
గుండెపోటుతో హెడ్కానిస్టేబుల్ మృతి
తిరుమలగిరి: విధి నిర్వహణలో ఉన్న హెడ్కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గన్యానాయక్తండాకు చెందిన రమేష్ రాథోడ్(49) హెడ్కానిస్టేబుల్గా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రమేష్ రాథోడ్కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుర్చీలోనే కూలబడిపోయాడు. తోటి సిబ్బంది గమనించి వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య, కుమార్తె ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమా ర్తె, ఉన్నారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.