్నా నేడు కేసీఆర్ మాటే వినిపిస్తోందని చెప్పారు. ఆత్మకూర్.ఎస్ మండలం మంగళితండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు 70 మంది బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రిటైర్డ్ ఉద్యోగి నరసింహచారి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, వై.వి, పెరుమాళ్ల అన్నపూర్ణ పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
బాధితులకు భరోసా కల్పించాలి
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేట టౌన్ : ఫిర్యాదులపై పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి బాధితులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ.. అద్భుత పథకంహుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ అద్భుత పథకమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. సోమవారం హుజూర్నగర్లోని గోవిందపురంలో దళితవాడకు చెందిన పాలడుగు కోటయ్య ఇంట్లో స్థానిక నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం కోటీశ్వరుడి నుంచి కూలీ వరకు సన్నబియ్యమే తింటున్నారని అన్నారు. ఉచిత సన్నబియ్యం పథకంతో దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, జక్కుల మల్లయ్య, దొంతగాని శ్రీనివాస్, సుబ్బరాజు, సౌజన్య, ధనుంజయ్, జైలు, వీరబాబు, ముక్కంటి, కోటమ్మ, అజీజ్ పాషా, సత్యనారాయణ, రాములు, పున్నయ్య, సైదులు, కృష్ణ, అమర్నాధ్ రెడ్డి, ఉపేందర్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించాలిసూర్యాపేటటౌన్ : అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీఅగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాంశ్రీ అనే నినాదంతో ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు జన సమూహం ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇదే శాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, జానయ్య పాల్గొన్నారు. మహాసభలను జయప్రదం చేయాలి హుజూర్నగర్ (చింతలపాలెం) : భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం చింతలపాలెం మండలం దొండపాడులో మహాసభల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. మంగళవారం 10 గంటలకు ప్రారంభమయ్యే మహా సభలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగాని ప్రవీణ్ కుమార్ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మారుడి శ్రీనివాస రెడ్డి, చెల్లా బాలశౌరి, బండారు బాలరాజు, ఓర్సు ప్రసాద్, తమ్మిశెట్టి సాగర్, ఆదిమల్ల సైదులు, వీరబాబు, కల్పన పాల్గొన్నారు. -
భూ భారతికి శ్రీకారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. మొదట రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనుంది. ఆ తరువాత జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనుంది. భూభారతిలో పరిష్కారం కానున్న సమస్యలివే.. రెవెన్యూ రికార్డుల్లో గతంలో పట్టాదారు కాలమ్తోపాటు కబ్జాదారు కాలమ్ కూడా ఉండేది. అయితే ధరణి తీసుకువచ్చినప్పుడు కబ్జా కాలమ్ను తొలగించి పట్టాదారు కాలమ్ను మాత్రమే రికార్డుల్లో ఉంచింది. దీంతో గతంలో భూములు కొని పట్టాలు చేసుకోని వారు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు కబ్జాలో ఉన్నప్పటికీ వారికి ఆ భూమిపై హక్కులు లేకుండా పోయాయి. గతంలో అమ్ముకున్న వారికే ధరణిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అయ్యాయి. అదేవిధంగా ధరణి అమలులో భాగంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములన్నింటిని ఆన్లైన్ చేసే సందర్భంలో ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుతో పట్టాలు ఎక్కడం, కొందరికి భూమి ఉన్నంతగా కాకుండా తక్కువగా, ఎక్కువగా పాస్బుక్కుల్లో ఎక్కడం, మరికొందరు తమ భూములను అమ్ముకున్నప్పటికీ వారే దొడ్డిదారిన ఆ భూమిని పాస్బుకుల్లో తమ పేరున ఎక్కించుకోవడం, మరికొందరు కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు ఉన్నా ఒక్కరే పట్టా చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ధరణిలో పరిష్కారం కాలేదు. దాంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ భారతి ద్వారా ఇలాంటి సమస్యలకు కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండానే క్షేత్ర స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం, అక్కడా పరిష్కారం కాకపోతే కలెక్టర్కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధరణిలో పాస్బుక్ పొందిన పట్టాదారుడే తిరిగి వారేవారికి పట్టా చేస్తేనే పేరు మారేది. కలెక్టర్కు కూడా దాన్ని మార్చే అధికారం లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటికి భూ భారతిలో మోక్షం లభించనుంది. ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు రైతులకు వచ్చేవి కావు. అలాంటివి ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పట్టా భూమి పొరపాటున ప్రభుత్వ భూమి అని పడితే దాన్ని మార్పు చేయాలంటే సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా 2023 నుంచి అలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు అత్యధికంగా ఉన్న సాదాబైనామాలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. భూ సమస్యలు ఇక వేగంగా పరిష్కారం ఫ భూ భారతి పోర్టల్ను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి ఫ జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు ఫ మళ్లీ తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు -
రాజ్యాంగం వల్లే అందరికీ హక్కులు
తాళ్లగడ్డ (సూర్యాపేట) : డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో అందరూ హక్కులు, బాధ్యతలు, పదవులు పొందగలుగుతున్నారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలో ఆయన విగ్రహానికి కలెక్టర్ తేజస్నందర్లాల్ పవార్, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మందుల సామేల్, ఎస్పీ నరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమాన విద్య , సమానత్వపు హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేడ్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ హక్కుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ యువత .. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే తాను ప్రజా ప్రతినిధి స్థాయికి ఎదిగానన్నారు. ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకి అంబేడ్కర్ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి కె.లత, గిరిజన అభివృద్ధిశాఖ అధికారి శంకర్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఆర్డీఓ వివి.అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, టీఎన్జీఓ సంఘం సెక్రటరీ దున్న శ్యామ్, వివిధ సంఘాల నాయకులు చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, అంజద్ అలీ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఫ హాజరైన ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి, సామేల్ -
రాష్ట్ర ప్లినరీని విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21న సికింద్రాబాద్లో జరిగే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దక్షిణ తెలంగాణ కోఆర్డినేటర్ అనంతుల మధు కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతుల మధు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీను వాస్, తెలంగాణ ఉద్యకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిళ్ల విప్లవ్ కుమార్, రాష్ట్ర నాయకులు పడిదల ప్రసాద్, తెలంగాణ ఉద్యమ నాయకులు పంతం యాకయ్య, బాసిపంగు సునీల్, ఎండీ మజహార్, యాతకుల సునీల్, అంజయ్య, భారీ ఖాన్, దుర్గయ్య, నాగేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, విరస్వామి, జ్యోతి రెడ్డి, గగన్ కుమార్, జానికి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నికఅనంతగిరి: వ్యవసాయ కార్మిక సంఽఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా రెమిడాల రాజు, ప్రధాన కార్యదర్శిగా దూళిపాళ్ల ధనుంజయ నాయుడు ఎన్నికయ్యారు. శనివారం అనంతగిరిలో జరిగిన వ్యవసాయ కార్మికసంఘం నాల్గవ జిల్లా మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తమ నియామకానికి సహకరించిన వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, సీపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, హనుమంతరావుకు ఆదివారం వారు కృతజ్ఞతలు తెలిపారు. వైభవంగా నారసింహుని కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఎదుర్కోళ్ల మహోవత్సవం అనంతరం స్వామివారి కల్యాణం జరిపించారు. అదేవిధంగా గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామిఅమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి ఆదాయం
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలో 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెటింగ్ శాఖకు నిర్దేశిత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ఆరు వ్యవసాయ మార్కెట్లలో కోదాడ, హుజూర్నగర్ మినహా మిగిలిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల మార్కెట్లు టార్గెట్ను అధిగమించాయి. 2024–25లో మార్చి నుంచి ఏప్రిల్ వరకు మార్కెట్ కమిటీల ద్వారా రూ.32.02 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ.33.14 కోట్ల ఆదాయం సమకూరింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లుగా, తుంగతుర్తి స్పెషల్ గ్రేడ్ మార్కెట్గా, నేరేడుచర్ల గ్రేడ్–2 మార్కెట్గా, తిరుమలగిరి గ్రేడ్ – 3 మార్కెట్గా విభజించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.10.57కోట్లు కాగా.. రూ.13.11కోట్లు వసూళ్లు సాధించింది. అదేవిధంగా తుంగతుర్తి మార్కెట్ లక్ష్యం రూ.2.25కోట్లు కాగా.. వసూళ్లు రూ.2.39 కోట్లు, తిరుమలగిరి మార్కెట్ లక్ష్యం రూ.5.23కోట్లు అయితే వసూళ్లు రూ.5.67కోట్లు, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.77కోట్లు కాగా.. వసూళ్లు రూ.1.99కోట్లు సాధించింది. ఇక.. కోదాడ రూ.4.49కోట్లు, హుజూర్నగర్ మార్కెట్ కమిటీలు రూ.5.45కోట్ల వసూళ్లు సాధించాయి. మార్కెట్లలో జరిగే పంటల విక్రయాలు, పలు రకాల ఫీజులు, గోదాములు, దుకాణాల అద్దెలు, చెక్ పోస్టులు, సీసీఈ కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇలా పలు రకాలుగా ఆదాయం సమకూరింది. 5లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు జిల్లాలో ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువగా వరి, పత్తి రైతులు సాగు చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం, పత్తికి సంబంధించి మార్కెట్ ఫీజులు వసూలు కావడంతో ఎక్కువగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఫ టార్గెట్ను అధిగమించిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్లు ఫ లక్ష్యం రూ.32.02 కోట్లు.. వసూలు రూ.33.14 కోట్లు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం తిరుమలగిరి వ్యవసా య మార్కెట్లో సంవత్సరం పొడవునా క్రయవిక్రయాలు జరుగుతా యి. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాం. మార్కెట్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరుతాం. – చామంతి, మార్కెట్ చైర్పర్సన్, తిరుమలగిరి ఆదాయ లక్ష్యాలు మార్కెట్ లక్ష్యం వసూళ్లు (రూ.కోట్లలో) సూర్యాపేట 10.57 13.11 కోదాడ 6.32 4.49 హుజూర్నగర్ 5.86 5.45 తుంగతుర్తి 2.25 2.39 తిరుమలగిరి 5.23 5.67 నేరేడుచర్ల 1.77 1.99 -
ఉద్యాన సాగుకు ఔట్సోర్సింగ్ సేవలు
నాగారం : జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తున్నాయని కొందరు రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. అయితే ఉద్యాన పంటలు సాగు చేసే వారికి సలహాలు, సూచనలిచ్చే అధికారులు, సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే.. జిల్లాలో రైతులు సమారుగా 36,559 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. పండ్ల తోటలు 15,846 ఎకరాల్లో, కూరగాయలు 813 ఎకరాల్లో. మిర్చి 14,917 ఎకరాలు, ఆయిల్పామ్ 4,885 ఎకరాల్లో సాగవుతుంది. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, పెన్పహాడ్, మోతె, సూర్యాపేట, నడిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, ఆత్మకూర్ తదితర మండలాల్లో ఉద్యాన పంటలు అధికంగా సాగుచేస్తుంటారు. మొలకెత్తింది మొదలు పంట చీడపీడల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధర దక్కేలా రైతులను సరైన బాటలో నడిపించేది క్షేత్రస్థాయి సిబ్బందే. జిల్లాలో 23 మండలాలు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉద్యాన అధికారులు ఉన్నారు. జిల్లాలో హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, మేళ్లచెరువు మండలాలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో ఉద్యానాధికారి మూడు, నాలుగు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో ఉద్యాన అధికారులపై అదనపు భారం పడుతోంది. పొరుగు సేవల సిబ్బంది విధుల్లో చేరితే సలహాలు, సూచనలు త్వరితగతిన అందించేందుకు వీలుంటుంది. మూడేళ్ల కిందట ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించగా వారిని తిరిగి చేర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తొమ్మిది మంది సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి ప్రభుత్వ ఆదేశాలు వస్తే జిల్లాలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తాం. ఈమేరకు సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించాం. – నాగయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, సూర్యాపేట ఫ సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు ఫ అన్నదాతలకు తప్పనున్న ఇబ్బందులు జిల్లాలో సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..) పండ్ల తోటల సాగు 15,846 కూరగాయలు 813 మిర్చి 14,917 ఆయిల్పామ్ 4,885 ఇతర పంటలు 95 మొత్తం 36,559 -
స్వర్ణోత్సవ సమ్మేళనం.. మది నిండా సంతోషం
సూర్యాపేట టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ బైపీసీకి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకొని తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు తమ బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. యాభై ఏళ్ల క్రితం ఈ కళాశాలలో చదువుకున్న తాము మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం ఎంతో పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి వేడుకలు ప్రతి బ్యాచ్ నిర్వహించుకుని తమ పాత స్నేహితులను కలుసుకొని మధురానుభూతి పొందాలన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, శ్యాంసుందర్, అశోక్, రాజేంద్రప్రసాద్, నరేందర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, అశ్విని కుమార్, నరసింహారావు, డాక్టర్ రామచంద్రరావు, జగన్, రంజన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
గాలిదుమారం.. వడగండ్లు
సూర్యాపేట అర్బన్, ఆత్మకూర్(ఎస్), తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్ నాగారం, నడిగూడెం : అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. అకాల వర్షాలు రైతులకు అంతులేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న వరి నేలవాలింది. కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● సూర్యాపేట పట్టణంలో బలమైన ఈదురు గాలులు వీయంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సుమారు రెండు గంటల తర్వాత విద్యుత్ను పునరుద్ధరించారు. ఈదురుగాలుల బీభత్సవానికి కుడకుడలోని ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. ప్రహరీ కూలిపోయింది. ● నాగారం మండలంలో వరిచేలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నర్సింహులగూడెం గ్రామాలనికి వెళ్లే రహదారిపై చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో వరి పైరు నేలకొరగగా, మామిడి, నిమ్మ తోటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ● ఆత్మకూర్(ఎస్) మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు విరిగి, విద్యుత్ స్తంభాలు కూలాయి. సుమారు 40 నిమిషాల పాటు ఈదురు గాలులు వీయడంతోపాటు రాళ్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకస్మాత్తుగా వచ్చిన గాలివానతో ధాన్యం రాశులపై పట్టాలు కప్పడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ● తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరింది. భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మకాయలు నేల రాలాయి. అదేవిధంగా నూతనకల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయింది. ● జాజిరెడ్డిగూడెం మండలంలోరైతులు తీవ్రంగా నష్టపోయారు. జాజిరెడ్డిగూడెం. అర్వపల్లి, కోడూరు, తూర్పుతండా కాసర్లపహాడ్ తదితర గ్రామాల్లో వరిపంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదైపె పడి మృతిచెందింది. అర్వపల్లిలో హైవేలు జలమయమయ్యాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● నడిగూడెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బృందావనపురం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. నడిగూడెంలోని ప్రధాన రహదారిపై ఉన్న పలు భారీ వృక్షాల కొమ్మలు విరిగాయి. ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ నేలరాలిన మామిడి, నిమ్మకాయలు ఫ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఫ చెట్ల కొమ్మలు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ధాన్యం పూర్తిగా తడిసిపోయింది అమీనాబాద్ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. ధాన్యం ఆరబోసుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నా. ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం కల్లంలోనే తడసిపోయింది. పూర్తిగా నష్టం వాటిల్లింది. – నాగరాజు, రైతు అమీనాబాద్, అనంతగిరి మండలం -
నల్లగొండ బిడ్డకు ఉన్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి మరో ఉన్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా మారాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, సహచర న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా
సూర్యాపేటటౌన్ : జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో నిర్వహిస్తున్న జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, రుణాలు, ఫైనల్ పేమెంట్స్ సుమారు రూ.18 కోట్ల 72 లక్షలు రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడంతోపాటు వరుస క్రమం పాటించకుండా చెల్లింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సోమయ్య, సిరికొండ అనిల్ కుమార్, కె అరుణ భారతి, పి శ్రీనివాసరెడ్డి, వెంకటయ్య, ఆర్.దామోదర్, నాగేశ్వరరావు, వి.రమేష్, బి.ఆడం, డీ.లాలుసభ్యులు పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతికి పోలీస్ భద్రత
సూర్యాపేటటౌన్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం భక్తుల సౌకర్యార్థం జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత సమయంలో కార్యక్రమాలు ముగించుకోవాలన్నారు. ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలిసూర్యాపేట అర్బన్ : ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలని అదనపు కలెక్టర్, సూర్యాపేట మున్సిపల్ ప్రత్యేక అధికారి పర్స రాంబాబు అన్నారు. శుక్రవారం వాటరింగ్ డే ను పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై మొక్కలకు ఆయన నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలంలో మొక్కలకు నీరు పోసి కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్, వసుంధర, వసీం తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంగరిడేపల్లి : అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు ప్రతి గ్రామంలోని వార్డుల్లో సమస్యలను గుర్తించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్బోర్డు సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింగ్ అంజయ్య, పొలిశెట్టి అంజయ్య, జెనిగల శ్రీను, చిత్తలూరు సోమయ్య, చంద్రశేఖర్రెడ్డి, తాళ్ల సురేష్, గుండు బాలకృష్ణ, రామకృష్ణ, కందుల వెంకటరెడ్డి, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలి భానుపురి (సూర్యాపేట) : మార్కెట్ యార్డుకు రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మార్కెట్కు 25వేల బస్తాల ధాన్యం వచ్చిందని, రూ.2329 గరిష్ట, రూ.1500 కనిష్ట ధర పలికిందన్నారు. లైసెన్స్ కలిగిన వ్యాపారులు రైతుల ధాన్యం కుప్పలో తేమ శాతం, తాలు, చెత్త పరిశీలించిన తర్వాత ధర నిర్ణయిస్తారని తెలిపారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రైతు బత్తిని లింగరాజు 40 బస్తాల ధాన్యం తీసుకురాగా.. నాణ్యత ప్రమాణాల మేరకు రూ.1606 ధరను ఖరీదుదారులు చెల్లించేందుకు ముందుకు వచ్చారన్నారు. ధర ఎక్కువ కావాలని రైతు కోరగా.. తాలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఖరీదుదారులు అంత ధర చెల్లించలేమన్నారని పేర్కొన్నారని అన్నారు. చుట్టుపక్కల రైతులు, లింగరాజు కలిసి చెట్ల ఆకులను ధాన్యం రాశి వద్దకు తీసుకొచ్చి నిప్పంటించారన్నారు. తేమశాతం 22 ఉందని, ధాన్యాన్ని ఆరబెడితే ధర అధికంగా చెల్లించే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో రైతు అంగీకరించి శనివారం ధాన్యం అమ్ముకుంటానని చెప్పాడన్నారు. మార్కెట్కు నిత్యం కొందరు కావాలనే మార్కెట్ కమిటీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, రైతులు అధైర్య పడకుండా ధాన్యం తీసుకురావాలని సూచించారు. -
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
చివ్వెంల(సూర్యాపేట) : కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు అరబెట్టిన ధాన్యం తీసుకురావాలన్నారు. 17 శాతం తేమ ఉంటే ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్కుమార్, నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల చదువుతోనే సమాజ అభివృద్ధి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : మహిళల చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఫూలే గుర్తించారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డితో కలిసి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్యతో గుర్తింపు లభిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి ఫూలే అన్నారు. అస్పృశ్యత, లింగ వివక్షత నిర్మూలించేందుకు, వితంతువులకు పునర్వివాహం చేసేందుకు జ్యోతిబాఫూలే కృషి చేశారని అన్నారు. మహిళా సాధికారత లభిస్తే సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి భార్య సావిత్రిబాయి ఫూలే ను మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తయారు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో 13 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చదువు చెబుతున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థానానికి చేర్చేందుకు జ్యోతిబా ఫూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. అనంతరం బీసీ ఉద్యోగుల డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్్ వి.రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం
మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతసేవ, నిత్య అగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. నూతన పట్టు వస్త్రాలంకరణతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు. అనంతరం , మాంగల్యధారణ, తలంబ్రాలతో వేదమంత్రోచ్ఛరణాలతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కృష్ణానదికి అర్చకులు హారతి ఇచ్చారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏదీ సౌకరా్యల జాడ!
కోదాడ: కోదాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ (ఇండస్ట్రీయల్ పార్క్) పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. పారిశ్రామిక వాడలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తక్కువ రేట్లకు స్థలాలు దక్కించుకున్నవారు అటువైపు చూడకపోవడంతో పారిశ్రామిక వాడ కంపచెట్లతో దర్శనమిస్తోంది. చీకటి పడిందంటే అటువైపు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి పక్కన ఉండే ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. 20 ఏళ్లలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు అన్నీ కలిపి ఇప్పటి వరకు 20 నుంచి 30 మాత్రమే ఇక్కడ ఏర్పాటు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారి పక్కన 61 ఎకరాలు.. కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద 2005లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ).. ప్రస్తుతం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో కోదాడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన రూ.44.73 లక్షలతో 61 ఎకరాల భూమిని సేకరించారు. దీన్ని లేఅవుట్ చేసి రోడ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేవారికి స్థలాలు కూడా కేటాయించారు. 2006 నుంచే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్థలాలు తీసుకున్నవారు నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ 200 వరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా గత 20 సంవత్సరాల్లో కేవలం 20 నుంచి 30 వరకు మాత్రమే పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 119 మంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేయగా వారికి స్థలం కేటాయించారు. స్థలం కోదాడలో.. కార్యాలయం వరంగల్లో.. కోదాడ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడకు సంబంధించిన ఏ సమాచారం కూడా ఇక్కడ దొరకడం లేదు. ఇది వరంగల్ రీజియన్ పరిధిలో ఉంది. దీంతో ఏ సమాచారం కావాలన్నా వరంగల్కు వెళ్లాల్సి వస్తోంది. రీజియన్ అధికారులు ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి కూడా వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి కోదాడ పరిధిలోని దోరకుంట పారిశ్రామికవాడలో కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు గుంతలుపడి కంకర తేలాయి. కంపచెట్లు కమ్మేశాయి. కోదాడ దుర్గాపురం జంక్షన్ నుంచి పారిశ్రామికవాడ వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడి నుంచి భారీ వాహనాలు ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లి చిమిర్యాల క్రాస్ రోడ్డు నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. – ఏర్నెని బాబు, మాజీ సర్పంచ్, కోదాడ ఫ 20 ఏళ్ల క్రితం దోరకుంట వద్ద ఏర్పాటు ఫ దరఖాస్తు చేసుకున్నవారికి స్థలం కేటాయింపు ఫ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని పరిశ్రమలు ఫ మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలంకనీస సౌకర్యాలు కరువు పారిశ్రామిక వాడకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లపై కంకర తేలి నడవడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు వేసే దిక్కేలేదు. ఆ ప్రాతం మొత్తం కంపచెట్లు పెరిగి చీకటి పడితే వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. నీటి వసతి కూడా లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో అనేక ట్రాక్టర్ ట్రాలీ, ఇతర వ్యవసాయ పనిముట్లు, షట్టర్లు తయారు చేసే పరిశ్రమలు రోడ్డుమీదే ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వీరందరికీ పారిశ్రామిక వాడలో స్థలాలు కేటాయించాలని పలువురు కోరుతున్నా అది కార్యరూపం దాల్చడంలేదు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలి
గరిడేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునేవిధంగా గర్భిణులను ప్రోత్సహించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వేసవి కాలంలో ప్రజలు తమ పనులను ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్పనిసరిగా గొడుగు తీసుకుని వెళ్లాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులు వాడేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ నజీయా, ఏఓ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ నరేష్, ఎస్ఓ వీరయ్య, సతీష్, శారద, అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్ఫోన్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు. -
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి –జటంగి నర్సమ్మ, కేతేపల్లి నెలకు రూ.1500 ఆదా అవుతున్నాయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగానే ఉన్నాయి. మా ఏరియా వారందరూ సన్నబియ్యం వండుకుని తింటున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం వల్ల మాకు బియ్యం కొనుగోలు చేయడం తప్పింది. నెలకు దాదాపు రూ.1500 వరకు ఆదా అవుతోంది. – రమ్య, హుజూర్నగర్ -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమశాతం 17 రాగానే సీరియల్ ప్రకారం తూకం వేయాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
అమ్ముకోం.. వండుకుంటం
సన్న బియ్యంపై లబ్ధిదారుల సంతృప్తిసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. సరిగ్గా వండుకుంటే సమస్యే లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గంజి సరైన సమయంలో సరిగ్గా వార్చకపోతే కొద్దిగా ముద్ద అవుతోందని, అయినా పరవాలేదని సన్న బియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త బియ్యం అయినందున కొన్నాళ్లు ఆగి వండుకుంటే మరింత బాగుంటుందని పేర్కొంటున్నారు. అక్కడక్కడ కొంతమేర నూకలు వస్తున్నా, దొడ్డు బియ్యంతో పోల్చితే సన్న బియ్యాన్ని పూర్తిగా వండుకొని తింటామని ప్రజలు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలోనే సన్నబియ్యం సరఫరా అయ్యాయి. 90 నుంచి 60 శాతం మంది లబ్ధిదారులు బియ్యాన్ని ఇప్పటికే తీసుకెళ్లారు. తొలి మూడు, నాలుగు రోజులు లభ్దిదారులు షాపుల వద్ద బారులు తీరారు. సన్న బియ్యం చింట్లు, హెచ్ఎంటీలు రకంగా పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్నవి ఫోర్టిఫైడ్ సన్నబియ్యం అని చెబుతున్నారు. సన్న బియ్యంలో మూడు రకాల బియ్యం ఉన్నాయని, 30శాతం వరకు నూకలు, మెరిగెలు ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ వండుకుంటున్నారు ఎక్కడా అమ్ముకోవడం లేదు. బియ్యంలో సుమారు 15 నుంచి 20 శాతం వరకు నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు తెలుపుతున్నారు. బియ్యం తినడానికి వీలుగా ఉన్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్నం బాగానే ఉంటుందని గంజి వార్చితే ఇంకా బాగుంటుందని మహిళలు చెబుతున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తుండడంతో తాము పిండి పట్టించడానికి ఇతర అవసరాలకు వాడుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటున్నట్లు పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సన్న బియ్యం తీసుకున్న ప్రజలు ఆ బియ్యంతో ఏం చేస్తున్నారు.. గతంలో దొడ్డు బియ్యాన్ని ఇడ్లీ, దోశలకు వినియోగించినట్లుగానే వినియోగిస్తున్నారా? వాటిలా అమ్ముకునేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదంటే తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే అంశాలపై ‘సాక్షి’ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది. లబ్ధిదారులతో మాట్లాడింది. మొత్తానికి సన్న బియ్యంను తాము తినేందుకే వినియోగిస్తామని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఇంకా సాగుతున్న పంపిణీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రేషన్ షాపులు 2122 ఉండగా, వాటి పరిధిలో 10,08,829 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులపై ప్రతినెలా 1,75,70,855 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,92,12,855 కిలోల బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయగా, ఇప్పటివరకు 1,44,47,914 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఇంకా 31.22.941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. పేదలకు మేలు సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో దొడ్డుబియ్యం పంపిణీతో దళారులకు లబ్ధిచేకూరేది. ఆ బియ్యాన్ని తినలేక చాలా మంది అమ్ముకునేవారు. కోళ్లకు, గేదెలకు పెట్టేవారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఈ బియ్యాన్నే తింటారు. – గంపల కిష్టమ్మ, నెమ్మికల్లు, ఆత్మకూర్(ఎస్) మండలం సన్నబియ్యం పర్వాలేదు గతంలో ఇచ్చిన దొడ్డు రకం బియ్యం కంటే ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం పర్వాలేదు. అన్నం కొద్దిగా మెత్తగా అవుతోంది. గతంలో ఉన్న బియ్యం తినలేకపోయాం. నాకు నెలకు ఆరు కిలోలు వస్తాయి. సన్నబియ్యం నిరంతరం ఇస్తే బాగుంటుంది. – కిన్నెర రాములమ్మ, తిప్పర్తిఫ సరిగ్గా వండితే.. సాఫీగానే భోజనం ఫ కొన్నిరోజులు ఆగి వండుకుంటే మరింత బాగు ఫ గంజి సరిగ్గా వార్చకపోతే కాస్త ముద్దగా అన్నం ఫ కొంతమేర నూకలు.. అయినా బాగున్నాయని ఆనందం -
నేడు కోదాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు
కోదాడరూరల్ : కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమైనట్లే. అధ్యక్ష పదవికి న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్యలు పోటీపడుతున్నారు. అయితే బార్ అసోసియేషన్ క్షేమం కోరి సీనియర్ల సలహా మేరకు నాళం రాజయ్య పోటీ నుంచి విరమించుకొని లక్ష్మీనారాయణరెడ్డికే మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బార్ కౌన్సిల్ నియమావళి ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ రాజ య్య పోటీనుంచి తప్పుకోవడంతో లక్ష్మీనారాయణరెడ్డి ఎన్నిక దాదాపుగా ఖరారు అయింది. శుక్రవారం అధ్యక్ష పదవితో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎన్నికను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 104 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు నాగేశ్వరరావుతో పాటు సహాయ అధి కారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు. ఉపాధి పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలి భానుపురి (సూర్యాపేట) : యుక్తధార పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్లకు యుక్త ధార శిక్షణ తరగతుల్లో డీఆర్డీఓ వీవీ అప్పారావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో వాటర్ షెడ్ పద్ధతిలో ఎత్తు పల్లాల నుంచి దిగువపల్లం వరకు సంబంధించిన పనులను పోర్టల్లో గుర్తించాలన్నారు. సాగర్ కాల్వలకు నీటి నిలిపివేతనాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వలకు గురువారం సాయంత్రం నీటిని నిలిపి వేశారు. యాసంగి పంటకుగాను అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీటిని విడుదల చేశారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాలు సాగైంది. ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 115 రోజులపాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశారు. విద్యుత్లైన్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలిహుజూర్నగర్రూరల్ : విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ప్రాంక్లిన్ సిబ్బందిని ఆదేశించారు. హుజూర్నగర్ మండలంలోని వేపలసింగారంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు సబ్స్టేషన్కి వచ్చే 33 కేవీ లైన్ విద్యుత్ స్తంభాలు ఎనిమిది విరిగిపోయాయి. కాగా గురువారం డీఈ వెంకటస్వామితో కలిసి విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించి మాట్లాడారు. వీరి వెంట ఏఈ రాంప్రసాద్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
సర్కారు బడి బలోపేతానికి..
వేసవి సెలవులకు ముందే బడిబాట ఫ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యం ఫ 23 వరకు కొనసాగనున్న కార్యక్రమంప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేదు. నాణ్యమైన బోధన అందుతోంది. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆసక్తితో స్వచ్ఛందంగా వారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – అశోక్, డీఈఓ సూర్యాపేటటౌన్ : సర్కారు బడి బలోపేతానికి కొందరు ఉపాధ్యాయులు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా వేసవి సెలవులకు ముందే వీరు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అధికారికంగా కాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 23 వరకు కొనసాగనుంది. జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు మెత్తం 950 ఉన్నాయి. వీటిలో 690 ప్రాథమిక, 70 ప్రాథమికోన్నత, 190 ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని ఏటా జూన్లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ముందస్తుగానే విద్యార్థుల గుర్తింపు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన కొంత మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి స్వచ్ఛందంగా ముందస్తుగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచి ఉదయం 8 గంటల మధ్య నిర్వహిస్తున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత నిర్వహిస్తున్నారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మోడల్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలు, డిజటల్ తరగతులు గురించి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గుర్తించిన పిల్లలను జూన్ మొదటి వారంలో లో నిర్వహించే అధికారిక బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేర్చుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా.. ప్రతి సారి జూన్లో బడిబాట నిర్వహిస్తుండటంతో అప్పటికే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ విషయాన్ని కొంత మంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ తేజస్నంద్లాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సారి జిల్లాలో ముందస్తుగానే బడిబాట నిర్వహించి పాఠశాలలు ముగిసే సమయానికి జిల్లా అంతా బడిబాట నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో మరో రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలల్లో బడిబాట నిర్వహించాలని ఆదేశాలు రానున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. -
నల్లగొండ రీజియన్కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
భానుపురి (సూర్యాపేట): నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కబస్సుల స్థానంలో త్వరలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. నల్లగొండ రీజియన్కు 152 బస్సులను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 41 ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిలిగిన బస్సులు త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్తోనే నడవనున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఈ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చార్జింగ్ పాయింట్లో రోజుకు ఐదారు బస్సులకు మాత్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు. డ్రైవర్లకు శిక్షణ అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు హైదరాబాద్లో డ్రైవర్లకు సుమారు 20 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే బస్సుల రూట్లను పూర్తిస్థాయిలో కేటాయిస్తారు.ఫ సూర్యాపేటకు 75, నల్లగొండకు 77 బస్సుల కేటాయింపు ఫ ఇప్పటికే సూర్యాపేట డిపోకు 41 బస్సులు రాక ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులుప్రయాణికులకు మెరుగైన రవాణా ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. ఆయా రూట్లలో బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది. – జాన్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం -
ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం
హుజూర్నగర్రూరల్ : హుజూర్నగర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. వేపలసింగారంలో కొనుగోలు కేంద్రంలో రైతులు చల్మారెడ్డి, యూకుబ్లకు చెందిన సుమారు 10 ఎకరాల ధాన్యం తడవడంతో పాటు రాశులపై కప్పిన పట్టాలపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ నీటిని తొలగించి బుధవారం వాటిని ఆరబెట్టారు. అంతేకాకుండా బూరుగడ్డ, శ్రీనివాసపురం, లక్కవరం, అమరవరం గ్రామాల్లో కోతకు దశకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఆకాల వర్షానికి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతు సంఘాల నాయకులు కోరారు. తోటల్లో రాలిన మామిడి, నిమ్మ కాయలు తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మండలంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మతోటలకు నష్టం వాటిల్లింది. జలాల్పురం, తొండ గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు, నిమ్మకాయలు రాలాయి. ఫ అకాల వర్షానికి తడిసిన ధాన్యం ఫ నేలవాలిన వరి చేలు -
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ
కోదాడరూరల్: కోదాడ బార్అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు న్యాయవాదులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలు పదవులు ఏకగ్రీవం కాగా కొన్ని పదవులకు పోటీ తప్పలేదు. అధ్యక్ష పదవికి సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్య పోటీలో ఉండగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎండి.హుస్సేన్, ఎస్. నవీన్కుమార్లు పోటీపడుతున్నారు. కాగా వైస్ ప్రెసిడెంట్గా ఉయ్యాల నర్సయ్య, జాయింట్ సెక్రటరీగా ఎండి.నయీం, లైబ్రరీ సెక్రటరీగా షేక్.కరీముల్లా, ట్రెజరర్గా కోడూ రు వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్సెక్రటరీగా బండారు రమేష్బాబు, లేడీ రిప్రజెంటేటివ్గా ధనలక్ష్మితో పాటు ఈసీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలిచివ్వెం(సూర్యాపేట) : విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని విజయకాలనీలో ఉన్న బాల సదన్ చిల్ట్రన్స్ హోమ్ను తనిఖి చేశారు. విద్యార్థులను మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమ శిక్షణ పట్టుదలతో చదివి, భావిపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, బి.విష్ణు స్వ రూప్ పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి కోదాడరూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నరసింహ సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చిన్నవయస్సులోనే గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తుండాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కొంతమంది స్వార్థంతో దాడులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రీధర్రెడ్డి, రూరల్ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చేపట్టిన 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన భవన నిర్మాణ ప్లానింగ్ను పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ డిపార్ట్మెంట్ వస్తుందో అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు చేసి మార్పుల కోసం టీఎస్ఎంఐడీసీకి ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు. ఆ తర్వాత హెచ్ఓడీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తర్వాత నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు భవనాలు అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, దేవేందర్, ఈఈ జైపాల్ రెడ్డి, హెచ్ఓడీలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించాలి భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస సామర్థ్యాల సాధనలో భాగంగా పాఠశాలలు ప్రారంభమైన మొదటి 60 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పది రోజులకు ఒకసారి పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్షకు పరీక్షకు విద్యార్థి మార్కుల్లో పురోగతి కన్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లా వానాకాలం, యాసంగి సీజన్ లలో అత్యధికంగా వరి పంట సాగు చేసి రాష్ట్రానికి అన్నం పెట్టేలా ఎదిగిందన్నారు. అలాగే చదువులో కూడా జిల్లాను ఉన్నత స్థాయి కి చేర్చి మోడల్గా మార్చాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సెక్టోరియల్ అధికారి జనార్దన్, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధాన్యం ట్రాక్టర్ల బారులు
నేరేడుచర్ల: రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నేరేడుచర్లలో కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించారు. దీంతో వారి దుకాణాల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులుదీరాయి. పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు, జాన్పహాడ్ రోడ్డులో వందలాది ధాన్యం ట్రాక్టర్లు నిల్చున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 8న స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే ఖరీదు చేస్తుండటంతో రైతులు కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినా పచ్చి ధాన్యం అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలం లేకపోవడం, బస్తాల కొరత ఉండటంతో రైతులు దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. వీరు వారం రోజుల క్రితం రూ.2500 కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ. 2200 నుంచి రూ.2250 వరకు కొనుగోలు చేస్తున్నారు. -
మహాత్మా.. కదిలించు!
కోదాడ: కోదాడ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏర్పాటు చేసిన పార్కు ఆక్రమణకు గురైంది. కొందరు పూల వ్యాపారులు పార్కు స్థలాన్ని కబ్జా చేసి తమ దుకాణాలను విస్తరించారు. వాకింగ్ ట్రాక్ను సైతం ఆక్రమించేశారు. పూల వ్యర్థాలను కూడా పార్కులోనే డంపు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. మున్సిపాలిటీ పరిపాలన వ్యవహారాలను చూడాల్సిన ప్రత్యేక అధికారి కనీసం చుట్టపుచూపుగా కూడా రావడంలేదన్న విమర్శలున్నాయి. 12 అడుగుల మేర లోపలికి చొచ్చుకొని వచ్చి.. కోదాడ మున్సిపాలిటీలో 80వేలకుపైగా జనాభా ఉన్నారు. కోదాడ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గాంధీ పేరిట పార్కును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. గతంలో దీన్ని కొందరు కారు పార్కింగ్ కోసం ఉపయోగిస్తుండగా అప్పటి మున్సిపల్ కమిషనర్ బాలోజినాయక్ వారిని ఖాళీ చేయించి దానిలో మొక్కలు పెట్టారు. ఈ పార్కుకు జాతీయ రహదారి వైపు కొందరు చిన్న బండ్లపై పూల వ్యాపారం చేసుకుంటారు. కొంత కాలంగా ఈ వ్యాపారులు తమ డబ్బాకొట్లను కొద్దికొద్దిగా పార్కు లోపలకు విస్తరిస్తూ దాదాపు 12 అడుగుల మేరలోపలికి చొచ్చుకొనిపోయి పక్కానిర్మాణాలు చేసుకున్నారు. ఇంతటి తో ఆగకుండా పార్కు లోపల వాకింగ్ ట్రాక్నూ కబ్జాచేశారు. దీంతో పార్కుకు వచ్చేవారు నడవకుండా అయ్యింది. పాడైపోయిన పూలు, చెత్తను పార్కులోపలే వేస్తున్నారు. పూలవ్యాపారులు తమ ద్విచక్రవాహనాలను పార్కులోపలే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చేవారు ఇబ్బందులు పడాల్సివస్తోంది. నిర్వహణ మరిచిన మున్సిపల్ అధికారులు గాంధీ పార్కు అభివృద్ధి పేరుతో గత పాలకవర్గం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. మొదట పార్కులోపల రూ.10 లక్షలు ఖర్చు చేసి ఓపెన్జిమ్, పిల్లలు ఆడుకునే కొన్ని వస్తువులను ఏర్పాటు చేశారు. నాణ్యత లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే అవన్నీ పాడైపోయాయి. తరువాత మరో రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి పార్కులోపల మొక్కలునాటారు. గ్రీనరీతో పాటు వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ మరువడంతో ప్రస్తుతం పార్కులో సగం మొక్కలు చనిపోయాయి. ఇక పార్కులోపల ఏర్పాటు చేసిన మూత్రశాలలకు తాళం వేసిఉంచారు. దాన్ని తీసేనాథుడే లేడు. పార్కు నిర్వహణకు ఒకరిని నియమించాలి గాంధీపార్కుతో పాటు పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉత్తమ్ పద్మావతినగల్లోని పార్కు, పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండిపోతున్నాయి. గాంధీ పార్కువద్ద ఆక్రమణల విషయంలో ము న్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ కాంప్లెక్స్పై అనుమతి లేకుండా నిర్మాణం చేసిన షెడ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రత్యేక అధికారి మున్సిపాలిటీ విషయాలపై దృష్టిసారించాలి. –కుదరవెళ్లి బసవయ్య, కోదాడకోదాడ పట్టణంలోని గాంధీ పార్కులో ఆక్రమణల జోరు ఫ తాత్కాలికంగా కొట్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత పక్కా నిర్మాణాలు ఫ పార్కుస్థలంలోపలి వరకు దుకాణాల విస్తరణ ఫ వాకింగ్ ట్రాక్ సైతం కబ్జా ఫ చెత్త మొత్తం పార్కులోనే డంపు ఫ చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు -
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేద ప్రజల పై భారం మోపిందన్నారు. కార్యక్రమంలో అనంతుల మల్లేశ్వరి, కొప్పోజు సూర్యనారాయణ, దొడ్డ వెంకటయ్య, బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, రేగట్టి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సేవలందించాలి
కోదాడ: కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ కోరారు. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. వంద పడక వైద్యశాల నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యులు పనిచేయాలని కోరారు. వైద్యుల కొరత లేకుండా త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ దశరథనాయక్, ఆర్డీఓ సూర్యానారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
త్వరలోనే ఆధార్ ఈ– సంతకం ప్రస్తుతం రిజిస్ట్రేషలన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసే వారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమయం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ– సంతకం విధానాన్ని ప్రవేశపెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.చౌటుప్పల్: ఇళ్లు, ఇంటిస్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు గతంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. ఽగత ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో వ్యవసాయ భూములు తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేవి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ కొనసాగుతుండేది. ఈ పద్ధతికి స్వస్తి పలకడంతోపాటు సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 144 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ప్రయోగాత్మకంగా 22 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ కార్యాలయాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో భువనగిరి, చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు 48 స్లాట్లుగా విభజన ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో అత్యధిక డాక్యుమెంట్లు సమర్పిండంతో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారీ పనివేళలను 48స్లాట్లుగా విభజించనున్నారు. ప్రజలు డాక్యుమెంట్ రైటర్లపై ఏమాత్రం ఆధారపడకుండా registration.tela ngana.gov.in వెబ్సైట్లో తమకు అనుకూలమైన తేదీ, రోజును ఎంచుకొని ఆ సమయానికి కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10– 15నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది. రేపటి నుంచి భువనగిరి, చౌటుప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు ఇళ్లు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్కు కొత్త విధానం స్లాట్ బుకింగ్ లేని ఐదు డాక్యుమెంట్లకు అనుమతి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చేసుకోని 5 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. -
కక్షిదారులకు అందుబాటులో ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సఖీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జువైనల్ కోర్టును ప్రారంభించి మాట్లాడారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలు నేరాలకు పాల్పడితే జువైనల్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. అదే విధంగా రిమాండ్లో భాగంగా నల్లగొండలొని చైల్ట్ హోంకు తరలించనున్నట్లు తెలిపారు. బాలలు చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి మంగళవారం కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ లాయర్లు తదితరుల పాల్గొన్నారు. ఫ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎమ్.శ్యామ్ శ్రీ -
టార్గెట్ రూ.6
కోట్లుసూర్యాపేట మున్సిపాలిటీలో ఈ నెల ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇదీజూన్ దాటితే .. మున్సిపాలిటీలో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై ఫైన్ పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారికి అపరాధరుసుంతో సహాచెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. అపరాధ రుసుముకు సంబంధించి తగ్గింపు లాంటివి ఇక్కడి స్థానిక మున్సిపల్ అధికారుల పరిధిలో ఉండదు. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది. భవన యజమానులందరు అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో భాగంగా ఈనెలలో రూ.6కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి ముందస్తుగా చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ రాయితీ నివాస, వాణిజ్య భవనాలకు వర్తించనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు. ఈనెల 30తో రాయితీ గడువు ముగియనుంది. ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి.. ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి మున్సిపల్శాఖ రాయితీ అవకాశం కల్పించింది. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకే సారి చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈమేరకు ఆశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. రాయితీ ప్రకటనతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తి పన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు బకాయిలతో సహా చెల్లిస్తేనే.. మున్సిపల్ పట్టణంలోని భవనాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2025 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్ను ను ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహా చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో 5 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఏడాదికి లక్ష రూపాయల ఆస్తి పన్ను చెల్లించే వారికి ముందస్తుగా చెల్లించడం ద్వారా రూ. 5వేల ను భవనాల యజమానులు లబ్ధిపొందనున్నారు. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం చెల్లించాలి. అందువల్ల ప్రజలు ఈ5 శాతం రాయితీని వినియోగించుకుంటే బాగుంటుంది.రాయితీని సద్వినియోగం చేసుకోవాలి ఇంటి యజమానులు ఈ సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించి 5శాతం రాయితీ పొందాలి. బకాయిలతో సహా ఈ ఏడాది పన్ను చెల్లిస్తే కూడా రాయితీ వర్తించనుంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ తర్వాత పెనాల్టీ పడుతుంది. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు సూర్యాపేట మున్సిపాలిటీలో 35,429 నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను డిమాండ్ రూ.15కోట్లు ఉంది. ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈనెలలో రూ.6 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 మంది మున్సిపల్ సిబ్బంది, ఆర్ఓ కలిసి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు. ఫ ఎర్లీబర్డ్ స్కీం కింద 5శాతం రాయితీ ఫ ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి వర్తింపు ఫ ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు సూర్యాపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వివరాలు(రూ. కోట్లలో) సంవత్సరం మొత్తం ఏప్రిల్ వసూలు డిమాండ్ టార్గెట్ 2024–25 13.60 5 4.982025–26 15 6 0.90 -
బెట్టింగ్కు పాల్పడితే చర్యలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ఎవరైనా బెట్టింగ్లకు పాల్పతే చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్స్, పేయింగ్ గేమ్స్, ఆన్లైన్ జూదం, రమ్మి లాంటి ఆటలతో పాటు ఇతరత్రా బెట్టింగ్లకు పాల్పడవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్లు, ఇతర బెట్టింగ్ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదికి తెచ్చుకుంటోందని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఎవరైన బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు గానీ లేదా డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో రైతు నర్సింహారావునడిగూడెం : నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మారిశెట్టి నర్సింహారావు రాజస్థాన్లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8 వరకు నిర్వహించిన శాశ్వత యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో పాల్గొన్నారు. మంగళవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల కలిగే దుష్ఫప్రభావాలు, ప్రకృతి కాలుష్యం అవుతున్న విధానం, తద్వారా జరిగే ప్రకృతి వైపరీత్యాలు, ఆహారం విషంగా మారడం, మానవ జాతికి విషాహారం వల్ల మానవజాతికి కలిగే అనర్థాలు తదితర అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు. మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలునల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న శ్రీసామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్రశ్రీపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తామని వివరించారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్సాగర్, సుధారాణి, అరుణప్రియ, సబీనా, హరీష్కుమార్, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. పూజల్లో భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. -
కాంటాలు వేయడంలో జాప్యం వద్దు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోదాడరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో నల్లబండగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కాంటాలు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ బస్తాలు, మిల్లుల ట్యాగులు కాక ఆలస్యం అవుతోందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, స్థానిక పీఏసీఎస్ చైర్మన్ కొత్తా రఘుపతి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీసీఓ, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బస్తాలు, ట్యాగులు పంపించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సీఈఓ జొన్నలగడ్డ జయకృష్ణ, రైతులు ఉన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేయాలి భానుపురి (సూర్యాపేట) : సహకార సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కోఆపరేటివ్ అభివృద్ధి కమిటీ, జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్, సోలార్ యూనిట్స్, ఐస్ ప్రాజెక్ట్లపై పీఏసీఎస్ల ద్వారా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. పీఏసీఎస్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లపై శిక్షణ ఇప్పించి వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పీఏసీఎస్ చింతలపాలెంలో కోల్డ్ స్టోరేజ్కు డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, నాబార్డ్ ఏజీఎం ఎన్. సత్యనారాయణ, డీసీసీబీ సీఈఓ ఆర్. శంకర్రావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖైదీలు ఉంటున్న గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. దీని వల్ల కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందన్నారు. మంచి నడవడిక కలిగి ఉండి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. జైలులో ఉన్న ఖైదీలు అడ్వకేట్లను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకుంటే డీఎల్ఎస్ఏకు దరఖాస్తు చేసుకోవాలని, ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి ,జైలు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి -
నేటి నుంచి ఎస్ఏ–2
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో బుధవారం నుంచి ఎస్ఏ(సమ్మెటివ్ అసెస్మెంట్)–2 పరీక్షలు జరగనున్నాయి. 9వ తేదీ నుంచి 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రారంభం కానుండగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాలను జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలను అయా మండలాలు, పాఠశాలలకు పంపిణీ చేశారు. జిల్లాలో 1261 పాఠశాలలు... జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,261 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు 1.18లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఎస్ఏ –2 పరీక్షలు రాయనున్నారు. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు సాధించిన మార్కులు, హాజరు వివరాలను ‘ఐఎస్ఎంఎస్’ పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఈ నెల 23న తల్లి దండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి వెల్లడించనున్నారు. ఫ 17వ తేదీ వరకు నిర్వహణ షెడ్యూల్ ఇలా... తేదీ సబ్జెక్ట్ 9 తెలుగు 10 హిందీ 11 ఇంగ్లిష్(6 టు 9) తెలుగు(1 టు 5) 12 సోషల్(6, 7), మ్యాథ్స్(8, 9) ఇంగ్లిష్(1 టు 5) 15 జనరల్ సైన్స్(6, 7), ఫిజికల్ సైన్స్(8, 9) మ్యాథ్స్( 1 టు 5) 16 మ్యాథ్స్(6, 7) బయో సైన్స్(8, 9) ఈవీఎస్(1 టు 5) 17 సోషల్ (8, 9వ తరగతులకు) -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27 వతేదీన వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, నాయకులు నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు . -
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే..మా అక్కనే స్ఫూర్తి..నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది.సొంతంగానే చదివా..గ్రూప్స్కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్కు అవసరమయ్యే మెటీరియల్ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్లో నాకు అవసరమైన మెటీరియల్ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. -
మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు
● ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మైనార్టీ గురుకులాలు ● అందులో 13 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులుచౌటుప్పల్ రూరల్: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. చాలా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క గురుకులానికే సొంత భవనం..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో ఉన్న బాలుర మైనార్టీ గురుకులానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా 13 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్, భువనగిరిలో బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటికి నెలకు సుమారు రూ.3.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. వసతుల్లేక ఇబ్బందులు..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల మూతపడిన పరిశ్రమ షెడ్లో కొనసాగుతోంది. డార్మిటరీ లేక రేకుల షెడ్లోనే సుమారు 320 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద రేకుల షెడ్ను గదులుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు. బాత్రూంలు కూడా సరిపడా లేవు, భోజనం చేయడానికి రేకుల షెడ్లోనే డైనింగ్ హాల్ ఏర్పాటుచేశారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో విలీనం చేసేనా..రాష్ట్ర ప్రభుత్వం 28 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను కూడా విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరిలో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లోకి ఆయా ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ గురుకులాలు విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను మునుగోడు మండలం కలకుంట్లలో నిర్మిస్తున్న సమీకృత గురుకులంలో విలీనం చేస్తారని సమాచారం. సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను విలీనం చేయకపోతే మైనార్టీ గురుకుల పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శివాలయంలో నిత్యారాధనలు నిర్వహించిన అర్చకులు మూలమంత్ర జపములు, దశ శాంతి పంచసూక్త పారాయణములతో అభిషేకములు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, అష్టోత్తర శతనామార్చనలు జరిపించారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుకను ఆలయ సిద్దాంతి, ప్రధానార్చకులు చేపట్టారు. సాయంత్రం నిత్యారాధనలు జరిపించిన అనంతరం రాత్రి 7గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్పములు, కార్యక్రమాలు జరిగాయి. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. -
అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్ !
నడిగూడెం: ప్రస్తుత వేసవిలో పశుగ్రాసం కొరతతో పాడి రైతులు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు అజొల్లా పెంపకమే సరైన పరిష్కారమని నడిగూడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ అఖిల చెబుతున్నారు. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ నీటి మొక్క త్వరగా పెరుగుతుందని, ఇది పశుగ్రాసానికి ప్రత్యామ్నాయమని ఆమె పేర్కొన్నారు. అజొల్లాతో లాభాలు ఇవీ..అజొల్లా తిన్న పశువులకు పోషక విలువలు అందుతాయి. ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25–35 శాతం వరకు మాంసకృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. అజొల్లా లిగ్నైట్ తక్కువగా ఉండడటం వలన పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. ఒక కిలో అజొల్లా ఉత్పత్తికి 20–30 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి రోజు 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువులకు దాణాలో కలిపి తినిపించవచ్చు. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. దీని వలన పాల దిగుబడి 15నుంచి 20 శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతంలో పాటు ఎస్ఎన్ఎఫ్ పెరిగి ప్రతి లీటరు పాలకు 60 పైసలు నుంచి 150 పైసల వరకు అదనపు ఆదాయం పెరుగుతుంది. ఇలా పెంచాలి..సూటిగా సూర్యకాంతి పడని కొద్దిపాటి నీడ గల భూమి కలపును పూర్తిగా చదును చేసుకోవాలి. 10 సెం.మీ. లోతు వచ్చేలా గోతిని తవ్వాలి. అందులో చుట్టూ ఇటుకలను పేర్చాలి. ఇలా ఒక తొట్టిని 2.50 నుంచి 1.5 మీటర్ల సైజుల్లో నిర్మిస్తే అజొల్లా ఉత్పత్తి చేయవచ్చు. గోతి లోపల భూమిపై కలుపు మొక్కల వేర్లు రాకుండా ప్లాస్టిక్ సంచులు పరచాలి. దీనిపై 150 జీఎస్ఎం మందం ఉన్న ప్లాస్టిక్ షీటు వేయాలి. షీటు చివరలు ఇటుకలపై అంచువరకు వచ్చేలా పరచాలి. ఇందుకు 3.2 మీటర్ల సైజు గల ప్లాస్టిక్ షీటు ఉండాలి. షీటు కప్పిన తొలి లోతు 10 సెం.మీ. ఉండాలి. 30 నుంచి 35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి, మెత్తని మట్టిని ప్లాస్టిక్ షీటుపై సమానంగా పరచాలి. ఒక చదరపు మీటరుకు 10 నుంచి 12 కిలోల పశువుల పేడను 10 లీటర్ల నీటిలో పలుచగా కలిపి, దానిలో 10–20 గ్రాముల సూపర్ పాస్పేట్ను కలిపి పోయాలి. ఈ తొట్టిలో 7–10 సెం.మీ. ఎత్తు ఉండేలా నీరు పోయాలి. బెడ్లోని మట్టి, నీటిని కలియతిప్పాలి. అజొల్లా త్వరతగతిన పెరిగి 7–10 రోజుల్లో నీటి తొట్టెను పూర్తిగా ఆక్రమిస్తుంది. 8వ రోజు నుంచి ప్రతిరోజు ఒక కిలో అజొల్లాను ఒక్కొక్క తొట్టి నుంచి తీసుకోవచ్చు. బెడ్ మీద చల్లిన ఒక కిలో అజొల్లా వారం రోజుల్లో 8–10 కిలోలు అజొల్లా ఉత్పత్తవుతుంది.మేపేది ఇలా..తొట్టి నుంచి తీసుకొచ్చిన అజొల్లా చదరపు సెంటీమీటరు వెడల్పు ఉన్న రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో ఉంచాలి. దానిని సగం నీరు నింపిన బకెట్పై పెట్టి పైనుంచి నీరు పోయాలి. ట్రేలో పైన ఉన్న అజొల్లాను పశువులకు మేపాలి. ట్రేలోని రంధ్రాల ద్వారా చిన్న చిన్న అజొల్లా మొక్కలు బకెట్లోని నీళ్లలోకి వెళ్తాయి. ఈ నీటిని మరలా బెడ్లో పోయడం వలన అజొల్లాను తిరిగి పెంచవచ్చు. ప్రస్తుతం నడిగూడెం, కోదాడ మండలాలలో చుట్టుపక్కల వరి పొలాల్లో కూడా అజొల్లా కనిపిస్తోంది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేతేపల్లి: కేతేపల్లి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్పై నకిరేకల్కు బయల్దేరాడు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పల్లె రుచులు హాటల్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్ కుడి కాలు పూర్తిగా తెగిపోయి ప్రమాద స్థలంలో పడిపోయింది. అశోక్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అదేవిధంగా చెర్కుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెర్కుపల్లి గ్రామానికి చెందిన మున్న శివ ఆదివారం రాత్రి పక్కనే ఉన్న కొండకిందిగూడెం గ్రామం నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం రాశి పైకి బైక్ దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మొదట సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్కు తరలించారు. -
చలో వరంగల్ సభను జయప్రదం చేయాలి
నకిరేకల్: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు నిండిన సందర్భంగా వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ(చలో వరంగల్)ను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను నకిరేకల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చలో వరంగల్ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదన్నారు. ఈ సభకు తరలివెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిర్బంధించడంతో పాటు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, నాయకులు పల్లె విజయ్, పెండెం సదానందం, పల్రెడ్డి మహేందర్రెడ్డి, గొర్ల వీరయ్య, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, వంటల చేతన్, యానాల లింగారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, బోయిళ్ల కిషోర్, గుండగోని జంగయ్య, రాచకొండ శ్రవణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్ నిడమనూరు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నరసింహ(41) మిర్యాలగూడలోని బాపూజీనగర్లో నివాసముంటూ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నరసింహ సోమవారం బైక్పై స్వగ్రామానికి వచ్చి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసింహను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉప్పునూతల రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి
కట్టంగూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన కాసర్ల యాదమ్మ, నర్సిరెడ్డి దంపతుల ఏకై క కుమారుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి(47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. శ్రీనివాసరెడ్డికి 25 సంవత్సరాల క్రితం వివాహం చేయగా కుమార్తె జన్మించిన మూడు సంవత్సరాల అనంతరం భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి యాదమ్మ తన మనువరాలు, కొడుకు ఆలనాపాలన చూసుకుంటుంది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసరెడ్డి తిరిగి రాలేదు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సోమవారం ఈదులూరు గ్రామ శివారులో గల బావిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం తేలి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. తన కొడుకు మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు శ్రీనివాసరెడ్డి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. -
ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
నాగార్జునసాగర్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్కాలనీలో జరిగింది. ఎస్ఐ సంపత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిల్కాలనీకి చెందిన నెల్లం శ్రీనివాసరావు డిండి మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎయిమ్స్లో పీడియాట్రిక్ సర్జరీ డేబీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం వరల్డ్ పీడియాట్రిక్ సర్జరీ డే ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్ వైద్య విభాగంలో చికిత్స పొందడానికి వచ్చిన చిన్నారులతో కలిసి డైరెక్టర్ వికాస్ భాటియా, వైద్యులు కేక్ కట్ చేశారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. ఆధునిక సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వికాస్ భాటియా తెలిపారు. -
డిగ్రీ పూర్తికాగానే కొలువు !
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే.. ● మా అక్కనే స్ఫూర్తి.. నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కై రళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాఽధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది. ● సొంతంగానే చదివా..గ్రూప్స్కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్కు అవసరమయ్యే మెటీరియల్ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్లో నాకు అవసరమైన మెటీరియల్ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. ● కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపరేషన్ -
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. రూ.50వేల లోపు యూనిట్లకు 100 శాతం, రూ.లక్ష లోపు యూనిట్లకు 90 శాతం, రూ.2లక్షల యూనిట్ల వరకు 80శాతం, రూ.4లక్షల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు సంబంధించిన యూనిట్ల స్థాపనకు 21–55 ఏళ్ల వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21–60 ఏళ్ల వయస్సు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అర్హులని తెలిపారు. ఆధార్, ఆహార భద్రతకార్డు లేదంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), పట్టాదారు పాస్పుస్తకం (వ్యవసాయ రంగ పథకాలకు), సదరం సర్టిఫికెట్ (వైకల్యమున్న వ్యక్తులు), పాస్పోర్ట్సైజ్ ఫొటో, బలహీన వర్గాల ధ్రువీకరణ పత్రం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలకు సంబంధి పత్రాలు జతచేసి ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలని కోరారు. గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కు గాను అదనంగా విడుదల చేస్తున్న గోదావరి జలాలను ఆదివారం నిలిపివేశారు. 7వ తడిగా ఈ నెల 2న గోదావరి జలాలను జిల్లాకు పునరుద్ధరించారు. అయితే ఐదు రోజులపాటు నీటిని వదిలారు. కాగా ఈ సీజన్కు సంబంధించి జనవరి 1న జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం వారబందీ విధానంలో మార్చి 24 వరకు 6 తడులుగా నీళ్లిచ్చారు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చేయడంతో అధికారులు మరో తడికి అదనంగా విడుదల చేశారు. -
పెద్దవూర మండల వాసి
తెలంగాణ లోకాయుక్తగాపెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన హైకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి తెలంగాణ లోకాయుక్తగా నియమితులయ్యారు. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు యడవెల్లి రామాంజిరెడ్డి–జయప్రద దంపతులకు ఐదుగురు సంతానం కాగా.. రాజశేఖర్రెడ్డి పెద్దవారు. ఆయన 1960 మే 4వ తేదీన జన్మించారు. రాజశేఖర్రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని సెయింట్ మేరీ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్సెస్ పాఠశాలలో, ఇంటర్మీ డియట్ హైదరాబాద్లోని ఏవీఎం కళాశాలలో, బీఎస్సీ డిగ్రీ, ఎల్ఎల్బీ వరంగల్లో సాగాయి. ఆ రోజుల్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్ మీడియంలో సాగింది. డిగ్రీ సైన్స్లో చేసినప్పటికీ బాబాయి కొండల్రెడ్డి అడ్వకేట్గా స్థిరపడటంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజశేఖర్రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం సాధించారు. ఎల్ఎల్బీ పూర్తికాగానే 1985లో మొదట నల్ల గొండలో న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా 1985 ఏప్రిల్లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా, అదే ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2022 ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్తగా యడవెల్లి రాజశేఖర్రెడ్డి పేరును ఖరారు చేసి రాజ్భవన్కు పంపింది. ఒకటి, రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన యడవెల్లి రాజశేఖర్రెడ్డి పేరు ఖరారు రాజ్భవన్కు చేరిన ప్రతిపాదనలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్న ఉత్తర్వులు -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన మూల్యాంకనం ప్రక్రియం సోమవారం నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాకు 1.5లక్షల జవాబు పత్రాలు!మూల్యాంకనానికి జిల్లాకు దాదాపు సుమారు 1.5 లక్షలకు పైగా జవాబు పత్రాలు వస్తాయని అధి కారులు భావిస్తున్నారు. విధుల్లో పాల్గొ నేందుకు జిల్లా నుంచి మొత్తం ఏఈలు, సీఈ లు, స్పెషల్ అసిస్టెంట్లు కలిపి 600 మంది ఉపాధ్యాయుల్ని నియమించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేపర్లు దిద్దనున్నారు. జిల్లాకు వస్తున్న జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తున్నారు. మరోపక్క కోడింగ్ ప్రక్రియ జరుగుతోంది.ఫ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ ఫ 600 మంది ఉపాధ్యాయులకు విధులు ఫ సూర్యాపేటలోని ఏవీఎం స్కూల్లో ఏర్పాట్లు ఉపాధ్యాయులంతా హాజరుకావాలి పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచాం. మూల్యాంకనానికి సంబంధించి ఆర్డర్లు వచ్చిన ఉపాధ్యాయులంతా తప్పకుండా విధులకు హాజరు కావాలి. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్య లక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం జరిపారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంభనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
‘యువతేజం’ జాబ్మేళాకు విశేష స్పందన
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన యువతేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించిన ఈ జాబ్మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రూ.40వేల వేతనంతో ఉద్యోగం వచ్చిందిమాది నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామం. మాది వ్యవసాయం కుటుంబం. మా అమ్మనాన్న కష్టపడి వ్యవసాయం చేసి నన్ను చదివించారు. ప్రస్తుతం జీఎన్ఎం(నర్సింగ్ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్మేళాకు హాజరయ్యాను. నెలకు రూ.40వేల వేతనంలో హోమ్కేర్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. – కందుకూరి సోని, వెలుగుపల్లి, నల్లగొండ మండలం పోలీసు శాఖకు ధన్యవాదాలునేను 2013లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేశాను. మా నాన్న ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తారు. ఈ జాబ్మేళా గురించి తెలుసుకుని హాజరయ్యాను. పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరై కాగా.. రూ.45 వేల వేతనంతో పీహెచ్సీ సొసైటీ హోమ్కేర్ సర్వీస్లో జాబ్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు. – ఉప్పుల ఉదశ్రీ, నల్లగొండజాబ్ చేస్తూ చదువుకుంటాఇటీవల ఇంటర్ పూర్తి చేశాను. జాబ్మేళాలో ప్రైవేట్ కంపెనీలో రూ.16 వేల వేతనంతో జాబ్ వచ్చింది. ఈ జాబ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత చదువులు చదివి ఇంకా మంచి ఉద్యోగం సంపాదిస్తాను. – నారగోని శివాని, చిన్న సూరారంఉద్యోగ కల నెరవేరిందిడిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్మేళా అవకాశాన్ని చూపింది. నెలకు రూ.14వేలు జీతంతో ప్రైవేట్ కార్ షోరూం నందు జాబ్ లభించింది. నా ఉద్యోగ కల నెరవేరింది. – ఆర్. మోహన్, నల్లగొండ భారీగా హాజరైన నిరుద్యోగులు -
మానసిక ఒత్తిడితో కార్మికుడి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: మానసిక ఒత్తిడితో ఉరేసుకుని కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పసూనూరు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్(50) కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గత 20ఏళ్లుగా భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచింది. కానీ సయ్యద్కు మాత్రం జీతం పెంచలేదు. దీంతో కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. శుక్రవారం పరిశ్రమకు వెళ్లిన సయ్యద్ తనకంటే జూనియర్లకు జీతం పెంచి తనకు ఎందుకు పెంచలేదని పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగాడు. ‘ఇక్కడ పనిచేస్తే చెయ్.. లేదంటే వెళ్లిపో’ అని పరిశ్రమ యాజమాన్యం అనడంతో ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యతో చెప్పి బాధపడ్డాడు. సొంతూరికి వెళ్దామని, సామాను సర్దమని భార్యకు చెప్పాడు. శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రించిన సయ్యద్ అర్ధరాత్రి మరొక గదిలోకి వెళ్లి ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం సయ్యద్ కుమార్తె నిద్ర లేచి చూడగానే తండ్రి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో తల్లికి చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి సయ్యద్ను కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. తన చావుకు కంపెనీ యాజమాన్యం మరియు శేఖర్ అనే వ్యక్తి కారణమని రాసిన లెటర్ లభ్యమైంది. మృతుడి భార్య షేక్ జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు
నల్లగొండ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఏడాది కాలంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.22కోట్ల విలువైన ఎల్ఓసీలు పేద ప్రజలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణాల్లో నల్లగొండ ఒకటని, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల తర్వాత ఎక్కువ ప్రసవాలు నల్లగొండలో జరుగుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి, నార్కట్పల్లి–అద్దంకి రహదారి ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్ అవసరమని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 3 కోర్సులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, వేణుగోపాల్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
● పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు దగ్ధంకోదాడరూరల్ : కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ నిప్పు గాలికి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పడడంతో రాలిన చెట్ల ఆకులకు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ ఆవరణలో ఉంచిన పలు కేసుల్లో సీజ్ చేసిన మూడు ఆటోలు, కారు, టాటా ఏస్ వాహనం, స్కార్పియో వాహనానికి మంటలు అంటుకొని దగ్ధమాయ్యయి. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఏమాత్రం ఆలస్యమైనా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్కు నిప్పంటుకొని పెను ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుందిరంగనాథ రంగశాలను అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు సమయానుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉంటాయి. – శివ, స్థానిక వ్యాపారిసాగర్లో థియేటర్ లేదుసాగర్లో ఒకప్పుడు మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్కటి కూడా లేదు. వారాంతంలో సినిమాలు చూసేందుకు స్థానికులు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. రంగనాథ రంగశాలను లీజుకు తీసుకుని మినీ సినిమా థియేటర్గా రూపొందిస్తే పూర్వ వైభవం వస్తుంది. – భాస్కర్, ఉపాధ్యాయుడునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు తమ శ్రమను మర్చిపోయి ఆనందంగా గడిపేందుకు హిల్కాలనీలో రంగనాథ రంగశాలను నిర్మించారు. ఇందులో నిత్యం నాటకాలు ప్రదర్శించేవారు. అలనాటి సినిమా తారలు నూతన్ప్రసాద్, సావిత్రి, రేలంగి, జగ్గారావు, రాజనాల వంటి వారు రంగనాథ రంగశాలలో స్టేజీపై నాటకాలు వేశారని అప్పటి ఉద్యోగులు చెబుతుంటారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే ఉన్నతాధికారులు, విదేశీయులు సైతం ఇందులో వేసే నాటకాలు చూసి అబ్బుర పడేవారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో సినిమా థియేటర్లు వచ్చాక రంగనాథ రంగశాలలో నాటకాలు ప్రదర్శన ఆగిపోయాయి. కొంతకాలం సమావేశాలకు వినియోగం ఆ తర్వాత కొంతకాలం వరకు రంగనాథ రంగశాలను సమావేశాలు నిర్వహించేందుకు వినియోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు సేద తీరేందుకు గాను రూ.50లక్షలు ఖర్చు చేసి విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, వాష్రూమ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ లేక రంగనాథ రంగశాల ఆవరణలో కంపచెట్లు మొలిచాయి. బస్టాండ్కు సమీపంలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విద్యుత్ బోర్డులు, ఫ్యాన్లు చోరీకి గురయ్యాయి. నాగార్జునసాగర్లో గతంలో మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్క థియేటర్ కూడా లేదు. స్థానికులు సినిమా చూడాలంటే హాలియా, మాచర్ల, మిర్యాలగూడకు వెళ్తుంటారు. రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ ఇంజనీర్కు సినిమా థియేటర్ల నిర్వహణలో అనుభవం కలవారు దరఖాస్తు చేశారు. కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిని అద్దెకిస్తే ప్రాజెక్టు అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని స్థానికులు అంటున్నారు. శిథిలావస్థలో నాగార్జునసాగర్లోని రంగనాథ రంగశాల అద్దెకిచ్చి మినీ థియేటర్గా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు -
కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదం
వలిగొండ: కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్(సవరణ)–2025 బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్రెడ్డి సంతాప సభను శనివారం టేకులసోమారం సమీపంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత హాజరై మోహన్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వక్ఫ్(సవరణ)–2025 బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో లోక్సభలో రాహుల్ గాంధీ నోరు మెదపలేదని, ప్రియాంక గాంధీకి లోక్సభకు రావడానికి కూడా తీరిక లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. అనంతరం టేకులసోమారం గ్రామానికి చెందిన పనుమటి జంగారెడ్డికి చెందిన ఎండిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టదని, పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్రెడ్డి తన సొంత డబ్బుతో పాటు భూమిని కూడా దానమిచ్చి శ్రీవెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 600 ఎకరాలకు సాగునీరందించి రైతులకు ఎంతో మేలు చేశారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మ వెంకట్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్గౌడ్, పనుమటి మమతానరేందర్రెడ్డి, డేగల పాండరి, ఎండీ అఫ్రోజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో పూజలు..భువనగిరిటౌన్: భువనగిరి మండలం నందనంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పూజలు చేశారు. వలిగొండ వెళ్తున్న ఆమెకు భువనగిరి వద్ద మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ అమరేందర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొండ గ్రామ వాసి
తిరుమలగిరి : హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నెమురుగొమ్ముల గౌతమ్రావు పేరును శుక్రవారం ఖరారు చేశారు. ప్రస్తుతం గౌతమ్రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్గా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనున్నది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్రావును నిర్ణయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్య లక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ
భానుపురి (సూర్యాపేట): జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సన్నబియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న 610 రేషన్ షాపులకు 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తరలించి ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని, ఎక్కడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధికారులు, చౌక ధరల దుకాణ యజమానులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రాంబాబు, పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ప్రసాద్ తదితరులున్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ప్రజల్లో చైతన్యానికే పోలీస్ ప్రజా భరోసా
అర్వపల్లి: ప్రజలను చైతన్యం చేసేందుకే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక అంశాలు, చట్టాలపై ప్రతి బుధవారం సమావేశం నిర్వహిస్తూ పోలీస్ ప్రజా భరోసా ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఒక గ్రామాన్ని ఎంచుకొని పోలీస్ అధికారులు పాల్గొనేలా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాను కూడా ప్రతివారం ఒక గ్రామాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి, నాగారం సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ, ఏఎస్ఐలు రామకోటి, రాములు పాల్గొన్నారు. ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు తుంగతుర్తి: ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు చేయబడి ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అనంతరం రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారధి, ఎస్సై క్రాంతి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
నేరేడుచర్ల: విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ భిక్షపతి అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలోని న్యూ అరబిందో డిగ్రీ, స్పందన జూనియర్ కళాశాలలో డ్రగ్స్పై అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 16న యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు– వాటి అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కట్ట ప్రవీణ్కుమార్రెడ్డి, ప్రిన్సిపాల్ యడవల్లి వెంకట్రెడ్డి, కానిస్టేబుల్ స్వామి తదితరులున్నారు. -
జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పటిష్టవంతంగా తీర్చిదిద్దుతామని, సూర్యాపేట మెడికల్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట మెడికల్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కళాశాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు కళాశాల ప్రాంగణంలో 1000 సీట్లతో కూడిన ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకోటి రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం రెండు బస్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్య విద్యార్థుల పాత్ర కీలకంగా ఉందన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య బాధ్యత వైద్య విద్యార్థుల భుజస్కందాలపై ఉందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఈ సందర్భంగా 2019–2025లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొదటి బ్యాచ్ 150 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. అద్బుతమైన మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించుకున్నాం సూర్యాపేటలో అద్భుతమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించుకున్నామని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆనాడు మెడికల్ కాలేజీ అనగానే వెంటనే ఎగ్జిబిషన్ సొసైటీతో మాట్లాడి అనుమతి తీసుకున్నామని, విద్యార్థులు ఒక్క ఇయర్ కూడా నష్టపోకూడదని 2019 లోనే ప్రారంభించుకున్నామని తెలిపారు. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన ఘనత మన మెడికల్ కళాశాలకే దక్కిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ప్రిన్సిపాల్ జయలత, కేఎన్ఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నందకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సూర్యాపేట మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి ఫ ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటన ఫ ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చాలా ఆనందంగా ఉంది సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నా. నాలుగేళ్లు కష్టపడి చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. పీజీ పూర్తి చేసి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు పాటుపడతా. – అనిల్కుమార్ యాదవ్, కూకట్పల్లి అదృష్టంగా భావిస్తున్నా సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రారంభం మొదటి బ్యాచ్ 2019లో చేరాను. ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. పీజీ చేసి మంచి సర్జన్ అవుతా. పేద వారికి నాణ్యమైన వైద్యం అందించి మన్ననలు పొందుతా. – రామటెంకి విజయ్, మంచిర్యాల చాలా గర్వంగా ఉంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రొఫెసర్లు మంచి నాణ్యమైన విద్యనందించారు. మెరుగైన వైద్య సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటా. – ప్రతిమ, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంవైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది స్నాతకోత్సవంలో ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని అన్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాల, గాంధీ మెడికల్ కళాశాలలో ఎంతోమంది పట్టభద్రులు బయటకి వెళ్లారని, ఇప్పుడు సూర్యాపేట మెడికల్ కాలేజీలో సుమారు 150 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తిచేసుకుని వెళ్లడం గొప్ప విషయమన్నారు. ఈ విజయం అందించిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. -
‘పాలిటెక్నిక్’ పిలుస్తోంది
తిరుమలగిరి (తుంగతుర్తి): పదవ తరగతి తరువాత సాంకేతిక విభాగాల్లో డిప్లొమా కోర్సులు చేసేందుకు విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలు దన్నుగా నిలుస్తున్నాయి. వీటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవచ్చు. రెండు కళాశాలల్లో 300 సీట్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వీరంతా పాలిసెట్ రాసేందుకు అర్హత ఉంటుంది. తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేటలో ఒక్కొక్కటి చొప్పున రెండు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, సూర్యాపేట కళాశాలలో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో 60, డిప్లొమా కంప్యూటర్లో 60 సీట్లు, ఈసీఈలో 60 చొప్పున రెండు కళాశాలల్లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. పాలిసెట్లో సాధించిన మార్కులు, పదవ తరగతిలో వచ్చిన జీపీఏ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో హాస్టల్ వసతి కూడా ఉంది. కోర్సు తరువాత ఉద్యోగ అవకాశాలు పాలిటెక్నిక్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సులు పూర్తి చేసే వారికి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఏయిర్ లైన్స్, ట్రాన్స్పోర్టు గనులు, ఇండియన్ ఆర్మీ, నావి, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, బీహెచ్ఈఎల్, బీడీఎల్, బీఎస్ఎన్ఎల్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు సాధించవచ్చు. ఈ కళాశాలలో నాణ్యమైన టెక్నికల్ విద్య అందుతుంది. భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. పాలిసెట్కు అప్లయ్ చేయడానికి ఏప్రిల్ 21వ తేదీ వరకు చివరి గడువు ఉంది. – సత్తయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, తిరుమలగిరి ఫ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ఫ ఆఖరు తేది ఏప్రిల్ 21 ఫ మే 13న పాలిసెట్ ఫ ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 ఫీజు ఫ జిల్లాలో రెండు కళాశాలలు -
పత్తి రైతుపై విత్తన భారం!
భానుపురి: పత్తి రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. విత్తనాలు నాటింది మొదలు పత్తి దిగుబడి చేతికొచ్చి అమ్మేదాకా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రానున్న వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల కంపెనీలు విత్తన ధరలను పెంంచేశాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. ఫలితంగా ఇప్పటికే ఏటేటా తగ్గుతూ వస్తున్న పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధరలు ఏటా పెంచుతుండగా నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్రంగా నష్టాల పాలుచేస్తోంది. ఏటేటా పెరుగుతున్న విత్తన ధరలు రైతులకు ఏటేటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులతోపాటు విత్తనాలు, పురుగు మందులకు రూ.వేల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడుగా కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఎకరానికి రూ.10 నుంచి రూ.12వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో పత్తి ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కు చేరింది. ఎకరాకు మూడు ప్యాకెట్లు అవసరం జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికంగా ఉంటుంది. 8ఏళ్ల క్రితం దాదాపు 2 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు ఉండేది. కొన్నేళ్లుగా కాలం కలిసి రావడం, ఎస్సారెస్సీ నీళ్లు జిల్లాకు అందుతుండడంతో రైతులు వరిసాగు వైపు మళ్లుతున్నారు. దీనికితోడు పత్తి ధర అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గత వానాకాలంలో జిల్లాలో 80వేల ఎకరాల వరకు పత్తి సాగు జరిగింది. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున విత్తనాలను విత్తుకోవాల్సి ఉండగా జిల్లాలో 2.40 లక్షల ప్యాకెట్ల పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్ 475 గ్రాములు ఉంటుండగా ఇందులో 450 గ్రాముల బీటీ, 25 గ్రాముల నాన్బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు పూర్తిగా బీటీ విత్తనాలే వాడుకుంటారు. పెట్టుబడులు అధికమవుతున్నాయి పత్తి విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మకం దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు. ఏటా విత్తన ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. ఇతరత్రా ఖర్చులు అధికంగానే పెరుగుతుండడంతో పత్తి సాగు చేసే పరిస్థితి లేదు. – గుద్దేటి జాన్రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) ధరలను తగ్గించాలి పత్తి విత్తనాల ధరలను ఏటా పెంచుతుండంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం పత్తి విత్తనాలపై రాయితీ ఇవ్వాలి. పత్తి సాగు చేస్తే పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. – ఉప్పుల మల్లయ్య, రైతు, ఆత్మకూర్(ఎస్) పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు ఫ ఇప్పటికే అధిక పెట్టుబడులతో కుదేలవుతున్న రైతాంగం ఫ దిగుబడులు సైతం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్న వైనం ఫ జిల్లాలో ఏటా 80వేల ఎకరాల్లో పత్తిసాగుపత్తి విత్తన ప్యాకెట్ల ధరలు ఇలా.. (రూపాయల్లో..) 2019 710 2020 730 2021 767 2022 810 2022 853 2023 864 2024 864 2025 901 -
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు అదనంగా మరో విడత గోదావరి జలాలను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు 1000 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం 1,325 క్యూసెక్కులకు పెంచారు. మూడో సారి శుక్రవారం 1,510 క్యూసెక్కులకు పెంచినట్లు బయ్యన్నవాగు డీఈఈ సత్యనారాయణ తెలిపారు. ఈ నీటిని 69,70,71 డిస్ట్రిబ్యూటర్లకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు చివరి భూములకు చేరడానికే పెంచినట్లు తెలిపారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టకుండా, నష్టం కలిగించకుండా గోదావరి జలాలను వాడుకోవాలని సూచించారు. తోటివారితో ప్రేమ పూర్వకంగా ఉండాలి మఠంపల్లి: క్రైస్తవులంతా తోటి వారితో ప్రేమ పూర్వకంగా జీవించాలని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) కరణం ధమన్కుమార్ అన్నారు. శుక్రవారం మఠంపల్లిలోని శుభవార్త చర్చిలో జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దివ్యబలిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 2025 సంవత్సరాన్ని జూబ్లీగా పోపు ప్రకటించారని తెలిపారు. గతనెల 5నుంచి ఈనెల 18న జరగనున్న గుడ్ఫ్రైడే వరకు ఉపవాస దీక్షల్లో ఉన్న క్రైస్తవులకు అత్యంత విలువైన కాలమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు, చర్చి కమిటీ పెద్దలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్లు మార్టిన్, బాల, సాగర్, చిన్నపరెడ్డి, క్రీస్తురాజు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్కు రెండు రోజులు సెలవుతిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్కు శనివారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి, ఆది వారం వారాంతం సందర్భంగా రెండు రోజులు మార్కెట్కు సెలవు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావొద్దని కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపుభానుపురి (సూర్యాపేట): సీఎంఆర్ బకాయి పూర్తి చేసిన మిల్లర్లకే 2024– 25 రబీ సీజన్ ధాన్యం కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 రబీ సీజన్, 2024–25 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ బకాయిలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకు మాత్రమే 2024–25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని, వేలం వేసిన ధాన్యం బకాయిలు కూడా త్వరగా చెల్లించాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం పెండింగ్ ఉంచకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, డీటీలు, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.