breaking news
Dr B R Ambedkar Konaseema
-
వైఎస్సార్సీపీ నేత జగ్గిరెడ్డి అక్రమ అరెస్ట్
రావులపాలెం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. పోలీసుల సహకారంతో కూటమినేతలు రెచ్చిపోయారు. రావులపాలెంలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు కూటమి నేతలు. అనుమతులు లేని ప్రాంతంలో విగ్రహం పెట్టడంపై జగ్గిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ప్రదేశంలో ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గతంలో తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా జగ్గిరెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గిరెడ్డిని రావులపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ద్రాక్షారామంలో శివాలయంపై దాడి.. నిందితుడు టీడీపీ కార్యకర్త?
సాక్షి, ద్రాక్షారామం: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అనంతరం, మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘ద్రాక్షారామాం ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడం దారుణం. ఎటువంటి సంప్రోక్షణ చెప్పకుండా హడావిడిగా మరో లింగాన్ని ఎందుకు ప్రతిష్టించారు. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే?. ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్గా ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించారు.మరోవైపు.. దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ..‘ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?. ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునః ప్రతిష్టించటం అపచారం కాదా?. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారు?. ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు?. చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి సోదరుడు అధికార టీడీపీ కార్యకర్త అని తెలిసింది. నిందితుడు కూడా టీడీపీ కార్యకర్త అని సమాచారం. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్కల కొట్లాట వంటిదని కృష్ణుడికి ధర్మరాజు విన్నవించుకుంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సిందిగా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మరాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పోయి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని మేం అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ధర్మజుడి మాటల్లో ఆయన శరణాగతి కనపడుతోందని అన్నారు. ఇక కర్ణ దుర్యోధనులది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని వ్యాఖ్యానించారు. ‘‘అర్జునుడిని ఎదుర్కోవడానికి తగిన వాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే తలంపుతో దుర్యోధనుడి అండ చేరాడు కర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆదర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్య నిర్వహణకు వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నారు. సంజయునికి ధృతరాష్ట్రుడు కృష్ణ తత్త్వాన్ని వివరిస్తాడన్నారు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలో ఉన్న జీవుడు ఒకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్న జీవుడు మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం షాపులను మూయించాలి
అమలాపురం రూరల్: నూతన సంవత్సర వేడుకల పేరుతో జరుగుతున్న విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు, మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి డిసెంబర్ 30, 31 జనవరి 1వ తేదీలలో మద్యం షాపులను పూర్తిస్థాయిలో మూసివేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవ కృప, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారేం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏటా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మందుబాబు మద్యం తాగి అర్ధరాత్రి వేళల్లో చేసే రచ్చతో మహిళలు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. -
కోటి ఆశలతో..
అమలాపురంగడియార స్తంభం సెంటర్ సాక్షి, అమలాపురం: నూతన సంవత్సరం అనగానే కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో గడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వ్యవసాయం బాగుండాలని రైతు, ఉద్యోగ అవకాశాలు పెరగాలని నిరుద్యోగి, మెరుగైన జీతభత్యాలు రావాలని ఉద్యోగి, తమకు వ్యక్తిగత భద్రత, ఆర్థిక భరోసా కావాలని మహిళలు, ఉన్నత చదువులకు చేయూత దక్కాలని విద్యార్థి.. ఇలా సమాజంలో అన్ని రంగాల వారూ ఆశలు పెట్టకుంటారు. గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరచి, రాబోయే కొత్త సంవత్సరంలో తమ జీవితాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తారు. మరి కొద్ది గంటలలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజలు తమ జీవితాలు నవీన పథంలో పయణించాలని కోరుకుంటున్నారు. అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ప్రభుత్వం నాటి సంక్షేమ ఫలాలు అందాలని బడుగు, బలహీన, మధ్య తరగతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పేద, మధ్య తరగతి, రైతు వ్యతిరేక విధానాలతో సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. తమ ఆశలు.. ఆకాంక్షలను ‘సాక్షి’కి వివరించారు. కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి అన్ని రంగాలూ వృద్ధి చెందాలి చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి సంక్షేమ ఫలాలు అందాలి జిల్లా ప్రజల ఆకాంక్ష -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
అమలాపురం టౌన్: యూఎఫ్బీయూ పిలుపు మేరకు కోనసీమలోని అన్ని బ్యాంక్ల ఉద్యోగులు అమలాపురంలోని యూనియన్ బ్యాంక్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం సాయంత్రం ధర్నా చేశారు. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే అన్ని ప్రధాన బీమా సంస్థలతోపాటు ఆర్బీఐ, ఎల్ఐసీ, ఎస్ఈబీఐ తదితర సంస్థలు 5 రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయని బ్యాంక్ ఉద్యోగులు గుర్తు చేశారు. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ల ఉద్యోగులు తీవ్రమైన సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, అధిక లక్ష్యాలతో మానసిక, శారీరక ఒత్తిడితో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోనసీమ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణ, సెక్రటరీ బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ వై.గణేష్, సబ్ స్టాఫ్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు, అమలాపురం ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు, కోనసీమ జిల్లా ఎల్డీఎం కేశవ వర్మతోపాటు కోనసీమలోని పలు బ్యాంక్ల యూనియన్ల ప్రతినిధులు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. ఆకట్టుకున్న ఆటో కార్ట్ వాహనంఐ.పోలవరం: నైపుణ్య వృత్తి విద్యపై అమలాపురంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐ.పోలవరం జెడ్పీహెచ్ఎస్ ఒకేషనల్ జట్టు తయారు చేసిన కాలుష్య రహిత ఆటో కార్ట్ (ఈకో ఫ్రెండ్లీ గో కార్ట్) వాహనం ఆకట్టుకుంది. దాన్ని రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు నడిపారు. తయారు చేసిన విద్యార్థులు భరత్, గణేష్, రాఘవ సతీష్, ఎస్.మహేష్బాబుతో పాటు ఒకేషనల్ టీచర్ కె.సతీష్, టీమ్ను అభినందించారు. జిల్లా ఒకేషనల్ టీంలో జిల్లా బాలిక అభివృద్ధి అధికారి ఎంఏకేడీ భీమారావు, ఐ.పోలవరం జెడ్పీహెచ్ఎస్ ఒకేషనల్ ట్రైనర్లు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వృత్తి విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి పథకం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలతో ఆర్థిక వృద్ధి అమలాపురం రూరల్: జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కొబ్బరి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇంక్యుబేషన్ సెంటర్ డెవలప్చేసే విధానం, కొబ్బరి నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి డొక్క నుంచి ఫైబర్ యార్న్ కోకో ఫిట్, జియో టెక్స్టైల్స్ మాక్స్ తయారీ అంశాలపై చర్చించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్థానికంగా రైతులు కేవలం కొబ్బరి కాయలను విక్రయించి మిగిలిన కోయర్ విలువ ఆధారిత ఉత్పత్తులపై ఏ విధమైన ఆసక్తి చూపక నష్టపోతున్నారన్నారు. ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎన్ఆర్ఎల్ఎం, నాబార్డు సంస్థల ద్వారా కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఉప్పలగుప్తంలో ఏడు ఎకరాల స్థలాన్ని ఈ పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం జరిగిందన్నారు. పశు దాణా పథకం సత్ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పశుదాణా పథకం వల్ల కలిగిన లబ్ధి తదితర అంశాలపై సమీక్షించారు. -
పెరిగిన హత్యలు.. ఆగని చోరీలు
● రోడ్డు ప్రమాదాలూ అధికమే ● 2025లో ఎక్కువైన నేరాలు ● వార్షిక నేర సమీక్ష నివేదికను వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది (2025) జిల్లాలో హత్య కేసులు పెరిగాయి. అలాగే చోరీ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. జిల్లా మొత్తం మీద అన్ని రకాల కేసులకు సంబంధించి పెరుగుదల ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగాయి. 2025 సంవత్సరం వార్షిక నేర సమీక్ష నివేదికలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ విషయాలను వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజుతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక నేర సమీక్ష నివేదికలోని వివిధ నేరాల గణాంకాలను వివరించారు. ● 2025లో 112 కాల్ ద్వారా 9,096 ఫిర్యాదులు అందగా, వాటిలో 9,012 పరిష్కరించారు. ● ఈ ఏడాది సీఈఐఆర్ ద్వారా సుమారు రూ.1.10 కోట్ల విలువైన 550 సెల్ఫోన్లు రికవరీ చేశారు. ● ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 2,224 ఫిర్యాదులు రాగా వాటిలో 2,120 పరిష్కారమయ్యాయి. ● జిల్లాలో 42 సైబర్ నేరాలపై కేసులు నమోదయ్యాయి. 1930 సైబర్ పెట్రోల్ ద్వారా 975 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు నష్టపోయిన రూ.1.03 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా హోల్డ్ చేశారు. ● మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసుల వివరాలు, చోరీలు, ఆస్తుల రికవరీ, నిందితుల అరెస్ట్ వంటి వాటిని ఎస్పీ వివరించారు. కోడి పందేలు, పేకాట శిబిరాలు, గంజాయి, అక్రమ మద్యం, సారా కేసుల వివరాలు తెలిపారు. సంవత్సరం హత్యలు దొంగతనాలు రోడ్డు నమోదైన ప్రమాదాలు కేసులు 2024 9 416 572 6,747 2025 13 439 612 8393 -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
కడియం: వృద్ధురాలిని బెదిరించి నగదు, బంగారు చెవిదుద్దులు దోచుకున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు కడియం ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే..కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్కు చెందిన దువ్వారపు శాంతమ్మ అనే వృద్ధురాలు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళం నుంచి వచ్చి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో దిగింది. స్టేషన్ బయట ఆమెకు చైతన్య నగర్ వరకూ లిఫ్ట్ ఇస్తానంటూ దాసరి వీర వెంకట దుర్గాప్రసాద్ తన మోటారు సైకిల్ ఎక్కించుకున్నాడు. రాజవోలు నుంచి కడియం ఆవలోకి వచ్చే రోడ్డు సమీపంలో శాంతమ్మకు కత్తితో బెదిరించి బంగారం చెవిదుద్దులు, రూ.5 వేలు లాక్కున్నాడు. ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అదుపు తప్పి.. బోల్తా పడి..మామిడికుదురు: జాతీయ రహదారిపై పాశర్లపూడి వద్ద మంగళవారం వేకువ జామున ఓ కారు పంట బోదెలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం, కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురం వైపు నుంచి తాటిపాక వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఎడమ వైపున ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ కారులోని నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని రాజోలుకు చెందిన 108లో అమలాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొన్న వేగానికి కొబ్బరి చెట్టు నుంచి బొండాలు రాలిపడ్డాయి. -
ఇల వైకుంఠం.. కన్నుల వైభవం
● వైభవంగా ముక్కోటి ఏకాదశి ● ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం ● ఆలయాలకు పోటెత్తిన భక్తులు కొత్తపేట: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివార్లకు భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం భూలోక వైకుంఠంలా మారింది. ఆలయంతో పాటు ప్రాంగణం, వైకుంఠ ద్వారం, అంతరాలయాలను పుష్పాలతో విశేషంగా అలంకరించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు మంగళవారం తెల్లవారుజామున తిరుమల తరహాలో ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ఉత్సవ మూర్తులను, శేషపాన్పుపై ఉన్న స్వామివారిని, అనంతరం ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాల్లో భాగంగా గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రూ. 17.72 లక్షల ఆదాయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఒక్కరోజే రూ.17,71,782 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. గత ఏడాది ముక్కోటికి రూ.5,79,678 వచ్చిందన్నారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు: అప్పనపల్లిలోని బాల బాలాజీ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. అంతర్వేదిలో.. సఖినేటిపల్లి: అంతర్వేదిలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యాన అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. -
ఉద్యోగ అవకాశాలు పెరగాలి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉద్యోగాలూ కల్పించలేదు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. క్వాంటం కంప్యూటర్స్, గూగుల్ డేటా సెంటర్లు కేవలం వైజాగ్ వరకే పరిమితమవుతున్నాయి. కోనసీమ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాలి. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ దిశగా కొత్త సంవత్సరంలోనైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం. – సత్తి నాగ పల్లారెడ్డి, బీకాం కంప్యూటర్స్, రావులపాలెం పాత పెన్షన్ విధానం కావాలి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో సీపీఎస్, జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టెట్ పరీక్షల నుంచి 2010కు ముందున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వ కొత్త సంవత్సరంలో ఇస్తుందని ఆశిస్తున్నాను. – కటకటాల చంద్రశేఖర్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుడిమళ్లంక, మలికిపురం మండలం పంటకు లాభసాటి ధర ఇవ్వాలి రైతులు పండించే పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. పండించిన పంటకు లాభసాటి ధర ఇవ్వాలి. వరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సాధారణ రకం బస్తా (75 కేజీలకు)కు కనీసం రూ.రెండు వేలు నిర్ణయించాలి. జగన్ ప్రభుత్వంలో అమలు చేసినట్టుగా ఉచిత పంటల బీమా విధానాన్ని తీసుకు రావాలి. పంట నష్టపోయిన రైతులకు మూడు నెలల్లో పెట్టుబడి రాయితీ ఇవ్వాలి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, కొత్తూరు, రామచంద్రపురం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు మరో రెండు నెలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటాను. మెడికల్ రంగంపై ఆసక్తితో బైపీసీ చదువుతున్నాను. మెడికల్ సీట్ పొందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. అప్పుడే అందరికీ మేలు కలుగుతుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చదవడం ఖర్చుతో కూడుకున్నది. నూతన సంవత్సరంలో విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు చేస్తారని ఆశిస్తున్నాను. – ఎ.అంజలీదేవి, అంగర, కపిలేశ్వరపురం మండలం మహిళలకు లబ్ధి కలగాలి కొత్త సంవత్సరంలో మహిళలకు వ్యక్తిగత, ఆర్థిక భద్రత రావాలి. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని కొత్త ఏడాదిలోనైనా అమలు చేయాలి. మహిళకు ఇతర పథకాల లబ్ధి కూడా కలగాలి. వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. – చెల్లి రమాదేవి, కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం వ్యాపార రంగం తేరుకోవాలి జిల్లాలో వ్యాపార రంగం తీవ్ర ఒడిదొడుకులకు గురైంది. బంగారం, వెండి ధరల్లో అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభానికి అనుగుణంగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. చూసిన వారికి ఈ రెండింటి ధరలు పెరిగాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా కొందరు వ్యాపారులు మార్కెట్ హెచ్చుతగ్గులపై సరైన అవగాహన లేక నష్టపోయారు. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారులు ఆచితూచి లావాదేవీలు చేయాలి. కొత్త సంవత్సరంలో ప్రతి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. – అనిల్ జైన్, రాష్ట్ర బంగారు వర్తక సంఘం కోశాధికారి, అమలాపురం -
ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణమంటూ ధృత రాష్ట్రునితో సంజయుడు చెబుతాడని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని సోమవారం ఆయన కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవుల మధ్య జరిగిన అనేక చర్చోపచర్చలను ఆయన వివరించారు. ‘‘పాండవుల వద్దకు ధృతరాష్ట్రుని తరఫున సందేశాన్ని తీసుకువెళ్లిన సంజయుడు.. తిరిగి వచ్చి, ధర్మరాజు సహనానికి, సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. ధర్మరాజు మెత్తటి వాడే కానీ, చేతకాని వాడు కాడు. మనశ్శాంతి కోసం విదురుడిని ఆహ్వానించిన ధృతరాష్ట్రుడు.. జరుగుతున్న పరిణామాల వలన తాను నిద్రకు దూరమయ్యానని అంటాడు. ‘బలవంతుడు దండెత్తి వస్తే తగిన సాధనాలు లేని దుర్బలుడు, సంపద కోల్పోయిన వాడు, కాముకుడు, దొంగ– ఈ నలుగురికీ నిద్ర పట్టదు. నీలో ఈ దోషాలు లేవు కదా?’ అని విదురుడు అడుగుతాడు’’ అని వివరించారు. విదురనీతి, సనత్సుజాతీయం భారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవని, విదురనీతిని విద్యార్థి దశ నుంచే బోధించాలని సామవేదం అన్నారు. సామాన్య ప్రజలు, సీ్త్రలు సైతం ధర్మరాజు విజయాన్ని కాంక్షిస్తున్నారని ధృతరాష్ట్రునితో సంజయుడు అంటాడని చెప్పారు. కర్ణుడికి బ్రహ్మాస్త్రం పని చేయదని పరశురాముడు శపించడంలో కుల ప్రస్తావన లేదని, మోసంతో విద్యను నేర్చుకోవాలని కర్ణుడు భావించడమే ఆ శాపానికి కారణమని వివరించారు. ‘‘ఇటు ద్రోణ, కర్ణులు, అటు అర్జునుడనే ముగ్గురిలో ఏ ఒక్కరు మరణించినా శాంతి ఉంటుంది. అర్జునుడు, గాండీవం, కృష్ణుడు అనే మూడు శక్తులున్న చోటే జయం ఉంటుంది. నా కొడుకు నా మాట వినడు. నేనేం చేయాలి’’ అంటూ ధృతరాష్ట్రుడు విలపిస్తాడు. స్మరించగానే ధృతరాష్ట్రుని వద్దకు వ్యాసుడు వచ్చి, కృష్ణ మహిమను వివరిస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వలోకేశ్వరుడని నీకు తెలిసినట్టు నాకెందుకు తెలియదని వ్యాసుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నీవు అవిద్యలో ఉన్నవాడివి కనుక తెలుసుకోలేకపోతున్నావని వ్యాసుడు చెబుతాడు’’ అని చెప్పారు. ధృతరాష్ట్రుని మించిన శ్రోత లేడని, ఆసక్తికరంగా వింటాడని, లోపలకు ఎన్ని విషయాలు వెళ్తున్నాయో మనకు తెలీదని సామవేదం అన్నారు. పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి అవిద్యయే కారణమని చెప్పారు. -
‘ముక్కోటి’కి ముస్తాబు
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు ● ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు తూర్పు రాజగోపురం, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధానాలయం ఉత్తర ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 4 గంటలకు పండితులు స్వామి, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పిస్తారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. దీనికోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ భక్తులు దిగువ నుంచి ఆలయ ప్రాకారంలోకి క్యూలో ప్రవేశించాక.. దక్షిణ ద్వారం నుంచి లోపలకు వెళ్లి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు వచ్చేవారు. ముక్కోటి సందర్భంగా దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం వద్దనే ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్లను దర్శించి, అక్కడి నుంచి తూర్పు ద్వారం వైపు వెళ్లి, గర్భాలయంలో సత్యదేవుడు, అమ్మవారిని దర్శించుకుని, దక్షిణ ద్వారం వద్ద ఉన్న క్యూ లైనులో వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి వెండి గరుడ వాహనంపై అన్నవరం గ్రామంలో ఊరేగించనున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులతో ఆలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓ పెండ్యాల భాస్కర్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ మార్కెట్కు ఎరువులు
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం అమలాపురం టౌన్: జిల్లాలో ఎమ్మార్పీ ధరలకు ఎరువులు దక్కడం లేదని, సరకు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. కాట్రేనికోన మండలానికి చెందిన ఓ మహిళా రైతు ఎమ్మెల్సీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసింది. తాను పదెకరాలకు పైనే దేవస్థానం భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని, తనకు అతి కష్టంగా రెండే రెండు బస్తాల ఎరువులు దక్కాయని ఆమె ఎమ్మెల్సీ వద్ద వాపోయింది. అనంతరం ఆ మహిళా రైతు అమలాపురంలోని కలెక్టరేట్కు వెళ్లి గ్రీవెన్స్లో అన్నదాతలకు ఎరువులు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురంలో సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాతలు నేడు బ్లాక్ మార్కెట్లో దాదాపు రూ. 200కి పైగానే అదనపు ధరలను చెల్లించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా ప్రభుత్వం మాత్రం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుందని, ఇలాగైతే పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగుకు ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని లేకుంటే రైతుల పక్షాన నిరసన చేపడతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు. -
అర్జీలను పారదర్శకంగా పరిష్కరించండి
అమలాపురం రూరల్: ప్రజలు అందించిన ప్రతి అర్జీని పారదర్శకంగా పరిష్కరించాలని జేసీ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో కొత్త మాధవి, డ్వామా పథక సంచాలకులు ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీలతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలకు సంబంధించి మొత్తం 280 అర్జీలు వచ్చాయి. జేసీ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే సంకల్పాన్ని సాధించే దిశగా ఎంఎస్ఎంఈల ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీలను గడువు లోగా పరిష్కరించాలన్నారు. వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలుచోట్ల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. ఆ పత్రాలను ఎస్పీ పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. అర్జీదారుల సమక్షంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల సీఐలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు. జోనల్ స్థాయి స్పెల్బీ పోటీలకు ఎంపిక అల్లవరం: అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి స్పెల్బీ పోటీల్లో దేవగుప్తం ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థి కోలా లీలాశివకార్తిక్ ప్రథమ స్థానంలో నిలిచి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం వేణుగోపాల్ సోమవారం తెలిపారు. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఎన్సీఈఆర్టీ వారి ఆధ్వర్యంలో స్పెల్బీ పోటీలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి లీలా శివకార్తిక్కు ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థికి ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం.బాలశంకర్, సాయి సుబ్బలక్ష్మిని హెచ్ఎం, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. -
సాగనంపాలనే..
కపిలేశ్వరపురం: ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడా నికి గత అనుభవాలు మార్గదర్శకం అవుతాయి. జరిగి నవి ఘటనలుగా కాకుండా గుణపాఠాలుగా పరిగణించిన రోజున ప్రతి ఘటనా మనసును మీటే ప్రేరకమే అవుతోంది. 2025లో ఎన్నో మజిలీలు.. మరెన్నో విజయాలు, ఓటములు, దుర్ఘటనలు, ప్రకృతి విలాపాల ను ప్రతి ఒక్కరూ చవిచూశారు. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక తదితర ప్రజా సంఘాలు సైతం తమదైన శైలిలో పోరాడాయి. నిరసన.. జోరున ● జనవరి 2: తమను విధుల్లో కొనసాగించి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ కూట మి నేతలు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వలంటీర్లు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ● జనవరి 13: విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ● మార్చి 12: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యువత పోరు విజయవంతమైంది. ● ఏప్రిల్ 12: ‘సాక్షి’ దినపత్రికపై, ఎడిటర్పైనా వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పత్రికా విలేకరులు ఆందోళన చేశారు. ● ఏప్రిల్ 28: తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో ఆరోగ్య కేంద్రాల్లోని 400 మంది సీహెచ్ఓలు సమ్మె చేశారు. ● మే 7: రబీ ధాన్యంలో ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనాలంటూ అమలాపురంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ● జూన్ 23: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ● జూలై 2: ఇందుపల్లిలో జిల్లా స్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ● జూన్ 4: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన తెలిపారు. ● సెప్టెంబర్ 12, 13: జిల్లాలో సీ్త్రశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో కార్మికులు ఆటోలు బంద్ చేశారు. ● సెప్టెంబర్ 19: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కామనగరువులో గత ప్రభుత్వం ప్రారంభించిన పభుత్వ వైద్య కళాశాల భవనం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ● డిసెంబర్ 10: ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి, 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీలతో తరలించారు. అందరిలో మేటి.. కీర్తి చాటి ● జనవరి 26: ఢిల్లీలోని 76వ గణతంత్ర వేడుకలో ముక్కామలకు చెందిన నాగబాబు కళాకారుల బృందం ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది. కొత్తపేట కళాకారుల గరగ, వీరనాట్యం ప్రదర్శనకు గుర్తింపు దక్కింది. ● మార్చి 9: నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోరీ చేనేత సహకార సంఘం తయారు చేసిన వస్త్రాలను ప్రశంసించారు. ● జూన్ 15: వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం మహిళ చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచారు. ● ఆగస్టు 2: లండన్లో ఆరేళ్లలోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కొత్తపేటకు చెందిన తణుకు పూర్ణిమకు బ్రిటిష్ అత్యున్నత కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ (సీబీఈ) పురస్కారాన్ని బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనీ చేతుల మీదుగా అందజేశారు. ● ఆగస్టు 15: శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ నిర్వాహకులు రావులపాలేనికి చెందిన గొలుగూరి సతీష్రెడ్డి, పడాల సోమిరెడ్డి తదితరులను విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ నజీర్ అభినందించారు. తుదిశ్వాస విడిచి.. ● జూన్ 5: అమలాపురంలో కామాక్షి పీఠం స్థాపకుడు, అనాధాశ్రమం నిర్వాహకుడు కామేశ మహర్షి (87) తుదిశ్వాస విడిచారు. ● నవంబర్ 11: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు వెంకట సత్యసూర్య అచ్యుత రామరాజు (60) గుండెపోటుతో మృతి చెందారు. ● డిసెంబర్ 13: అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి (85) ఢిల్లీలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఏడాదిలో అనేక ఉద్యమాలు సమస్యలపై కదం తొక్కిన ప్రజలు చంద్రబాబు పాలనలో కానరాని కేంద్ర సాయం కలవరపెట్టిన ప్రముఖుల మరణాలు అనేక అనుభవాలను మూటకట్టిన 2025 -
థర్టీ ఫస్ట్ ధమాకా
● క్వార్టర్పై రూ.10 అదనం ● సామాజిక మధ్యమాల్లో హల్చల్● ముమ్మిడివరం నియోజకవర్గంలో దోపిడీ ● కీలక నేత వత్తాసు ● సిండికేట్లో 30 షాపులు వారివే సాక్షి, అమలాపురం: ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’... పాత సంవత్సరానికి ముగింపు రోజు. అంతేకాదు మందు బాబులకు పండగ రోజు. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారులు రెండు చేతులా సంపాదించే రోజు. సాధారణ రోజుల కన్నా సంవత్సరాంతం రెండు, మూడు రెట్లు సాగే వ్యాపారం కోసం మద్యం వ్యాపారులు చేసుకునే ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. సందట్లో సడేమియాగా జిల్లాలో మద్యం వ్యాపారులు దోపిడీకి సిద్ధమయ్యారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్కు అదనంగా సొమ్ము వసూలుకు తెగబడ్డారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటికే మొదలైన ఈ దోపిడీ జిల్లా అంతా విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో మద్యాన్ని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ దందా సాగుతోంది. క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దందాపై ఒక మద్యం ప్రియుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది హల్చల్ చేస్తోంది. మద్యం విక్రయాలు జరిపే ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘అదనపు ధర ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రత్యేకమని’ చెప్పడం గమనార్హం. సాధారణంగా బెల్టు షాపుల్లో మద్యం దుకాణాల కన్నా రూ.20 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ధరలు పెంచడంతో వీరు కూడా అదనంగా రూ.30 నుంచి రూ.40 పెంచి విక్రయిస్తున్నారు. ఆ నేత సోదరుడి హవా.. నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ కీలక నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది. వీరి ఆధ్వర్యంలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో సుమారు 30 మద్యం దుకాణాల వరకూ ఉన్నాయని అంచనా. దీనిని అడ్డు పెట్టుకుని మద్యం ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల కనుసన్నల్లోనే బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం కాస్తా మాఫియాగా మారిపోయింది. గతంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన విషయం గమనార్హం. మిగతా చోట్లా.. అదే బాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వ్యాపారంలో భారీ లబ్ధి ఆశిస్తున్న జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు కూడా ముమ్మిడివరం బాట పట్టే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గాల వారీగా సిండికేట్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అంబాజీపేటలో ఒక సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది. గత దసరా పండగ సమయంలో ఇక్కడ జరిగే భేతాళస్వామి ఉత్సవాలకు మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు క్వార్టర్కు రూ.50 చొప్పున పెంచి మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డోర్ డెలివరీ వ్యాపారం జోరందుకుంది. -
సాయం లేక.. సాగలేక..!
● అన్నదాతకు కలిసిరాని కాలం ● వరి సాగు తిరోగమనం ● రబీ ధాన్యం సొమ్ము జమలో జాప్యం ● ఖరీఫ్ను ముంచెత్తిన ప్రకృతి ● కొబ్బరి.. నింగి నుంచి నేలకు ● ఆదుకోని అరటి ● వనామీపై ట్రంపోత్పాతం ● చేయూత లేని బాబు సర్కార్ సాక్షి, అమలాపురం: క్యాలెండర్లలో తేదీలే కాదు.. సంవత్సరాలు మారుతున్నా కర్షకుడు కష్టాల నుంచి గట్టు ఎక్కలేకపోతున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు ఈ ఏడాది మన్నే మిగిలింది. ప్రకృతి ప్రకోపానికి, చంద్రబాబు సర్కార్ ఉదాసీన వైఖరికి అన్నదాత మరోసారి చిత్తయ్యాడు. ప్రకృతి శాపం కన్నా బాబు నిర్లక్ష్యంతో పుడమి పుత్రుడు నిలువునా మునిగిపోయాడు. 2025 సంవత్సరం వరి.. కొబ్బరి.. అరటి.. కూరగాయ పంటల నుంచి చివరకు వనామీ సాగు కూడా నష్టాలను మిగిల్చింది. వరి.. రెండు పంటలకు దెబ్బ ● జిల్లాలో ప్రధానమైన వరి ఈ ఏడాది కలసిరాలేదు. ఏడాది ఆరంభంలో రబీ పంట దిగుబడి బాగా వచ్చినా కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. కొన్న ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు జమ కాకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నీరు వదిలినా మధ్య డెల్టాలో లొల్ల, తూర్పు డెల్టాలో చొప్పెల్ల లాకుల వద్ద నిలిపివేసింది. తరువాత వదిలినా దిగువున లాకుల వద్ద నిలిపివేయడంతో ఖరీఫ్ ఆలస్యమైంది. ● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ప్రభుత్వం సకాలంలో నీరందించకపోవడం వల్ల కేవలం 1.53 లక్షల ఎకరాల్లో మాత్రమే ఖరీఫ్ సాగవుతోంది. ● సాగు మధ్యలో రైతులకు యూరియా కొరత ఏర్పడింది. యూరియా బస్తా రూ.266.50 కాగా రైతులు అదనంగా చెల్లించి రూ.400 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చింది. చివరకు ఖరీఫ్లో 30 నుంచి 35 బస్తాలు రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల సగటున 25 బస్తాల కన్నా తక్కువ వచ్చింది. ఎగసి‘పడిన’ కొబ్బరి కొబ్బరి ధర ఈ ఏడాది ఎగసిపడింది. మే నెల నుంచి సెప్టెంబరు నెల వరకు రికార్డు స్థాయి ధర వచ్చింది. పచ్చికొబ్బరి ధర రూ.28 వేల వరకు ఉండేది. అక్టోబరు నెలలో రూ.23 వేలకు పడిపోగా, నవంబరు 15 తరువాత రూ.13 వేలకు పడిపోయింది.రైతులకు ధాన్యం సొమ్ము ఇవ్వాలని ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు (ఫైల్) ధాన్యం సొమ్ము విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ట్రాక్టర్లను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్)వనామీని ముంచిన ట్రంప్ ● జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశాజనకంగా ఉన్న వనామీ సాగు ఆ తర్వాత తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మార్చిలో స్థానిక ఎగుమతిదారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించేశారు. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడంతో రొయ్యల ధరలు కౌంట్కు కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించడంతో ఆక్వా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే సమయంలో విద్యుత్ ఓల్టేజీ వల్ల నష్టపోతున్నామని ఆక్వా రైతులు రోడ్డున పడి ఆందోళన చేయాల్సి వచ్చింది. చేయిచ్చిన చంద్రబాబు సర్కార్ ● చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు అందిస్తామని చెప్పిన తొలి ఏడాదే ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇచ్చినా కొంతమంది రైతులకు కోత పెట్టింది. ● రబీ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే 24 గంటలలో వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినప్పటికీ మూడో నెలలో కాని సొమ్ము అందలేదు. రూ.248.65 కోట్లు అందించకపోవడంతో రైతులు అప్పులు పాలయ్యారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా విధానాన్ని ఎత్తివేసింది. జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా కేవలం 44,201 ఎకరాలు మాత్రమే బీమా పరిధిలో ఉన్నాయి. మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని పాందలేకపోయారు. బీమా పరిధిలో లేని వారిలో 80 శాతం కొలుదారులు కావడం గమనార్హం. ● కోనసీమలో అత్యంత కీలకమైన పది మేజర్ డ్రైన్లలో తూడు, గురప్రు డెక్క తొలగింపునకు అరకొరగా ఇచ్చిన నిధులు కూడా వినియోగించనందున మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు చేలు ముంపులో ఉన్నాయి. ● చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన ఎంపిక చేసిన ప్రాజెక్టు కమిటీ ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. రూ.రెండు కోట్లు నిధులు ఇచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. -
ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 76 మంది వికాస్ కార్మికుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు వెల్లడించారు. మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్న వారిని తొలగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం ఏదైనా సంస్థలో 100 మందికి పైగా సిబ్బందిని తొలగించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఉండాలని ఆయన అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. మున్సిపాలిటీలో ఏటా 15 శాతం నుంచి 30 శాతం వరకూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని, కానీ ఆ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆయన అన్నారు. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక నిత్యం వేలాది మంది వివిధ పనులపై వస్తున్నారని, ఈ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన కార్మికులు చాలా మంది అవసరమవుతారని ఆయన అన్నార. పట్టణానికి వచ్చే ప్రజలకు కనీసం మూత్ర విసర్జన శాలలను ఎక్కువగా నిర్మించే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ కుడుపూడి ఆందోళన వ్యక్తం చేశారు. రాకపోకలకు రేవులు సిద్ధం అయినవిల్లి: ఇటీవలి వరదల సమయంలో ముక్తేశ్వరం–కోటిపల్లి రేవు మూతపడింది. ఈ లోపులో రేవు పాట కూడా ముగిసింది. దీంతో రేవు నిర్వాహకులు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వరదలకు కొట్టుకుపోయిన ముక్తేశరం రేవు వైపు, కోటిపల్లిరేవుల తాత్కాలిక రహదారిని వారం రోజుల పాటు శ్రమించి మళ్లీ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రయాణాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొబ్బరి ధరలు తగ్గితే నాఫెడ్ కేంద్రాలు సిద్ధం చేయాలిఅంబాజీపేట: కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఏపీ నాఫెడ్ బ్రాంచ్ మేనేజర్ టీఎన్ శర్మ అన్నారు. అంబాజీపేటలో జరిగిన ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు వీడ్కోలు సభలో ఆదివారం పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం కొబ్బరికి బహిరంగ మార్కెట్లో ధరలు బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో కొబ్బరి దిగుబడులు గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయని ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడుతుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాల్ కోప్రాకు రూ.12,500, మిల్లింగ్ కోప్రాకు రూ.12,027 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ఈ ధరలు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయన్నారు. బహిరంగ మార్కెట్లో కొబ్బరి ధరలు ఇంతకన్నా తగ్గిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకుని సంసిద్ధంగా ఉండాలన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ అమలాపురం టౌన్: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు రౌడీ షీటర్లను ఆదివారం స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక శక్తులకు, రౌడీయిజం, గుండాయిజాలకు తావు లేకుండా చేస్తామన్నారు. ఈ కౌన్సెలింగ్ల ద్వారా రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లు పదే పదే నేరాలకు పాల్పడితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
గృహ రుణాలలో చేతివాటం!
● లబ్ధిదారుల నుంచి సొమ్ముల వసూలు ● కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదుపై అధికారుల విచారణ ● ఉన్నతాధికారుల అండదండలతోనే అవినీతి అంటున్న బాధితులు అల్లవరం: స్థానిక గృహ నిర్మాణ శాఖలో పనిచేసి అమలాపురం హౌసింగ్ కార్యాలయానికి బదిలీపై వెళ్లిన ఓ అధికారి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి హోదాలో పనిచేసిన ఆ అధికారి ఆ హోదా దక్కిందే తడవుగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. సదరు అధికారికి కేటాయించిన గ్రామాల్లో లబ్ధిదారులు వద్దకు వెళ్లి మీకు గృహ రుణం మంజూరు చేస్తామని రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అల్లవరానికి చెందిన బొలిశెట్టి నాగమణికి రుణం మంజూరు చేసి ఆమె వద్ద సొమ్ములు వసూలు చేసినట్టు ఆమె కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో హౌసింగ్ పీడీ నరసింహారావు, స్థానిక సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సమక్షంలో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించారు. కాగా ఇదొక్కటే కాకుండా ఆయన పర్యవేక్షిస్తున్న ఎనిమిది గ్రామాల్లోనూ ఇలా చాలామంది బాధితులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లవరానికి చెందిన మరో మహిళ, రెబ్బనపల్లికి చెందిన ఇంకొక వ్యక్తి నుంచి కూడా సొమ్ములు తీసుకున్నట్టు తెలిసింది. గోడిలో బొంతు సత్యనారాయణకు గృహ రుణం మంజూరు చేసి వారి ఆధార్ కార్డు తప్పుగా బొంతు సూర్యనారాయణకు సీడింగ్ చేశారు. దీంతో సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన రూ.లక్ష నగదు సూర్యనారాయణ అకౌంట్కు జమ అయింది. అయితే సూర్యనారాయణ వద్దకు వెళ్లి సత్యనారాయణకు క్రెడిట్ కావల్సిన హౌసింగ్ డబ్బులు మీ అకౌంట్ పడ్డాయని ఆయకు చెప్పి సొమ్ములు కుడా కాజేశాడని సమాచారం. ఇలా ఒకటి కాదు రెండు అనేక మంది నుంచి గృహ రుణాల పేరిట డబ్బులు వసూలు చేసినట్టు వెలుగు చూసింది. కాగా.. సదరు అవినీతి ఆరోపణలపై విచారణ జరిగి నెల రోజులు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో అతడు మళ్లీ పైరవీలు మొదలుపెట్టినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. తాను ఎవరి నుంచి అయితే డబ్బులు వసూలు చేశాడో వారి వద్దకు వెళ్లి వారికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్టుగా లెటర్లు తీసుకుంటున్నాడు. ఈ లెటర్లు హౌసింగ్ ఉన్నతాధికారులకు సమర్పించి తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల అండదండలు ఉండడం వల్లే అతడు ఈ అవినీతికి పాల్పడుతున్నాడని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.ఫిర్యాదులు నిజమే అల్లవరం గృహ నిర్మాణశాఖలో విధులు నిర్వహించిన ఉద్యోగిపై ఫిర్యాదులు రావడం నిజమే. తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి తుది నివేదికను జిల్లా కలెక్టర్కు పంపాము. ఐదు నెలల కిత్రం అతడిని కార్యాలయానికి పిలిచి ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్చరించాం. – నరసింహారావు, పీడీ, గృహ నిర్మాణ శాఖ, అమలాపురం. -
క్రీడలతో జాతీయ గుర్తింపు
రావులపాలెం: క్రీడల్లో రాణించడంతో క్రీడాకారులు జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో దండు సాయి ఆకాష్ వర్మ జ్ఞాపకార్థం రెండు రోజులుగా నిర్వహిస్తున్న పదో రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ మెన్, ఉమెన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్లతో కలసి జగ్గిరెడ్డి ట్రోఫీలు అందజేశారు. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవసాత్తు అకాల మరణానికి గురైన దండు సాయి ఆకాష్ వర్మ తల్లిదండ్రులు దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, సుజాత దంపతులు ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం విజేలకు శుభాకాంక్షలు తెలిపారు. 13 జిల్లాల నుంచి 26 జట్లు పోటీ.. పదమూడు జిల్లాల నుంచి మెన్, వుమెన్ కేటగిరీల్లో వచ్చిన 26 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలవగా రన్నర్గా విశాఖపట్నం, తృతీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి. అలాగే మహిళా విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా విశాఖపట్నం, తృతీయ స్థానం తూర్పుగోదావరి, నాలుగో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచినట్టు నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచ్లు బొక్కా కరుణాకరం, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు ముత్యాల వీరభద్రరావు, ముదునూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీను, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెదిరేశ్వరంలో ముగిసిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పురుషుల విభాగంలో తూర్పుగోదావరి.. మహిళా విభాగంలో కృష్ణా జిల్లా విజేతలు -
రైతన్నపై వాతావ‘రణం’
జూన్ నెల నుంచి అక్టోబరు నెల వరకు లోటు వర్షం నమోదైంది. జూన్ నెలలో 4.9, జూలైలో 53.4, ఆగస్టులో 11.4, సెప్టెంబరులో 40.2, అక్టోబరు 15 తరువాత వరకు 50.7 మిల్లీ మీటర్ల లోటు వర్షం నమోదైంది. ● బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, మోంథా తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఖరీఫ్ ఆరంభంలో కురవాల్సిన వర్షం.. కోతల సమయంలో కురిసి రైతులను నిలువునా ముంచేసింది. వరి 77 వేల ఎకరాలలో, అరటి 3,379, కూరగాయలు 450.71, బొప్పాయి 43.48, పువ్వులు 39.53, పసుపు 19.76, తమలపాకు 7.90 ఎకరాల్లో పంట దెబ్బతింది. -
ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు
కలెక్టర్ మహేష్కుమార్ అంబాజీపేట: మొసలపల్లి జగ్గన్నతోటలో ఏకాదశ ప్రభల ఉత్సవాలకు సకల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రభల తీర్థం జరిగే జగ్గన్నతోటలో శనివారం ఆయన పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగ్గన్నతోట ప్రభల తీర్థం అత్యంత పురాతన, పవిత్ర తీర్థ స్థలంగా పేరొందిందన్నారు. కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మండల, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభలు తరలివెళ్లే మార్గాలను పరిశీలించారు. అప్పర్ కౌశిక దాటే ప్రభల వివరాలపై కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్, అంబాజీపేట తహసీల్దార్ బి.చినబాబు, ఎంపీడీఓ బి.మమతలను అడిగి మ్యాప్ ద్వారా ఆరా తీశారు. శాంతికి ప్రతీక క్రిస్మస్ అమలాపురం రూరల్: ప్రేమ, శాంతి, సేవా భావాలకు ప్రతీకగా క్రిస్మస్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్ హైటీ కార్యక్రమాన్ని క్రైస్తవ మత పెద్దలతో నిర్వహించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్వో కె.మాధవి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీల్, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఊడిమూడిలంక వంతెన 65 శాతం పూర్తి పి.గన్నవరం: నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై ఊడిమూడిలంక వద్ద రూ.71.43 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు 65 శాతం పూర్తయ్యాయని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇంత వరకూ జరిగిన పనుల ప్రగతిని పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్స్ విభాగం డీఈఈ అన్యం రాంబాబు వివరించారు. 2026 వరదల సీజన్ నాటికి లంక గ్రామాల ప్రజలు వంతెనపై నడిచి వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అని కలెక్టర్ ప్రశ్నించారు. అప్పటికి అన్ని ఫిల్లర్లు, గడ్డర్ల నిర్మాణాలు మాత్రమే పూర్తవుతాయన్నారు. 2027 మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాంబాబు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మెహన్రెడ్డి వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విదితమే. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే లైన్ను త్వరితగతిన పూర్తి చేయించండి
అమలాపురం టౌన్: కోనసీమ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికి కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధుల బృందం తీసుకు వెళ్లింది. కేఆర్ఎస్ఎస్ ప్రతినిధి అయిన ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కూడిన స్టీరింగ్ కమిటీ బృందం ఎంపీని అమలాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసింది. కేవలం 57 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే లైనుకు పూర్తి స్థాయిలో స్థల సేకరణ జరగలేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కేఆర్ఎస్ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణం తదితరులు అన్నారు. లైన్ అలైన్మెంట్ విషయంలోనే ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయన్నారు. 23 ఏళ్ల కిందట అమలాపురం సర్క్యులర్ బజార్ షాపుల్లో నెలకొల్పిన రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ కౌంటర్ను రెండేళ్ల కిందట మూసి వేశారని గుర్తు చేశారు. దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ కోనసీమలోని మూడు నదీపాయలపై ఇప్పటికే రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రాజెక్ట్కు న్యాయపరమైన చిక్కులు దాదాపు తొలగాయని, జాయింట్ సర్వే పూర్తి కావొచ్చిందని వివరించారు. కమిటీ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, ఆర్వీ నాయుడు, వంకాయల రాజా, ఎరగర్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్న ప్రతి మదీ మురిసింది. ప్రాతః కాలంలో స్వామివారి తొలి హారతి అంగరంగ వైభవంగా జరిగింది. బాల బాలాజీ స్వామివారికి మంగళాశాసనం నిర్వహించారు. గోదాదేవికి తిరుప్పావై సేవాకాలం ఘనంగా జరిపించారు. భక్తులు స్వామి వారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,29,082 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.89,083 విరాళాలుగా సమర్పించారన్నారు. స్వామివారిని 4,700 మంది దర్శించుకోగా, 2,800 మంది అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
గోవింద.. హరి గోవింద
కొత్తపేట: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది.. ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది.. ఆ ఏడు వారాల క్షేత్రం భక్తులతో నిండింది.. ధనుర్మాసం సందర్భంగా కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపించింది. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ప్రదక్షిణలు చేయగా, కోరిన కోర్కెలు తీరిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చక స్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఈ ఒక్కరోజే స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు, అన్న ప్రసాద విరాళం ద్వారా రూ.53,40,208 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కాకినాడకు చెందిన నాట్యవేద కూచిపూడి నృత్య బృందం వారి ప్రదర్శన ఆకట్టుకుంది. ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక శోభ ఫ భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం -
2025..అంతా చేదు
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● చిన్నారులపై వరుస అఘాయిత్యాలు ● నిందితుల్లో ఇద్దరు టీడీపీ, జనసేన నాయకులు ● పెరిగిన రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్లు ● ఈ ఏడాదంతా జిల్లాలో కన్నీటి ఘటనలే అమలాపురం టౌన్: రక్తమోడిన రహదారులు.. నేరాలు.. ఘోరాలు.. బాలికలపై అత్యాచారాలు.. హత్యలు.. ఇలా ఈ ఏడాది అంతా కన్నీరే మిగిల్చింది. జిల్లాలో 2025 సంవత్సరం చేదు అనుభవాలను మూటగట్టింది.. ముఖ్యంగా బాలికలపై వరుస అఘాయిత్యాలు అంతటా కలకలం రేపింది. ఈ అత్యాచారాలకు సంబంధించి రెండు కేసుల్లో ఇద్దరు నిందితులు టీడీపీ, జనసేన నాయకులు కావడం మరింత ఆందోళనకు గురిచేసింది. పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లో నదీ పాయల్లో 11 మంది మృత్యువాత పడడం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అలాగే సైబర్ నేరాల్లో రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఆందోళనే మిగిలింది.. పలు హత్య కేసులు సంచలనమయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఘటనలే జరిగాయి. చితికిపోయిన బాల్యం ● అక్టోబర్ 25న ఐ.పోలవరం మండలం బాణాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై జనసేన పార్టీ నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (బాబి) అత్యాచారం చేసినట్లు నేరారోపణ ఎదుర్కొన్నారు. ఈ కేసు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ● ఈ నెల 3న ముమ్మిడివరం మండలం ఠాణేలంక గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై టీడీపీ నాయకుడు మోర్త గిరిబాబు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ● 7న ముమ్మిడివరం గ్రామంలో పదో తరగతి చదివిన ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ● 13న ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఓ బాలికపై అతని తండ్రి కామవాంఛ తీర్చుకుంటూ కొన్ని నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ నాలుగు సంఘటనలు (బాలికలపై అత్యాచారాలు) అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరగడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగించాయి. నదీ పాయలు.. మృత్యుకుహరాలు ● ఆగస్ట్ 26న ముమ్మిడివరం మండలం కమిని వద్ద నదీ స్నానాలకు వెళ్లిన ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఆ యువకులంతా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వారే కావడం, వారి చదువుకుని ప్రయోజకులు అవుతారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. ● మే 27న పి.గన్నవరం మండలం నాగుల్లంక, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా నదీ పాయలోకి స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలోని నదీ పాయలోకి స్నానానికి వెళ్లి ఈతరాక ప్రాణాలు వదిలారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆయా కుటుంబాలకు ఏకై క కుమారులు కావడం ఆ కుటుంబాలను మరింత కుంగదీసింది. సైబర్ నేరం చేసి.. సొమ్ము కాజేసి ● ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓ విశ్రాంత మండల విద్యాశాఖాధికారి సైబర్ నేరం బారిన పడి రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. ● మండపేట పట్టణంలో ఓ హోటల్లో ఫుడ్ బుకింగ్ సమయంలో ఓటీపీలు చెప్పడంతో రూ. 80 వేల డబ్బును నేరగాళ్లు దోచుకున్నారు. ● ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువు గ్రామంలో మహిళలకు సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాన్ని ఆశ చూపి ఆమె వద్ద నుంచి రూ.8.50 లక్షలు కాజేశారు. ● అమలాపురంలో క్రిడెట్ స్కోర్ పెంపు పేరుతో ఓ వ్యక్తి రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. దక్షిణా ఆఫ్రికా ప్రయాణ లగేజీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆ సొమ్ము కాజేశారు. వేగం.. బలిగొన్న ప్రాణం ● సెప్టెంబర్ 23న తాళ్లరేవు మండలం పెదవలసల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్పై వేగంగా వెళ్తున్న వీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ● ఈ నెల 17న అమలాపురం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అతివేగం కారణంగా బైక్పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ఇలా జిల్లాలో అనేక ప్రమాదాలు జరిగాయి. సంచలనమైన హత్య కేసు అక్టోబర్ 28న అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనే డ్రైవర్ హత్య కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అమలాపురానికి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్, మరో నలుగురు కలసి శ్రీనును హత్య చేసి పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి నదీపాయల వద్ద మృతదేహాన్ని పాడేశారు. భర్త ఆచూకీ కోసం శ్రీను భార్య, కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారు. ఎస్పీకి ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది. గంజాయి.. ఆగలేదోయ్ ● జిల్లాలో పలు గంజాయి కేసులు ఈ ఏడాదిలో నమోదయ్యాయి. నవంబర్ 9న రాజోలులో గంజాయి విక్రయ కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా ఈ ఆరుగురు ఇన్స్ర్ట్రాగామ్ ద్వారా తమ స్మార్ట్ ఫోన్లలో గ్రూప్ను క్రియేట్ చేసి గంజాయిని విక్రస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారాలకు యువకులు అనేక మంది బలయ్యారు. ● ఈ నెల 23న కె.గంగవరం మండలం కోటిపల్లి శివారు ఏటిగట్టుపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచింగ్లు.. దోపిడీలు ● రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో నవంబర్ నెలలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. ● అమలాపురంలో ఈ ఏడాదిలో చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. దీంతో ఇంట్లో మహిళలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోయారు. ● అమలాపురంలో గత నెలలో జరిగిన చోరీలో అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు. ● సెప్టెంబర్ 11న కపిలేశ్వరపురంలో ఓ ఇంట్లో జరిగిన చోరీలో కేసులో రూ.3.8 లక్షల సొత్తును దోచుకున్నారు. ● అక్టోబర్ 1న అయినవిల్లి మండలం విలస గ్రామంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భార్యభర్తలు ప్రాణాలు విడిచారు. ● అదృశ్యం కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అమలాపురం పట్టణంలో ఈ ఏడాది నాలుగు కే సులు నమోదయ్యాయి. కంచిపల్లి శ్రీనుది ముందు అదృశ్యం కేసు నమోదు చేయగా, అతను హత్యకు గురికావడంతో అది హత్య కేసుగా మార్చారు.జీవితాల్లో ‘పేలుడు’ రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో అక్టోబర్ 7న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా తయారీ కేంద్రం యాజమానితో సహా కేంద్రంలోని పనిచేసే తొమ్మిడి మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఏ రోజుకా రోజు కూలి సొమ్ముతో జీవించే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పట్లో ఈ ప్రమాదం జిల్లాలో సంచలనమైంది. బాణసంచా తయారీ కేంద్రాల్లో సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి అంత మంది మృతికి కారణమైంది. అధికారులు, ప్రభుత్వ వైఫల్యం కనిపించింది. ఇదే ఈ ఏడాది జిల్లా పెద్ద ఘటనగా చెప్పవచ్చు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
కోడి పందేలకు అనుమతి లేదు
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: సంక్రాంతి పండగల పేరుతో కోడి పందేలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. వీటిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. శనివారం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జిల్లా నేర సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ మీనా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులపై పోలీస్ స్టేషన్ల వారీగా ఎస్పీ సమీక్షించారు. సంక్రాంతి పండగకు ఇచ్చే సెలవులకు జిల్లాలోని పలు కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోలీస్ గస్తీని పెంచాలని సూచించారు. ప్రజలు కూడా పండగ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్, జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, డీసీఆర్బీ సీఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
ర్యాలి క్షేత్రాన్ని సందర్శించిన సరస్వతీ స్వామీజీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ, గోపాలస్వామివారి ఆలయాన్ని పెనుగొండ వాసవీ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతీ (బాల) స్వామీజీ శనివారం సందర్శించారు. స్వామీజీకి దేవస్థానం ఈఓ భాగవతులు వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శనికి ప్రీతికరమైన శనివారం పురస్కరించుకుని దేవస్థానం దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,47,105, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.80,800, అన్న ప్రసాద విరాళాల రూపంలో రూ.23,222 ఆదాయం వచ్చినట్టు ఈఓ వివరించారు. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అమలాపురం టౌన్: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటి త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికై న అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులను డీఈఓ పి.నాగేశ్వరరావు అభినందించారు. ఫుట్ ప్రెస్ పవర్ జనరేటర్ పేరుతో ప్రాజెక్ట్ తయారు చేసిన విద్యార్థులు ఎన్.సత్య ప్రవీణ్, పి.సిద్ధార్థ్లను, గైడ్ టీచర్ పీవీఎల్ఎన్ శ్రీరామ్ను ఆ పాఠశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్ట్ పనిచేసే విధానాన్ని డీఈఓ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలోనూ ఈ ప్రాజెక్ట్ విజేతగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల హెచ్ఎం కె.ఘన సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎంఎస్డీ భవాని, బీఎన్ వెంకటేశ్వరరావు, కేఆర్ఎన్ ప్రసాద్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శృంగార వల్లభుని ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న కళాకారులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల కళాకారులు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుతూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే కళాకారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. ఈ కళాకారులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురమళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల కళాకారులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని కళాకారులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు ఆనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భాగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. అలా ఎలా ఇచ్చారో..! దేవస్థానంలో ప్రతి వ్యాపారానికీ వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్లో విక్రయాలకు అనుమతులిచ్చిన వాటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఆదేశించారు.ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
పండగ సంబేరాలు లేక..
అమలాపురం శ్రీదేవి మార్కెట్లో వ్యాపారం లేక వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు కర్ఫ్యూ పెట్టినట్టుగా అమలాపురం గోల్డ్ మార్కెట్ వీధి తిరోగమనంలో వ్యాపారాలు వస్త్ర, బంగారు దుకాణాలు వెలవెల ఇప్పటికే క్రిస్మస్ అమ్మకాలు పూర్తి వచ్చే పండగలకూ కనిపించని జోష్ కుదేలైన వివిధ రంగాలు జనం వద్ద తగ్గిన కొనుగోలు శక్తి సాక్షి, అమలాపురం: క్రిస్మస్ వేడుకలు పూర్తయ్యాయి.. నూతన ఆంగ్ల సంవత్సర సంబరాలు మొదలు కానున్నాయి.. తరువాత సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా జిల్లాకు పండగల జోష్ వచ్చినా వస్త్ర, బంగారు వ్యాపారాలు తిరోగమనంలో ఉన్నాయి. జనం, మరీ ముఖ్యంగా అన్నదాతల వద్ద సొమ్ము లేకపోవడం.. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు డల్గా ఉండడం.. బంగారం ధరలు కొండెక్కడంతో కొనుగోళ్లు లేక వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు వాణిజ్య, వ్యాపార కేంద్రాలైన రావులపాలెం, బండారులంక, తాటిపాక, మలికిపురం, రామచంద్రపురం, మండపేట, ద్వారపూడి, ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పండగ సందడి మొదలు కావాల్సి ఉంది. వస్త్ర, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఇతర ఫర్నీచర్ అమ్మకాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా ఉండాల్సి ఉంది. క్రిస్మస్ పండగ సంబరాలు జరుగుతున్నాయి. తరువాత ఆంగ్ల సంవత్సరం, ఆపై పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. గతంలో ఈ సమయానికే రిటైల్, హోల్సేల్ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అమలాపురంలో వస్త్ర, బంగారు, ఇతర వస్తువుల కొనుగోలు లేక దుకాణాలు కళావిహీనంగా ఉన్నాయి. ఆయా మార్కెట్లలో మధ్యాహ్న సమయంలో కొనుగోలుదారులు కనిపించడం లేదు. వస్త్రాలను బయట వేలాడదీసి వ్యాపారులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పేరొందిన బండారులంకలో సైతం వస్త్ర వ్యాపారం వెలవెలబోతోంది. సాయంత్రం వేళ ఇద్దరు, ముగ్గురు కొనుగోలుదారులు మాత్రమే వస్తున్నారు. ‘సంక్రాంతి కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు కాకున్నా.. ఏటా ఈ సమయానికి కొనుగోలుదారులు ఎక్కువగానే వచ్చేవారు. గతంలో ఈ సమయంలో జరిగే వ్యాపారంలో ఇప్పుడు పావు వంతు కూడా జరగడం లేదు’ అని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఐదేళ్ల కాలంలో అమలాపురంలో మెగా వస్త్ర, బంగారు ఆభరణాల మాల్స్ పెద్దఎత్తున వచ్చాయి. అక్కడ కూడా ఇంచుమించు ఇలానే ఉంది. జిల్లాలో మండపేట, రామచంద్రపురం, తాటిపాక, మలికిపురం, రావుపాలెం వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు పడకేశాయి. పండగ సమయంలో కొత్త మోటార్ సైకిళ్లు, కార్లు కొనేవారు ఇప్పటికే బుకింగ్లు మొదలు పెట్టేవారు. సంక్రాంతి సమయానికి డెలివరీ కావాలని అడ్వాన్సులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో బుకింగ్స్ లేవని వాహన అమ్మకాల డీలర్లు చెబుతున్నారు. మండపేట మండలం ద్వారపూడి మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ మార్కెట్ ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే హోల్సేల్ వస్త్ర వ్యాపారం జరిగేది. ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఉంది. గత ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు పలు ప్రాంతాల్లో మాల్స్ రావడం ఇక్కడ సగం వ్యాపారం తగ్గిపోయింది. జరిగే కొద్దిపాటి వ్యాపారం కూడా ఈ ఏడాది లేకుండా పోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విపణిలో బంగారం ధర కొండెక్కడం కూడా కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. ప్రస్తుత మార్కెట్లో బంగారం 24 క్యారెట్లు గ్రాము ధర రూ.14 వేల వరకూ ఉంది. పది గ్రాములు రూ.1.40 లక్షలు కాగా, కాసు ధర రూ.1.12 లక్షలు. దీంతో సామాన్యులు, పేదలు ఆభరణాల కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిల్లిగవ్వ లేక.. జనం వద్ద సొమ్ము లేకపోవడం కొనుగోలుకు ప్రధాన అవరోధంగా మారింది. మరీ ముఖ్యంగా అన్నదాత అప్పుల్లో ఉన్నాడు. వరి గిట్టుబాటు కావడం లేదు. ఖరీఫ్ సాగులో రుతుపవనాలు, మోంథా తుపానుతో కురిసిన వర్షాలకు జిల్లాలో 77 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఎకరాకు 30 బస్తాల నుంచి 35 బస్తాల వరకూ రావాల్సిన దిగుబడి కొన్నిచోట్ల 20 బస్తాల నుంచి 25 బస్తాలకు పడిపోయింది. దీనితో పెట్టుబడులు రావడం గగనమైంది. ప్రస్తుతం రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొబ్బరి కాయ ధర ఇటీవల రూ.22 నుంచి రూ.15కు తగ్గింది. అరటి తుపానుకు నేలచూపు చూడగా, ధరలు రెండు, మూడు రెట్లు తగ్గిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. జిల్లాలో ఆక్వా సాగు సైతం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ధరలు కొంత వరకూ ఉన్నా ఇటీవల మారిన వాతావరణంతో తెగుళ్ల బారిన పడి పంట దెబ్బతింటోంది. పైగా ఇప్పుడు కేవలం మూడో వంతు మాత్రమే సాగులో ఉంది. రియల్ ఎస్టేట్ రంగం గత ఏడాదిగా దాదాపు స్తంభించింది. ఒక్క అమలాపురం పట్టణంలోనే నిర్మాణం పూర్తయిన అపార్ట్మెంట్లలో సగం ప్లాట్లు అమ్ముడు పోక ఖాళీగా ఉంటున్నాయి. లేఅవుట్లో స్థలాలు కొనేవారు లేకుండా పోయారు. ఈ ప్రభావంతో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు రియాల్టర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఇలా కీలక రంగాలన్నీ సంక్షోభంలో ఉండడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి ఒక్కరిపైనా పడింది. జనం వద్ద డబ్బు లేకపోవడంతో కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది. ఇదే వస్త్ర, బంగారు, ఆటోమొబైల్ రంగాలపై పడి జిల్లాలో పండగ సందడి లేకపోయింది. సాధారణ అమ్మకాలూ లేవు గతంలో కంటే వస్త్ర మార్కెట్లో అమ్మకాలు బాగా తగ్గాయి. ద్వారపూడిలో సుమారు 200 హోల్సేల్, 50 రిటైల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సాధారణ స్థాయి అమ్మకాలు కూడా లేని పరిస్థితి. రాజమహేంద్రవరం, కాకినాడ తదితర పట్టణాల్లోని షాపింగ్ మాల్స్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. మధ్య తరగతి ప్రజలు సైతం అటువైపే వెళుతుండటంతో ద్వారపూడి మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి. జనం వద్ద కూడా సొమ్ములు లేవు. – చిక్కాల శ్రీనివాస్, అధ్యక్షుడు, మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ మార్కెట్, ద్వారపూడి, మండపేట మండలం -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ కృషికి ఫలితంమోహన్సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
గంజాయి అక్రమ రవాణాను నిరోధించాలి
అమలాపురం రూరల్: గంజాయి అక్రమ రవాణాను అన్ని దశల్లోనూ నిరోధించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నార్కెట్ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రహస్య సమాచారం ఆధారంగా హైవేలు, ఫ్రూట్ మార్కెట్లు, చెక్ పోస్ట్లు, పార్సిల్, కోరియర్ ఆఫీస్లు, ప్రత్యేక డ్రైవ్ల ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలతో అనర్థాలు వివరించి యువతను సన్మార్గంలో నడిపించడం ద్వారా ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్నారు. కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచుతూ, యాంటీ–డ్రగ్ క్లబ్లు, క్యాంపెయిన్లు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గ్రామ శివార్లు, పాన్, కిళ్లీ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీసీహెచ్ఎస్ కార్తీక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అయినవిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులతో రబీ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.60,613 చొప్పున పరిహారంగా ఏపీ ట్రాన్స్కో అందిస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఏపీ ట్రాన్స్కో, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 22 కిలోమీటర్ల మేర విద్యుత్ టవర్ల ఏర్పాటు సమయంలో పనుల నిర్వహణకు ఆయా ప్రాంత రైతులు రబీలో పంట నష్టపోతున్నారన్నారు. రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అయినవిల్లి మండలాల పరిధిలో 64 విద్యుత్ టవర్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ టవర్లు వెంబడి సుమారు 563 ఎకరాల్లో రబీ సాగును నిలుపుదల చేసినందుకు రైతులకు పరిహారంగా రూ.3.41 కోట్లను ఏపీ ట్రాన్స్కో కేటాయించిందన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రభల ఉత్సవాలకు ఆటంకం కలగకుండా టవర్ల ఎత్తు పెంచాలని అన్నారు. ఏపీ ట్రాన్స్కో పర్యవేక్షక ఇంజినీర్ మనోహర్, ఈఈలు పుల్లారావు, వెంకట్రావు, డీఈ చంద్రశేఖర్ ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు లైన్ల రహదారికి కార్యాచరణ ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో కాలువ గట్టు నుంచి గుడి వరకూ సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కార్యాచరణ చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆర్అండ్బీ, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి భూ సేకరణపై సమీక్షించారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుండడంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పరిహారాలను దేవస్థాన అధికారులు చెల్లించడానికి ముందుకు వచ్చారన్నారు. భూసేకరణకు గాను సుమారు రూ. 6 కోట్లు అవుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సుమారు రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఫ జిల్లాలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీలో రైతులకు, మహిళా సంఘాలకు, యువ పారిశ్రామిక వేత్తలకు దిక్సూచిగా ఇంక్యుబేషన్ సెంటర్ నిలుస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. దీనిపై కలెక్టరేట్లో కొబ్బరి, పారిశ్రామికవేత్తలు, జిల్లా పరిశ్రమల కేంద్రం ఎమ్ఎస్ఎంఈ ప్రతినిధులు, ఉద్యాన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మామిడికుదురు, ఉప్పలగుప్తంలలో కొబ్బరి పరిశ్రమలు స్థాపన అంశాలపై సమీక్షించారు. జిల్లాలో రైతులకు అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన మార్క్ఫెడ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెళకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎగ్నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి ● సీపీఐ నేత మధు ● ఘనంగా ఆ పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. -
దివ్యాంగులను అన్నింటా ప్రోత్సహించాలి
అమలాపురం టౌన్: పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులను అన్నింటా ప్రోత్సహించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్ఏపీడీ) కె.రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ (సీడబ్ల్యూఎస్ఎన్) కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు శుక్రవారం జరిగిన జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమాన్ని రవీంద్రనాథ్రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. సహిత విద్య ద్వారా దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సహిత విద్య స్టేట్ కన్సల్టెంట్ వై.నరసింహ మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు విభిన్న ప్రతిభావంతులను బేస్ క్యాంప్ ద్వారా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా జిల్లా ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ జిల్లాలో 22 భవిత కేంద్రాల ద్వారా 486 మంది దివ్యాంగులకు విద్యనందిస్తున్నామని తెలిపారు. ఆరు నుంచి 18 ఏళ్ల వయసున్న 3,108 మంది సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు ఉన్నారన్నారు. సహిత విద్య జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జోనల్ పరిధిలో విద్యార్థులకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. సహిత విద్య జిల్లా ఓ ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పోటీల్లో జోనల్ పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 150 మంది దివ్యాంగులు పాల్గొన్నారన్నారు. స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుపుదాం
అంబాజీపేట: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యత ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాది ‘పది’ పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. జిల్లా నుంచి 19,640 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిని షైనింగ్ స్టార్స్ మార్చాలన్నారు. పాఠశాలకు రాని పదో తరగతి విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అంతకు ముందు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. కొత్తపేట డివిజన్ డీవైఈఓ కాండ్రేగుల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆలయ ప్రహరీకి రూ.50 వేల విరాళం కొత్తపేట: వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ తల్లి ఆలయ ప్రహరీ నిర్మాణానికి బిళ్లకుర్రు శివారు యెలిశెట్టివారిపాలేనికి చెందిన సూరవరపు వెంకట్రావు, రామలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50 వేల విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణకు అందజేశారు. అలాగే సామర్లకోటకు చెందిన దివంగత కారుమూరి రాజేశ్వరరావు, సత్యవేణి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమార్గుప్తా రూ.20,116, అమెరికాకు చెందిన శంభు రవికృష్ణ, భాస్కర వెంకటలక్ష్మి దంపతులు రూ.20 వేలు, వానపల్లికి చెందిన నేమాని పురుషోత్తమ ప్రసాద్, సుందరిలక్ష్మి దంపతులు రూ.10 వేలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాతల పేరున ఆసాదులు ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు. -
కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
పాల్ ల్యాబ్స్ వినియోగంలో రాష్ట్రంలో ద్వితీయ స్థానం
ముమ్మిడివరం: సీఎంశ్రీ పాఠశాలల్లో పర్సనల్ అడాఫ్టివ్ లెర్నింగ్ (పాల్) ల్యాబ్స్ను విద్యార్థులు ఉపయోగించడంలో జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం లభించిందని సమగ్ర శిక్ష ఏఎంఓ, పాల్ ల్యాబ్స్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ పి.రాంబాబు తెలిపారు. అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాల్ ల్యాబ్ను ఇన్చార్జి హెచ్ఎం ఎం.శ్రీనివాసరావుతో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది పీఎంశ్రీ పాఠశాలల్లో నూతనంగా పాల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటిని వినియోగించడంలో జిల్లా 96.22 శాతంతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పాల్ ల్యాబ్ 111.67 శాతం ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గతంలో మంజూరైన పాల్ ల్యాబ్స్లో కాలపరిమితి ముగిసి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు -
భీష్మ సమానుడు వాజ్పేయ్
అమలాపురం రూరల్: జిల్లా బీజేపీ కార్యాలయంలో దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని వాజ్ పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజకీయాలలో వాజ్పేయి భీష్ముడిలాంటి వారన్నారు. రాజనీతజ్ఞడిగా, అజాతశత్రువు అనే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన పోక్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రహదారుల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు భారతదేశ గమనాన్ని మార్చేశాయన్నారు. పట్టణ అధ్యక్షుడు అయ్యల బాషా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురిమెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చిలకమర్తి కస్తూరి తదితరులు ఆయనకు నివాళులర్పించారు. -
వక్ఫ్ భూముల జోలికి రావద్దు
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూముల జోలికి కూటమి ప్రభుత్వం రావద్దని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్పష్టం చేశారు. ముస్లిం పేదలకు అంజుమన్– ఎ ఇస్లామియా సంస్థ పూర్వీకంలో ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గుంటూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన 71.57 ఎకరాలను ఐటీ పార్కుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీకి చెందిన కొందరి ముస్లిం నాయకులతో కలసి ఖాదర్ గురువారం అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరులో ఐటీ పార్కు అంటే అదో ప్రైవేటు సంస్థ, ప్రైవేటు వ్యక్తులు, వారికి ప్రభుత్వం 71.57 ఎకరాలను ఇచ్చేడంపై వారు నిరసన తెలిపారు. గుంటూరులో భూములను ప్రైవేటు సంస్థకు కేటాయించడం వెనుక ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డు సీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాదర్తో పాటు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీవై షరీఫ్, అమలాపురం అధ్యక్షుడు ఖాజాబాబు, పి.గన్నవరం అధ్యక్షుడు అన్వర్ తహె హుస్సేన్, పార్టీ జిల్లా కార్యదర్శి అలీబాబు, ముస్లిం నాయకులు కర్రార్ హుస్సేన్, ఎండీ అలీషా, యూసఫ్ సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. కౌలు రైతు మృతి ఉప్పలగుప్తం: ఏటా ఖరీఫ్ పంట నష్టపోతూండటం.. రబీకి పెట్టుబడి దొరకపోవడంతో ఆవేదన చెందిన ఓ కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ములపర్తి నరసింహమూర్తి (55) కిత్తనచెరువు గ్రామంలో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ ముంపుతో నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్ పంట తుపాను వర్షాలకు దెబ్బ తింది. కనీసం మాసూలు ఖర్చులు కూడా రాలేదు. ఇదే సమయంలో రబీకి పెట్టుబడి దొరకక నరసింహమూర్తి నెల రోజులుగా దిగులుతో ఉన్నారు. పొలం వద్ద నారుమడిలో నీరు తోడి గురువారం సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 29న నిధి ఆప్ కే నికట్ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయంలో పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్ కే నికట్ జిల్లా ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్లోను ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. -
విరాటపర్వ పారాయణతో శుభ ఫలితాలు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రామాయణంలో సుందరకాండ, భాగవతంలో దశమ స్కంధం మాదిరిగానే భారతంలో విరాటపర్వానికి ఓ ప్రత్యేకత ఉందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వేదవ్యాస భారత ప్రవచన ధారలో భాగంగా ఆయన గురువారం విరాటపర్వ విశేషాలను వివరించారు. విరాటపర్వ పారాయణ వలన కరువు కాటకాలు నశిస్తాయని, శుభఫలితాలు చేకూరుతాయని చెప్పారు. భారతాధ్యయనం విరాటపర్వంతో ప్రారంభించాలని వ్యాసుడు ఎక్కడా చెప్పలేదన్నారు. మత్స్యరాజు కొలువులో ప్రవేశించే ముందు.. పాండవులు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో.. ద్రౌపది గురించి ధర్మరాజు అన్న మాటలను నేటి తరం స్మరించుకోవాలని అన్నారు. ‘‘ద్రౌపది మనకు ప్రియమైన భార్య. తల్లిని కొడుకు ఎలా రక్షించాలో ఈమెను మనం అలా రక్షించుకోవాలి. అక్కలా గౌరవించాలి. ఈమె మనకు ప్రాణాల కన్నా ప్రియమైనది’’ అని సోదరులతో ధర్మరాజు అంటాడని వివరించారు. వాల్మీకి వ్యాసాదులు రామాయణ భారతాల్లో భార్యాభర్తల అనుబంధాన్ని ఎంతో పవిత్రంగా వివరించారన్నారు. భార్యకు పాతివ్రత్యధర్మాన్ని చెప్పినట్టుగానే.. భర్తకు కూడా భార్య పట్ల అంతటి బాధ్యత ఉందని చెప్పారు. ‘‘కీచకుని ఆగడాలను ప్రతిఘటించడానికి ద్రౌపది ముందుగా సూర్యారాధన చేసింది. అజ్ఞాతవాసం ప్రారంభించడానికి ముందు దుర్గాదేవిని ధర్మరాజు స్తుతించి, ఆమె అనుగ్రహం పొందుతాడు. వేదమంత్రాలకున్న శక్తి భారత పారాయణకుంది. విరాటుని కొలువులో ప్రవేశించే ముందు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ఉపదేశించిన ధర్మాలను మనం విస్మరించరాదు. రాజు కన్నా ఉన్నతాసనం ఆశించరాదు. రాజు భార్యలతో చెలిమి తగదు. రాజు శత్రువులతో మాట్లాడరాదని పాండవులతో ధౌమ్యుడు చెబుతాడు. ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పుకోవడంలో అసత్యం లేదు. కంకుడు అనే పదానికి యమధర్మరాజు అనే అర్థం ఉంది. ఆయన యమధర్మరాజు కుమారుడు’’ అని సామవేదం వివరించారు. -
సత్యదేవుని సన్నిధిలో మహాపచారం
● పూజలో వాడిన పూలతో ఫినాయిల్ తయారీ! ● అన్నవరం దేవస్థానంలో విక్రయాలు ● ఆవేదన చెందుతున్న భక్తులుఅన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు. ‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ.. సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్ లీటర్ బాటిల్ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్ బాటిల్పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్ను టాయిలెట్స్ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ అపచారాలు అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు. అటువంటివి విక్రయించనీయం దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్లైట్పై అక్షయ పాత్ర.. హ్యాండిల్కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
జాతీయ స్థాయి సైన్స్ఫేర్కు వన్నెచింతలపూడి ప్రాజెక్ట్
అమలాపురం రూరల్: రాష్ట్రస్థాయి 53వ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శల్లో వన్నెచింతలపూడి పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగిన వన్నెచింతలపూడి హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన ఈజీ మిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిపై జాతీయ స్థాయి ప్రదర్శనలో చోటు సంపాదించింది. ఈ ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థి రోహిత్ విజయభాస్కర్కు గైడ్ టీచర్గా ప్రధానోపాధ్యాయుడు గుబ్బల నాగ సత్యనారాయణ వ్యవహరించారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. మూడేళ్లుగా కోనసీమకు జాతీయస్థాయిలో స్థానం సాధిస్తున్న హెచ్ఎం సత్యనారాయణను అధికారులు గురువారం అభినందించారు. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్స్ర్ట్రాగామ్లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్షాప్కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్షాప్లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు అందజేశారు. -
సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతిపై లోతైన విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసుల్ని కోరుతున్నారు. జాతీయ స్థాయి జు – జుట్సు పోటీల్లో రవి శంకరికి రజతం అమలాపురం టౌన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హాల్ద్వానీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగిన జాతీయ స్థాయి జు – జుట్సు చాంపియన్ షిప్ –2025 పోటీల్లో అమలాపురానికి చెందిన అడపా రవి శంకరి రజిత పతకాన్ని సాధించింది. అండర్–16 విభాగంలో రవి శంకరి 48 కేజీల ఫైటింగ్ కేటగిరిలో విజేతగా నిలిచి పతకాన్ని కై వసం చేసుకుందని కోచ్లు పడాలి అంజి, చిక్కం సురేష్ తెలిపారు. విజేతను అమలాపురం పవర్ కిక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమి ప్రతినిధులు అభినందించారు. -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి
ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై ఆగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. -
అభిరామ్కు రాష్ట్ర స్థాయి పురస్కారం
రామచంద్రపురం రూరల్: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసిన మండలంలోని ద్రాక్షారామకు చెందిన దేవులపల్లి శ్రీకృష్ణ అభిరామ్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ కమిటీలో అభిరామ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అభిరామ్ సేవలను అభినందిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ తదితరులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అభిరామ్ను పలువురు అభినందించారు. -
కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ అమ్మవారికి సమర్పించిన చీరను ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ ● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
హిందువులు మౌనం వీడాలి
● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్ ● కౌన్సిల్ పూర్వ చైర్మన్ పరవస్తు ● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయ నాయకుల వద్ద నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేదన్నారు. ఇప్పటికై నా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని తెలియజేశారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బతిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలను నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ గోదావరి జిల్లా సహకార్య వాహ్ గెడ్డం రాంబాబు, మండపేట ఖండ ప్రముఖ్ చక్రవర్తి, వీహెచ్పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు తదితరులు పాల్గొన్నారు. -
విలీనమా..విముఖమా..
● పలు గ్రామాల గ్రామసభలకు రంగం సిద్ధం ● పెరగనున్న మున్సిపాలిటీల విస్తీర్ణాలు ● జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ● అభివృద్ధి చెందిన పలు పంచాయతీలలో విముఖత ● కొన్నిచోట్ల అనుకూలంగా తీర్మానాలు సాక్షి అమలాపురం: జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో వాటిని ఆనుకుని ఉన్న పంచాయతీల విలీన ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. అమలాపురం మున్సిపాలిటీలో మూడు గ్రామాల విలీన ప్రక్రియ మొదలు కావడంతో మిగిలిన మున్సిపాలిటీల్లో పంచాయతీ విలీన అంశం తెరమీదకు వస్తోంది. కాగా ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు పంచాయతీలు విలీన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాయి. తాము చేసుకున్న అభివృద్ధి ఫలాలు మున్సిపాలిటీలకు మళ్లిపోతాయని, మళ్లీ అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను తీర్చిదిద్దుకోవాల్సి వస్తుందని అక్కడి పాలకులు భావిస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ గ్రేడ్–1గా గుర్తింపు పొందింది. దీని పరిధిలో ఉన్న పలు వార్డులు అమలాపురం మండలంలోని కామనగరువు, ఈదరపల్లి, పేరూరు పంచాయతీల్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. పదేళ్ల క్రితం మున్సిపాలిటీ చుట్టూ ఉన్న సుమారు 13 గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నా తరువాత వెనక్కు పోయింది. తాజాగా ఈదరపల్లి గ్రామం పూర్తిగా (సర్వే నెంబరు 1 నుంచి సర్వే నెంబరు 82 వరకు), కామనగరువు, పేరూరు పంచాయతీల్లో కొంత భాగం తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే పేరూరు బిట్–1లో సర్వే నెంబరు 672 నుంచి 712 వరకు (41 సర్వే నెంబర్లు), కామనగరువులో ఇప్పుడున్న మున్సిపాలిటీ వార్డులతోపాటు జాతీయ రహదారి 216 వరకు సేకరించాలని నిర్ణయించారు. ఈ సర్వే నెంబర్ల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రాంతం అంతా అమలాపురం మున్సిపాలిటీలో విలీనం కానుంది. ఈ మేరకు ఆయా పంచాయతీలు గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలను చేయాలని జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పంచాయతీ గ్రామ సభలు ఆమోదం తెలిపిన సర్వే నెంబర్ల ఆధారంగా ఈ విభజన జరుగనుంది. అనంతరం మున్సిపాలిటీలో విలీన ప్రక్రియ జరుగుతుంది. అయితే గ్రామ సభల తీర్మానాలు, ప్రజల ఆమోదం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. తమ గ్రామాలను తప్పనిసరిగా విలీనం చేయడాన్ని అంగీకరించి తీరాలనే నిబంధన ఏమీ లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమలాపురం పార్లమెంట్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా అమలాపురాన్ని గుర్తించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో పాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మత్స్యశాఖ, జిల్లా పంచాయతీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఇరిగేషన్, డ్రైనేజీ, ఆర్టీవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని కార్యాలయాలను ముమ్మిడివరం మండలం ఎయిమ్స్ కాలేజీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం అయిన తరువాత అమలాపురానికి ప్రాధాన్యం పెరగడంతో సదుపాయల కల్పన కోసం మున్సిపాలిటీని విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రతిపాదన ఆగింది. తిరిగి ఇప్పుడు విలీన ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అమలాపురం మున్సిపాలిటీ జనాభా సుమారు 53 వేలు. ఇప్పుడనుకున్నట్టుగా విలీనం జరిగితే జనాభా 70 వేల వరకు పెరుగుతుందని అంచనా. జిల్లాలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలలో సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేయాలనే ప్రతిపాదన గతం నుంచి ఉంది. ఇప్పుడు అమలాపురం మున్సిపాలిటీలో పంచాయతీల విలీనం కదలిక రావడంతో మిగిలిన మున్సిపాలిటీలలో కూడా సమీప పంచాయతీల విలీన అంశం తెరమీదకు వస్తోంది. రామచంద్రపురం మున్సిపాలిటీలో రామచంద్రపురం మండలానికి చెందిన ఉట్రుమిల్లి, తాళ్లపొలం, యనమదల, అగ్రహారం, నర్సాపురపుపేట, రాయవరం మండలం పసలపూడి గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం 48 వేల మంది వరకు జనాభా ఉండగా, విలీనం జరిగితే మరో 30 వేల మంది పెరుగుతారు. 2019 ఎన్నికలకు ముందు మండపేట మున్సిపాలిటీలో మండపేట మండలం మారేడుబాక, తాపేశ్వరం, ఇప్పనపాడు, ఏడిద, అర్తమూరు ఐదు గ్రామాలు, కపిలేశ్వరపురం మండలం నుంచి నేలటూరు గ్రామం మొత్తం ఆరు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. మండపేట మున్సిపాలిటీ జనాభా 2011 లెక్కలు ప్రకారం 53,588, మిగిలిన ఆరు గ్రామాలు విలీనమైతే మరో 20 వేల మంది జనాభా పెరుగుతుందని అంచనా. అమలాపురం పట్టణంరామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం -
రక్షకుని రాకకు..
సాక్షి, అమలాపురం: కరుణామయుడు అరుదెంచే శుభ తరుణం ఆసన్నమైంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురంతో పాటు వివిధ గ్రామాల్లో చర్చిలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా క్రీస్తుస్తుతి గీతాలతో పండగ వాతావరణం నెలకొంది. శాంటాక్లాజ్లు, క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల స్టార్లు.. క్రిస్మస్ వేడుకలకు కొత్త అందం తీసుకువచ్చాయి. సర్వం సిద్ధం లోక రక్షకుని రాక కోసం ఊరువాడా సిద్ధమవుతోంది. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. కరుణామయుని పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోటా చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో ముస్తాబు చేశారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలియజేస్తూ పశువుల పాకల సెటింగులు వేశారు. చర్చిల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆరాధన కూడికలు జరుగుతాయి. క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేకంగా స్టార్, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా.. ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను డిసెంబర్ నెలంతా ప్రత్యేకంగా జరుపుకొంటారనే విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి సుమారు 400కు పైగా చర్చలున్నాయని అంచనా. వీటిలో జిల్లా కేంద్రమైన అమలాపురంలో మన్నా జూబ్లీ చర్చి, లూథరన్, ఆర్సీఎం చర్చిలు పెద్దవి. వీటిలో క్రిస్మస్ సందర్భంగా వేల మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ● మండపేట పట్టణంలో అతి పురాతనమైన రోమన్ కేథలిక్ చర్చి, న్యూలైఫ్ బాప్టిస్ట్, రామచంద్రపురం పట్టణంలోని ఏసు ప్రేమాలయం, రోమన్ కేథలిక్ చర్చిలు, ముమ్మిడివరం ఆర్సీఎం, ఐ.పోలవరం మండలం కొమరిగిరి చర్చి, రాజోలు లూథరన్, పి.గన్నవరం మండలం కందాలపాలెం చర్చిలతో పాటు కొత్తపేట లూథరన్, మన్నా, పలివెల ఆర్సీఎం, వాడపాలెం ప్రవచన దేవుని సంఘం, ఎరుషలేం చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ● పుదుచ్చేరి యానాంలో ఫ్రెంచివారు నిర్మించిన ఆర్ సీఎం చర్చితో పాటు యానాంలో గౌతమీ నదీపాయలో జీసెస్ విగ్రహాలు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇక్కడ విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు దైవారాధనకు వచ్చే క్రీస్తువులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ● చర్చిలతో పాటు క్రైస్తవులు తమ ఇళ్ల వద్ద కూడా ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఇళ్ల వద్ద క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు స్టార్లు తగిలించారు. కుటుంబ సభ్యులు, క్రైస్తవ భక్తులకు పంచేందుకు ప్రత్యేక కేక్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన పట్టణాలలో క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటి అమ్మకాలతో ఆయా దుకాణాలు సందడిగా మారాయి. ముస్తాబైన క్రైస్తవ మందిరాలు నేడు క్రిస్మస్ వేడుకలు విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న చర్చిలు ఇళ్ల ముందు కనువిందు చేస్తున్న స్టార్లు ఊపందుకున్న కేక్లు, క్రిస్మస్ ట్రీల విక్రయాలు -
గోదావరి జిల్లాల్లోకి ఆయిల్ అక్రమ రవాణా
● యానాం నుంచి తరలిస్తున్న మాఫియా ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి, పెట్రోల్ బంకుల యజమానులు అమలాపురం టౌన్: ఉభయ గోదావరి జిల్లాల్లోకి యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమ రవాణా జరుగుతోందని, దీని అరికట్టాలంటూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో పాటు జిల్లా పెట్రోలు బంకుల యాజమానులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి సమస్యను వివరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కుడుపూడి, జిల్లా బంకు యాజమానులు స్థానిక మీడియాతో మాట్లాడారు. యానానికి వచ్చే పెట్రోలు, డీజిల్ ధర.. ఆంధ్రా ధర కంటే దాదాపు రూ.13 నుంచి రూ.17 వరకూ తక్కువగా ఉంటుందన్నారు. దీనివ ల్ల అక్కడి నుంచి ఆయిల్కు అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ యానానికి దిగుమతి అయిన పెట్రోలు, డీజిల్ నిత్యం ఉభయ గోదావరి జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోట్లతో టాక్సుల రూపంలో ఆదాయం తగ్గుతోందన్నారు. ఈ అక్రమ రాకెట్ను ఓ మాఫియా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ అక్రమ ఆయిల్ మాఫియా విషయాన్ని తాను శాసన మండలిలో చర్చకు తీసుకుని వస్తానని, కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు జిల్లా బంక్ల యజమానులతో కలసి త్వరలోనే అక్కడ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. యానాం ఆయిల్స్ అక్రమ రవాణాతో బంక్ల నిర్వహణ, వ్యాపారాలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా పెట్రోల్ బంక్ల యాజమానుల బృందం ప్రతినిధులు బీవీ తిరుమలరావు, జవ్వాది తాతబాబు, కె.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అమలాపురం ఎంపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎంపీ గంటి హరీష్ మాధుర్కు వినతి పత్రం అందజేశారు. -
వైఎస్ జగన్ వాలీబాల్ టోర్నీ విజేతగా వైజాగ్
అమలాపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎ.వేమవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన వైఎస్ జగన్ వాలీబాల్ చాంపియన్ షిప్ విజేతగా వైజాగ్ జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పోటీ పడగా, రన్నర్గా మాగం టీమ్ నిలిచింది. విజేతలకు వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచే రమణారావు మొదటి బహుమతిగా రూ.25 వేల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. రన్నర్కు మాజీ ఎంపీ, పార్టీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ రూ.15 వేల చెక్కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు కుడిపూడి భరత్ భూషణం, రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తొరం గౌతమ్, నాయకులు నక్కా చంద్రశేఖర్, చీకట్ల కిషోర్, చెట్ల రామారావు, చిత్రపు జయరాజు పాల్గొన్నారు. విజేతకు ట్రోఫీ అందజేస్తున్న మాజీ ఎంపీ అనురాధ, వైఎస్సార్ సీపీ నాయకుడు రమణారావు -
స్టేట్ సైన్స్ ఎగ్జిబిషన్లో కోనసీమ సత్తా
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశాయి. వాటిలో ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని, దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శిని అనే రెండు అంశాలుగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అమలాపురం మండలం సమనస జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘మెషిన్ ఫర్ అగ్రికల్చరల్’, రావులపాలెం మండలం ఊబలంక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ● వ్యక్తిగత విభాగం నుంచి రామచంద్రపురంలోని లాల్ బహుదూర్శాస్త్రి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రూపొందించిన ‘సస్టైనబుల్ అగ్రికల్చర్’ ప్రాజెక్టు, గ్రూపు విభాగం నుంచి అమలాపురం పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ‘ఫుట్ ప్రెజర్ పవర్ జనరేషన్’ ప్రాజెక్టు, రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు రూపొందించిన ‘సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్–సేవ్ స్కూల్స్’ ప్రాజెక్టు సదరన్ ఇండియా సైన్స్ ఫేర్కు ఎంపికయ్యాయి. రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు రెండు విభాగాల్లో ఎంపిక కావడం గమనార్హం. ● సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 జనవరి 18న హైదరాబాద్లో జరగనుండగా, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జరిగే ప్రదేశం, తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జిల్లా నుంచి ఐదు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై కలెక్టర్ మహేష్కుమార్ రావిరాల, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ఆ విద్యార్థులను, గైడ్ టీచర్లను అభినందించారు. -
కొబ్బరికి మద్దతు ధర లభించేలా సంప్రదింపులు
అమలాపురం రూరల్: కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా కొబ్బరి బోర్డుతో సంప్రదింపులు జరుపుతామని వర్తకులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో అంబాజీపేట కొబ్బరి మార్కెట్ వర్తకులతో సమావేశం నిర్వహించి, కొబ్బరి ధరల హెచ్చుతగ్గులపై సమీక్షించారు. ● శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సఖినేటిపల్లి మండలం చింతలమోరి నుంచి మామిడికుదురు మండలం కరవాక వరకు సుమారు 22.9 కిలోమీటర్లు పొడవునా డ్రైనేజీ వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని సర్వే, రెవెన్యూ, జలవనరుల డ్రైనేజీ విభాగపు ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు వారితో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ● జిల్లాకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ1.650 కోట్లతో ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని కలెక్టర్ అన్నారు. బొబ్బర్లంక నుంచి పైప్లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని జిల్లా చిట్ట చివరి స్థాయి వరకు సరఫరా చేసేందుకు పైప్లైన్ ఏర్పాటుపై సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెగా ఇంజినీరింగ్ రూపొందించిన పైప్లైన్ ఏర్పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముందుగా తిలకించారు. అలాగే జిల్లాలో రబీ సీజన్కు సరిపడా యూరియా, రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. -
ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయం
అమలాపురం టౌన్: ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. అమలాపురంలోని జిల్లా ఆర్మ్డ్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీస్తు బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ కరుణ, దయ, త్యాగం, ప్రేమ వంటి లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, రఘువీర్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఆర్మ్డ్ ఆర్ఐలు కోటేశ్వరరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. భార్య దేవుడిచ్చిన మిత్రము సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గృహస్థునకు భార్య దేవుడిచ్చిన మిత్రము అని ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానం చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన 28వ రోజు ప్రవచనం కొనసాగించారు. అష్టకష్టాలలో భార్యా వియోగం ఒకటి, పురుషుని జీవితం భార్య మీద ఆధారపడి ఉన్నదని ఆయన వివరించారు. భారతీయ సారస్వతంలో భార్యకు ఉన్నతస్థానం ఉన్నదని ఆయన వివరించారు. యక్షప్రశ్నలు ఒక ఉపనిషత్తుగా స్వీకరించాలని, కర్ణుని గురించి విశ్లేషణ చేస్తూ, దానవీరశూర కర్ణ అనడం అతిశయోక్తి అని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. -
లంక భూములకు గోదావరి కోత
కొత్తపేట: జిల్లాలో గోదావరి ప్రవాహానికి కోతకు గురవుతున్న లంక భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్రేయపురం మండలం రాజవరం సమీప లంక ప్రాంతంలోని విలువైన భూములు నదీ కోతకు గురవుతున్న విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై స్పందించిన జగ్గిరెడ్డి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఏడాది గోదావరి వరదలు, నదీ ప్రవాహానికి పంట భూములు కోతకు గురైపోతున్నాయని రైతులు వివరించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాణిజ్య పంటలు పండే ఎంతో విలువైన భూమి కోతకు గురై గోదావరిలో కలిసిపోతోందన్నారు. వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా వానపల్లి, కపిలేశ్వరపురం మండలాల పరిధిలోని లంక భూములు కూడా కోత బారిన పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, లంక భూముల నదీ కోతను అరికట్టి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) కింద ప్రతిపాదించి, వెంటనే ప్రత్యేక బృందంతో పరిశీలన జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. నదిలో కలిసిపోతున్న విలువైన భూములు చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి కోతకు గురైన ప్రాంతాల పరిశీలన -
క్రిస్మస్ వెలుగులు
అమలాపురంలో మున్నా సిల్వర్ జూబ్లీ చర్చి భూమిపై మానవులను పాపాల నుంచి రక్షించేందుకే ఏసుక్రీస్తు జన్మించారు. అశాంతితో ఉన్న సమాజాన్ని శాంతి, ప్రేమ, దయ తదితర మార్గాల్లో నడిపించారు. ప్రతి ఒక్కరూ పొరుగువారిని ప్రేమించాలని, క్షమాగుణం అలవర్చుకోవాలని బోధించారు. అనేక శ్రమలను భరించి శిలువపై మరణించారు. అనంతరం సజీవునిగా లేచి లోకానికి సత్యమార్గం చూపించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వివిధ చర్చిల్లో ఆయన జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ వేసిన సెట్టింగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ పండగ సందడి మొదలైంది. చర్చిలు, క్రైస్తవుల ఇళ్లు రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి.రామచంద్రపురంలోని దివ్య కారుణ్య దేవాలయంలో క్రీస్తు జననాన్ని తెలిపే సెట్టింగ్ -
శివరాత్రికి జాతీయ వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహాశివరాత్రి సందర్భంగా గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐదు రోజుల పాటు అరిగెల శ్రీరంగయ్య (ఏఎస్ఆర్) జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గొల్లవిల్లి చినరాజప్ప కల్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన నిర్వాహక కమిటీ సభ్యులతో ఏఎస్సార్ టోర్నమెంట్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య సలహాదారుడు అరిగెల వెంకట ముసలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, సొసైటీ అధ్యక్షులు మంచెం బాలకృష్ణ, చిక్కం ఉమేష్, టోర్నమెంటు నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి
గోదావరి డెల్టాలో ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు తూడు, గుర్రపు డెక్కతో పూడుకుపోయి ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే రబీ సాగు సాఫీగా సాగుతోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం మంగళవారం కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ను కోరింది. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆయనను కలిసింది. జిల్లాలో అధ్వానంగా ఉన్న కాలువల వివరాలు, ఫొటోలతో కూడిన వినతిపత్రం అందజేసింది. అనంతరం జిన్నూరి బాబీ విలేకరులతో మాట్లాడుతూ కాలువలు, డ్రైన్లు అధ్వానంగా ఉండడంతో గత ఖరీఫ్ దెబ్బతిందన్నారు. త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలువల వ్యవస్థ దెబ్బతినడం వల్ల రెండో పంటకు నీరందే అవకాశం లేదన్నారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొర్లపాటి వెంకటేశ్వరరావు (కోటబాబు), చిక్కం బాలయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల జోహార్, ఉప్పలగుప్తం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం సూరిబాబు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి యాళ్ల చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: వీఆర్వోల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి, జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. అమలాపురంలోని కచేరి చావిడిలో మంగళవారం జరిగిన జిల్లా వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు సాధనాల ఎల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్కు వీఆర్వోలకు సంబంధించిన అనేక సమస్యలను వివరించామన్నారు. గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1గా పదోన్నతులు కల్పించాలని, వన్ టైమ్ సెటిల్మెంట్ పద్ధతిలో పదోన్నతులకు అర్హులైన వీఆర్వోలను ఖాళీల్లో భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి మల్లేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రరాజు సత్యనారాయణరాజు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈవీవీ సత్యనారాయణ, కేవీవీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి చోడే శివకుమార్ తదితరలు ప్రసంగించారు. -
11 నుంచి కోనసీమ సంక్రాంతి సంబరాలు
● కలెక్టర్ మహేష్కుమార్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అమలాపురం రూరల్: కోనసీమ సంక్రాంతి సంబరాలు, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సవాలను జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవో పర్యాటక జలవనరుల, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోనసీమ సంక్రాంతి సంబరాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. జనవరి 11వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఆత్రేయపురం కాలువ లాకులు వద్ద స్విమ్మింగ్ పోటీలు ప్రారంభిస్తారని, అదే రోజు ఉదయం 9 నుంచి ముగ్గుల పోటీలు ఆత్రేయపురం ప్రధాన రహదారిపై జరుగుతాయన్నారు. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆత్రేయపురం కెనాల్ వద్ద గాలిపటాల పోటీలు ప్రారంభిస్తారన్నారు. కోనసీమ సంక్రాంతి సంబరాలు గోదావరి ట్రోఫీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జనవరి 12, 13 తేదీల్లో ఆత్రేయపురం కాలువ లొల్ల లాకులు డౌన్ స్ట్రీమ్ వద్ద ఉచ్చిలి దేవాలయం నుంచి బ్రిడ్జి వరకూ జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 28 టీములు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.2 లక్షలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.లక్ష బహుమతిగా అందిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జనవరి 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఆత్రేయపురం హైస్కూల్ గ్రౌండ్లో సినీ ఆర్కెస్ట్రా, 12వ తేదీ రాత్రి 7 గంటల నుంచి బాండ్ సేహరి మ్యూజికల్ కార్య క్రమం ఉంటుందన్నారు. = జిల్లాలో కొబ్బరి క్వాయర్ విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అవ కాశాలు నిండుగా ఉన్నాయని, ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. రాష్ట్ర ఎంఎస్ఎం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడికుదురు, ఉప్పలగుప్తం, రావులపాలెం, అమలాపురం, రాయవరం, ద్రాక్షారామాల్లో సంకల్పించిన కొబ్బరి క్వాయరు ఆధారిత పరిశ్రమల ప్రతిపాదనలపై సమీక్షించారు. -
రబీ సాగేదెలా!
● జిల్లాలో అధ్వానంగా డెల్టా కాలువలు ● పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు ● షార్ట్ టైమ్ క్లోజర్ పనులు చేయించని అధికారులు ● రూ.2.70 కోట్ల వీడ్ రిమూవల్ నిధులు నీటిపాలు ● చేయకుండానే బిల్లు చేసుకునే పనిలో నీటి సంఘాలు! సాక్షి, అమలాపురం: ప్రకృతి వైపరీత్యాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్ పంటను కోల్పోయిన రైతులు రబీ సాగుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పంట కాలువలు, మురుగునీటి కాలువల దుస్థితిని చూస్తుంటే జిల్లాలో రబీ సాగు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ప్రధాన పంట కాలువల నుంచి పంట బోదెలు, మైనర్ మురుగునీటి కాలువల్లో తూడు, గుర్రపు డెక్క నిండిపోయాయి. దీనితో శివారు, మెరక ప్రాంతాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు సరికదా.. కీలక సమయంలో డ్రైన్ల నుంచి నీరు తోడుకునే అవకాశం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రబీ సాగుకు జలవనరుల శాఖ అధికారులు డిసెంబర్ ఒకటో తేదీన నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తుపాను, వర్షాల వల్ల ఖరీఫ్ కోతలు ఆలస్యం కావడంతో రబీ పనులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అలాగే మొదలు పెట్టిన చోట సాగునీరు అందడం లేదు. నీరు వదులుతున్నా.. గోదావరి మూడు డెల్టాల పరిధిలో పంట కాలువలకు సమృద్ధిగా నీరు వదులుతున్నారు. తూర్పు డెల్టాకు ఐదు వేలు, మధ్య డెల్టాకు రెండు వేలు, పశ్చిమ డెల్టాకు ఏడు వేల చొప్పున మొత్తం 14 వేల క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. అయినా శివారు, మెరక ప్రాంతాలకు నీరు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదంటే అందుకు పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడమే కారణం. ముఖ్యంగా తొలి పంట సాగు చేయని మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో రబీ ముందస్తు సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లోనే శివారుకు నీరందడం లేదు. దారుణం జిల్లాలో మురుగునీటి కాలువల వ్యవస్థ మరింత దారుణంగా ఉంది. మేజర్, మైనర్, మీడియం డ్రైన్లతో పాటు రెవెన్యూ డ్రైన్లలో కూడా తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయాయి. దీంతో ముంపు నీరు దిగే అవకాశం లేకపోవడంతో ఖరీఫ్లో 40 వేల ఎకరాల్లో సాగు జరగని విషయం తెలిసిందే. ఇక రబీలో నీటి ఎద్దడి సమయంలో వీటి మీద క్రాస్బండ్లు వేసి నీరు నిల్వ చేస్తూంటారు. రైతులు వీటి నుంచే మోటార్లతో సాగునీరు సేకరిస్తారు. అయితే డ్రైన్లు పూడుకుపోవడంతో కీలక సమయంలో నీటిని తోడుకునే అవకాశం రైతులకు లేకుండా పోయింది. ముంచేసిన నీటి సంఘాలు రైతులకు మేలు చేసేందుకు ఏర్పడిన నీటి సంఘాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో చేయపోవడంతో పంటలు నీట మునిగి దెబ్బతినే పరిస్థితులను తెచ్చాయి. ఈ ఏడాది మేజర్, మీడియం డ్రైన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు గతంలోనే కేటాయించింది. కూనవరం, లోయర్ కౌశిక, అప్పర కౌశిక, సాకుర్రు, వృద్ధ గౌతమీ, అమలాపురం, దసరా బుల్లోడుకోడు, వాసాలతిప్ప వంటి డ్రైనేజీల్లో పనులకు ప్రభుత్వం నిర్వహణ నిధులు కేటాయించింది. ఈ పనులను గత ఖరీఫ్కు ముందు వర్షాలు రాక ముందే చేపట్టాల్సి ఉంది. కానీ నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టిన ప్రాజెక్టు కమిటీ తూడు, గురప్రు డెక్క తొలగించిన పాపాన పోలేదు. ఈ ఏడాది నైరుతిలో లోటు వర్షం కలిసి వచ్చింది. అయినా అరకొరగా పనులు చేసి వదిలేసి, బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. వీరి దోపిడీ వల్ల గత ఖరీఫ్లో భారీ వర్షాలు, మోంథా తుపాను సమయంలో జిల్లాలో సుమారు 77,560 ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. పది మేజర్ డ్రైన్ల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చినా.. సకాలంలో తూడు, గురప్రుడెక్క తొలగించక పోవడంతో చేల నుంచి ముంపునీరు వీడడం లేదు. దీనివల్ల పంట పెద్ద ఎత్తున కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. గత నవంబర్ నాలుగో తేదీన ‘సాక్షి’ పత్రిక ‘‘తుడిచిపెట్టిన నిర్లక్ష్యం’’ అనే శీర్షికన ఈ సమస్యను వెలుగులోకి తెచ్చింది. అయినా అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు. సరికదా బిల్లులు చేసుకునే పనిలో పడ్డారు. ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను తామే చేసినట్టుగా రికార్డు చేయించుకుని బిల్లులు నొక్కేసే పనిలో పడినట్టు సమాచారం. -
పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయం
అల్లవరం: సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ఎస్పీ రాహూల్ మీనా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ప్రకటనలో అభినందించారు. అలాగే మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన, సీ్త్రలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలను నియంత్రించడానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. నెల రోజులుగా పలు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే సైబర్ నేరాల తీవ్రం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. ఈ తరహా నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో హెచ్చుమీరుతున్నాయన్నారు. ఉద్యోగం, షేర్లు, బాండ్లు, క్రెడిట్ స్కోర్ తదితర విషయాల్లో సోషల్ మీడియా వేదికగా యాప్లను డౌన్లోడ్ చేయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు సమాచారం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అమలాపురం టౌన్: జిల్లాలోని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ప్రభుత్వ బీమా పథకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు పీఆర్టీయూ జిల్లా యూనియన్ ప్రతినిధులు మంగళవారం వినతి పత్రాలు అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి మెంగం అమృతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాళం శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ మట్టా శ్రీనివాస్ తదితరులు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. పీఎఫ్ చెల్లింపులకు సంబంధించిన సమస్యలను సరిదిద్దాలని, ప్రభుత్వ బీమా పట్టాలు చేరని వారికి, త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలను కూడా తొందరగా పరిష్కరించాలని కోరారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాయంలోని ఏవో సూర్యప్రకాష్, ఏపీజీఎల్ఐ కార్యాలయ సూపరింటెండెంట్ సుధీర్కు వినతి పత్రాలు అందజేశారు. అమరావతికివాజ్పేయి కాంస్య విగ్రహం కొత్తపేట: అమరావతిలో నెలకొల్పే దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని మంగళవారం కొత్తపేట నుంచి తరలించారు. కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ 14 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని టన్నున్నర కాంస్యంతో తయారు చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 30న ఉత్తర ద్వార దర్శనం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ దర్శన అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చెప్పారు. -
హక్కులు, బాధ్యతలపై అవగాహన
సమనసలో వినియోగదారుల సదస్సు అమలాపురం రూరల్: ప్రతి వినియోగదారుడికి హక్కులు బాధ్యతలపై అవగాహన పెంపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి పిలుపు నిచ్చారు. సోమవారం సమనసలో ఒక స్కూల్లో నిర్వహించిన వినియోగదారుల అవగాహన సదస్సును జిల్లాస్థాయి అధికారులు, పాఠశాల విద్యార్థులతో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందని అదే విధంగా సరైన సమాచారం తెలుసుకుని, బిల్లులు తీసుకుని, మోసాలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండటం వినియోగదారుని బాధ్యత అన్నారు. డీఆర్ఓ కే మాధవి మాట్లాడుతూ డిజిటల్ ఫిర్యాదుల పరిష్కారం వంటి ఆధునిక సాంకే తికతలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ ప్రసంగిస్తూ వినియోగదారులు తూకాలు, కొలతల్లో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తూని కలు కొలతలు శాఖ నియంత్రణ అధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు పరిశీలించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య మాట్లాడుతూ కొనుగోలు చేసిన పదార్థాలు తాజాగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు రహదారి భద్రత పట్ల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని చేసి ఐదుగురు ఉపాధ్యాయులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. 24 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5,000 రూ.3,000, రూ.2,000 నగదు, ప్రశంసా పత్రాలు జేసీ చేతుల మీదుగా బహుకరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు పాల్గొన్నారు. -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
జీతాలు ఇవ్వాలని నైట్ వాచ్మన్ల ధర్నా
అమలాపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్మన్లకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, పదిరోజులు పొతే నాలుగు నెలలు పూర్తి అవుతాయి అని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ. దుర్గాప్రసాద్, నూకల బలరామ్ మాట్లాడుతూ జీతా లు లేకపోతే వారికి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి రావాల్సిన పెండింగ్ జీతా లు ఇచ్చేలా ప్రయత్నం చేయాలని అన్నారు. కలెక్టర్కు నైట్ వాచ్మెన్లు సంఘం నాయకులు రాంబాబు, బాలాజీ, శ్రీనివాస్ సత్యం వినతి పత్రాన్ని అందించారు. -
బాల మేధస్సుకు పదును
● కలెక్టర్ మహేష్కుమార్ ● ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అమలాపురంటౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెల్లి వెరిసేలా బాల మేధస్సుకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని, అప్పుడే భావి శాస్త్రవేత్తలు పుట్టుకు వస్తారని కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్ రావిరాల పేర్కొన్నారు. అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా విద్యా శాఖ, జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్ మహేష్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశీలనాశక్తిని, సైంటిఫిక్ టెంపర్మెంట్ను పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ మాట్లాడారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల నుంచి 174 ప్రాజెక్టులు సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు వచ్చాయన్నారు. వీటి నుంచి 11 ప్రాజెక్టులను ఎంపిక చేసి, మంగళ, బుధవారాల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సుకు పంపిస్తున్నట్లు తెలిపారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎన్ఎసీసీ, జాతీయ సైన్స్ కాంగ్రెస్ పతాకాలను అతిథులు ఆవిష్కరించారు. సర్ సీవీ రామన్, గణిత మేధావి రామానుజన్ చిత్ర పటాలను ఆవిష్కరించారు. ఏడు థీమ్స్తో కూడిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉప విద్యాశాఖాధికారులు జి.సూర్యప్రకాశరావు, పి.రామలక్ష్మణమూర్తి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రాజెక్టులు రాయవరం: జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. పాఠశాలలపై సోలార్ ఎనర్జీ పాఠశాలలపై సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేయడం ద్వారా అధిక మొత్తంలో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునంటూ రావులపాలెం మండలం ఊబలంక విద్యార్థులు నిరూపించారు. 7వ తరగతికి చెందిన కె.ఈశ్వర్సంజీవ్, 9వ తరగతికి చెందిన సీహెచ్.పవన్సాయి ఈ ప్రాజెక్టును రూపొందించారు. గైడ్ టీచర్ సీహెచ్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఫుట్ ప్రెషర్ ఎలక్ట్రిసిటీ నడుస్తున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫుట్పాత్ మీద నడుస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఎనర్జీ జనరేట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీనే మనం విద్యుత్ అవసరాలకు వాడుకోవచ్చునని అమలాపురంలోని వెత్సావారి అగ్రహారం ఎంజీ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరూపించారు. పాఠశాలకు చెందిన ఎన్.సత్యప్రవీణ్, పి.సిద్దార్ధలు గైడ్ టీచర్ పీవీఎల్ఎన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ సిస్టమ్ తక్కువ ఖర్చుతో అధికంగా ఉత్పత్తిని సాధించడం ఎలాగన్నది ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ సిస్టమ్ ద్వారా నిరూపించారు. రామచంద్రపురం అనిశెట్టివారి సావరంలోని ఎస్ఎల్బీ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.నాగదేవి, సీహెచ్.సుచిత్ర గైడ్ టీచర్ బి.విజయశ్రీ నేతృత్వంలో ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తక్కువ విస్తీర్ణంలో మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్, హైడ్రోఫోనిక్ వెర్టికల్ క్రాపింగ్, యానిమల్ హజ్బెండరీ, ఆక్వాకల్చర్ను అభివృద్ధి చేసే విధానాన్ని తెలియపర్చారు. మల్టీ క్రాపింగ్ ద్వారా రైతులు నష్టపోకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు. -
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత ● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులు పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అద్యక్షులు రావుల మాదవరావు, ఆనాల సుదర్శన్లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు. -
మహాత్మాగాంధీ పేరు తొలగించటం దుర్మార్గం
● ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు ● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుబ్బారావు ● కలెక్టరేట్ వద్ద వామపక్షాలు, దళిత ప్రజా సంఘాల ధర్నా అమలాపురం రూరల్: జాతీయ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మహాత్మాగాంధీ పేరును తొలగించి జీరామ్జీ అనే పేరు చేర్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ిసీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద వామపక్షాలు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలా అని ఆలోచిస్తూ ఉందని, చివరకు ఆ పథకాన్ని రద్దు చేయడానికి సరికొత్త స్కీమును ప్రవేశపెట్టిందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడమే పనిగా పెట్టుకుని ప్రతి బడ్జెట్లో నిధుల కోత పెడుతూ, జీ రామ్జీ పేరు చేర్చి మతపు రంగు పులిమే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 125 రోజులకు పని పెంచినట్లు కేంద్రం చెబుతున్నా అందుకు తగ్గ నిధులను కేటాయించలేదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. దుర్గాప్రసాద్, ఎన్.బలరాం, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసిరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, సీపీఐ నాయకులు చెల్లుబోయిన తాతారావు, దొండపాటి గట్టురాజు, డి భానోజీ, డి చిట్టిబాబు, వి చిట్టిబాబు, పౌర హక్కుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి అమలుదాసు బాబురావు, జిల్లెల్ల మనోహర్ మాల మహానాడు జిల్లా నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, వీర ప్రసాద్, ఉండవల్లి గోపాలరావు పాల్గొన్నారు. -
చెడు అలవాట్లతో బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో విత్తనం కందను చేలో పరచిన దృశ్యం అన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా వ్రతాల నిర్వహణకు వెళ్లిన స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజు కు మెమో ఇచ్చారు. సోమవారం సస్పెండ్ అయిన వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పండగ బాదుడు మొదలు
● సంక్రాంతి దోపిడీకి ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధం ● మూడు రెట్లు పెరిగిన బస్సు టిక్కెట్ ధరలు ● ఈ నెల 9 నుంచి 13 వరకు... ● హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ టిక్కెట్లు లేవు ● ప్రైవేట్ బస్సు సిటింగ్ టిక్కెట్ల ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు... ● స్లీపర్ బస్సుల ధరలు రూ. 2 వేల నుంచి రూ.మూడు వేల ● ఈ నెల 18న కొండెక్కిన రిటన్ టిక్కెట్ల ధరలు ● రైల్వేలో చాంతాడంత వెయిటింగ్ లిస్టు ● పండగకు ప్రయాణమే పెద్ద ఖర్చు సాక్షి, అమలాపురం: పండగ బాదుడుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు. రైల్వే టిక్కెట్ల వెయింటిగ్ లిస్టు చాంతాడంత ఉండడం... హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లు ఇప్పటికే కొనుగోలు పూర్తి కావడంతో ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారికి పండగ రోజుల్లో ఇళ్ల వద్ద అయ్యే వ్యయం కన్నా ప్రయాణానికే ఖర్చు అధికం కానుంది. 17 లేదా 18వ తేదీన తిరిగి వెళ్లే ఏర్పాట్లు సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంత ప్రాంతమైన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున తరలి రావడం సర్వసాధారణం. కరోనా తరువాత చాలా మంది సొంత వాహనాలైన కార్లలో పండగ సమయంలో రావడం పెరిగింది. అయితే మధ్య తరగతి, పేద వర్గాలకు చెందినవారు రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి, ఉన్నత ఉద్యోగాల కోసం మహా నగరాలకు వలస వెళ్లినవారు అధికం. అందునా ఒకప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో నివాసముంటున్నవారు అధికం. వీరంతా పండగకు రావడం తప్పనిసరి. వచ్చే ఏడాది జనవరి 14న తేదీ బుధవారం భోగి పండగ వచ్చింది. అయితే తొమ్మిదవ తేదీ రెండవ శనివారం కావడంతో చాలా మంది శుక్రవారం రాత్రి బయలుదేరనున్నారు. రెండవ శనివారం, తరువాత ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాలు సెలవులు పెట్టుకుంటే తిరిగి 17వ తేదీ శనివారం, 18వ తేదీ ఆదివారం వెళ్లనున్నారు. 18వ తేదీ అమావాస్య కావడంతో చాలామంది 17వ తేదీన తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైళ్లు.. బస్సులు ఫుల్ ఉమ్మడి జిల్లాకు వచ్చేవారు సికింద్రాబాద్, హైదరాబాద్ల నుంచి బయలుదేరి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు వస్తారు. ఆ రోజుల్లో రెగ్యులర్గా నడిచే రైళ్ల వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. గౌతమీ, గోదావరి, కోకనాడ, ఎల్టీటీ వంటి ప్రధాన సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్ల టిక్కెట్లు వెయిటింగ్ లిస్టు పరిమితి కూడా దాటిపోవడంతో రిగ్రెట్లో పెట్టారు. పండగ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక ఆర్టీసీ బస్సులలో కూడా టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్ నుంచి అమలాపురం బస్టాండ్కు రోజూ సుమారు పది రెగ్యులర్ బస్సులున్నాయి. వీటిలో తొమ్మిదవ తేదీ ఉదయం నడిచే బస్సులకు తప్ప మిగిలిన బస్సుల టిక్కెట్లు పూర్తయ్యియి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, రాత్రి సర్వీసుల బస్సులు టిక్కెట్లు కూడా అయిపోయాయి. జిల్లాలో అమలాపురంతో పాటు రాజోలు, రామచంద్రపురం డిపోల బస్సుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అమాంతంగా పెరిగిన ధరలు ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ, నాన్ఏసీ బస్సులు అనే తేడా లేకుండా టిక్కెట్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు,మూడు రెట్లు పెరిగాయి. అన్ సీజన్లో నాన్ ఏసీ సిటింగ్ రూ.500కు కూడా వచ్చే టిక్కెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సిటింగ్ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదవ తేదీన అయితే ఏకంగా రూ.2,600ల నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సిటింగ్ ధర రూ.1,500 నుంచి రూ.2,500ల వరకు ఉండగా, స్లీపర్ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం. టిక్కెట్ రేట్లు చూసినవారికి కొత్త దుస్తులు, ఇతర ఖర్చుల కన్నా ప్రయాణ ఖర్చులే అధికంగా అవుతాయని పండగలకు సొంత గ్రామాలకు వచ్చేవారు వాపోతున్నారు. నోరు మెదపని ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆపరేటర్లలో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, ప్రధాన నేతలు ఉండడంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ బస్సు టిక్కెట్ల ధరలు రెండు, మూడు రెట్లు పెంచిన విషయం వివిధ యాప్లలో బహిరంగంగా కనిపిస్తున్నా ఆర్టీవో అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇక పండగ సమయంలో దొడ్డిదారిన బస్సులు నడిపేందుకు సైతం ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిమాండ్ లేని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలుపుదల చేసి డిమాండ్ ఉన్న సర్వీసులో తిప్పనున్నారు. ఇటీవల పలు ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. గత అక్టోబర్ 24వ తేదీన కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన తరువాత తనిఖీల పేరుతో వారం రోజుల పాటు హడావుడి చేసిన ఆర్టీవో అధికారులు తరువాత వాటి వంక చూడలేదు. ప్రయాణీకుల భద్రత విషయాన్ని గాలికి వదిలేశారు. ఇక పండగ సమయంలో చూసీచూడనట్టు వదిలేసే అవకాశముండడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా బస్సులు తిప్పనున్నారు. -
ఆర్డీవో, డీఎస్పీ ఆఫీసులు కొనసాగించాలని వినతి
అమలాపురం రూరల్: రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రామచంద్రపురం రెవెన్యూ సబ్ డివిజన్ను తరలించడం కూడదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు పలువురు నాయకులు వినతిపత్రాలు అందించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉందని దీనివల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్లు పొరుగు నియోజకవర్గాలకు తరలిస్తారు. వీటిని కొనసాగించాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోర్టినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెమ్మిరెడ్డి మురళి, అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, అఖిల పక్ష నాయకుడు సలాది సతీష్నాయుడుకలెక్టర్ను కలిసి వినిత పత్రం అందిచారు. ఈ ఆఫీస్ను మూసివేస్తే రైతులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, కూలీలు, సాధారణ ప్రజలకు కష్టాలు ఏర్పడతారయని అందువల్ల, వాటిని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. -
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
వైఎస్సార్ టీయూసీ బలోపేతానికి చర్యలు
అమలాపురం టౌన్: వైఎస్సార్ టీయూసీ జిల్లా యూనియన్ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ యూనియన్ జోనల్ అధ్యక్షుడు భూపతి అజయ్కుమార్ అన్నారు. అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్లో సోమవారం జరిగిన జిల్లా యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సమావేశానికి జిల్లా యూనియన్ అధ్యక్షుడు యల్లమిల్లి వెంకటేశ్వర అధ్యక్షత వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి యూనియన్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అజయ్కుమార్ వెల్లడించారు. పార్టీ కోసం శ్రమించేలా పటిష్టమైన కార్మిక విభాగాన్ని, నాయకత్వాన్ని తయారు చేస్తున్నామన్నారు. పార్టీ పురోభివృద్ధికి టీయూసీ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి, జిలా కార్యదర్శి శెట్టి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు ఇళ్ల సత్య గోపాలకృష్ణ, కాకిలేటి శ్రీనివాస్తోపాటు జిల్లాలోని నియోజకవర్గాల యూనియన్ అధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్, పితాని నరేష్, ములపర్తి సత్యనారాయణ, బొంతు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పెన్షనర్స్ విభాగం కార్యదర్శి టపా పుల్లేశ్వరరావులు ప్రసంగించి కార్మిక ఉద్యమ చరిత్ర, నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. 250 అర్జీల స్వీకరణ అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సుమారు 250 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి, డీఆర్ఓ కే. మాధవి సమగ్ర శిక్ష ఏపీసీ జి. మమ్మీ, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 29 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికకు 29 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువ భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలే ఉండడంతో ఆ ఫిర్యాదుదారులతో ఎస్పీ మీనా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రాజ్యలాభం కన్నా ధర్మలాభం గొప్పదిఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాజ్యలాభం కన్నా ధర్మమార్గం గొప్పది. ధర్మానికి తపస్సే మార్గమని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతాడు’ అని సామవేదం షణ్ముఖశర్మ తెలిపారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారతం ప్రవచనాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ‘‘తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాండవుల వద్దకు కృష్ణుడు వచ్చి ధర్మజ, భీములకు నమస్కరిస్తాడు. వారిద్దరూ వయసులో కృష్ణునికన్నా పెద్దలు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. కృష్ణునికి నకుల సహదేవులు నమస్కరించారు. ధర్మరాజుతో కృష్ణుడు మాట్లాడుతూ, వనవాస సమయంలో నీలో ఎటువంటి సుగుణాలున్నాయో, రాజుగా ఉన్న సమయంలో కూడా అవే ఉన్నాయి. నీవు కర్మలను కామ్య దృష్టితో చేయవు’’ అని అంటాడని వివరించారు. సాధకుని దృష్టి ధర్మరాజుపై, లక్ష్యం కృష్ణునిపై ఉండాలని అన్నారు. ‘‘అనంతరం వారి వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన తపస్సా్ాధ్యయ సంపన్నుడు. జరామరణాలు లేనివాడు. వేల సంవత్సరాల వయసున్నా, పాతికేళ్ల యువకునిలా ఉండేవాడని వ్యాసుడు వర్ణించాడు. ప్రళయ కాలంలో సృష్టి అంతా జలమయమైన సమయంలో కూడా ఆయన అదే శరీరంతో ఉన్నారు’’ అని చెప్పారు. శకుని ప్రోద్బలంతో కౌరవులు ఘోష యాత్రకు ప్రయాణమవుతారన్నారు. గ్రంథావిష్కరణ విశ్రాంత ఓఎన్జీసీ అధికారి, ప్రముఖ సాహితీవేత్త కవితా ప్రసాద్ రచించిన సౌందర్యలహరి పద్య సంపుటిని ప్రవచనానంతరం షణ్ముఖశర్మ ఆవిష్కరించారు. శంకరభగవత్పాదులు అందించిన సౌందర్యలహరి శ్లోకాలను మధ్యాక్కర ఛందస్సులో కవితా ప్రసాద్ అనువదించిన తీరు అభినందనీయమని అన్నారు. ఆదిశంకరుల శ్లోకాలకు రచయిత ప్రామాణికమైన అనువాదాన్ని అందించారని చెప్పారు. -
రోస్ట్ రుచే వేరప్పా!
● నోరూరించే మోరి జీడిపప్పు ● బాయిల్డ్ కన్నా మంచి డిమాండ్ ● 25 గ్రామాలకు విస్తరించి 25 వేల కుటుంబాలకు ఉపాధి ● రోజుకు 200 బస్తాలు ప్రాసెస్ ● ఏటా రూ.500 కోట్ల టర్నోవర్ సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం. తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. ఇక్కడి జీడిపప్పు కేరళ సరకు కంటే రుచిగా ఉండడం వల్ల దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇక్కడ తయారీ విధానం వల్లే దానికి అంత ప్రసిద్ధి ఏర్పడింది. మిగిలిన ప్రాంతాల్లో బాయిలర్లో ఉడికించిన జీడిపప్పే దొరుకుతుంది. మోరిలో మాత్రం రోస్టింగ్ పప్పు సరఫరా అవుతుంది. దిగుమతి గింజలతోనే వ్యాపారం రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికే పరిమితమైన ఈ పరిశ్రమ క్రమేపీ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఉగాదికి అందుబాటులోకి వచ్చే గింజలతోనే సీజన్ మొదలవుతుంది. మోరిలో తయారైన జీడిపప్పు క్రమేణా రాజోలుదీవిలోని సుమారు 25 గ్రామాలకు విస్తరించింది. రోజుకు 200 బస్తాల గింజలు రోజుకు సరాసరి 200 బస్తాల గింజల నుంచి జీడిపప్పు ప్రాసెస్ అవుతుంది. 80 కిలోల బస్తాలోని జీడి పిక్కలను ప్రాసెస్ చేస్తే 20 కిలోల స్వచ్ఛమైన జీడిపప్పు వస్తుంది. ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్ష ల టన్నులు ఉత్పత్తి అయ్యి సుమారు రూ.500 కోట్ల టర్నోవర్ వస్తుందని అంచనా. ఈ పరిశ్రమపై 25 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అంచనా. స్వదేశీ గింజలతో వ్యాపారం ఏటా ఉగాదికి కొత్తగా మార్కెట్లోకి వచ్చే స్వదేశీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రాసెస్ చేసిన పప్పును హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి ప్రధాన కేంద్రాలతో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోస్టింగ్, బాయిలింగ్.. జీడిగింజలను కొలిమి (డ్రమ్ము)లో వేసి కాల్చిన తరువాత పప్పు తీసే పద్ధతి రోస్టింగ్. బాయిలర్ లేదా కుక్కర్లో ఉడకబెట్టి పప్పు తీసే పద్ధతి బాయిలింగ్. బాయిలింగ్ పారిశ్రామికంగా పేరుపొందింది. పెద్ద మొత్తంలో వేగంగా, తక్కువ శ్రమతో పప్పు తయారవుతుంది. దీంతో జీడిగింజలు ప్రాసెస్ చేసే అన్ని చోట్లా బాయిలింగ్ పద్ధతి పెరిగింది. మోరిలో కూడా బాయిలింగ్ మొదలైనప్పటికీ, రోస్టింగ్ యూనిట్లే ఎక్కువగా ఉన్నాయి. రోస్టింగ్కి నైపుణ్యం ఉన్న కార్మి కులు కావాలి. రోస్టింగ్ చేసే వ్యాపారులు మాత్రం, బాయిలర్ వైరెటీ కంటే రోస్టింగ్ వైరెటీకే ఎక్కువ నిల్వ, నాణ్యత, రుచి ఉంటుందని చెబుతున్నారు. రోస్టింగ్ జీడిపప్పు స్పెషల్ ప్రస్తుతం రోస్టింగ్ జీడిపప్పు మా ప్రాంతాల నుంచే వస్తోంది. రోస్టింగ్ చేసేది బాగా తెల్లగా ఉండదు. ఉడకబెట్టింది బాగా తెల్లగా ఉంటుంది. బాయిలర్ కంటె రోస్టింగ్లో మనుషుల పని ఎక్కువ. రోస్టింగ్ చేసేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. – ముప్పర్తి సుబ్బారావు, వ్యాపారి, మోరిపోడు శ్రమ ఎక్కువ, లాభం తక్కువ ఈ పనిలో శ్రమ ఎక్కువ. భారీగా లాభాలేమీ రావు. రైతు వద్ద కొనుగోలు చేసే టైంలో గింజల లోపల ఏముందో పసిగట్టలేం. పెట్టుబడికి, సరుకు అమ్మకం వల్ల వచ్చే మొత్తానికి సరిపోతోంది. – ముప్పర్తి ఆదినారాయణ, వ్యాపారి, మోరి 80 కేజీల బస్తా రూ.14 వేలు ప్రస్తుతం మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.14 వేలు పలుకుతోంది. 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి కూలీల ఖర్చు రూ.1,400 వెచ్చించాల్సి వస్తుంది. కాగా స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.830, కేజీ బద్దముక్క రూ.750, నలిముక్క కేజీ రూ.650 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,300, ముక్కబద్దకు రూ.6,000, నలి ముక్కకు రూ.1,300 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా మొత్తం ఆదాయం రూ.15,600 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే : మార్కెట్లో 80 కిలోల గింజల తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై మొత్తం రూ.15,400 పెట్టుబడి అవసరమవుతుంది. మార్కెట్లో తెల్లపప్పు విక్రయాల ద్వారా వస్తున్నది రూ.15,600. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారికి లాభం అత్యల్పం. ఖాతాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. -
వేయి శుభములు కలుగు నీకు..
● సంక్షేమ సారధి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు ● జిల్లాలో వ్యాప్తంగా కేక్ కటింగులు ● విరివిగా సేవా కార్యక్రమాలు ● వందల సంఖ్యలో రక్తదాన శిబిరాలు ● దుప్పట్లు, రగ్గులు, పండ్ల పంపిణీలు ● భారీగా మోటారు సైకిల్ ర్యాలీలు సాక్షి, అమలాపురం: సంక్షేమ సారధి.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం జేజేలు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఆయన జన్మదినోత్సవాన్ని పండగలా నిర్వహించారు. వాడవాడలా కేక్లు కట్చేసి పంచారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ కో ఆర్డినేటర్లు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. పేదలకు, కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆస్పత్రులలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. పిల్లలకు ఆస్పత్రులలో ఉయ్యాలలు పంచిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రక్తదానం చేసి స్ఫూర్తి నింపారు.. సంక్షేమ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. జగ్గిరెడ్డి స్వయంగా రక్తదానం చేసి కార్యకర్తలలో స్ఫూర్తిని నింపారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు ఉయ్యాలలు, రోగులు, పేదలకు దుప్పట్లు, రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంచారు. రావులపాలెంలో అంధుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రన్నకుమార్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బొక్కా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. రావులపాలెంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్లు కోసి.. వస్త్రదానాలు చేసి.. అమలాపురం నియోజకవర్గంలో జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా అమలాపురం హై స్కూల్ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచారు. పేదలకు వస్త్రాలు పంచిపెట్టారు. పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, మాజీ ఎంపీ, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం లూయీ అంధుల పాఠశాల, హరి మనోవికాస కేంద్రం విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని తన స్వగృహంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేదలకు నూతన వస్త్రాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు ముట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజా కుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, జాన గణేష్, మిండగుదిటి శిరీష్, తోరం గౌతమ్ రాజా తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు పండ్లు పంపిణీ
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 113 మంది రక్తదానం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ సభ్యురాలు కాశి బాల మునికుమారి, రాష్ట్ర కార్యదర్శులు పెన్మత్స చిట్టి రాజు, పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు. -
ఐహెచ్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్ఆర్సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు. -
జాతీయ కోకో పోటీలకు లావణ్యశ్రీ
అంబాజీపేట: తొండవరం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సవరపు లావణ్యశ్రీ జాతీయ ఖోఖో పోటీలలో పాల్గొననున్నట్టు హెచ్ఎం పీవీ కేశవాచార్యులు, పీడీ పెచ్చెట్టి సూర్యనారాయణ తెలిపారు. గత నెల విజయనగరంలో జరిగిన అండర్–19 బాలికల ఖోఖో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో లావణ్యశ్రీ పాల్గొందన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యంత ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుందన్నారు. లావణ్యశ్రీని పలువురు అభినందించారు. -
చైతన్య కెరటం చెకుముకి
● రాష్ట్ర స్థాయి సంబరాలకు కాకినాడ సిద్ధం ● మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఉమ్మడి జిల్లా ● రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది హాజరు ● శాస్త్రవేత్తలతో 162 మంది విద్యార్థులు మమేకం కపిలేశ్వరపురం: మానవుని దైనందిన జీవితంలో సైన్స్ భాగం కావాలన్న లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా కృషి చేస్తోంది. విద్యార్థుల్లో విజ్ఞానం, సమాజం పట్ల చైతన్యం కల్పించే దిశగా చెకుముకి సంబరాలను ఏటా నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి సంబరాలను కాకినాడ జేఎన్టీయూకేలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కథనం.. విద్యార్థులు ప్రతిభ ఇలా.. అక్టోబర్ 18న పాఠశాల స్థాయిలోనూ, నవంబర్ 4న మండల స్థాయిలోనూ చెకుముకి పరీక్ష నిర్వహించి మండలానికి ఒక్కో బృందం చొప్పున జిల్లా పోటీలకు ఎంపిక చేశారు. నవంబర్ 23న కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో జిల్లా స్థాయి సంబరాలను నిర్వహించారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఒక్కో బృందం చొప్పున ఆదివారం నుంచి రాష్ట్ర స్థాయి సంబరాలకు ఎంపిక చేశారు. కోనసీమ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి మండపేట రూరల్ మండలం ద్వారపూడి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం, ప్రైవేటు విభాగంలో మండపేట పట్టణంలోని అన్నపూర్ణ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి సీతానగరం మండలం రఘుదేవపురం పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి రాజానగరంలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థులు నిలిచారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ విభాగం నుంచి పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైవేటు విభాగం నుంచి కాకినాడ గంగరాజునగర్లోని ఆదిత్య ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానాల్లో నిలిచాయి. కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీల్లో ఆయా బృందాల ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. రాష్ట్ర స్థాయి సంబరాలు ప్రత్యేకతలివీ కాకినాడలోని జేఎన్టీయూకేలో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించనున్నారు. 2015లో జేఎన్టీయూకేలోనూ, 2014లో పెద్దాపురం శ్రీప్రకాష్ విద్యాలయంలోనూ రాష్ట్ర స్థాయి సంబాలను నిర్వహించారు. ప్రస్తుత సంబరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు చెకుముకి పరీక్షలో పాల్గొననున్నారు. మరో 150 మంది తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో గైడ్ టీచర్ హాజరవుతారు. హైదరాబాద్ సీసీఎంబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వేగేశ్న రాధ, విశాఖపట్టణం డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ యు.అర్బన్కుమార్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డిలతో మీట్ ది సైంటిస్ట్ నిర్వహిస్తారు. అలాగే విద్యార్థి బృందాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా కాకుండా విద్యార్థుల బృందంగానే ప్రతిభను పరిగణిస్తారు. ప్రాక్టికల్, ఆడియో, వీడియో విజువల్ క్విజ్ రౌండ్ తదితర ప్రతిభా పోటీలను నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థి బృందాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేస్తారు. విద్యార్థులను క్షేత్ర పరిశీలన విభాగంలో మడ అడవుల సందర్శనకు తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు వివిధ సామాజిక అంశాలపై చర్చావేదిక నిర్వహిస్తారు. జీవితంలో సైన్స్ భాగం కావాలి ప్రజల దైనందిన జీవితంలో సైన్స్ భావాలను కల్పించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగా 8, 9, 10 విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, చదువు పట్ల ఆసక్తి, చిన్ననాటి నుంచీ సమానత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, సమష్టి ఆచరణ పద్ధతులను అలవాటు చేయడానికి కృషి చేస్తున్నాం. కాకినాడలోని రాష్ట్ర స్థాయి సంబరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. జీఎస్హెచ్పీ వర్మ, ఆహ్వాన సంఘం కార్యదర్శి, కాకినాడ చెకుముకి సంబరాల నేపథ్యమిదీ మానవుల్లో అజ్ఞానాన్ని తొలగించేందుకు పలువురు మేధావులు 1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదికను స్థాపించారు. విద్యార్థి చెకుముఖి పేరుతో 1990 డిసెంబరు నుంచి సైన్స్ మాస పత్రికను, 2010 నుంచి ‘చెకుముఖి సైన్స్ సంబరాలు’ను నిర్వహిస్తుంది. నేర్చుకున్నది గుర్తుంచుకోవడం కాకుండా ఆచరించగలగడమే గీటురాయి అని చెప్పడమే సంబరాల ఉద్దేశం. వ్యక్తిగా కాకుండా సమూహంగా విజ్ఞాన ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తుండటం చెకుముకి మరో ప్రత్యేకత. -
పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చీలిక పెదాలు, అంగిలి సవరణ చికిత్సా శిబిరం శనివారం ప్రారంభమైంది. మిషన్ స్మైల్ ఇండియా ఫినాలెక్స్, ముకుల్ మహదేవ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. బాధిత బాలల్ని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రత్నభూషణ్ పర్యవేక్షణలో అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ వైద్యులు శిశిర్రెడ్డి, రేఖాదేవి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం 66 మంది బాలలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. -
అగ్నిప్రమాదంలో పూరిళ్లు దగ్ధం
నిరాశ్రయులైన పేద కుటుంబాలు తొండంగి: మండలంలోని శృంగవృక్షంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. శృంగవృక్షం గ్రామశివారు పి.అగ్రహారం రహదారిలో సుమారు పది కుటుంబాల వారు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. కొబ్బరి చీపుర్లు, పాములు పట్టడం, ఉడుములు పట్టడం వంటి కుటుంబ వృత్తులతో వారు జీవిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వంట చేస్తుండగా పొయ్యిలోని మంటలు చెలరేగి పై కప్పునకు వ్యాపించాయి. ఈదురుగాలుల ప్రభావంతో మరో ఐదిళ్లకు మంటలు వ్యాపించి క్షణాల్లో అవి కాలిపోయాయి. మగవారు పనికి వెళ్లడంతో ఇళ్లలోని మహిళలు, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ఈ లోపు మంటలు ఆర్పేందుకు చేతనైన చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శకటం వచ్చేటప్పటికే ఆ పూరిళ్లన్నీ కాలిపోయాయి. తోట రమణ, రావూరి శివ, పుట్టం పోలయ్య, తుపాకుల వెంకటలక్ష్మి, బండి సత్తిబాబు, పంజాపు లక్ష్మి, పుట్టం రాజు తదితర కుటుంబాల వారి ఇంటి సామగ్రితో పాటు నగదు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సుమారు రూ.పది లక్షల ఆస్తినష్టం ఉంటుందని బాధితులు వాపోయారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ కాంతారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అట్టహాసంగా టెన్నిస్ టోర్నీ పెద్దాపురం (సామర్లకోట): సీనియర్ జాతీయ ర్యాంకర్స్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం పెద్దాపురం లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైంది. 35 ప్లస్, 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్, 55 ప్లస్, 60 ప్లస్, 65ప్లస్, 70ప్లస్, 70 ప్లస్ విభాగాలలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో భాగంగానే ఈ పోటీలు ఈనెల 23 వరకు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. లిటరరీ అసోసియేషన్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావారణంలో పోటీలు నువ్వా, నేనా అన్నట్టు సింగిల్స్, డబుల్స్ పోటీలు జరిగాయి. డ్రైవర్ నిర్లక్ష్యం... ప్రయాణికురాలికి గాయం ప్రత్తిపాడు: ఉచిత బస్సు.. ప్రయాణికుల రద్దీకి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికురాలు గాయపడిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు ఏలేశ్వరం మండల కేంద్రానికి చెందిన బి.దివ్య బంధువు వి.పరిమళతో కలిసి పెద్దాపురం మండలం పులిమేరు వెళ్లేందుకు పయనమయ్యారు. ఏలేశ్వరం నుంచి యర్రవరం వచ్చిన వారిద్దరూ ప్రత్తిపాడు వెళ్లేందుకు రాజమహేంద్రపురం డిపోకు చెందిన తుని వెళ్లే బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదిలించారు. దీంతో దివ్య అదుపుతప్పి పడిపోయింది. దీనిపై ప్రయాణి కులు డ్రైవర్పై ఆగ్రహంతో విరుచుకుపడడంతో అదే బస్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తరలించారు. చికిత్స అనంతరం ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది. -
భక్తజన సంద్రమైన వాడపల్లి
కొత్తపేట: ఏడు వారాలస్వామి వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. దేవస్థానానికి ఒక్క రోజు ఆదాయం రూ 62.53 లక్షలు సమకూరినట్టు ఈఓ తెలిపారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ, బందోబస్తు నిర్వహించారు. ఒక్క రోజు ఆదాయం రూ 53.36 లక్షలు వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాస్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో శనివారం ఒక్కరోజు రాత్రి 9 గంటల వరకూ దేవస్థానానికి రూ.53,36,577 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి రావులపాలేనికి చెందిన సాయి నటరాజ కళాపీఠం కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం వారు మెమెంటోలు అందచేశారు. శనైశ్చరుని ఆదాయం రూ.2.49 లక్షలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేశారు. దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,28,670, పరోక్ష పూజలు, మనియార్డర్లు ద్వారా రూ.86,600, అన్నప్రసాదం విరాళాలు రూపంలో రూ.33,954 మొత్తం రూ.2,49,224 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్బాబు తెలిపారు. -
మంగళసూత్రాలే టార్గెట్
కాకినాడ క్రైం: మహిళల మెడలో మంగళసూత్రాలు లాక్కుని వెళ్తున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. మంగళసూత్రాల చోరీలే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఈ నలుగురు రోడ్లపై వెళ్తున్న మహిళల మెడల నుంచి చాకచక్యంగా లాక్కుని వెళ్లడంలో ఆరితేరిపోయారు. వీరి ఆటలను జిల్లా పోలీసులు కట్టించారు. సంబంధిత వివరాలను ఎస్పీ బిందుమాధవ్ శనివారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన నలుగురు దొంగలు ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్లు చేస్తూ బెంబేలు పుట్టిస్తున్నారు. మోటార్ సైకిళ్లపై సంచరిస్తూ రోడ్లపై వెళ్తున్న ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుంటారు. పరస్పర సమన్వయంతో ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తారు. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ తన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో దొంగల జాడకోసం జల్లెడ పట్టారు. సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని ఎస్పీ తెలిపారు. కాజులూరు, తాళ్లరేవు, కరప మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతుండగా ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాయన్నారు. ఎట్టకేలకు దొంగలు తాళ్లరేవు మండలం పరదేశమ్మ పేటకు చెందిన మల్లాడి విజయ్కుమార్, సీతారాంపురం కొత్తకాలనీకి చెందిన పెసింగి రాధాకృష్ణ, కాకినాడ జగన్నాథపురానికి చెందిన మల్లాడి సతీష్, తాళ్లరేవు మండలం సీతమ్మపురానికి చెందిన పరంశెట్టి బుజ్జి వెంకట దుర్గారావులను శుక్రవారం సాయంత్రం నామవానిపాలెం మార్గంలో అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వీరు 24 చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. ముద్దాయిల నుంచి రూ.56 లక్షల విలువైన 452 గ్రాముల బంగారంతో పాటు, ఐదు ద్విచక్ర వాహనాలను, నేరాలకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగల్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణతో పాటు ఆయన బృందాన్ని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. ● నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు ● రూ.56 లక్షల విలువైన ● 452 గ్రాముల బంగారం రికవరీ -
నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి
మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మా కుమార్తె హనీ వైద్యం కోసం మా అత్తవారి ఊరైన అల్లవరం మండలం నక్కా రామేశ్వరం వచ్చాను. ఇప్పుడు అమలాపురంలో నివాసం. హనీకి మూడేళ్ల వయసులోనే గౌచర్ (గాకర్స్– శరీరంలో రక్తం సరఫరా లోపం (మెటబాలిక్ డిజార్డర్)) అనే అరుదైన వ్యాధి వచ్చింది. దేశంలో ఇలాంటి వ్యాధిగ్రాస్తులు 14 మంది మాత్రమే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. నాకు, నా భార్య నాగలక్ష్మికి గుండె పగిలేంత దుఃఖం తన్నుకొచ్చింది. హనీ వైద్యానికి రూ.లక్షలు ఖర్చవుతుందని తెలిసి ఏం చేయాలో పాలుపోలేదు. 2020 సెప్టెంబరు 26న సీఎం జగన్ పి.గన్నవరం పర్యటనకు వచ్చారు. ఇది తెలిసి జగన్ వెళ్లే దారిలో మా పాపను నెత్తిన ఎక్కించుకుని ‘తన ప్రాణాలు కాపాడాల’ని ప్లకార్డు పట్టుకుని అర్థించాను. దానిని చూసి తన వద్దకు వచ్చిన జగన్ పాపకు వెంటనే వైద్యం అందించాలని పక్కనే ఉన్న కలెక్టర్ హిమాంశు శుక్లాను ఆదేశించారు. హనీ వైద్యానికి రూ.కోటి మంజూరు చేశారు. మా చిన్నారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు రూ.74 వేలు ఉంది. 2022 అక్టోబర్ 2న అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హనీకి తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. 2024 వరకూ వైద్యం అందడంతో పాప త్వరగానే కోలుకుంది. ఉచిత విద్యకు భరోసాలో భాగంగా సమనసలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హనీకి ఉచిత విద్య అందుతోంది. ఈ ప్రభుత్వంలో ఆరు నెలలుగా ఇంజెక్షన్లు నిలిపివేసి తిరిగి ఇప్పుడు అందిస్తున్నారు. నేడు మా హనీ జీవించి ఉందంటే అది జగన్ చలవే. జగన్ నిండు నూరేళ్లూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. మాలాంటి పేదలను ఇలానే ఆదుకోవాలి. – కొప్పాడి రాంబాబు (తండ్రి), నాగలక్ష్మి (తల్లి) -
మా పల్లె మారింది
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామంలో నిర్మించిన వెల్నెస్ సెంటరునిరంతరం ఏదో ఒక సంక్షేమం అందేది గత ప్రభుత్వం హయాంలో నిరంతరం ఏదో ఒక సంక్షేమం అందిస్తుండేవారు. మా కుటుంబంలో నా భార్యకు డ్వాక్రా రుణమాఫీ జరిగి అప్పు భారం తగ్గింది. మా అమ్మకు నెలనెలా పెన్షన్ అందేది. ఫీజు రీయింబర్స్మెంటుతో నా కుమారుడు డిగ్రీ పూర్తి చేశాడు. నాకు రైతు భరోసా పడేది. ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ప్రభుత్వమే ఉచిత బీమా ప్రీమియం చెల్లించడం వల్ల పంట నష్టపోతే పరిహారం అందేది. అటుంవంటి ఆపద్బాంధవుడు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకొని మళ్లీ అధికారం చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాను. – రెడ్డి పుల్లయ్య, నంగవరం, ఉప్పలగుప్తం మండలంఅడపాదడపా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైటింగ్ ఇంతకు మించి పెద్దగా అభివృద్ధి ఎరగని పల్లెలు ఎన్నో. ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామం కూడా ఇంచుమించు అటువంటిదే. కాని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామం రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి. రోడ్లతో పాటు సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ వచ్చాయి. రూ.76 లక్షలతో అవన్నీ ఒకేచోట నిర్మించారు. ఇప్పుడు సచివాలయంలో గడపగడపకూ నిధుల్లో భాగంగా రెండు విడతలుగా రూ.40 లక్షల విడుదల చేశారు. గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి దాదాపుగా 48 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నవ రత్నాలతో పాటు వివిధ పథకాల ద్వారా గ్రామంలో సుమారు రూ.16.63 కోట్లను సంక్షేమ పథకాల ద్వారా అందజేశారు. ఇది కాకుండా 48 మందికి ఇళ్ల స్థలాలు, 235 మందికి జగన్న విద్యా కానుక వంటివి అందించారు. -
ఉచిత ‘బీమా’కు దూరమయ్యాం
మాది కొత్తపేట మండలం వాడపాలెం. కొత్తపేటతో పాటు కపిలేశ్వరపురం మండలం కేదార్లంకలో నేను, నాకు కుటుంబ సభ్యులు పది ఎకరాల్లో అరటి రకాలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా వల్ల రూపాయి ఖర్చు లేకుండా సాగుకు బీమా భరోసా ఉండేది. ఇప్పుడు ఎకరాకు రూ.మూడు వేల ప్రీమియం కట్టమనడం వల్ల మాకు రూ.30 వేలు అవుతోందని కట్టలేదు. 2022–23 వరదలకు రూపాయి ప్రీమియం కట్టకపోయినా ఆరు ఎకరాల్లో పంట దెబ్బతింటే బీమా పరిహారం రూ.60 వేలు వచ్చింది. ఈ ఏడాది మోంథా తుపాను వల్ల పెద్దగా నష్టం లేకున్నా కొన్ని చెట్లు నేల కూలాయి. అసలు నష్టం ఇప్పుడు బయటపడుతోంది. గాలుల వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. జిల్లా యూనిట్ అనడం వల్ల బీమా ఉన్నా పెద్దగా పరిహారం వచ్చే అవకాశం లేదు. – పెదపూడి శ్రీనివాస్, వాడపాలెం, కొత్తపేట మండలం -
గూడు కల్పించిన మహానుభావుడు
ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో జీవించిన తమ కుటుంబానికి గూడు కల్పించిన మహానుభావుడు జగనన్న. ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రుణ సాయం చేయడం వల్ల ఇల్లు కట్టుకోగలిగాం. నా కుమార్తె కనక దుర్గా మహాలక్ష్మి, కుమారుడు గణేష్కు వివాహాలు చేశాం. కూలి పని చేసుకుంటూ అక్కడక్కడ అద్దె ఇంట్లో గడిపిన మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ఆ కల నెరవేర్చిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇప్పుడు మేము సొంత ఇంటిలో ఏ బాదరబందీ లేకుండా ఉంటున్నాం. ఆయన నిండు నూరేళ్లు జీవించాలి. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి. – యనమదల భవానీ, రాంబాబు, జగనన్న కాలనీ, ఆలమూరు మండలం. -
రీయింబర్స్మెంట్తో ఇంజినీరింగ్
మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న లారీ డ్రైవర్, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఇంజినీర్ కావాలనే ఆశయంతో చదువుకున్నాను. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చినా ప్రభుత్వ కళాశాలలో సీటు రాలేదు. కౌన్సెలింగ్ ద్వారా అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో సీటు వచ్చింది. ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్య అంటే మా కుటుంబం భయపడింది. ఎక్కువ ఫీజులు కట్టగలమా అని ఆందోళన చెందారు. కాని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బీటెక్ సాఫీగా పూర్తి చేశాను. జగన్ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఓ సారి సకాలంలో ఫీజు రీయింబర్స్ చేసింది. వాటిని మా అమ్మ ఖాతాలో వేయడం వల్ల ఆ డబ్బులు కాలేజీకి చెల్లించి బీటెక్ పూర్తి చేశాను. చదవలేననుకున్న బీటెక్ పూర్తి చేయడమే కాదు.. బెంగళూరు కేంద్రంగా అమెజాన్ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కూడా ఉద్యోగం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నాలా చాలా మంది పేద కుటుంబాల వారు ఇంజినీరింగ్, మెడిసిన్ పూర్తి చేశారు. దీనికి నా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడం కలసి వచ్చింది. జగన్ మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.– అలెగ్జాండర్, ఎ.వేమవరం, అమలాపురం మండలం -
నాడు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రోత్సాహం వల్ల సఖినేటిపల్లి మండల పరిధిలోని ఉయ్యూరువారి మెరకలో ఉన్న మా ఆంధ్రా ప్రియ పికిల్స్కు స్వర్ణయుగమనే చెప్పాలి. మేము 1995లో వినాయక డ్వాక్రా గ్రూపును ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోలేటి శ్రీదేవి, మందపాక సీతా మహలక్ష్మి ఆధ్వర్యంలో 30 మంది సభ్యులతో ఆంధ్ర ప్రియ పికిల్స్ సెంటర్ నెలకొల్పాము. అప్పట్లో బ్యాంకు రుణాలు ఒక్కొక్కరికీ రూ.20 వేలు చొప్పున మంజూరయ్యాయి. . బయట నుంచి కొంత పెట్టుబడులు తెచ్చి వ్యాపారం చేశాము. 2005లో శ్రీతులసి డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు చింతపట్ల నాగచిట్టి సింహాద్రమ్మ, ఎర్రా మాధవి ఆధ్వర్యంలో మరో 30 మంది సభ్యులు కలిశారు. మొత్తం 60 మంది సభ్యులు చేసే ఉత్పత్తులు సాలీనా 20 టన్నులకు చేరింది. రూ.12 లక్షల పెట్టుబడితో చేసిన వ్యాపారంలో ఏడాదికి రూ.15 లక్షల వరకు టర్నోవర్ ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలు, పట్టణాలకు కూడా పచ్చళ్లు పంపేవాళ్లం. గత ప్రభుత్వ హయాంలో 2022లో మా గ్రూపునకు రూ.3 లక్షలు రుణం మంజూరు చేశారు. దీని వల్ల వ్యాపారాన్ని విస్తరించాం. డీఆర్డీఏ అధికారులు మమ్మల్ని, మా వ్యాపారాన్ని ఎంతగానో ఆదరించి, మా పచ్చళ్లకు మార్కెటింగ్ కల్పించారు. అప్పటితో పోల్చుకుంటే వివిధ కారణాలతో మా వ్యాపారం మందగించింది. గత ప్రభుత్వంలో జగన్ చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. – ఆంధ్రా ప్రియ పికిల్స్ తయారీదారులు -
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారుగోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుంచనపల్లిలో..తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
రూ.1.26 కోట్ల ఎఫ్డీలు
అంతర్వేది దేవస్థానంలో నార సింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమి త్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.1,26,47,912 ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, అంతర్వేది దేవస్థానం మనోవాంఛా ఫలసిద్ధికి భక్తులు నారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం వల్ల మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కూడా సుదర్శన హోమం వల్ల సిద్ధిస్తుంది. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం జన్మ, జన్మల పుణ్యఫలం ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి విశేష పూజల్లో పాల్గొంటే జన్మ, జన్మల పుణ్యఫ లం సిద్ధిస్తుంది. అభిషేకం, సుదర్శన హోమం, ఆర్జిత సేవగా క ల్యాణం వంటివి జరుగుతున్నాయి. నిత్య అన్నదాన పథకంలో స్వామి ప్రసాదం తీసుకోవడం మహాద్భాగ్యం. – బాలాజీ, భక్తుడు, హైదరాబాదు -
ఈ–పంట ఏ మాయో!
● గంటా సూర్యప్రకాశరావు కౌలురైతు. కొత్తపేటకు చినగూళ్లపాలెం, పెదగూళ్లపాలెంలలో వరి ఆయకట్టు ప్రాంతాల్లో 1.9 ఎకరాలలో సాగు చేశారు. దానిలో 1.25 ఎకరాలు ఈ–పంట నమోదైంది. 45 కింటాళ్ల ధాన్యాన్ని ఆర్ఎస్కేల ద్వారా వ్యాపారులకు విక్రయించారు. అయితే కేవలం 40 సెంట్ల విస్తీర్ణానికి సంబంధిం 10 క్వింటాళ్లకు 2,369 చొప్పున రూ.23,690 మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. అంటే మిగిలిన 8.25 ఎకరాల విస్తీర్ణం ఈ–పంటలో నమోదు కాలేదు. మిగిలిన 35 క్వింటాళ్లకు ప్రైవేట్ వ్యాపారికి విక్రయించుకోవాల్సివచ్చింది. ఫలితంగా బస్తా ధర రూ.270 తగ్గిపోయింది. అలా 35 క్వింటాళ్లకు రూ.8,500 నష్టం వచ్చింది. ● పోతంశెట్టి సత్తిబాబు అనే కౌలురైతు కొత్తపేట చినగూళ్లపాలెం వరి ఆయకట్టులో 1.7 ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేయగా 42.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆ మొత్తం తూయగా 50 సెంట్ల విస్తీర్ణానికి సంబంధించి 17 క్వింటాళ్ల ధాన్యానికి రూ.2,369 చొప్పున రూ.40,273 మాత్రమే పడ్డాయి. మిగిలిన 1.20 ఎకరాలకు సంబంధించి పంట నమోదు కాకపోవడంతో 26 క్వింటాళ్లు ధాన్యం ప్రైవేట్ వ్యాపారికి విక్రయించాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ రైతుకు రూ.7 వేలు నష్టం వచ్చింది. ఎంతో మంది రైతుల వ్యధలకు ఈ ఇద్దరు కేవలం ప్రతినిధులు మాత్రమే. ఇలా ఎందరో పుడమి పుత్రులు ఈ ఖరీఫ్ సీజన్లో అధికారుల మాయాజాలంలో మోసపోయి.. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో నష్టపోయారు. కొత్తపేట: ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను కష్టాలు, నష్టాలపాలు చేస్తూనే ఉన్నాయి. రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వారికి మొండి చేయి చూపిస్తూనే ఉంది. రైతు పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని, దానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వం కొంత ధాన్యానికే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తోందని, మిగిలిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదని పలువురు రైతులు వాపోయారు. ఉదాహరణకు కొత్తపేటలో పలువురు రైతులు తమకు ధాన్యం డబ్బులు పూర్తిగా పడలేదని, ఇదేమిటి? తాము ఇన్ని బస్తాలు తూచామని, కానీ కొన్ని బస్తాలకే డబ్బులు పడ్డాయని సంబందిత వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆరా తీస్తే ఈ–పంట నమోదు కాలేదని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రతి సీజన్లో క్షేత్ర స్థాయికి వచ్చి పండించిన పంటను ఈ–పంటలో నమోదు చేసేవారన్నారు. పండించిన ధాన్యన్ని అంతటినీ కొనుగోలు చేసేవారని, బ్యాంకు ఖాతాకు మొత్తం ధాన్యానికి డబ్బులు జమయ్యేవని తెలిపారు. సీజన్లో ఆదివారం, సెలవుదినం అయినా ఆ సిబ్బంది రైతుల వద్దకు వచ్చి మరీ సేవలందిచేవారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తప్ప, ప్రభుత్వ పరంగా గాని, వ్యవసాయ శాఖ పరంగా గాని ఏ విధమైన ఇబ్బందులు పడలేదని అన్నారు. నేటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం పట్ల సవతి తల్లి ప్రేమతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నష్టాలు చవి చూడాల్సివస్తోందని వాపోయారు. ఈ–పంట నమోదులో మతలబు ప్రభుత్వం పరోక్షంగా అమలు చేస్తున్న విధానమా? లేక సిబ్బంది నిర్లక్ష్యమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ఇలా.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గురువారం వరకు జిల్లాలోని 22 మండలాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1,68,088 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇంత వరకు 1,60,396 ఎకరాల్లో కోతలు పూర్తి కాగా 3,44,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 205 ఆర్ఎస్కేల ద్వారా 2,82,309 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దాన్యం కొనుగోలులో మతలబులెన్నో ఽపండిన ధాన్యం అంతా కొనని ప్రభుత్వం నమోదైన మేరకే జమ అంటున్న సిబ్బంది సిబ్బంది నిర్లక్ష్యమో.. ప్రభుత్వ విధానమో.. అర్థం కాక అన్నదాత సతమతం వ్యవసాయ సిబ్బంది వివరణ సొంత రైతుల భూమి మొత్తం ఈ–పంటలో నమోదైంది. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యానికి డబ్బులు పడ్డాయి. జాయింట్ ఎల్పీఎం ఉన్న వాళ్లకు నమోదు కాలేదు. సొంత రైతుల ఆధార్ లింక్ కాక కొందరివి, కౌలు రైతులు ఆర్ఎస్కేకు ఆధార్ తీసుకురానివాళ్లవి ఈ– పంటలో నమోదు కాలేదు. పంట నమోదు అయిన మేరకే డబ్బులు పడ్డాయి. – జి.స్వప్న, వీఏఏ, కొత్తపేట -
సుదర్శనం.. సకల ఫలప్రదం
● అంతర్వేదిలో నిత్య హోమాలు ● 2010 నుంచి దేవస్థానంలో అమలు ● ఎఫ్డీల రూపంలో భక్తుల విరాళాలు సఖినేటిపల్లి: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి నారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఽఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభువుగా స్వామివారు వెలసినట్టు చరిత్ర చెపుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన మేరకు ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్య సుదర్శన హోమం స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధాలు, 16 భుజాలు కలిగిన సుదర్శన చక్రధారుడైన స్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛలు, ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కోసం ఈ హోమాలను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పదిహేను సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలో నిత్య సుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంత ఖర్చులతో ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు. కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ఆలోచించి, నిత్య నారసింహ సుదర్శన హోమం నిర్వహణకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించిన అనంతరం 2010 సంవత్సరంలో హోమాలను ప్రారంభించి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. రుసుములు ఇలా ఒక రోజుకు రూ.400 నెలకు రూ.4,000 మూడు నెలలకు రూ.10,000 ఆరు నెలలకు రూ.20,000 సంవత్సరానికి రూ.40,000 శాశ్వతం (పదేళ్లకు) రూ.1,00,000 -
గుర్రపు డెక్క తొలగిస్తూ కార్మికుడి గల్లంతు
● గాలిస్తున్న గజ ఈతగాళ్లు ● నిర్వాహకుని నిర్లక్ష్యమే కారణం! ● మెషీన్తో తీస్తే సమస్యలకు చెక్ సామర్లకోట: స్థానిక గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులలో పాల్గొన్న కార్మికుడు శుక్రవారం గల్లంతయ్యాడు. స్థానిక యానాదుల కాలనీకి చెందిన సుమారు 10 మంది కార్మికులు నాలుగు రోజులుగా మండలంలోని హుస్సేన్పురం నుంచి గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మాండవ్యనారాయణస్వామి ఆలయం వద్ద కాలిబాట వంతెన పంచారామ క్షేత్ర ముఖ ద్వారం వద్ద ఉన్న ఇనుప వంతెనల మధ్య గుర్రపు డెక్క తొలగిస్తూ బయటకు వస్తున్నారు. ఈ సమయంలో సామర్లకోటకు చెందిన చేవూరి లోవరాజు (40) గల్లంతు అయ్యాడు. విషయం తెలిసిన వెంటనే సహ కార్మికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గుర్రపు డెక్క తొలగిస్తూ నోటిలో కొడవలి పట్టుకుని లోవరాజు గట్టు ఒడ్డుకు వస్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న గుర్రపు డెక్క గుట్టను గమనించక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలియజేశారు. గుర్రపు డెక్క కాలికి తగులు కోవడం వల్ల మునిగి గల్లంతై ఉండవచ్చునని ఘటనా స్థలం వద్ద ఉన్న కౌన్సిలర్, మత్స్యకారుడు మర్రి శేషారావు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెషీన్తో తీస్తే ప్రమాదాలకు చెక్ : గోదావరి కాలువలో నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలో కూలీలతో గుర్రపు డెక్క తొలగించడం ఎంత వరకు సమంజసమనే కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఈ పనులు నీటి సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. గత సార్వా సీజన్లో ఈ కాలువలో గుర్రపు డెక్క తొలగించిన మూడు నెలలకే తిరిగి పెరిగిపోయింది. అసలు గుర్రపుడెక్క పెరగకుండా ఉండడానికి అధికారులు గాని, నీటి సంఘ ప్రతినిధులు ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీబీతో గుర్రపు డెక్క తొలగింపు చేపడితే కార్మికులకు ప్రమాదం ఉండదని స్థానికులు అంటున్నారు. సామర్లకోటకు చెందిన కూలీలు గత 20 ఏళ్లుగా గుర్రపు డెక్క తీస్తున్నారు. ఈ పనులలో లోవరాజుకు 20 ఏళ్ల నుంచి అనుభవం ఉందని తోటి కార్మికులు చెప్తున్నారు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో ఒకరికి వివాహం కావలసి ఉన్నదని లోవరాజు సమీప బంధువు మాజీ కౌన్సిలర్ ధనరాజు తెలిపారు. గుర్రపు డెక్క తొలగింపునకు మెషీన్తో అవకాశం లేకనే కూలీలతో తీయిస్తున్నట్టు నీటి పంపిణీదారుల సంఘ చైర్మన్ కొప్పిరెడ్డి వీరాస్వామి తెలిపారు. ఐదు తూముల వద్ద, వ్యవసాయ క్షేత్రం వద్ద మెషీన్ పెడతామన్నారు. చేతులు కాలాక..చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నీటి సంఘ ప్రతినిధుల పనితీరు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గుర్రపు డెక్క తీతలో ఓ కార్మికుడు గల్లంతయ్యాక మెషీన్తో తొలగింపు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. గల్లంతైన లోవరాజు కోసం గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం లేక పోవడంతో గుర్రపు డెక్కలో చిక్కుకుని ఉండవచ్చునని జేసీబీతో గాలిస్తున్నట్లు గుర్రపు డెక్క తొలగింపు కాంట్రాక్టరు తెలిపారు. -
అతి వేగానికి ముగ్గురు బలి
● ఎదురెదురుగా బైక్లు ఢీకొని ఇద్దరు.. ● మంచు వల్ల రోడ్డు కనపడక ఒకరు మృతి ● మరో ఇద్దరికి తీవ్రగాయాలు తాళ్లరేవు/పి.గన్నవరం: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. 216 జాతీయ రహదారిపై కోరంగి వంతెన సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పి.గన్నవరం మండలం కొత్త అక్విడెక్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేటకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన కొండ్రు వినయ్కుమార్ ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు నుంచి యానాం వైపు వెళ్తున్నాడు. ధవళేశ్వరం వేమగిరికి చెందిన కుందు సతీష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒకే స్కూటీపై యానాం వైపు నుంచి కాకినాడ వెళ్తున్న క్రమంలో ఆ రెండు వాహనాలూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వినయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కుందు సతీష్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ధవళేశ్వరం సున్నంబట్టీ వీధికి చెందిన కొమర లక్ష్మీ నీలేకర్, కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన సూరాడ అనిల్కుమార్లకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీలో ఉంచారు. అలాగే పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు కొత్తపేటకు చెందిన ఆరి సుమంత్ కుమార్ (25) గ్యాస్ కంపెనీ ఏజన్సీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు మోటారు సైకిల్పై తాటిపాకలోని సోదరి ఇంటి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై శుక్రవారం ఉదయం గ్యాస్ కంపెనీలో విధులకు వెళ్లాల్సిన నేపథ్యంలో తెల్లవారు జామున అక్కడి నుంచి కొత్తపేటకు మోటారు సైకిలుపై బయలుదేరాడు. కొత్త అక్విడెక్టు వద్దకు వచ్చేసరికి అతడి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంచు వల్ల రహదారి కనపడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సుమంత్ మృతదేహానికి కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి
● అనారోగ్యం పాలైన మహిళ ● కలెక్టర్ ఆదేశాలతో ● స్పందించిన కేసీఎం అధికారులు అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడిన పి.జ్యోతి అనే మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జ్యోతి భర్త పి.దుర్గాప్రసాద్ వృత్తి రీత్యా వంట పని చేస్తూ జీవిస్తుంటాడు. కుటుంబ పరిస్థితులు బాగులేక తన భార్యను గల్ఫ్ దేశానికి పంపించాలని నిర్ణయించి కాకినాడకు చెందిన పి.శేషగిరిరావు అనే ఏజెంట్ ద్వారా మే నెలలో మస్కట్కు పంపించారు. అక్కడ 8 నెలలు పని చేసిన తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో రెండు నెలలుగా పని చేయలేక ఇబ్బంది పడింది. ఈ మేరకు జ్యోతిని ఇండియాకు తీసుకురావాలని ఆమె భర్త మైగ్రేషన్ సెంటర్ను ఆశ్రయించాడు. ఈ మేరకు కలెక్టర్ అత్యవసర చర్యలు తీసుకుని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని సురక్షితంగా ఇండియాకు చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థ జ్యోతిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు ఆ కేంద్రం నోడల్ అధికారి మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ శుక్రవారం తెలిపారు. -
మహానేతకు అపూర్వ గౌరవం
● డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం నిర్మించి మాట నిలబెట్టుకున్న మల్లాడి ● రేపు ప్రారంభోత్సవం ● తరలిరానున్న నాయకులు, అభిమానులు యానాం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరం నేడు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పట్టణ పరిధిలో యర్రాగార్డెన్స్లో మల్లాడి నివాసం ఎదుటే రూ.లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి రెండస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 21 నాటికి 36 ఏళ్లు అవుతోందని, దానిని పురస్కరించుకుని మహానేత రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరున నిర్మించిన ఈ మందిరాన్ని, గో నిలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మందిరంలో మహిళలు, పురుషులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేలా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహానేతతో తనకున్న అనుబంధంపై రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ దూరమై 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన స్మృతులు యానాం నిండా ఉన్నాయన్నారు. యానాంకు సాగు, తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం, సాగునీటిని 19 నుంచి 30 క్యూసెక్కులకు పెంచడం, మంచినీటి నిల్వ కోసం ఏపీ రైతుల నుంచి సేకరించిన 52.5 ఎకరాల భూమిని యానాంకు కేటాయిండం, ధవళేశ్వరం వద్ద పంప్హౌస్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు, అక్కడి నుంచి యానాం వరకు 80 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. యానం–ద్రాక్షారామ రోడ్డును బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వరకు యానాం ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎస్సార్ నిధులను సైతం ఆంధ్రాకు 70 శాతం, యానాంకు 30 శాతం కేటాయించారన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ ఫ్రెంచి లింకింగ్ చానల్, వైఎస్సార్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వైఎస్సార్ కాలనీ వంటివి ఉన్నాయన్నారు. పుదుచ్చేరి క్యాబినెట్లో తనకు మంత్రి పదవి ఇచ్చేలా అఽధిష్టానాన్ని ఒప్పించడంతో అప్పటిలో తొలిసారిగా తాను మంత్రిగా ప్రమాణం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. -
పుష్కరాలకు సమగ్ర ప్రణాళికలు
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పుష్కరాల కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జిల్లాలో పుష్కరాలకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 182 పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.1,20,061 విలువైన అంచనాలను దేవదాయ శాఖకు సమర్పించామని వివరించారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 182 పుష్కర ఘాట్లలో ముఖ్యమైనవి వాడపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, కోటిపల్లి, సోంపల్లి, అంతర్వేది, ముక్తేశ్వరం ఉన్నాయన్నారు. పుష్కరాల ప్రత్యేకాధికారి వీర పాండియన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. యూరియా, ఎరువుల పంపిణీకి చర్యలు జిల్లాలో రబీ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రబీలో అన్ని పంటలకు అవసరమైన 29,241 మెట్రిక్ టన్నుల యూరియా, ఎరువులు పంపిణికి ప్రణాళిక సిద్ధపరచడం జరిగిందన్నారు. శుక్రవారం నాటికి 3794 టన్నుల యూరియా, 2,300 టన్నుల డీఏపీ, 1210 టన్నుల పొటాష్, 7823 టన్నుల కాంప్లెక్స్, 927 టన్నుల ఎస్ఎస్పీ ఎరువులను పీఏసీఎస్లు, ఆర్ఎస్కేలు తదితర కేంద్రాల్లో నిల్వ ఉంచినట్టు తెలిపారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలి కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,48,942 మంది పిల్లలు, 3,624 హైరిస్క్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాలో 22 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 47 పీహెచ్సీలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 9 సీహెచ్సీలు, రెండు ప్రాంతీయ ఆస్పత్రులలో సుమారు 1,850 బృందాల ద్వారా 978 బూత్లు, 53 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. శనివారం టాంటాం వేయించి, బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బీవీవీ సత్యనా రాయణ పాల్గొన్నారు. -
సత్యదేవుని భక్తులపై ‘ధరా’భారం!
అన్నవరం: సత్యదేవుని భక్తులపై ధరాభారం పడనుంది. అన్నవరం దేవస్థానంలో వివిధ సేవల టికెట్లు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. పెంపుదల ప్రతిపాదనలను పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని గ్రామస్తులను, భక్తులను కోరారు. ఇవీ ప్రతిపాదనలు ● యంత్రాలయంలో అంతరాలయ దర్శనం టి కెట్టు ఒక్కొక్కరికి ప్రస్తుతం రూ.50 ఉంది. దీనిని రూ.100కు పెంచాలని ప్రతిపాదించారు. ● ప్రతి రోజూ సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకూ ఆలయంలో నిర్వహిస్తున్న పంచహారతుల సేవ టికెట్టు ప్రస్తుతం దంపతులకు రూ.500గా ఉంది. దీనిని ఒక్కరికి రూ.500, దంపతులకు రెండు టిక్కెట్లు రూ.1,000కి పెంచాలని యోచిస్తున్నారు. ఈ టికెట్టుపై భక్తులకు ఇస్తున్న 125 గ్రాముల ప్రసాదాన్ని ఒక్కో టికెట్టుకు 150 గ్రాములకు పెంచనున్నారు. ● ప్రతి నెలా స్వామివారి జన్మనక్షత్రం మఖనాడు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్టు దంపతులకు రూ.3 వేలుగా ఉంది. దీనిని రూ.5 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. ● పదేళ్లు దాటిన పిల్లలకు కూడా ఇకపై టికెట్టు తీయాలని నిర్ణయించారు. ● ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు, సలహాలను 94907 12066, 94912 13887, 99084 11777 నంబర్లకు వాట్సాప్ ద్వారా జనవరి 20లోగా పంపించాలి. అలాగే, endow-eoannavaram@gov.in ద్వారా ఈ–మెయిల్ కూడా చేయవచ్చని ఈఓ తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో నియామకాలు సాక్షి, అమలాపురం: పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలువురిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలలో నియమించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అనుబంధ విభాగాలలో (పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం) రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మల్లం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా తోరం భాస్కరరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా పితాని నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా కనుమూరి సత్యనారాయణరాజులను నియమించారు. మహలక్ష్మి ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం పి.గన్నవరం: ఎల్.గన్నవరంలో కొలువైన గ్రామ దేవత మహలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన అంబటి వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.2,02,114 విరాళంగా అందించారు. అలాగే యర్రంశెట్టి వినయ్ వెంకటేష్ రూ.10,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంబటి సత్యనారాయణ, దుర్గారావు, రాముడు, డొక్కా మూర్తి, దూళిపూడి శ్రీనివాసరావు, అన్నాబత్తుల అనుబాబు, అడబాల రంగరావు, గనిశెట్టి ఈశ్వర్, యర్రంశెట్టి రామకృష్ణ, చిట్టాల జోగేశ్వరరావు, పాటి చిట్టిబాబు, చిట్టాల ఆర్యశ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కార్పెంటర్ల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: కార్పెంటర్ల (వడ్రంగి మేసీ్త్రలు) సంక్షేమంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జిల్లా కార్పెంటర్లు, చేతి వృత్తుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాతుతూ గృహ నిర్మాణాలకు సంబంధించి రెడీమేడ్ వస్తువులు మార్కెట్లోకి వచ్చి కార్పెంటర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆంక్షలను తుంగలో తొక్కి రెడీమేడ్ గుమ్మాలు, తలుపులు, కిటికీల విక్రయాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కార్పెంటర్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించి అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు గున్నేపల్లి భీమశంకరం, కొనుకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రఘురామను పదవి నుంచి తొలగించాలి వైఎస్సార్సీపీ జిల్లా ఽఅధికార ప్రతినిధి రామకృష్ణ ముమ్మిడివరం: బ్యాంకులను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజును తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకుండా ఎగవేసిన రఘురామ కృష్ణంరాజుపై మరిన్ని కేసులు నమోదు చేయాలని కోరారు. ఆయన సంస్థలుగా ఉన్న ఇండ్ భారత్ పవర్.. ఇండ్ భారత్ ఇన్ఫ్రాతో పాటు మరిన్ని అనుబంధ కంపెనీల పేరుతో రూ.947 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన చేశారన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బ్యాంకులను మోసం చేయడమే కాకుండా ప్రజలను సైతం మోసం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ‘తూర్పు’ పోలీసు విభాగానికి ఏబీసీడీ అవార్డు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సాధించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఈ అవార్డు అందుకున్నారు. -
టెండరింగ్లో రీచ్లు!
సాక్షి, అమలాపురం/రావులపాలెం: అదే సన్నివేశం. అదే ఫలితం. ఇసుక రీచ్లకు టెండర్లు పిలవడం.. ఆ సిండికేటే ముందుగా నిర్ణయించుకున్న ధరలకు టెండర్లు వేయడం.. వారికే టెండర్లు దక్కడం.. అంతా సేమ్ టూ సేమ్. గత ఏడాది జరిగినట్టే ఇప్పుడూ జరిగింది. జిల్లాలో నాలుగు రీచ్లకు నిర్వహించిన టెండర్లు ఆ మూడు కంపెనీలకే దక్కాయి. గోదావరి వరద ఉరవడి తగ్గడంతో జిల్లా ఇసుక కమిటీ నాలుగు ర్యాంపులకు టెండర్లు పిలిచింది. దీనిలో కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరం (2.02 లక్షల టన్నులు), ఆలమూరు మండలం జొన్నాడ (3.15 లక్షల టన్నులు), ఆలమూరు (2.7 లక్షల టన్నులు), ఆత్రేయపురం మండలం మెర్లపాలెం (0.72 లక్షల టన్నులు)లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ఈ రీచ్లకు టెండర్లు పిలిచారు. మొత్తం నాలుగు రీచ్లలో 8,57,200 లక్షల టన్నుల ఇసుక తవ్వకాల కోసం ఈ టెండర్లు పిలిచారు. ఈ నెల 12వ తేదీన మరో నాలుగు కొత్త ఇసుక ర్యాంపులను అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా ఇసుక కమిటీ దరఖాస్తులు ఆహ్వానించింది. స్క్రూట్నీ, టెక్నికల్ బిడ్ వంటి అంశాలను పరిశీలించిన అనంతరం 4 ర్యాంపులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను అధికారులు ప్రకటించారు. జిల్లాలలో ఇసుక తవ్వకాల కోసం ఏర్పడిన సిండికేటులోని కంపెనీలకే మరోసారి ఈ టెండర్లు దక్కడం గమనార్హం. జొన్నాడ రీచ్ను ఆర్ఎస్ఆర్ సంస్థ టన్ను ఇసుక తవ్వకానికి రూ.72, కపిలేశ్వరపురంలో జీఎస్ఆర్ సంస్థ రూ.67, మెర్లపాలెం, ఆమూరులు రీచ్లలో ఇసుక తవ్వకాలకు సుధాకర్ ఇన్ఫ్రా సంస్థ రూ.69 చొప్పున టెండర్లు వేసి దక్కించుకున్నారు. మొత్తం 23 మంది టెండర్లు వేయగా తక్కువకు కోట్ చేసిన వీరికి టెండర్లు ఖరారైనట్టు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో సెమీ మెకనైజ్డ్, మ్యానువల్ కలిపి మొత్తం 14 రీచ్ల వరకు ఉన్నాయి. వీటికి కేవలం 9 కంపెనీలు మాత్రమే టెండర్లు వేస్తుండడం విశేషం. అధికారిక ర్యాంపులన్నీ మండపేట, కొత్తపేట నియోజకవర్గాలలో ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీ కీలక నేతల ప్రమేయంతోనే రీచ్లలో ఇసుక తవ్వకాలు జరగడం, అమ్మకాలు వంటివి జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. వీరి ప్రమేయం ఉన్న సిండికేటు కంపెనీలు తప్ప బయట వ్యక్తులు టెండర్లు వేసే అవకాశం లేకుండా పోయింది. కాదని రీచ్లు దక్కించుకుంటే తవ్వకాలు చేయలేరంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో జిల్లాలో శాండ్ కమిటీ నిర్ణయించిన 20 స్టాక్ పాయింట్లు 16 ర్యాంపులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12 ర్యాంపులకు కుదించడంలో సిండికేట్ విజయం సాధించింది. అలాగే అమలాపురం మండలం కామనగరువు, రావులపాలెం మండలం గోపాలపురం, రావులపాడు, ఆలమూరు మండలం జొన్నాడ, కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో ఎగుమతులను నిలిపివేయడంలో వారు విజయం సాధించారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఎనిమిది ర్యాంపులు కాకుండా కొత్తగా జొన్నాడ, కపిలేశ్వరపురం, మెర్లపాలెం, ఆలమూరు ర్యాంపులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటిలో జొన్నాడ, మెర్లపాలెం గ్రామాల్లో వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ర్యాంపులు సాధించడంలో సిండికేట్ వ్యూహం ఫలించింది. అలాగే ర్యాంపుల నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్న గ్రామాల్లోని ర్యాంపులలో ఇసుక పరిమాణం లేదని చూపి, ఆ ర్యాంపులను మూసివేయించడంలో సిండికేట్ తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో కొత్తగా ఇచ్చిన 4 ర్యాంపులలో రెండు జొన్నాడ, మెర్లపాలెం, ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఊబలంక ఏ, ఊబలంక బి, ఊబలంక–2 (మ్యాన్యువల్,) రీచులను ఆనుకుని ఉన్న చోట తీసుకురావడంలో సిండికేట్ వ్యూహం ఫలించినట్టైంది. జిల్లాలో ఇప్పటికే 8 రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్న విషయం తెలిసిందే. ఆయా రీచ్లలో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణ కూడా ఉన్నాయి. ఇసుక సరిపడినంత దొరకడం లేదని, దీని వల్లే ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నందున కొత్త రీచ్లకు అనుమతులు ఇచ్చామని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కొత్త రీచ్ల నుంచి ఇసుక రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని కొత్త భాష్యం చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న రీచ్ల మీద కూడా సిండికేటు హవా నడుస్తున్న విషయం తెలియంది కాదు. కొత్త రీచ్ల మీద కూడా వారి పెత్తనమే కొనసాగుతోంది. అటువంటప్పుడు ధరలు ఎలా దిగివస్తాయనేది అధికారులు చెప్పాలి మరి. సిండికేట్కే నాలుగు ర్యాంపులు 8.57 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి మమ్మల్ని కాదని చేయలేరంటూ బయటి వ్యక్తులకు బెదిరింపులు గత ఏడాది తక్కువ ధరకు బిడ్డింగ్ వేసిన బయటి వ్యక్తులు సాంకేతిక కారణాలు చూపి టెండర్ల రద్దు -
మేధో మధనానికి పదును
● 22న జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు ● 176 ప్రాజెక్టుల ప్రదర్శనకు సిద్ధం ● జిల్లా స్థాయి ప్రదర్శనకు వేదికగా ● అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల రాయవరం: పాఠ్య పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానంతో ఆలోచనలకు పదును పెడితే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఇన్స్పైర్ మనక్, బాలల సైన్స్ కాంగ్రెస్, జాతీయ సైన్స్ దినోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఈ నెల 22న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు చురుగ్గా ఏర్పాట్లు చేపడుతున్నారు. అంతకు ముందుగా ఈ నెల 18వ తేదీలోపు మండల స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ప్రదర్శన అమలాపురం బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. మూడు కేటగిరీల్లో పోటీలు ఈ పోటీలను ప్రధానంగా మూడు కేటగిరీల్లో ఏడు విభాగాల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులు వ్యక్తిగతంగా, గ్రూపుగా పోటీ పడవచ్చు. ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కూడా పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఉపాధ్యాయ విభాగంలో పోటీ పడేవారు ఏడు విభాగాల్లో ఏదో ఒక దానిని ఎంచుకుని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. వ్యక్తిగత విభాగంలో పోటీ పడే విద్యార్థులు ఏడు అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని గైడ్ టీచర్తో కలిసి పోటీ పడవచ్చు. ఎవరెవరు పాల్గొనవచ్చు.. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థి వ్యక్తిగత, గ్రూపు, టీచర్ విభాగం నుంచి ఒక్కొక్క ప్రాజెక్టును మాత్రమే మండల స్థాయిలో ప్రదర్శించాలి. అక్కడ సాధారణ పాఠశాలలతో పాటుగా, అటల్ ల్యాబ్ ఉన్న పాఠశాలలు కూడా ప్రత్యేకంగా పాల్గొనవచ్చు. అటల్ ల్యాబ్లో తయారు చేసిన ప్రాజెక్టులు మాత్రమే ప్రదర్శించాలి. అలాగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్టులు నేరుగా జిల్లా స్థాయికి నామినేట్ అవుతాయి. జిల్లా స్థాయిలో వ్యక్తిగత విభాగం, గ్రూపు, టీచర్స్ విభాగాల నుంచి ఒక్కో విభాగం నుంచి రెండు ప్రాజెక్టుల వంతున మొత్తం ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 23న విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తిగత విభాగాల నుంచి 15 ప్రాజెక్టులను, గ్రూపు విభాగాల నుంచి పది, ఉపాధ్యాయ విభాగం నుంచి పది ప్రాజెక్టులు మొత్తంగా 35 ప్రాజెక్టులను రీజనల్ స్థాయికి పంపిస్తారు. రీజినల్ స్థాయిలో తొమ్మిది రాష్ట్రాల నుంచి పోటీ పడతారు. ఈసారి రీజినల్ స్థాయి పోటీలను 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. రీజినల్ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు పోటీ పడతాయి. 22న జిల్లా స్థాయిలో.. ఈ నెల 22న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల వేదిక కానుంది. జిల్లా సైన్స్ విభాగం ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల, మండల, జిల్లా స్థాయి ప్రదర్శనలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలంటూ ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ పి.నాగేశ్వరరావు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో మండల నుంచి ఐదు ప్రాజెక్టుల వంతున జిల్లాకు 176 ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. టీచర్స్ నుంచి ఒకటి, వ్యక్తిగత కేటగిరీ నుంచి రెండు, సామూహిక కేటగిరీ నుంచి రెండు వంతున ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. ఏడు విభాగాలివీ.. ససై ్టనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్, గ్రీన్ ఎన ర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, రీ క్రియేషన్ మేథమెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజిన్, వాటర్ కన్జర్వేటింగ్ అండ్ మేనేజ్మెంట్.జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలి జిల్లా స్థాయి ప్రదర్శనకు నాణ్యమైన ప్రాజెక్టులు రూపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో మన జిల్లా ప్రతిభ కనబరచేలా ప్రాజెక్టులు రూపొందించాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం. మేధో సంపత్తికి పదును పెట్టేందుకు విద్యార్థుల్లోని మేధా సంపత్తికి పదును పెట్టేందుకు, ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తుంది. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – పి.నాగేశ్వరరావు, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. -
22న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
డీఈవో నాగేశ్వరరావు అమలాపురం టౌన్: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 22వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విజయవంతం చేయాల డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ సన్నాహక సమావేశంలో సమగ్ర శిక్ష జిల్లా ఏసీసీ జి.మమ్మీతో పాటు డీఈఓ పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశంలో ప్రదర్శనలో ఏర్పాటు చేసే 176 ప్రయోగాలపై చర్చించింది. సైన్స్ ఉపాధ్యాయుల నుంచి ఒకటి, విద్యార్థుల వ్యక్తిగత కేటగిరీ నుంచి రెండు, సామూహిక కేటగిరీ నుంచి రెండు వంతున ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని డీఈవో వివరించారు. రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి, సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లోగోను విద్యా శాఖాధికారులు ప్రదర్శించారు. -
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతం, వనపర్వంలోని పలు అంశాలను వివరించారు. పరమాత్మ తప్ప రక్షకులు లేరని నాటి సభలో నిరూపణ అయిందని ఆమె అంటుంది. కృష్ణ పరమాత్మ ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో తాను ద్వారకలో లేనని, ఉంటే ఇలా జరిగేది కాదని అంటాడు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ఇచ్చి, ఆమెను కాపాడిన కృష్ణుడు తాను ద్వారకలో లేకపోవడం వలన ఈ అనర్థం జరిగిందని చెప్పడంలో అంతరార్థం మనం తెలుసుకోవాలని అన్నారు. నీలకంఠీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి, ద్వారక అంటే నవద్వారాలు కల శరీరమని ఆయన వివరించారు. ద్రౌపదిని దుశ్శాసనాదులు అవమానిస్తుంటే, పాండవుల స్మరణలో కృష్ణుడు లేడు, వారు విధి బలీయమైందని అనుకున్నారే కానీ, కృష్ణ స్మరణ చేయలేదు. బుద్ధి ప్రపంచం వైపు తిరిగితే పరమాత్మ కనిపించడు, ఆయన వైపు తిరిగితే కనిపిస్తాడని సామవేదం అన్నారు. పాండవులు వనాలకు తరలిపోయాక, ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుని పిలిచి, తనకు హితం ఏది కలిగిస్తుందో చెప్పమంటాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి వేయాలి, దుశ్శాసనుడు తాను చేసిన అకృత్యానికి నిండు సభలో పాండవులను క్షమించమని అడగాలి. నీవు దుర్యోధనుని వదిలివేస్తే, అందరూ క్షేమంగా ఉంటారని విదురుడు చెబుతాడు. దానికి తీవ్ర కోపంతో ధృతరాష్ట్రుడు విదురుని నిందించి, నీవు ఉంటే ఉండు, పోతే పొమ్మని అంటాడు. విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెడతాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో సంజయుని పంపి, విదురుని చేర తీసుకుంటాడని సామవేదం అన్నారు. దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు తెలుసుకున్న వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేయమని, లేని పక్షంలో దుర్యోధనుని అడవులకు పంపి పాండవులతో చెలిమి చేయమని అంటాడు. సత్పురుషులతో వైరం ప్రమాదకరం, స్వజనులతో వైరం అంతకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. హితం ఉపదేశించడానికి వచ్చిన మైత్రే య మహర్షి మాటలను లక్ష్యపెట్టక, వినయరాహిత్యంతో దుర్యోధనుడు తన కాలిని ముందుకు చాచి తొడ మీద కొట్టుకుంటాడు. పాండవులతో శాంతియుతంగా జీవించకపోతే, ధర్మయుద్ధంలో భీముడు నీ తొడను పగలగొడతాడని మైత్రేయ మహర్షి దుర్యోధనుని శపిస్తాడని సామవేదం వివరించారు. వంచన చేసి సుఖపడాలనుకున్నవాడు వధ్యుడేనని సామవేదం అన్నారు. -
2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ
అమలాపురం రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 56,827 మంది రైతుల నుంచి రూ.665 కోట్ల విలువైన 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటికే 2,80,683 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటే జిల్లా కార్యాలయంలో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ నంబర్ 83094 32487, సెల్ నంబర్ 94416 92275ను సంప్రదించాలన్నారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలను బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ద్వారా క్రమబద్ధీకరించుకునే దిశగా ఆ భవన యజమానులకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, జిల్లా పౌరసరఫరాల విభాగం మేనేజర్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి అవగాహన అవసరం ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ– ఆఫీస్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో ఉద్యోగులతో ఆమె సమావేశమయ్యారు. జనవరి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ఈ– ఫైల్ ద్వారా నిర్వహించాలన్నారు. వెబ్సైట్లో ప్రభుత్వ లోగో, కాపీరైట్ పాలసీ, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండీషన్లు తప్పనిసరిగా చూడాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీస్ వెబ్సైట్ నిర్వహణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉండాన్నారు. డీఆర్వో కె.మాధవి, సుబ్బరాజు, వంశీ, నాగలక్ష్మమ్మ భరత్ పాల్గొన్నారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
రాయవరం: పిల్లల ఆరోగ్యం విషయంలో ముందుచూపు అవసరం. రెండు చుక్కలు చిన్నారుల జీవితాన్ని పోలియో బారిన పడకుండా చేస్తాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పిల్లలు పుట్టగానే వారికి పోలియో వ్యాధి నివారణ వ్యాక్సిన్ ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జిల్లాలో 1,48,942 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నెల 21న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 27 ట్రాన్సిట్ పాయింట్లు, 53 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 549 హైరిస్క్ ఏరియాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 3,624 మంది ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఉన్న 47 పీహెచ్సీలు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 978 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. పోలియో చుక్కల కార్యక్రమంలో 3,912 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 503 మంది ఏఎన్ఎంలు, 428 మంది ఎంఎల్హెచ్పీలు, 1,384 మంది ఆయాలు, 1,597 మంది అంగన్వాడీ సిబ్బంది, 193 మంది సూపర్వైజర్లు పల్స్ పోలియో విధుల్లో పాల్గొననున్నారు. ఫ 21న చిన్నారులకు పల్స్పోలియో ఫ జిల్లాలో 1.48 లక్షల మందికి లక్ష్యం -
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. అవధానం చేపట్టిన తొలి అడుగుల్లోనే తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్కృతం అనగానే క్లిష్టమైనదని భావించి నేర్చుకోవడానికి కూడా భయపడే నేటి రోజుల్లో, ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో స్థిరపడిన 13 ఏళ్ల బాలిక అవలీలగా సంస్కృతాన్ని ఉచ్చరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన అష్టావధానాన్ని చేస్తూ ఘనాపాఠీలను సైతం ఔరా అనిపిస్తోంది. అంతటితో ఆగకుండా సంస్కృతంతోపాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలను అవలీలగా మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ చిన్నారి చెప్పే మాటలు వినడానికి వేద పండితులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం. ఇంజరంలో పుట్టి.. బెంగళూరులో పెరిగి.. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన నరసింహదేవర మైథిలీనాథ్ వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ హెచ్ఏఎల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కిరణ్మయి గృహిణి. వీరి గారాల పట్టి నరసింహదేవర జయలక్ష్మికి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. కుటుంబ నేపథ్యం, బాల్య దశ నుంచే సంస్కృతం సాహిత్యాభిలాషతో, శాసీ్త్రయ శిక్షణతో అవధానంలో అడుగుపెట్టింది. తాత సుబ్బారావు సూచనతో బెంగళూరు పూర్ణ ప్రమతి గురుకుల పాఠశాలలో జయలక్ష్మిని చేర్చించి సంస్కృతం నేర్పించారు. కాశీలో తొలిసారిగా.. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ మహానగరంలో జయలక్ష్మి ఈ ఏడాది అక్టోబర్ 26న సంస్కృతంలో తొలి అష్టావధానం చేసింది. అలాగే మధునాపంతుల సత్యనారాయణమూర్తి సూచనలతో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రెండో అష్టావధానం చేసి అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులో రాణిస్తున్న జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఫ సంస్కృతంలో అష్టావధానం చేస్తున్న బాలిక ఫ జయలక్ష్మికి ప్రశంసల వెల్లువ సంప్రదాయాలను కాపాడాలనే.. మన సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో జయలక్ష్మికి దేవభాష సంస్కృతం నేర్పించాం. ఏదీ కష్టతరం కాదని, నేర్చుకుంటే అన్నీ సులభతరమేనని రుజువు చేస్తూ ప్రతిభ కనబరుస్తుంది. నేటి బాల, బాలికలలో స్ఫూర్తి నింపే విధంగా తమ కుమార్తెను తీర్చిదిద్దుతాం. – నరసింహదేవర మైథిలీనాఽథ్, జయలక్ష్మి తండ్రి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు.. జయలక్ష్మిలో ఉన్న విశేష ప్రతిభను గుర్తించి తమ పాఠశాలకు తీసుకువచ్చి సత్కరించాం. తమ విద్యార్థులకు సంస్కృత భాషపై అవగాహన కల్పించడంతో పాటు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐదు భాషల్లో అవలీలగా మాట్లాడుతున్న జయలక్ష్మిని చూసి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు. –టీవీఎస్ఎస్వీ ప్రసాదరావు, హెచ్ఎం, రీజెన్సీ హైస్కూల్ -
మా నోట మన్నేశారు!
గత్యంతరం లేక ఉద్యమం చేనేత, ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ రకాల బకాయిలు పేరుకుపోతుండటంతో చేనేత సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. కనీసం చేనేత కార్మికుడికి పని కల్పించలేని పరిస్థితులు వచ్చాయి. ఆప్కో బకాయిలు పాక్షికంగా కాకుండా పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల అధికారులకు వినతి పత్రాలు అందించాం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమానికి దిగాల్సి వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. – గుడిమెట్ల శివరామకృష్ణ, ఉమ్మడి జిల్లా చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యుడు, అంగర కపిలేశ్వరపురం: బ్రిటిష్ మహారాణికి అగ్గిపెట్టెలో చీరను నేసిచ్చిన ఘనత మన చేనేత రంగానిది. అలాంటి చేనేతలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నివిధాలా అందుకుంది.. నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో మొత్తం 3,560 మందికి లబ్ధి చేకూర్చింది. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఎన్నికల సమయంలో ఈ పథకానికి రూ.వెయ్యి అదనంగా వేసి ఇస్తామని ‘కూటమి’ ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా అమలుకు మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలో సుమారు 3,600 చేనేత మగ్గాలు ఉండగా, ఆప్కో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ బకాయిలు చెల్లించాలంటూ నేతన్నలు అనేక సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేక ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 23 చేనేత సంఘాలు ఉన్నాయి. ఆప్కో, ప్రభుత్వం నుంచి రూ.కోట్ల బకాయిలు పెరిగిపోవడంతో ఈ సంఘాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. 2018 జీఓ ప్రకారం చేనేత కార్మికులకు కొనుగోలు చేసే నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాలి. వస్త్రాల అమ్మకాలపై 30 శాతం డిస్కౌంట్ సహకార సంఘాలకు అందించాలి. ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులకు రోజువారీ పనులను చూపలేని పరిస్థితి నెలకొంది. సంఘాల పరిధిలో తయారు చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసినా దీర్ఘకాలికంగా బకాయిలు పేరుకుపోయాయి. సహకార సంఘాలు.. బకాయిలు రెండు నెలల కిందట వరకూ జిల్లాలోని పలు సంఘాల బకాయిలు ఇలా ఉన్నాయి. అంగర చేనేత సహకార సంఘానికి రూ.3.85 కోట్లు, నేలటూరు సహకార సంఘానికి రూ.1.34 కోట్లు, నల్లూరు సంఘానికి రూ.1.18 కోట్లు, మండపేట సంఘానికి రూ.1.87 కోట్లు, ఏడిద సంఘానికి రూ.47.74 లక్షలు, రాయవరం సంఘానికి రూ.65 లక్షలు, పసలపూడి సహకార సంఘానికి రూ.1.62 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం ఆయా సంఘాల్లో సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక ఉద్యమమే ఆయుధంగా.. చేనేత బకాయిలు రాకపోతే సంఘాల నిర్వహణ కష్టసాధ్యమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో చేనేత సహకార సంఘాల ప్రజాప్రతినిధులు ఐక్యంగా కార్యాచరణకు దిగారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రైవేట్ సహకార సంఘాల జేఏసీ నాయకులు అమలాపురంలో జేసీ నిషాంతికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ సంఘాల పరిస్థితిని ఆప్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రస్తుతమున్న సంఘాల పరిస్థితి నేపథ్యంలో ఆప్కో పూర్తి బకాయిలను సంఘాలకు చెల్లించాలని పాక్షిక చెల్లింపులతో ఒరిగేది ఏమీ ఉండదని నాయకులు అంటున్నారు. అరకొర చెల్లింపులతో సర్థిపెట్టితే ఇప్పటికే సంఘాలు చేసిన అప్పుల వడ్డీకి కూడా సరిపోవని చెబుతున్నారు. ఆప్కో, ప్రభుత్వం చేనేత సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించని పక్షంలో జిల్లాలోని 18 చేనేత కుల సంఘాలు, చేనేత ఉద్యమ సంఘాలు సంయుక్తంగా ఉద్యమ కార్యాచరణకు దిగుతామని నాయకులు ప్రకటించారు. ఈ నెల 15న రాజమహేంద్రవరంలోని ఉమా రామలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 40 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ హాజరై బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపు విడుదల చేయకపోతే రిలే దీక్షలతో ప్రారంభించి ఆమరణ దీక్షలకు కార్యాచరణ చేస్తామని ప్రకటించారు. ·˘ ^ól¯ól™èl çÜ…çœ*-ÌSMýS$ గుదిబండలా బకాయిలు ·˘ B´ùP, {糿¶æ$™èlÓ… ¯]l$…_ ^èl$MðSP-§ýl$Æý‡$ ·˘ AÐ]l$Ë$ M>° Ð]l$…{† çÜ$¿ê‹Ù àÒ$ ·˘ çܵ…¨…-^èl-MýS-´ù™ól సంక్రాంతి తర్వాత ఉద్యమం మంత్రి మాటిచ్చినా.. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరి వారంలో మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్మికులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆందోళన చేపట్టిన కాలం నాటికి రూ.3.85 కోట్ల వివిధ రకాల బకాయిలున్నాయి. వాటిని చెల్లించాలంటూ సెప్టెంబర్ 27న అంగర గ్రామంలో నిరసన ర్యాలీ చేశారు. తర్వాత సహకార సంఘం ఎదుట 14 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. చేనేత కార్మికుల ఆందోళన నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో స్వయంగా జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న సహకార సంఘం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ మూడో వారం నడుస్తున్నా బకాయిలు సహకార సంఘాలకు నిధులు జమ కాకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. -
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై ఆందోళనలు
అమలాపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ చట్టానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్చి పేదల హక్కులను కాలరాస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కూడా ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో గ్రామీణ పేదలతో పాటు రైతులు, కౌలు రైతులు, రైతాంగానికి మద్దుతు ఇచ్చే ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కీలక అంశాలను తొలగించి ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని వెంకటేశ్వరరావు అన్నారు. కళాశాలల బస్సుల తనిఖీ అమలాపురం రూరల్: రహదారి భద్రతా చర్యల్లో భాగంగా అమలాపురంలో రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థకు చెందిన 43 బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బస్సుల్లో సాంకేతిక లోపాలను గుర్తించి కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాలల, కళాశాలల నిర్వాహకులు సహకరించి, వారం రోజుల్లోగా లోపాలను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. 19న ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎంపికలు అమలాపురం రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 సంబంధించి సీ్త్ర, పురుషులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు 19న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా నది సమీపంలో మణిపాల్ హాస్పిటల్ వద్ద జరుగుతాయని జిల్లా క్రీడా ప్రాధికార అధికారి వైకుంఠ రుద్ర బుధవారం తెలిపారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, బీచ్ సెపక్ తక్రాలో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, లేదా పాస్పోర్ట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ నిర్ధారణ ధ్రువీకరణ, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకు రావాలన్నారు. ఇటీవల జాతీయ చాంపియన్ షిప్ ఫలితం, ర్యాంకింగ్ సర్టిఫికెట్, సంబంధిత అధికార సంస్థ ద్వారా పంపిన నోటిఫికేషన్ పత్రం జత చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికలు, ఇతర వివరాలకు 91211 06836 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. -
సమన్వయంతో నరసన్న కల్యాణోత్సవాలు
అధికారులకు జేసీ నిషాంతి ఆదేశం అమలాపురం రూరల్: అంతర్వేది శ్రీలక్ష్మీ నర సింహస్వామి వారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శాఖల సమన్వయంతో వైభవంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అధికారులను ఆదేశించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాల నిర్వహణపై రెండో దఫా సమీక్ష సమావేశం గురువారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించి ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ గత ఏడాది కన్నా 20 శాతం భక్తుల తాకిడి పెరగవచ్చని, ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల క్యూ లు, స్నాన ఘట్టాలు, లైటింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు, ఆరు బయట స్వామి వారి కల్యాణం తిలకించేందుకు ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. డీపీవో పారిశుధ్య ఏర్పాట్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ తాగునీటి సరఫరా ఏర్పాట్లు, పంచాయతీరాజ్ ఆర్అండ్బీ ఇంజినీర్లు రోడ్ల మరమ్మతుల చేయాలన్నారు. గజ ఈతగాళ్లతో నాలుగు బోట్ల ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆహార కల్తీ ,తూనికలు కొలతల్లో మోసాలు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్ఓ కే.మాధవి ఆర్డీవోలు పి శ్రీకర్, డీ అఖిల పాల్గొన్నారు. నాలుగు రీచ్లలో టెండర్లు ఖరారు అమలాపురం రూరల్: జిల్లాలో నాలుగు సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచులలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ సీల్డ్ టెండర్లు పిలువగా 20 మంది టెండర్లు దాఖలు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి వెల్లడించారు. గురువారం సీల్ టెండర్లు తెరచి నాలుగింటిని ఫైనలైజ్ చేసినట్టు తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడ, ఆత్రేయపురం మండలం మెర్లపాలెం, ఆలమూరు మండలం ఆలమూరు, కపిలేశ్వరపురం రీచ్లకు ఖరారు చేసినట్టు వివరించారు. ఈ – ఆఫీస్ నిర్వహణ కీలకం ప్రభుత్వ కార్యాలయాలలో ఈ – ఆఫీస్ నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని జేసీ నిషాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో సిబ్బందికి ఈ–ఆఫీస్ నిర్వహణ అంశాల పట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలో అమలు చేయాల్సిన ఈ–ఆఫీస్ నిర్వహణ అంశాలు వాటికి సంబంధించిన విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష అమలాపురం రూరల్: జిల్లాలో రానున్న జనవరి మాసంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే మాధవి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో జనవరి మాసంలో నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. వచ్చే నెలలో భోగి, సంక్రాంతి, కనుమ పండగలు, జనవరి 16వ తేదీన ప్రభల తీర్థం, డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి, జనవరి 31న అంతర్వేది శ్రీలకీ్ష్మ్నరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరగాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. గోదాదేవి కల్యాణం ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. జనవరి 31 మందపల్లి శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు నిర్వహణకు భక్తులకు పూర్తిస్థాయిలో వసతులను కల్పించాలన్నారు. కాలువలు సముద్రపు స్నాన ఘట్టాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. జనవరి 16న అంబాజీపేట మండలంలో నిర్వహించే ప్రభల తీర్థానికి రహదారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వార్షిక కల్యాణోత్సవం జనవరి 28న వైభవంగా నిర్వహించాలన్నారు. జనవరి 31 భీష్మ ఏకాదశి రథోత్సవం ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవోలు పి.శ్రీకర్ డి.అఖిల, దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ వివిధ దేవాలయాల కార్య నిర్వహక అధికారులు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
ఐ.పోలవరం: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్ను డీఈవో పి.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఐ.పోలవరం మండలం జి.వేమవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఈవో జిల్లా విద్యా వైజ్ఞానిక పోస్టర్ను జిల్లా సైన్స్ అధికారి జి.సుబ్రహ్మణ్యం, డీసీబీ సెక్రటరీ బి.హనుమంతరావు, మండల విద్యా శాఖ అధికారులు నల్లమిల్లి కొండారెడ్డి, వీధి సురేష్బాబు ఆవిష్కరించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా లో సోమవారం అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరగనుంది. మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 11 ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు సుమారు 100 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆయా విభాగాలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా వేగిరాజు వెంకట నారాయణ.పి.వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి వ్యవహరించగా, జి.వేమవరం సర్పంచ్ నల్లా సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు చోడిశెట్టి జ్యోతినాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, హెచ్ఎం సుభద్ర లక్ష్మీదేవి, మండల సైన్స్ ఆఫీసర్ వరద శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పీడీలు ఏరీ..!
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొరత ● ఉండాల్సింది ఏడుగురు ● ఉన్నది ఒక్కరు ● క్రీడల్లో వెనుకబడుతున్న విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ఇప్పటి వరకూ ఎటువంటి రూపురేఖలూ లేని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఘనంగా చెప్పారు. ఒలింపిక్స్ సంగతి అలా ఉంచితే.. అసలు క్రీడల అభివృద్ధిలో.. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇచ్చి తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) పాత్ర ఎంతో కీలకం. వీరు ఆయా కళాశాలల్లో క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. విద్యార్థి సలహా కమిటీల వంటి వాటిల్లో భాగస్వామిగా ఉంటూ అవసరమైన సూచనలు ఇస్తారు. వీరి విధుల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యం పీడీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. ఆరుచోట్ల ఇన్చార్జిలే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బొమ్మూరు, అనపర్తి, ద్రాక్షారామ, కాకినాడ, ఎటపాక, పిఠాపురం, కాకినాడ(మహిళ)ల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరో 18 ప్రైవేటు కళాశాలలున్నాయి. మొత్తం ఏడు ప్రభుత్వ కళాశాలలకు గాను కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రస్తుతం రెగ్యులర్ పీడీ ఉన్నారు. మిగిలిన అన్నిచోట్లా ఆయా కళాశాలల లెక్చరర్లనే ఇన్చార్జి పీడీలుగా నియమించి, ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. దీంతో, ఆయా లెక్చరర్లు అటు సబ్జెక్టుల బోధనకు.. ఇటు క్రీడా శిక్షణకు సమయం కేటాయించలేని దుస్థితి నెలకొంది. రెండు విధులూ నిర్వహించాల్సి వస్తూండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు. రెగ్యులర్ పీడీలు లేకపోవడంతో సరైన శిక్షణ లభించక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులు క్రీడా పోటీల్లో వెనుకంజ వేస్తున్న దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీడీలు ఉండటంతో అక్కడి విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో మెరుగైన శిక్షణ లభిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా పూర్తి స్థాయిలో పీడీలను నియమిస్తే వివిధ క్రీడల్లో మరింత మంది విద్యార్థులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తేడా స్పష్టం పీడీలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ రీజినల్ మీట్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత నైపుణ్యంతో మాత్రమే వివిధ పోటీల్లో విజయం సాధిస్తున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ తమకు తగిన మెళకువలు నేర్పాల్సిన పీడీలు లేకపోవడంతో వెనుకబడుతున్నామని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. ఈ మీట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 25 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే తమకు సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పీడీలను నియమించాలని కోరుతున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్కు వేదికగా నిలిచిన బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సైతం రెగ్యులర్ పీడీ లేరు. కెమిస్ట్రీ లెక్చరరే ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్కు ప్రొఫెషనల్ పీడీ అవసరం కావడంతో కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పీడీని ఇన్చార్జిగా రప్పించారు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు పూర్తి స్థాయిలో పీడీలను నియమించాలని పలు సంఘాల నాయకులు కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీపీఐ ధర్నా
అమలాపురం రూరల్: పీపీపీ పద్ధతిలో నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం జారీచేసిన జీఓ 590 రద్దు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో అమలాపురం మండలం కామనగరువులో మెడికల్ కళాశాల భవనాల వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాలకు మెడికల్ విద్యను దూరం చేసే విధంగా జీవో 590తో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పజెప్పడాన్ని సీపీఐ ఖండిస్తోందన్నారు. వైద్య విద్యను అభ్యసించాలనే పేద వారి కలలను దూరం చేసి వైద్యాన్ని అమ్ముకునే కార్పొరేట్ డాక్టర్లను తయారు చేయడం కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తోందన్నారు. 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చి, నిర్వహణ బాధ్యతలు వారికి ఇస్తే రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా విద్య, వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. గూగుల్ డేటా సెంటర్కి రూ.22,000 కోట్ల రాయితీలు, కంపెనీలకు 99 పైసలకు వేల ఎకరాలు ఇవ్వగలిగిన వారు కేవలం రూ.5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదని విమర్శించారు. దీన్ని కూటమి ప్రభుత్వం చేతకానితనం అనాలా లేక కార్పొరేట్ వారికి దాసోహం అనాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతుందని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ ఇది ప్రజా ఉద్యమం, ప్రజా గొంతుగా సీపీఐ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాము, వెంకటేష్, రామకృష్ణ, తాతాజీ, రవికుమార్, సమితి సభ్యులు చిట్టూరి ప్రసాద్, చిట్టూరి సత్యనారాయణ, గుత్తి నాగేశ్వరరావు, ఆనంద్, ప్రేమానందం, తాడి సత్యనారాయణ, భీమరాజు, నాగబాబు, వెంకట్ పాల్గొన్నారు. -
దిక్సూచిలా కోనసీమ వలసదారుల కేంద్రం
అమలాపురం టౌన్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోనసీమ వలసదారుల కేంద్రం ఓ దిక్సూచిలా నిలిచి విదేశాల్లో చట్ట బద్ధమైన సురక్షిత ఉపాధిని కల్పించేందుకు పూర్తిగా దోహదపడుతోందని ఆర్టీవో, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) నోడల్ అధికారి కొత్త మాధవి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఆర్డీవో గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లభించక మెరుగైన ఉపాధి కోసం వివిధ కారణాలతో తమ స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి హక్కులను రక్షించడం కేసీఎం లక్ష్యమని పేర్కొన్నారు. కేసీఎం మేనేజర్ గోళ్ల రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
వాసురాజూ.. ఆరోగ్యం ఎలా ఉంది?
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తిని పలకరించిన మాజీ సీఎం జగన్ అమలాపురం టౌన్ : వాసురాజు...ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్రమంగా జరిగింది కదా...అని అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన నడింపల్లి వాసురాజును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వాసురాజు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ సూచనలతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రూ.20 లక్షలు సహాయం చేశారు. ఆ డబ్బుతో అప్పట్లో వాసురాజు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్లు వాసురాజును వెంట పెట్టుకుని మాజీ సీఎం జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. మీరిచ్చిన రూ.20 లక్షలతోనే వాసురాజుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందని జగన్కు విశ్వరూప్ వివరించారు. వాసురాజు ఆరోగ్య యోగ క్షేమాలను జగన్ అడగడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. -
ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అంటే డబ్బుతో పని. అదే ప్రభుత్వం ద్వారా వైద్య కళాశాలలు నడిపితే పేదలకు వై ద్యం ఉచితంగా అందుతుంది. అలాగే ప్రైవేట్ విధానంలో వైద్య విద్యను పేదలు చదవలేరు. ప్రభుత్వ వైద్య విధానంలో పేదలు డాక్టర్లు అవుతారు. అందుకే వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని నమ్ముతున్నాను. – పువ్వల సుశాంత్, విద్యార్థి, పదో తరగతి, ఏడిద, మండపేట మండలం సామాజిక బాధ్యతగా సంతకం చేశా గత ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రారంభించినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయాలి. కాదని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆ కళాశాలలు ఖరీదైనవిగా మారి పేదలకు దూరవుతాయి. అందుకే సామాజిక బాధ్యతగా సంతకం చేశాను. – ఖండవల్లి మంజులహరి, విద్యార్థి, డిగ్రీ సెకండ్ ఇయర్, ఏడిద, మండపేట మండల పీపీపీని రద్దు చేయాలి పీపీపీ విధానంలో వైద్య విద్య అందించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయాలి. ఇదేమీ తప్పు కాదు. పైగా పేదలకు మేలు జరుగుతుంది. లేకపోతే సామాన్యులకు వైద్య విద్య అందకుండా పోతుంది. – కరీం వికాస్, కొత్తపేట -
ప్రభుత్వ వైద్య విద్యే ముద్దు
చంద్రబాబు సర్కారు వచ్చాక అమలాపురం మండలం కామనగరువులో ఆగిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణం● నినదిస్తున్న కోనసీమ విద్యార్థి లోకం ● చంద్రబాబు సర్కారు ‘ప్రైవేటు’ జపంపై ఆగ్రహం ● వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు ● ప్రజాస్పందన చూసైనా నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ సాక్షి, అమలాపురం: పేదలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ మెడికల్ విద్యను పీపీపీ పేరుతో ‘ప్రైవేటీకరణ’ చేయవద్దు అని కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎలుగెత్తి నినదిస్తున్నారు. తక్షణం పీపీపీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలని, గత వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతున్నారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా విద్యార్థులు గత ప్రభుత్వ మెడికల్ కాలేజీ విధానానికి మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇందుకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి గళాల గర్జనకు మద్దతుగా సంతకాల ఉద్యమానికి దన్నుగా నిలిచారు. తమ వంతుగా వారు కూడా సంతకాలు చేసి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఏడాదిన్నరగా నిలిచిన నిర్మాణ పనులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు, తన అనుయాయులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమలాపురం మండలం కామనగరువులో గత ప్రభుత్వం 60 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.500 కోట్లను కేటాయించింది. పరిపాలనా భవనం, తరగతి గదుల నిర్మాణం, స్టాఫ్ నివాస భవనాల నిర్మాణ పనులు మొదలై చాలా వరకు పూర్తయ్యాయి. ఈ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. దీనిని కోనసీమ విద్యార్థి లోకం తీవ్రంగా తప్పుపడుతోంది. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి గళాల సంతకాల సేకరణకు మద్దతు ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో వందలాది మంది విద్యార్థులు సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పీపీపీ విధానంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వం తక్షణం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్బుల్ నజీర్కు అందజేసిన నేపథ్యంలో జిల్లాలో విద్యార్థులు మరోసారి తమ మనోగతాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. పునరాలోచన చేయాలి పీపీపీ విధానంపై ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచన చేయాలి. అన్ని వర్గాల వారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. – కుంచే అభిరామ్,డిగ్రీ ద్వితీయ సంవత్సరం, అమలాపురం ప్రతి ఒక్కరూ ప్రైవేట్గా చదవలేరు వైద్య విద్యను ప్రతి ఒక్కరూ ప్రైవేట్గా చదవలేరు. ప్రైవేటురంగంలో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. సామాన్యులు, పేద వర్గాల వారు చదవుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను కొనసాగించాలి. పీపీపీ విధానం మంచిది కాదు. – గుర్రం కృప, ఎంబీబీఎస్, లక్కవరం, మలికిపురం మండలం ప్రైవేట్ పెత్తనంతో అసలుకే నష్టం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్మిస్తే తక్కువ ఖర్చుకు వైద్య విద్య అందుతుంది. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు పెరుగుతాయి. అదే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే వైద్య విద్య ఖరీదై సామాన్య విద్యార్థులకు అందకుండా పోతుంది. ఉచిత వైద్యం కూడా అందదు. – బొంతు రాహుల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాశర్లపూడిలంక, మామిడికుదురు మండలం -
మండపేటలో భోగ ముద్ర
మండపేటలో వేంచేసియున్న స్వామి భోగ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కపిలేశ్వరపురం మండలంలోని దాతపురిగా ప్రఖ్యాతిగాంచిన తాతపూడిలోని గోదావరి చెంతన తొలుత ఈ ఆలయం ఉండేది. వరదల వల్ల దేవాలయం దెబ్బతినడంతో పండితుల సలహా మేరకు మాండవ్యపురం (మండపేట)కు ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ జనార్దనుడితో పాటు ఆగస్త్యేశ్వర, కై లాసేశ్వర స్వాముల ఆలయాలు ఉండటం ప్రత్యేకత. కోటిపల్లిలో సిద్ధ ముద్ర భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా గోదావరి నదీ తీరాన కోటిపల్లిలో వైష్ణ, శైవ క్షేత్రాలు ఒకే శిఖరం కింద, ఒకే ధ్వజస్తంభంతో వేర్వేరు గర్భ గుడుల్లో ఉన్నాయి. ఇక్కడ జనార్దనస్వామి సిద్ధ ముద్రలో కనిపిస్తారు. ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుంటే సకల పాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. -
రాజమహేంద్రవరంలో రెయిన్బో ఆసుపత్రి సేవలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెయిన్బో ఆసుపత్రి సేవలు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చాయని ఆ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల గురువారం తెలిపారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ఆస్పత్రిని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లా వాసులకు అధునాతన నియోనాటల్, పీడీయాట్రిక్ ఇన్సెంటివ్ కేర్, జనరల్ పీడియాట్రిక్, బర్త్ రైట్స్ ప్రసూతి, గైనకాలజీ, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సులు అధునాతన క్లినికల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆవిష్కరణతో రాజమహేంద్రవరం ఒక కీలకమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంటుందన్నారు. తమ సంస్థ 25 సంవత్సరాల వారసత్వ అనుభవంతో దేశంలో అతి పెద్ద నెట్వర్క్ కలిగి, తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం చూరగొందన్నారు. గతంలో రెయిన్ బో ఆసుపత్రి సేవలు పొందాలంటే మెట్రో నగరాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో ముఖ్య అతిథి తేజస్విని మతుకుమల్లి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ప్రారంభించినందుకు రెయిన్ బో బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. అత్యున్నత నాణ్యతా చికిత్సలు ఈ ప్రాంత వాసులకు కల్పించడమే కాకుండా తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందన్నారు. డాక్టర్ దినేష్ చిర్లా, డాక్టర్ ప్రణతీరెడ్డి, నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. -
వందే మాతరం స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణేన్ని తాను సేకరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 32 గ్రాముల బరువుతో ఉండే ఈ నాణేన్ని నికెల్, సిల్వర్ మిశ్రమంతో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు రూ.150 ముఖ విలువ, మరో వైపు బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వంద మాతరం’ అని నినదిస్తున్న చారిత్రాత్మక దృశ్యం ముద్రించారు. ఆవుకు కవల దూడలు రాయవరం: సాధారణంగా ఆవుకు లేదా గేదెకు ఒక ఈతలో ఒక దూడ జన్మిస్తుంది. అయితే మండలంలోని లొల్లలో ఆవుకు కవల దూడలు జన్మించాయి. గ్రామానికి చెందిన పాడి రైతు జొన్నగంటి త్రిమూర్తులుకు చెందిన ఆవుకు రెండు పెయ్య దూడలు గురువారం జన్మించాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపాడు. పత్ర గణపతి! పెద్దాపురం (సామర్లకోట) : లేత కొబ్బరి ఆకులతో పెద్దాపురం మరిడమ్మ ఆలయ సిబ్బంది తయారు చేసిన వినాయకుడి బొమ్మ ఆకట్టుకుంటోంది. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. -
జొన్నాడలో అభయం
జొన్నాడలో వెలసిన శ్రీజనార్థనస్వామి అభయ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ స్వామిని కొలుస్తారు. భక్తులు సమీపంలోని గోదావరిలో స్నానమాచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఆలమూరులో ఉగ్ర రూపం ఆలమూరులో ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రథ సప్తమి రోజున భారీగా స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. కపిలేశ్వరపురంలో పద్మాసనంలో.. పూర్వం ఇక్కడి ఆలయం దోపిడీకి గురైంది. దీంతో అప్పటి అర్చకులు జనార్దనస్వామి విగ్రహాన్ని భూమిలో భద్రపరిచారు. కొన్నేళ్లు కిందట ఈ విగ్రహం బయట పడటంతో ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించారు. ఈఆలయంలో జనార్థునుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు. మాచర జ్వాలాముద్ర నవ జనార్దన ఆలయాల్లో సప్తమ క్షేత్రంగా భాసిల్లుతున్న మాచరలో స్వామి జ్వాలాముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. రథ చక్రాకృతిలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద కోరుమిల్లిలో సాధక ముద్ర గౌతమీ నది చెంతన అష్టమ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెద కోరుమిల్లిలోని స్వామి సాధక ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు.


