Nalgonda
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని మిల్లర్లు జాప్యం చేయకుండా దిగుమతి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం మిర్యాలగూడలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శరత్చంద్రపవార్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. రోజూ కనీసం 400 లారీల ధాన్యం మిల్లుల్లో దించేలా చూడాలన్నారు. ధాన్యం అన్లోడింగ్ అయిన వెంటనే ట్రక్ షీట్లను తీసుకెళ్లాలని తెలిపారు. రైస్ మిల్లులు, లారీ ట్యాగింగ్ సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యం తరలింపు పూర్తయ్యే వరకు సహకరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, పౌరసరసరఫరాల డీఎం రాంపతినాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, మిల్లర్లు గౌరు శ్రీనివాస్, బాబి, నవీన్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
‘సర్’పై అప్రమత్తంగా ఉంటాం
నల్లగొండ : అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సర్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంశాలపై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్లగొండ, భువనగిరి లోక్సభల్లో చేపట్టే ఓటర్ల జాబితా సవరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని అందుకు బూత్ లెవల్ కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అకారణంగా తొలగింపునకు గురైన ఓటర్లకు తిరిగి అప్పీల్ చేసుకోవడం, దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలల సమయం ఇచ్చేలా ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేలా కాంగ్రెస్ తరఫున తెలియజేయాలన్నారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 20, 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారికి ఇవ్వాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేసిన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ కోసం కష్టపడే వాళ్లకే పదవులు ఇస్తామని, అర్హులైన వారి పేర్లు మీరే ఇవ్వండి అని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారని, మంత్రి ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో కలిసి సమాలోచనలు చేసి జాబితా ఇస్తామని తెలిపారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
2,815 క్వింటాళ్ల విత్తనాలు కావాలి
ఫ ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు ఫ నెలాఖరు నాటికి అందుబాటులోకి విత్తనాలు నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు అవసరమైన వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందించటానికి నందిపాడ్ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 2,815 క్వింటాళ్ల వరి, పెసర, జీలుగ, జనుము విత్తనాల అవసరం ఉంటాయని అంచనా వేసి ప్రభుత్వానికి పంపింది. రైతులకు అవసరమైన వరి విత్తనాలను నెలాఖరు నాటికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 12,02,051 ఎకరాల్లో వరి, పత్తితో పాటు వివిద పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అవసరమైన వరి జేజీఎల్ 27356 రకం 133 క్వింటాళ్లు, ఎంటీయు 1010 రకం 983.75 క్వింటాళ్లు, కేఎన్ఎం 118 రకం 879 క్వింటాళ్లు, జేజీఎల్ 24423 రకం 369.50 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 246 క్వింటాళ్లు, పెసర ఎంజీజీ 385 రకం 34 క్వింటాళ్లు, జీలుగ 114.60 క్వింటాళ్లు, జనుము 51.20 క్వింటాళ్లు అవసరంగా గుర్తించింది. జీలు, జనుము 50 శాతం సబ్సిడీపై.. జీలుగ, జనుము విత్తనాలు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. వరి, పెసర విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన పత్తి విత్తనాలు సుమారు 16 లక్షల ప్యాకెట్లు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. పత్తితో పాటు ఇతర హైబ్రీడ్ వరి విత్తనాలు కూడా ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే విత్తనాలను త్వరలో ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా సంస్థల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. వానాకాలం సాగు అంచనా ఇలా.. పంట ఎకరాల్లో పత్తి 5,13,524 వరి 5,86,137 కంది 14,000 సజ్జ 200 జొన్న 500 మొక్కజొన్న 500 ఆముదం 500 పెసర 7,000 వేరుశెనగ 5,000 -
రమ్యకు స్పోర్ట్స్ సైకిల్ అందజేత
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లింగ్ క్రీడాకారిణి నిజానపల్లి రమ్యకు మంత్రి కేటీఆర్ స్పోర్ట్స్ సైకిల్ అందజేశారు. సైక్లింగ్లో జాతీయ స్థాయి క్రీడాకారిణి రమ్య.. అంత్యంత ఖర్చుతో కూడుకున్న సైక్లింగ్ సామగ్రి కోసం దాతల సాయం కోరింది. ‘సాక్షి’లో ‘సాయం చేస్తే సత్తా చాటుతా’ శీర్షికన ప్రచురితమైన కథనం మాజీ మంత్రి కె.తారకరామారావు దృష్టికి వెళ్లడంతో రమ్యకు సాయం చేస్తానని మాటిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రమ్యకు రూ.13 లక్షల విలువ గల సైకిల్తో పాటు స్పోర్ట్స్ సామగ్రిని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన తాను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. జాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తెస్తానని తెలిపింది. ఎంజీయులో విద్యా వారోత్సవాలునల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో శనివారం విద్యావారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల నాన్–టీచింగ్, పరిపాలనా సిబ్బంది ఆఫీస్ నిర్వహణలో భాగంగా ‘ఏఐ టూల్స్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టాస్క్ నుంచి సాయి రాఘవేంద్ర మాట్లాడుతూ ఏఐ ఆధారిత కార్యాలయ ఆటోమేషన్, అధికారిక లేఖలు, నివేదికలు, నోటీసుల తయారీ, దత్తాంశ నిర్వహణ, డాక్యుమెంటేషన్, స్మార్ట్ ప్రజెంటేషన్లు, కంటెంట్ సృస్టి, ఈ–మెయిల్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఎం.జయంతి, రేఖ, నీలిమ, సునీత, ప్రగతి, నిర్మల, నాగయ్య, హేమంత్, ఉమ పాల్గొన్నారు. ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై అవగాహనరామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ ప్రాక్టీషనర్ సిద్దేశ్వర్రావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడు వెంకటరమణ, టీఎస్కేసీ మెంటర్ ఎండీ.తౌసిఫ్, ఇంగ్లిష్ విభాగం అధ్యక్షుడు వైవిఆర్.ప్రసన్నకుమార్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – మెషిన్ లెర్నింగ్ నిత్యజీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. హెల్త్కేర్లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి, అధ్యాపకులు జె.నాగరాజు, వెల్దండి శ్రీధర్, ఎన్.కోటయ్య, ఎ.మల్లేశం, లెఫ్టినెంట్ సుధాకర్, అనిల్ బొజ్జ, జ్యోత్స్న, ఎం.శ్రీనివాస్రెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యారులు తదితరులు పాల్గొన్నారు. -
అలైన్మెంట్ను మార్చాలి
త్రిబుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలి. లేకుండా నిర్వాసితులకు భూమి కింద భూమి ఇవ్వాలి. లేదా మార్కెట్ ధరకు ఐదు రెట్లు పరిహారం చెల్లించాలి. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మా ప్రాంతానికి ఇప్పటికే డ్రాగన్ లాంటి త్రిబుల్ఆర్ అలైన్మెంట్ ఉండగా గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే లైన్తో ఇక్కడి భూములు గద్ద వచ్చి కోడి పిల్లకు గురి పెట్టినట్లుగా ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదటే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతాం. – జిల్లా కిశోర్, రైతు, రాజాపేటతండా -
చేతివృత్తులపై అభిరుచి పెంచుకోవాలి
నల్లగొండ : విద్యార్థులు చదువుతో పాటు చేతివృత్తులపై అభిరుచి పెంచుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని డైట్ కాలేజీ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చర్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకేచోట 2500 మంది విద్యార్థులు చదువుకునే విధంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, సైన్స్ అధికారి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓటర్ మ్యాపింగ్ పూర్తిచేయాలి నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో నల్లగొండ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. సర్ షెడ్యూల్ మొదలయ్యేలోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. సాదాబైనామ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఈత సరదా.. కారాదు ప్రమాదం
ఎండల నుంచి ఉపశమయం పొందేందుకు నల్లగొండలోని పానగల్లు ఉదయ సముద్రం తాగునీటి రిజర్వాయర్లో పెద్దలు, యువకులు, చిన్నారులు సైతం ఈతలు కొడుతున్నారు. కొందరు సెల్ఫీలు, రీల్స్ కోసం రిజర్వాయర్ మధ్య వరకు వెళ్లి ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. రిజర్వాయర్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిజర్వాయర్లో లోతైన ప్రాంతాలపై అవగాహన లేకుండా ఈతకు దిగడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి
మర్రిగూడ : ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మర్రిగూడ వైద్యులతో కలిసి మర్రిగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలను కట్టడి చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్లు రాహుల్, దీప, కృష్ణకుమారి, నగేష్, దీపక్, శాలిని, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
జనగణనలో అందరూ పాల్గొనాలి : ఎస్పీ
నల్లగొండ : జనగణన – 2027లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఎన్యుమరేటర్ల వద్ద వివరాలను నమోదు చేయించుకుని మాట్లాడారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారమని, భవిష్యత్ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జనగణన పేరుతో మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, ఏటీఎం వివరాలు, ఓటీపీలు అడగరని తెలిపారు. అలాంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఉస్మాన్, మల్లిక్ ఉన్నారు. -
పెంచిన ధరలు తగ్గించాలి..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ఈ పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా. బండి మీద వెళ్లాలి. వచ్చిన జీతంలో అధిక శాతం పెట్రోల్కే ఖర్చయితే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి. – మాదవి, ప్రైవేట్ ఉద్యోగి, నల్లగొండ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత ఽపెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఇప్పటికే ధరలు పెరిగి వ్యాపారాలు లేవు, కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. దాంతో మళ్లీ ధరలు పెరుగుతాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టపోతాం. ప్రభుత్వం ధరలు తగ్గించాలి. – ముర్తూజా, పండ్ల వ్యాపారి, నల్లగొండ -
యాసంగి సన్నాలకు
నల్లగొండ అగ్రికల్చర్, పెద్దవూర : యాసంగిలో సన్నాలు సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. కేవలం వానాకాలం కొనుగోలు చేసిన సన్నాలకే పరిమితం చేసింది. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2024–25 వానాకాలం నుంచి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం కేవలం వానాకాలం సాగుకే అమలవుతోంది. గత యాసంగి బోనస్ ఇవ్వలేదు. ఈ యాసంగిలో అసలు బోనస్పై ఎలాంటా ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ వానాకాలం నుంచి తాము సూచించిన 8 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది. దీంతో రైతులు ఏ రకాలు సాగు చేయాలోనని గందరగోళం చెందుతున్నారు. రూ.10.97 కోట్లు పెండింగ్ 2024–25 వానాకాలం సీజన్లో రైతుల నుంచి 74,393 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికి కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ను కూడా విడుదల చేసింది. ఆ సీజన్లో రూ.37.20 కోట్లను రైతులకు బోనస్ కింద జమ చేసింది. కానీ 2024–25 యాసంగి సీజన్లో రైతులు పండించిన సన్నాలు 21,939 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసింది. బోనస్ కింద రూ.10.97 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఇంత వరకు విడుదల చేయలేదు. ఈ యాసంగిలో బోనస్ ఊసే లేదు.. 2025–26 వానాకాలం సీజన్లో ప్రభుత్వం 1,48,812 మెట్రిక్ టన్నుల సన్న దాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. యాసంగి సీజన్ బోనస్ను విడుదల చేయని ప్రభుత్వం 2025–26 సీజన్కు సంబంధించిన వానాకాలం బోనస్ కింద రూ.74.41 కోట్లను విడుదల చేయడం విశేషం. తిరిగి 2025–26 యాసంగి సీజన్ కూడా ముగిసి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నా.. గత యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్పై నోరు మొదపడం లేదు. అసలు యాసంగి సీజన్కు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే 2024–25, 2025–26 యాసంగి సీజన్లకు సంబంధించిన బోనస్ను ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పిన రకాలే సాగు చేయాలి.. వానాకాలంలో సాగు చేసే వరి సన్నాల్లో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి.. బోనస్ పొందండి అంటూ వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టింది. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. గడిచి రెండు వానాకాలం సీజన్లలో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్రయించినా ప్రభుత్వం బోనస్ను అందించింది. 2026 వానాకాలం సీజన్కు సంబంధించి మాత్రం 8 రకాలనే వ్యవసాయ శాఖ ప్రమోషన్ చేయాలని నిర్ణయించడం.. రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే అనుమానం నెలకొంది. ఫ ఏడాది గడిచినా రైతులకు అందని పోత్సాహకం ఫ వానాకాలం సన్నాలకే బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఫ యాసంగిలో సన్నాలు సాగు చేసినా ప్రయోజనం లేదంటున్న రైతులు ఫ 8 రకాలకే బోనస్ ఇస్తామంటూ ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రచారంఈ ఫొటోలోని రైతు మాడ్గులపల్లి మండల కేంద్రానికి చెందిన పుల్లెంల యాదగిరి. ఈ రైతు గత యాసంగిలో 16 ఎకరాల్లో పండిన 437 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో అమ్మాడు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో తనకు మద్దతు ధరతోపాటు రూ.2,18,500 వస్తాయని లెక్కలు వేసుకున్నాడు. కానీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. గత వానాకాలంలో ఐకేపీలో సన్న ధాన్యం అమ్మిన బోనస్ వచ్చింది. దీంతో ఈ యాసంగి సీజన్లో కూడా 318 క్వింటాళ్ల సన్న ధాన్యం ఐకేపీలో విక్రయించాడు. ఈ యాసంగిలోనైనా ప్రభుత్వం బోనస్ ఇస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నాడు. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాల్లో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సూచించే 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అంతేకాని తాము సూచించిన రకాలకే బోనస్ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని, దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు. -
సామాన్యుడిపై పెట్రో పిడుగు
ఫ లీటర్ పెట్రోల్పై రూ.3.40, డీజిల్పై రూ.3.27 పెంపు ఫ నిరసన తెలిపిన రాజకీయ పక్షాలునల్లగొండ : సామాన్యుడిపై పెట్రో బాంబు పేలింది. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెరుగుదల, కొరతతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్న తరుణంలో.. తాజా పెంపు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ తయారైంది. రూ.3 పైనే పెంపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సాకుతో కేంద్రం ఇంధన ధరలను సవరించింది. పెట్రోల్పై లీటరుకు రూ.3.40, డీజిల్పై లీటరుకు రూ.3.27 పెంచింది. డీ జిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై నేరుగా పడనుంది. ఫలితంగా నిత్యావసరాలైన బియ్యం, ప ప్పులు, నూనె ధరలు పెరగనున్నాయి. కూరగాయలు, రవాణా ఖర్చులు పెరగడంతో సా మాన్యుడిపై భారం పడనుంది. స్టీల్, సిమెంట్ ధరలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం కానుంది. జిల్లాపై ప్రభావం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 240 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిత్యం వేల లీటర్ల ఇంధన విక్రయాలు జరిగే ఈ జిల్లాలో, తాజా పెంపు వల్ల ప్రజలపై ప్రతి నెలా కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మధ్యతరగతి జీవి బడ్జెట్ తలకిందులవుతోంది. వెల్లువెత్తుతున్న నిరసనలు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సెగలు మొదలయ్యాయి. నల్లగొండ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ పెట్రో ధరల పెంపుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ్రీ బస్తో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. నల్లగొండ నుంచి చర్లపల్లి, ఎస్ఎల్బీసీ, పానగల్ వెళ్లేవారు కూడా బస్లు ఎక్కుతున్నారు. వృద్ధులు, నడవలేని వారు మాత్రమే ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ దరలు పెంచింది. దీంతో మా బతుకులు బస్టాండ్ పాలు కానున్నాయి. – గాలయ్య, ఆటో డ్రైవర్, నల్లగొండ -
రైతులను ముంచుతున్న కాంగ్రెస్
కొండమల్లేపల్లి : ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొండమల్లేపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పంట వేశాక యూరియా ఇవ్వకుండా, ఇప్పుడు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
జంతు హింసకు పాల్పడొద్దు
నల్లగొండ : జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతువుల రవాణా విషయంలో నిబంధనలు పాటించాలని, ఒకే వాహనంలో అధిక సంఖ్యలో జంతువులను తరలించవద్దని చెప్పారు. పశు వైద్యాధికారి సర్టిఫికెట్ లేకుండా జంతువులను తరలించడం నేరమన్నారు. రవాణా వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలని, ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల్లో జంతువులకు ఆశ్రయం కల్పించే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని సూచించారు. వీధి కుక్కల నియంత్రణ కోసం త్వరలో కుక్కల దత్తత కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, పశు సంవర్ధక అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
ఎంజీయూలో ఏఐపై అవగాహన
నల్లగొండ టూటౌన్ : విద్యా వారోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ఆర్ట్స్ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ‘ఆర్టిఫిపియల్ ఇంటెలిజెన్స్ పర్ ఎవ్రి వన్’ అనే అంశంపై హైదరాబాద్కు చెందిన ఏఐ నిపుణుడు డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి.. ప్రొపెసర్లకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, మిషన్ లెర్నింగ్.. విద్యా రంగంలో, ఇంజనీరింగ్ విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరుగుతాయని, విద్యార్థులు వీటిని గమనించి లోతైన అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అంజిరెడ్డి ప్రిన్సిపాల్ ఆర్.రేఖ, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ప్రొఫెసర్లు హరీష్కుమార్, జయంతి, సంధ్యారాణి, సుధారాణి, అధాపకులు పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించాలికనగల్ : వర్షపు నీటిని సంరక్షించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. జల సంచాయ్ – జన్ భాగిదారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనగల్ గ్రామంలో ఆయన నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఎంపీఓ సతీష్కుమార్, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్, ఉప సర్పంచ్ చంద్రయ్య, ఏపీఓ సుధాకర్, కార్యదర్శి వీరబాబు, మాజీ సర్పంచ్ చిట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ‘ఇక్కత్’ను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రెడ్ కార్పెట్పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. -
ఐస్ తయారీ యూనిట్లలో తనిఖీ
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లను జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్.శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ, ఆహార భద్రత ప్రమాణాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఐస్ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా, చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంటుందని, ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రకాశం బజార్లోని ఒక చికెన్ సెంటర్ నుంచి ఒక ఫంక్షన్ హాల్కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్ను అధికారులు తనిఖీ చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలివేశారు. -
ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి
నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రభుత్వం ప్రాధామ్య పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా పెండింగ్ ఉన్న కేంద్రాలను సందర్శించి కారణాలను విశ్లేషించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు నూటికి నూరు శాతం గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ కాని వాటిని రద్దుచేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఎల్–3 నుంచి ఎల్–1కు వచ్చే కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, బదిలీల్లో ఎలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించబోయి తాత మృతి
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన.. శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మద్దతు ధర పెంపును సవరించాలి
సూర్యాపేట అర్బన్: కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం ప్రయోజన కరంగా లేవని, వాటిని సవరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు కోరారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవని అన్నారు. ముఖ్యంగా వరికి 72 రూపాయలు ప్రకటించడం సరైంది కాదన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై పెద్ద ఎత్తున పెంచుతూ పంటలకు తక్కువ ధరలు ప్రకటించడం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దివాలా తీయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరికి 2,441 అంటే 3.93శాతం, పత్తి6.2శాతం, మొక్కజొన్న 06శాతం పెరిగిందని అదే ఎరువులకు 18.50శాతం, వ్యవసాయ పనిముట్లకు 25శాతం రేట్లు పెంచిందన్నారు. ఈ విధంగా పెట్టుబడులకు పెద్ద ఎత్తున పెంచడం, మద్దతు ధరలు అతి తక్కువ పెంచడం సరైనది కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, అలుగుబెల్లి వెంకటరెడ్డి , కోట మధుసూదన్ రెడ్డి, మేకల కనకారావు, పి. నాగన్న పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో కదలిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై జిల్లా యంత్రాంగం కదిలింది. ధాన్యంతో వెళ్లిన లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి దిగుమతి కావడం లేదు. దీంతో కల్లాల వద్ద లారీల కొరత ఏర్పడటంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు అటు నిర్వాహకులు, హమాలీలు, రైతుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ, డబ్బులు ఇస్తేనే తూకం వేసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ‘సాక్షి’ ‘అడుగడుగునా అడ్డంకులు, ఆదేశాలు బేఖాతరు’, ‘లారీలు రావు.. ధాన్యం కదలదు’, ‘డబ్బులిస్తేనే లోడింగ్’ శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించింది. దీంతో జిల్లా యంత్రాంగం కదిలింది. రవాణాలో అలసత్వం వహించిన నలుగురు లారీ కాంట్రాక్టర్లకు జరిమానా విధించింది. మరోవైపు మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులపై కఠిన చర్యలు చేపట్టేలా రంగంలోకి దిగింది. మిల్లుల్లో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు ఈసారి ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన సమస్య రవాణా, ధాన్యం దిగుమతి చేసుకోవడమే. దిగుమతుల విషయంలో మిల్లర్లు తాలు పేర కిరికిరి పెడుతూ, వారు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకుంటూ ప్రభుత్వ కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీనిపై కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌరసరఫరాల విభాగం అధికారులు మంగళవారం మిర్యాలగూడ వెళ్లి మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు వారు కొనుగోలు చేసే ధాన్యాన్ని ఆపి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ముందుగా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన లారీని వచ్చినట్లుగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. ప్రతి మిల్లు వద్ద ప్రత్యేక అధికారి, పోలీస్ ఇబ్బందిని పెట్టి లారీలు రాగానే దిగుమతి చేసుకునేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులు అయితే పైఅధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో మిల్లర్లు జాప్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. అధిక సంఖ్యలో లారీల దిగుమతి కలెక్టర్, ఎస్పీలు రంగంలోకి దిగి మిల్లు పరిశీలనకు వెళ్లడంతో ఒక్క రోజే మిల్లుల వద్ద లారీల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం దిగుమతి అయింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి దిగుమతులను పర్యవేక్షించారు. ఒక్కరోజు దాదాపు ఏడు వందల లారీలు దిగుమతి చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో వందకుపైగా లారీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్ అయినట్లు తెలిపారు. దిగుమతి అయిన లారీలు వెంటనే ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు పంపాలని పౌరసరఫరాల విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోళ్లలో పెరగనున్న వేగం నెల రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిల్లర్ల సహకారం లేక అన్నిచోట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేలా కలెక్టర్, ఎస్పీ క్షేత్రస్థాయికి వెళ్లడంతో కొనుగోళ్లలో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ఫ ధాన్యం దిగుమతులపై రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీ ఫ మిర్యాలగూడలో తనిఖీలు ఫ ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి, పోలీసు సిబ్బంది నియామకం ఫ ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని ఆదేశాలు ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం -
మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, మిల్లర్లు ప్రైవేట్ ధాన్యానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి, మహేశ్వరి రైస్ మిల్లులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వచ్చిన ధాన్యం లారీని 12గంటల్లోపు దిగుమతి చేసి తిరిగి కేంద్రాలకు పంపించాలని, అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలన్నారు. డిండి, అవంతీపురం ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరి రైస్ మిల్లుల్లో రైతు వద్ద డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత రికార్డులను పరిశీలించిన కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని మాడుగులపల్లి తహసీల్దార్ను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 4.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలని, అన్లోడింగ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఫీజు చెల్లిస్తే.. ప్లాట్ ఓకే!
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ పట్టణాల్లో అనుమతి తీసుకోకుండా చేసిన వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు 42,681 పెండింగ్లో ఉన్నాయి. గతంలోనూ ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం మరోసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మే, జూన్ నెలల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. పెండింగ్లో భారీగా దరఖాస్తులు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను మాత్రమే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కు అనుమతి ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 74,254 మంది దరఖాస్తులు చేసుకోగా.. 31,033 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. ఇంకా 42,681 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే భారం ఎక్కువే.. అనుమతి లేని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఇల్లు కట్టుకునే వారికి భారీగా ఖర్చు కానుంది. మున్సిపాలిటీల్లో అనుమతులు తీసుకోవాలంటే ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న మార్కెట్ ప్రకారం 14 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కింద అయితే ప్లాట్ కొన్నప్పుడు డాక్యుమెంట్పై ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ధర ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం అయితే ఉదాహరణకు 200 గజాలు ఉంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఇంటి అనుమతుల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే భూముల విలువ పెంచే అవకాశం ఉన్నందున ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఫీజు మరింత పెరిగే అకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్లాట్లు అమ్ముకునే వాళ్లం గనుక ఎల్ఆర్ఎస్ ఎందుకులే అనే దోరణిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైనా పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ చేయించుకుంటారో లేదో వేచి చూడాలి. మున్సిపాలిటీలు దరఖాస్తులు క్రమబద్ధీకరణ పెండింగ్ నల్లగొండ 36,827 24,554 11,733 మిర్యాలగూడ 14,339 3,117 11,222 హాలియా 4,300 1,200 3,100 దేవరకొండ 5,043 423 4,620 చండూరు 3,400 1,100 2,300 చిట్యాల 3,265 208 3,057 నకిరేకల్ 7,080 431 6,649 మొత్తం 74,254 31,033 42,681 ఫ ఎల్ఆర్ఎస్కు మరోసారి అవకాశమిచ్చిన ప్రభుత్వం ఫ జూన్ 30 వరకు గడువు ఫ పెండింగ్ దరఖాస్తులు 42,681 -
జీజీహెచ్లో నర్సుల దినోత్సవం
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సులు అందించే సేవలను విస్త్రతం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్ఎంఓ చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయి, సుజాత, రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు అంతా సిద్ధం
నల్లగొండ : పాలిసెట్– 2026 పరీక్షకు అన్ని ఏర్పాటు చేసానట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. ఆయన నల్లగొండలో మంగళవారం తన చాంబర్లో ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలిసెట్కు జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రమేష్ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో బీఎన్ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా కో–ఆర్డినేటర్ సిహెచ్ నరసింహారావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ట్రాన్స్కో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించంరామగిరి(నల్లగొండ) : పాలిసెట్ ప్రవేశపరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందని నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్లో ప్రవేశాలునల్లగొండ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతపూర్, బేగంపేట)లో 2026–27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి డే స్కాలర్స్లో గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా దరఖాస్తులు తీసుకుని, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అదే కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హత, ఎంపిక విధానం, పూర్తి వివరాలకు 9515181080 ఫోన్ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులునల్లగొండ : తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి సయ్యద్ యూసుఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే విధానం, అర్హత, ఎంపిక తదితర పూర్తి వివరాల కోసం నల్లగొండలోని ఉర్దూ అకాడమీ ట్రైనింగ్ సెంటర్, లేదా 7989314572 ఫోన్ నంబర్ను స్పంప్రదించాలని సూచించారు. ‘సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చింది’నల్లగొండ టౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చి పలు డిమాండ్లను అంగీకరించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, ఆరు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న సమ్మె ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి చర్చలకు పిలిచి 32 డిమాండ్లను అంగీకరించిందని తెలిపారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎస్.బాబు , జమాల్, డి.గోపాల్, పాటి అప్పారావు, కేఎస్.రెడ్డి, మనోహర్, బాసాని వెంకటయ్య, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాడి రైతులకు భరోసా
సాక్షి, యాదాద్రి: కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘానికి (నార్ముల్– మదర్ డెయిరీ) ఎట్టకేలకు ఊరట లభించింది. తక్షణ సాయంగా రూ.27కోట్ల చెక్కును ఎన్డీడీబీ అందజేసింది. ఇందులో రూ. 10 కోట్లతో బుధవారం ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులు చెల్లించనున్నారు. మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నార్ముల్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, డైరెక్టర్ల సమక్షంలో మదర్డెయిరీ, ఎండీఎన్డీడీబీ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక.. క్రమం తప్పకుండా బిల్లులు ఒప్పందం ప్రకారం నార్ముల్ పాలసేకరణ చేస్తుంది. ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీలు పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ చేస్తాయి. నార్ముల్ –మదర్డెయిరీ రోజూ లక్ష లీటర్లకుపైగా పాల సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. నార్ముల్ కొనుగోలు చేసి ఇచ్చే ప్రతి లీటరు పాలకు ఎన్డీడీబీ రూ.6.50 కమీషన్ చెల్లిస్తుంది. ఈ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడంతో పాటు మెయింటెనెన్స్ చేస్తారు. పాడి రైతుల బిల్లులు చెల్లించేందుకు రూ. 10 కోట్ల చెక్కు, అప్పు చెల్లించేందుకు రూ.17 కోట్ల చెక్కుతో కలిపి మొత్తం రూ. 27 కోట్లు నార్ముల్– మదర్ డెయిరీకి ఎన్డీడీబీ అందజేసింది. ముందుగా ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులను బుధవారం చెల్లిస్తారు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న నార్ముల్–మదర్ డెయిరీ భూమి 29.37 ఎకరాలను ఎన్డీడీబీ కొనుగోలు చేసి రూ. 40 కోట్లు చెల్లిస్తుంది. మరో రూ.28 కోట్లు సాఫ్ట్లోన్ ఇస్తుంది. ఫ నార్ముల్ – ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం ఫ రూ. 27 కోట్లు విడుదల ఫ పాడి రైతులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు -
13న పాలిసెట్
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2026 ప్రవేశపరీక్ష 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 13, నాగార్జునసాగర్ 2 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. పరీక్షకు మొత్తం 5,310 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. 11 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హెచ్బి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ 90 శాతం పూర్తి చేయాలినల్లగొండ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా 90 శాతం పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిపోయిన మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మమోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు. నైపుణ్యాలతో మెరుగైన ఉపాధినల్లగొండ టూటౌన్ : నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించవచ్చని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇన్నోక్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఎంపికై న 20 మంది టీచర్లకు ఆయన నియామకపత్రాలు అందజేసి మాట్లాడారు. 20 మంది వివిధ పాఠశాలల్లో అధ్యాపకులుగా అర్హత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్కుమార్, కొప్పుల అంజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఇన్నో క్యూటర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దారి కోసమంటూ ఇచ్చేసిన నీటిపారుదల శాఖ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గిరికబావిగూడెం వద్ద ఎస్ఎల్బీసీ కాలువ నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమి కబ్జాకు గురైంది. హైదరాబాద్–మునుగోడు బైపాస్ రోడ్డును ఆనుకొని ఇటీవల కొత్త కొత్త వెంచర్లు పుట్టగొడుగొల్లా పుట్టుకొస్తున్నాయి. వెంచర్లలోకి ప్రవేశించేందుకు దారిలేకపోవడంతో కాలువ భూమిని ఆక్రమించి అక్రమంగా రోడ్లు ఏర్పాటు చేశారు. ఓ వైపు ఆక్రమణకు గురైన ఎన్ఎపీ, ఎస్ఎల్బీసీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. కానీ నల్లగొండలో రియల్టర్లు మాత్రం ఎస్ఎల్బీసీ భూములను ఆక్రమించి వెంచర్లలోకి 30 ఫీట్ల వెడల్పుతో మూడు చోట్ల నుంచి రోడ్లు వేయడమేగాక, భూములకు నలువైపులా ఇనుపకంచెలు నిర్మించి ఆక్రమిస్తున్నారు. రూ.వందల కోట్లతో ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రూ.కోట్ల విలువైన భూమిని రియల్టర్లు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. బైపాస్తో భూముల ధరలకు రెక్కలు నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు గిరకబాయిగూడెం నుంచి లతీఫ్సాహెబ్ గుట్ట వెనుక భాగం నుంచి మునుగోడు రోడ్డుకు వెళ్లే దారిలో ఎస్ఎల్బీసీ ప్రధాన కాల్వ ఉంది. ఆ కాల్వ తవ్వే సమయంలో ఇరిగేషన్ శాఖ కాల్వ వెంట అప్పట్లో భూమిని సేకరించింది. ఆ భూమి పక్కనుంచి ప్రస్తుతం బైపాస్ రోడ్డు వస్తుండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే కాల్వ వెంట ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి చుట్టుపక్కల భారీ ఎత్తున ఒక ప్రైవేట్ వెంచర్ వెలిసింది. దానికి దారులు లేవు. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకోవడంతో వారు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నట్లుగా వదిలేశారు. ఇక్కడ ఆ ఎస్ఎల్బీసీ స్థలానికి కూడా కడీలు పెట్టి పెన్సింగ్ కూడా రియల్టర్లే వేయడంతో ఆ భూమి కూడా ప్రైవేట్ భూమి అన్న తీరులో అక్కడ దర్శనమిస్తోంది. బండ్లదారి కాదే.. సాధారణంగా ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు దాని వెనుక ఉండే వ్యవసాయ భూములకు మాత్రమే ఎడ్ల బండ్లు వెళ్లేలా దారి ఇస్తారు. అదీ రైతులు వెళ్లి వచ్చేందుకు ఒకచోట మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ మూడు చోట్ల పెద్ద రోడ్లు వేశారు. అయినా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదంటే దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు పెట్టి పెన్సింగ్ వేసి, కాపాడాలని చెబుతుంటే నల్లగొండలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏకంగా వెంచర్దారులకు భూమిని అప్పగించేశారు. ప్రభుత్వ భూమే కదా అని 30 ఫీట్ల వెడల్పు చొప్పున మూడు రోడ్లు వేసుకున్నారు. సగం వరకు సీసీ వేసుకుని మిగతా మట్టి రోడ్డు వేశారు. ఆ వెంచర్కు మూడుదారులు వేసి పెద్దగేట్లు పెట్టేసరికి దీంతో చూడటానికి మంచి లుక్ వచ్చింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేలా వెంచర్ తయారైంది. ఇలా ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్లు వేసుకుని కష్టమర్లను ఆకర్షించి ప్లాట్లు అమ్మేందుకు అధికారులు సహకరించారు. ఈ తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత డీఈని అడిగితే వారికి దారి లేదు ఎలా వెళతారని సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్దారులకు అలా ఇవ్వవచ్చా అని అడుగ్గా వెంటనే దాన్ని తీసివేస్తామని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఫ భూసేకరణ సమయంలో వ్యవసాయ బండ్ల బాటకు ఇచ్చేలా ఒప్పందం ఫ అంతకు మించి రెండు మూడు చోట్ల రోడ్డు వేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం ఫ నల్లగొండ సమీపంలో ఆక్రమణకు గురవుతున్న ఎస్ఎల్బీసీ స్థలం -
పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా
కేతేపల్లి : బక్రీద్ పండగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చెక్పోస్టులతో నిఘా పెంచామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ తీరును పరిశీలించి అక్కడ విధుల నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. కంటైనర్లు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవటం, గొడవలకు దిగటం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి, శాలిగౌరారం ఎస్ఐలు సతీష్, సైదులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి
నల్లగొండ : నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జల సంచాయ్ – జన్ భాగిదారి’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సోమవారం ఆయన కలెక్టరేట్లో మేయర్ బుర్రి చైతన్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జల సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలలో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతుందన్నారు. తెలంగాణ సాంస్క్రతిక సారధి కళాకారుల ద్వారా నీటి సంరక్షణ, నీటి పొదుపు, నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరులను సంరక్షించుకోవాలని, సూచించారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు నిర్మించుకునే వారిరు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బండి సంజయ్ రాజీనామా చేయాలి
దేవరకొండ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు నమోదై మూడు రోజులవుతున్నా నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఎం రేవంత్రెడ్డి పోలీసులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో వల్లపురెడ్డి, టీవీఎన్ రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్లతో చెర్వుగట్టు అభివృద్ధి
నార్కట్పల్లి : చెర్వుగట్టు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యుల చేత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా వారాల రమేష్ను పాలకమండలి సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్వుగట్టు ఆయల ప్రాముఖ్యతను సీఎం రేవంత్రెడ్డికి.. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలసి వివరించిన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని వివరించారు. ఆలయానికి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోందని, నూతనంగా పదవులు పొందిన పాలకమండల సభ్యులు ఆలయ ప్రాముఖ్యత, చరిత్రను అందరికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ వారాల రమేష్, పాలక మండలి సభ్యులు నల్ల అనిత, రేగట్టె శ్రీనివాస్రెడ్డి, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇడుకుల్ల సంపత్కుమార్, మర్రి లింగస్వామి, కమ్మలపల్లి మల్లేషం, కొమ్ము శ్రీను, మధుల నర్సింహ, రంగ శ్రవణ్కుమార్, పాల మహేష్, వీరెల్లి రఘునాథ్, గద్దగూటి యాదయ్య, గౌరిదేవి లక్ష్మయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, ఆలయ ఈఓ మోహన్, సర్పంచ్లు నేతగాని కృష్ణ, ఏల్లెందుల లింగస్వామి, జేరిపోతుల భారత్, వెంకట్రెడ్డి, కొంపెల్లి సైదులు, పున్నపురాజు యాదగిరి, రేగట్టె రాజశేఖర్రెడ్డి, నల్ల వెంకన్న, సట్టు సత్తయ్య, సిద్దగోని స్వామి, పాశం శ్రీనివాస్రెడ్డి, సామ నరేందర్రెడ్డి, గడ్డం పశుపతి, గోలి సాగర్రెడ్డి, మట్టిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం -
పక్కాగా ఇళ్ల లెక్క
నల్లగొండ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు. పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్వైజర్లను నియమించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఇళ్లకు స్టిక్కర్లు వేస్తూ అక్కడ రోడ్డు, బావి, బడి ఉందా అన్నింటిని పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని భవనాలతో పాటు నీటి ట్యాంకులను కూడా మ్యాపింగ్ చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్ యాప్ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది. 34 రకాల వివరాలతో యాప్ ద్వారా చేయనున్నారు. వలసలు.. ఇతర ప్రాంతాల్లో నమోదుపై స్పష్టత జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు. రామగిరి(నల్లగొండ) : జనగణనలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, జిల్లా ఇన్చార్జి హోబాలాల్ అన్నారు. సెన్సెస్ తొలిదశలో భాగంగా గృహగణనను సోమవారం నల్లగొండ మండలం గుండ్లపల్లిలో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వీయ గణన చేసుకున్న వారు ఐడీని ఎన్యూమరేటర్లకు తెలియజేసి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఆఫీసర్ కె.పరశురామ్, ఎంపీ.యాకుబ్నాయక్, శేఖర్రెడ్డి, చారి, వంగూరి రమేష్ పాల్గొన్నారు. ఫ పూర్తి వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు -
‘హ్యామ్’లో రోడ్లు అభివృద్ధి
మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రహదారుల ప్రాజెక్టు మొదటి దశలో మిర్యాలగూడ ఆర్ అండ్ బీ డివిజన్లో 12 రహదారులను ఎంపిక చేశారు. రూ.616 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో కాంట్రాక్టర్ 60 శాతం, ప్రభుత్వం 40 శాతం నిధులు భరించి నిర్మిస్తారు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత వాయిదాల్లో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తుంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది. టెండర్ ప్రక్రియ పూర్తయిందని అప్రూవల్ వచ్చిన వెంటనే పనులను ప్రారంభించేలా చూస్తామని ఆర్అండ్బీ ఈఈ రాజేందర్ తెలిపారు. ఎంపిక చేసినవి రోడ్లు ఇవే.. ● ముకుందాపురం తుమ్మడం మీదుగా అడవిదేవులపల్లికి వెళ్లే రహదారి 21 కిలోమీటర్లు. ● నాగార్జునసాగర్ పీడబ్ల్యూడీ రహదారి నుంచి రాజవరం మీదుగా అల్వాల ఎక్స్ రోడ్డు వరకు 14.22 కిలోమీటర్లు. ● పడమటపల్లి పీడబ్ల్యూడీ రహదారి నుంచి శ్రీశైలం రహదారి వరకు 18.43 కిలోమీటర్లు. ● మాడుగుల పీడబ్ల్యూడీ రహదారి నుంచి సాగర్ పీడబ్ల్యూడీ రహదారి వరకు 9.30 కిలోమీటర్లు. ● డిండి– దేవరకొండ రహదారి నుంచి బాపనకుంట మీదుగా గోనబోయినపల్లి వరకు 16 కిలోమీటర్లు. ● కొత్తపల్లి అజ్మాపూర్ రహదారి (ధర్మాతండా మీదుగా) 7 కిలోమీటర్లు. ● బొత్తలపాలెం రాగడప రహదారి (కల్లేపల్లి, తిమ్మాపురం, శాంతినగర్, నర్సాపూర్, రాజాగట్టు, పుట్టలగడ్డ మీదుగా) 25.65 కి.మీ. ● డిండి – దేవరకొండ రహదారి 34 కిలోమీటర్లు. ● డిండి – దేవరకొండ రహదారి నుంచి కంబాలపల్లి 30.90కిలోమీటర్లు. ● మహబూబ్నగర్ నల్లగొండ రహదారి (మల్లేపల్లి నుంచి ధర్వేశిపురం వరకు) 8 కిలోమీటర్లు. ● మిర్యాలగూడ – తడకమళ్ల రహదారి 15.43 కి. ● ముకుందాపురం, తుమ్మడం, అడవిదేవులపల్లి (నారమ్మగూడెం మీదుగా) 8.46కిలోమీటర్లు. ఫ మిర్యాలగూడ డివిజన్లో12 రహదారుల గుర్తింపు ఫ రూ.616 కోట్లతో టెండర్లు పూర్తి -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో 86 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖకు 46, ఇతర శాఖలకు సంబంధించినవి 40 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి మంజూరు చేసే ఇళ్లకు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత లాగిన్కు పంపించాలని చెప్పారు. జనగణనలో భాగంగా సోమవారం నుండి నిర్వహించనున్న ఇళ్ల లెక్కింపును, విద్యా వారోత్సవాలను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. జూన్ 2 నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకకు అన్ని శాఖలు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కింద చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించాలన్నారు. జూన్ 1 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సిబ్బందికి శిక్షణ సిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నంబర్లపై కసరత్తు..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్ పరిధిలో డాక్యుమెంట్ లేని స్థలాల్లో నివాసాలకు ఇంటి నంబర్ల సమస్య పరిష్కారం కోసం కసరత్తు జరుగుతోంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో కలెక్టర్ చంద్రశేఖర్.. పానగల్, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీల్లో పర్యటించి ఇంటి నంబర్లు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏడు విలీన గ్రామ పంచాయతీలు, వాటి ఆవాస గ్రామాలు, పానగల్, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీ, ఏఆర్నగర్, వెంకటరమణ కాలనీ, న్యూ సూర్యవంశీ కాలనీ గుట్ట, పాతబస్తీ ప్రాంతం, మాన్యంచల్క, హైదర్ఖాన్గూడ, సుందరయ్య కాలనీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న నివాస స్థలాలు, ఇండ్లకు పూర్వం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేవు. గ్రామ కంఠం భూమలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరికి ఇంటి నంబర్లు ఉండగా, మరి కొందరికి లేవు. దాంతో ఇంటికి సంబంధించిన గుర్తింపు పత్రం అవసరమైనప్పుడు సమస్య వస్తోంది. 9 వేలకు పైగా ఇళ్లు నీలగిరి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పూర్వం నుంచి నివాసం ఉంటూ డాక్యుమెంట్లు లేని ఇండ్లు 9,645 ఉన్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఇళ్లలో కొన్నింటికి ఇంటి నంబర్లు లేని కారణంగా కార్పొరేషన్కు ఆస్తి పన్ను రావడం లేదు. డాక్యుమెంట్స్ లేని కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఇంటి నంబర్లు ఇవ్వాల్సి వస్తోంది. దాంతో సంబంధిత ఇంటి యజమానులు తమ పేరు లేకుండా ఇంటి నంబర్లు ఇస్తే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కలెక్టర్ ఆయా కాలనీల్లో పర్యటించిన సందర్భంలో ఇంటి నంబర్లు లేని ఇళ్లు, డాక్యుమెంట్ లేకపోవడం, కొంతమందివి రాసుకున్న పాత కాగితాలు, తాతల పేరు మీద ఉన్న ఇళ్లకు ప్రభుత్వం పట్టా ఇస్తే విక్రయించివి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్నవి, అసలు విలీన గ్రామాల్లో రికార్డుల్లో కూడా ఇంటి నంబర్లు లేని లాంటి సమస్యలు గుర్తించారు. ఇక్కడ గుర్తించిన సమస్యలపై కలెక్టర్ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఏళ్ల నుంచి వస్తున్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుంతో లేదో వేచి చూడాల్సిందే. ఫ నీలగిరి కార్పొరేషన్లో ఇళ్ల వివరాలు ఆరా తీసిన కలెక్టర్ ఫ డాక్యుమెంట్ లేని ఇళ్లకు సంబంధించి పలు సమస్యల గుర్తింపు ఫ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కలెక్టర్ సొంతిల్లు ఉన్నా.. దానిపై వారికి ఎలాంటి హక్కు పత్రం లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. డాక్యుమెంట్ లేని కారణంగా ఆస్తి పన్ను కూడా రెండింతలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కొత్తగా నిర్మించాలన్నా, బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకుందామన్నా డాక్యుమెంట్ కావాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుందామన్నా డాక్యుమెంట్ లేని కారణంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో డాక్యుమెంట్ లేనివి కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడలేదు. ఇంతటి జఠిలమైన సమస్యకు పరి ష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
గ్యాస్ కోసం రోడ్డెక్కిన లబ్ధిదారులు
తిప్పర్తి : మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లను అక్రమంగా అమ్ముకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆదివారం మండల కేంద్రంలోని నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుకింగ్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకుండానే డెలివరీ అయినట్లు మెసెజ్ వస్తోందని ఆరోపించారు. సిలిండర్లను బ్లాక్లో అమ్ముకుంటున్న గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకొని బుకింగ్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
3,99,593 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.954.63 కోట్ల విలువ చేసే 3,99,593 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,59,596 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని కొనుగోలు చేసిన ధాన్యంలో 3,97,616 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, రూ.644 కోట్ల విలువచేసే 2,69,730 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేశామని వెల్లడించారు. ధాన్యం అమ్మిన 30,167 మంది రైతులకు రూ.558.94 కోట్లు చెల్లించామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రోజూ క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎంజీయూలో నేటి నుంచి విద్యా వారోత్సవాలు నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో సోమవారం నుంచి తెలంగాణ విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మెగా టీచర్ ప్లేస్మెంట్ డ్రైవ్, రెండవ రోజు జాతీయ విద్యా ప్రణాళిక – 2020 అమలుపై చర్చ, మూడవరోజు డిగ్రీ టీచర్లకు సిలబస్ రివ్యూ, కొత్త డిగ్రీ కోర్సులపై ఓరియంటేషన్, 4వ రోజు బీఈడీ టీచర్లకు సిలబస్ రివ్యూ, మూల్యాంకనంపై ఓరియంటేషన్, 5వ రోజు ఇంజనీరింగ్ టీచర్లకు కత్రిమ మేధ వినియోగం శిక్షణ, 6వ రోజు నాన్ టీచింగ్ ఉద్యోగులకు కత్రిమ మేధ వినియోగంపై ఓరియంటేషన్, 7వ రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మెరుగైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలిసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన డీటీఎఫ్ ఐదవ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం సరికాదన్నారు. మొత్తంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చెర్ల వేణు, బీవీ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పున్నయ్య పాల్గొన్నారు. -
నీటి ప్రవాహానికి బండరాళ్లు అడ్డు
నాగార్జునసాగర్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వలో పేరుకుపోయిన బండరాళ్లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ సామర్థ్యం ప్రకారం ప్రవహించాల్సిన నీటికి, వాస్తవ ప్రవాహానికి పొంతన ఉండటం లేదని చెబుతున్నారు. కాల్వలో 11 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సి ఉండగా, పూడిక, రాళ్ల వల్ల అది 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. అయితే, ఎడమ కాల్వ వద్ద ఉన్న గేజీ మీటర్ మాత్రం 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని చూపిస్తుండడం గమనార్హం. కూలుతున్న దరులు.. పెరిగిన అడ్డంకులు కాల్వకు ఇరువైపులా ఉన్న రాతి దరులు వర్షాలకు నానుతుండటంతో అప్పుడప్పుడు కాల్వలోకి కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం వాటిని తొలగించారు. కానీ కాల్వ దరులను మాత్రం లైనింగ్ చేయలేదు. దరులపై చెట్లు పెరిగి, వాటి వేర్లు బలంగా పాకడంతో రాళ్లు వదులై నీటిలో పడుతున్నాయి. చిన్న రాళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయి బొయ్యారం (టన్నెల్) లోకి చేరుతుండగా, పెద్ద బండరాళ్లు మాత్రం కాల్వలోనే ఉండిపోయి నీటి వేగాన్ని తగ్గిస్తున్నాయి. జలాశయం లోపల ఉన్న అప్రోచ్ కెనాల్లో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. చేపల వేట కోసం కొందరు ఉపయోగిస్తున్న నాటు బాంబుల వల్ల కూడా ఈ రాతి దరులు బీటలు వారి నీటిలో పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాళ్లు తొలగించేందుకు ఇదే తగిన సమయం ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గింది. అప్రోచ్ ఛానల్ మొత్తం బయటపడటంతో, అందులో పేరుకుపోయిన బండరాళ్లను తొలగించడానికి ఇదే సరైన సమయమని రైతులు సూచిస్తున్నారు. తూము ముందు భాగంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తేనే నీటి సరఫరా సజావుగా సాగుతుంది. మరమ్మతులకు నిధులిస్తేనే.. కాల్వ దరులు పటిష్టంగా ఉండాలంటే ‘షార్ట్క్రీటింగ్’ పద్ధతిని చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. సన్నని ఇనుప జాలీని అమర్చి సిమెంట్తో లైనింగ్ చేయడం వల్ల దరులు కూలకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల దరులపై చెట్లు మొలిచే అవకాశం కూడా ఉండదు. పెద్ద బండలకు డ్రిల్లింగ్ చేసి ఇనుప రాడ్లను అమర్చడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వం స్పందించి, కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఫ ఎడమకాల్వ అప్రోస్ కెనాల్, తూము వద్ద కూలుతున్న దరులు ఫ ఏళ్లు గడుస్తున్నా తొలగించని అధికారులు ఫ లైనింగ్ చేయాలని రైతుల డిమాండ్ -
స్వీయ గణనకు స్పందన కరువు
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన (సెన్సస్) ప్రక్రియలో భాగంగా.. ఈసారి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వీయ గణన)కు జిల్లాలో ఆశించిన స్పందన లభించలేదు. ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 10 వరకు గడువు ఇచ్చినప్పటికీ, ప్రజల నుంచి స్పందన కరువైంది. కలెక్టర్ చంద్రశేఖర్ పదేపదే అవగాహన కల్పించినప్పటికీ, జిల్లాలోని 5 లక్షల పైచిలుకు కుటుంబాలలో కేవలం 17,161 కుటుంబాలు మాత్రమే స్వీయ గణన చేసుకున్నాయి. విద్యావంతులు కూడా దీనిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. స్వీయ గణన చేసుకున్న వారు, ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ఆ వివరాలు చూపిస్తే సరిపోయేది. గడువు ముగియడంతో ఇకపై ఎన్యుమరేటర్ల ద్వారానే వివరాలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండు దశలో జనగణన జనగణనను ఈసారి రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇళ్ల గుర్తింపు, రెండో దశలో జనాభా గణన జరగనుంది. ఈ క్రమంలో, నేటి నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నారు. జూన్ 9 వరకు మొదటి దశలో భాగంగా ఇళ్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల్లో ఈ సర్వే ముమ్మరంగా సాగనుంది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో రెండో దశ కింద పూర్తిస్థాయి జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. సిబ్బంది నియామకం జనగణన కోసం జిల్లావ్యాప్తంగా 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 నుంచి 300 ఇళ్లను (సుమారు 700 మంది జనాభా) కవర్ చేయాల్సి ఉంటుంది. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి.. జనగణన కిట్లను అందజేశారు. తొలిసారి డిజిటల్ పద్ధతిలో.. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు.ఎన్యుమరేటర్లు తమ స్మార్ట్ఫోన్లలోని ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ‘ఆఫ్లైన్’లో వివరాలు సేకరించి, తర్వా త సర్వర్లో అప్లోడ్ చేసే సౌకర్యం కల్పించారు. జిల్లాలో 16,18,416 మంది జనాభా ఇటీవలి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 16,18,416 మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 2027 జనగణన కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి తమ ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించి, సరైన వివరాలు అందించాలని అధికారులు కోరుతున్నారు. ఫ వివరాలు నమోదు చేసింది 17,161 కుటుంబాలే.. ఫ ముగిసిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ గడువు ఫ నేటి నుంచి గృహాల గుర్తింపు -
దళితుల ఆత్మీయ బంధువు.. సీఎం రేవంత్రెడ్డి
నల్లగొండ : దళితుల ఆత్మీయ బందువు సీఎం రేవంత్రెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్లో ఐదు మంత్రి పదవులు దళితులకు దక్కాయన్నారు. ఎస్సీ వర్గీకరణతో అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ను బీఆర్ఎస్ను ప్రజలు జన్మలో నమ్మరన్నారు. కాంగ్రెస్ సంస్థాగత ఇన్చార్జి మందుల సూర్యకిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్కు అండగా నిలిచేది దళితులే అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, బీసీ సెల్ చైర్మన్ జిల్లా పల్లి పరమేష్,, కుర్పటి గణేష్, వేముల గోపి, పెరిక అంజయ్య, పుల్లెంల సందీప్, చింతపల్లి బాలకృష్ణ, సంజయ్, వినోద్, చిరుమర్తి ఉపేందర్, పెరిక హరిప్రసాద్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘కేన్స్’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు
భూదాన్పోచంపల్లి : ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఈ నెల 17 నుంచి 21 వరకు 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్ కార్పెట్ వాక్ చేయనుంది. అదేవిధంగా ప్రీ ఈవెంట్ పార్టిసిపేషన్, ర్యాంప్ అండ్ స్టైలింగ్ చేయనున్నారు. హౌజ్ ఆఫ్ వెండోమ్ ప్యారిస్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన రష్మీ ఠాకూర్ను ఎంపిక చేశారు. ఫ్యాషన్ షోకు అవసరమైన ఇక్కత్ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేశ్ ఆదివారం రష్మీ ఠాకూర్కు పంపించారు. ఈ సందర్భంగా తడక రమేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా తమకు ఇక్కత్ వస్త్రాలను అందించేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆదివారం రూ.లక్ష విలువైన ఎంపిక చేసిన ఇక్కత్ వస్త్రాలను అందజేశామని పేర్కొన్నారు. అంతేకాక తనకు కూడా ర్యాంప్ వాక్లో చేనేత కళాకారుడిగా పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు రష్మీఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాషన్ షోకు ఎంపిక చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇవే.. ఫ ఫిల్మ్ ఫెస్టివల్లో ధరించనున్న బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ -
యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తులతో చేయించారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు. -
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు అన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నల్లగొండ పట్టణంలో నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి క్లాక్టవర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్. రావు మాట్లాడుతూ ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నిర్బంధ కాలం నుంచి స్వతంత్రంగా ఆర్టీసీ కార్మిక సమస్యలపై, సంస్థ రక్షణ కోసం పోరాడిందన్నారు. 2021 నుంచి 9 సంఘాలతో జేఏసీ ఏర్పడి పనిచేసింది అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోర్మెన్ కమిటీ ముందు, ప్రభుత్వ మంత్రుల ఉప సంఘం ముందు విలీనం, అనంతర సమస్యలు, యూనియన్ పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్లు, పే స్కేల్ అలవెన్స్లపై వినతిపత్రాలు సమర్పించామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ పనిభారం, వేధింపులు, యూనియన్ హక్కుల పునరుద్ధరణ కోసం ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. బస్సుల విధానం మార్పు చేసి, వాటిని ఆర్టీసీలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి జి.లింగమూర్తి, ప్రచార కార్యదర్శి పి.రవీందర్ రెడ్డి, కోశాధికారి కేఎస్.రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీత, ఎస్.కృష్ణ, ఈఏ.రాంచందర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస్, బియూ.చారి, బత్తుల సుధాకర్, నాయకులు నర్సింహ, రసూల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
13న విద్యార్థులకు కౌన్సిలింగ్
నల్లగొండ టూటౌన్ : స్పోర్ట్స్ స్కూల్స్, హాస్టల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన వారు బాలురు 8 మంది, ఆరుగురు బాలికలు రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు అన్ని ఒరిజినల్స్తో కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించారు. లారీల కాంట్రాక్టర్లకు జరిమానానల్లగొండ : ధాన్యం రవాణా విషయంలో అలసత్వం వహిస్తున్న నలుగురు కాంట్రాక్టర్లకు జరిమాన విదించినట్లు పౌర సరఫరాల శాఖ మేనేజర్ రాంపతి తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’ లో ‘డబ్బులు ఇస్తేనే లోడింగ్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ సందర్భంగా మేనేజర్ రాంపతి మాట్లాడుతూ ధాన్యం రవాణలో ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపడుతుందన్నారు. రైతులను ఎవరైనా డబ్బులు అడిగితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలినల్లగొండ టూటౌన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.సుజాత అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్లో మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మార్కెటింగ్, కలుపు నివారణ, లైసెన్స్ పొందడం తదితర వాటిపై మత్స్యకారులు అవగాహన పొందాలన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ నాగరాజు, కోఆపరేటివ్ అధికారి భూక్యా వెంకన్న, మత్స్య శాఖ జిల్లా అధికారి రాజారామ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. కొండమల్లేపల్లిలో విజిలెన్స్ తనిఖీలుకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పశువుల సంతకు సంబంధించి గత కాంట్రాక్టర్ 2016 నుంచి 2026 మార్చి వరకు కొనసాగారు. మార్చి 25న నిర్వహించిన వేలంలో కల్వకుర్తికి చెందిన కాంట్రాక్టర్ సుమారుగా రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. అయితే పాత కాంట్రాక్టర్ 10 సంవత్సరాలుగా పశువుల సంత కాంట్రాక్టును దక్కించుకుని, పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నాడని, గత సంవత్సరానికి సంబంధించిన వేలం ఫేక్ చలాన్లు ఇచ్చాడని గుర్తించడంతో పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పైఅధికారులు జిల్లా విజిలెన్స్ అధికారుల ద్వారా కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పశువుల సంత కాంట్రాక్టుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. 11 నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ వారంనల్లగొండ : ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సస్పెన్షన్నల్లగొండ : ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. మండలంలోని పెద్ద సూరారం, నార్కట్పల్లి మండలం బాచకుంట, త్రిపురారం, చండూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంటర్ చేయలేదు. ఈ విషయమై కలెక్టర్ సీరియస్ అయి ఆయా కేంద్రాలకు చెందిన నలుగురు ఇన్చార్జిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
స్వీయ గణన చేసుకోండి
నల్లగొండ టూటౌన్ : జనగణనలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని ఎన్జీ కాలేజి నుంచి క్లాక్టవర్ వరకు జనగణన నడకను మేయర్ బుర్రి చైతన్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. జనగణంలో భాగంగా ముందుగా స్వీయ గణన, గృహాల లెక్కింపు, జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ గణన ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకోవచ్చని, 16 భాషల్లో గణన చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. పెద్దబండ వద్ద స్వీయ గణనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన మాట్లాడారు. స్వీయ గణన సందర్భంగా అద్దె ఇంట్లో ఉన్న అక్కడి నుంచే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనగణనలో సరైన సమాచారం ఇవ్వాలని, ఇది భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంట్లో ఉన్న అందరి వివరాలను తెలియజేయాలని, కుటుంబానికి ఒక ఎన్యుమరేషన్ ఐడీ వస్తుందని, దీని ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు జనగణన జాప్యం లేకుండా త్వరత్వరగా చేసుకునేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సీపీఓ శ్రీనివాస్నాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, జిల్లా క్రీడలు యువజన సర్వీసుల అధికారి అక్బర్ అలీ, తహసీల్దార్ పరశురాం, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫ 10వ తేదీనే ఆఖరుఫ నల్లగొండలోన జనగణన నడకను ప్రారంభించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
మేలు జాతి పశువులతో లాభాలు
రామగిరి(నల్లగొండ), తిప్పర్తి : మేలు జాతి పశు సంతతితో లాభాలు పొందవచ్చని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ జివి.రమేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలంలోని జికె అన్నారం, తిప్పర్తి మండలంలోని జొన్నగడ్డలగూడంలో పశు గర్భకోశ వ్యాధి చికిత్సలు, మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. పశువుల్లో వచ్చే వ్యాదులను రైతులు ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. పశువైద్యాధికారులు కోట్ల సందీప్రెడ్డి, డా. పల్లవి, యశ్వంత్, సర్పంచ్ నామిరెడ్డి అనురాద,ఉపసర్పంచ్ డేవిడ్, సాయిచరణ్, శ్రీహరి, రసూల్, హతిక్, శివ, అరుణ్, నర్సింహ పాల్గొన్నారు. -
ప్రధానికి పోస్టుకార్డులు
నల్లగొండ : మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానికి పోస్టు కార్డులు పంపనున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వై.సుజాత, జె.లలిత, బి.స్వరూపారెడ్డి, వెంకటమ్మ, డి.సుజాత, డి.సునీత, పి.సుజాత, ఎస్.ఐలమ్మ, కె.సమ్మక్క, ఎస్.బాగ్యమ్మ, కె.ప్రియాంక, డి.లక్ష్మమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు. -
పేరు మారిందా.. మిల్లు అమ్మేశారా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం 2022–23 యాసంగి సీజన్లో ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రామలక్ష్మణ్ రైస్ మిల్లు పేరు మారింది. అయితే సాధారణంగానే పేరు మార్చేశారా? లేదంటే మిల్లునే అమ్మేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు మిల్లుల ద్వారా రూ.100 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన విషయం తెలిసిందే. ఆయనను ఆరెస్టు చేసి రిమాండ్కు పంపిన రోజే ఆయనకు సంబంధించి పానగల్ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు ఉన్న రామ్లక్ష్మణ్ పారుబాయిల్డ్ మిల్లు పేరును రాజరాజేశ్వరి రైస్ మిల్లుగా పేరు మార్చి బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ధాన్యం ఎగ్గొట్టిన వ్యవహారంలో ఆ మిల్లును అధికారులు సీజ్ చేయడం, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మిల్లు పేరు మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మిల్లునే ఆమ్మేయడం ద్వారా పక్కదారి పట్టించిన ధాన్యం డబ్బులను ఎగ్గొట్టేందుకు ఆ పని చేశారా? లేదంటే మరో పేరుతో మిల్లును నడిపించుకునేందుకు, మళ్లీ ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని వ్యాపారం చేసుకునేందుకు ఈ చర్యలకు దిగారా? అన్నది తేలాల్సి ఉంది.ఫ రామ్లక్ష్మణ్ మిల్లు వద్ద రాజరాజేశ్వరి రైస్ మిల్ పేరుతో బోర్డు -
మిర్యాలగూడ మున్సిపాటీలో అవకతవకలు
● మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ఛంద్ర తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రజలు 9440446106, టోల్ ఫ్రీ నెం.1064లను సంప్రదించాలని కోరారు. మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కార్యాలయంలో అధికారులు పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ పనితీరును పరిశీలించారు. రికార్డులు, ఆర్థిక లావాదేవీల్లో పలు అవకతవకలు కనిపించినట్లు ఏబీసీ బ్యూరో హైదరాబాద్ ఎస్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధుసామ్ శుక్రవారం తెలిపారు. ఏసీబీ అధికారులు గుర్తించిన అంశాలు ఇలా.. ● ఆస్తి పన్ను విషయంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24.86కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. కేవలం రూ.9.17కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.15.68కోట్లు బకాయి ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది. ● దుకాణాల పన్ను వసూళ్లలో లోటు ఏర్పడినట్లు గుర్తించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీలో 1756 దుకాణాలకు రూ.43.03 లక్షల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. రూ.28.35 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.36.81లక్షలు కాగా కేవలం రూ.15.01 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో ఈ లోటుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగింది. ● గత ఆర్థిక సంవత్సరంలో అక్రమ నిర్మాణాలపై 54 ఫిర్యాదులు అందగా చాలా కేసుల్లో నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్ణీత గడువు ముగిసిన తరువాత కూడా తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదు, తనిఖీ సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొలుగురి వెంకన్న అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. ● చేయూత పింఛన్, జనన, మరణ విభాగంలో 116 జనన దరఖాస్తులు, 1 మరణ దరఖాస్తులు ఉండగా ఏడు రోజుల గడువు దాటినా వాటిని పెండింగ్లో పెట్టినట్లు గుర్తించారు. పోర్టల్లో ఎంట్రీ ఆప్షన్ లేకపోవడంతో 1,820 పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తేల్చారు. ● టౌన్ ప్లానింగ్లో భవన అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం 2024–25లో రూ.3.29కోట్ల నుంచి 2025–26లో రూ.3.05కోట్లకు పడిపోయిందని, ఇది అధికారుల పనితీరు లోపాన్ని సూచిస్తోంది. ● 2025–26లో మ్యుటేషన్ దరఖాస్తుల్లో 86కుగాను 61 పెండింగ్లో ఉన్నాయని, ఇది ప్రజా అభ్యర్థనల పరిష్కారంలో లోపాిన్ని చూపిస్తోందని, 2026–27లో 18 దరఖాస్తులు మాత్రమే రాగా పెండింగ్ దరఖాస్తులు కలిపి 34 ఆమోదించినట్లు చూపించారు. ● కీలక రిజిస్టర్ల సరైన నిర్వహణ లేనట్లు గుర్తించారు. భవన అనుమతి, అక్రమ లేఅవుట్లు, రిజిస్టర్లు సరిగా నిర్వహించలేదని, కేవలం మూడు రిజిస్టర్లు మాత్రమే పాక్షికంగా ఉన్నాయని, వాటిపై అదికారుల సంతకాలు లేవని తేల్చారు. 21రోజుల పరిమితిని దాటిన పలు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు ఉన్నాయని అక్రమ నిర్మాణాలపై 54 ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేకుండా పెండింగ్లో ఉంచినట్లు గుర్తించారు. ● 4,638 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రాసెస్ చేయలేదని దీని వల్ల రూ.15కోట్ల ఆదాయం రాకుండా పోయిందని, ఇది తీవ్రమైన విధానపరమైన లోపాన్ని తేల్చారు. ● కార్యాలయంలో వ్యక్తిగత నగదు రిజిస్టర్ నిర్వహించలేదని, దీనివల్ల సిబ్బంది వద్ద ఉన్న నగదుకు జవాబుదారీతనం తనిఖీ చేయడం కష్టంగా మారింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ప్రకారం మార్చి 2026లో కొన్ని రోజులు కొందరు ఉద్యోగులు గైర్హాజరు అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం పూర్తి నెల జీతం క్లెయిమ్ చేసినట్లు గుర్తించారు. ● మున్సిపల్ అధికారుల వినియోగం కోసం ఇంధన చార్జీల కింద నెలకు రూ.19.33 లక్షలు క్లెయిమ్ చేస్తున్నా దానికి రికార్డులు నిర్వహించడం లేదు. వాహనాల ల్యాగ్ బుక్స్ లేవని, కేటాయించిన వాహనాలకు సరైన రికార్డులు నిర్వహించడం లేదని గుర్తించారు. ఫ ఏసీబీ సోదాల్లో గుర్తింపు ఫ అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు -
వేసవిలో తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తాగునీటి విషయంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సరఫరాలో సమస్యలు, మరమ్మతులు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు. పూర్తిస్థాయిలో పరీక్ష నిర్వహించిన తర్వాతే తాగునీటిని సరఫరా చేయాలని, ఇందుకు గాను ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి టెస్టింగ్ కిట్లను ఇచ్చామన్నారు. ఏఈలు గ్రామాల్లో సర్పంచులతో అనుసంధానంలో ఉండి ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా పర్యవేక్షించాలని సూచించారు. తాగునీటిపై పత్రికల్లో వచ్చే వార్తలకు స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు, వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇంజనీరింగ్ అధికారులు చూడాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్య ఎస్ఈ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ శాంతకుమారి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్నాయక్, మిషన్ భగీరథ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో కొన్నది సగమే..
సాక్షి ప్రతినిది, నల్లగొండ : ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతకు అష్టకష్టాలు తప్పడం లేదు. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కొన్నది సగమే. ఇంకా కల్లాల్లో సగం ధాన్యం అలాగే ఉంది. అన్నీ సక్రమంగా ఉన్నాయని కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయించి మిల్లులకు పంపితే.. అక్కడ కొర్రీలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు లారీల కొరత రైతులను వేధిస్తోంది. మొత్తంగా ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో అధికారుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అన్ని చోట్లా దోపిడీ.. ఈ సీజన్లో ఎండల తీవ్రత కారణంగా ధాన్యం కల్లాల్లో పోసిన రెండు మూడు రోజుల్లోనే నిర్దేశిత తేమ శాతం వస్తోంది. అయినా రైతులు దోపిడీకి గురవుతున్నారు. తాలు పేరుతో కేంద్రాల్లోనే అదనంగా తూకం వేస్తున్నారు. బస్తాకు రూ.3, రూ.4 ఇస్తేనే లారీలను పంపుతున్నారు. ఇక మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటే బస్తాకు 3, 4 కిలోల కోతకు ఒప్పుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని దింపుకునేలా చేయడం, ట్రక్ షీట్లు తెప్పించడం, ఆన్లైన్ చేయడం ఈ బాధ్యతంతా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే. అయినా వారు పట్టించుకోకుండా రైతులనే వెళ్లి మిల్లర్తో మాట్లాడుకొమ్మని చెప్పి దోపిడీకి సహకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న పౌరసరఫరాల విభాగం మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏ గ్రేడ్ను.. బీ గ్రేడ్ మార్చుతున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం గ్రేడ్ను నిర్ణయిస్తారు. అది ఏ గ్రేడ్ ధాన్యమా? బీ గ్రేడ్ ధాన్యమే అన్నది వ్యవసాయ అధికారులు సర్టిఫై చేస్తారు. అలా వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్ దింపుకొని ట్రక్ షీట్ ఇచ్చేయాలి. కానీ కొందరు మిల్లర్లు తాలు, మట్టి పేరుతో తమ వద్దకు వచ్చిన ధాన్యంలో కోత పెట్టడమే కాకుండా, గ్రేడ్ మార్చేసి మరీ దోచుకుంటున్నారు. అందుకు ఒప్పుకుంటే సరి. లేదంటే దింపుకోకుండా పెండింగ్ పెడుతుండటంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కొన్నది 56.53 శాతమే.. జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నెల రోజులు దాటిపోయింది. 6,50,934 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అందులో ఇప్పటివరకు 3,67,985 మెట్రిక్ టన్నుల (56.53 శాతం) ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యంలో 3,65,853 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మిల్లులకు వెళ్లిన ధాన్యంలో మిల్లర్లు 1,99,191 మెట్రిక్ ధాన్యాన్ని (54.44 శాతం) మాత్రమే దింపుకున్నారు. అంటే మిల్లులకు వెళ్లిన ధాన్యంలో సగం ధాన్యానికి మిల్లర్లు ఓకే చెప్పలేదు. ఈ వ్యవహారంలో అధికారులు పక్కా చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు నిర్ణీత సంఖ్యలో లారీలు లేకున్నా ఉన్నట్లు అధికారులు బుకాయిస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు మిల్లులకు వెళ్లిన 350 లారీల్లో సగం మిల్లుల వద్ద ఉన్నాయి. మిగతా సగమే తిరుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 450 లారీలను ఎందుకు కొనుగోలు కేంద్రాలకు పంపించడం లేదన్నది ప్రశ్న. అంతేకాదు అటు లారీల యజమానులు, మిల్లర్లతో కొందరు అధికారులు కుమ్మకై ్క ముడుపుల బాగోతంతో రైతులను కష్టాలపాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసినా.. మిల్లుల్లో కొర్రీలు ఫ అడుగడుగునా దోపిడీకి గురవుతున్న రైతులు ఫ ధాన్యం కొనుగోళ్లలో కనిపిస్తున్న ప్రణాళికా లోపం -
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలి
తిప్పర్తి : రైతులు సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్మాయ పంటల సాగుపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు దొడ్డురకం వరి కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాలతోపాటు కూరగాయలు, పామాయిల్ పంటలు సాగుచేసి ఆదాయం పొందాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు, ప్రజలు సోలార్ సిస్టమ్ను వాడుకున్నట్లయితే కరెంటు సమస్యలు తలెత్తవన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు విద్యుత్ వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను కూడా ఎత్తులో నిర్మించుకుంటే మూగజీవాలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉంటాయన్నారు. బోరు మోటార్ల దగ్గర నాణ్యమైన తీగలు, స్టార్టర్లను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం రజితసుధీర్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, రెడ్కో డీఎం సంతోష్, డీఈలు రాజునాయక్, ప్రసాద్రావు, ఏిఈ శ్రీనివాస్, ఏఈ శివకుమార్, రైతులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నాగార్జునసాగర్ : రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. గురువారం నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరాన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన రైతు డిక్లరేషన్ ప్లెక్సీలు, కాపీలకు పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందన్నారు. రూ.2లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో రైతులకు సాగునీరు అందించడం, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతు డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని హామీలను తక్షణమే అమల చేయాలన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.ఫ సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫ రైతు డిక్లరేషన్ కాపీలకు పిండ ప్రదానం -
కుమారుడు భూమి లాక్కున్నాడని తల్లి నిరసన
చందంపేట : నా పేర ఉన్న భూమిని నా కుమారుడు ఆయన పేరిట మార్చుకున్నాడని, వెంటనే తనకు న్యాయం చేయాలని చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు నక్క లింగమ్మ కోరింది. ఈ మేరకు ఆమె గురువారం చందంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారుడు నక్క వెంకటయ్య తనకు తెలియకుండా పెన్షన్కు వేలిముద్ర పడుతలేదని నమ్మబలికి తన సంతకం తీసుకొని తన పేర ఉన్న 1.13 ఎకరాల భూమిని మోసపూరితంగా ఆయన పేరిట మార్చుకున్నాడని పేర్కొంది. తన కొడుకు తనను సరిగా పట్టించుకోడని, తన బాగోగులు కూడా చూడడని, కుమార్తెలే చూస్తారని ఆమె వాపోయింది. ఈ విషయమై తహసీల్దార్ శ్రీధర్బాబు స్పందిస్తూ ఫిర్యాదు అందజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆసరా.. అందించేలా!
ఆసరా పింఛన్ల కోసం చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు రికార్డులో నమోదు చేశాం. క్షేత్ర స్థాయికి సిబ్బందిని పంపి అర్హులను ఎంపిక చేయిస్తాం. వెబ్సైట్ ఓపెన్ కాగానే దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తాం. – శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని 48 డివిజన్లలో ఆసరా పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పరిశీలిస్తోంది. ఒక్కొక్కరు రెండుసార్లు దరఖాస్తులు చేసుకున్న వారు ఉండడంతో డివిజన్ల వారీగా దరఖాస్తులను విభజించేందుకు లబ్ధిదారులను తేల్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2023 నుంచి చేసుకున్న వాటితోపాటు 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 1,870తో కలిపి మొత్తం 4వేలకుపైగానే ఆసరా పింఛన్ దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. కానీ, కొందరికి ఓకే చేసి మిగతా దరఖాస్తులను పక్కన పెట్టారు. తెరుచుకోని ఆన్లైన్ సైట్ ఆసరా పింఛన్ల కోసం నల్లగొండ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రోజూ 20 నుంచి 30 మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్ల దరఖాస్తులను ఆన్లైన్ చేసేకి సైట్ను మూసేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసరా పింఛన్లకు సంబంధించి ఆన్లైన్ సైట్ మూసివేయడంతో దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అర్హులను తేల్చే పనిలో యంత్రాంగం ఆసరా పింఛన్ల కోసం గతం నుంచి చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం క్షేత్ర స్థాయికి సిబ్బందిని పంపి అర్హులను తేల్చి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆసరా పింఛన్ల ఆన్లైన్ సైట్ ఓపెన్ కాగానే దరఖాస్తుదారుల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఫ నీలగిరిలో పింఛన్ అర్జీలను పరిశీలిస్తున్న యంత్రాంగం ఫ లబ్ధిదారులను తేల్చేందుకు కసరత్తు ఫ 2023 నుంచి ఇప్పటి వరకు 4 వేలకుపైగా దరఖాస్తులు -
‘కార్పొరేట్‘ కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించి ఉచిత విద్యనందించేందుకు రెసిడెన్షియల్ వసతి, విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్న జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు వి.వెంకటకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రిప్యూటెడ్ జూనియర్ కళాశాలలను 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ఎంపిక చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల కళాశాలలు అయిదేళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొపైల్ ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కళాశాల ఈపాస్ యూజర్ ఐడీ, పాస్వర్డులతో లాగిన్ అయి వారి కళాశాలలను రిజిస్ట్రేషన్ చేసుకుని హార్డు కాపీని సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 12న సాయంత్రం 5 గంటలలోగా తమ కార్యాలయంలో అందజేయాలని కోరారు. కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తులురామగిరి (నల్లగొండ): నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సంర ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 20 సీట్లు, 3వ తరగతి 1 సీటు ఖాళీ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. టైలరింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ నల్లగొండ : నల్లగొండలోని రాంనగర్లో గల ఎస్బీఐ ఆర్సెటి (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ సియాజిరాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 9701009265 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలిదేవరకొండ : వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్రెడ్డి అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో శివగంగా ట్రేడర్స్, తిరుమల రోటరీ ఆయిల్ మిల్, నందిని సంస్థలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు వ్యాపారులు ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారని, అలాగే 15 లీటర్ల టిన్ల నుంచి గానుగ యంత్రం ద్వారా లూజ్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పలు దుకాణాల నుంచి ఆయిల్ నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. గానుగ కేంద్రాల్లో నాణ్యమైన ముడి పదార్థాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆ శాఖ సిబ్బంది ఉన్నారు. నేడు ‘జనగణన రన్’నల్లగొండ : జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఉదయం 7 గంటలకు నల్లగొండలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు శ్రీజనగణన అవగాహన రన్ఙ్ నిర్వహించనున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రన్లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య పాల్గొంటారని తెలిపారు. సాగర్ ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా రాజు నాగార్జునసాగర్ : స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) నాగార్జునసాగర్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్గా బి.రాజు గురువారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన విజయభాస్కర్రావు బదిలీపై హైకోర్టు రక్షణ విధులకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేసిన రాజు నాగార్జునసాగర్కు వచ్చారు. రాజుకు సాగర్డ్యాం, జెన్కో ఆర్ఐలు ప్రతాప్నాయుడు, శ్రీనివాసరావు సిబ్బంది స్వాగతం పలికారు. -
బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివి
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ కవి డాక్టర్ బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివని ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో బోయ జంగయ్య వర్ధంతి సభను నిర్వహించారు. జంగయ్య చిత్రపటానికి జిల్లా కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బోయ జంగయ్య రచయితగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. జంగయ్య సాహితీ సేవలకు గుర్తింపుగా నల్లగొండలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు. సాహితీవేత్త, సినీ విమర్శకుడు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య మాట్లాడుతూ బోయ జంగయ్య మానవీయ కోణంలో చేసిన రచనలు అందరికీ స్ఫూర్తిని కలిగించాయన్నారు. విశిష్ట అతిథి పున్న అంజయ్య మాట్లాడుతూ బోయ జంగయ్య తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. కార్యక్రమంలో రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జీవకవి మునాసు వెంకట్, డాక్టర్ పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, డాక్టర్ మహమ్మద్ హసేన, డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, బండారు శంకర్, దున్న యాదగిరి, దర్శనం అంజయ్య, డాక్టర్ చింతోజు మల్లికార్జునచారి, ఎలికట్టె శంకర్రావు, దాసరి శ్రీరాములు, బూర్గు గోపికృష్ణ, తరుణోజు భీష్మాచార్య, జంగయ్య కుటుంబ సభ్యులు చేతన్, సిద్ధార్థ్, నామా వెంకటేశ్వర్లు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, నల్లగొండ జిల్లా: హైడ్రా రాష్ట్రవ్యాప్త విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని.. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.‘‘కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టాం. ఇప్పుడున్న దరఖాస్తులను పరిష్కరించడమే ముందు ప్రాధాన్యత. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. కబ్జా విషయంలో హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.కబ్జా కోరల నుంచి 2100 భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మరో సంవత్సర కాలంలో లక్ష కోట్లు విలువ చేసే భూములను హైడ్రా కాపాడుతుంది. హైడ్రా పరిధిలోనే 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం’’ అని రంగనాథ్ చెప్పారు. -
లారీలు రావు.. ధాన్యం కదలదు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లారీలు లేకపోవడంతో కొన్నిచోట్ల కాంటా లు వేయడం లేదు. కాంటాలు వేసినచోట్ల ధాన్యాన్ని నింపి పక్కన పెట్టేస్తున్నారు తప్ప మిల్లులకు తరలించడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలకు రాని లారీలు యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం 800 లారీలు అందుబాటులో ఉంచామని పౌరసరఫరాల విభాగం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మూడు నాలుగు రోజులు గడిచినా లారీలు రాని కొనుగోలు కేంద్రాలు చాలా ఉన్నాయి. అడవిదేవులపల్లి మండలం కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి 20 రోజుల్లో కేవలం 17 లారీలే వచ్చాయి. నాలుగు రోజుల క్రితం ఒక లారీ మాత్రమే వచ్చింది. ఆ తరువాత మళ్లీ జాడే లేవు. నిర్వాహకులను అడిగితే లారీలు అందుబాటులో లేవంటున్నారని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత్యంతరం లేక సోమవారం రాస్తారోకో చేశారు. దీంతో అధికారులు వచ్చి లారీలను పంపిస్తామన్నారు. కానీ మంగళవారం కూడా ఒక్క లారీ రాలేదు. 459 కేంద్రాల్లో కొనుగోళ్లు జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం మార్కెట్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వాటిల్లోకి ఇప్పటికే 6.62 లక్షల మెట్రిక్ ధాన్యం మార్కెట్ వచ్చింది. అందులో ఇప్పటి వరకు 3.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందులో 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు పంపించామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నారు. అస్తవ్యస్తంగా కొనుగోళ్లు.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. కొనుగోళ్లు ప్రారంభమై నెల గడిచినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏ సెంటర్లో చూసినా 20 నుంచి నెల రోజులపైగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్కో కేంద్రానికి 2 లారీలు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. అయితే వచ్చిన లారీల యజమానులు మాత్రం మిల్లర్లు ధాన్యం దింపుకోవడం లేదని, అక్కడే వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఫ మూడు రోజులకోసారి వస్తున్న లారీలు ఫ సకాలంలో కాంటాలు వేయని సిబ్బంది ఫ రోజుల తరబడి రైతుల నిరీక్షణ ఫ లారీలు పంపాలని అడవిదేవులపల్లిలో ధర్నా చేసిన రైతులు -
మార్కెట్లకు మెండుగా ఆదాయం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 మార్కెట్లకు గాను అన్ని మార్కెట్లు మంచి ఆదాయాన్ని గడించాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవసాయ మార్కెట్లకు కలిపి రూ.78.26 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దామరచర్ల మినహా మిగతా పది మార్కెట్లు రూ.80.20 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. మిర్యాలగూడకు అధికంగా.. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నిడమనూరు, హాలియా, నల్లగొండ, నకిరేకల్, చిట్యాల, చండూర్, వెంకటేశ్వరనగర్ (మాల్) వ్యవసాయ మార్కెట్లలో అత్యధికంగా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ రూ.32 కోట్ల 53 లక్షల ఆదాయం సమకూరింది. దేవరకొండ, చండూరు మార్కెట్ కమిటీలు లక్ష్యం కంటే తక్కువగా.. ఆదాయాన్ని సాధించాయి. అత్యల్పంగా దామరచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ.76 లక్షల ఆదాయాన్ని మాత్రమే సమకూర్చుకుంది. దామరచర్ల మార్కెట్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆదాయానికి సంబంధించిన లక్ష్యం నిర్దేశించలేదు. ఆదాయం వచ్చేది ఇలా.. మిల్లర్లు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర వ్యాపారులు, పత్తి, బత్తాయి వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేసే ధాన్యం ఇతర పంటలపై వ్యవసాయ మార్కెట్లకు సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వ్యాపారులు మన జిల్లా నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లే ఉత్పత్తులపై కూడా ఆయా మార్కెట్ కమిటీలకు చెక్పోస్టుల వద్ద సెస్ చెల్లించడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. మార్కెట్ కమిటీల ఆదాయం ఇలా (రూ.లక్షల్లో) మార్కెట్ లక్ష్యం ఆదాయం మిర్యాలగూడ 3238.93 3253.08 దేవరకొండ 757,13 675.11 నల్లగొండ 720.71 779.84 నకిరేకల్ 494.10 601.12 హాలియా 476.18 540.58 నిడమనూరు 419.64 459.77 చిట్యాల 419.83 424.09 చండూరు 468.96 332.15 వీటీనగర్ 694.06 721.86 శాలిగౌరారం 136.97 156.28 దామరచర్ల – 76.09 మొత్తం 7826.51 8019.97 ఫ లక్ష్యానికి మించి సమకూర్చుకున్న మార్కెట్ కమిటీలు ఫ 2025 – 26 సంవత్సరానికి టార్గెట్ రూ.78.26 కోట్లు ఫ సాధించింది రూ.80.20 కోట్లు 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నీ లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇదే ఉత్సాహంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటాం. – ఛాయాదేవి, మార్కెటింగ్ అధికారి -
నిస్వార్థ సేవతోనే ప్రజల్లో మంచి గుర్తింపు
నకిరేకల్ : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే ప్రజాప్రనిధులకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మున్సిపల్ పాలవర్గం ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియడంతో మున్సి పల్ కార్యాలయం ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన వీడ్కోలు, సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని పదవులు అధిరోహించేలా ప్రజలకు సేవలందించాలన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి పాలకవర్గం చేసిన కృషి ఎనలేదని కొనియాడారు. ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందారని అభినందించారు. మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, గాజుల సుకన్య, పన్నాల పావని శ్రీనివాస్రెడ్డి, యాసారపు లక్ష్మీవెంకన్న, మట్టిపల్లి కవితా వీరు, గర్శకోటి సైదులు, పోతుల సునీత రవీందర్, చౌగోని అఖిల లక్ష్మీనారయణ, చౌగోని రాములమ్మ సైదులు, గడ్డం స్వామి, వంటెపాక సోమలక్ష్మి, బానోతు వెంకన్న పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఫ ముగిసిన నకిరేకల్ మున్సిపల్ పాలవర్గ పదవీకాలం -
ఎన్ని రోజులు ఎదురుచూడాలి
కేంద్రానికి 40 క్వింటాళ్ల ధాన్యం తెచ్చి 20 రోజులు అవుతోంది. ఇప్పటివరకు ఐదు లారీల ధాన్యం పంపారు. మళ్లీ లారీలు రాలేదు. రోజూ అడిగితే వస్తాయని చెబుతున్నారు. కానీ రావడం లేదు. ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతుందోనని భయమేస్తోంది. – ఎలవర్తి అంజయ్య, గుండ్రపల్లి, చండూరు 15 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం. తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోలు చేయలేదు.ఽ నాలుగు రోజుల క్రితం మా ధాన్యం కొన్నారు. కానీ అప్పటి నుంచి లారీలు రావట్లేదు. దీంతో ధాన్యం బస్తాలో నింపి పక్కన పెట్టారు. లారీల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. – నాగిళ్ల ప్రవీణ్, పోలేపల్లి, చందంపేట ఐకేపీ సెంటర్కు 300 బస్తాల ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతోంది. ఇంతవరకు కాంటా వేయలేదు. ఇక నాలుగు రోజుల నుంచి లారీలు రావడం లేదు. దీంతో కాంటాలు వేయడం ఆపేశారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది. – జానయ్య, ఆమనగల్లు, వేములపల్లి మండలం -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
నిర్లక్ష్యంగా వాహనాలు నడపొద్దు
నల్లగొండ : మద్యం తాగి నిర్లక్ష్యంగా అధిక వేగంగా వాహనాలు నడపొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్ను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇతర వాహనదారుల పొరపాట్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తంగా వాహనం నడిపితేనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు, నిర్దేశిత వేగ పరిమితి పాటించాలన్నారు. వాహనాలను ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదన్నారు. వాహనాలను రోడ్డు వెంట నిలిపినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ కోన్స్, రిఫ్లెక్టర్ స్టిక్కర్లు, ఇండికేటర్లు ఉపయోగించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారి టోల్ప్రీ నంబర్ 1033 కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రమాదాలు జరగకుండా భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి లేదన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం కింద ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తికి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, రిటైర్డు సీఐ అంజయ్య, మిర్యాలగూడ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాంద్పాషా, సెక్రటరీ రవీందర్రావు, పోలీసులు పాల్గొన్నారు.ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయండి
రామగిరి (నల్లగొండ) : రైతులు డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ రైతు వేదికలో జరిగిన రైతు వారోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డులను ప్రారంభించిందని, గ్రామాలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా భూముల సారవంతం పరిశీలిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ వంటి సౌకర్యాలు వినియోగించుకుని లాభాలు పొందవచ్చన్నారు. వరిలో దొడ్డు బియ్యం కాకుండా సన్నరకాలను పండించాలన్నారు. తిప్పర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న భూమిని రైస్ మిల్ ఏర్పాటుకు నాబార్డు అధికారులను సంప్రదిస్తామన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. రైస్ మిల్లర్లు, లారీల కొరత, వర్షం తదితర కారణాల వల్ల కొనుగోళ్లలో కొంత జాప్యం జరుగుతుందని, సమస్యలన్నీ అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం ధాన్యం తరలించేందుకు 900 లారీలు ఏర్పాటు చేశామని, కేవలం 20 రోజుల్లో 3 లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం మిల్లుల్లో దిగుమతి సమస్య లేదన్నారు. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పత్యానాయక్, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నరాజు, సహదేవరెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఎల్డీఎం శ్రామిక్, డీఏఓ శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
రేపు మత్స్యకారులకు అవగాహన సదస్సు
నల్లగొండ టూటౌన్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో ఈనెల 8న ఉదయం 10 గంటలకు మత్స్యకారులకు, మత్స్య రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి రాజారామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ సదస్సుకు మత్స్య మార్కెటింగ్, లైసెన్స్దారులు, మత్స్య సంఘాల సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. యాదగిరి క్షేత్రంలో స్థానిక బదిలీలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈఓ భవానీ శంకర్ పలు విభాగాలకు సంబంధించిన అధికారులను స్థానికంగా బదిలీలు చేశారు. సుమారు 25 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిసెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వెంటనే తమకు కేటాయించిన విభాగాల్లో చేరాలని ఈఓ ఆదేశించారు. మెరుగైన ర్యాంకు సాధిద్దాంనల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ సర్వేక్షన్లో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఉద్యోగులమంతా కృషి చేద్దామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర అన్నారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యోగులతో నిర్వహించి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్–2026లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా ఉద్యోగులు, సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. వేసవిలో నగరంలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. జంక్షన్ల వద్ద షేడ్ నెట్స్ ఏర్పాటు చేసి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు. సమావేశంలో ఈఈ రాములు, ఏసీపీ కృష్ణవేణి, డీఈ అశోక్, ఆర్వో శివరాంరెడ్డి, ఏఈ అసీంబాబా తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం వద్ద ట్రాఫిక్ జామ్ భూదాన్పోచంపల్లి : భూదాన్పోచంపల్లి మండల శివారులోని కొత్తగూడెం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయల లోడ్లతో లారీలు, ట్రక్కులు, ఆటోలు, మినీవాహనాలు కొత్తగూడెం వద్ద ఉన్న పండ్ల మార్కెట్కు వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెంట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తుండడంతో పోచంపల్లికి నుంచి వచ్చే పోయే వాహనాలు, బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో హైదరాబాద్కు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను బుధవారం మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నేత గుత్తి బాలశంకర్.. భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందిస్తూ వనస్థలిపురం ట్రాఫిక్ ఏసీపీ నవీన్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఎంపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్ సమస్యను గురువారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. -
డిగ్రీలో కొత్త కోర్సులు
ఫ ఏఈడీపీ పేరుతో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి.. ఫ నల్లగొండలోని ఎన్జీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభం ఫ ఒక్కో కళాశాలలో మూడు కోర్సు.. ఒక్కో దాంట్లో 60 సీట్లురామగిరి (నల్లగొండ) : విద్యారంగంలో నూతన విద్యాప్రమాణాలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. వచ్చే 2026–27 విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ (ఎన్జీ), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో డిగ్రీలో అత్యాధునిక అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్(ఏఈడీపీ) కోర్సులను ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో ప్రారంభమవుతున్న ఈ ప్రత్యేక కోర్సులు విద్యార్థులకు విద్యతోపాటు పరిశ్రమ అనుభవాన్ని సమాంతరంగా అందించే వినూత్న కార్యక్రమంగా నిలువనున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యార్థులు డిగ్రీ చదువుతో పాటు పరిశ్రమలలో ప్రత్యక్ష శిక్షణ పొందుతూ, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రతి కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉండగా, అడ్మిషన్లు తెలంగాణ ప్రభుత్వ ఈౖ ఖీ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధిత సైన్స్, కామర్స్ కోర్సులు అత్యుత్తమ అవకాశాలను అందించనున్నాయి. ఎన్జీ కాలేజీలో ప్రారంభించే ఏఈడీపీ కోర్సులు ఇవే.. ఫ బీఎస్సీ ఈ అండ్ మొబిలిటీ అండ్ బాటరీ ఫ బీఎస్సీ ఫార్మాక్యుటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఫ బీకామ్ బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో.. ● బీకామ్ బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ● బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్ ● బీఎస్సీ ఫార్మాక్యుటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ. -
ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!
నల్గొండ జిల్లా: ప్రహరీ నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదంలో తన భర్త గిరగాని సురేశ్ను శాలిగౌరారం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గిరగాని జ్యోతి బుధవారం విలేకరులకు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తమ సమీప బంధువైన గిరగాని వీరమ్మకు చెందిన ఇంటి స్థలంలో యనమల్ల శంకర్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మిస్తుండగా.. ఈ నెల 1న తన భర్త గిరగాని సురేశ్, యనమల్ల శంకర్ మధ్య గొడవ జరిగిందని ఆమె పేర్కొంది.దీంతో శంకర్ అదేరోజు రాత్రి డయల్ 100కు ఫోన్ చేయడంతో ఇద్దరు పోలీసులు గ్రామానికి వచ్చారని.. వారికి, తన భర్త మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. దీంతో మరుసటిరోజు తన భర్తను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. సురేశ్ను కొట్టలేదు..ఈ నెల 1న యనమల్ల శంకర్, గిరగాని సురేశ్లు గొడవపడి కొట్టుకున్నారని, డయల్ 100కు ఫోన్ రావడంతో తమ కానిస్టేబుళ్లు శ్రీను, విక్రమ్ చిత్తలూరు గ్రామానికి వెళ్లి ఘర్షణపై విచారణ జరిపినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఈ క్రమంలో గిరగాని సురేశ్, అతడి తండ్రి గిరగాని వెంకన్న, దేశగాని విఠల్ తమ కానిస్టేబుళ్లతో గొడవపడి రాళ్లతో దాడి చేశారని ఎస్ఐ వివరించారు.ఇద్దరు కానిస్టేబుళ్లు కాగా.. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఈ నెల 2న అరెస్ట్ చేసి నకిరేకల్ కోర్టులో హాజరుపర్చామన్నారు. సురేశ్పై కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వెంటనే కోర్టులో హాజరుపర్చామన్నారు. ఇరువర్గాల ఘర్షణలో సురేశ్కు దెబ్బలు తగిలి ఉంటాయే తప్ప పోలీస్ స్టేషన్లో ఎవరూ కొట్టలేదని, కావాలనే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. -
పథకాలు రైతులకు చేరేలా..
ప్రభుత్వం ఆరు రోజుల పాటు నిర్వహించనున్న రైతు వారం కార్యక్రమంలో రైతులు పాల్గొని వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన పొందాలి. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలయ్యే పథకాల గురించి, సాగు పద్ధతులను తెలుసుకుని అమలు చేయాలి. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వారం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు రైతు వారం కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం, ఇతర అంశాలపై ఆయా శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఆరు రోజులపాటు కార్యక్రమాలు ఇలా.. సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి నేల ఆరోగ్య పరిరక్షణ సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అదే విధంగా పౌర సరపరాల శాఖ వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. భూసార పరీక్షల నిర్వహణ కోసం మట్టి నమూనాలను సేకరించనున్నారు. మంగళవారం ఉద్యానవన, మత్స్య శాఖతో పాటు మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంపుదల ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు ప్రభుత్వం అందించే సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంటల దిగుబడులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. బుధవారం బ్యాంకులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. బ్యాంకుల ద్వారా రైతులకు అందించే దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల అవగాహన కల్పిస్తారు. గురువారం నియోజకవర్గ స్థాయిలో విద్యుత్, రెడ్కో శాఖల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. అందులో వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ, రుణాలపై ప్రభుత్వ సబ్సిడీ వినియోగం లాభాలపై అధికారులు రైతులకు వివరించనున్నారు. శుక్రవారం పశు సంవర్థక శాఖ, మత్స్య, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పాడిపరిశ్రమ, పశు జాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణపై గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చెరువులో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, మత్స్య అధికోత్పత్తిపై వివరించానున్నరు. శనివారం గ్రామస్థాయిలో రైతులతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మతు, కాల్వలు, చెరువుల్లో కంపచెట్లు, గుర్రపుడెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నేటి నుంచి రైతు వారం ఫ వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహణ ఫ ఆరు రోజులపాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన -
సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’
నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుంచి నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అందాస్ జానయ్య తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో యూనివర్సిటీ సైంటిస్టులు, వివిద పరిశోధన కేంద్రాలకు చెందిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 గ్రామాల్లో లక్షలాది మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రధానంగా అధిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల వాడకం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారం పరిరక్షించడంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పించి రైతుల ఆదాయ పెంపుపై శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే కంపాసాగర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.లింగయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ జి.శివప్రసాద్, కె.సంధ్యారాణి, జి.స్వాతి, ఎ.రాములమ్మ, హిమబింధు, సాయిప్రియ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
నీట్కు 53 మంది గైర్హాజర్
నల్లగొండ : నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్) ఆదివారం నల్లగొండలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు మహిళా డిగ్రీ కాలేజీ, ఎన్జీ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్జీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 6 కేంద్రాల్లో 2,038 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,985 అభ్యర్థులు హాజరయ్యారు. 53 మంది గైర్హాజర్ అయ్యారు. పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ.. జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ తనిఖీ చేశారు. రామగిరిలోని మహిళా డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీ కలిసి తనిఖీ చేయగా.. ఎంజీయూ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. -
జాబ్మేళా విజయవంతం
నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ప్రధాని సభను విజయవంతం చేయాలి నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు కావాలన్నారు. సమావేశంలో బోగరి అనిల్కుమార్, రాజు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలంమునుగోడు : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిరిపారి వెంకటేశ్వర్లు అన్నారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మునుగోడులో ఆ సంఘం జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బండారి శంకర్, నాయకులు చాపల శ్రీను, విప్లవ్కుమార్, బద్దుల శశి, అందుగుల మహేష్, పాండు పాల్గొన్నారు. -
నెల్లిబండ జాతర ప్రారంభం
నకిరేకల్ : మండల పరిధిలోని నెల్లిబండ గుట్ట మీదున్న లింగమంతుల స్వామి, సౌడమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. జాతర సందర్భంగా నెల్లిబండ గుట్టంతా మూడు రోజులపాటు భక్తులతో నిండిపోతుంది. ఆదివారం రాత్రి నెల్లిబండ గ్రామంలోని మిద్దెగూడెం నుంచి భజన, బేరీ చప్పుళ్లతో దేవరను ఊరేగింపుగా తీసుకుని గట్టుమీదికి చేర్చడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి జాతర కార్యక్రమాలు సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7గంటలకు కుంకుమార్చన, కంకణధారణ, 8 గంటలకు బోనాలు, యాటల బలి, సాయంత్రం 5గంటలకు ఆకువంచమభోనం, 5వ తేదీన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పసుపు కుంకుమలతో దేవుడి పటం (చిత్రపటం) వేస్తారని ఆలయ చైర్మన్ యానాల యాదగిరెడ్డి, సర్పంచ్ ఆడెపు రాఘవులు తెలిపారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగం
సాక్షి నెట్వర్క్ : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లపైకప్పు లేచిపోయింది. మిర్యాలగూడ సమీపంలోని గూడూరు, యాద్గార్పల్లి, శెట్టిపాలెం, అవంతీపురం వద్దనున్న రైస్ మిల్లుల్లో గోదాముల పైకప్పు రేకులు లేచిపోయాయి. కొన్ని మిల్లుల్లో కరెంట్ పరికరాలు కాలిపోయాయి. బాయిలర్ చిమ్నిలు ధ్వంసమయ్యాయి. పగలు ఎండ.. సాయంత్రం వర్షం జిల్లాలో మూడు నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. దాంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. రైతుల పరుగులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకునేందుకు ప్రయత్నించగా ఈదురు గాలులు, వర్షం దాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడ్డారు. చాలాచోట్ల కాంటా వేసిన బస్తాలు తడిసిపోయాయి. రాశుల కిందికి వర్షపు నీరు చేరింది. ఫ పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల బీభత్సం ఫ విరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ఫ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం -
ఆరోగ్యమే గొప్ప సంపద
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ నల్లగొండలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్ నల్లగొండ టూటౌన్ : మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానం నుంచి ఏర్పాటు చేసిన 2కే, 5కే, 10కే రన్లను ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సొసైటీ ఫర్ తెలంగాణ రన్ను అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. జూన్ 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరగనున్న రన్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్, అదనపు ఎస్పీ రమేష్, ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేష్, డాక్టర్లు పుల్లారావు, రాఘవ సంకోజు, సునిల్, సతీష్, నిఖిల్, చంద్రశేఖర్, అనితారాణి, డీఎస్పీ శివరామిరెడ్డి, అవంతిక కన్స్ట్రక్షన్ ఎండీ ఎన్నం హేమంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్ చేస్తున్న యువతి -
లక్ష్మీనరసింహుడికి వసంతసేవ
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం అర్చకులు వసంతసేవ, చక్రతీర్థం, మహాలక్ష్మీహోమం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వైఖానస సంప్రదాయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం, ప్రత్యేకఅర్చనలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో వసంతసేవ, చక్రతీర్థస్నానానికి స్వామి, అమ్మవార్లను తరలించారు. ప్రహ్లాద స్నానఘట్టం వద్ద అర్చకులు, ధర్మకర్తలు ప్రభోది మంత్ర పుష్పనీరాజనాలతో రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామికి వసంతసేవ, చక్రతీర్థస్నానం నిర్వహించారు. అనంతరం హోమం మహాపూర్ణాహుతి, పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, బజ్జూరు వెంకటరమణ, కాంతారావు, ఈఓ జ్యోతి, సహాయ యాజ్ఞికుడు నారాయణం హరికిరణాచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
333 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
నల్లగొండ : విద్యా శాఖ మొదట నుంచీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం వల్లే జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 98.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం వివిధ కేటగిరీల కింద 448 హైస్కూళ్లు ఉంటే అందులో 333 పాఠశాలల్లో విద్యార్థులు పదిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన స్కూళ్లలో చాలా వరకు 90 శాతంపైనే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను దత్తత తీసుకుని.. పాఠశాలల వారీగా హెడ్మాస్టర్ల చొరవతో సబ్జెక్టు టీచర్లతో కోఆర్డినేషన్ చేసుకుని విద్యార్థులను కొందరు ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు వారి తల్లిదండ్రులకు వేకప్ కాల్ చేసి పిల్లలను నిద్ర లేపించి చదివించేలా కృషిచేశారు. ప్రత్యేక తరగతులకు సమయానికి హాజరయ్యేలా అవగాహన కల్పించారు. పాఠశాలకు వచ్చిన పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇదే క్రమంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి పాఠంపై స్లిప్ టెస్టు టెస్టులు నిర్వహించారు. రివిజన్ సందర్భంలో మోడల్ పేపర్లతో పరీక్షలు పెట్టి విద్యార్థుల్లో వార్షిక పరీక్షలంటే భయం తొలగించారు. వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాక పరీక్షకు పరీక్షకు మధ్యలో ఉన్న గ్యాప్లో ఆయా సబ్జెక్టు టీచర్లతో సందేహాలు నివృత్తి చేశారు. దాంతో పదిలో మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. ఫ రోజూ వేకప్ కాల్ చేసి విద్యార్థులు చదివేలా కృషి ఫ రెండుపూటలా ప్రత్యేక తరగతులు ఫ పక్కా ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాల సాధన హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, సబ్జెక్టు టీచర్ల కృషితోనే పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాం. జిల్లాలో 488 హైస్కూళ్లు ఉంటే అందులో 333 స్కూళ్లు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా 98.48 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఈసారి పదో స్థానంలో నిలిచింది. – భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి -
మూసీని సందర్శించిన సీడబ్ల్యూసీ ఎస్ఈ
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సూపరింటెండెంట్ ఇంజనీర్ కొల్లు సురేఖరాణి గురువారం సందర్శించారు. ప్రాజెక్టు అధికారులతో కలసి డ్యాం గేట్లు, స్పిల్వే, రిజర్వాయర్లో నీటి నిల్వలను పరిశీలించారు. ప్రాజెక్టును ఎప్పుడు నిర్మించారు, గరిష్ట నీటినిల్వ సామర్ధ్యం, ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వెళ్లే వరదనీటి సామర్ధ్యం, ప్రాజెక్టు కింద సాగవుతున్న ఆయకట్టు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిర్వాయర్లో పూడిక బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన స్కవర్ గేట్లను కాంక్రీట్ వేసి శాశ్వతంగా ఎందుకు మూసివేశారని అధికారులను ఆమె ప్రశ్నించగా.. స్కవర్ గేట్లు తరచూ మరమ్మతులకు గురై నీరు లీకవుతుండటంతో 30 ఏళ్ళ క్రితమే అప్పటి అధికారులు సీజ్ చేశారని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టు మెయింటనెన్స్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్రెడ్డి, జేఈ మధు, సిబ్బంది ఉన్నారు. -
అడుగడుగునా అడ్డంకులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అడుగడుగునా కొర్రీలు, అధికారుల అలసత్వం వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఽఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రైతుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం ఇరకాటంలో పడుతున్నారు. అది తట్టుకోలేకనే తాజాగా కనగల్ మండలం బచ్చన్నగూడెం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. మొదట నుంచీ జాప్యమే.. ఏప్రిల్ 2వ తేదీన ధాన్యం కొనుగోల్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మిల్లర్లు తాలు పేరుతో కిరికిరి పెడుతూనే ఉన్నారు. అధికారులు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పినా, పెడచెవిన పడుతున్నారు. ఐకేపీ, ఇతర ప్రభుత్వ కొనుగోలు సంస్థల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మాత్రం తాలు ఉందంటూ దించుకోవడం లేదు. రైతులే స్వయంగా మిల్లుల వద్దకు వెళ్లి కోతలకు ఒప్పుకుంటేనే ఽఆ ధాన్యాన్ని దింపుకుంటున్నారు. దీంతో లారీలు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది. బయటి ధాన్యం యథేచ్ఛగా దిగుమతి ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటూ మిల్లర్లు దిగుమతులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు ఎందుకు ఆగిపోతున్నాయి.. అసలు ఏదైనా మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎంత? వెళ్లిన లారీలు ఎన్ని? ఎందుకు ధాన్యం దింపుకోవడం లేదు? నిజంగా మిల్లర్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలన్నది నిర్ణయించాల్సిన అధికారుల కమిటీ ఏం చేస్తోంది? అన్న దానికి సమాధానాలు లేకుండాపోయాయి. దీంతో మిల్లర్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ధాన్యం దింపుకోకపోతే ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటీ రెండు మిల్లులకు పంపిన ధాన్యం ఎంత? వారు దింపుకున్నది ఎంత? మిలుల్లోకి వచ్చిన ధాన్యం ఎంత? అన్న లెక్కలు తేల్చితే జరిగిందేంటన్నది తేలే అవకాశం ఉంది. రైతుల నుంచి ఒత్తిడి.. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కల్లాల వద్ద బసాకు 42 కేజీలు తూకం వేసి మిల్లుల వద్దకు పంపించినా, మిల్లర్లు అక్కడ మళ్లీ తాలు ఉందంటూ కొర్రీలు పెట్టి దిగుమతి చేసుకోవడం లేదు. వాస్తవానికి కొనుగోలు కేంద్రంలోనే అధికారులు ధాన్యాన్ని చెక్ చేసి, నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తారు. అలా వెళ్లిన ధాన్యాన్ని దింపుకోకుండా ఆపడానికి, మిల్లర్లు అదనపు కోతలు విధించడానికి ఉన్న నిబంధనలేంటి? ఈ విషయంలో పట్టించుకునేవారు లేకుండాపోయారు. మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలు! అధికారులు మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైకి మిల్లర్లకు గట్టిగా చెబుతున్నామని కనిపిస్తున్నా, అధికారులు మిల్లర్లు చెప్పేదానికే తలాడిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే నెల రోజుల్లో 5 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసి మిల్లులకు పంపితే, మిల్లర్లు తాము ధాన్యం దిగుమతి చేసుకున్నట్లుగా అకనాలెడ్జిమెంట్ ఇచ్చిన ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులకు మించకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఫ కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు ఫ గందరగోళంగా ధాన్యం కొనుగోళ్లు ఫ రైతుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఫ తాజాగా కనగల్లో ఆత్మహత్యకు యత్నించిన కేంద్రం నిర్వాహకుడు ఫ ఏటా ఏప్రిల్ చివరినాటికి సగానికిపైగా విక్రయం ఫ ఈసారి సగం కొనుగోళ్లు కూడా పూర్తికాలే.. కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు సైదులు మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే మిల్లర్లు దింపుకోకపోవడం, ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోలేదు. మిల్లర్ల వద్దకు రైతులే వెళ్లి మాట్లాడుకోమని చెప్పమని సూచన చేయడం, మరోవైపు రైతులు కొనుగోలు కేంద్రంలో ఎలా కొన్నారని, మిల్లులో ఎందుకు ఆపుతున్నారని ఒత్తిడి చేయడంతో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు తాను రికార్డు చేసిన వీడియోలో పేర్కొన్నారు. దానిని బట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, అధికారులు, మిల్లర్ల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
సత్తాచాటిన ‘మైనార్టీ’ విద్యార్థులు
నల్లగొండ : పదో తరగతి ఫలితాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 13 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నల్లగొండ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న మొత్తం 64 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో 38 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరిలో సమీరా 560 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. సమీరా బేగం 559, వై.సానియా 558, జోహాషాజ్ 557 మార్కులు సాధించారు. విద్యార్థినులను జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ, ఇన్చార్జి టీఎంఆర్ఈఎస్ నల్లగొండ మహ్మద్ అబ్దుల్ ఖయ్యూం, ఆర్ఎల్సీ శ్రీకాంత్, షాహీన్ షేక్ ఉపాధ్యాయులు అభినందించారు.సమీరా బేగం జోహాషాజ్ఏకుల సన్య -
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
కొండమల్లేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభిభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం కొండమల్లేపల్లి మండలం కోల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరధిలోని రైతువేదిక సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాల భవన నిర్మాణానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అలాగే రూ.80 లక్షలతో చేపట్టే కేజీబీవీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. 15 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ విజ్ఞప్తి మేరకు పెండింగ్ నీటి ప్రాజెక్టుల పూర్తికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే కరువుండదు : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగం, పెండ్లిపాకల రిజర్వాయర్ ఎత్తు పెంపు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి కరువుండదన్నారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమనే నమ్మకంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. దేవరకొండలోని ప్రభుత్వ వైద్యశాలను 200 పడకల ఆసుపత్రిగా మార్చాలని మంత్రిని, మండలి చైర్మన్ను కోరారు. కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్యా శ్రీనివాస్రెడ్డి, దేవరకొండ మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ సరళ, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వేమన్రెడ్డి, కోల్ముంతల్పహాడ్ సర్పంచ్ రమావత్ సరస్వతిరవినాయక్, పసునూరి యుగంధర్రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖాశ్రీధర్రెడ్డి, దూదిపాల వేణుధర్రెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ఖాన్, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ కోల్ముంతల్పహాడ్లో యంగ్ ఇండియాస్కూల్ నిర్మాణానికి భూమిపూజ ఫ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్ హాజరు -
నెల రోజుల్లోనే రూ.8.80 కోట్లు
పెన్షన్దారుల బారులుఇంటర్ సప్లిమెంటరీకి ప్రత్యేక తరగతులు ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు రెమిడియల్ (ప్రత్యేక) తరగతులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు నల్లగొండ కలెక్టరేట్ నుంచి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో 15 ఇంటర్ కళాశాలలు ఉన్నాయని, మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షలు రాసిన విద్యార్థులలో 1982 మంది ఫెయిల్ అయ్యారని, వారికి ఏప్రిల్ 18 నుంచే హాఫ్ లైన్లో రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఐఈఓ అధికారి దస్రు నాయక్, బలప్రసాద్, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు. నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో ముందస్తు ఆస్తి పన్ను రికార్డు స్థాయిలో వసూలైంది. పభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ (ఎర్లీబర్డ్ స్కీం)ని నీలగిరి మున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి నీలగిరిలో 33 మంది వార్డు ఆఫీసర్లు ఎంతో కృషిచేశారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గేటెడ్ కాలనీలు, అపార్ట్మెంట్ బాధ్యులను కలిసి రాయితీపై ప్రచారం కల్పించడంతో కార్పొరేషన్ పెట్టుకున్న లక్ష్యానికి మించి పన్ను వసూలు చేశారు. నెల రోజుల్లోనే రూ.8.80 కోట్లు వసూలు చేసి నీలగిరి కార్పొరేషన్ యంత్రాంగం రికార్డు సృష్టించింది. డిమాండ్ రూ.18.50 కోట్లు.. నీలగిరి మున్సిపల్ పరిధిలోని 48 డివిజన్లలో 33 వేల వరకు భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి ఆస్తి పన్ను రూ.18.50 కోట్లు రావాల్సి ఉంటుంది. రూ.18.50 డిమాండ్కు గాను మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ఆఫీసర్లు ఒక్క నెలలోనే 13 వేల మంది మంది నుంచి రూ.8.80 కోట్లు వసూలు చేశారు. ఐదుశాతం రాయితీతో సాధ్యమైనంత ఎక్కువ పన్నువసూలు చేయాలనే లక్ష్యంతో నగర మేయర్ కమిషనర్ శరత్చంద్ర నిరంతరం రెవెన్యూ విభాగాన్ని పర్యవేక్షించడం, విస్తృతంగా ప్రచారం చేయించడంతో టార్గెట్ను మించిపోయారు. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.6.50 కోట్లు వసూలు చేయగా ఈ సారి అదనంగా రూ.2.30 కోట్లు వసూలు చేయగలిగి రూ.8.80 కోట్లకు చేరుకుకోవడం విశేషం. అయితే ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ అవకాశం గురువారంతో ముగిసింది. ఫ నీలగిరి కార్పొరేషన్లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు ఫ ఫలించిన వార్డు ఆఫీసర్ల కృషి ఫ ముగిసిన ఐదు శాతం రాయితీ గడువు -
థర్డ్ పార్టీతో సాయిల్ టెస్ట్ నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని బైపాస్ నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టిపై థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు చేయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని ఆర్అండ్బీ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్కు విన్నవించారు. ఈ సందర్భంగా వర్షిత్రెడ్డి మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారుల అధికారికి ఫిర్యాదు చేయగా ఇటీవల నమూనాలు సేకరించిన అధికారులు సరైన పరీక్షలు చేయలేదని పేర్కొన్నారు. తాము చూపించిన దగ్గర సాయిల్ టెస్ట్ చేయకుండా కాంట్రాక్టర్ను కాపాడేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంటనే థర్డ్ పార్టీ సాయిల్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. లేకుంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళతామన్నారు. వర్షిత్రెడ్డి వెంట ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు. -
నల్గొండ: ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్
నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం పిట్టపల్లిలో నోష్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 3వ బ్లాక్లో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో పేలుడు. ఇదే ఫ్యాక్టరీలో గత నెల 9న రియాక్టర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. -
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం
మిర్యాలగూడ అర్బన్ : కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్లను, ట్రాక్టర్ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మంగ్తా అక్కడికక్కడే మృతిచెందగా.. కురియా తండాకు చెందిన ధనావత్ భాస్కర్, కారు సర్వీసింగ్ సెంటర్లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగ్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్..!నల్గొండ జిల్లా మిర్యాలగూడ బై పాస్లో ఘోర రోడ్డు ప్రమాదంఉన్నట్లుండి బైకర్ అడ్డు రావడంతో అదుపుతప్పి రెండు బైకులను, రోడ్డు పక్కన నిలబడ్డ మరో ఇద్దరిని బలంగా ఢీకొట్టిన కారుఒకరు స్పాట్ డెడ్.. మరో నలుగురికి తీవ్ర గాయాలు pic.twitter.com/v42Lxtss6W— Telugu Scribe (@TeluguScribe) April 30, 2026న్యాయం చేయాలని రాస్తారోకో..మంగ్తా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మైసమ్మకుంట తండా గ్రామస్తులు ఘటనా స్థలంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై బైఠాయించారు. మూడున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్ను నియంత్రించారు. ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ.. మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
ధాన్యం తడవకుండా చూసుకోవాలి
నల్లగొండ : వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండలస్థాయి అధికారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. పెట్రోల్, డీజిల్పై సమీక్షిస్తూ ఎక్కడా నో స్టాక్ బోర్డు పెట్టకుండా చూడాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, తహసీల్దార్ స్థాయిలో ఉన్న అన్ని దరఖాస్తులు ఆర్డీఓ లాగిన్కి రావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
టెన్త్ ఉత్తీర్ణత 98.47%
ఫ రాష్ట్రంలోనే పదో స్థానంలో నల్లగొండ జిల్లా ఫ ఫలితాల్లో బాలికలదే పైచేయి నల్లగొండ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 98.47 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 11వ స్థానంలో ఉండగా.. ఈసారి 10వ స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 488 ఉన్నాయి. వీటి పరిధిలో 19,667 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 19,366 ఉత్తీర్ణత సాధించడంతో 98.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పై చేయిగా నిలిచింది. బాలురు 10,131 మంది పరీక్ష రాయగా 9,949 ఉత్తీర్ణులై 98.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,536 పరీక్ష రాయగా.. 9,417 మంది ఉత్తీర్ణులై 98.75 శాతం ఉత్తీర్ణత సాధించి బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. రీ కౌంటింగ్కు దరఖాస్తులు.. విద్యార్థులు మార్కులకు సంబంధించి రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశం ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఆన్లైన్ bse.telangana.gov.in ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు రీవెరిపికేషన్తో పాటు ఆన్సర్ బుక్ కావాల్సిన వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని పేర్కొన్నారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆయా పాఠశాలల ద్వారా మే 14వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
సాక్షి, నల్లగొండ: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో బయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు.దీంతో ఆ టీచర్ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. -
ఏఐకెఎంఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నకిరేకల్ : అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆసంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్ శుక్రవారం నకిరేకల్లో ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా జాల్వ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా గజ్జి రవి, వేముల శంకర్, జిల్లా ప్రదాన కార్యదర్శిగా అంబటి చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా సిలువేరు జానయ్య, అంబటి క్రిష్ణమూర్తి, కోశాధికారిగా పుట్ట సత్తయ్య, సభ్యులుగా బీరెడ్డి సత్తిరెడ్డి, కల్లూరి అయోధ్య, ముస్కు అనంతరెడ్డి, కుంభం వెంకటేషం, బూరుగు సత్తయ్య, అంబటి నర్సయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
నల్లగొండ – దేవరకొండ రోడ్డుపై వరుసగా ప్రమాదాలు
గుర్రంపోడు : నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారి గుర్రంపోడు మండల పరిధిలో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆరు నెలలుగా ప్రతి నెలా ఒకటి, రెండు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం అంటేనే బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా గుర్రంపోడు నుంచి తానేదార్పల్లి స్టేజీ వరకు గల రోడ్డులోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వద్దిరెడ్డిగూడెం సమీపంలో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరద్చంద్ర పవార్ సూచిక బోర్డులు, చెట్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని సూచించారు. ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరైనా కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు. వరుసగా జరిగిన ప్రమాదాలు ఇలా.. ● జనవరి 26న ప్రధాన రహదారిపై చెట్టుకు కారు ఢీ కొన్న సంఘటనలో నేరడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కంబాల శ్రీను మృతిచెందాడు. ఇతనికి మరో ఇరవై రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది. ● మార్చి 30న తానేదార్పల్లి వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొన్న ఘటనలో వడ్లపల్లి అంజిరెడ్డి మృతిచెందాడు ● ఏప్రిల్ 19న గుర్రంపోడులో శివారులో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న తెరాటిగూడెం గ్రామానికి చెందిన శిరబోయిన శ్రీకాంత్ మృతిచెందాడు. ● ఏప్రిల్ 22న రోజుల క్రితం వద్దిరెడ్డిగూడెం గ్రామం వద్ద జరిగిన కారు– బైక్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెంది మరో ముగ్గురు గాయపడ్డారు. ● డిసెంబర్ నెలలో మహబూబ్నగర్ జిల్లాలో సీఎం సభకు బందోబస్తుకు వెళ్లి వస్తూ పోలీసు వాహనం చెట్టుకు ఢీ కొన్న ఘటనలో పోలీసులు గాయపడ్డారు. ● గుర్రంపోడు శివారులోని ఇరుకై న బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రెయిలింగ్ తక్కువ ఎత్తులో ఉన్నకారణంగా వెనుక కూర్చున మహిళ వాగులో పడి మృతిచెందింది.ఫ ఈ రోడ్డంతా మూలమలుపులు, గుంతలమయం ఫ రోడ్డు వెంట చెట్లను ఢీకొనిమృత్యువాత పడుతున్న జనం ఫ నిధులు మంజూరైనా.. మొదలుకాని విస్తరణ పనులు రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రేడియం స్టిక్కర్లు తెప్పించాం. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – వెంకన్న, ఎస్ఐ, గుర్రంపోడు నల్లగొండ– దేవరకొండ రోడ్డు విస్తరణ ఇదిగో పులి– అదిగో తోక అన్న చందంగా మారింది. ఈ రహదారిపై గతంలో కంటే వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం వేళలో వాహనాన్ని ఓవర్టేక్ చేయలేనంత రద్దీ ఉంటోంది. జిల్లాలో చాలా వరకు ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోగా ఈ రోడ్డు మాత్రం ఇంకా ఇరుకుగానే ఉంది. రెండేళ్ల క్రితం వరకు గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డులో ప్యాచ్ వర్క్ చేశారు. అక్కడక్కడా మాత్రమే మరమ్మతులు చేశారు. దీంతో రోడ్డంతా ఎగుడుదిగుడుగా, ప్రమాదకరంగా ఉంది. ఇక గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం క్రాస్ రోడ్డు నుంచి కట్టవారిగూడెం వరకు రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుతో ప్రమాదాలకు రోడ్డు పక్కన దగ్గరగా ఉన్న పెద్ద వృక్షాలు కారణమవుతున్నాయి. ఇవి రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించబోయి రోడ్డు పక్కకు వాహనం దింపితే చెట్టుకు ఢీ కొని ప్రమాదం జరుగుతోంది. -
విద్యార్థులకు ‘వేసవి’ శిక్షణ
అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆసక్తి గల వారు క్యాంపు దగ్గరికి వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలి. క్రీడా సామగ్రి రాగానే శిక్షణ ప్రారంభిస్తాం. – అక్బర్ అలీ, జిల్లా యువజన క్రీడల అధికారి మే 1 నుంచి సమ్మర్ క్రీడా శిక్షణ శిబిరాలు ఫ రెండు మూడు రోజుల్లో జిల్లాకు చేరనున్న క్రీడా సామగ్రి ఫ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. పట్టణాల్లో ఫీజు వసూలు నల్లగొండ టూటౌన్ : వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఈనెల 24 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంత వరకు క్రీడా సామగ్రి జిల్లాకు చేరకపోవడంతో మే 1వ తేదీ నుంచి సమ్మర్ క్యాంపు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ శిబిరాలాల్లో జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిబిరాలను విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక వికాసం పెంపొందించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు ఎంతగానో దోహదపడతాయి. క్రీడలు ప్రోత్సహించేందుకు.. విద్యార్థుల్లో వివిధ క్రీడలను ప్రోత్సహించడానికి వేసవి క్రీడా శిభిరం నిర్వహిస్తున్నారు. వారికి ఇష్టమైన క్రీడలను ఈ వేసవి శిక్షణ శిబిరంలో నేర్పించనున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి శిక్షణలు వేదిక కానున్నాయి. మే 1 నుంచి శిబిరాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఈలోగా విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నారు. శిబిరాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతంలో వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, హాకీ, హ్యాండ్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, తదితర క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని నిడమనూరు, ఇబ్రహీంపేట (హాలియా) (కబడ్డీ), జెడ్పీహెచ్ఎస్ గట్టుప్పల్ (బాల్ బ్యాడ్మింటన్), బాలాజీనగర్ (పీఏపల్లి) (బేస్బాల్), ఎన్జీ కాలేజీ నల్లగొండ (హాకీ), జెడ్పీహెచ్ఎస్ తిప్పర్తి (హ్యాండ్బాల్), ఔట్డోర్ స్టేడియం నల్లగొండ (పుట్బాల్), జెడ్పీహెచ్ఎస్ వెల్మకన్నె (గట్టుప్పల్) (వాలీబాల్), జెడ్పీహెచ్ఎస్ నకిరేకల్ (హ్యాండ్బాల్), జెడ్పీహెచ్ఎస్ కనగల్ (కబడ్డీ)లో గ్రామీణ క్రీడాకారులకు ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. అర్బన్ ప్రాంతంలో ఫీజు.. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. క్రీడను బట్టి రూ.100 నుంచి రూ.1000 వసూలు చేయనున్నారు. జెడ్పీహెచ్ఎస్ కురంపల్లిలో బ్యాడ్మింటన్, నల్లగొండ పబ్లిక్ స్కూల్లో చెస్, జెడ్పీహెచ్ఎస్ మిర్యాలగూడలో వాలీబాల్, ఇండోర్ స్టేడియం నల్లగొండలో టేబుల్ టెన్నీస్, షటిల్ బ్యాడ్మింటన్, ఎన్జీ కాలేజీ నల్లగొండలో కబడ్డీ, ఔట్డోర్ స్టేడియం నల్లగొండలో ఖోఖో, ఇండోర్ స్టేడియం మిర్యాలగూడలో షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, ఎన్జీ కాలేజీ నల్లగొండలో అథ్లెటిక్స్, నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని తైక్వాండో సెంటర్లో తైక్వాండో, ఇండోర్ స్టేడియం నల్లగొండలో తైక్వాండో, ఉరుమడ్ల (చిట్యాల)లో హాకీ క్రీడా పోటీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నల్లగొండ : జిల్లా విద్యాశాఖ, బాల భవన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు 40 రోజుల పాటు నల్లగొండలోని బోయవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 నుంచి 11 వరకు శాసీ్త్రయనృత్యం, చిత్ర లేఖనం, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్లో శిక్షణ ఇస్తారు. 6 నుంచి 16 సంవత్సరాల బాలబాలికలకు వీటిని ఉచితంగా నేర్పిస్తారు. రిసోర్స్ పర్సన్లు, టీచర్లు, సమాజ సేవకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇతర వివరాలకు 94404 40939, 94416 60881 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని డీఈఓ భిక్షపతి సూచించారు. -
ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు
నల్లగొండ : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు పట్టింపులకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకరయ్యగౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని ఈసారి తాలు సమస్య ప్రధానంగా ఉందన్నారు. తాలు విషయంలో కలెక్టర్లు, మిల్లర్లు, రైతులతో కలిసి ఒప్పందానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. రైతు బోనస్, రైతుబంధు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమనే విషయం వాస్తవమేనని ఈ విషయంలో రైతుబంధు, సన్నాలకు బోనస్.. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రానికి విన్నవించినా అక్కడ నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ సమ్మె విషయంలో వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనాలను పొందాలని చూస్తున్నాయన్నారు. కాలేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ విషయంలో ఎవరికీ హైకోర్టు క్లీన్ చీట్ ఇవ్వలేదని, సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు కాబట్టే హరీష్రావు, కేసీఆర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపిందన్నారు. ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
ప్రత్యేక ప్రజావాణి వాయిదా
నల్లగొండ : ప్రతినెల చివరి శనివారం వృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవికాలం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రజావాణి నిర్వహించే తేదీ ప్రకటించే వరకు వృద్ధులు, దివ్యాంగులు ప్రజావాణికి రావద్దని ఎండలో బయటకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలిడిండి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వసతులు కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం డిండి మండల పరిధిలోని కందుకూర్, బొల్లనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు సక్రమంగా పెరిగేలా చూడాలన్నారు. బొల్లనపల్లి గ్రామశివారులో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూలీలకు ఎలాంటి వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకన్న, ఏపీఓ శ్రీనివాసులు, ఈసీ వెంకటాచారి, సర్పంచ్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం ఆక్షాంక్షించారు. శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మహనీయుల జీవితాలే సాక్ష్యమని వారి అడుగుజాడల్లో పయనించి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కళాకారుడు రేలారే ప్రసాద్ తన పాట, మాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్, మహమ్మద్ అబ్దుల్ మాలిక్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సరిత, అలువాల రవి, రవితేజ, వసంత, అరుణప్రియ, ప్రేమ్సాగర్, మద్దిలేటి, జ్యోతి, సబీనా హెరాల్డ్, హరీష్కుమార్, దోమల రమేష్, మిరియాల రమేష్ పాల్గొన్నారు. వైభవంగా ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయబద్ధంగా ఊరేగించి ఆలయ ముఖ మండపంపై ఉత్తర దిశలో ఉన్న మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
డిమాండ్లు నెరవేర్చాల్సిందే..
మిర్యాలగూడ టౌన్, రామగిరి (నల్లగొండ) : ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజూ కొనసాగింది. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టువీడకపోవడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లగొండలో ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి క్లాక్ టవర్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ చిత్రపటానికి డిపో ఎదుట, క్లాక్ టవర్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి డిపో ఎదుట ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో డిపో నుంచి జాతీయ రహదారిపై రాజీవ్గాంధీ చౌరస్తా, అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, సీపీఎం రాష్ట్ర నేత డబ్బీకార్ మల్లేష్, సీపీఐ జిల్లా నేత బంటు వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నేత వస్కుల మట్టయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ మాలి ధర్మపాల్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. 385 బస్సులు నడిపిన యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 385 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపించింది. మిగతా బస్సులు డిపోకే పరిమితం అయయి. కేవలం ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే నడుస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో తమ ఇళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఏదైనా బస్సు వచ్చిందంటే అందులోకి ఎక్కడానికి తోపులాటలు జరుగుతున్నాయి. కాగా, మిర్యాలగూడ నుంచి భువనగిరికి వెళ్లే ఎలక్ట్రికల్ బస్సు ఎక్కే సమయంలో ఓ మహిళ బ్యాగులో నుంచి రూ.వెయ్యిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. మరో మహిళ బ్యాగులోని రూ.500 కొట్టేశారు. ఫ పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు ఫ సమ్మెకు పెరుగుతున్న మద్దతు ఫ మూడో రోజూ కొనసాగిన సమ్మె.. ప్రయాణికుల ఇబ్బందులు -
ఇసుక, మట్టి తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తాం
నల్లగొండ : జిల్లాలో అక్రమంగా ఇసుక, చెరువు మట్టి తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలించే వాహనాలను సీజ్ చేయాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి.. ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మట్టి తవ్వాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇసుకను లీగల్గా అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో ఇసుక రీచ్లకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్నేశ్వరమ్మగుట్ట చెరువు, కనగల్, తిమ్మాన్నగూడెం చెరువుల వద్ద అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేములపల్లి మండలం బొమ్మకల్, రావులపెంటలో కొత్తగా 2 ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు మూడు రోజుల్లో నిరోదించేలా పోలీస్, రెవెన్యూ శాఖలు పని చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లీగల్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజల అవసరాలకు ఇసుక సరఫరా చట్టబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, మైనింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ అనుమతి లేకుండా రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయాలి ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు
నల్లగొండ టూటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రాచారం చేసిన సీఎం రేవంత్కు, కాంగ్రెస్కు.. హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి కూలేశ్వరం అయిందని ప్రచారం చేసిన వారికి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఇకనైనా బుద్ధి రావాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి మంత్రి వర్గమంతా ఏపీ సీఎం చంద్రబాబుకు, అక్కడి రాష్ట్రం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్టుకు రోజుకు 0.5 టీఎంసీ నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తాం.. కరెంట్ లేక, యూరియా అందక అష్టకష్టాలు పడి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నేటి నుంచి మాజీ ఎమ్మెల్యేలంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటామన్నారు. అవసరమైతే రైతులను సమీకరించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు చకిలం అనిల్కుమార్, కొండూరు సత్యనారాయణ, సింగం రామ్మోహన్, వంగాల సహదేవరెడ్డి, బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ -
పీఏసీఎస్లకు త్వరలో పాలకవర్గాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (పీఏసీఎస్) కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. గత ఏడాది ఫిబ్రవరితో పాలకవర్గాల గడువు ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తరువాత ఒకసారి ఆరునెలలు గడువు పొడిగించింది. గత ఆగస్టు నెల నుంచి పీఏసీఎస్లు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. అయితే ఆయా పీఏసీఎస్లకు పాలకవర్గాలను నామినేట్ చేయాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే ఆయా పీఏసీఎస్లకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్లు, ఒక రైతు పరస్పర సహకార సంఘం (తుంగతుర్తిలో) ఉన్నాయి. వాటన్నింటికి త్వరలోనే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయనుంది. మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా నాగార్జున మార్కెటింగ్ సొసైటీలకు (ఎన్డీసీఎంఎస్) కూడా పాలకవర్గాలను నామినేట్ చేసే అవకాశం ఉంది. మొన్నటివరకు డీసీసీబీకి కుంభం శ్రీనివాస్రెడ్డి చైర్మన్గా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూన్ 28వ తేదీన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన చైర్మన్ అయ్యారు. అయితే ఆయన కొద్దికాలమే చైర్మన్గా పని చేయడం, ఆ కొద్ది కాలంలోనే బ్యాంకును లాభాల్లోకి తీసుకెళ్లినందున మళ్లీ ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ఫ నామినేట్ చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం ఫ డీసీసీబీకి కూడా నామినేట్ చేసే అవకాశం -
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి
నల్లగొండ : ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్లో గురువారం ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్లో వెనుకబడిన బీఎల్ఓలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి గ్రామస్తుల సహకారంతో ఫొటో మ్యాపింగ్ చేపట్టాలన్నారు. డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నట్లయితే వెంటనే ఫారం–7 ద్వారా తొలగింపు చేపట్టాలని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తి కాని జాబితాను తీసుకుని బీఎల్ఓలు, బిల్ కలెక్టర్లు, ఆర్పీల సమన్వయంతో పని చేయాలని, సమస్యలు ఉంటే ఈఆర్ఓలకి తెలియజేయాలని, సాంకేతిక సమస్యలుంటే తహసీల్దార్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. దామరచర్లలో రైల్వే బైపాస్ లైన్మిర్యాలగూడ : విష్ణుపురం– మోటుమర్రి రైల్వే మార్గాన్ని అనుసంధానం చేస్తూ దామరచర్ల వద్ద ఐదు కిలోమీటర్ల రైల్వే బైపాస్ లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీనికి నెల రోజుల క్రితం రైల్వే శాఖ మార్కింగ్ నిర్వహించగా ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే జరిపి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. 4.90కిలోమీటర్ల మార్గానికి 52 ఎకరాల భూమిని సేకరించారు. 60 మంది రైతులకు సంబంధించిన వివరాలు గెజిట్లో పొందుపరిచారు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు విధించారు. ఈ లైన్ విష్ణుపురం స్టేషన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో దామరచర్ల విద్యుత్ ఉపకేంద్రం పక్క నుంచి నాగులచెర్వు దిగువ నుంచి మోటుమర్రి రైల్వే లైన్కు అనుసంధానం చేస్తారు. నార్కట్పల్లి– అద్దంకి రహదారిపై ఆర్యుబీ(వంతెన కింద రహదారి) నిర్మించనుంది. నాలుగు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో హరితహారం నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పైలాన్కాలనీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డ్యాం ఎస్పీఎఫ్ కమాండెంట్ విజయభాస్కర్రావు, ఇన్స్పెక్టర్ ప్రతాప్నాయుడు, శ్రీనివాస్రావు, చీప్ ఇంజనీర్ మంగేష్కుమార్ పాల్గొన్నారు. కూలీలకు మౌలిక వసతులను కల్పించాలిమిర్యాలగూడ, అడవిదేవులపల్లి : ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, కొండ్రపోల్, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం, అడవిదేవులపల్లి గ్రామాల్లో ఉపాది హామీ పనులను, నర్సరీలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ఉపాది కూలీలు పనిచేసే చోట టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అలివేలు మంగమ్మ, మెసిన్ బిన్ అహ్మద్, తహసీల్దార్ రాగ్యానాయక్, ఏపీఓ నాగేశ్వర్రావు, ఏపీఎం కృష్ణమూర్తి, తాళ్లవీరప్పగూడెం సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, ఈసీ శంకర్, టీఏ సైదా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
అడవిదేవులపల్లి : రైతుల కష్టాలను తీర్చేందుకు దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ మల్లికార్జున్, ఈఈ కేశవతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దున్నపోతుల గండి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్న తరువాత ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దున్నపోతుల గండి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలన్నారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలునాయక్ తదితరులు ఉన్నారు. ఫ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -
ఏరియా ఆస్పత్రి సందర్శన
దేవరకొండ : దేవరకొండ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం గురువారం సందర్శించింది. డాక్టర్ సాయికిరణ్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులు, వాటి నిర్వహణ, వైద్య సేవలు, సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. ఆస్పత్రిలోని ఇన్పేషంట్–అవుట్ పేషంట్, డయాలసిస్, మాతా శిశుసంరక్షణ కేంద్రం, జనరల్ ఓపీ, మెటర్నటీ, ఎమర్జెన్సీ విభాగాలను సందర్శించారు. ఈ బృందం ఇక్కడ పరిశీలించిన అంశాలపై ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేయనుంది. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్, వైద్యులు కృష్ణ, సిబ్బంది తదితరులున్నారు. -
సమ్మె ఉధృతం
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె గురువారం రెండవ రోజూ కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు గురువారం 398 బస్సులు నడిపారు. వీటిలో ఆర్టీసీ 10, ఎలక్ట్రిక్, అద్దె బస్సులు 388 ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కండక్టర్లను నియమించారు. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సర్వీస్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రైవేట్ వాహనదారులు చార్జీలు భారీగా పెంచారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు సుమారు రూ.500 వరకు వసూలు చేశారని.. ఇలా ప్రతి చోటుకు దూరాన్ని బట్టి చార్జీలు డబుల్ వసూలు చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు. అన్ని డిపోల వద్ద ఉద్రిక్తత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సమ్మెలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. నల్లగొండ డిపో వద్ద డ్రైవర్ వెంకన్న ఒంటిపై డిజీల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేట డిపో జరిగిన ధర్నాలో బస్సులు నడవకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. కాసేపు పోలీసులు, ఉద్యోగులకు మద్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అక్కడి తరలించడంతో బస్సులు నడిచాయి. యాదగిరిగుట్టలో కూడా ఉద్యోగులు డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అద్దె బస్సుల పార్కింగ్ వేరే చోట ఉండడంతో ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి బస్సులను నడిపించారు. యాదగిరిగుట్ట, కోదాడ డిపోలో ఉద్యోగులు ధర్నా వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్ను పోలీసులు తొలగించేశారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆందోళనలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. నార్కట్పల్లి డిపోలో జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదగిరిగుట్టలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, సీపీఐ రాష్ట్ర నాయకుడు గాదె శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్ సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో సీపీఎం, సీపీఐతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు సమ్మెకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.ఫ అన్ని డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు ఫ యాదగిరిగుట్ట, కోదాడలో ధర్నా టెంట్లను తొలగింపు ఫ నల్లగొండలో కార్మికుడి ఆత్మహత్యాయత్నంమిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అధికారులు అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను పాక్షికంగా నడిపారు. కండక్టర్లు కొరత ఉండడంతో కొన్ని బస్సుల్లో మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచితంగా ప్రయాణించారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లే అద్దె బస్సు డ్రైవర్కు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన కాగితంపై ప్రయాణికులందరికీ ఫ్రీ అని రాసి ఉంది. కాగా కండక్టర్లు లేకపోవడంతో పురుషులు ఉచితంగా ప్రయాణించారని.. శుక్రవారం నుంచి తప్పనిసరిగా పురుషులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
అన్నదాతకు వరి గోస
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతన్న తల్లడిల్లుతున్నాడు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోవ డంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయినా పట్టు వదలకుండా రూ.లక్షలు వెచ్చించి సాగునీటి కోసం ప్రయ త్నం చేస్తూనే ఉన్నాడు. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు చేయ ని ప్రయత్నం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. పలు చోట్ల ప్రస్తుతం వరికోతలు కొనసాగుతుండగా, నల్లగొండ, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు బోర్లు వేయిస్తున్నా నీరు పడకపోగా, అప్పుల్లో కూరుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిల్ల గ్రామ రైతులు సాగు నీటికి చేస్తున్న భగీరథ ప్రయత్నాలు. గ్రామంలో బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో దాదాపు 60 మంది రైతులు తమ పంట పొలాలు కాపాడుకునేందుకు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో మోటార్లు పెట్టుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు నీటిని తీసుకెళ్తున్నారు. చిన్న ట్రాన్స్ఫార్మర్, హైస్పీడ్ మోటారు, పైపులైన్, విద్యుత్ కోసం ఒక్కో రైతు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశారు.వాటర్ ట్యాంకర్తో వరి పొలానికి నీరు పెడుతున్న రైతు ఎల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆయన ఎకరంన్నరలో వరి సాగు చేశారు. లోఓల్టేజీ కరెంటుతో నీరందక పంట వాడిపోతోంది. మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరులో నీరు సరిగ్గా రావడం లేదు. చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు రూ. 20 వేలు వెచ్చించి వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు.ఎండిపోయిన వరి చేలో నిల్చున్న ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్కు చెందిన ఆర్ల రాంరెడ్డి. తనకున్న ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటికే రూ.1.85 లక్షలు పెట్టుబడి పెట్టారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మరో రూ.1.20 లక్షలు వెచ్చించి బోరు వేశాడు. అయినా నీరు పడలేదు. దీంతో ఇప్పటికే 3 ఎకరాల పంట ఎండిపోయింది. మిగిలిన వరి పంటను కాపాడుకునేందుకు రూ. 25 వేలు వెచ్చించి ట్యాంకర్లతో పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా రైతు భగీరథ యత్నం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లికి (జి) మహిళా రైతు కన్న రాధిక తనకున్న ఆరెకరాల భూమిలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉన్న ఒక్క బోరుతో ఇబ్బంది అవుతుండటంతో మరో నాలుగు బోర్లు వేయించింది. అయినా వాటిల్లో నీరు పడలేదు. గత్యంతరం లేక రూ.3.40 లక్షలు వెచ్చించి పాత బోరుకే కిలోమీటరు లోతులో మరో 140 పైపులు వేయించి పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేసింది. అయినా నీరు సరిపోక రెండెకరాల వరి పంట ఎండిపోవడంతో వదిలేసి, మిగతా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం నీళ్లు రాక.. గోదావరి ఎండిపోయి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గోదావరి తీరప్రాంత రైతులు అంతా గోదావరి జలాలపై ఆధారపడి వరి సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోవడంతో నది ఎడారిలా మారింది. దీంతో గత్యంతరం లేక గోదావరి మధ్యలోనే బోర్లు వేసి, పైపుల ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఒక్కోసారి బోర్లు కూడా ఎండిపోతుండటంతో అప్పులపాలు కావాల్సి వస్తోందని వాపోతున్నారు.బోరు అడుగంటిపోవడంతో.. బోరు వట్టిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు తాను వేసిన వరి పంట ఎండిపోతుండటంతో ట్యాంకర్తో నీటిని అందిస్తున్నారు. ఒక్కో వాటర్ ట్యాంక్కు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్లో మరోరైతు నర్సాగౌడ్ బోరుసైతం సైతం ఎండి పోవటంతో ట్యాంకర్ద్వారా నీటిని తెచ్చి పోస్తున్నారు. రెండేళ్లలో ఎనిమది బోర్లలో చుక్క నీరు పడలే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన బద్దిపడగ అనిల్రెడ్డి అనే రైతు 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటను కాపాడుకునేందుకు రెండేళ్లలో 8 బోర్లు వేశాడు. ఒక్కదాంట్లో కూడా నీరు పడలేదు. యాసంగి సీజన్లో 10 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న మినీ డ్యాం నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి కిలోమీటరున్నర మేర పైపు లైన్ వేసి నీటిని అందించాల్సి వస్తోందని వాపోయాడు. నీటి కోసం రూ. 8 లక్షలకు పైగా వెచ్చించాబోర్లు పడకపోవడంతో సాగర్ వెనుక జలాల నుంచి నీటిని తరలించేందుకు రూ.8లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్కు రూ.80 వేలు, మోటారుకు రూ.లక్ష, కేబుల్ వైర్కు రూ.లక్ష అవుతోంది. కృష్ణా అడుగుభాగం నుంచి నీటిని తోడేందుకు పైప్నకు రూ.1,05,000 వరకు ఖర్చు అవుతోంది. 3 కిలోమీటర్ల పొడవునా పైపులకు రూ. 4 లక్షలు, పైప్లైన్ గుంత తీసినందుకు జేసీ బీకి రూ.లక్ష, గుంతను మూసివేయించేందుకు రూ.30వేల ఖర్చు అవుతోంది. – జటావత్ మంగులాల్, పొగిళ్ల, చందంపేట, నల్లగొండ -
ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద బుధవారం కార్మికుల సమ్మెకు బుధవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని కోరారు. ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ సమ్మెను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కెఎస్.రెడ్డి, ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు బి.నరేందర్, యార చంద్రయ్య, రాజు, రావు, ఏఎల్ స్వామి, శంకరమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లపై విజి‘లెన్స్’
నల్లగొండ : రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న అధికారులు, లోపలికి వెళ్లగానే తలుపులు మూసివేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విజిలెన్స్ సీఐ దశరథ, ఎఫ్ఆర్ఓ మనోహర్ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు సాగాయి. సబ్ రిజిస్టార్లతోపాటు ఇతరుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను అధికారులు గుర్తించారు. గతంలో అవుట్సోర్సింగ్ కింద పనిచేసిన వీరి కాలపరిమితి ముగిసినప్పటికీ, కార్యాలయంలో కొనసాగుతుండటంతో వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ దశరథ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్త ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ నిశితంగా పరిశీలించామని, పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. తనిఖీల్లో ఎఫ్ఆర్ఓ మనోహర్తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు నర్సింహారెడ్డి, వెంకటన్న, పాషా తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఫ కార్యాలయ విధుల్లో ప్రైవేట్ వ్యక్తుల గుర్తింపు ఫ పరుగులు పెట్టిన డాక్యుమెంట్ రైటర్లువిజిలెన్స్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తలుపులు మూసి తనిఖీలు చేస్తుండడంతో కార్యాలయ సిబ్బందితో పాటు డాక్యుమెంట్ రైటర్లు బెంబేలెత్తిపోయారు. ఏసీబీ అధికారులు వచ్చారని భావించిన కార్యాలయం వద్ద ఉన్న డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత వచ్చింది విజిలెన్స్ అధికారులేనని తెలుసుకున్న డాక్యుమెంట్ రైటర్లు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం కాసేపు ఉత్కంఠ నెలకొంది. -
రెండు గంటల నుంచి వేచి ఉన్నాం
హాలియా నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాం. తిరిగి హాలియాకు వెళ్దామని వచ్చి నల్లగొండ బస్టాండ్లో బస్సు కోసం రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాము. చిన్న బాబు ఉన్నాడు ఎండకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. – సహదేవ, ప్రయాణికుడు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మెను నిలిపివేయాలి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. గ్రామాలకు ఆటోలు కూడా లేని వారికి ఇబ్బంది అవుతోంది. ఎండకు ఆటోలో ప్రయాణించే పరిస్థితి లేదు. – మానస, ప్రయాణికురాలు ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిందే. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను అమలు చేయాలి. 2017 నుంచి ఏరియర్స్ చెల్లించాలి. – పి.శారద, ఆర్టీసీ ఉద్యోగి ఉద్యోగుల డిమాండ్లను ఒ ప్పుకునేంత వరకు సమ్మె ను విరమించేది లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. యూనియన్లను పునరుద్ధరించాలి. మూడు సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం. తప్పని పరిస్థిల్లో సమ్మెకు వెళ్లాం. ప్రభుత్వ బెదిరింపులకు భయపడం. – ఎండీ.లతీఫ్, డ్రైవర్ -
మే 1 నుంచి పీజీ కళాశాలలకు సెలవు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలోని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎగ్జామ్ బ్రాంచ్, ప్రిన్సిపాల్, ఇతర కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలలు జూన్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆలయ భూముల పరిశీలనచిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని శ్రీతిరుమలనాథ స్వామి ఆలయ భూములను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురవతున్నాయని పెద్దకాపర్తి వార్డు సభ్యుడు మర్రి హారీష్రెడ్డి, మాచర్ల యాదగిరి, చేకూరి గణేష్ వేర్వేరుగా ప్రజావాణిలో కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, ఎండోమెంట్ అధి కారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 201 సర్వే నంబర్లో అక్రమణకు గురైన ఆలయ భూములను గుర్తించి పరిరక్షిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, మైనింగ్ ఏడీ బాలు, దేవాదాయ శాఖ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తాంపెద్దఅడిశర్లపల్లి : ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ చంద్రమౌళి అన్నారు. బుధవారం ‘సాక్షి’లో ‘కోతకు ఒప్పుకుంటేనే.. కొనుగోలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తేమశాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడిగా నాగరాజునార్కట్పల్లి : భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ జిల్లా అధ్యక్షుడిగా నార్కట్పల్లి పట్టణానికి చెందిన వడ్డేపల్లి నాగరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం భీమ్ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం, బహుజన రాజ్యాధికారం కోసం అంకితభావంతో పని చేస్తానన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలి
నల్లగొండ : ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ తమ ప్రాణ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. హెల్మెట్ ప్రాముఖ్యతపై బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. మీడియా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే అలవాటు కలిగేలా చూడాలన్నారు. అనంతరం శాంతలక్ష్మి ఫౌండషన్ ఆధ్వర్యంలో కంబాలపల్లి ఉపేందర్, మన్నెం యాదగిరి సహకారంతో మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్రెడ్డి, మహాలక్ష్మయ్య,ఉ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచలే..
శాలిగౌరారం : దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేదని అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అద్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని ఇటుకులపహాడ్లో నిర్వహించిన ఏఐకేఎంఎస్ నల్లగొండ జిల్లా 11వ మహాసభలో ఆయన మాట్లాడారు. రైతు పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించుకునే హక్కు లేకపోవడంతో దళారీల చేతిలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్త అదాని ఆదాయం రోజుకు రూ.1600 కోట్లు ఉందని, చెమటోడ్చే రైతులకు మాత్రం ఆదాయం సంగతేమో కానీ ఆత్మహత్యలు మిగులుతున్నాయని చెప్పారు. నేటీ బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి విబిజిరాంజీ పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్రాలపై ఆధారపడేలా చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, ఉపాద్యక్షులు సిలివేరు జానయ్య, నాయకులు గజ్జి రవి, వేముల శంకర్, అంబటి కృష్ణమూర్తి, నర్సయ్య, కల్లూరి అయోధ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, కుంభం వెంకటేశం, బూరుగు సత్తయ్య, పజ్జూరు ఉపేంద్ర, బివి.చారి, పోలె పవన్, మామిడోజు వెంకటేశ్వర్లు, రావుల లింగయ్య, అంబటి మహేశ్, జయరాజ్, యాదమ్మ, సుజాత, శైలజ, సునీత, పుష్ప, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఫ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అద్యక్షుడు కోటేశ్వరరావు -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు
నల్లగొండ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా ప్రకృతి పెను విపత్తు ఎదుర్కొంటోందని.. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల ప్రాణకోటికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కాలుష్యం నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ధరిత్రిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మార్కెట్కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కాటన్ బ్యాగులు తీసుకెళ్లాలని, ప్లాస్టిక్ బాటిల్కు బదులు స్టీల్ లేదా మట్టి వాటర్ బాటిల్స్ వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రకతిని కాపాడే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ధరిత్రి దినోత్సవంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రాజశేఖర్, డీఎస్డీఓ మహమ్మద్ అక్బర్అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ -
హెల్మెట్ ధరిస్తేనే.. ఎంట్రీ
ఫ నేటి నుంచి కలెక్టరేట్ వద్ద అమలు నల్లగొండ : నల్లగొండ కలెక్టరేట్లో గురువారం నుంచి నో హెల్మెట్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం నుంచి కలెక్టరేట్కు వచ్చే సిబ్బంది, అధికారులు, వివిధ పనుల కోసం ద్విచక్ర వాహనంపై వచ్చే వారు హెల్మెట్ ధరిస్తేనే కలెక్టరేట్లోకి అనుమతించాలని ఆదేశించారు. అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ గేటుకు ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా సరే గురువారం నుంచి హెల్మెట్ లేకుండా వస్తే కలెక్టరేట్ లోపలికి అనుమతించరు. -
గొడుగులు చేతబట్టి ‘బడిబాట’
మర్రిగూడ : మండలంలోని దామెరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు సోమవారం ఎర్రటెండలో సైతం గొడుగులు చేతబట్టి వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. గొడుగుల నీడలో ఇల్లిళ్లు తిరిగి పిల్లలను ప్రభుత్వ బడిలోకే పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాద్యాయుడు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారన్నారు. దీనికితోడు ప్రస్తుతం అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వై.మంజులత, కొండ శ్రీనివాస్, సబావత్ వెంకట్కుమార్, మీనా, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనాలని రాస్తారోకో
పెద్దవూర : ధాన్యం వెంటనే కొనాలని కోరుతూ సోమవారం పెద్దవూర మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రం ఎదుట జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రమావత్ రవినాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదిరోజులు అవుతున్నా.. ఇప్పటివరకు కేవలం నాలుగు లారీల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. ధాన్యంలో సరైన తేమశాతం వచ్చినా.. లారీలు రావడం లేదన్న సాకుతో బస్తాలు ఇవ్వడం లేదని, బస్తాలు ఇచ్చిన రైతుల ధాన్యం మిల్లులకు తరలింకాకే. మిగిలిన రైతులకు బస్తాలు ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్గాని, సబ్ కలెక్టర్గాని వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేవరకు రాస్తారోకోను విరమింపజేసేది లేదని భీష్మించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పిన రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు ఏరుకొండ నర్సింహ, శ్రీనివాస్రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనతో పాటు, అదనపు కలెక్టర్, తహసీల్దార్లు, సీనియర్ అధికారులు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సందర్శించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపించడం, ధాన్యాన్ని వెంటనే ఆన్లోడ్ చేసే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్య లేకుండా చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల అన్ని సౌకర్యాలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ.. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలినల్లగొండ టూటౌన్ : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చెరువులు, గుట్టలు తవ్వుతున్న మట్టి మాఫీయాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఫిర్యాదు చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోకుండా 30 నుంచి 40 అడుగులలోతు చెరువుల్లో మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మట్టి మాఫీయా టిప్పర్లు, ఇతర వాహనాలను వెంటనే సీజ్ చేయాలని కోరారు. బట్రాజ్ సంఘం జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ టౌన్ : బట్రాజ్ సంఘం జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సరస్వతి శంకర్రాజు, ప్రధాన కార్యదర్శిగా పిచ్చంరాజు, గౌరవ అధ్యక్షుడిగా బొల్లేపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారిగా సత్యనారాయణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ‘నీట్’కు ఏర్పాట్లు చేయాలి నల్లగొండ : వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి అధికారులకు సూచించారు. మే 3న నిర్వహించే నీట్ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,318 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఎన్జీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఎంజీయూ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, నీట్ జిల్లా కోఆర్డినేటర్, కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ : ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్ ఇంటర్ తెలుగు పరీక్షకు 1,759 మందికిగాను 1,512 మంది పరీక్ష రాశారని, 247 మంది గైర్హాజర్ అయ్యారని తెలిపారు. 8 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్ టెన్త్ తెలుగు పరీక్షకు 1,334 మందికి 1,141 మంది పరీక్ష రాశారని 193 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. -
మహిళా బిల్లు అంతా బూటకం
మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులు అంతా బూటకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కేరళ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన సాగుతోందని, కార్మికుల పోరాటాలను పోలీసులతో అణిచి వేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వచ్చే నెల 1న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, మల్లు గౌతంరెడ్డి, మంగారెడ్డి, రవినాయక్, బావండ్ల పాండు, పరుశురాములు, సీతారాములు, మసూద్, వరలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 104 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు 70, ఇతర శాఖలకు సంబంధించినవి 34 వచ్చాయని తెలిపారు. ఈ నెల 28న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు నల్లగొండకు రానున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అప్పీలేట్ అథారిటీ అధికారులకు ఆర్టీఐపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. సెక్షన్ 4(1)(బి) కింద వెల్లడించాల్సిన సమాచారాన్ని ముందుగానే నవీకరించి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలని, లేనిపక్షంలో ‘నిల్’గా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీవోలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
అక్షయ తృతీయకు అంతంత మాత్రమే!
రామగిరి(నల్లగొండ) : అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. హిందూ సంప్రదాయంలో బంగారం, వెండి కొనుగోలుకు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతుండడంతో ఈసారి కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయలలోపే ఉండగా ఇప్పుడు ఆ ధర భారీగా పెరిగింది. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల షాపుకెళ్తే తులం బంగారం రావడం లేదు. 2025 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.96,000 నుంచి రూ.97,000 మధ్య ఉంది. అంటే సుమారు లక్ష రూపాయలు ఉంటే ఒక తులం బంగారం కోనే వీలుండేది. కానీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు పోటీపడి పెరుగుతుండడంతో ప్రజలు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారు. ఫ ఈ ఏడాది తగ్గిన బంగారం విక్రయాలు ఫ ధరలు పెరగడంతో ఆసక్తి చూపని ప్రజలు -
ప్రగతి చక్రానికి బ్రేకులు
మిర్యాగూడ టౌన్ : ప్రగతి చక్రానికి బ్రేకులు పడుతున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ లక్ష్యంగా జాయంట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడుతున్నారు. ఆర్టీసీలో 2019 తరువాత ఇప్పుడు కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోనున్నాయి. ఏడేళ్ల క్రితం 54 రోజుల సమ్మెతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరిగుట్ట, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిపోలున్నాయి. వీటి పరిధిలో ఆర్టీసీ బస్సులు 329, అద్దె బస్సులు 235, ఎలక్ట్రికల్ బస్సులు 169 మొత్తం 733 బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు 719 మంది, కండక్టర్లు 1012 మంది, గ్యారేజి సిబ్బంది 264 మంది మొత్తం 1,995 మంది పనిచేస్తున్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఖర్చులను తగ్గించుకునేందుకు టిమ్స్ డ్యూటీలు వేస్తోందని కార్మికులు అంటున్నారు. 12 నుంచి 16 గంటల వరకు డ్యూటీలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో ఒక్కో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల డ్రైవర్లు, కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లకు టిమ్స్ ఇవ్వడంతో బస్సులు నడుపుతూ, టికెట్ల కొట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని సంరక్షించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. డిపోలు బస్సులు ఉద్యోగులు దేవరకొండ 106 352 కోదాడ 86 279 మిర్యాలగూడ 106 287 నల్లగొండ 154 307 నార్కట్పల్లి 27 99 సూర్యాపేట 159 327 యాదగిరిగుట్ట 95 344 సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు ఫ డిపోలకే పరిమితం కానున్న బస్సులు ఫ ప్రయాణికులకు తప్పని పాట్లుఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న అద్దె బస్సులను నడిపించేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. అయితే కొంత మంది ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లో వీధులకు హాజరవుతారనే నమ్మకం ఉంది. వారి ద్వారా కూడా బస్సులను నడుపుతాం. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం మేరకే చర్యలు చేపడతాం. – కొణతం జాన్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
నల్లగొండ : ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పౌర సరఫరాలు, మార్కెటింగ్, డీఆర్డీఏ, రవాణా, కోఆపరేటివ్ తదితర శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని పగలు, రాత్రి.. అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కాంటాలు వేయాలని, వారం పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల సంఖ్య, లారీలను పెంచి రోజుకు 10 వేల మెట్రిక్ టన్నులు కొనాలన్నారు. రోడ్డు నిర్మాణంలో అవినీతికి ఆస్కారం లేదు నల్లగొండ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలంటూ ఓ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరైతే.. భూసేకరణకే రూ.250 కోట్లు పోతుందని, పనులన్నీ నేషనల్ హైవే అధికారులు చూసుకుంటారని.. అందులో ఎవరి ప్రమేయం ఉండదని చెప్పారు. నీలగిరిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ బి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్, రవాణా శాఖ అధికారి లావణ్య నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, జూకూరి రమేష్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
నాణ్యమైన విత్తనాలు అందిస్తాం
నల్లగొండ టౌన్ : వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిసాత్మని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాతిద్య భవన్లో జిల్లాలోని విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, ఇందుకు దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరం ఉందని అంచనా వేశామని, ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 50 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరితో పాటు పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయితీ విత్తనాల పైనే దృష్టి పెట్టడం సరికాదని, రాయితీ లేని విత్తనాలను కూడా రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వానాకాలానికి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను కూడా సమయానికి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి -
ఎస్బీఐ దేవరకొండ శాఖలో ఘరానా మోసం
నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అగ్రికల్చర్(కమర్షియల్) బ్రాంచ్లో ఆర్థిక మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో లెండల చక్రపాణి అనే వ్యక్తి ఐదేళ్లుగా కాంట్రాక్టు బేసిక్పై హౌస్కీపింగ్గా పనిచేస్తున్నాడు. అతడికి కంప్యూటర్ పరిజ్ఞానం తెలియడం వల్ల బ్యాంకు సిబ్బందికి కంప్యూటర్ పనుల్లో సాయం చేసేవాడు. దీంతో బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి, ఖాతాల నిర్వహణపై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో అతడికి సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేసే పుట్ట వెంకటరామాంజనేయులుతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చక్రపాణి.. వెంకటరామాంజనేయులుతో కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరామాంజనేయులు తన పరిధిలో ఉన్న ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్పర్మేషన్ సిస్టం) ద్వారా ఎస్బీఐలో గత కొన్నేళ్లుగా ఇన్యాక్టివ్గా ఉన్న 10 ఖాతాల వివరాలు సేకరించాడు. ఆ తర్వాత చక్రపాణి ఖాతాదారుల పేరు, చిరునామా, ఆధార్, పాన్ కార్డు, ఫొటో, సంతకాల వివరాలు సేకరించి నకిలీ ఆధార్, పాన్కార్డులు తయారు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల లాగిన్ వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్లో లాగిన్ అయి ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లు అప్లోడ్ చేశాడు. తర్వాత యోనో యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీ పాస్వర్డ్లు, పిన్ నంబర్లు సృష్టించాడు. మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివ ద్వారా తెలిసిన వ్యక్తులకు ‘మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. నగదు ఇవ్వండి. ఇది లీగల్ వ్యవహారం’ అని చెప్పి, కమిషన్ ఆశ చూపి బ్యాంకు ఖాతాలు వివరాలు సేకరించారు. అనంతరం ఇన్యాక్టివ్ ఖాతాల్లోని రూ.2.65 కోట్ల నగదును ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తం డబ్బులో 45 శాతం చక్రపాణి, పుట్ట వెంకన్న రామాంజనేయులు, రామ్లాల్, మారేపల్లి శివకు 10 శాతం వాటాలు ముందే పంచుకున్నారు. ఇలా వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలో నిందితులు హైదరాబాద్లోని కోఠి ఎస్బీఐ బ్రాంచ్లో నరేందర్ అనే వ్యక్తి ఖాతాకు అక్రమంగా కేవైసీ అప్డేట్ చేయగా.. ఆయన ఇటీవల బ్యాంకును సంప్రదించడంతో అసలు విష యం బయటపడింది. ఈ మోసం దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకటరాఘవపూడి ఈ నెల 13న దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ ఇన్యాక్టివ్ ఖాతాల నుంచి నగదు కొట్టేసిన కాంట్రాక్టు ఉద్యోగి ఫ నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురి అరెస్టు ఫ రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్ర పవార్దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు లెండల చక్రపాణితో పాటు అతడికి సహకరించిన సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకటరామాంజనేయులు, మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.10 కోట్ల నగదు, బెనిఫిషరీ ఖాతాల నుంచి రూ.1.31 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. అదేవిధంగా ఆరు సెల్ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ రాజు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
రైతుభరోసా రూ.267 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేసింది. జిల్లాలో 5,20,741 మంది రైతుల ఖాతాల్లో రూ.267.81 కోట్లు జమచేసింది. ఇప్పటి వరకు మొదటి, రెండవ విడతలు కలిపి 5,40,693 మంది రైతుల ఖాతాల్లో రూ.448,09,89,256 జమ చేసింది. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అయ్యింది. పౌష్టికాహారం అందించడమే లక్ష్యంరామగిరి(నల్లగొండ) : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. అంగన్వాడీ ప్రీస్కూల్ పిల్లల సంఖ్య పెంచాలన్నారు. తల్లులకు పోషకాహార విలువపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల, ఎంపీడీఓ యాకుబ్నాయక్, సూపర్వైజర్లు పద్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు బదిలీ ● నూతన డీఎస్పీగా తుమ్మ ఆనంద్రెడ్డి మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజును బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంటలిజెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న తుమ్మ ఆనంద్రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీగా పంపారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సందర్భంగా బదిలీపై వెళుతున్న డీఎస్పీ కె.రాజశేఖరరాజు మాట్లాడుతూ.. మిర్యాలగూడ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడిలో సహకరించిన సీఐలు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తుమ్మ ఆనంద్రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా, హాలియా, మిర్యాలగూడ సీఐగా, హాలియా ఎస్ఐగా పనిచేసిన చేశారు. నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. విద్యార్థులకు పోటీలు నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వం, క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు 26వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించాలని సూచించారు. మేడేను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఇళ్ల అద్దెలు, ధరలు, విద్య, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారమయ్యాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికుల సంఘటితమై తమ బతుకులు మార్చుకోడానికి ఈ మేడేను ఉద్యమంలా జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, పోలే సత్యనారాయణ, భీమగాని గణేశ్, అద్దంకి నరసింహ, జంజరాల శ్రీనివాస్, సలివోజు సైదాచారి, గంజి రాజేష్, సుంకరబోయిన వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ.. మహిళా వ్యతిరేకి
ఫ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని, పార్లమెంట్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారీశక్తి వందన్ 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తి వివరాలు వెల్లడించినా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ జరిగితే మహిళకు అన్ని చట్టసభల్లో అధిక సీట్లు లభిస్తాయన్నారు.తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్న 17 సీట్ల లోక్సభ సీట్లు 25 వరకు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకుండానే.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, కంకణాల నివేధిత, రేవతి, విజయలక్ష్మి, అరుణ పాల్గొన్నారు. -
రైతులకు రెండో విడత భరోసా
నల్లగొండ అగ్రికల్చర్ : అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరగనున్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 23న ప్రభుత్వం మొదటి విడత కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రెండో విడత నిధుల విడుదలలో కొంత జాప్యం జరగడంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ, ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడవ విడత నిధులను కూడా జమ చేసి, ఈ సీజన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.268.57 కోట్లు ప్రభుత్వం మొదటి విడతలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి ధాన్యం విక్రయాల్లో బిజీగా ఉన్న రైతులు, త్వరలోనే వానాకాలం సీజన్కు సన్నద్ధం కానున్నారు. జూన్ మొదటి వారం నుంచి దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి పనులకు భారీగా పెట్టుబడి అవసరమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు రైతులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ఫ నేడు అన్నదాతల ఖాతాల్లోకిపెట్టుబడి సాయం ఫ నిధులు విడుదల చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు -
కాంగ్రెస్ పార్టీది చరిత్రాత్మక తప్పిదం
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి హాలియా : మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీది చారిత్రక తప్పిదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదితరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహాశైలికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హాలియా పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతపై గంబీర ఉపన్యాసాలు చేసే ఇండియా కూటమి నాయకులు మహిళల హక్కుల, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఆడ్డుకుంన్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు ఉన్నారు. -
సామాజిక విప్లవకారులు.. ఫూలే, అంబేడ్కర్
నల్లగొండ టౌన్ : సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్ అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబ్బాస్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఫూలే, అంబేడ్కర్ జన జాతర సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఫూలే, అంబేడ్కర్ భారతీయ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపనకు శాసీ్త్రయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులు అన్నారు. ఫూలే విద్యను.. సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేశారని, అంబేడ్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సంస్థాగతంగా స్థాపించారని చెప్పారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ అవమానాలకు గురవుతున్న అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అక్షరాలను ఆయుధంగా ఎంచుకుని ఫూలే, అంబేడ్కర్ చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది దర్శనం నరసింహ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, రేముడాల పరుశరాములు, గాదె లింగస్వామి, నేలపట్ల సత్యనారాయణ, కొలగాని పర్వతాలు, ఎడ్ల సైదులు, మల్లెపాక వెంకన్న, మామిడి సైదులు, బకరం శ్రీనివాస్, మానుపాటి భిక్షమయ్య, రజియోద్దీన్, బోనగిరి దేవేందర్, పందుల సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే మహిళా సాధికారత
నల్లగొండ : మహిళా సాధికారత కోసం పాటుపడిన ఏకై క పార్టీ కాంగ్రెస్ అని నేత అన్నారు. నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ యూపీఏ చైర్ పర్సన్గా దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో మహిళలను అధ్యక్షులుగా చేశారా? ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు. డీలిమిటేషన్లో మహిళల బిల్లులను తీసుకురావడం పెద్ద కుట్ర అని విమర్శించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ఇప్పుడున్న సభ్యుల ఆధారంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, రవీందర్రెడ్డి, తోటకూరి పరుశురాములు, ముంతాజ్ అలీ, చర్లపల్లి గౌతం పగిళ్ల రాజు, రవితేజ, సాగర్రెడ్డి, వేముల గోపీనాథ్, అశోక్, ఇంధనూరి శీను, పరశురాం, చకిలం ఫణికుమార్, శ్రీను నాగార్జునగౌడ్, శరత్, పరశురాం, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ -
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
గుర్రంపోడు : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచాయని, మిగిలిన రెండున్నరేళ్లలో చివరి ఏడాది ఎన్నికల ఏడాదిపోగా ఏడాదిన్నర సమయమే ఉందన్నారు. కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టాలని, ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించాలని.. బీఆర్ఎస్ అధికారం రాగానే వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వాళ్లకే అర్థమైందన్నారు. అందుకే వారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎస్ఎల్బీపీ టన్నెల్ బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన టన్నెల్లో శవాలను కూడా తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రమాద స్థలానికి టూరిస్టు ప్లేస్కు వచ్చినట్లు మంత్రులు విమానంలో చక్కర్లు కొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ఇంకా ఏమీ లేదని అయిపోయిందన్నారని, రుణమాఫీ చేసింది కేవలం 40 శాతమేనని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారని, మళ్లీ సీఎంగా కేసీఆర్ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు ఆయన తానేదార్పల్లి వద్ద కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్రావుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రబాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, పల్లె రవికుమార్, ఎన్ఆర్ఐ అమెరికా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు -
రేణుకా ఎల్లమ్మకు పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నికనల్లగొండ టూటౌన్ : అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నికలు ఆదివారం నల్లగొండలో నిర్వహించారు. అధ్యక్షుడిగా ఈసం మారయ్య, ప్రధాన కార్యదర్శిగా గోలి మల్లేష్, ఉపాధ్యక్షులుగా గాదరి సుందరయ్య, కూకుంట్ల ఫిలిప్స్ కుమార్, కోశాధికారిగా సింగం వెంకటయ్య, సహాయ కార్యదర్శులుగా రాసవల్ల శ్రీనివాస్, పెరమళ్ల వినయ్కుమార్, సాంస్కృతిక కార్యదర్శిగా ఈసం యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన బుచ్చిరాములు, గోలి మల్లేశానికి నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. పంచభూతాల కలయికే హిందుత్వంచౌటుప్పల్ : పంచభూతాల కలయికే హిందుత్వమని త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవాప్రతి వాసుదేవానంద సరస్వతి తెలిపారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుదేవానంద సరస్వతి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. హిందుత్వం అంటే సమానత్వమన్నారు. కులాలు ఏవైనా అందరూ కలిసిమెలిసి జీవనం సాగించమని చెప్పేదే హిందుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్న సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పౌరులు సన్మార్గంలో నడవాలంటే హనుమాన్ చాలిసా చదవాలని, లేదంటే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖలకు వెళ్లాలని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మాట్లాడుతూ.. మనిషికి నైతిక విలువలు ఎంతో అవసరమని తెలిపారు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా నైతిక విలువలు, క్రమశిక్షణ లేకుంటే జీవితం వ్యర్ధమన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కేవీబీ.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సమ్మేళన సమితి ప్రధాన కార్యదర్శి కొసునం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, ప్రతినిధులు బడుగు శ్రీరాములు, పోలోజు రాజుచారి తదితరులు పాల్గొన్నారు. -
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఏబీఆర్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, పొడపంగి ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
సూర్యాపేటటౌన్ : ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరాబాద్ గ్రామానికి చెందిన కొల్లు సందీప్(28) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో పనులు ముగించుకొని మరో వ్యక్తితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. కాసరాబాద్ గ్రామ సపమీంలోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యనల్లగొండ : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య(19)కు నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్కు చెందిన శివతో ఆరునెలల క్రితం వివాహమైంది. కాగా ఐశ్వర్య శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు ఐశ్వర్య తల్లిదండ్రులు ఆదివారం నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ దేవరకొండ : గంజాయి కలిగిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి సమీపంలోని పల్లీ మిల్లులో బిహార్కు చెందిన ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. శనివారం వారు దేవరకొండలోని రహదారి బంగ్లా సమీపంలో గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్, ఆటోను ఢీకొట్టిన కారు
మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ముక్కెర్ల చంద్రయ్య(70) బైక్పై మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. వలిగొండ నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
భువనగిరి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పాఠాలు బోధించడం, రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పాఠ్యపుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 44 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, తాగునీరు, ఫ్యాన్లతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలందించేందుకు పరీక్ష కేంద్రాలలో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ఫోన్లు అనుమతించబడదు.ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా.. జిల్లా తరగతి హాజరుకానున్న పరీక్ష విద్యార్థులు కేంద్రాలు నల్లగొండ టెన్త్ 1,611 08 ఇంటర్ 2,226 10 సూర్యాపేట టెన్త్ 990 06 ఇంటర్ 2,012 11 యాదాద్రి టెన్త్ 569 04 ఇంటర్ 1,427 05 టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,835 మంది విద్యార్థులు -
అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు
కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం మృతిచెందగా.. అప్పు ఇచ్చిన బాధితులు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామానికి చెందిన వరికుప్పల శేఖర్ కొండమల్లేపల్లి మండల కేంద్రం సమీపంలోని దోనియాల గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఇస్తరాకులు తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరేళ్ల నుండి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో అప్పు ఇచ్చిన వారికి వడ్డీలు బాగానే కట్టి నమ్మకం పెంచుకున్నాడు. దీంతో అమాయక ప్రజలు బయట రూ.2 వడ్డీకి బయట అప్పులు తెచ్చి శేఖర్కు అధిక వడ్డీకి ఇచ్చారు. ఈవిధంగా శేఖర్ సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం ఏడాది నుంచి ఇబ్బందులు.. అయితే శేఖర్ గత ఏడాది నుంచి అప్పులు ఇచ్చిన వారికి సక్రమంగా వడ్డీలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా మూడు నెలల క్రితం శేఖర్ గుండెకు స్టంట్ వేసినట్లు అతడి ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి శేఖర్పై ఒత్తిడి పెరగడంతో డబ్బులు తెస్తానని కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు బెంగళూరుకు వెళ్లి శేఖర్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కొండమల్లేపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శేఖర్కు అప్పులిచ్చిన బాధితులంతా అతడి ఇంటి వద్దకు చేరుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బాధితులు 50 మంది కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇటీవల పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాకు చెందిన బాలాజీనాయక్, మధునాయక్ అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ఘటన మరువక ముందే కొండమల్లేపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు. అప్పు తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి మృతుడి ఇంటి వద్ద ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు -
వైభవంగా విశ్వశాంతి మహాయాగం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వశాంతి మహాయాగం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం యాదగిరిగుట్ట ఆయల రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు సమక్షంలో గణపతి పూజ జరిపించారు. అనంతరం 108 జంటలతో సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయాగం, 1008 మందితో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3వేలకు పైగా భక్తులు ఆయా వేడుకల్లో పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన విశేష కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు, ట్రస్టు ప్రతినిధులు పూల రవీందర్, ఆకుల లలిత, డాక్టర్ పుంజాల వినయ్కుమార్, రుద్ర సంతోష్కుమార్, పలుగుల శ్రీనివాస్, పోతంశెట్టి అనిల్కుమార్, పుప్పాల నరసింహులు, సంగాని రజినికాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, ఆవుల సురేందర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
ఏనుగు నర్సింహారెడ్డి యువతకు ఆదర్శనీయుడు
చిట్యాల : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన చిట్యాల పట్టణ వాసి ఏనుగు నర్సింహారెడ్డి నేటి యువతకు ఆదర్శనీయుడని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణంలో ఏనుగు నర్సింహారెడ్డికి ప్రమోద సాహితి సంస్థ, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జస్టిస్ కుకుడాల లక్ష్మణ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం హాజరయ్యారు. ఈ సందర్భంగా కుకుడాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి పేదరికంలో ఉండి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. సాహిత్య రంగంలోనూ రాణిస్తున్న నర్సింహారెడ్డి భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకుని మంచి గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన 19 పుస్తకాలను రచించడంతో పాటు మరో ఎన్నో సాహిత్య సమీక్షలను, కవిత్వాలను రాసి ఇరవై రెండు వరకు అవార్డులు పొందారని పేర్కొన్నారు. తెలుగు భాషే నిలబెట్టింది.. అనంతరం ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనకు చిన్ననాడు చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయుల ద్వారా తెలుగు భాషపై అభిమానం ఏర్పడిందన్నారు. తెలుగు భాష ద్వారానే సాహిత్య రంగంలో ఎన్నో పుస్తకాలు రాశానన్నారు. అంతేకాకుండా తెలుగు భాష ద్వారా గ్రూప్–2 రాసి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ఇప్పుడు ఐఏఎస్ హోదాను పొందానని గుర్తుచేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తనకు పౌర సన్మానం చేసిన ప్రమోద సాహితీ సంస్థతో పాటు తన చిన్ననాటి స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్తో పాటు సాహితీవేత్తలు తండు కృష్ణకౌండిన్య, ఏభూషి నర్సింహ, సాగర్ల సత్తయ్య, సిలివేరు నర్సింహ, పాటి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ -
అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతి
కనగల్ : అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతిచెందాడు. వివరాలు.. కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ పరిధిలోని వేద ఫంక్షన్హాల్–2 లో ఇద్దరు వాచ్మెన్ల మధ్య పాత నూనె డబ్బాల విషయంలో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ ఘటనలో కనగల్ గ్రామానికి చెందిన వాచ్మెన్ దొమ్మాటి సైదులు(56)పై గుర్రంపోడు మండలం గన్సిరాంతండాకు చెందిన మెగావత్ గోపీనాయక్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని సైదులు భార్యకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం అతడిని నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గోపినాయక్ దాడి కారణంగానే తన భర్త సైదులు మరణించాడని మృతుడి భార్య అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు సీఐ కే. ఆదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎస్. రామయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సైదులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మృతుడితో గొడవపడిన గోపినాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
జి.ఎడవెల్లి వాగు పరిశీలన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్ మండల పరిధిలోని జి.ఎడవెల్లి వాగును శనివారం అధికారులు సందర్శించారు. అనుమతులు లేకుండా వాగులో నెల రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో ‘తోడెయ్.. అమ్మెయ్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆదేశాల మేరకు వాగులో ఇసుక తవ్వకాలు జరిపిన స్థలాన్ని సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్ పద్మ, ఆర్ఐ సునీత, మైనింగ్ శాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి.యడవల్లి వాగు నుంచి ఇసుక తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవని.. జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరిపితే కఠిన తప్పవని హెచ్చరించారు. వాగు నుంచి అక్రమ రవాణా సాగించే దారుల్లో గుంతలు తీయిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మెపాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలిదేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్రావు అన్నారు. శనివారం ఆయన దేవరకొండ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కెవిఎస్.హరీష్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమమహేష్, వనం జగదీష్, న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి గౌరీశంకర్, నెమ్మికంటి రమాశంకర్, షౌకత్అలీ, ఇంద్ర వరప్రసాద్, అశోక్గౌడ్, రవి, శ్రీకాంత్, ఇద్దయ్య, గణేష్, ఆంజనేయులు, కృష్ణ, సురేష్, సాయి, శేఖర్ తదితరులున్నారు. -
ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి
నల్లగొండ : యాసంగి ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మిల్లర్లు.. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉంటుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తాలు, తరుగు సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 4 లక్షలు ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండేవని.. ఇప్పుడు 40 వేల ఎకరాలకు పడిపోయాయని.. రైతులు తిరిగి బత్తాయి సాగు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీ వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. సాదాబైనామా కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 330 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, గోపాల్, ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్లగొండ కార్యదర్శి భద్రాద్రి రాములు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఏఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
ఇంటి యజమానిగా మహిళలు 22.46 శాతమే..
ఫ ఓసీల్లో అత్యధికంగా వృద్ధులు ఫ నిరక్షరాస్యులు ఎస్సీల్లోనే అధికం ఫ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, కుల సర్వేలో వెల్లడి సామాజిక వర్గాల వారీగా ఇళ్లు.. జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు (బీసీల్లో, ఓసీలు అన్నీ కలిపి ఓసీల్లో కలిపి) నల్లగొండ 98,367 67,652 2,53,817 28948 62,854 5,11,638 సూర్యాపేట 75,102 49,525 1,75,323 22582 49,000 3,71,532 యాదాద్రి 48,753 15,494 1,57,310 8803 30,406 2,60,766 -
మహిళలను కించపరిచిన ప్రతిపక్షాలు
నకిరేకల్ : భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించి మహిళలను కించపరిచాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సగం జనాభా ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని.. కానీ, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే నాయకుల ఆటలు సాగవనే భయంతో అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి మోహన్, కిసాన్ మోర్చా నాయకుడు గోలి మధుసూధన్రెడ్డి, చినేని జాని, యానాల శంకర్రెడ్డి, పల్స శ్రీనుగౌడ్, యానాల శ్రీనివాస్రెడ్డి, చెనగాని రాములు, పందాల సైదులు, పెండెం పురుషోత్తం, గాయం మహేష్రెడ్డి, శ్రీకాంత్, ఏర్పుల అంజి తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి -
నిరక్షరాస్యులు ఎస్సీల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాలో 15 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఎస్సీల్లోనే ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 31.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 46.9 శాతం మంది ఉన్నట్లు తేలింది. సూర్యాపేట జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 30.4 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 26.8 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరక్షరాస్యుల శాతం ఇలా.. జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 31.9 46.9 31.9 31.0 34.5 26.9 10.3 35.5 19.1 18.7 సూర్యాపేట 30.4 40.9 32.6 30.2 34.3 26.4 26.2 33.4 25.7 17.2 యాదాద్రి 26.8 40.9 28.6 26.1 30.2 22.6 9.7 29.7 18.7 20.0 -
కొనుగోళ్లలో కొర్రీలు పెట్టొద్దు
తిప్పర్తి : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాలు, చెత్త పేరుతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినా మిల్లర్లు కోత విధిస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. మిల్లుల వద్ద లారీలను రెండు రోజులపాటు నిలిపివేసి.. ఆ తరువాత కోత విధిస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన చేస్తున్నట్లు తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి.. కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులతో మాట్లాడిన ఆర్డీఓ అశోక్రెడ్డి తిప్పర్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆర్డీఓ అశోక్రెడ్డి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల రాశుల నుంచి ఒక బస్తా ధాన్యం తూర్పార బట్టి అందులో ఎంతశాతం తాలు వస్తుందో దాని ప్రకారం కొత విధించేలా మిల్లర్లతో మాట్లాడతామని తెలిపారు. -
విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్డ్రిల్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జెన్కో ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో శనివారం అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో చీఫ్ ఇంజినీర్ మంగేష్కుమార్ మాట్లాడుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డీఐజీ మాధవరావు ఉత్తర్వుల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా అడ్డుకోవాలి, ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంలో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, జెన్కో డీఈ, ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ ప్రతాప్నాయుడు, ఆర్ఐ శ్రీనివాసరావు ఉన్నారు.జెన్కో ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది -
జి.ఎడవెల్లి వాగులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
ఫ అర్ధరాత్రి వేళలో జేసీబీతో తోడేస్తున్న వ్యాపారులు ఫ అనుమతుల పేరుతో పగటి పూట కూడా రవాణా ఫ అధికార పార్టీ నాయకుడి అండతో రెచ్చిపోతున్న కొందరు ఫ చోద్యం చూస్తున్న పోలీస్ అధికారులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్ మండలంలో ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కొందరు అర్ధరాత్రి వేళ జి.ఎడవెల్లి వాగును తోడేస్తున్నారు. ఇసుక తవ్వకంపై రైతులు, గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడితో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలలో సగం రోజులు ఇందే తంతు.. నెలలో 15 రోజుల వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాగులోకి జేసీబీని ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే పగటి పూట కూడా అనుమతుల మాటున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇదే విషయంపై పలుమార్లు పైస్థాయి అధికారులకు కూడా సమాచారం అందించినా వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల వెనుకడుగు! ఒకవేళ పక్కా సమాచారంతో జేసీబీ, ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించినా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా తమనే బెదిరిస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. వదలమంటే సదరు నాయకుడు రంగంలోకి దిగి ట్రాక్టర్లు స్టేషన్కు తీసుకొచ్చిన మరుసటి రోజే రాజకీయ పైరవీలు చేసి దర్జాగా బయటకు తీసుకెళ్తున్నాడు. చేసేదేమీలేక స్టేషన్కు వచ్చిన ఇసుక ట్రాక్టర్లను బయటికి పంపిస్తున్నారు. దీంతో రైతులు, గ్రామస్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు పట్టుకునేది ఎందుకు, స్టేషన్ తీసుకువచ్చేది ఎందుకు, వదిలి పెట్టేది ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వాగులోకి జేసీబీని దింపి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నా దళారుల్లో మార్పు రావడం లేదు. రాజకీయ నాయకుల అండతో కొన్ని గంటల్లోనే బయటకు వచ్చి మళ్ళీ దందా మొదలుపెడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలి. – కందుల లక్ష్మయ్య, జి.ఎడవెల్లి ప్రస్తుతం కనగల్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజీవ్రెడ్డి అందరి ఎస్ఐల మాదిరిగా కాకుండా వచ్చి రాగానే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎలాంటి రాజకీయ పైరవీలకు తావులేకుండా అనేక ట్రాక్టర్లు, జేసీబీలపై కేసులు నమోదు చేసి ఇసుక వ్యాపారుల్లో వణుకు పుట్టించారు. కానీ జి.ఎడవెల్లిలో మాత్రం ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ ముఖ్య నేత కావడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ ఎస్ఐకి మంచి పేరు ఉన్నప్పటికీ.. ఒక్క జి.ఎడవెల్లి వాగు విషయంలో మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు గతంలో ఇక్కడ పనిచేసిన మరో ఎస్ఐ ఆ సదరు నేత తీరు వల్ల స్వచ్ఛందంగా వేరేవేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. జి.ఎడవల్లి వాగులో అక్రమ ఇసుక రవాణాపై సమాచారం వస్తోంది. ఇటీవలే ఒక జేసీబీ, ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశాం. అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మాపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. – రాజీవ్రెడ్డి, ఎస్ఐ, కనగల్ -
ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అర్థరహితం
నల్లగొండ : పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్–భారత్ విభజనతో పోల్చడడం అర్థ రహిత మని జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ నల్లగొండలోని గడియారం సెంటర్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పున్న కై లాష్ మాట్లాడుతూ బలిదానాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బీజేపీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్రెడ్డి లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రధాని మోదీ, అమిత్సా కుట్ర పన్నుతున్నారన్నారు. ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకలు ముంతాజ్ అలీ, పెరిక వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి పరమేష్, నోముల జనార్దన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, చింతమల్ల వెంకటయ్య, వేముల గోపినాథ్, తగుళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సాగర్రెడ్డి, హరీష్, పల్లా రవితేజ, వెంకన్న, శ్రీను, అంజయ్య, అజీజ్ పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య పూజలు కొనసాగాయి. ప్రధానంగా లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజ ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. గట్టుపైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకున్నారు. పూజ కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ వరాల రమేష్, వార్డు సభ్యులు శ్రీకాంత్, సాయి పాల్గొన్నారు.


