breaking news
Dr B R Ambedkar Konaseema
-
ఆడుకున్న మృత్యువు
ఘటనకు కారణాలెన్నో.. ఒక టీచర్తో నడుస్తున్న ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ మొత్తం 20 విద్యార్థులు ఉండగా, శుక్రవారం 19 మంది హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని పార్కులో పునాది నిర్మించకుండానే నేలపైనే సిమెంట్ బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటికి సపోర్టు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్, తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, సర్పంచ్ దంగేటి అన్నవరం, ఎంపీటీసీ పల్లి మోషే తదితరులు పరిశీలించారు. శ్రీకాకుళంలో ఉన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాదంపై ఆరా తీసి, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఫ సిమెంట్ జింక బొమ్మ పడి చిన్నారి మృతి ఫ జి.పెదపూడి పాఠశాల ఆవరణలో ఘటన పి.గన్నవరం: నవ్వుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అభం శుభం తెలియని ఆ పసిప్రాయం అనంత లోకాల్లో కలసిపోయింది.. పాఠశాల ఆవరణలో సిమెంట్ ఆట బొమ్మపై ఆడుకుంటూ దిగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని అశువులు బాసింది.. పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన దివి దుర్గా వరప్రసాద్కు, జి.పెదపూడికి చెందిన సుజాతతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే దుర్గా వరప్రసాద్, సుజాతలు జీవనోపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు. వారి ఇద్దరి పిల్లలను జి.పెదపూడి గ్రామంలోని వరప్రసాద్ అత్తయ్య అధికారి సత్యవతి ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. జి.పెదపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సత్యవతి చాలాకాలం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట పనిచేస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఆ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకుంటున్నారు. తేజశ్రీ ఐదో తరగతి, జాహ్నవి (7) రెండో తరగతి అభ్యసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జాహ్నవి పాఠశాల ఆవరణలోని పార్కులో సిమెంట్ జింక బొమ్మపై ఎక్కి నవ్వుతూ కొంతసేపు ఆడుకుంది. అనంతరం కిందకు దిగుతుండగా జాహ్నవిపై ఆ బొమ్మ పడిపోయింది. సుమారు 70 కిలోల బరువున్న బొమ్మ ఆమె ఛాతిపై పడడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాఠశాల హెచ్ఎంతో పాటు, స్థానికులు ఆ చిన్నారిని అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడే భోజనం తినిపించా.. అప్పుడే భోజనం తినిపించా.. సరదాగా నవ్వుతూ ఉంది.. కొద్ది సేపటికే ఇలా జరిగిందంటూ జాహ్నవి మృతితో అమ్మమ్మ సత్యవతి బోరున విలపిస్తోంది. ఈ ఘటనతో జి.పెదపూడి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంక్రాంతి పండగలకు ఇక్కడకు వచ్చిన జాహ్నవి తల్లిదండ్రులు రెండు రోజుల కిందటే తిరిగి విజయవాడకు వెళ్లారు. ఈ ఘటనపై పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
అంబాజీపేట: కొబ్బరి తోటలో అంటించిన మంటల్లో ప్రమాదవశాత్తూ పడి ఓ బాలుడికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వరం గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీరామనిరంజన్ (14) ఈ నెల 13న తన తండ్రితో కలసి కొబ్బరి తోటకు వెళ్లాడు. అక్కడ కూలీలు చెత్తకు నిప్పుపెట్టగా ఆ మంటల్లో ప్రమాదవశాత్తూ శ్రీరామనిరంజన్ కాలుజారి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు శ్రీలింగనందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ లారీ ఢీకొని మూగజీవాల మృతి చింతూరు: మండలంలోని సరివెల వద్ద జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి లారీ ఢీకొనడంతో తొమ్మిది మూగజీవాలు మృతి చెందాయి. ఆవులను విక్రయించేందుకు ఒడిశా నుంచి తెలంగాణకు కాలినడకన తీసుకు వెళ్తున్న క్రమంలో భద్రాచలం వైపు నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్తున్న లారీ వేగంగా వస్తూ రహదారి దాటుతున్న ఆవులను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మూగజీవాలు చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. -
‘తిరుమల’లో వైభవంగా సరస్వతీ హోమం
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం నాగాబట్ల కామేశ్వరశర్మ ఆధ్వర్యంలో వింజమూరి సుబ్బారావు బృందంచే సరస్వతీ హోమం ఘనంగా నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, సరోజినిదేవి దంపతులు ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. 22 వేల మంది విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులంతా విద్యతో పాటు, మంచి బుద్ధిని కలిగి ఉండాలన్నారు. తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అవసరమన్నారు. తమపై తమకు విశ్వాసం పెంపొందించుకోడానికి ఈ హోమం ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
పొదల్లో శిశువు లభ్యం
చింతూరు: మండలంలోని కల్లేరులో పొదల మాటున శుక్రవారం మగ శిశువు కనిపించింది. సీలేరు వంతెన సమీపంలోని పొదల మాటున శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో సీడీపీఓ జయలక్ష్మి సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న ఆ శిశువును బయటకు తీసి చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ రమేష్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా మూడ్రోజుల క్రితం కూడా మదుగూరు ప్రాంతంలో నవజాత శిశువు లభ్యంకాగా, తాజాగా మరో పసికందు కనిపించడం గమనార్హం. -
దమ్ము ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి
కాట్రేనికోన: మండలంలోని వేట్లపాలెంలో దమ్ము ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వేట్లపాలెంలో ఓ పొలంలో డ్రైవర్ గుత్తుల గోణుగోపాలరావు (42) దమ్ము చేసేందుకు పొలంలో దుక్కి చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ముందు చక్రాలు పైకి లేచి ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్ కింద విగతజీవిగా పడిఉన్న వేణుగోపాలరావును బయటకు తీసేందుకు రైతులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సరిహద్దు పంట చేనులో దుక్కి చేస్తున్న ట్రాక్టర్ సహాయంతో రైతులు బోల్తా పడిన ట్రాక్టర్ను తొలగించి వేణుగోపాలరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉంది. ఆలనాపాలన చూసుకునే కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి దుఖఃసాగరంలో మునిగిపోయింది. కాట్రేనికోన ఎస్సై అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్మిషన్ల దందాపై పోరాటం
కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ఇంటర్ ప్రవేశాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకుండానే తాయిలాలు ప్రకటిస్తూ అసత్య ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలి. అడ్మిషన్ల దందాపై పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం. –బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ, రామచంద్రపురం విద్య వ్యాపారంగా.. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తల్లిదండ్రుల నంబర్లు సేకరించి మాట్లాడి మభ్యపెడుతున్నారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించే వరకూ చేపట్టరాదు. అయితే విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. టాలెంట్ టెస్ట్లు, అవగాహన సదస్సుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల అసత్య ప్రచారాన్ని నియంత్రించాలి. – సింహాద్రి కిరణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూ, రాజమహేంద్రవరం -
కొత్త కార్యకర్గం ఎన్నిక
బాలాజీచెరువు: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ఎన్నికను శుక్రవారం కాకినాడలోని జిల్లా కేంద్రం గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఎం.సంజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధి కె.త్రిమూర్తులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘ గౌరవ అధ్యక్షుడిగా గట్టి రామారావు, అఽధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, కోశాధికారిగా ఆర్.వీరభద్రరావు, మహిళా కార్యదర్శిగా డి.వాణిశ్రీ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా సీహెచ్ నాగేశ్వరరావు, ఐవీ రామరాజులు కొనసాగనున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు సలాది సాయి సత్యనారాయణను సత్కరించారు. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
కమిటీల నియామకాలు పూర్తి చేయాలి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబిఅమలాపురం రూరల్: జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీల నియమకాలు పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) పిలుపునిచ్చారు. అమలాపురం మండలం భట్నవెల్లిలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ నివాసంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం జిల్లా సమావేశం జరిగింది. బాబీ మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలన్నారు. రైతులకు ప్రధానమంత్రి బీమా యోజన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఉప్పులగుప్తం మండలం కూనవరం, అల్లవరం మండలం రామేశ్వరం సముద్ర మొగలు మూసుకుపోవడం వల్ల ఏర్పడుతున్న ముంపు సమస్యను పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ కోసం రైతు సంఘాలతో కలసి కలెక్టర్ను కోరుతామన్నారు. ఆధునీకరణ పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలన్నారు. వెబ్ లాండ్ పోర్టల్ లో లోపాలు, రెవెన్యూ తప్పిదాల వల్ల రైతుకు శాపాలుగా ఉన్నాయని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కీలక మార్పులు చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఇందుకూరి సత్యనారాయణరాజు, సంయుక్త కార్యదర్శి గుబ్బల రమేష్, ఢిల్లీ నారాయణ మాట్లాడుతూ శంకర గుప్తం డ్రైయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపాలన్నారు. ఆధునీకరణ వల్ల రైతులకు గోగులమఠం, కరవాక, ముత్యాల పాలెం గ్రామాల్లో ఆక్రమణలు, ఆక్వా చెరువులు చిత్తడి నేలల్లో మేటలు వేయడం వల్ల ముంపు నీరు వెళ్లడం లేదన్నారు. ఆక్రమణలు తొలగించి డైయిన్ను ఆధునీకరిచాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు చిక్కం బాలయ్య, ఢిల్లీ నారాయణ, తులా గోపాలకృష్ణ, పిప్పర రాజు, కె. జవహర్, పళ్ల. వి. వి సత్యనారాయణ, శీలం సూరిబాబు యాళ్ళ చిన్న, నాగు తదితరులు పాల్గొన్నారు. -
విఘ్నేశ్వరుని పాదాల చెంత లక్ష కలాలు
అయినవిల్లి: చదువుల పండగ పేరుతో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం రెండో రోజు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీయాగం నిర్వహించారు. ఈ పూజలు ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో 12 మంది రుత్వికుల పర్యవేక్షణలో జరిపారు. గణపతి పూజ, సరస్వతీ కల్పం, సరస్వతీ మండపారాధన, మహన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, శాంతి మంత్ర పఠనం, లక్షగరిక పూజ, లక్ష కలాల పూజ, పుష్పార్చన, సరస్వతీ హోమం జరిపారు. స్వామివారి ప్రసాదంగా లభించిన కలంతో విద్యార్థులు పరీక్షలు రాస్తే శుభ ఫలితాలు సాధిస్తారనే నమ్మకం. ఈ కలాల కోసం విద్యార్థులు భారీ ఎత్తున విఘ్నేశ్వరస్వామివారిని దర్శించి స్వామివారి కలాలను తీసుకెళ్తారు. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 25వ తేదీ నుంచి ఈ కలాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఈఓ తెలిపారు. -
‘వైరాగ్యం అంటే అడవులకు పారిపోవడం కాదు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వైరాగ్యం అంటే అడవులకు పారిపోవడం కాదు, కర్తవ్యాన్ని విస్మరించడం కాదు, సరిగా నీ విధులను నీవు చేయడమే వైరాగ్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం హిందు సమాజంలో ఆయన ఆశ్రమవాసిక పర్వంలోని అనేక అంశాలను వివరించారు. ‘వ్యాసుడు తన తపశ్శక్తితో యుద్ధంలో మరణించిన వీరులను భూమి మీదకు తీసుకురావడంలో అంతరార్థం ధాతరాష్ట్రాదుల శోకమోహాలను దూరం చేయడమే. అవిద్య వల్లనే శోకమోహాలు కలుగుతాయి. వైరాగ్యమంటే స్వస్వరూపం తెలుసుకోవడానికి చేసే తీవ్రమైన ఆలోచన, ఆత్మానాత్మ విచారణ’ అని సామవేదం చెప్పారు. ఈ సందర్భంగా అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కీటకోపాఖ్యానాన్ని వివరించారు. వ్యాసుడు ఒక కీటకంతో ‘ఎటువంటి భోగానుభవానికి యోగ్యం కాని దేహంతో ఉన్న నీకు మరణమే మేలని అనిపిస్తున్నద’ని అంటాడు. ‘నేను జీవించాలనే అనుకుంటున్నాను’ అని కీటకం సమాధానం చెబుతుంది. ‘శునకము తన బతుకు ఘనమై తలపోయు’ అని అన్నమాచార్యుడి కీర్తనను సామవేదం ఉదహరించారు. అనేక నీచజన్మలు ఎత్తాక, కీటకం రాజుగా జన్మిస్తుంది. ‘ఎన్ని జపాలు చేసినా, యాగాలు చేసినా, అహంకారంతో చేస్తే, అవన్నీ నిరర్థకమవుతాయ’ని వ్యాసుడు రాజుగా జన్మించిన కీటకంతో చెబుతాడు. ‘ధనం, పాండిత్యం, అధికారం, సౌందర్యం, యౌవనం అహంకారానికి కారణాలు కారాదు. దేహానుభవం మనకున్నంతగా పరమాత్మ అనుభవంలోకి రావడం లేద’ని సామవేదం అన్నారు. ‘మనకు మృత్యుభయం ఉండరాదు, ధర్మలోపం కలగరాదనే భయం ఉండాలి. భయం–భక్తీ అంటే ఇదే అర్థమని’ సామవేదం అన్నారు. భారతంలోని చివరి మూడు అధ్యాయాలలో విస్తృతంగా వ్యాసుని ఉపదేశం కనబడుతుంది. ఇది వాసుదేవుని కథా, వ్యాసదేవుని కథా అన్న సందేహం కలగవచ్చు, వాసుదేవుడు, వ్యాసుడూ ఒకరేనని సామవేదం అన్నారు. స్నేహపాశం తపస్సుకు భంగం కనుక, కుంతీదేవి తమను చూడటానికి వచ్చిన పాండవులను హస్తినకు వెళ్లిపొమ్మని ఆదేశిస్తుంది. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ వసంతపంచమి సందర్భంగా వాగ్దేవికి, వాగ్దేవీ వరపుత్రునికి నమస్కరిస్తున్నానని, సరస్వతికి, సమన్వయ సరస్వతికి నమస్కారం చేస్తున్నానని సభకు శుభారంభం పలికారు. ముందుగా పిల్లలకు పుస్తకాలు, కలాలు వితరణ చేశారు. -
గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్
అమలాపురం రూరల్: గోదావరి పుష్కరాలు – 2027కు ఇప్పటి నుంచే ఘాట్ల పునరుద్ధరణ, భద్రత, రవాణా, నీటి, ఆరోగ్య సేవలతో సన్నద్ధం కావాలని కలెక్టర్ మహేష్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి నుంచి కలెక్టర్లతో ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్షరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మహేష్కుమార్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో 212 కిలోమీటర్లు గోదావరి తీరం ఉన్నదని భక్తుల సౌకర్యార్థం కొన్ని ఘాట్లను ఎంపిక చేసి నాలుగు మాసాల నుంచి సివిల్ పనులు చేపట్టామని తెలిపారు. ఘాట్ల అభివృద్ధి, అప్రోచ్ రోడ్లు భక్తుల సౌకర్యార్థం సివిల్ వర్క్ నిర్వహణ, భక్తుల రద్దీ, వసతి, శానిటేషన్ సమస్యలు లేకుండా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనులు నిర్వహించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా సుందర ప్రదేశాలు, ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. కోనసీమ ప్రాంతంలో మండువా లోగిళ్లలో హోం స్టే కోసం పర్యాటకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆ దిశగా మరిన్ని మండువా లోగిళ్లును ఎంపిక చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి పాల్గొన్నారు. బాడ్మింటన్ టోర్నీ అంపైర్గా శ్రీనివాస్ అమలాపురం రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఆదివారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ బాడ్మింటన్ టోర్నమెంట్కు ఈదరపల్లి అలా వైకుంఠపురానికి చెందిన అడపా శ్రీనివాస్ను న్యాయనిర్ణేతగా ఎంపిక చేస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులు అందాయని తెలిపారు. శ్రీనివాస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అంపైర్. గతంలో పలు జాతీయ టోర్నమెంట్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రీ సర్వేతో నాణ్యమైన సేవలు అమలాపురంరూరల్: భూ పరిపాలన రెవెన్యూ అంశాలలో రీ సర్వే ప్రక్రియ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని జాయింట్ కలెక్టర్ టీ.నిశాంతి రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె భూ పరిపాలన రీ సర్వే ప్రక్రియ అమలు, పురోగతి, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై రెవెన్యూ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించడం, పారదర్శకత పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. డీఆర్ఓ కె. మాధవి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్ద పీట వేయాలన్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకుడు కె. ప్రభాకర్ పాల్గొన్నారు. -
సర్పంచ్ తిరుమలవేణికి అరుదైన గౌరవం
కాజులూరు: మండలంలోని బందనపూడి సర్పంచ్ డేగల తిరుమలవేణికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనవలసిందిగా ప్రౌడ్ టు బి యాన్ ఇండియా (పీటీబీఐ) నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా పేద ప్రజలకు తానూ, తన కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న సేవలు, పేద విద్యార్థులకు అందిస్తున్న సహకారాలను పీటీబీఐ గుర్తించి ఈ అవకాశాన్ని అందజేసిందన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ను వీక్షించటంతో పాటు ప్రధానమంత్రితో సమావేశంలోనూ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జార్జి కురియన్, సురేష్గోపిలతో అల్పాహార విందులోనూ పాల్గొననున్నట్టు తెలిపారు. 22న మహా గాయత్రీ పీఠాధిపతికి పట్టాభిషేకం అమలాపురం టౌన్: శ్రీశైలం మహా గాయత్రీ పీఠాధిపతిగా ఇటీవల నియమితులైన అమలాపురానికి చెందిన కారుపర్తి తేజేశ్వరశర్మకు పట్టాభిషేకం ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.09 గంటలకు జరుగుతుందని ఆ పీఠం ప్రధాన కార్యదర్శి అంబాబత్తుల అండకొండ రాముడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హంపి హేమకూట శ్రీ గాయత్రీ మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ దయానందపురి మహాస్వామి చేతుల మీదుగా పట్టాభిషేకం జరుగుతుందని, ఇది దేవ బ్రహ్మణ (దేవాంగ) ద్వితీయ గురు పీఠమని వివరించారు. అశ్వవాహనం సమర్పణ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి కేశవదాసుపాలెంకు చెందిన దాతలు బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబ సభ్యులు సంయుక్తంగా శుక్రవారం ఇత్తడితో తయారు చేసిన కొత్త అశ్వవాహనం సమర్పించారు. ఆలయంలో వాహనశాల వద్ద పై వాహనానికి స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పెద్దింటి వేంకట శ్రీనివాస్, జీఎల్ఎన్ రాజేష్, వేద పండితుడు చింతా వేంకట శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. వాహనాన్ని 169 కేజీల ఇత్తడితో రూ.4 లక్షల ఖర్చుతో సమకూర్చారు. అర్చకుల సంప్రోక్షణ అనంతరం వాహనశాలకు ఆ రెండు కుటుంబాల సభ్యులు చేర్చారు. ఆలయ ఏసీ ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా విధి నిర్వహణ
● కలెక్టర్ మహేష్కుమార్ సూచన ● అంతర్వేది నరసన్న కల్యాణోత్సవాలపై సమీక్ష సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు. శుక్రవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో డివిజన్ స్థాయి శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ జరుగనున్న ఈ ఉత్సవాల్లో 28న కల్యాణం, 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న పౌర్ణమి స్నానాలకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ తీర్థంలో శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని డీపీవోకు సూచించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ కల్యాణ అక్షింతల పంపిణీ సమయంలో, పౌర్ణమి రోజు సముద్రం వద్ద రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్సవాలకు గతంలో మాదిరిగా మలికిపురంలో ఆర్టీసీ బస్ స్టాప్ పాయింట్ లేదని, సరాసరి అంతర్వేదికి వెళతాయని రాజోలు డిపో అధికారి పేర్కొన్నారు. తీర్థంలో బందోబస్తుకు వివిధ స్థాయిల్లోని పోలీసు సిబ్బంది 1,350 మంది డ్యూటీలో ఉంటారని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ చెప్పారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఆర్డీవోలు కొత్త మాధవి, శ్రీకర్, అఖిల, ఎండోమెంట్స్ డీసీ డీఎల్వీ రమేష్బాబు, జిల్లా ఎండోమెంట్స్ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, రాజోలు సీఐ టీవీ నరేష్కుమార్, తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, సర్పంచ్ కొండా జాన్బాబు, ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు పాల్గొన్నారు. -
కోతల సర్కారు నిర్వాకం!
● జిల్లాలో రైతు సేవా కేంద్రాలకు కోత ● గత ప్రభుత్వ హయాంలో 455 ఆర్బీకేలు ● ఇప్పుడు 352 మాత్రమే ● రేషనలైజేషన్ పేరిట చంద్రబాబు సర్కార్ ఆటలు ● సిబ్బందికి సైతం బదిలీలు ● 19 మంది ఏఏఓ, ఏహెచ్ఓలకు స్థాన చలనం సాక్షి, అమలాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకాలకు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన పేర్లు మార్పు చేయడం... తరువాత ఆ పథకాలకు కోత పెట్టడం చంద్రబాబు ప్రభుత్వంలో సర్వ సాధారణంగా మారింది. రైతు భరోసా.. అమ్మఒడి వంటి పథకాల పేర్లు మార్చడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెట్టారు. గత ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను చంద్రబాబు సర్కారు చిన్నాభిన్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)లు ప్రస్తుతం (రైతు సేవా కేంద్రా(ఆర్ఎస్కే)లుగా మార్చేసింది. తాజాగా రేషనలైజేషన్ పేరుతో వాటి ద్వారా అందే సేవలకు ప్రభుత్వం కోతలు పెడుతోంది. అన్నదాతలకు వెన్నుదన్నుగా ఆర్బీకేలు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, ఎరువుల నుంచి పురుగు మందుల వరకు, ఈ – క్రాప్ నమోదు నుంచి ఉచిత పంటల బీమా వరకు సేవలు అందిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులో అందేవి. గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య శాఖ సహాయకులను నియమించారు. ప్రధానంగా ఈ–క్రాప్ నమోదు శరవేగంగా సాగేది. ఈ విధానం వల్లే రైతులకు ఉచిత పంటల బీమా వంద శాతం అమలు జరిగేది. పంట నష్టపోతే మూడు నెలలలోపే పెట్టుబడి రాయితీ (ఇన్ఫుట్ సబ్సిడీ) అప్పటి ప్రభుత్వం అందించేది. గత ప్రభుత్వం సచివాలయం యూనిట్గా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులకు మెరుగైన సమాచారం అందించింది. నాణ్యమైన దిగుబడి కోసం ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఈ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు వీటిని అధ్యయనం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందుబాటులో ఉండడంతో రైతులు సమీపంలోని పెద్ద గ్రామాలు, పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి వచ్చేవి. వీటన్నింటికన్నా జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేసేవారు. దీనివల్ల మద్దతు ధరకు ఢోకా ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా రైతుల కళ్లాల వద్దకు వచ్చి ధాన్యం సేకరించేవారంటే అందుకు ఆర్బీకే కారణం. 103 ఆర్ఎస్కేలకు మంగళం వైఎస్సార్ సీపీ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను ఇప్పటికే భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్బీకేల పేరు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరు మార్చడమే కాక దీనిని నిర్వీర్యం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యూనిట్గా కొన్ని ప్రాంతాల్లో ఒక ఆర్ఎస్కే పరిధిలో సుమారు రెండు వేల హెక్టార్ల వరకు ఉన్నాయని, మరి కొన్నిచోట్ల చాలా తక్కువ విస్తీర్ణం ఉందని సాకుగా చెబుతోంది. రేషనలైజేషన్ పేరుతో ఆర్ఎస్కేలను భారీగా కుదించి వేస్తోంది. గత ప్రభుత్వం కోనసీమ జిల్లాలో మొత్తం 455 ఆర్బీకేలు ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ సంఖ్య 352కు కుదించింది. తద్వారా జిల్లాలో 103 ఆర్ఎస్కేలకు మంగళం పాడుతోంది. సచివాలయ వ్యవస్థను క్లస్టర్ చేయగా ఇప్పుడు ఆర్ఎస్కేలను ఆ క్లస్టర్కు అనుగుణంగా ఎంపిక చేస్తోంది. దీంతోపాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారు. జిల్లాలో ఏకంగా 23 మంది వీఏఏలు అదనంగా ఉన్నారని గుర్తించారు. వీరిలో నలుగురిని కోనసీమ జిల్లాలో, మిగిలిన 19 మందిని ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సర్దుబాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతోపాటు ఇప్పటికే ఆర్ఎస్కేల ద్వారా అందుతున్న పలు సేవలను క్రమంగా తగ్గిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామీణ వ్యవసాయంలో భాగంగా మారిన ఆర్బీకేలను ఇప్పుడు దూరం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తగ్గించడం దారుణం చంద్రబాబు సర్కార్ రైతులకు వరుసగా చాలా అన్యాయం చేస్తోంది. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించే రైతు సేవా కేంద్రాలను కుదించడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరిగేది. ప్రధానంగా పటిష్టమైన ధాన్యం కొనుగోలు వ్యవస్థ దీనివల్లే ఏర్పడింది. ఇప్పుడు రైతు సేవా కేంద్రాలను తగ్గించడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. – బత్తుల అప్పారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు, కుందూరు, కె.గంగవరం మండలం ఆర్ఎస్కేలను కుదించవద్దు ఆర్ఎస్కేల ద్వారా రైతుల క్షేత్రాల వద్దనే పలు రకాల సేవలందుతున్నాయి. గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు దొరుకుతున్నాయి. మా కళ్లాల వద్దకు వచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇంత మంచి వ్యవస్థను కుదించడం దారుణం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. – పల్లి జయ, రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం -
జంతు సంక్షేమానికి పాటు పడాలి
అమలాపురం టౌన్: జంతు స్వేచ్ఛ, జంతు హక్కుల చట్టాలపై అవగాహన పెంచుకుని అందరూ జంతు సంక్షేమానికి పాటు పడాలని పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ కర్నీడి మూర్తి పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకూ జరుగుతున్న జంతు సంక్షేమ పక్షోత్సవాలు వసంత పంచమి పర్వదినాన అమలాపురంలోని శ్రీగౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలలో శుక్రవారం జరిగాయి. గోశాలలో జరిగిన జంతు సంక్షేమ పక్షోత్సవాలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్మూర్తితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి ప్రారంభించారు. ముందుగా గోపూజ నిర్వహించారు. పశు సంరక్షణ – హక్కులకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. గోశాలలో ఉన్న దాదాపు 150 గోవులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం రైతులతో అవగాహన సదస్సు జరిగింది. మాట్లాడుతూ జీవ జాతుల పట్ల అందరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఓ బాధ్యతగా వ్యహరించాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ అధికారులను గోశాల ప్రతినిధులు సత్కరించారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణ, పశు వైద్యాధికారులు మేడిద నారాయణరావు, మాధురి, కావ్య, గో సేవకులు లింగోలు విస్సు, చాగంటి ప్రసాద్, కేవీ మావుళ్లయ్య పాల్గొన్నారు. -
‘నీ కోశాగారం ధర్మమార్గంలో నిండుతోందా?’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘నీ కోశాగారం ధర్మమార్గంలో నిండుతోందా అని ధృతరాష్ట్రుడు తనను చూడటానికి వచ్చిన ధర్మరాజును ప్రశ్నించార’ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో గురువారం ఆయన వ్యాస భారతంలోని ఆశ్రమవాసిక పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. వనవాస దీక్షలో ఉన్న గాంధారీ ధృతరాష్ట్రులను, తల్లి కుంతీదేవిని యుధిష్ఠిరుడు తమ్ములతో, ధర్మపత్నితో, ఇతర పరివారంతో తరలివెళ్లి కలుస్తాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంధించిన ప్రశ్నలు అయోధ్యకాండలో రామచంద్రమూర్తి తనను కలసిన భరతుని అడిగిన ప్రశ్నలను పోలి ఉంటాయని సామవేదం అన్నారు. ‘నీ పాలనలో సీ్త్ర బాల వృద్ధులు దుఃఖించడం లేదు కదా?, వారు జీవిక కోసం యాచక వృత్తిలోకి దిగలేదు కదా?, నీవు శ్రద్ధతో పితరులను, దేవతలను ఆరాధిస్తున్నావా?, నీ శత్రువులు కూడా నీ ప్రవర్తనతో తృప్తిపడుతున్నారు కదా?’ నీ రాజవంశం పూర్వప్రతిష్ఠను కాపాడుకుంటున్నదా?’ అని ధృతరాష్ట్రుడు ప్రశ్నలు సంధించాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునితో నీ ఆటంకాలు లేకుండా తపోదీక్ష సాగుతోందా అని ప్రశ్నించాడు. రాముడు శబరిని కలిసినప్పుడు ఇదే ప్రశ్నను అడిగాడని సామవేదం గుర్తు చేశారు. కఠినమైన తపోదీక్షలో ఉన్న విదురుడు అడవులలో తిరుగుతుండగా, ధర్మరాజు అతడిని కలుసుకున్నాడు. యోగమార్గంలో విదురుని ప్రాణాలు ధర్మరాజులో కలసిపోయాయి. అందరూ సమావేశమయ్యారని తెలుసుకున్న వ్యాసుడు వారి వద్దకు వచ్చి ధృతరాష్ట్రునితో నీ తపస్సు వృద్ధి చెందుతోందా అని ప్రశ్నించాడు. తపస్సు పండించేవి మూడు గుణాలని, అవి ఎవరి పట్ల శత్రుభావం లేకపోవడం, సత్యం, క్రోధరాహిత్యమని సామవేదం అన్నారు. కుంతి వ్యాసునితో కర్ణుని జన్మవృత్తాంతం చెప్పి, తాను చేసినది దోషమా అని అడుగుతుంది. వ్యాసుడు కుంతిలోని అపరాధ భావాన్ని దూరం చేస్తూ, కొన్ని దేవగణాల సంకల్పంతో, మాటలతో, దృష్టితో, స్పర్శతో, సమాగమంతో సంతానాన్ని ప్రసాదించగలరని, దేవధర్మం కారణంగా మానవధర్మం దూషితం కాదనీ చెబుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన వీరులందరినీ నాటి రాత్రి గంగాతీరంలో చూపించాడని సామవేదం అన్నారు. వసంత పంచమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రవచనానికి ముందు చిన్నారులకు కలాలు, పుస్తకాలు ప్రసాదంగా వితరణ చేయనున్నట్టు కార్యక్రమ వ్యాఖ్యాత అప్పాజీ ప్రకటించారు. -
బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి
రామచంద్రపురం రూరల్: ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్న బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమాలను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రామచంద్రపురం పట్టణం, రూరల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కలసి విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు లేని కారణంగా డీఏ బకాయిలు మున్సిపల్ కమిషనర్ అకౌంట్లో ఉండిపోతున్నాయన్నారు. పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన, ఆర్థిక కార్యదర్శులు పోతంశెట్టి దొరబాబు, కారుపల్లి కళ్యాణ బాబు, కుడుపూడి హేమంత శివకుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు పేరిచర్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
అమలాపురం టౌన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా గురువారం చేపట్టిన ఒక్క రోజు సమ్మెలో కోనసీమలోని 45 బ్యాంక్ల బ్రాంచీలకు చెందిన 250 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. వారందరూ గురువారం సాయంత్రం అమలాపురానికి చేరుకుని ప్రదర్శన నిర్వహించారు. అమలాపురంలోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నా చేసి, అక్కడి నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ ప్రదర్శన చేశారు. కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిదండి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని ప్రధాన బీమా సంస్థలతో పాటు ఆర్బీఐ, ఎస్ఈబీఐ లాంటి ఇతర సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేస్తున్నాయన్నారు. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం నేటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ రంగంలో అధికారులు, ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడి, పెరుగుతున్న పని భారం, అధిక లక్ష్యాలు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు టీవీవీ సత్యనారాయణ, కార్యదర్శి బి.శ్రీనివాసరావుతో పాటు స్టేట్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజియన్ సెక్రటరీ వై.గణేష్, స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె.సురేష్, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం.సురేష్, యూనియన్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ అసోసియేషన్ ప్రతినిధి వైఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
28న ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని ఈ నెల 28వ తేదీ బుధవారం రాత్రి 10.17 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. 28 ఉదయం లక్ష రుద్రాక్ష పూజ, రాత్రి దివ్య కల్యాణం, 30న సదస్యం, వేద స్వస్తి, 31న రథోత్సవం, ఫిబ్రవరి 1న నాకబలి, వసంతోత్సవం, త్రిశూల చక్రస్నానం, 2న స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో తెప్పోత్సవం, 3న శ్రీపుష్పోత్సవం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు అమలాపురం రూరల్: మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు విధించడంతో పాటు, ఆఫ్లైన్, ఆన్లైన్ సేవల్లో పారదర్శకత పెంచాలన్నారు. మహిళల భద్రత కోసం బహిరంగ ప్రాంతాల లో సీసీ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్, షీటీమ్ల కార్యకలాపాల బలోపేతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్లు వి.నిర్మల్ కుమార్, రవివర్మ, రాజు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్డర్ కాపీ అందజేత అమలాపురం రూరల్: సౌదీ అరేబియాలోని ఫ్యాక్టరీలో పనిచేస్తూ మృతి చెందిన ఓ వ్యక్తికి ఆ కంపెనీ మరణ పరిహారం, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన సొమ్ములు అందించింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని గురువారం కుటుంబ సభ్యులకు కలెక్టర్ అందజేశారు. వివరాల్లోకి వెళితే.. సఖినేటిపల్లికి చెందిన గొల్లమందల శామ్యూల్ 29 ఏళ్ల క్రితం సౌత్ అరేబియాకు వెళ్లాడు. ఆ దేశంలోని రియాద్లో బిన్ సాల్మన్ అనే ఫ్యాక్టరీలో పనిచేస్తూ 2025 జనవరి 9న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చికిత్స పొందుతూ హాస్పటల్లో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని మార్చి 28న భారత రాయబార కార్యాలయం ద్వారా బంధువులకు అప్పగించారు. శామ్యూల్ పనిచేసిన కంపెనీ వారు చట్టపర మరణ పరిహారం, రావాల్సిన బకాయి ముగింపు ప్రయోజనాలకు సంబంధించిన రూ.13,98,568ను భారత రాయబార కార్యాలయ విదేశీ వ్యవహారాల రెవెన్యూ చట్ట ప్రకారం సక్రమంగా ఏప్రిల్ 28న జమ చేశారు. సఖినేటిపల్లి తహసీల్దార్ ధ్రువీకరణ తర్వాత అతడి భార్య మార్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలకు కలెక్టర్ ఆర్డర్ కాపీ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు, కేసీఎం సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానాల్లో కొత్త హుండీలుఅన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో భక్తుల క్యూలలో స్టెయిన్లెస్ స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్న హుండీల ఎత్తు ఎక్కువగా ఉన్నందున వాటిలో కానుకలు సమర్పించడానికి భక్తు లు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనివలన క్యూలో భక్తులు వేగంగా కదలక దర్శనం ఆలశ్యమవుతోందన్నారు. అందువలన దేవస్థానాల్లో చక్రాలతో కలిపి మూడడుగుల ఎత్తు, 16 అంగుళాల వెడల్పు, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి అవసరమైనంత పొడవుతో స్టెయిన్లెస్ స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో హుండీ బరువు 55 నుంచి 60 కేజీల మధ్య ఉండాలన్నారు. -
తప్పు చేయలేదని ప్రమాణం చేస్తారా?
● ఎమ్మెల్యే ఆనందరావుకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సవాల్ ● అఖిల పక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ అమలాపురం టౌన్: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఏ తప్పూ చేయకపోతే, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోకపోతే ఆయన నమ్మిన దేవుని ముందు ప్రమాణం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను, తాను చేసిన ఆరోపణలను ఆయన ప్రమాణం ద్వారా నివృత్తి చేసుకోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు అమలాపురంలో గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ సవాల్ను ఎమ్మెల్యే స్వీకరిస్తే తాను కూడా తాను నమ్మిన దేవుని ముందు ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహల ఆధారంగా తాను మాట్లాడానని చెప్పారు. ఆయన గత రెండేళ్లలో ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసినప్పుడు, తాను కూడా బహిరంగంగా వచ్చి ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యే అవినీతిని నిగ్గు తేల్చేందుకు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం విచారణలో ఎమ్మెల్యే సచ్చీలుడని తేలితే తాను బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన స్థాయి గురించి మాట్లాడుతున్న కూటమి నేతలు గతంలో తన సొంత గ్రామం ఎస్.యానాంలో ఎమ్మెల్యే స్థాయి ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తాను గతంలో ఓ హోటల్లో మేనేజర్గా పనిచేసిన సంగతి వాస్తవమేనని, అదే ఎమ్మెల్యే గతంలో తన సాంతూరులో సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. -
తీరు మారేనా!
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026● నరసన్నా.. సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేలాదిగా భక్తులు ఈ కల్యాణ క్రతువుకు తరలి రానున్నారు. కానీ, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వామి వారి భక్తులు, అనాదిగా కొన్ని కుటుంబాలు, కొన్ని కుల సంఘాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు తప్ప.. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు అంతంత మాత్రమే కావడం గమనార్హం. 25న ప్రారంభం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ జరగనున్నాయి. వీటిలో ముఖ్యమైన కల్యాణోత్సవాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి నిర్వహిస్తారు. ఆ మర్నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలనూ తిలకించడానికి భక్తులు భారీగా వస్తారు. మొత్తంగా కల్యాణోత్సవాలకు ఐదారు లక్షల మంది వస్తారన్నది అంచనా కాగా, వారిలో సుమారు 3 లక్షల మంది కల్యాణం, రథోత్సవానికే వస్తారని చెబుతున్నారు. తిరిగి పౌర్ణమి రోజున మరో 2 లక్షల మంది వచ్చే అవకాశముంది. చాలా మంది భక్తులు కల్యాణం రోజు సాయంత్రానికి చేరుకుని కల్యాణోత్సవాన్ని తిలకించడంతో పాటు తెల్లవారుజామున సముద్ర స్నానాలకు వెళ్తారు. అనంతరం స్వామివారి దర్శనం, మధ్యాహ్నం నుంచి రథోత్సవం చూసుకుని సాయంత్రం స్వస్థలాలకు తిరిగి వెళ్తారు. కల్యాణోత్సవం వీక్షించేందుకు వచ్చే వేలాది మంది భక్తులు ఆవిధంగా 24 గంటలకు పైగా అంతర్వేదిలోనే ఉంటారు. పెరిగిన భక్తులు, ఆదాయం దశాబ్ద కాలంగా అంతర్వేది ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. భక్తులు రెండు మూడు రెట్లు పెరిగారు. కల్యాణోత్సవాలతో పాటు రోజు వారీ భక్తుల సంఖ్య కూడా ఎక్కువైంది. గతంలో ఏడాదికి రూ.80 లక్షలు ఉండే సగటు ఆదాయం ఇప్పుడు రూ.2.50 కోట్ల వరకూ ఉంటోందని అంచనా. అయినప్పటికీ కల్యాణోత్సవాల ఏర్పాట్లలో పాత పంథాను అవలంబిస్తున్నారే తప్ప భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు.సమీక్షలెందుకు? కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆలయం వద్ద స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. భద్రత, బస్సులు, పారిశుధ్యం వంటి వాటి మీద సమీక్షలతోనే సరిపోతోంది. భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల మీద చర్చ లేకుండా పోతోంది. ఈ నెల 28న అంతర్వేదిలో కల్యాణం భారీగా తరలిరానున్న భక్తులు వసతులు అంతంతమాత్రమే సౌకర్యాల కల్పనపై మీనమేషాలు సామాన్యుల అవస్థలు -
విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం
అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి సన్నిధిలో సప్తనదీ జలాల కలశాలతో వేద పండితులువిఘ్నేశ్వర స్వామికి జలాభిషేకం చేస్తున్న వేద పండితులుఅయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చదువుల పండుగ పేరుతో మూడు రోజులు పాటు జరిగే ప్రత్యేక క్రతువులకు వేద పండితులు గురువారం అంకురార్పణ చేశారు. ఈ మేరకు ఆలయాన్ని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలిరోజు స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో 12 మంది రుత్విక్కులు సప్తనదీ జలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి జలాలు ప్రత్యేక కలశాల్లో నింపి పూజలు చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి. శుక్రవారం చదువుల పండుగ పేరుతో శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామివారి పాదాల చెంత లక్ష కలాలు ఉంచి పూజలు చేస్తామన్నారు. లోక్ అదాలత్ను విజయవంతం చేయండిరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిరాజోలు: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన షేక్ మస్తాన్ (45) మృతి చెందాడు. ఈ నెల 21న రాజోలు మండలం పాలగుమ్మి బైపాస్ రోడ్డులో నగరం వైపు సైకిల్పై వెళ్తున్న షేక్ మస్తాన్ను గుర్తు తెలియని మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో 108 అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ గురువారం మృతి చెందాడని ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. ఊరూరా సైకిల్పై తిరుగుతూ గ్యాస్ స్టౌలు రిపేర్ చేస్తూ కుంటుంబాన్ని పోషించుకునే వాడని మస్తాన్ సోదరుడు నన్నాషా తెలిపారు. నన్నాషా ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని ఏడో జడ్జి చాంబర్లో వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా బీమా సంస్థలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. అలాగే రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి, వాటిని లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నేడు బస్ సర్వీసుల రద్దు రాజవొమ్మంగి: ఏలేశ్వరం డిపో నుంచి పోలవరం, అల్లూరి జిల్లాలకు తిరిగే ఆర్టీసీ బస్ సర్వీసులను పోలీసు అధికారుల ఉత్తర్వుల మేరకు శుక్రవారం నిలిపి వేస్తున్నట్లు ఏలేశ్వరం డిపో మేనేజర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డతీగల మండలం గొంతువానిపాలెం – రమణయ్యపేట గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రహదారికి మరమ్మతులు చేయాలంటూ గురువారం ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, నర్సపట్నం, కొయ్యూరు మండలాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. కాగా శుక్రవారం కూడా ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. స్కూల్ బస్సు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. నల్లజర్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా తూర్పుచోడవరానికి చెందిన దాసరి వెంకట సత్యనారాయణ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతను చిన్నాయగూడెంలో నివాసం ఉంటున్నారు. గురువారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా అచ్చన్నపాలెం వద్ద ఓ స్కూల్కు చెందిన బస్సు ఢీకొంది. సత్యనారాయణ ఎడమ కాలిపై నుంచి బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జయ్యింది. హైవే అంబులెన్స్లో ఆయనను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కె.గంగవరంలో పచ్చని చీర కట్టుకున్న పంట పొలం● పచ్చదనం పల్లెవించె.. పచ్చదనం పల్లవించింది.. పల్లె పచ్చని చీర కట్టుకుంది.. చూసిన ప్రతి మది పులకించింది.. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతుండడంలో నల్లగా కనిపించే పంట పొలాలు పచ్చ రంగుతో సింగారించుకున్నాయి. ఈ చిత్రం రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం గ్రామంలో కనిపించింది. ఈ పంట పొలాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేశాయి. – కె.గంగవరం కోలంకలో వ్యక్తి అదృశ్యంకాజులూరు: కోలంకకు చెందిన పినిపే ప్రసాద్ (38) వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు అతని కుమారుడు సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ప్రసాద్ భార్య కువైట్కు ఉపాధి నిమిత్తం వెళ్లింది. దీంతో అతను రోజూ పొలమూరుపాడులో అత్తవారింటికి వెళ్లి మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసి తిరిగి కోలంక వస్తుండేవాడు. ఈ నెల 15న సాయంత్రం పొలమూరుపాడులో భోజనం చేసి వెళ్లిన ప్రసాద్ తిరిగి కనిపించ లేదు. బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబీకులు అనుకున్నారు. వారం గడిచినా రాకపోవడంతో గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబరు 96189 06535, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ నంబర్ 0884 2335233కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.ట్యాంకర్ను లాగేందుకు అష్టకష్టాలుతొండంగి: మండలంలోని పీబీసీ కాలువకు అనుసంధానంగా పంట కాలువలో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడిన నేపథ్యంలో కాలువ నుంచి దానిని వెలికి తీసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సుమారు 60 టన్నుల వరకూ ఉండే ట్యాంకర్ను తీసేందుకు రెండు రోజులుగా జేసీబీలు వంటివి తీసుకొచ్చినప్పటికీ బయటకు తీసే వీలులేక వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోల్తా పడిన లారీని వెలికి తీసే పనులు మూడో రోజూ కూడా కొనసాగనున్నాయి. ట్యాంకర్లో ఉన్న స్పిరిట్ను కాలువలో వదిలి ఖాళీ ట్యాంకర్ను బయటకు తీస్తారా, లేక స్పిరిట్ వల్ల పంట కాలువ, పక్కనే ఉన్న పీబీసీ కాలువ నీరు కలుషితంగా కాకుండా ఏవిధమైన చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. వివాహిత అదృశ్యంపై కేసు నమోదురంగంపేట: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రంగంపేట గ్రామానికి చెందిన జుజ్జవరపు వెంకటరమణ పెద్ద కుమార్తె తేజకు, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన సూర్యకు 2025లో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న తేజ రంగంపేటలో తండ్రి ఇంటికి వచ్చింది. 20వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 94409 04854, 94407 96538 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
క్రమబద్ధకం
సాక్షి, అమలాపురం: లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు గడువు దగ్గర పడింది. జిల్లాలోని పట్టణ, గ్రామాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది. జిల్లా యంత్రాంగం ప్రచారం కూడా కల్పించలేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారికి, ఇళ్లు నిర్మించుకున్నవారు కోల్పోతున్నారు. రెండు రోజులే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ గడువు మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు ముగింపు గడువును పెంచినా జిల్లాలో అనుకున్న స్థాయిలో క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందలేదు. కోనసీమ జిల్లా మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉంది. అత్యధికంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అముడా)లో ఉంది. కోనసీమ జిల్లాలోని 14 మండలాల్లో 231 గ్రామాలు అముడా పరిధిలో ఉన్నాయి. గుర్తించిన వాటికన్నా ఎక్కువే.. కొత్తపేట నియోకవర్గం పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం మండలం, కె.గంగవరం మండలాలు కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అఽథారిటీ, రాజమహేంద్రవరం అర్బన్ డవలప్మెంట్ (రుడా) పరిధిలోకి వస్తాయి. వీటిలో అనధికార లేఅవుట్లు సుమారు 220 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా వాటి సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా. ఒక్క అముడా పరిధిలోనే అధికారులు 150 వరకు అనధికార లేఅవుట్లను గుర్తించారు. ఎల్ఆర్ఎస్తో క్రమబద్ధీకరణ కోనసీమ జిల్లాలోని అముడా, రుడా పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకరించింది. 2025 జూన్ 30వ తేదీ కన్నా ముందు వేసిన అనధికార లేఅవుట్లలో ప్లాట్లు, పట్టణాలలో అనధికారికంగా నిర్మించిన ఇళ్లు, ఇతర భవాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఇందుకు తొలుత గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ గడువు విధించగా, తరువాత అక్టోబరు 25వ తేదీ వరకు పెంచింది. తాజాగా ఈనెల 23వ తేదీ తుది గడువుగా తేల్చింది. భూమి విలువలో.. క్రమబద్ధీకరణకు భూమి విలువలో 14 శాతం చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే తొలుత విధించిన గడువులో దరఖాస్తు చేసుకున్నవారికి దీనిలో 50 శాతం రాయితీ కల్పించింది. అంటే కేవలం ఏడు శాతం, అలాగే అపరాధ రుసుములో పది శాతం రాయితీ కల్పించారు. ఆ తరువాత నుంచి నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకుంటే భూమి విలువలో 14 శాతం క్రమబద్ధీకరణకు, ఆపై అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంది. అపరాధ రుసుము 30 శాతం వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నత్తను తలపిస్తూ.. ఎల్ఆర్ఎస్ గడువును మూడుసార్లు పొడిగించినా ప్రభుత్వం ఆశించిన ఫలితం దక్కడం లేదు. జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు కొత్తపేట, రావులపాలెం, తాటిపాక, రాజోలు, మలికిపురం, అంబాజీపేట, మురమళ్ల, ముక్తేశ్వరం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు వంటి మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీల్లో కూడా ప్రధాన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను ఆనుకుని పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. రెవెన్యూ శాఖకు రూ.లక్షలు చెల్లించి కేవలం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పేరుతో అనుమతి తీసుకుని, టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ లేఅవుట్లలోనే డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ సర్వీసు లైన్లు వేయడం గమనార్హం. కొన్నిచోట్ల ఇలా వేసిన అనధికార లే అవుట్లలో భవనాల నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. ఆదాయానికి గండి అముడా, రుడాతో సంబంధం లేకుండా అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో 300 గజాల లోపు ఉన్న స్థలాలకు మున్సిపాలిటీలు అనుమతి ఇచ్చే అవకాశముంది. అమలాపురం మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 221 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రామచంద్రపురం మున్సిపాలిటీకి 192 దరఖాస్తులు, ముమ్మిడివరం నగర పంచాయతీలో 79 అనధికార లే అవుట్లు ఉండగా, 129 దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేస్తే ప్రభుత్వానికి ఎంత లేదన్నా రూ.20 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. అయితే దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, జిల్లా యంత్రాంగం పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతోంది.ఫ అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు స్పందన కరవు ఫ ఈ నెల 23తో ముగుస్తున్న గడువు ఫ ప్రచారం చేయని యంత్రాంగం ఫ ప్రజలకు అవగాహన లేమి ఫ ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు ఫ ప్రభుత్వ ఆదాయానికి గండి అనధికార లేఅవుట్లు అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా జిల్లాలో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. ఒక్క అముడా పరిధిలోనే సుమారు 150 వరకు అనధికార లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ఒక్కొక్క లేఅవుట్లో కనీసం పది నుంచి 80 ప్లాట్లు ఉంటున్నాయి. ఇవి కాకుండా ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మెట్ట, మాగాణీ భూముల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కానీ ఇంత వరకు 125 లేఅవుట్లలో వ్యక్తిగతంగా 675 మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న మొత్తం అనధికార లే అవుట్లలో ఇది పావుశాతం కూడా ఉండదని అధికారులే చెబుతున్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలకు ముక్కామల బృందం
అంబాజీపేట: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని ముక్కామల గ్రామానికి పసుపులేటి నాగబాబు బృందం మరోసారి దక్కించుకుంది. నాదస్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లతో కూడిన 20 మంది సభ్యుల బృందం పసుపులేటి కుమార్ సారథ్యంలో ఈ నెల 18వ తేదీన ఢిల్లీ చేరుకుని రిహార్సల్స్లో పాల్గొంటోందని ముక్కామల కంచి కామకోటి నాదస్వర పాఠశాల నిర్వాహకులు నాగబాబు బుధవారం తెలిపారు. వరసగా మూడేళ్ల నుంచి నాగబాబు బృందం అరుదైన అవకాశం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు నాలుగోసారి మరో అవకాశం లభించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 220 మంది కళాకారులతో నిర్వహించే హెరాల్డింగ్ ప్రోగ్రామ్లో ఏపీ నుంచి ముక్కామలకు చెందిన కళాకారులకు మాత్రమే ఈ అవకా శం దక్కడం విశేషం. భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సంగీత నాటకఅ కాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపుఅమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు బుధవారం ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులోని 4.5 కిలోల కణితిని తొలగించారు. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇన్ని కిలోల కణితి తొలగించడం ఇదే తొలిసారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన 50 ఏళ్ల కడలి సత్యవతి కొద్ది రోజుల కిందట కడుపు నొప్పితో బాధ పడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరిభాషలో ఆమె ఓవరియన్ సిస్టిక్టమీతో బాధతో పడుతోంది. ఆస్పత్రి వైద్యులు ఆమెకు ఓవరియన్ సిస్టిక్టమీ శస్త్ర చికిత్స చేసి కణితి తొలగించారు. బి.వీరభద్రుడు, జె.మౌనిక, మధుకర్, వై.సుధీర్ కుమార్తో కూడిన వైద్య బృందం, వైద్య సిబ్బంది విజయవంతంగా ఈ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ వీరభద్రుడు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావు, ఆర్ఎంవో డాక్టర్ కె.అనూష అభినందించారు. కవి బాలార్జునకు ‘అక్షర ప్రవీణ’ పురస్కారం అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవి, రచయిత సత్యనారాయణ బాలార్జున మాకేకు అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం లభించింది. శ్రీశ్రీ కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ కొండా నరసింహారావు చేతుల మీదుగా ప్రదానం చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇళ్లు, పొలాలు కోల్పోతున్నామని వినతి అమలాపురం రూరల్: జాతీయ రహదారి 216 ఈ అలైన్మెంట్ను మార్పు చేయాలని కోరు తూ ఇందుపల్లి, నడిపూడి, పేరూరు, బండారు లంక గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేశారు. దీని నిర్మాణం కారణంగా ఇందుపల్లిలో చాలా ఇళ్లు, పొలాలను కోల్పోతున్నామని వాపోయారు. ఈ మేరకు డీఆర్ఓ కె.మాధవికి వినతి అందించారు. అలాగే జాయింట్ కలెక్టర్కు కూడా వినతి పత్రం ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగా అభ్యంతరాలు తెలుపుతూ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. 2021లో ఇచ్చిన ఎలైన్మెంట్ ప్రకారమే హైవే నిర్మాణం జరగాలని కోరారు. -
వైభవంగా మహా మంగళ పూర్ణాహుతి
రామచంద్రపురం రూరల్: మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కొలువైన ద్రాక్షారామ క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 21 వరకు ఆధ్మాత్మిక వైభవం వెల్లివిరిసింది. తెనాలికి చెందిన పాలెపు రవికుమార్, తురగా నాగరాజుశర్మ, యల్లాప్రగడ పవన్కుమార్ శర్మ, తురగా సాయి భరధ్వాజ్ శర్మ, కంచిబొట్ల ఆత్రేయ శర్మ, మణికంఠ శర్మ, యల్లాప్రగడ గోపాలకృష్ణ భరద్వాజ శర్మల పర్యవేక్షణలో అష్టాదశ శక్తి పీఠాల్లో గతేడాది జనవరి 4 నుంచి ఈ ఏడాది జనవరి 19 వరకు చక్రార్చన, శివ, చండీహోమాలు, సువాసినీలచే కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు నిర్వహించారు. ఆఖరి అంకంగా 12వ శక్తి పీఠమైన మాణిక్యాంబ సన్నిధిలో ప్రత్యేక పర్ణశాల నిర్మించి మూడు రోజుల పాటు మహా మంగళ పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. పర్ణశాలలో ప్రధాన హోమగుండం, చుట్టూ 54 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. చివరి రోజు 69 మంది వేద పండితులు 108 మంది దంపతులతో చండీ హోమాలు నిర్వహించారు. అనంతరం సుమారు మూడువేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ), వైశ్యకుల గురువు వామనాశ్రమ మహాస్వామీజీ, కాళీవనాశ్రమ పీఠాధిపతి చంద్రకాళీ ప్రసాద మాతాజీ, గరిమెళ్ల వెంకట రమణ శాస్త్రి పాల్గొన్నారు. -
జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు సుష్మ
కాజులూరు: జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్కు చెందిన బుడితి సుష్మ ఎంపికై ంది. ఈ మేరకు బుధవారం పాఠశాలలో హెచ్ఎం ఎస్ఎస్బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ జి.సునీల్ కుమార్ మాట్లాడుతూ డిసెంబరు 11 నుంచి 13 వరకూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఎస్జీఎఫ్ అండర్ – 17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. వీటిలో తమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని బుడితి సుష్మ చక్కని ప్రతిభ కనపరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఛత్తీస్గఢ్లో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ పరిగే జాతీయ స్థాయి పోటీలలో సుష్మ రాష్ట్ర టీమ్ తరఫున పోటీపడుతుందన్నారు. ఆ జట్టుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తమ పాఠశాలకు చెందిన సుష్మ ఒక్కరే ఎంపిక కావడం గర్వకారణమన్నారు. -
అంతర్వేది నరసింహస్వామికి ఎస్పీ పూజలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని బుధవారం ఎస్పీ రాహుల్ మీనా సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా ఆయనకు ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎస్పీకి స్వామివారి చిత్రపటాన్ని ఆలయ సూపరింటెండెంట్ పి.విజయ సారథి అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబురాజు పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్వామివారి కల్యాణ ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. దేవస్థానం ఆధ్వర్యంలో లోపల, వెలుపల ఏర్పాటు చేస్తున్న క్యూలను పరిశీలించారు. కల్యాణ వేదిక వద్ద వీఐపీలు, సాధారణ భక్తుల గ్యాలరీల ఏర్పాటుపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో సమీక్షించారు. స్వామివారి కల్యాణాన్ని సాధారణ భక్తులు సంతృప్తికరంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని డీఎస్పీకి సూచించారు. వీటితో పాటు రథయాత్ర, పౌర్ణమి స్నానాలు వద్ద చేపట్టాల్సిన బందోబస్తుపై డీఎస్పీతో చర్చించారు. ఆయన వెంట రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్, ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు ఉన్నారు. -
పండగ ముసుగులో ఎమ్మెల్యే అక్రమ దందా
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం తీర ప్రాంతంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అక్రమ వసూళ్లతో రూ.కోట్లలో అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. గత రెండేళ్లలో సంక్రాంతి సంబరాల ముసుగులో చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ప్రీతి రెసిడెన్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి, అక్రమ వసూళ్లపై ధ్వజమెత్తారు. గుండాటలు, కోడి పందేల బరులు ఏర్పాటు చేయించి అనేక మంది బ్రోకర్ల ద్వారా ఎమ్మెల్యే అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులు, షాపింగ్ మాల్స్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల నుంచి సంక్రాంతి ఉత్సవాల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. రూ.10 కోట్ల మేర సీఎస్ఆర్ నిధులను సంక్రాంతి సంబరాలకు తెచ్చానని చెబుతున్న ఎమ్మెల్యే.. చేసిన ఖర్చులకు లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎస్.యానాం సంక్రాంతి సంబరాల వేదికపై టీవీ 9 విలేకరి అగ్ని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారంటే.. అక్కడ సౌకర్యాలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. అలాగే 18 ఏళ్లుగా అమలాపురంలో ఇద్దరు పంచాయితీరాజ్ డీఈఈలు బదిలీలు అనేవి లేకుండా ఇక్కడే తిష్టవేసి రూ.లక్షల అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆ అధికారుల వివరాలను, వారు చేస్తున్న అవినీతిని మరో రెండు రోజుల్లో తాను వివరిస్తానని చెప్పారు. అమలాపురంలో డివిజన్ స్థాయి అధికారి భర్త కాంట్రాక్టర్గా మారి పనులు చేయిస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా దిగజార్చారో తేటతెల్లమవుతోందన్నారు. సమావేశఽంలో నాయకులు పెదపూడి బాబూరావు, జొన్నాడ బుజ్జి, మల్లవరపు శ్రీను, బడుగు శ్రీను, నేదునూరి వివేకానంద, ఉందుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫ రూ.కోట్లలో అవినీతికి పాల్పడిన ఆనందరావు ఫ సంక్రాంతి సంబరాల పేరుతో భారీగా వసూళ్లు ఫ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ధ్వజం -
వాడపల్లి ఆలయానికి రూ.2.06 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.2,05,51,004 వచ్చింది. ఈ విషయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 34 రోజుల అనంతరం బుధవారం దేవదాయశాఖ అధికారులు, పాలకమండలి పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో ఆదాయాన్ని లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి హుండీల ద్వారా రూ.1,46,07,768, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.59,43,236తో కలిపి రూ.2.06 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 26 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రాములు, యూఎస్ఏ, కువైట్, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఓమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్, థాయ్లాండ్, టర్నీ, నైజీరియా, ఘనా, యమెన్ దేశాల కరెన్సీ నోట్లు 87 వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ద్రాక్షారామ దేవస్థానం ఈఓ ఏవీ దుర్గాభవాని, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్ –3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, పలువురు పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, సేవకులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
అష్టమి తిథినే భీష్ముడి నిర్యాణం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మాఘశుద్ధ ఏకాదశి తిథిన భీష్ముడు నిర్యాణం చెందలేదు, ఆయన నిర్యాణం చెందినది అష్టమి తిథినాడేనని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం ఆయన వేదవ్యాస ప్రవచనం కొనసాగిస్తూ, లోకంలో ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్యాణం చెందిన తొలి ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం భావించడంలో తప్పులేదని ఆయన అన్నారు. భారత, భాగవతాల్లో కొన్ని స్వల్పవైరుద్ధ్యాలు ఉన్నాయి, వీటిని అనుసరించి కొందరు భాగవతాన్ని వ్యాసుడు రాయలేదనడం తొందరపాటు నిర్ణయం కాగలదు. భారత భాగవతాలను రెంటినీ అందించినవాడే వ్యాసుడని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాగర్భస్థ శిశువును కృష్ణుడు రక్షించాడని భాగవతం చెబుతోంది, భారతం పుట్టిన మృతశిశువును కృష్ణుడు కాపాడాడని చెబుతోంది. ఇక్కడ మనం సమన్వయం చేసుకోవడం అవసరం. గర్భస్థ శిశువును కాపాడకపోతే, శిశువు బయటకు వచ్చి ఉండేవాడు కాదని సామవేదం అన్నారు. తాను రాజమహేంద్రవరంలో ముందు వ్యాసభాగవతాన్ని, తరువాత వాల్మీకి రామాయణాన్ని, ప్రస్తుతం వ్యాసభారతాన్ని ప్రవచనం చేయడం దైవప్రేరణ వలనేనన్నారు. ధృతరాష్ట్రుడు వనవాస దీక్షకు బయలు దేరినప్పుడు, వ్యాసుని అనుమతితో ధర్మరాజు అంగీకరిస్తాడు. మరణించిన భీష్మద్రోణ కర్ణాదులకు, పుత్రులకు ఇతర వీరులకు శ్రాద్ధాది కర్మలు చేయడానికి ధనం కావాలని ధృతరాష్ట్రుడు విదురుని ద్వారా ధర్మరాజుకు సందేశం పంపుతాడు. నా ధనమంతా ఆయనదే, యథేచ్ఛగా వినియోగించుకోవచ్చునని ధర్మరాజు, అర్జునుడు ప్రత్యుత్తరం పంపుతాడు. ‘మనం గతంలో ఎవరి ముందు ఐదు ఊళ్లయినా ఇమ్మని యాచన చేసేమో, వారే నేడు మన ముందు యాచన చేస్తున్నారు. సమస్త భూమండలాన్ని ఏలిన వారు వనవాసానికి వెడుతున్నారు. కాలం బలీయమైనదని అర్జునుడు వ్యాఖ్యానిస్తాడు. అర్జునుని సాంత్వన వచనాలతో భీముడు వారితో ఏకీభవిస్తాడు. గాంధారీ ధృతరాష్ట్రులతో కుంతి, విదురుడు, సంజయుడు కూడా వనవాసానికి బయలుదేరారు. అడవులకు వెళుతున్న వారిని చూసి భీముడు కూడా కన్నీరు పెట్టుకున్నాడని సామవేదం అన్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చేయి వేయగా, గాంధారి కుంతి భుజం మీద చేయి వేసి అడవులకు బయలు దేరారు. ద్రౌపది, శిశువుతో ఉత్తర, మరి కొందరు వారితో పాటు కొంతదూరం వెళ్లారని సామవేదం అన్నారు. ద్యూతంలో ఓడిపోయిన పాండవులు వనవాసానికి వెళుతుంటే ప్రజలు ఎంతటి దుఃఖం అనుభవించారో.. ధృతరాష్ట్రాదులు వెడుతుంటే అంతటి దుఃఖాన్ని అనుభవించినట్టు వ్యాసుడు పేర్కొన్నాడని సామవేదం అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు శుభారంభం పలికారు. -
సెంట్రింగ్ కూలి ఒకరి మృతి
ముగ్గురికి గాయాలు ధవళేశ్వరం: పంప్ హౌస్ రెండో స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఇందులో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి పక్కన మురుగునీరు గోదావరిలోకి పంపు చేసేందుకు పంపు హౌస్ను నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి శ్లాబ్ పూర్తయ్యింది. రెండో శ్లాబ్కు బుధవారం మధ్యాహ్నం కాంక్రీట్ వేస్తుండగా అది కూలిపోయింది. దీంతో ధవళేశ్వరం సుబ్బాయమ్మపేటకు చెందిన సెంట్రింగ్ మేస్త్రి కేతమళ్ల వెంకటేష్ (50)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేష్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వం అసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. వీరిలో సుబ్బాయమ్మపేటకు చెందిన దొడ్డి బాలకిశోర్, వడ్డెర కాలనీకి చెందిన రామాటి రాజు, వల్లెపు సింహాద్రి ఉన్నారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో సెంట్రింగ్ కింద తక్కువ మంది కూలీలు ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. సుబ్బాయమ్మపేటలో విషాదఛాయలు సంఘటన జరిగిన సమీపంలో మృతుడు కేతమళ్ల వెంకటేష్ నివాసం ఉంటున్నాడు. పనికి వెళ్లిన అతడు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన దొడ్డి బాలకిశోర్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. -
నాణేల సేకరణలో మరో రికార్డ్
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ మరో రికార్డ్ను సొంతం చేసుకుని వరుసగా ఐదో సారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. వివిధ సందర్భాల్లో విడుదలైన రూ.75 నాణేల సేకరణకు ఆయన పేరు ఆ పుస్తకంలో మరోసారి రికార్డయ్యింది. గత నాలుగేళ్లలో ఈ రికార్డులను అందుకోవడం వరుసగా ఇది ఐదో సారి. తపాలా బిళ్లల సేకరణలో రెండు సార్లు, నాణేల సేకరణలో ఒకసారి, కరెన్సీ నోట్ల సేకరణలో మరోసారి, తాజాగా నాణేల సేకరణలో ఐదోసారి రికార్డులకెక్కారు. భావి తరాలకు మన దేశ చరిత్రను, సంస్కృతిని ఈ నాణేలు, తపాలా బిళ్లలు, కరెన్సీ నోట్ల ద్వారా తెలియజేయడమే తన లక్ష్యమని కృష్ణ కామేశ్వర్ తెలిపారు. -
ఆవు అడ్డొచ్చి వరుసగా బస్సులు ఢీ
రాజమహేంద్రవరం రూరల్: దివాన్చెరువు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆవు అడ్డు రావడంతో ఒకదానికి ఒకటి మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులలో విహారయాత్రకు వెళ్లి తిరుగు పయనమైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యార్థులతో కలిపి 40 మందికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం వారు స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దిండి గ్రామానికి చెందిన పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9, 10, ఇంటర్ చదువుతున్న 56 మంది బాలికలు, 53 మంది బాలురు, పది మంది ఉపాధ్యాయులు రెండు బస్సులలో ఈ నెల 17వ తేదీన విహారయాత్రకు బయలుదేరారు. అరకు, విశాఖబీచ్ తదితర ప్రాంతాలను సందర్శించి మంగళవారం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో బాలురతో ఉన్న బస్సు దివాన్చెరువుకు వచ్చేసరికి ఆవు అడ్డురావడంతో సడన్బ్రేక్ వేశారు. దీంతో ఆ వెనుకనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సు దానిని కొట్టింది. ఈ బస్సు వెనుకే బాలికలతో వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రిన్సిపాల్తో పాటు 37 మంది విద్యార్థినులకు గాయాలు కాగా, బాలుర బస్సు నడుపుతున్న డ్రైవర్తో పాటు ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని మూడు 108 అంబులెన్స్లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. గాయపడిన విద్యార్థులకు ప్రాధమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసి పంపించారు. సంఘటన స్థలాన్ని తూర్పు మండల డీఎస్పీ బి.విద్య, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్, ఎస్సై మురళీమోహన్ పరిశీలించారు. మూడు బస్సులను ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పక్కన పెట్టించారు. ఆవు అడ్డురావడంతో సడన్బ్రేకు వేయగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో తనకు, ఒక విద్యార్థికి గాయాలయ్యాయని బస్సు డ్రైవర్ ఎండి షకీర్ ఫిర్యాదు చేశాడు. ముందు బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తమ బస్సు ఢీకొందనని, వెనుక మరో బస్సు ఢీకొందని, దీంతో ఆ బస్సులో ఉన్న కొందరు బస్సు అద్దాలు పగులగొట్టడంతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు బస్సుడ్రైవర్ అంబరీష్ మరో ఫిర్యాదు చేశారు. తమ బస్సు డ్రైవర్ నిబంధనలు పాటించకుండా 50 మీటర్లు డిస్టెన్స్ పాటించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే బాలికలు గాయపడ్డారని స్కూలు ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మూడు ఫిర్యాదుల మేరకు ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివాన్చెరువులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం రెండు బస్సులలో ప్రయాణిస్తున్న 40 మంది తెలంగాణ విద్యార్థులకు గాయాలు మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు -
కారు అద్దెకు తీసుకుని.. ఆపై అమ్మేసి దౌర్జన్యం
బాధితులను హింసించి, కిడ్నాప్కు యత్నం సాక్షి టాస్క్ఫోర్స్: అవసరం నిమిత్తం కార్లు అద్దెకు తీసుకుని.. ఆనక అమ్మేసి సొమ్ము చేసుకుని.. అదేమని అడిగిన పాపానికి యజమాని బృందాన్ని చావబాది కిడ్నాప్కు యత్నించిన ఓ ఘరానా ముఠా చేసిన అకృత్యం తాజాగా చర్చనీయాంశమైంది. మండలంలోని తోకాడలో జరిగిన ఘటనకు సంబంధించి హైదరాబాద్కు చెందిన ఎత్తరి ఈశ్వర్ రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్లోని ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న ఈశ్వర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అతని మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలతో కలిసి సొంతకార్లను అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో హరీష్ అనే వ్యక్తికి డిసెంబరు 3న సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునేలా తన మిత్రుడు జీవన్కు చెందిన మహీంద్ర థార్ కారును అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో హరీష్ కొంతకాలంగా అద్దె చెల్లించకపోగా ఆచూకీ తెలియకుండా పోయాడు. ఆ కారుకు అమర్చిన జీపీఎస్ను సైతం డిసెంబర్ 17 నుంచి తొలగించడంతో కారు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఈశ్వర్ బృందానికి ఎదురైంది. ఎట్టకేలకు జీపీఎస్ ఆచూకీ తెలియడంతో దానిని అనుసరించి వాహనం రాజానగరం మండలం, తోకాడలో ఉన్నట్టుగా గుర్తించారు. హరీష్ అనపర్తికి చెందిన వ్యక్తికి కారును విక్రయించినట్టు వారు తెలుసుకున్నారు. సోమవారం మిత్రులు జీవన్, కుషాల్, జయేంద్రలు ఆ ప్రాంతానికి వెళ్లి తమ వద్ద ఉన్న మారు తాళంతో కారును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో కారును విక్రయించిన వ్యక్తి దానిని కొనుక్కున్న సబ్బెళ్ల మురళీకృష్ణారెడ్డికి ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అతడు మరికొందరితో ఈశ్వర్ బృందంపై దౌర్జన్యానికి పాల్పడి కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈశ్వర్ బృందంపై దాడి చేసిన వారు చాలామంది ఉండగా కేవలం ఆరుగురి పైనే కేసు నమోదు చేయడం, పోలీసులు సైతం ముక్తసరి సమాచారం ఇవ్వడంతో వారిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాకు న్యాయం చేయండి బతుకుదెరువు కోసం సొంత కార్లను అద్దెకు నడుపుతున్న తమపై ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని బాధితులు వాపోతున్నారు. కారును తమకు అప్పగించి, న్యాయం చేయాలని, దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈశ్వర్ బృందం కోరుతోంది. -
మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ
గ్యాస్ స్టౌ మరమ్మతు కోసమని వచ్చి చోరీ కరప: ఇంట్లోని మగవారు బయటకు వెళ్లడాన్ని గమనించిన ఒక దొంగ గ్యాస్ స్టవ్ రిపేర్ కోసమని ఇంట్లోకి వెళ్లి మంచంపై ఉన్న ఒక మహిళ మెడలోని 8 కాసుల పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారైన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటస్వామి, అతని కుమారుడు శ్రీనుతో కలసి కాకినాడకు ఆసుపత్రి పనిమీద వెళ్లారు. ఇదిగమనించిన దొంగలు వారింటికి వెళ్లి ఒకరు బయట ఉండి కాపలా కాయగా మరొకడు ఇంట్లోకి చొరబడ్డాడు. అనారోగ్యంతో మంచంపై పడుకుని ఉన్న వెంకటస్వామి భార్య సత్యవతి అతనిని గమనించి ఎవరని ప్రశ్నించగా వెంకటస్వామిగారు గ్యాస్స్టవ్ రిపేర్ చేయమని పంపారని చెప్పి కొంత సేపు అక్కడ తచ్చాడి అంతలోనే ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన తండ్రీ, కొడుకులకు సత్యవతి జరిగిన విషయం తెలిపింది. దీంతో బాధితులు పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఎస్ఐ టి.సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన దొంగతనం వివరాలు అడిగి తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలిన ఆర్టీసీ బస్సు టైరు ● మహిళకు తీవ్ర గాయాలు ● ఇద్దరికి స్వల్పగాయాలు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో బస్సులోని ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయలయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చింది. స్థానిక వైజంక్షన్కు వచ్చేసరికి బస్సు వెనుక టైరు పేలింది. దీంతో టైరు పైభాగంలో కూర్చున్న పెద్దిళ్లపేటకు చెందిన మంగాలక్ష్మికి ఐరన్రేకు పైకిలేచి ఆమె కాళ్ల వేళ్లకు తగలడంతో పాటు అద్దం చేతిని తీవ్రంగా గాయపరిచింది. అలాగే బస్సు సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆనూరు గ్రామానికి వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగాలక్ష్మిని అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి సామర్లకోట: స్థానిక పెద్దాపురం ఏడీబీ రోడ్డులో అపర్ణ టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక మహిళ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్సై వి.మౌనిక కథనం ప్రకారం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన పోతురాజు సుమలత (50) అపర్ణ ప్యాక్టరీలో పని చేస్తూ బుధవారం విధులు ముగించుకుని బంధువు మోటారు సైకిల్పై వెళుతున్న సమయంలో జారి కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమెను ఢీకొని ఆమె పై నుంచి వెళ్లిపోవడంతో శరీరం నుజ్జు నుజ్జు అయింది. లారీ ఆగకుండా వెళ్లి పోవడంతో ఆ ప్రాంత ప్రజలు లారీ నెంబరును గుర్తించి పోలీసులకు తెలిపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే మోబైల్ కానిస్టేబుల్ ఈ ప్రమాదాన్ని గుర్తించి పెద్దాపురం ఎస్సైకు సమాచారం ఇచ్చారు. భార్యను గాయపరచిన కేసులో జైలు ప్రత్తిపాడు: భార్యపై దాడిచేసి గాయపరిచిన భర్తకు ప్రత్తిపాడు జ్యుడీషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్ ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ బి సూర్య అప్పారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాచపల్లిలో 2016 మే 22న కోన సూర్యారావు (సూరిబాబు) మద్యం తాగి, తన భార్య రమణమ్మపై కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. రమణమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు నమోదు చేసి, చార్జిషీటు దాఖలు చేశారు. ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఏపీపీలు పి.రవీంద్ర మోహన్, కేఎస్ఎస్ లక్ష్మీదేవి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. నేరారోపణ రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చినట్టు ప్రత్తిసాడు సీఐ తెలిపారు. -
జెడ్పీటీసీలకు ప్రొటోకాల్ ఏదీ?
● చంద్రబాబు సర్కార్లో వారికి విలువ శూన్యం ● రహదారులు అధ్వానంగా ఉన్నా చర్యలు లేవు ● వాడీవేడిగా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జెడ్పీటీసీలకు ప్రోటోకాల్ పాటించడం లేదని సభ్యులు ఎంపీడీఓల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు పద్దు ప్రవేశపెట్టారు. జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించరా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీడీఓలు జెడ్పీటీసీలను ఆహ్వానించడం లేదని సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు, గొల్లపల్లి రత్నం, ఒమ్మి బిందుమాధవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా అమలయ్యేదని, ఇప్పుడు తమను గౌరవించడం లేదని వారు ధ్వజమెత్తారు. దీనిపై అధికారులను నిలదీసినా సరైన సమాధానం రావడం లేదన్నారు. దీనిపై జెడ్పీ చైర్పర్సన్ స్పందిస్తూ ప్రొటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంతంలో మూడు నియోజకవర్గాలు, నాలుగు మండలాల ప్రజలకు ఉపయుక్తంగా ఉన్న సత్యసాయి తాగునీటి పథకాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీటీసీలు మట్టా శైలజ మాట్లాడుతూ తాము జెడ్పీటీసీలుగా ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ప్రజలకు ఏ మేలూ చేయలేకపోయామన్నారు. మంజూరైన అభివృద్ధి పనులకు నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 45 కోట్ల వరకు పనులు కేటాయించి, 15 కోట్లు పనులను తొలగించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేక ఇబ్బందులు గత ఖరీప్లోను, ప్రస్తుత రబీలోను రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు సమావేశంలో మండిపడ్డారు. పి.గన్నవరంలో రైతులకు యూరియా సక్రమంగా అందడం లేదని స్థానిక నాయకులు కూపన్లు ఇచ్చిన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని వాపోయారు. పిఠాపురం మండలంలో యూరియా సక్రమంగా అందడం లేదని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు నిలదీశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా అర్హులైన రైతులందరికీ అందడం లేదని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పంటనష్టం సంభవిస్తే నెలలోపు రైతు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసేవారన్నారు. గత ఖరీప్లో పంట నష్టం సంభవించినా ఎటువంటి పరిహారం ఇంకా అందలేని జేడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. తాము పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని జేడీఏ ఎన్.విజయ్కుమార్ తెలిపారు. రహదారులు అధ్వానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రహదారులపై ప్రయాణం చాలా కష్టంగా ఉందని, అధికారులు ఎప్పుడు అడిగినా రోడ్డు నిర్మిస్తామని చెప్పడం తప్ప పనులు జరగడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రహదారుల నిర్మాణం ప్రారంభిస్తామని రోడ్లు భవనాలు శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. జెడ్పీ బడ్జెట్ ఆమోదం 2025–26 సంవత్సరానికి రూ.43 లక్షల మిగులుతో రూ.1,019 కోట్ల సవరణ బడ్జెట్ను, 2026–27 సంవత్సరానికి రూ.45 లక్షల మిగులుతో రూ.2712.65 కోట్ల అంచనా బడ్జెట్ను ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ సర్వ సభ్య సమావేశం ఆమోదించింది. 2025–26 సవరణ బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.249 లక్షలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.99 లక్షలు, సీ్త్ర శిశు సంక్షేమానికి రూ.249 లక్షలు, తాగు నీటి సరఫరాకు రూ.199 లక్షలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమానికి రూ.165 లక్షలు, అభివృద్ధికి రూ.381 లక్షల నిధులు కేటాయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, డీఆర్వో వెంకట్రావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులుజేడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడుతున్న మహిళా జెడ్పీటీసీ సభ్యులు -
కల్వర్టులోనికి దూసుకెళ్లిన కారు
ఇద్దరికి తీవ్ర గాయాలు అడ్డతీగల: అడ్డతీగల మండలం గౌరయ్యపేట 516ఇ జాతీయ రహదారి టోల్గేట్ వద్ద బుధవారం కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కొయ్యూరు మండలం నడింపాలేనికి చెందిన పందల శివకు చేయి విరిగిపోగా పాలపర్తి సత్యనారాయణ అనే వ్యక్తికి నడుం వద్ద తీవ్రగాయమైంది. అడ్డతీగల నుంచి వారి స్వగ్రామం నడింపాలేనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుం ది. ఈ ఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ప్రైవేటు వాహనంలో అడ్డతీగల సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి వైద్యులు వారిని రాజమహేమద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమండ్రిలో మూడు బస్సులు ఢీ..
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డువచ్చిన గేదెను తప్పించబోయి వెనుక వచ్చి మూడు బస్సులు ఢీకొన్నాయి. బస్సులో తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్కి చెందిన 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ నెల 17వ తేదీన అరకు వెళ్ళి స్వగ్రామం నల్గొండ జిల్లా దిండికి తిరిగి వస్తుండగా.. ఘటన జరిగింది. -
దర్శకుడు ఈవీవీ తండ్రి వెంకట్రావు మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) ఆయన స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. విషయం తెలియగానే ఈవీవీ కుమారులు, సినీ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ స్వగ్రామానికి చేరుకుని తాతయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కోరుమామిడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట్రావుకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ అనే ముగ్గురు కుమారులు, ముళ్లపూడి మంగాయమ్మ అనే కుమార్తె ఉన్నారు. స్టోరేజ్ టెర్మినల్లో మంటలు కాకినాడ రూరల్: కాకినాడ పోర్టు రోడ్డులోని మహతి స్టోరేజ్ టెర్మినల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్ పైపు నుంచి వచ్చిన మంటలు కలకలం రేపాయి. బ్రాయిలర్ వేడికి పైపు నుంచి మంటలు రావడంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న కోరమాండల్, కాకినాడ శాలిపేటలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే కోరమాండల్కు చెందిన రెండు, శాలిపేట నుంచి అగ్నిమాపక కేంద్రం వాహనం ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మంటలు తక్కువ స్థాయిలో ఉండడంతో వాటిని అదుపు చేశాయి. సమీపంలో స్టోరేజ్ ట్యాంక్లలో కెమికల్స్తో పాటు సమీపంలో కోరమాండల్ ఎరువుల కర్మాగారం, సీపోర్టు ఉండడంతో మంటలతో భయందోళనలు వ్యక్తమయ్యాయి. ఎటువంటి ప్రమాదం జరగలేదని, కేవలం బ్రాయిలర్ పైపు హీట్ వలన మంటలు రావడంతో అదుపు చేశామని శాలిపేట అగ్నిమాపక అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 వేల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. చలిమంటలో పడి వ్యక్తికి గాయాలు రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు గ్రామమైన జి.శరభవరంలో బోడోజు మంగారావు (65) సోమవారం అర్ధరాత్రి చలి మంటలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అలాగే మంటలు పైకి ఎగసి పడటంతో అతడు నివశించే పూరిపాక కూడా కాలిపోయింది. సర్పంచ్ ఆదిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగారావు తన భార్య ముసలమ్మతో పాటు పూరింట్లో జీవిస్తున్నాడు. చలి ఎక్కువగా ఉండటంతో దంపతులు ఇంటి లోపలే మంట వేసుకున్నారు. అయితే భార్య బయటకు వెళ్లిన సమయంలో మంగారావు చలి మంటలో పడిపోయాడు. అతడు వేసుకున్న చొక్కాకు మంట అంటుకోవడంతో వీపు భాగం కాలిపోయింది. ఇరుగుపొరుగువారు అతడిని వెంటనే 108లో జడ్డంగి పీహెచ్సీకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కాకినాడ జీజీహెచ్కు వైద్యులు రిఫర్ చేశారు. డాక్టర్ పావని, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి, 108 స్టాఫ్ మరిణిరాజు, చిట్టిబాబు చికిత్స అందజేశారు. -
రైతులను ముంచేసిన చంద్రబాబు సర్కార్
ఫ ఉచిత పంటల బీమానుఎత్తివేయడం దారుణం ఫ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి మోసం ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబీ ఫ సమావేశంలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి, సూర్యప్రకాశ్ అమలాపురం టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశారని, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ బీమాను ఎత్తివేసి రైతులను మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ధ్వజమెత్తారు. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారని, జగన్ ఇస్తున్న ఉచిత పంటల బీమాతో పాటు రైతులకు అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానాలు చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రూ.7,800 కోట్ల మేర రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా వెచ్చించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా కనీసం దాని గురించి రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైందన్నారు. జగన్ పాలనలో 54 లక్షల మంది రైతులకు బీమా ప్రీమియం చెల్లించారని, అదే కూటమి ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న 18 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రీమియం చెల్లించిందన్నారు. వ్యవసాయంలో 80 శాతం ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటికే రూ.1100 కోట్ల మేర రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ బాకీ పడిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుపై అపనమ్మకం జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేయడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రైతుల పంటలకు బీమా కల్పించేందుకు ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క బీమా సంస్థ ముందుకు రాలేదంటే చంద్రబాబు పాలనపై వారికున్న అపనమ్మకమే కారణమని స్పష్టం చేశారు. సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాశ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
భూ పరిపాలనలో పురోగతి సాధించాలి
అమలాపురం రూరల్: ప్రభుత్వ ప్రాధాన్య అంశాలలో ఒకటైన భూ పరిపాలన నిర్దేశిత అంశాల్లో పురోగతిని సాధించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ క్లినిక్లు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మ్యుటేషన్లు, రీ సర్వే, వెబ్ లాండ్ కొత్త మాడ్యూల్స్ పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలన్నారు. డీఆర్ఓ కె.మాధవి, ఆర్డీవోలు దేవరకొండ అఖిల, పి శ్రీకర్, సర్వే ఏడీ కే. ప్రభాకర్ పాల్గొన్నారు. -
కొత్త పాటకు తాళం!
ఇది చాలా అన్యాయం జాతీయ రహదారి పొడవు 31.60 కిమీలు కాగా, ఇందులో 25 కిమీలు కాలువను ఆనుకుని వస్తోంది. అక్కడ లేని అభ్యంతరం మా ఊరి కాలువను ఆనుకుని నిర్మించమంటే ఎందుకు?. వరదలకు, భారీ వర్షాలకు బ్యాక్ వాటర్ వస్తే ఊరు ముంపులో ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో కొత్తగా జాతీయ రహదారి ఎలా నిర్మిస్తారు? వైఎస్సార్ సీపీ హయాంలో భట్నవిల్లి వద్ద జాతీయ రహదారికి కలపాలని నిర్ణయించారు. దానిని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. – ఆకుల నాగేశ్వరరావు, ఇందుపల్లి రైతు. సాక్షి, అమలాపురం: జాతీయ రహదారి 216–ఈ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వివాదాలు రేపుతోంది. రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఈ రహదారి కోనసీమ జిల్లా అభివృద్ధికి వెన్నెముకగా మారనుంది. ఈ కారణంగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆలైన్మెంట్ను కాదని చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త అలైన్మెంట్ తీసుకురావడంతో ఇళ్లు కోల్పోయినవారు.. రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. 31.60 కిమీల మేర నిర్మాణం అమలాపురం పేరూరు నుంచి రావులపాలెం మండలం రావులపాడు వరకు 216–ఈ హైవే విస్తరణకు అవసరమైన భూమిని గుర్తించి, దానిని సేకరించేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి 8వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది. అమలాపురం పేరూరు వై.జంక్షన్ సమీపంలో 216 జాతీయ రహదారి నుంచి రావులపాలెం వద్ద 216–ఎ జాతీయ రహదారి వరకు సుమారు 31.60 కిమీల 216–ఈ జాతీయ రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. గ్రీన్ ఫీల్డ్ హైవేపైనా వివాదాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. తాజాగా అంచనాలు రూ.630 కోట్లకు పెరిగాయి. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి రావులపాడు నుంచి నడిపూడి లాకుల వరకు పెద్దగా అభ్యంతరాలు లేవు. అక్కడి నుంచి పేరూరు వరకూ చేపట్టే నిర్మాణాలకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ పైనే వివాదాలు నెలకొన్నాయి. భూములు కోల్పోతున్న రైతులు, భవనాల యజమానులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కలెక్టరేట్లో ఫిర్యాదులతోపాటు స్థానిక ఎంపీ గంటి హరీష్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్త అలైన్మెంట్ను పరిశీలించాలని ఎంపీ చెప్పినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఏడాది కాలంగా ఈ వివాదం కొనసాగుతున్నా.. కొత్త అలైన్మెంట్కు ప్రభుత్వం, ఎన్హెచ్ అధికారులు మొగ్గు చూపుతూ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నా... ● గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన మార్చాలని స్థానికులు కోరుతున్నారు. నడిపూడి నుంచి ఈదరపల్లి వంతెన, ఇందుపల్లి వంతెన, వాకలగరువు వంతెన మీదుగా తోట్లపాలెం నుంచి బోడసుకుర్రు వంతెన వద్ద 216కు కలపాలని సూచిస్తున్నారు. ● ఈదరపల్లి ఎంపీడీవో కార్యాలయం పక్క నుంచి ఇందుపల్లి మీదుగా పేరూరు ఎఫ్సీఐ గొడౌన్ మీదుగా ఇప్పుడు అనుకున్న ప్రాంతం వరకు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. ఈదరపల్లి వంతెన వద్ద నుంచి ఇందుపల్లి వంతెన మీదుగా పేరూరు వరకు ఇప్పుడున్న రహదారిని గతంలో జాతీయ రహదారుల సంస్థ తమ అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడున్న రహదారిలో ఆక్రమణలు తొలగించి, జాతీయ రహదారిగా విస్తరిస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. ● ఇందుపల్లి గ్రామం వరద ముంపు ప్రాంతం. 1986లో వచ్చిన వరదలకు గ్రామం ముంపుబారిన పడింది. అప్పటి నుంచి గ్రామం హెడ్వర్ుక్స పరిధిలో ఉంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం క్షేమం కాదని వాదిస్తున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నడిపూడి లాకుల ముందు నుంచి నేరుగా భట్నవల్లి వద్ద 216లో కలపాలని నిర్ణయించారు. దీనివల్ల ఇళ్లు కోల్పోవడం తగ్గడంతోపాటు గ్రీన్ ఫీల్డ్ హై చాలా తక్కువ దూరంగా నిర్మిస్తే సరిపోతుంది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్హెచ్ అధికారులు కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్లు లేవు భూ సేకరణకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అవసరమైన భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉన్నాయి తప్ప రైతులు, ఇళ్లు కోల్పోతున్నవారి పేర్లు పొందు పరచకపోవడం గమనార్హం. ఇందుపల్లితోపాటు పేరూరు నుంచి రావులపాడు వరకు భూములు, ఇళ్లు కోల్పోతున్నవారు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాలు, పంచాయతీల్లో ఎటువంటి నోటీసులు పెట్టలేదు. కనీసం స్థానిక వీఆర్వోలను కలిస్తే తమకు తెలియడం లేదని చెబుతున్నారు. దీనిపై ఇందుపల్లికి చెందిన బాధితులు మంగళవారం సమావేశమై జిల్లా రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి తమ అభ్యంతరాలు తెలపాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు. ఈదరపల్లి– ముక్కామల రోడ్డులో నడిపూడి లాకులు దాటిన తరువాత ఇక్కడ నుంచే మొదలు కానున్న గ్రీన్ఫీల్డ్ హైవేఇందుపల్లిలో ఇళ్లు కోల్పోయే ప్రాంతం జిల్లాలో జాతీయ రహదారి 216–ఈపై రైతులు, స్థానికుల నుంచి అభ్యంతరాలు అయినా లెక్క చేయని అధికారులు.. కొత్త అలైన్మెంట్కే మొగ్గు ప్రత్యామ్నాయ మార్గం చూపినా నిర్లక్ష్యం భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ సర్వే నంబర్లు తప్ప రైతుల పేర్లు లేని వైనం బాధితుల ఆందోళన అమలాపురం రూరల్: మండలంలోని ఇందుపల్లి గ్రామంలో 216 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్నందున, దీనిపై జాయింట్ కలెక్టర్కు అభ్యంతరాలు తెలపాలని బాధితుల సమావేశం నిర్ణయించింది. మంగళవారం గ్రామంలో వారు సమావేశమయ్యారు. కలెక్టర్ను కలసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వెళ్తున్న హైవే వల్ల ఇళ్లు కోల్పోతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని కోరనున్నారు. రావులపాలెం నుంచి నడిపూడి వరకు కాలువ గట్టు వెంబడి వచ్చిన హైవే నడిపూడి నుంచి మార్పు చెందడం వెనక కొందరు వ్యక్తుల హస్తం ఉందనే అభిప్రాయాన్ని సమావేశంలో వ్యక్తపరిచారు. వరద ప్రాంతంలో హైవే నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామంలో ముంపు సమస్య అధికమవడంతో పాటు పంటలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైవే వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సర్పంచ్ చొల్లంగి అప్పాజీ, మల్లుల పోలయ్య, నాగిరెడ్డి తాతారావు, ఆకుల నాగేశ్వరరావు, విప్పర్తి ఆదినారాయణ, తాత కాశీ విశ్వనాథ్తోపాటు పలువురు బాధితులు పాల్గొన్నారు. -
కష్టపడి పనిచేసిన వారికి అన్యాయం
ఫ రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా రంగా పేరు పెట్టారా! ఫ విలేకరులతో జనసేన నేత కొండలరావు మామిడికుదురు: కష్టపడి పని చేసిన వారికి అన్యాయం జరుగుతోందని జనసేన నేత, పి.గన్నవరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడు కొమ్ముల కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పాశర్లపూడిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కాపు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరికి రుణాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జనసేనకు చెందిన కాపు నేతలపై దాడి చేసి.. బాధితులపైనే జనసేన పార్టీకి చెందిన నేత దగ్గరుండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం దారుణమన్నారు. దీన్ని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా కాపు నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టారా అని ప్రశ్నించారు. దీనిపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టే నిధులను సబ్సిడీ రుణాలకు కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కాపులకు, బీసీలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బీసీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఓసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
మోడిఫైడ్ సైలెన్సర్ల తొలగింపు
కాకినాడ క్రైం: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనచోదకులకు కాకినాడ ట్రాఫి క్–2 పోలీసులు ఝల క్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ దానేటి రామారావు ఆధ్వర్యంలో వరస డ్రైవ్లు నిర్వహించి, ఆ వాహనచోదకులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అలాగే మెకానిక్ను ఏర్పాటు చేసి, ఆయా వాహనాల నుంచి సైలెన్సర్లు తొలగిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఒక్కరోజే ట్రాఫిక్–2 పరిధిలో సీఐ రామారావు ఆధ్వర్యంలోని బృందం 162 సైలెన్సర్లను తొలగించింది. వాహన చోదకుల నుంచి సుమారు రూ.2.5 లక్షల జరిమానా వసూలు చేసింది. నందరాడలో పక్షుల ఆవాసాలపై సర్వే రాజానగరం: మండలంలోని నందరాడ పేరు వినగానే అందరికీ సినిమా షూటింగ్లు గుర్తుకు వస్తాయి. ఈ గ్రామంలో సీతారామయ్య గారి మనుమరాలు, సీతారామరాజు వంటి వివిధ చిత్రాలను చిత్రీకరించారు. పక్కా పల్లెటూరు వాతావరణంతో కూడిన ఈ గ్రామం ప్రస్తుతం వివిధ రకాల పక్షులకు ఆవాసంగా కూడా మారింది. ఈ గ్రామాన్ని జిల్లా అటవీశాఖ గణాంక విభాగానికి చెందిన అధికారులు మంగళవారం సందర్శించారు. నియోజకవర్గంలోనే పెద్ద సాగునీటి చెరువుగా ఉన్న ఏవీ ట్యాంకు పరిసరాలలో పక్షుల ఆవాసాలపై సర్వే నిర్వహించారు. ఈ ట్యాంకు చుట్టూ ఉన్న చెట్లపై 40 రకాల జాతులకు చెందిన సుమారు వెయ్యి పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తించారు. వీటిలో రెండు, మూడు రకాల విదేశీ పక్షులు కూడా ఉన్నట్టు నిర్ధారించారు. సర్వేలో అటవీశాఖ సిబ్బందితో పాటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ జియాలజీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి తుని: స్థానిక జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి చెందాడు. ఎస్సై జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ చివరిలో పెద్దపల్లి రైల్వే గేటు మధ్యలో సోమవారం రాత్రి సుమారు 60 నుంచి 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. అతడిని విశాఖపట్నం నుంచి చైన్నె వైపు వెళుతున్న ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తు పెట్టలేని విధంగా ఛిద్రమైంది. మృతుడు ఒంటిపై లుంగీ, జర్కిన్ చిరిగిపోయి ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కార్యకర్తలకే పెద్ద పీట
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీలో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లా ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల నియామకాలకు కసరత్తు జరుగుతోందని, కార్యకర్తల అండతో వైఎస్సార్ సీపీనీ మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్లో మంగళవారం జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం ద్వారా ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పదివేల మంది కార్యకర్తలు ఓ సైన్యంలా చంద్రబాబు ప్రభుత్వ శుష్క వాగ్దానాలపై పోరాటాలు చేస్తారని చెప్పారు. నాగార్జున యాదవ్, రాజా మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల ప్రచారంపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. జక్కంపూడి రాజా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలకు వర్క్ షాపును నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టంగా నిర్మించుకునే విధానాలను వివరించారు. నియోజకవర్గాన్ని డివిజన్లుగా విభజించుకుని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తన నియోజకవర్గమైన రాజానగరంలో ఇప్పటికే పూర్తయిన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఆయన వివరించారు. రాజానగరం నియోజకవర్గాన్ని 14 డివిజన్లుగా విభజించి సంస్థాగత నిర్మాణం చేసినట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేసిన పోరాటాల ఫలితంగా నేడు ఆ కాలేజీల పనులకు చంద్రబాబు సర్కారు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇది మన పార్టీ సాధించిన విజయమని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ను 2029 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ, పార్టీ సీఈసీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి తమ ప్రసంగాల్లో పార్టీని పటిష్టం చేసే దిశగా సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోపు జిల్లాలోని అన్ని గ్రామ స్థాయి పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం పూర్తి కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి సూచించారు. వైఎస్సార్కు నివాళులు అమలాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (బులినాని) పార్టీ పెద్దలను తొలుత వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ సీఈసీ సభ్యులు పీకే రావు, కేఎస్ఎన్ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, వంటెద్దు వెంకన్నాయుడు, చింతలపాటి శ్రీనివాసరాజు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి నాగిరెడ్డి, దూలం వెంకన్నబాబు, పాటి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సర్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, కొనుకు గౌతమీ, గూడపాటి రమాదేవి, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్గన గంగాధరరావు, పార్టీ ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి భరత్ భూషణ్, సాకా మణికుమారి, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు గొవ్వాల రాజేష్, కాశి మునికుమారి, సాకా ప్రసన్నకుమార్, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరజాకుమారి, చీకట్ల కిషోర్, షేక్ అబ్దుల్ ఖాదర్, తోరం గౌతమ్ రాజా, మిండగుదటి శిరీష్, జిన్నూరి వెంకటేశ్వరరావు, అబాక్ హుస్సేన్, ఉంగరాల సంతోష్, ఉండ్రు వెంకటేష్, కాశి రమణ పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలువర్క్షాపులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్న జక్కంపూడి రాజా చంద్రబాబు అరాచకాలపై ఇకపై వైఎస్సార్ సీపీ సైన్యం పోరాటాలు పార్టీ సంస్థాగత నిర్మాణ ఇన్చార్జి నాగార్జున యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా -
ప్రయోగం ఫలించేలా!
భాగాల గుర్తింపుతోనే మార్కులు జంతుశాస్త్ర ప్రయోగ పరీక్షలో నాలుగు ప్రశ్నలుంటాయి. ఒకటో ప్రశ్నలో భాగంగా పటం గీసి భా గాలను గుర్తించాలి. పటం అందంగా ఉండాలి. వీటికి ఆరు మార్కులు. రెండో ప్రశ్న గా ఇచ్చిన ఎక్స్పర్మెంట్కు మూల సూత్రం, పట్టిక, ప్రయోగ విధానం, ఫలితం రాయాలి. సూత్రానికి ఒకటి, ప్రయోగ విధానానికి మూడు, ఫలితానికి ఒకటి కలిపి మొత్తం ఐదు మార్కులు ఉంటాయి. మూడో ప్రశ్నలో ‘ఎ’ నుంచి ‘జి’ వరకు ఉప ప్రశ్నలు ఉంటా యి. అకసేరుకాలు, సక సేరుకాలకు సంబంధించిన స్లైడులు, స్పెసిమన్లను గుర్తించడంలో ఒత్తిడికి లోనుకాకూడదు. ఏడు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కు ల వంతున పద్నాలుగు మార్కులు. 4వ ప్రశ్న రికార్డు. దానికి ఐదు మార్కులు ఇస్తారు. ప్రాక్టికల్స్లో 30 మా ర్కులు తెచ్చుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు. పరీక్షా సమయంలో ఒత్తిడి లేకుండా సున్నితంగా పరిశీలించాలి. పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. రికార్డు లో పటాలు, దాని సూచికలు బాగుండాలి. శరీర ధర్మశాస్త్ర ప్రయోగాల్లో తప్పనిసరిగా ఉద్దేశం, సూత్రం, ప్రయోగ విధానం, ఫలితం, మూలసూత్రం ఉండాలి. – పాలిక జగదీశ్వరరావు, జంతుశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సామర్లకోట ఫ ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫ అదే నెల 10వ తేదీ వరకూ నిర్వహణ ఫ ప్రత్యేక శ్రద్ధ చూపితే మార్కులు సులువే ఫ విద్యార్థులకు అధ్యాపకుల సూచనలు రాయవరం: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ అత్యంత కీలకమైంది. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు ఎంతో ముఖ్యం. ప్రధానంగా సైన్స్ విద్యార్థుల మార్కుల్లో ప్రాక్టికల్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అధిక మార్కుల సాధించాలంటే ప్రయోగ పరీక్షలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్లో అధిక మార్కులు సాధించేందుకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అయితే ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. విద్యార్థులు ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ప్రాక్టికల్స్లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వీటిని ఆచరిస్తే మంచి స్కోర్ చేయవచ్చు. మంచి మార్కులు సాధించొచ్చు భౌతిక శాస్త్రానికి సంబంధించి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి బ్యాచ్కు 12 ప్రశ్నలు వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు మార్కులు, పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్లకు ఎనిమిది మార్కులు, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలు ఉంటాయి. విద్యుత్తు ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి. – టేకుమూడి రామ్కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు సూటిగా సమాధానాలు చెప్పాలి వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్షకు సంబంధించి 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణను క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్ బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. కవర్ స్లిప్ను ఫిక్స్ నీట్గా వేసి, శాఫ్రనీను ఎక్కువ కాకుండా చూడాలి. భాగాలు గుర్తించిన విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటర్ లేదా స్లైడ్ను గుర్తించి దాని లక్షణాలు రాయాలి. – కట్టా శ్రీనివాస్, బోటనీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముమ్మిడివరం ఫలితం తప్పనిసరి రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం కరంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండవ విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్థం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీ, ‘డి’ లో కార్బోహైడ్రేట్స్ చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి. – పి.రాజు, కెమిస్ట్రీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు.. ప్రతి రోజూ ఉదయం 9 – 12, మధ్యాహ్నం 2 – 5 గంటల మధ్య జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్బాల్ జట్ల ఎంపికల చాంపియన్షిప్ పోటీలను మంగళవారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో రామచంద్రపురం జట్లు ఎంపికైనట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి వెల్లడించారు. కాగా.. ఈ నెల 22, 23 తేదీల్లో కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్ బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లను ఎంపిక చేసి, ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్రాయ్, డాక్టర్ కోట సతీష్, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. -
బాలాజీ హుండీ ఆదాయం రూ.42.30 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామి వారికి హుండీల ద్వారా రూ.42,30,489 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 12 గ్రాముల బంగారం, 140 గ్రాములు వెండి లభించాయన్నారు. 71 రోజులకు స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఆలయం వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, స్థానికులు లెక్కింపులో పాల్గొన్నారు. నేడు జెడ్పీ బడ్జెట్ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరుగుతుందని సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. దీనిలో బడ్జెట్తో పాటు 13 శాఖలపై సభ్యులు సమీక్షిస్తారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సొంత వనరుల ద్వారా రూ.24 కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ నిర్దిష్ట గ్రాంట్ల నుంచి రూ.24.31 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. వ్యయాలు అదే స్థాయిలో ఉంటాయని వివరించారు. ఇతర గ్రాంట్ల ద్వారా మరో రూ.27 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు, జెడ్పీటీసీ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని లక్ష్మణరావు చెప్పారు. లక్ష్మీనృసింహుని హుండీల రాబడి రూ.46,54,233 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో రూ.46,54,233 ఆదాయం వచ్చింది. గతేడాది నవంబర్ 28వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ 53 రోజులకు పై ఆదాయం చేకూరింది. దేవదాయశాఖ అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు, ప్రజాప్రతినిధుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించారు. మెయిన్ హుండీల ద్వారా రూ.45,39,278, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.18,512, అన్నదాన హుండీల ద్వారా రూ.96,443 ఆదాయం లభించినట్టు ఏసీ ప్రసాద్ తెలిపారు.‘అక్రమార్జనతో చేసే దానాలు నిరర్థకం’ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అక్రమార్జనతో చేసే దానం నిరర్థకం, దాంతో పాపాలు తొలగవని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మంగళవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంలోని అశ్వమేధిక పర్వంలోని సన్నివేశాలను వివరించారు. ‘‘ధర్మరాజు అశ్వమేధయాగం పూర్తి చేశాడు. ఆ సమయంలో దేహంలో సగం బంగారు రంగు ఉన్న ముంగిస వచ్చింది. పెద్ద స్వరంతో యుధిష్ఠిరుడు చేసిన యాగం, పేద విప్రుడు చేసిన పేలపిండి దానంతో సరితూగదని అంటుంది. సదస్యులు ఈ వృత్తాంతాన్ని వివరించమని అడిగారు. పేద విప్రుడు కురుక్షేత్రంలో ఊంఛవృత్తి(పొలంలో పంట కోసి తీసుకువెళ్లాక గింజలు ఏరుకుని ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం)తో జీవించేవాడు. ఒకసారి గింజలు సంపాదించుకుని, పేలపిండితో భోజనం ఏర్పాటు చేసుకుని పేద విప్రుడు, భార్య, కొడుకు, కోడలు నాలుగు భాగాలు చేసుకున్నారు. ఆ సమయంలో మరో విప్రుడు అతిథిగా వచ్చాడు. తమ భాగాలను అతిథికి సమర్పించారు. ధర్మదేవతగా సాక్షాత్కరించిన ఆ అతిథి నీ దానంతో నేను సంప్రీతుడినయ్యానని చెబుతాడు. ఆ రోజు అక్కడ పొర్లిన పేలపిండితో నా దేహం సగం బంగారుమయమైంది. మిగతా సగం ధర్మరాజు యాగంతో కనకమయవుతుందని ఆశపడ్డాను అని ముంగిస అంటుంద’ని సామవేదం వివరించారు. -
అయినవిల్లి ఆలయంలో చదువుల పండగ
ఫ రేపటి నుంచి 24 వరకూ నిర్వహణ ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఫ 25న విద్యార్థులకు పెన్నుల పంపిణీ అయినవిల్లి: చదువుల పండగ పేరుతో అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి ఈనెల 24 వరకూ మహాక్రతువులు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చదువుల పండగకు ఆలయంలో అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. గణపతి కల్ప ప్రారంభంతో, సప్తనదీ జలాభిషేకంతో, సహిత లక్ష కలముల వితరణ మహోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. తొలిరోజు 22న జరిగే సప్తనదీ జలాభిషేకం కోసం గోదావరి, గంగ, యమున, సరస్వతి, సింధు, కావేరి, నర్మద నదుల నుంచి ఆలయ అధికారులు జలాలు సేకరించారన్నారు. జలాభిషేకం అనంతరం స్వామివారి పాదాల వద్ద లక్ష కలాలతో పూజలు చేసేందుకు వేద పండితుల సర్వం సిద్ధం చేశారని, 22న సరస్వతీ కల్పం, 24న మహా పూర్ణాహుతి ఉంటాయన్నారు. శ్రీపంచమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో విద్యార్థులతో సరస్వతీ పూజ చేయిస్తామన్నారు. స్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ నెల 25న విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు మాట్లాడుతూ స్వామివారి కలాల కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారన్నారు. -
హెల్మెట్ ధారణతో ప్రాణ రక్షణ
● అమలాపురంలో భారీ ర్యాలీ ● పాల్గొన్న ఎస్పీ రాహుల్ మీనా, డీటీవో శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు అమలాపురం టౌన్: హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలను నడిపితే అవి మన ప్రాణాలను రక్షిస్తాయని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అమలాపురంలో మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భారీ మోటార్ల సైకిళ్ల ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. మోటారు సైకిళ్ల ర్యాలీ స్థానిక జిల్లా ఆర్మ్డ్ కేంద్ర కార్యాలయం నుంచి మొదలై ఈదరపల్లి వంతెన, నల్ల వంతెన, ఎర్ర వంతెన, మీదుగా గడియారం స్తంభం సెంటరు వరకు సాగింది. ర్యాలీలో ఎస్పీ మీనా, జిల్లా రవాణాధికారి (డీటీఓ) డి.శ్రీనివాసరావు, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎప్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, వాహన చోదకులు హెల్మెట్లు ధరించి బైక్లు డ్రైవ్ చేశారు. ఆదర్శవంతులకు సత్కారం సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారిని ఈ సందర్భంగా ఎస్పీ మీనా సత్కరించారు. ఆర్టీసీ డ్రైవర్ పి.రాంబాబు బస్సును సురక్షితంగా నడుపుతూ రోడ్డు ప్రమాదం అనేది లేకుండా తోటి డ్రైవర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లు యు.వెంకటేష్, కె.ప్రదీప్ రోజూ యూనిఫాం ధరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నారన్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు సీహెచ్ నాగరాజు, పి.బలరామకృష్ణ రోజూ హెల్మెట్లు ధరించడం అభినందనీయమని చెప్పారు. ఈ అయిదుగురిని ఎస్పీ సత్కరించారు. ర్యాలీ అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటరులో ఎస్పీ మీనా విద్యార్థులు, వ్యాపారులు, పోలీస్ సిబ్బందితో హెల్మెట్ల ధారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఇక నుంచి తాము రోడ్డు భద్రతా చర్యలను తప్పకుండా పాటిస్తామని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలపై వెళతామని, విధిగా హెల్మెట్ను ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్ఐ బ్రహ్మానందం పాల్గొన్నారు. -
కేసీఎం చొరవతో స్వదేశానికి వచ్చాను
అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం ఖతార్కు వెళ్లి ఇటీవల ఇబ్బంది పడి కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) చొరవతో స్వదేశానికి క్షేమంగా చేరుకున్న ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి చెందిన పి.వెంకటలక్ష్మి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను కలసి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్లో ఎదుర్కొన్న ఇబ్బందుల పూర్వాపరాలను ఆమెను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆమె తన బాధ చెప్పుకుంటూ అక్కడ ఎంత బాధ పడిందో వివరించింది. ఖతార్లో తన సోదరి ద్వారా కేసీఎం గురించి తెలుసుకుని తన సోదరుడు కోనసీమ వలసదారుల కేంద్రానికి పంపించి సంప్రదించగా కేసీఎం బృందం సమస్యను తెలుసుకుని భారత రాయబార సంస్థతో సంప్రదింపులు జరిపి క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఈ కేసీఎం ఏర్పాటు చేయడం మాలాంటి ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్నటు వంటి అనేక మందికి శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ గోళ్ళ రమేష్, కె.సత్తిబాబు, సఫియా, దుర్గ పాల్గొన్నారు. -
పదోన్నతి కల్పించాలంటూ ధర్నా
అమలాపురం రూరల్: ప్రభుత్వం సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించడంపై కోనసీమ జిల్లా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. స్టాఫ్ నర్సుల పోస్టులను ఏఎన్ఎంలకు కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శివకుమారి మాట్లాడుతూ 115 జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం సచివాలయం ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పిస్తుందన్నారు. తాము శిక్షణ పొంది 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ తమ సేవలు, అర్హతలను గుర్తించాలని న్యాయమైన నియామక ప్రక్రియ, పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యక్షురాలు అమృతవల్లి, స్టాఫ్ నర్సులు క్రిటికల్ పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. వైద్యులు లేకుండా భద్రతా సిబ్బంది లేకుండా, తగిన సౌకర్యాలు లేకుండా, సేవలు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్కు వినితిపత్రం అందించారు. జిల్లా నాయకులు ఎం. ప్రశాంతి, జి.దుర్గమ్మ, పి.సుశీల, ఎం.కల్యాణి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
జాతీయ పురస్కారానికి ఎంపిక
వీఆర్పురం: అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మన్యం కవి నూనె రమేష్ను జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలవరం జిల్లా వంటి ఏజెన్సీలో పుట్టి తెలుగు భాష సంస్కృతి, వైభవం, సాహిత్యం తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహితీ సాంస్కృతిక సామాజికసేవలతో సాహితీ ప్రభంజనం సృష్టిస్తున్న మన్యం కవి నూనె రమేష్ను అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్యర్యంలో ప్రాచీన కవుల వారసులతో నిర్వహించే సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవ పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు. రమేష్ చేస్తున్న అమూల్యమైన కృషికి గౌరవార్థం జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశామని తెలియజేశారు. జనవరి 21న బుధవారం నాడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఈ పురస్కారన్ని అందిస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తదితరులు తెలిపారు. -
ట్రావెల్స్ బస్ ఢీకొని యువకుడి మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై పోలవరం కాలువ వంతెన సమీపాన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు జగ్గంపేట మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన తలారి రవి (26) బైక్పై ప్రత్తిపాడు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పోలవరం కాలువ వంతెన సమీపానికి వచ్చే సరికి తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీకొనడంతో తలారి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రావులపాలెం– అమలాపురం హైవేకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమలాపురం: అమలాపురం – రావులపాలెం హైవే నిర్మాణం, విస్తరణకు ఒక అడుగు పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ హైవేను కోనసీమ జిల్లా పరిధిలో రెండు హైవేలకు అనుసంధానంగా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న 216 జాతీయ రహదారి, తూర్పు గోదావరి జిల్లా లాలాచెరువు నుంచి ఏలూరు జిల్లా గుండుగొలను వరకు ఉన్న 216–ఏ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి 216–ఈ అని పేరు పెట్టారు. అమలాపురం మండలం పేరూరు ఎత్తు రోడ్డు నుంచి రావులపాలెం మండలం రావులపాడు వరకు మొత్తం 31.60 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మిస్తుండగా, దీనిలో 6 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మించనున్నారు. ఇందుకోసం 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోడ్డు రెండు లైన్లు, నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్టు ఎన్హెచ్ వర్గాలు చెబుతున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ ప్రకటన వెలువడిన తేదీ మొదలు రైతుల వద్ద నుంచి 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉన్నవారు వాటిని లిఖిత పూర్వకంగా, తగిన ఆధారాలతో సహా జిల్లా జాయింట్ కలెక్టర్ (కాంపిటెంట్ అథారిటీ)కి సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్తో భూములు, ఇళ్లు కోల్పోతున్నవారు ఆందోళన చెందుతున్నారు. తమ అభ్యంతరాలను మరోసారి గట్టిగా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు
పి.గన్నవరం: ఎల్.గన్నవరంలో కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మ వారి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం పలువురు భక్తులు రూ.12.2 లక్షల విరాళాలు అందించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన అడబాల వారి కుటుంబ సభ్యులు మొత్తం రూ.8,70,135, అన్నాబత్తుల వీరన్న కుటుంబ సభ్యులు రూ.2,12,121, చిట్టాల వెంకన్న రూ.51,116, మహాదశ భాస్కరరావు రూ.25,116, పలువురు రూ.10 వేల చొప్పున విరాళం అందించారు. విరాళం అందించిన భక్తులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
ఎటు చూసినా ఇసుకే..
● రోడ్లపై ఇసుక తొలగించాలి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఇసుక చెల్లాచెదురుగా పడి ఉంటుంది. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అధిక ఇసుకలోడుతో వెళ్లడంతో పాటు, షడన్ బ్రేక్ వేసిన సమయంలో ఇసుక రోడ్డుపై పడుతుంది. దీంతో రోడ్డుపై పడిన ఇసుక వాహనాల రాపిడికి ఎగిరి వాహనదారుల కళ్లల్లోనూ, రోడ్ల పక్కకు చేరి ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ల పక్కన గుట్టల మాదిరిగా పేరుకుపోతోంది. రోడ్లపై పడిన ఇసుకను అధికారులు తొలగించేలా చూడాలి. – కంఠమణి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కొవ్వూరు ● నిర్వాహకులదే బాధ్యత రోడ్లపై పడిన ఇసుక తొలగించే బాధ్యత సంబంధిత నిర్వాహకులదే. స్టాక్ పాయింట్లు పెట్టిన వారిని ఇసుక తొలగించాలని గతంలో ఆదేశాలు కూడా ఇచ్చాం. ర్యాంపుల నుంచి ఇసుకతో వెళ్లే లారీలు టార్పాలిన్లు తప్పనిసరిగా కప్పాలి. అదే విధంగా ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. అధిక లోడుతో వెళితే రూ.25 వేలు వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఇసుక లారీలు నడిపే వారు, ర్యాంపు నిర్వాహకులు ఇసుక రోడ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. – రాణి సుస్మిత, ఆర్డీవో, కొవ్వూరు ఫ యథేచ్ఛగా ఇసుక లారీల రాకపోకలు ఫ అధికలోడు కారణంగా రోడ్లపై పడుతున్న ఇసుక ఫ జారిపడి గాయాలపాలవుతున్న వాహన చోదకులు ఫ అధికారుల తీరుపై విమర్శలు తాళ్లపూడి: కూటమి ప్రభుత్వంలో ఇసుక ర్యాంపుల్లో ఓ పక్క అక్రమ ఇసుక తవ్వకాలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు, ఇసుక లారీలతో ట్రాఫిక్ సమస్య, మరోపక్క రోడ్లపై ఎక్కడపడితే అక్కడ జారిపడిన ఇసుకతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో ఉచిత ఇసుక మాటున అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున పెద్ద లారీల్లో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. పరిమితికి మించి అధిక ఇసుక లోడుతో వెళుతున్న లారీల నుంచి ఇసుక జారిపడుతుంది. ఏటిగట్టు రోడ్డు మలుపుల వద్ద, రోడ్ల పైనా, రోడ్ల పక్కనా ఎక్కడ చూసిన ఇసుక మేటల మాదిరిగా దర్శనమిస్తుంది. దీంతో రహదారిపై వెళ్లే వాహనదారులు జారిపడి ప్రమాదాల బారినపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై పరిమితికి మించి వేగంగా వెళ్లే ఇసుక లారీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు నుంచి ప్రక్కిలంక వరకు గోదావరి ఏటిగట్టు రోడ్డు పై నుంచి నిత్యం అధిక సంఖ్యలో వెళుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్ల నుంచి కిందికి జారిపోయిన ఇసుక ఆర్అండ్బీ రోడ్డుపై పేరుకుపోయి స్పీడ్గా వెళ్లే వాహనాలు అదుపు తప్పుతున్న పరిస్థితి నెలకొంది. నిబంధనల మేరకు ఇసుక లోడ్తో వెళ్లే వాహనాలపై టార్పాలిన్ కప్పాలి. చాలాసార్లు ఏ విధమైన టార్పాలిన్ లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. అధిక లోడ్ కారణంగా కప్పినా కూడా లారీ బ్రేక్ వేస్తే ఇసుక జారిపడుతుంది. నియోజకవర్గంలోని ర్యాంపులు కొవ్వూరు మండలంలో కొవ్వూరు, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి సమీపంలోని ఆరికిరేవుల1, 2, దొండకుంట, వాడపల్లి, రోడ్కం రైల్వే బ్రిడ్జి వద్ద, తాళ్లపూడి మండలంలో తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం, తాడిపూడిలో ర్యాంపులు నడుస్తున్నాయి. వాహనదారుల అవస్థలు కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి, తాళ్లపూడి మండలంలోని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక రవాణా చేసే సమయంలో ఏటిగట్టు రోడ్డుపై ఇసుక జారి పడడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొవ్వూరులోని గోదావరిమాత విగ్రహం వద్ద రోడ్డుపై అయితే ఇసుక మేటలా పేరుకుపోయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆటో సైతం తిరగబడింది. అంతేకాకుండా కొవ్వూరు, ఆరికిరేవుల ర్యాంపు వద్ద ఏటిగట్టుపైనా, చిడిపి నుంచి తాళ్లపూడి టి–గట్టు మలుపు వద్ద, తాళ్లపూడి నుంచి ప్రక్కిలంక చింతచెట్టు వద్ద ఏటిగట్టుపై, ప్రక్కిలంక ఆంజనేయ స్వామి ఆలయం జంక్షన్లో ఇసుక పడి ఉంది. అంతే కాకుండా పలు చోట్ల ఇసుకపడి ఉంది. పరిమితికి మించి లోడు వేయడంతో రోడ్లన్నీ ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము కూడా లేచిపోతోంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. పరిమితికి మించి లోడు వేసినా, రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక అతి వేగంతో లారీలు నడుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై పడి ఉన్న ఇసుకను తొలగించే నాథుడే లేడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని ముర్లవానిపాలెం గ్రామానికి చెందిన సోముల సోమరాజు (45) కల్లు గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి జారిపడి తీవ్రగాయాలతో మరణించారు. సోమరాజు ఆదివారం సాయంకాలం రోజు మాదిరిగానే కల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కాడు. పట్టుతప్పి కింద పడిపోయిన సోమరాజును గ్రామస్తులు వెంటనే అంబులెన్స్లో రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించారు. కాగా అప్పటికే సోమరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం వున్నారు. ఆ నిరుపేద గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. లారీ ఢీకొని ఫార్మా ఉద్యోగి.. అన్నవరం: స్థానిక జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన గుడివాడ కిరణ్ (40) అనకాపల్లిలోని అగనంపూడి వద్ద ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు సోమవారం సాయంత్రం కాకినాడ నుంచి అనకాపల్లి బైక్ మీద వెడుతుండగా అన్నవరం వచ్చే సరికి డిగ్రీ కళాశాల వద్ద వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో అతను రోడ్డు మీద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఢీకొని హోంగార్డు.. రాజానగరం: మండలంలోని రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం, శృంగవృక్షానికి చెందిన మనం వీరబాబు (47) రంగంపేట పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అనపర్తి పోలీసు సర్కిల్ కార్యాలయానికి తపాల్స్ తీసుకువెళ్లి సుమారు 12.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా రామస్వామిపేట వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీ కొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. తలకు రోడ్డు మార్జిన్ తగిలి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొదల్లో నవజాత శిశువు చింతూరు: మండలంలోని కల్లేరు పంచాయతీ మదుగురు గ్రామం శివారు పొదల్లో ఓ నవజాత శిశువును గుర్తించారు. ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో పొదల్లో నుంచి పసికందు ఏడుపులు వినిపిస్తుండటంతో పొలం నుంచి వస్తున్న పొడియం గంగయ్య, కన్నమ్మ అటుగా వెళ్లి చూసి పసిపాపను గుర్తించారు. పసికందును వారు ఇంటికి తీసుకొచ్చి సమాచారాన్ని ఎంఎల్హెచ్ పీఎస్కు తెలిపారు. పొదల్లో ఉన్న నవజాత శిశువు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిశువును వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. -
వాడపల్లి క్షేత్రంలో కూటమి నేతల దోపిడీ
● నకిలీ టికెట్ల స్కాంపై విచారణ జరపాలి ● భక్తుల మనోభావం దెబ్బతీస్తుంటే సనాతన వాది ఏమైపోయారు? ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి రావులపాలెం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని కూటమి నాయకులు దోపిడీకి అడ్డాగా మార్చి, నకిలీ టికెట్ల స్కాంతో నెలకు రూ.20 లక్షల పైనే దోచేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాడపల్లి ఆలయ ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. ఇటీవల నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వారిని వదిలేయడంలో నాయకుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ టికెట్ల జారీ పకడ్బందీగా నిర్వహించగా ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎందుకు తప్పిస్తున్నారని అడిగారు. మొత్తం వివాదంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తింటుంటే సనాతన వాదిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని, భక్తుల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ సీపీ తరఫున సిద్ధంగా ఉంటామన్నారు. ప్రజలకు లెక్కలు చెప్పాలి ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నాయకులు చందాలు వసూలు చేసి దోపిడీకి తెర లేపారన్నారు. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తే వచ్చింది ఎంత, చందాల రూపంలో వసూలు చేసింది ఎంత, ఖర్చు చేసింది ఎంతో ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. ప్రభుత్వ నిధులతో చేసిన కార్యక్రమంలో అధికారులు కూడా నాయకుల కొడుకుల ఫొటోలతో గంతులు వేశారన్నారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రొటోకాల్ ఎక్కడ అని ప్రశ్నించారు. సంక్రాంతి పేరు చెప్పి చంద్రబాబు మద్యం సీసాపై రూ.10 పెంచితే, కొత్తపేటలో మాత్రం బీ ట్యాక్స్ పేరుతో రూ. 60 వరకూ పెంచి మద్యం విక్రయాలు చేశారన్నారు. బస్సు టికెట్ల ధరలు తగ్గించామని చెబుతూనే ప్రజల అవసరాలకు కావాల్సిన స్థాయిలో బస్సుల సంఖ్య పెంచలేదన్నారు. దీంతో ప్రైవేట్ బస్సుల దోపిడీ పెరిగిందన్నారు. నేడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్క్షాపు వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఫిబ్రవరి 15 తేదీలోగా కార్యకర్తలకు ఐడెంటీ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మంగళవారం అమలాపురం వాసర్ల గార్డెన్స్లో వర్క్షాపు నిర్వహిస్తున్నట్టు జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జక్కంపూడి రాజా, నాగార్జున, కారుమూరి సునీల్ పాల్గొంటారన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిదివేల మందికి కార్డులు ఇస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, బొక్కా కరుణాకరం, సర్పంచులు కర్రి గోవిందకృష్ణారెడ్డి, సబ్బితి మోహనరావు, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా ప్రభాకరరావు, మన్యం భాను పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టుకు ప్రయాణికుల తాకిడి
ఫ తిరుగు ప్రయాణికులతో సందడి ఫ రోజూ 1400 మంది పయనం ఫ రోజుకు 9 సర్వీసులు ఫ ఈ నెల 26 వరకు ఢిల్లీ సర్వీసు రద్దు కోరుకొండ: మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి తగిలింది. సంక్రాంతి సెలవుల నిమిత్తం వచ్చిన ప్రయాణికులు తిరుగు పయనమవుతున్న నేపథ్యంలో ఆదివారం నుంచి సందడి నెలకొంది. విమానశ్రాయానికి డిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగుళూరుకు డైలీ, ముంబాయ్, తిరుపతికి వీక్లీ సేవలందుతున్నాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 9 సర్వీసులు తిరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రాక మొదలయింది. కాగా సెలవుల అనంతరం ఆదివారం నుంచి తిరిగి వెనక్కి వెళ్లడంతో విమానాశ్రయంలో రద్దీ ఏర్పడంది. ఈ రాకపోకల సందర్భంగా విమానాశ్రయానికి 1,400 మంది చొప్పున రోజూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారం రోజులు 9 సర్వీసుల్లో 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. ఢిల్లీ నుంచి నిర్వహిస్తున్న బోయింగ్ విమాన సర్వీసు సేవలు ఈ నెల 26వ తేదీ వరకు 8 రోజుల పాటు నిలిచిపోతున్నట్టు ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దీంతో విమాన సర్వీసుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే సోమవారం ఢిల్లీ సర్వీసు రద్దయింది. అలాగే సోమవారం సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్కు 72 మంది ప్రయాణికుల సామర్థ్యంతో మరో విమాన సర్వీసు ప్రారంభమయిందన్నారు. దీంతో హైదరాబాద్కు రెండు ఎయిర్బస్ సర్వీసులు, మూడు ఏటీఆర్ విమాన సర్వీసులు నడుపుతున్నారు. -
కోకోకు కార్పొరేటు కాక
‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్టుగా తయారైంది కోకో రైతుల పరిస్థితి. ప్రపంచంలోనే నాణ్యమైన కోకో గింజలను ఉత్పత్తి చేస్తున్నా లాభాసాటి ధర కోసం రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లిప్తతకు తోడు.. కార్పొరేట్ కంపెనీల మార్కెట్ మాయాజాలంతో ధరలు పొందలేక విలవిలలాడుతున్నారు. సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి తోటల్లో కోకో సాగు దశాబ్దాల కాలంగా జరుగుతోంది. జిల్లాలో 3,800 ఎకరాల్లో కోకో సాగు జరుగుతుండగా ఏడాదికి సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. ఎకరాకు సగటున మూడు క్వింటాళ్ల కోకో ఉత్పత్తి అవుతోంది. అదే ఏలూరు జిల్లాలో అయితే ఐదు క్వింటాళ్ల నుంచి ఆరు క్వింటాళ్ల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త పంట కావడంతోపాటు అక్కడ పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కోకో గింజల ధర కేజీ రూ.350 వరకు ఉంది. రెండేళ్లు కోకో గింజలకు రికార్డు స్థాయి ధర వచ్చిన విషయం తెలిసిందే. 2023లో కోకో గింజల కేజీ ధర రూ.1,100 కూడా పలికింది. తరువాత ఇది తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అయితే అంతర్జాతీయంగా కోకో గింజలకు ఇస్తున్న ధర తమకు కూడా ఇవ్వాలని స్థానిక రైతులు కొన్ని నెలలుగా ఆందోళన బాట పట్టారు. దిగుమతి సుంకం, జీఎస్టీతో తడిసి మోపెడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజల ధర రూ.530 వరకు ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో చాక్లెట్ తయారీ కంపెనీలు ఇతర దేశాల నుంచి, మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి కోకో గింజలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశంలో కోకో గింజల అవసరాలలో కేవలం 25 శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతుండగా, మిగిలిన 75 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా వస్తున్న వాటికి భారీగా దిగుమతి సుంకాలు చెల్లించాలి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కోకో గింజల మీద 16.5 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. 5 శాతం జీఎస్టీ కూడా కట్టాలి. మొత్తం మీద 21.5 శాతం అవుతోంది. అంటే ఇతర దేశాల్లో కోకో గింజల ధర రూ.530 వరకు ఉండగా, దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి రూ.113.95 చెల్లించాలి. ఈ విధంగా చూస్తే ఇతర దేశాల నుంచి వస్తున్న కోకో గింజలు కంపెనీ చేరే సమయానికి కేజీ రూ.644 అవుతోంది. రైతుల మొర ఆలకించని ప్రభుత్వం ఇదే సమయంలో కోనసీమ జిల్లాలో రైతులు పండిస్తున్న కోకో గింజలకు చెల్లిస్తున్న ధర కేజీ రూ.350 మాత్రమే. ఇదే రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఏలూరులో కేజీ కోకో గింజలకు రూ.400 చెల్లిస్తుండగా, ఇక్కడ ఇంత కన్నా తక్కువ చెల్లించడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన కోకో గింజలను ఆఫ్రికాలోని ఘనా దేశం పండిస్తోందంటారు. అక్కడ కన్నా నాణ్యమైన గింజలు గోదావరి జిల్లా రైతులు పండిస్తున్నారు. అయినా ఇక్కడ పండే గింజలకు తక్కువ ధరను ఇస్తూ కంపెనీలు కోకో రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. దీనిపై కొన్ని నెలలుగా రైతులు దశల వారీగా ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం వీరి మొర ఆలకించడం లేదు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు దోపిడీ ఆపడం లేదు. తాజాగా కోనసీమ రైతులు కోకో గింజలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాము పండిస్తున్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడున్న ధరకు కొనుగోలు చేయాలని, కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటుగా మారి రైతులను నష్టాలు పాల్జేసే చర్యలు అడ్డుకోవాలని, స్థానికంగా కోకో పంట పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కోనసీమ గింజలకు దక్కని ధర జిల్లాలో సుమారు 3,800 ఎకరాల్లో సాగు సగటున 1,140 టన్నుల గింజల ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత ధర కేజీ రూ.530 స్థానికంగా ఇస్తున్న ధర రూ.350 మాత్రమే కొనుగోలు చేసే కార్పొరేట్ కంపెనీల దోపిడీ దిగుమతి చేసుకుంటున్న గింజలకు కేజీ రూ.644 చెల్లింపు ఆఫ్రికా దేశం ఘనా కన్నా మేలైన గింజలు ఉత్పత్తి చేస్తున్న రైతులు అయినా తక్కువ ధర చెల్లించడంపై ఆగ్రహం అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధర ఇవ్వాలి దిగుమతి సుంకాలు చెల్లించి ఇతర దేశాల నుంచి కోకో గింజలను కేజీ రూ.644 చేసి చాక్లెట్ ఫ్యాక్టరీలు కొంటున్నాయి. స్థానిక రైతుల వద్ద నుంచి సుంకాలు చెల్లించకుండానే కోకో గింజలు కొనుగోలు చేయవచ్చు. అయినా మేము రూ.644 ఇవ్వమని కోరడం లేదు. అంతర్జాతీయంగా ఉన్న ధర కేజీ రూ.530 చేసి కొనుగోలు చేయమంటున్నాం. అయినా కంపెనీలు పట్టించుకోవడం లేదు. పెరిగిన పెట్టుబడులకు తగినట్టుగా ఆదాయం రాకపోతే కోకో సాగు చేయలేం. – ప్రకాష్, కోకో రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం మండలం -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నల్లజర్ల: మండలంలోని గంటావారిగూడెంలో ఒక పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.1,29,800 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. పోక్సో కేసు నమోదు సీతానగరం: స్థానిక పంచాయతీ పరిధిలోని శెట్టిబలిజపేటకు చెందిన అంచూరి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చినకొండేపూడికి చెందిన పేడూరి చిట్టిబాబుపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్కుమార్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినకొండేపూడిలో చిట్టిబాబు ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి దండుకేశవరంలో ఉంటుంది. ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న చిట్టిబాబు ఈనెల 16 రాత్రి 9 గంటలకు శెట్టిబలిజపేటలో మద్యం తాగడానికి వెళ్లాడు. పదహారేళ్ల బాలికను చేయిపట్టుకుని లాగాడు. అయితే ఈనెల 17 ఉదయం మైనర్ బాలిక రాత్రి జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. చిట్టిబాబు రెండు రోజుల తర్వాత సోమవారం శెట్టిబలిజపేటకు వెళ్లాడు. తన కుమార్తెను ఎందుకు చేయి పట్టుకుని లాగావని చిట్టిబాబును బాలిక తండ్రి రామకృష్ణ నిలదీసి, స్తంభానికి కట్టడానికి ప్రయత్నించగా చేయి కొరికి పారిపోయాడు. దీంతో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రైల్వేట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కడియం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపాన రైలు పట్టాలపై గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. 5.4 అడుగుల పొడవు, నల్లని పొడుగు చేతుల చొక్కా, సిమెంటు రంగు నిక్కరు ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఎడమచేసి చూపుడువేలు సగం వరకే ఉందని, ఇతడి ఆచూకీ తెలిసిన వారు రాజమహేంద్రవరం రైల్వే పోలీసులకు 0883 2442821)సమాచారం అందించాల్సిందిగా వారు కోరారు. అట్రాసిటీ కేసు నమోదు సీతానగరం: మండలంలోని చినకొండేపూడికి చెందిన పేడూరి చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంచూరి రామకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 7.30 గంటలకు చిట్టిబాబు మద్యం తాగడానికి సీతానగరం శెట్టిబలిజపేటకు చిట్టిబాబు వెళ్లాడు. నా కుమార్తెను చేయి పట్టుకుని లాగుతావా అంటు శెట్టిబలిజపేటకు చెందిన రామకృష్ణ మద్యం తాగడానికి వచ్చిన చిట్టిబాబును చేతులతో కొడుతూ వైరుతో టెలిఫోన్ స్తంభానికి కట్టివేశాడు. చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నార్త్జోన్ డీఎస్పీ విచారణ నిర్వహిస్తారని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు నుజ్జునుజ్జయిన వృద్ధురాలి కాళ్లు అనపర్తి: బస్సు చక్రం కాళ్లపై నుంచి వెళ్లడంతో వృద్ధురాలి రెండు కాళ్లు నుజ్జునుజ్జయిన ఘటన సోమవారం సాయంత్రం అనపర్తి దేవీచౌక్లోని బస్టాప్ వద్ద జరిగింది. సుమారు 80 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వృద్ధురాలు బస్టాండ్ వద్ద నిలుచుని ఉండగా కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వృద్ధురాలిని ఢీకొట్టడంతో కింద పడిపోయిందని వెంటనే బస్సు టైరు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో కాళ్లు రెండు చర్మం ఊడిపోయి భయానకంగా మారాయి. దీంతో స్థానికులు ఆమెను పక్కనే ఉన్న అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సును ఏరియా ఆస్పత్రిలోనే నిలిపివేశారు. -
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
అమలాపురం టౌన్: సంస్థాగతం నిర్మాణంపై అమలాపురం వాసర్ల గార్డెన్స్లో మంగళవారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. జగ్గిరెడ్డి, పార్టీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశానికి జిల్లాలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరు కావాలని కోరారు. పీజీఆర్ఎస్కు 160 అర్జీలు అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యకమ్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 160 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, వచ్చిన ప్రతి ఆర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, రెవెన్యూ ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి సోమవారం రిజిస్ట్రేషన్ కౌంటర్లో సరైన విధంగా అర్జీల నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.మాధవి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఎల్డీఓలు రాజేశ్వరరావు వేణుగోపాల్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25 అర్జీలు అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న ప్రజల నుంచి ఎస్పీ రాహుల్ మీనా ఫిర్యా దులు స్వీకరించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ కూడా ఫిర్యాదులను పరిశీలించారు. కార్మిక కోడ్లను నిరసిస్తూ ధర్నా అమలాపురం రూరల్: బ్రిటిష్ కాలం నాటి నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 కార్మిక కోడ్లుగా మార్చడాన్ని నిరసిస్తూ సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. దుర్గాప్రసాద్, ఎం.బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ, కార్మికుల కనీస వేతనం, భద్రత, సంఘం పెట్టుకునే హక్కును హరిస్తూ ఈ కోడ్లు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల కోత ద్వారా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టాలని కేంద్రం చూస్తోందని ధ్వజమెత్తారు. సీఐటీయూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సకల సూర్యనారాయణ, టీ. నాగ వరలక్ష్మి, బళ్ల పర్వతాలు, ఎన్ లక్ష్మణ్, సతీష్ పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా నరసన్న కల్యాణ ఏర్పాట్లు
అమలాపురం రూరల్: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కల్యాణ ఉత్సవాల నిర్వహణపై మూడవ దఫా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాగునీరు, బారికేడ్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక షెడ్లు, క్యూ ల ఏర్పాటు, వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీసీ భక్తుల రాకపోకల కోసం 125 బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రక్షణ, భద్రతకు పోలీసులు బందోబస్తు ప్రణాళిక రచించాలన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీ నిఘా వ్యవస్థల నడుమ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఏర్పాట్లు, 6 చోట్ల వైద్య శిబిరాలు, వైద్య సదుపాయాలు, అంబులెన్సులు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. రథోత్సవం, కల్యాణోత్సవం, చక్రస్నానం, జల విహారం ఘనంగా నిర్వహించాలన్నారు. సుమారు 380 పారిశుధ్య కార్మికులతో చెత్త సేకరణ, డంపింగ్ నిర్వహణ పక్కాగా చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ , తాగునీరు సరఫరా వంటి చర్యల ద్వారా భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి సమ న్వయం వహించాలన్నారు. విపత్తు నిర్వహణకు రెండు రాష్ట్ర స్థాయి విపత్తుల స్పందన నిర్వహణ బృందాలను నియమించామన్నారు. దేవదాయ శాఖ, పోలీస్, ఆర్టీసీ, వైద్య, శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. భక్తులకు అవసరమైన సమాచారం కోసం అనౌన్స్మెంట్లు, హెల్ప్డెస్క్లు, రెండు కమాండ్ కంట్రోల్ రూమ్లు నిర్వహించాలన్నారు. 1,300 మంది పోలీసులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహోత్సవం జరగాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్ఓ కే.మాధవి ఆర్డీఓలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నిద్ర మత్తులోకి జారకుండా..
● ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు ● ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం అమలుఅమలాపురం టౌన్: జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ చేపట్టింది. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు.. జిల్లాలోని ఎదుర్లంక నుంచి అమలాపురం వరకూ.. రావులపాలెం నుంచి సిద్ధాంతం వంతెన వరకూ జాతీయ రహదారుల పైన.. రాజోలు, కొత్తపేట తదితర స్టేట్ హైవేల పైన పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. లారీలు, భారీ వాహనాలు, వ్యాన్లు, కార్లు నడుపుతున్నప్పుడు డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు నిద్రమత్తులోకి జారుకునే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలోనే రెప్పపాటులో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఆ సమయంలో డ్రైవర్లను అప్రమత్తం చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో వెళ్లే వాహనాలను రోడ్డు చెంతన నిలిపి, ఆ డ్రైవర్ ముఖాన్ని చన్నీళ్లుతో ఓసారి కడుక్కునేలా చర్యలు తీసుకున్నారు. వారికి నిద్ర మత్తు పూర్తిగా తొలగిన తర్వాతే వాహనం నడిపేందుకు అనుమతించారు. నిద్ర మత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ఎదురయ్యే ప్రాణ నష్టాలు, ఇంటి వద్ద వారి కోసం ఎదురు చూసే భార్యాపిల్లలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై ఆ డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు రోడ్లపై ఇక నుంచి ప్రతి రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తం చేసేలా ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
వేగంగా కొత్త యూనిట్ల పనులు
పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సూచనలు, సలహాలు ఇస్తున్నాం. – సుజయ్ కుమార్, ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ ఏడాది లోపు పూర్తి చేసేలా.. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో చేపట్టిన కొత్త యూనిట్ల నిర్మాణ పనులు మొత్తం ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే చాలా వరకూ పనులు తుది దశకు వచ్చాయి. పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నాం. – సీహెచ్ రాజారావు, చీఫ్ ఇంజినీర్, ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ తుది దశకు అనుసంధాన పనులు కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఏడాది లోపే 5, 6 యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. – బి.బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో, పొల్లూరు ● -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా కలెక్టరేట్ గోదావరిభవన్లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటవరకు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు మూడు రెవె న్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతర్వేదిలో కొనసాగుతున్న రద్దీ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రంలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. సంక్రాంతి పర్వదినాల్లో అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి ఆదివారం కావడంతో మరింత పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చిన భక్తుల సంఖ్య రెట్టింపు అయింది. దేవస్థానం ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోవింద నామసమ్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కాగా ఆలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన హోమం, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేటి నుంచి పశువైద్య శిబిరాలు అమలాపురం రూరల్: అమలాపురం ఏరియా పశువైద్యశాల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎల్. విజయరెడ్డి ఆదివారం తెలిపారు. దీనిలో భాగంగా పశువైద్యాధికారి డాక్టర్ పూర్ణిమ నాగలక్ష్మి ఆధ్వర్యంలో వన్నె చింతలపూడి సొసైటీ చైర్మన్ నడింపల్లి వెంకటరామరాజు సోమవారం ఉచిత మెగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో ఎదకు రాని పశువులకు చికిత్స, చూడి పరీక్షలు, లేగదూడలకు నట్టల నివారణ మందులు, అవసరమైన వాటికి శస్త్ర చికిత్సలు, వ్యాధిగ్రస్థ పశువులకు నిపుణులైన పశువైద్యాధికారులు పరిశీలించి ఉచితంగా మందులు ఇస్తారన్నారు. పశువులకు టీకాలు వేస్తారని తెలిపారు. ఘనంగా సత్యదేవుని రథసేవఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవునికి ఆలయ ప్రాకారంలో ఆదివారం రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రథంపై వేంచేయించి, అర్చకులు దేవులపల్లి వరప్రసాద్ తదితరులు పూజలు చేశారు. అనంతరం, ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
విద్యుత్కు జలసత్వాలు
నిత్య జీవితంలో విద్యుత్ ఎంతో అవసరం. అలాంటి విద్యుత్ అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ముంపుచూపుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020లో ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంది. ఇక్కడ అదనంగా 5, 6 యూనిట్ల పనులు మొదలుపెట్టింది. దీనికి గాను రూ.536 కోట్లు కేటాయించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 80 శాతం పనులు జరిగాయి. కొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తి కానున్నాయి. తద్వారా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు మరింత ఆసరా కానుంది. మోతుగూడెం: తెలుగు రాష్ట్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తికి పొల్లూరు జల విద్యుత్ కేంద్రం చిరునామాగా నిలిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన చర్యలతో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ ఇప్పటికే నాలుగు యూనిట్లు ఉండగా, 5, 6 యూనిట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో పాత యూనిట్లు, కొత్త నిర్మాణాలకు మధ్య అనుసంధాన పనులు చేపట్టేందుకు సుమారు 45 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి ఫోర్బై రిజర్వాయర్ వరకూ సుమారు 16 కిలోమీటర్ల మేర పవర్ కెనాల్ కాంక్రీట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పవర్ కెనాల్కు సంబంధించి సైడ్ ప్యానళ్ల ప్లాస్టరింగ్తో పాటు కాంక్రీటింగ్, గ్రౌటింగ్ పనులు సుమారు రూ.1.50 కోట్లతో 20 మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పవర్ కెనాల్ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఫోర్బై జలాశయం అండర్గ్రౌండ్ టన్నెల్ వద్ద వికెట్ గేట్ల పనులు దాదాపు పూర్తి కానున్నాయి. దీంతో పాటు పవర్ హౌస్ వద్ద ఉన్న సర్జ్ ట్యాంక్లో నూతన గేట్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. వాల్వ్ హౌస్ వద్ద బటర్ఫ్లై వాల్వ్ను కొత్తగా నిర్మించిన పెన్స్టాక్ పైప్లైన్కు అనుసంధానించే కార్యక్రమం పూర్తవుతోంది. దీంతో పాటు పెన్స్టాక్ పైప్లైన్ వాల్వ్ హౌస్ నుంచి పవర్ హౌస్ దిగువన కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లకు అనుసంధానం చేసే పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి. పవర్ హౌస్ దిగువ భాగాన ట్రయల్ రేస్ సంపులో ఉన్న నీటిని పూర్తిగా తోడి, 5, 6 యూనిట్లకు అండర్ గ్రౌండ్లో డ్రాప్ ట్యూబ్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అండర్గ్రౌండ్ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు నిర్మించే ప్రాంతంలోని నీరు పవర్ హౌస్లోకి రాకుండా కాంక్రీటుతో పూర్తిగా మూసివేశారు. అయితే, అనుసంధాన పనులు చేస్తూండటంతో ఈ కాంక్రీట్ వాల్ను పగులగొట్టి డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజులుగా ఈ అనుసంధాన పనులతో పాటు పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్లో ఓవర్ హాలింగ్ పనులను అభిరామ కంపెనీకి అప్పగించి సాంకేతికంగా సరి చేస్తున్నారు. దీంతో పాటు డొంకరాయి పవర్హౌస్లో ఉన్న 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు రూ.28 లక్షలతో అభిరామ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. మరో 45 రోజుల్లో క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు పూర్తి చేసుకుని జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.పెరగనున్న ఉత్పత్తి ఏప్రిల్ నాటికి 5, 6 యూనిట్లలో ఒకటి పూర్తయితే పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి పెరగనుంది. ఈ నెల 25 లోపు అనుసంధాన పనులు పూర్తవుతాయి. పొల్లూరు జల విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యం 460 మెగావాట్లు. ఒక్కో యూనిట్ నుంచి 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కొత్తగా నిర్మించే 5, 6 యూనిట్లు పూర్తయితే అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇలా ఈ కేంద్రం సామర్థ్యం మొత్తం 690 మెగావాట్లకు పెరగనుంది. ఈ యూనిట్ల నిర్మాణం, అనుసంధాన పనులపై ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారం రోజుల కిందట ఆయన పొల్లూరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు. జల విద్యుత్కు చిరునామా ‘పొల్లూరు’ సామర్థ్యం పెంపునకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే పనులు త్వరలోనే అందుబాటులోకి రానున్న 5, 6 యూనిట్లు తద్వారా రాష్ట్రంలో మెరుగుపడనున్న సరఫరా -
వస్తాం.. మళ్లొస్తాం!
ఈ గాలీ.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. నా కళ్ల లోగిళ్లు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పదాలు పల్లెల ప్రశస్తిని పెంచేవే. పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజులపాటు సాగే పెద్ద ఉత్సవం. పట్టణాలకు.. నగరాలకు ఉదర పోషణకు వెళ్లిన ఈ ప్రకృతి ముద్దు బిడ్డలు ఈ పండగకు సొంతూళ్లకు వస్తున్నారంటే అందుకు ఎంతో ముందస్తు ప్రణాళిక వేసుకుంటారు. ‘ఒరేయ్ నువ్వొస్తున్నావా.. ఆడొస్తున్నాడా.. ఎహే.. పన్లేంట్రా.. ఆణ్ణీ ఆళ్లావిడ పిల్లల్నీ తీసుకుని రమ్మన్రా.. మళ్లీ ఎప్పటికో కలుస్తాం..’ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎన్ని ప్రసారమై ఉంటాయో.. గంపెడు పిల్లలున్న కుటుంబాలకు పల్లెల్లో కొదవులేదు. వారంతా పిల్లాజెల్లలతో అవకాశం ఉంటే వారి కుక్కపిల్లలతో సహా వచ్చి వారం రోజుల పాటు వారి వారి ఇళ్లల్లో ముచ్చట్లు.. మురిపాలు.. అల్లుళ్లు.. సందళ్లు.. ముగ్గులు నిండిన ముంగిళ్లు.. సంప్రదాయ పిండి వంటలు.. కోడి పందేలు.. చెరకు తోటల్లో తిరుగుళ్లు ఒకటేమిటి.. పుడమి పులకించిపోయేలా సందడిగా గడిపారు. పండగ సెలవులు గడిచిపోయాయి. చెమర్చిన కళ్లతో.. వీడి వెళ్లలేని వీడ్కోళ్లతో పల్లె బిడ్డలు పట్టణాలకు పయనమై వెళ్లిపోయారు. పల్లెల్లోని ఇళ్లన్నీ బోసిపోగా.. ఎవరి పనులు వారు చక్కబెట్టుకుంటున్నారు. సాక్షి, అమలాపురం: తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతి ముగిసింది. మూడు రోజుల పండగకు రెక్కలు కట్టుకుని వాలిపోయిన స్థానికులు, బంధువులు, మిత్రులు తిరుగు పయనమయ్యారు. ముక్కనుమ నాడు వేసిన రథం ముగ్గుతో వీధుల్లో రంగవల్లులు వేయడం నిలిపివేశారు. నాలుగు రోడ్ల కూడళ్లలో భగభగ వెలిగిన భోగి మంటల బూడిద మిగిలింది. జనంతో కళకళలాడిన అమ్మవారి జాతరలు, ప్రభల తీర్థాలు జరిగిన ప్రాంతాలు ఖాళీగా మారాయి. కోడి పందేలు, గుండాటల బరులు దీనంగా చూస్తున్నాయి. మొత్తం మీద పండగ అయిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు శనివారం నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. వీరి వెళ్లిపోవడంతో పల్లెలు బోసిపోయాయి. పండగ కోసం వచ్చినవారు ‘వెళ్లలేమంటూ.. వీడలేమంటూ.. వీడుకోలు’ పలుకుతున్నారు. సంక్రాంతి పండగ కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు స్థానికులు, వారి బంధువులు, ఇతర ప్రాంతాలకు చెందిన మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మూడు రోజుల పండగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సందడిగా గడిపారు. పట్టణాల్లో మరిచిపోయిన గోదావరి సంస్కృతి, సంప్రదాయాలు గుర్తు చేసుకున్నారు. పట్టు పరికిణీలు, పట్టు పంచెలు ధరించారు. భోగి మంటలు చుట్టూ చేరి ఆడిపాడారు. పొంగిన పాల కుండలను చూసి మురిసిపోయారు. గంగిరెద్దు వాళ్ల పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆరిసెలు, పాకుండలు రుచి చూశారు. వీటితో పాటు గోదావరి అల్పాహారం, ఈ ప్రాంత రుచులను ఆస్వాదించారు. కోడి పందేలు, ప్రభల తీర్థాలను చూసి ముచ్చటపడిపోయారు. పండగ మూడు రోజులూ తమను తాము మరిచిపోయారు. పాఠశాలల్లో చదువుకున్న పాత స్నేహితులు కలుసుకున్నారు. గత జ్ఞాపకాలు, అల్లర్లను గుర్తు చేసుకున్నారు. గురువులను గౌరవించుకున్నారు. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలను మదిలోనూ.. మొబైల్ఫోన్లలోనూ పదిలం చేసుకున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ఫొటోలు, రీల్స్ రూపంలో చక్కర్లు కొట్టించేస్తున్నారు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను వీడి వెళ్లలేక వెళుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా తిరుగుపయనమవుతున్నారు. తిరుగు ప్రయాణికులతో జిల్లాలోని బస్టాండ్లు, ప్రైవేట్ బస్సులు ఆగే ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రం అమలాపురం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు ప్రధాన బస్టాండ్లు శనివారం రాత్రి నుంచి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాలకే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప, శ్రీకాకుళం వెళ్లే వారితో వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు సరిపోక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే దారిలో అమలాపురం ఈదరపల్లి వంతెన, చిన్న వంతెన, పేరూరు ఎత్తురోడ్డు, ముమ్మిడివరం, మురమళ్ల సెంటరు, కొత్తపేట పాత బస్టాండ్, రావులపాలెం సెంటరు, ఆలమూరు జొన్నాడ సెంటర్లు ప్రయాణికులు వారిని దిగబెట్టేందుకు వచ్చిన బంధుమిత్రులతో కిటకిటలాడుతున్నాయి. రావులపాలెం బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూపు వీడలేక.. వెళ్లలేక వీడ్కోలు చెప్తున్న ఆత్మీయులు ముగిసిన సంక్రాంతి సెలవులు ఉద్యోగ, వ్యాపారాల కోసం తిరుగు పయనం ఆది, సోమవారాల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న ప్రయాణికులు బోసిపోయిన పల్లెలు -
జ్ఞాపకాల దొంతరతో వెళ్తున్నా
గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి వేడుకల్లో ఈ ఏడాది నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మురమళ్లకు పిలిచి పండగ వేడుకల్లో భాగం చేసుకున్నారు. ఇందంతా నా అదృష్టం. నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. ఈసారి నా వెంట అమెరికాకు చాలా అందమైన జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నాను. మళ్లీ సంక్రాంతి పండగకు వచ్చే వరకు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. – మోర్తా శిరోమణి, అమెరికా మధురానుభూతులతో వెళ్తున్నా మాది హైదరాబాద్. సంక్రాంతి పండగకు కోనసీమ జిల్లా అమలాపురంలో బంధువుల ఇంటికి వచ్చాం. ఇక్కడి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాను. ఆత్రేయపురంలో జరిగిన పడవల పోటీలు చూశాం. జగ్గన్న తోట ప్రభల తీర్థం చూసి ఆనందపడ్డాను. కోనసీమ సంప్రదాయమైన కోడి పందేలు చూశాం. పది రోజుల పాటు కోనసీమ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మధురమైన జ్ఞాపకాలతో ఇంటికి వెళ్తున్నాను. – మెల్లం రమేష్ బాబు, అధ్యాపకుడు, హైదరాబాద్ -
ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?
అమలాపురం రూరల్: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత యువకుడు మందా సాల్మన్ను పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ అమలాపురం మండలం ఈదరపల్లి బొంతువారిపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం వైఎస్సార్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పీఏసీ సభ్యుడు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ, పాముల రాజేశ్వరిదేవి, నియోజవర్గం కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్కుమార్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావులతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు, నాయకులు పాల్గొని నిరసన తెలిపి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం బొంతువారిపేట నుంచి ఈదరపల్లి వంతెన వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరవైందని మండిపడ్డారు. సాల్మన్ హత్య అత్యంత దారుణమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా చంద్రబాబూ?అని ప్రశ్నించారు. బాధితుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే యరపతినేని రక్తదాహానికి సాల్మన్ బలి : జగ్గిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల ఇష్టారాజ్యంతో వందలాది కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయన్నారు. భార్య అనారోగ్యం కారణంగా సొంతూరికి చూడటానికి వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సాల్మన్ను కిరాతకంగా టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి అతనిపై కేసులు పెట్టారన్నారు. పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గూండాల రక్తదాహానికి సాల్మన్ బలైపోయాడని అరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్నిబిహార్లా మార్చేసి వేడుక చూస్తున్నావా చంద్రబాబు అని ప్రశ్నించారు. పీఏసీ సభ్యుడు విశ్వరూప్ మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ను ఇప్పటికై నా పక్కన పెట్టాలి అని అన్నారు. చంద్రబాబు 18 నెలల పాలనలో 180 మంది దళితులపై హత్యలు, ఆత్యాచారాలు దాడులు జరిగాయని అన్నారు. పోలీసులు విఫలం : ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ సాల్మన్ హత్య జరగకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. సాల్మన్ హత్య తర్వాత దహన సంస్కారాలు కూడా చేయకుండా బంధువులను, నాయకులను అడ్డుకోవడం దారుణమని అన్నారు. సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వ అరాచకమని అన్నారు. చంద్రబాబు 18నెలల పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రలో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో దళితులకు రక్షణ లేకుండా పొయిందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. దళితులపై దాడులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ కుడుపూడి బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్యకుమార్, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, ఎంపీపీ యిళ్ల శేషరావు, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరిరామ్ గోపాల్, గౌనుకు గౌతమ్, మున్సిపల్ చైర్మన్, రెడ్డి నాగేంద్రమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, వైస్ ఎంపీపీ పొలమూరి బాలకృష్ణ, అమలాపురం పట్టణ, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు, తిక్కా ప్రసాద్, సరెళ్ల రామకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, తోరం గౌతమ్ రాజా, జాన గణేష్, సూదా గణపతి, విత్తనాల మూర్తి, చింతా రామకృష్ణ, వాసంశెట్టి సత్యనారాయణ, తిరుకొటి సతీష్కుమార్, ఉండ్రు చేట్ల రామారావు ,దూడల ఫణి, అడపా బాబులు, ఊటాల ఉదయకుమార్, ఎంపీటీసీ సభ్యులు వాసంశెట్టి శ్రీను, చొల్లంగి సుబ్బిరామ్, రేవు శ్రీనివాసరావు గుత్తుల సత్తిబాబు , కడిమి ప్రవేణ్, ఈతకోట శ్రావణ్ పాల్గొన్నారు. – సాల్మన్ పాశవిక హత్యకు నిరసనగా వైఎస్సార్ సీపీ ర్యాలీ -
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు ప్రభుత్వం
అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమం కంటే హత్యా రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురుజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త, దళిత యువకుడు మండా సాల్మన్ను ప్రభుత్వ ప్రోత్సాహంతో దారుణంగా హత్య చేసిన ఘటనను ఆయన ఖండించారు. ఈ మేరకు కిషోర్ అమలాపురంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. సాల్మన్ హత్య చంద్రబాబు ప్రభుత్వ రాక్షస పాలనకు అద్దం పడుతోందని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి దళితులన్నా, దళితుల ప్రాణాలన్నా చులకన భావన ఉందని ఆరోపించారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించేందుకు దళిత బహుజనుల సమీకరణ జరుగుతోందని కిషోర్ హెచ్చరించారు. అప్పనపల్లి బాలాజీకి రూ.8.16 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామికి శనివారం రికార్డు సంఖ్యలో ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.8,16,073 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 24 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 8,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.90,397 విరాళాలుగా అందించారన్నారు. మండపేటకు చెందిన మాకే ఏసుదాసు వారి కుటుంబ సభ్యులు స్వామి వారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50,049 విరాళంగా అందించారు. విద్యుత్ చార్జీలపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ రామచంద్రపురం: విద్యుత్ చార్జీలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ బి.రాజేశ్వరి, రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే రత్నాలరావు శనివారం ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి ఈ అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. 20న తిరుపతిలోనూ 22,23 విజయవాడ, 27న కర్నూలులో హైబ్రిడ్ విధానంలో అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు 1.00 నుంచి 2.30 గంటల వరకు ప్రత్యక్ష విధానంలో మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. -
‘సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను ఇకపై కాపాడలేరు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కర్ణుని జన్మ రహస్యం గోప్యంగా తల్లి కుంతీదేవి ఉంచడం వల్ల, తాను అన్నను చంపుకుని తీవ్ర శోకానికి గురయ్యానని, ఇకపై సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను కాపాడజాలరని ధర్మరాజు శపించాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం ఆయన హిందు సమాజంలో శాంతి పర్వంలోని పలు అంశాలను వివరించారు. రాజ్యపాలనకు విముఖత చూపిన ధర్మరాజు మహర్షుల, సోదరుల అభ్యర్థన మేరకు పట్టాభిషిక్తుడు అవుతాడు. కృష్ణపరమాత్మ పవిత్ర జలాలు నిండిన శంఖంతో ధర్మరాజును అభిషేకం చేస్తాడు. అందరూ ధృతరాష్ట్రుని ఆజ్ఞను పాటించాలని, పూర్వం ఆయన ఎటువంటి గౌరవం పొందేవాడో, అదే గౌరవం కొనసాగాలని, ఆయనే కురురాజ్యానికి నాథుడని ధర్మరాజు ప్రకటిస్తాడు. ధర్మరాజు వ్యక్తిత్వం అంతటి ఉన్నతమైనదని సామవేదం అన్నారు. భారతాన్ని మూడు భాగాలుగా చూడాలి–ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ పర్వాలకు ఆదిపంచకమని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, సీ్త్ర పర్వాలకు యుద్ధషట్కమని పేరు. ఇక శాంతి, అనుశాసన, అశ్వమేఽధిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలకు శాంతి సప్తకమని పేరు ఉన్నదని సామవేదం అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ భారతంలో కృష్ణుడు, రామాయణంలో హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని వర్ణించారని సామవేదం అన్నారు. నియమాలు అతిక్రమించిన వారే నియమాలు చెప్పడం చూస్తున్నాం, వీరికి ఉదాహరణగా దుర్యోధన, కర్ణులని పేర్కొనాలని ఆయన అన్నారు. భారతంలో 18 పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, భారత యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌ హిణుల సైన్యం, యుద్ధం 18 రోజులు నడిచిందని సామవేదం వివరించారు. వేల సంవత్సరాలకు ముందే యుద్ధనీతి, రాజనీతి వేళ్లూనుకున్న దేశం ఒక్క భారతదేశమే, జీవితాన్ని సర్వతోముఖంగా తీర్చిదిద్దగల శక్తి భారతానికి ఉన్నదని ఆయన అన్నారు. యుద్ధపర్వాల పేర్లు అన్నీ కౌరవపక్ష నాయకుల పేర్లు మాత్రమే ఉండటానికి కారణాలు సామవేదం వివరించారు. పాండవ పక్షాన యుద్ధం ఆదినుంచి అంతం వరకు ధృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధ్యక్షుడు, కౌరవుల పక్షాన వారు మారుతూ వచ్చారు. మానవుడికి సాధారణంగా మూడు స్థితులు తెలుసు, అవి స్వప్న, సుషుప్తి, నిద్రావస్థలు, వీటిని మించిన తురీయావస్థ గొప్ప యోగులకే సాధ్యమని అన్నారు. భీష్ముడు అస్తమిస్తే, సమస్త ధర్మాలు అస్తమిస్తాయని, శరతల్పగతుడయిన ఆయన నుంచి అన్ని ధర్మాలు తెలుసుకోవాలని కృష్ణుడు పాండవులకు చెప్పి, భీష్ముని వద్దకు తీసుకువెడతాడని, ఆ సమయంలో భీష్ముడు అచ్యుతుని చేసిన స్తోత్రం భీష్మస్తవ రాజం అత్యంత మహిమాన్వితమైనదని, స్తోత్రాలు అన్నీ వాగ్రూపమైన యజ్ఞాలని సామవేదం వివరించారు. -
నిత్య కల్యాణ గోవిందా..
– వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రం కొత్తపేట: నిత్యకల్యాణ.. గోవిందా.. నీరజనాభ గోవిందా.. అంటూ వాడపల్లి వెంకన్నను స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఓం నమో వేంకటేశా.. గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. స్వామివారిని భక్తులు దర్శించి పారవశ్యంతో ఓలలాడారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవులు కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆ క్షేత్రానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఇసుక వేస్తే రాలని రీతిలో కిక్కిరిసి, అడుగులో అడుగు వేస్తూ ఏడు ప్రదక్షిణలు పూర్తిచేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వే లాది మంది భక్తులతో క్యూ లు నిండిపోయాయి. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. మాడ వీధుల్లో, క్షేత్రంలో ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలు అందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను తమ వాహనాల నుంచి ఆలయం వరకు, దర్శనానంతరం తిరిగి వాహనాల వద్దకు చేరవేశారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, క్షేత్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. -
క్షేమంగా స్వదేశానికి..
ఖతార్ నుంచి ఇంటికి రప్పించిన కేఎంసీ బృందం అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో ఒక ఇంటిలో పనిచేస్తుండగా కింద పడి కాలుకి దెబ్బతగిలి పనిచేయలేక నరకయాతన పడిన ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువు గ్రామానికి చెందిన పి.వెంకటలక్ష్మిని కేఎంసీ బృందం క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చింది. పేరాయి చెరువుకు చెందిన పి.వెంకటలక్ష్మి గత సంవత్సరం జులై నెలలో ఖతార్ దేశం వెళ్లింది. అక్కడ ఒక ఇంటిలో పనికి కుదిరింది. అక్కడ పనిచేస్తుండగా ఇటీవల కాలు జారి పడిపోయింది. కాలికి బలమైన గాయం తగలడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అక్కడ ఇంటి యజమానులు పని చేయకపోతే కుదరదు అని చెప్పి, బలవంతంగా పనిచేయిస్తున్నారని దానివల్ల తన అక్క ఇబ్బంది పడుతోందని ఆమె సోదరుడు కృష్ణమూరి కలెక్టర్ మహేష్కుమార్, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఆశ్రయించారు. కనీసం వాళ్లు హాస్పిటల్కు తీసుకుని వెళ్లడం లేదని, అక్కను ఖతార్ నుంచి ఇండియాకు క్షేమంగా తీసుకురావాలని విన్నవించాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆమెను క్షేమంగా స్వదేశానికి తీసుకుని రప్పించాలని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందాన్ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడ ఏజెంట్ కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను తిరిగి రప్పించే ఏర్పాట్లు చేపట్టి స్వదేశానికి సురక్షితంగా చేర్చిందని నోడల్ అధికారి డీఆర్ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ శనివారం తెలిపారు. ఎమ్మెల్సీలకూ సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి అమలాపురం టౌన్: సీఎస్ఆర్ నిధులు ఎమ్మెల్సీలకు కూడా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.మోషేన్రాజును ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ కుడుపూడికి స్వయంగా అందించేందుకు చైర్మన్ మోషేన్రాజు శనివారం సాయంత్రం అమలాపురం వచ్చారు. ఎమ్మెల్సీని స్థానిక హైస్కూలు సెంటరులోని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సీఎస్ఆర్ నిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇస్తున్నారని, ఎమ్మెల్సీలకు కూడా ఆ నిధులను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి చైర్మన్ మోషేన్రాజుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ విజ్ఞప్తి పట్ల చైర్మన్ సానుకూలంగా స్పందించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను చైర్మన్ మోషేన్రాజు ఎమ్మెల్సీ కుడుపూడికి అందజేశారు. మోషేన్రాజుకు వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి త్రినాథ్, ముంగర ప్రసాద్, సీహెచ్.రంగరాజు, ఆర్.సత్తిబాబు రాజు, సీహెచ్. సుబ్బరాజు స్వాగతం పలికారు. విశ్వరూప్నకు ఆహ్వానం అమలాపురం రూరల్: శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్రాజు అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పీఏసీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ను కలసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలను అందించారు. పట్టణ, ఉప్పులగుప్తం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని నాని, బద్రి బాబ్జి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు దూడల ఫణి మోషేన్ రాజును సత్కరించారు. మహాలక్ష్మి ఆలయ నిర్మాణానికి రూ.28.49 లక్షల విరాళాలుపి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్మిర్మాణానికి భక్తులు శనివారం రూ.28.49 లక్షల మేర విరాళాలను ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామానికి చెందిన చిట్టాల ఆదినారాయణమూర్తి రూ.5,67,999, చిట్టాల పాండు రంగారావు కుటుంబ సభ్యులు రూ.5,00,116, దివంగత యర్రంశెట్టి కొండలరావు కుమారులు, కుమార్తెలు, మనుమలు కలిసి రూ.4,78,116, నల్లా ఆదినారాయణమూర్తి రూ.3,00,999, అల్లాడ భాస్కరరావు రూ.3,00,006, అల్లాడ మార్తాండ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు, డొక్కా జగ్గారావు కుటుంబ సభ్యులు రూ.1,00,800, డొక్కా చిట్టియ్య కుమారులు రూ.1,00,800, యర్రంశెట్టి నవీన్కుమార్ రూ.1,00,116, మంత రమణారావు కుటుంబ సభ్యులు రూ.1,16,000, చిట్టాల సత్యనారాయణ మూర్తి రూ.1,00,889, చిట్టాల చిట్టిబాబు రూ.51,116 ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. పలువురు గ్రామస్తులు రూ.10 వేల వంతున విరాళాలను ఆలయ కమిటీకి అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
శాంతిభద్రతల విధుల్లో..
ఫ చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్ ఫ అభినందించిన స్థానికులు సామర్లకోట: స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్సును వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తరువాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలు దేరారు. అయితే కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులకు సంబంధించిన బ్యాగ్తో విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడారు. -
శనైశ్చరునికి ప్రత్యేక తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రాతఃకాల సమయంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,53,290, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.99,200, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.37,684 వచ్చిందని ఈఓ సురేష్బాబు వివరించారు. -
నగమోము సింగారం
ఫ ఇమిటేషన్ జ్యూయలరీకి పెరిగిన ఆదరణ ఫ అందుబాటులో వివిధ రకాల ఆభరణాలు ఫ తక్కువ ధరలో లభించడంతో మహిళల ఆసక్తి ఫ శుభకార్యాలు, వేడుకల్లో వినియోగం రాయవరం: రోజు రోజుకూ బంగారం ధర కొండెక్కుతోంది. ప్రస్తుతం పది గ్రాములు రూ. రెండు లక్షలకు చేరువలో ఉంది. బంగారం, వెండి ధరలకు కళ్లెం లేకుంది. అయితే ఏ శుభకార్యమైనా మెడలో బంగారు నగలు ధరించాలని మహిళలకు ఉత్సుకత ఉంటుంది. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. అచ్చు బంగారం నగలను పోలిన జ్యూయలరీ ట్రెండ్ నడుస్తోంది. అలంకారం కోసమే కాకుండా పలు శుభ కార్యక్రమాల్లో సైతం ధరించేందుకు బంగారాన్ని మైమరపించేలా ఈ జ్యూయలరీ లభిస్తుండడంతో మహిళలు వీటినే కోరుకుంటున్నారు. చూస్తే నిజంగా బంగారు ఆభరణాలనే విధంగా ఆకట్టుకునే డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ నగలకు ఒక గ్రాము బంగారం అద్దడంతో నిజమైన పుత్తడిలా కనిపిస్తుంటుంది. పుత్తడితో పోల్చి చేసే నగలు బంగారం పూత పూసి స్వర్ణకాంతులతో శోభను సంతరించుకుంటున్నాయి. పాలు, నీళ్లకు మధ్య తేడాను హంసలు ఇట్టే కనిపెడతాయనేది నానుడి. అదే తరహాలో బంగారు నగలకు, గిల్టు నగల మధ్య తేడా కేవలం మహిళలకే తెలుస్తుంది. వివిధ రకాల లోహాలతో కూడిన పదునైన ఫినిషింగ్తో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. కొత్త ఫ్యాషన్లు, సరికొత్త నగలను కోరుకునే వారికి బీరువాలో నిజమైన ఆభరణాలు ఉన్నప్పటికీ ముస్తాబు కోసం బంగారాన్ని మరిపించే వివిధ లోహాల జ్యూయలరీని మహిళలు ఎంచుకుంటున్నారు. పసిడి పరుగులు పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. 2025 ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర రూ.1,02,650 ఉండగా, సెప్టెంబర్లో రూ.1,14,500, అక్టోబర్లో రూ.1.28 లక్షలు, నవంబర్లో రూ.1,29,100, డిసెంబర్లోరూ.1,39,600లు, 2026 జనవరిలో ఏకంగా రూ.1.49 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ఏడాది రూ.రెండు లక్షలకు చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.39 లక్షలకు చేరింది. బంగారం, వెండి వాటి రికార్డులను అవే తిరిగి రాస్తున్నాయి. ధగధగ మెరుపులు బంగారు ఆభరణాలతో సమానంగా ఇమిటేషన్ నగలు ధగధగ మెరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఇమిటేషన్ జ్యూయలరీ కొత్త డిజైన్లలో వస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా ఇమిటేషన్ నగల దుకాణాలు ప్రారంభించారు. అక్కడ మహిళలకు నచ్చిన కొత్త డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. వేసుకునే డ్రెస్లు, చీరలను బట్టి మ్యాచింగ్ డిజైన్లు దొరుకుతుండడంతో మహిళలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారు నగల షాపులతో పోటీగా వివిధ కంపెనీల పేరుతో ఇమిటేషన్ నగల దుకాణాలు వెలుస్తున్నాయి. బంగారం షాపులే అన్నట్లుగా ఉంటున్న ఈ షాపులు కూడా ఇటీవల కాలంలో రద్దీగా మారుతున్నాయి. ● గుర్తు పట్టలేనంతగా.. ఇమిటేషన్ నగలు బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. బర్త్ డే ఫంక్షన్ నుంచి పెళ్లిళ్ల వరకూ ఈ నగలనే వేసుకుంటున్నాం. బంగారు నగలు ఉన్నప్పటికీ ఇమిటేషన్ నగలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవి వివిధ రకాల కొత్త డిజైన్లలో ఉంటున్నాయి. –బీఎస్ సునీతాలక్ష్మి, ఉపాధ్యాయిని, ద్రాక్షారామ ● అందరికీ అందుబాటులో.. పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇమిటేషన్ నగలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నగలు ఒక కానుక అని చెప్పవచ్చు. ఎక్కడైనా పోగొట్టుకున్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. –జి.త్రివేణిస్వాతి, గృహిణి, కాకినాడ బంగారు పూతతో సరికొత్తగా.. బంగారం, వెండి పూతతో తళుకు తళుకుమంటూ మెరుస్తు న్న నగలను చూసి అ బ్బుర పడాల్సిందే. ఈ మెరుపులు కొన్ని నెల ల పాటు తాత్కాలిక మే అయినప్పటికీ రకరకాల డిజైన్లతో నగలు ఉండ డంతో అన్ని వర్గాల మహిళలు ఎక్కువగా కొను గోలు చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్, వైబ్సైట్ల ద్వా రా ఇమిటేషన్ నగలను అధికంగా కొంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ఈ దుకాణాలు ఏర్పాటయ్యాయి. -
● ఎటూ చూసినా..
పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేట సాగిస్తున్న మత్స్యకారులకు పంట పండింది. కనుమ రోజు శుక్రవారం సాయంత్రం సముద్రంపై లోతు జలాల్లోకి ఒక సోనా బోటుపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు సుమారు 20 టన్నుల టూనా రకం చేపలు చిక్కాయి. వీటిని శనివారం ఉదయం బోటులో హార్బర్కు తీసుకు వచ్చారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.40 లక్షలు వరకూ పలికిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. –సఖినేటిపల్లి ● మంచు కురిసే వేళలో.. మంచు కురిసే వేళలో ప్రకృతి అందాలు వర్ణనాతీతం. అంబాజీపేటలో హిమసోయగం కనువిందు చేసింది. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుంది. సూరీడు కూడా మంచు పొరలు చీల్చుకుని వెలుగులు ప్రసరింపజేయడానికి అష్టకష్టాలు పడ్డాడు. పచ్చని పంట పొలాలు, రహదారిపై మంచు పరదా కప్పేసింది. శనివారం ఉదయం 10 గంటలు దాటినా పొగ మంచు తొలగకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని పయనించారు. –అంబాజీపేట ● చేయి కలిపి.. ప్రాణం నిలిపి విధి నిర్వహణలోనే కాదు.. అవసరమైతే ప్రాణాలు కాపాడతామని ఆ అధికారులు నిరూపించి అందరి మన్ననలు పొందారు. మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో శుక్రవారం జరిగిన ప్రభల తీర్థానికి భారీగా జనం వచ్చారు. అక్కడ రాజమహేంద్రవరానికి చెందిన గొంతి గుణ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతనికి పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, అంబాజీపేట డిప్యూటీ ఎంపీడీఓ కె.శ్రీనివాస్లు ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అప్పటికీ ఊపిరి అందకపోవడంతో అర కిలోమీటరు దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లి అమలాపురం ఆసుపత్రికి తరలించారు. –అంబాజీపేట పల్లిపాలెం మార్కెట్లో ఐస్ బాక్సుల్లో భద్రపరుస్తున్న టూనా చేపలు -
అమాత్యా.. ఛీఛీ ఇవేం పాడు పనులు?
సాక్షి టాస్క్ఫోర్స్: సంక్రాంతి సంబరాల పేరిట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన డ్యాన్స్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట మ్యూజికల్ నైట్లు, రికారి్డంగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుల్లితెర, జబర్దస్త్లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ బహిరంగంగా చిందులు వేశారు.ఆయనతో పాటు ఆయన తండ్రి వాసంశెట్టి సత్య కూడా డ్యాన్సులు వేయడం కొసమెరుపు. అయితే బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా రికారి్డంగ్ డ్యాన్సులు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి మంత్రుల వల్ల రాష్ట్రం పరువు పోతోందని తప్పు పడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్లపై మంత్రి స్పందించిన తీరు మరిన్ని విమర్శలకు దారి తీసింది. ‘‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’’ అంటూ వింత ధోరణిలో సమర్థించుకోవడం గమనార్హం. -
సీమకు సుప్రభాతం..
● ఏకాదశ రుద్రులతో శోభిల్లిన కోనసీమ ● అంబరాన్నంటిన ‘ప్రభ’ల సంబరాలు ● జగ్గన్నతోటలో ఆధ్యాత్మిక పారవశ్యం ● కొత్తపేటలో దేవతల వైభవం ● పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట: ప్రకృతి రమణీయత ఉట్టిపడే కోనసీమ సంక్రాంతి పండగ వేళ మరింత శోభాయమానమై అలరారుతుంది. వీధుల్లో రంగవల్లులు.. కూడళ్లలో భోగిమంటలు.. సంప్రదాయ దుస్తులలో ముస్తాబయ్యే పల్లెవాసులు.. ఒకటేమిటి.. ఆ సందడే వేరుగా ఉంటుంది. రైతుల వద్ద.. జనం వద్ద సొమ్ములు లేక పండగ ఈసారి కళ తప్పినా ప్రభల తీర్థాలతో కాస్తా సందడి వచ్చింది. చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న జగ్గన్నతోట ప్రభల తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆకు పచ్చని వరిచేల మీదుగా.. నిలువెత్తు కొబ్బరి తోటల మధ్య నుంచి.. పంటకాలువల గలగలల మధ్య అందమైన రంగురంగుల ప్రభలు తీర్థాలకు తరలివచ్చాయి. కొత్తపేట తీర్థంతో గురువారం ఆరంభమైన ప్రభల ఉత్సవాలు శనివారం ముక్కనుమ వరకు సాగనున్నాయి. కొలువుదీరిన ఏకాదశ రుద్రులు చారిత్రక ప్రసిద్ధి పొందిన అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశ రుద్రుల ప్రభలు పంట పొలాలు, కాలువలు దాటుకు వచ్చి భక్తులను పరవశింపచేశాయి. ప్రభలపై వచ్చిన ఈశ్వరుని ప్రతిరూపాలను చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలలోను, ఇతర దేశాల్లోను ఉపాధి కోసం వెళ్లినవారు తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చారు. భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభలు మోసేవారి అశ్శరభ.. శరభ నినాదాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. వ్యాఘ్రేశ్వరునికి గౌరవ వందనం జగన్నతోట ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం ఉమా పార్వతీ సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్ కౌశిక దాటుకుని రావడాన్ని భక్తులు భక్తి పారవశ్యంతో వీక్షించారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. జగన్నతోట తీర్థానికి రాష్త్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ దంపతులతో పాటు ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఏపీ సాంస్కృతిక, కళలు కార్పొరేషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని తదితరులు హాజరై ప్రభలను వీక్షించారు. అంబరాన్నంటిన కొత్తపేట ఉత్సవం కొత్తపేట ప్రభల ఉత్సవం అంబరాన్ని తాకింది. మకర సంక్రాంతి సందర్భంగా గురువారం జరిగిన ఈ ఉత్సవానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ గ్రామం జనసంద్రమైంది. రోడ్లు, పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుంచి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మూడు వీధుల వారు పాల్గొన్నారు. తిరుగు ఊరేగింపులో భాగంగా పాత, కొత్త రామాలయం వీధుల వారు అర్థరాత్రి 2 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకు పాల్గొన్నారు. పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా కాల్పులతో ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. కాట్రేనికోన మండలం చెయ్యేరు, రావులపాలెం మండలం దేవరపల్లి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, వాడపర్రు, సన్నవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, కపిలేశ్వరపురం మండలాల్లో ప్రభల తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి. 55 అడుగుల ఎత్తయిన ప్రభ అంబాజీపేట మండలం వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువుకు చెందిన ఉమా సర్వేశ్వరస్వామి వారి ప్రభ, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి వార్ల ప్రభలు 55 అడుగుల ఎత్తున నిర్మించారు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల్లో ఎత్తయిన ప్రభలుగా ఇవి గుర్తింపు పొందాయి. -
జగన్నతోటలో భక్తుల ఆపసోపాలు
జగన్న తోట ప్రభల తీర్థం ఈ ఏడాది రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తీర్థాన్ని మాత్రం నిర్వహకులు చందాలు వేసుకుని ఘనంగా నిర్వహించారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది భక్తులు వస్తే పదుల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి వదిలేశారు. ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీస్ సిబ్బంది ముఖం చాటేశారు. మొసలపల్లి వంతెన వద్ద వీఐపీలకు కార్ పార్కింగ్ ఇవ్వడంతో అటువైపు తీర్థానికి వచ్చిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఒకనొక దశలో ఇక్కడ తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్ర పండగ అంటే ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రొటోకాల్ కల్పించడమే అన్నట్టుగా అధికారులు ఉత్సాహం చూపించారు. -
జూదం సంప్రదాయమై!
● జిల్లాలో బరి తెగించి పందేల నిర్వహణ ● వందకు పైగా బరులలో రూ.వంద కోట్లు దాటిన పందేలు ● ఒక్క మురమళ్లలోనే.. 40 కోట్లకు పైగా పందెం ● గుండాటలు.. పింగ్ పాంగ్ బాల్... లక్కీ డిప్లు ● ఫుడ్ స్టాల్స్ మీద సైతం దోపిడీ ● చెలరేగిన అధికార పార్టీ నేతలు సాక్షి, అమలాపురం: పచ్చనేతల అధికార బలం ముందు పోలీసు హెచ్చరికలు మూగబోయాయి. పందేలను అడ్డుకోవాలనే కోర్టు ఆదేశాలు.. చట్ట ప్రకారం శిక్షిస్తామన్న పోలీసుల ప్రకటనలకు జూదగాళ్లు వెరవకపోగా రెట్టించిన ఉత్సాహంతో బరితెగించి పందేలు నిర్వహించారు. పనిలో పనిగా రికార్డింగ్ డాన్సులు వేయించారు. పట్టణాలు.. పల్లెలన్న తేడా లేకుండా కోడి పందేలు, గుండాటలు నిర్వహించారు. మురమళ్ల, ఎస్.యానాంలో అయితే సంక్రాంతి సంబరాల మాటున అధికార పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పందేలు సాగిపోయాయి. పందేల బరిలో కోళ్ల తలలు తెగిపడ్డాయి. నోట్ల కట్టలు పెళపెళలాడాయి. ఈ ఏడాది పట్టణాలు.. పల్లెల్లో సంక్రాంతి పండగ సందడి లేకున్నా.. బరులు, రికార్డింగ్ డ్యాన్సుల వద్దనే సందడంతా కనిపించింది. పందేల మీద నిషేధాజ్ఞలు.. నిఘా కళ్లు ‘లెక్క’ల చా టున జారుకున్నాయి. వేలు..లక్షలు కాదు.. కోట్ల రూ పాయలు చేతులు మారాయి. అధికార పార్టీకి చెందిన టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని మరీ పందేలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా కలిపి వంద వరకు బరులు వేశారు. సంబరాల వేదికల వద్ద కార్లు, మోటారు సైకిళ్లకు లక్కీ డిప్లు ఏర్పా టు చేసి కొత్త తరహా లాటరీలు మొదలు పెట్టారు. ఇలా సర్వం జూదగాళ్ల నుంచి దోపిడీ చేశారు. రూ.లక్షలలో పందేలు జిల్లాలో అతి పెద్ద పందేలు ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరిగాయి. పెద్ద బరిలో రోజుకు 25 పందేల చొప్పున మొత్తం మూడు రోజుల కలిపి మొత్తం 75 పందేలు నిర్వహించారు. స్థానికులే కాకుండా తెలంగాణ, చైన్నె, బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, ఆ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు రూ.లక్షలలో పందేలు కాశారు. ఒక్కొక్క పందెం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిగింది. మూడు రోజులకు కలిపి రూ.37.50 కోట్ల మేర పందేలు జరిగినట్టు అంచనా. ఇది కాకుండా మరో రెండు చిన్న బరులలో కోడి పందేలు జరిగాయి. వీటితో పాటు గుండాట, బాల్ గుండాట, చక్రం గుండాటలు కూడా నిర్వహించగా, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పందేలు కాశారు. మొత్తం మీద అన్ని పందేలు కలిపి ఇక్కడ రూ.50 కోట్ల మేర సాగాయి. ఈ పందేలకు కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ వంటి వారు వచ్చారు. పందేలకు మహిళలు పెద్దగా రావడంతో పాటు వారు కూడా ఉత్సాహంగా పందేలు కాయడం గమనార్హం. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కాట్రేనికోన మండలం చెయ్యేరు, ముమ్మిడివరం ప్రాంతాల్లో కూడా భారీగా పందేలు జరిగాయి. అమలాపురం నియోజకవర్గంలో మొత్తం 26 బరులు, 19 వరకూ గుండాట బోర్డులు నిర్వహించారు. మొత్తం 3 రోజుల్లో కోడి పందేల ద్వారా రూ.3.5 కోట్లు, గుండాటల బోర్డుల ద్వారా రూ.రెండు కోట్ల పందేలు జరిగినట్టు అంచనా. అల్లవరం మండలం రెల్లుగడ్డ, కోడూరుపాడుల్లో పెద్ద పందేలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేటలలో సుమారు 20 బరులలో కోడి పందేలు నిర్వహించగా, 53 గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.మూడు కోట్ల మేర చేతులు మారినట్టు సమాచారం. రామచంద్రపురం నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 12 బరులలో పందేలు నిర్వహించారు. సుమారు రూ.1.5 కోట్ల మేర పందేలు జరిగాయి. రాజోలు దీవిలో మలికిపురం, మామిడికుదురు మండలాల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. ఇక్కడ పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు కూడా యథేచ్చగా సాగాయి. కేశనపల్లి, తూర్పుపాలెం, గోగన్నమఠం, మగటపల్లిలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సూచనలతో పోలీసులు మూడు రోజుల మౌనదీక్ష వహించారు.ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడి పందేలు -
భక్తులతో కిక్కిరిసిన నృసింహ క్షేత్రం
సఖినేటిపల్లి: సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయ పరిసర ప్రాంత వాసులతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలి వచ్చిన భక్తులు భారీ క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన హోమం, విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం స్వామి, అమ్మవార్లను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అరటిపళ్లు, కొబ్బరికాయలను భక్తులు నైవేద్యాలుగా సమర్పించుకున్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో సిక్కిం డీజీపీ నవుండ్రు అమలాపురం రూరల్: సిక్కిం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న నవుండ్రు శ్రీధరరావు ఆయన సొంత గ్రామం మండలంలోని జనుపల్లిలో నిర్వహిస్తున్న సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మడికి శ్రీరాములు ఆధ్వర్యంలో శుక్రవారం సిక్కిం రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నవుండ్రు శ్రీధర్రావును జనుపల్లిలోని ఆయన నివాసగృహంలో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. శ్రీధర్రావు గతంలో ఢిల్లీ డీజీపీగా పని చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, సబ్ రిజిస్ట్రార్ రాయి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ‘నేనెంతో.. నా సోదరుడూ అంతే’ సామవేదం షణ్ముఖ శర్మ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘అమ్మా! ఇతరుల నెత్తురు తాగరాదు. నేనెంతో నా సోదరుడూ అంతే. సోదరుని నెత్తురు తాగవచ్చునా? దుశ్శాసనుడి నెత్తురు నా దంతాలు, పెదవులు దాటి లోపలకు పోలేదు’ అని గాంధారితో భీముడు చెప్పినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో శుక్రవారం ఆయన సీ్త్ర పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. ‘దుశ్శాసనుడి రొమ్ము చీల్చి, నెత్తురు తాగడం హేయమైన పని అని భీముడిని గాంధారి నిందిస్తుందించగా, ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేని క్షత్రియుడు ధర్మానికి దూరమవుతాడని భీముడు ఆమెకు బదులిస్తాడని, పాండవులను శపించడానికి గాంధారి సిద్ధపడిందని తెలుసుకున్న వ్యాస మహర్షి అక్కడకు వచ్చి నీ కొడుకు యుద్ధంలో నిత్యం నీ ఆశీస్సుల కోసం వచ్చేవాడు. యతోధర్మస్తతో జయః అని నీవు దీవించేదానివి. నీ మాటే నిజమైందని చెప్పిన ఆయన మాటలకు గాంధారి శాంతించింద’ని సామవేదం వివరించారు. తరువాత ఆమె కోపం కృష్ణుని వైపు మళ్లిందని ‘నీవే తలచుకుంటే ఈ మహావిపత్తును నివారించేవాడివని, నేను పతిశుశ్రూష చేసి సంపాదించుకున్న పుణ్యంతో నిన్ను శపిస్తున్నాను. ఇక 36 ఏళ్లకు నీ దాయాదులు పరస్పర కలహాలతో మరణిస్తారు. నీవు కూడా దిక్కులేని మరణం చెందుతావని ఆమె శపిస్తుందని, దానికి కృష్ణుడు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ముందుగా నిర్ణయమైన దానినే నీవు శాపం ద్వారా తెలియపరుస్తున్నావు. నీ తపోశక్తి వ్యర్థం చేసుకుంటున్నావ’ని కృష్ణుడు నవ్వుతూ చెప్పినట్టు షణ్ముఖశర్మ వివరించారు. అలాగే ‘నీ కొడుకు దుర్యోధనుడు దురాత్ముడు, ఈర్ష్యాళువు, తనను తాను పొగుడుకునే వాడు, క్రూరుడు, శత్రుభావం కలవాడు, పెద్దల మాటను గౌరవించే స్వభావం లేనివాడు’ అని గాంధారికి వివరించి ధర్మదృష్టి లేని తపస్సు అనర్థదాయకమని ఆయన తెలిపారు. ‘రణభూమిలో పడి ఉన్న దుర్యోధనుడిని చూసి గాంధారి తీవ్రశోకానికి లోనై దుర్యోధనుడు యుద్ధంలో మరణించలేదు. కృష్ణుని, విదురుని మాటను గౌరవించని నాడే మరణించాడని ఆమె భావించింది’ అని చెప్పారు. -
అల్లుడికి 220 రకాల పిండి వంటలతో విందు
కాకినాడ : అతిథి మర్యాదలకు గోదారోళ్లకు పేరుంది. దీనిని నిలబెట్టేలా పెరవలిలో కొత్త అల్లుడికి 220 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయటం ఆకట్టుకుంది. పెరవలికి చెందిన ఆగర్తి వెంకట కృష్ణారావు, స్వరూపారాణి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మికి హైదరాబాద్కు చెందిన బొడ్డు భార్గవ్సాయితో ఐదు నెలల కిందట పెళ్లి జరిగింది. పండగకు అత్తింటికి వచ్చిర భార్గవ్సాయికి మకర సంక్రాంతి రోజున ఇలా వడ్డించారు. తానెప్పుడూ ఇన్ని వంటలు చూడలేదని, పేర్లు కూడా వినలేదని ఆయన ఆ«శ్చర్యంగా చెప్పారు. పొట్టిగిత్త బండి.. అదిరిందండి సంక్రాంతి అంటేనే రైతు పండగ. తొలకరి పంట చేతికి అందిన తర్వాత రైతులు చేసుకునే పెద్ద పండగ ఇదే. కనుమ పండగ సందర్భంగా కొమరగిరిపట్నంలో రైతు మెట్ల చినకాపు పొట్టి గిత్తల బండికి పూజ నిర్వహించి శుక్రవారం ఊరేగించారు. ప్రస్తుతం కాడెద్దులు మచ్చుకైనా లేని తరుణంలో పొట్టిగిత్తలతో ఊరేగింపు నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి దృశ్యాలే మళ్లీ జీవం పోస్తాయి. – అల్లవరం -
ప్రభల తీర్థం.. కన్నుల వైభవం
సాక్షి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రారంభమైంది. మొత్తం 11 గ్రామాల్లో భాగంగా.. పాలగుమ్మిలో మొదటి ప్రభ ప్రారంభమైంది. ప్రభల ఊరేగింపు అనంతరం ప్రభలు జగ్గన్న తోట చేరుకోనున్నాయి. ఈసారి తీర్థంలో 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ప్రభల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవాలు ముఖ్యమైనవి. వీటితో పాటు చిరుతపూడి (అవిడి డ్యామ్ సెంటర్), మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరులలో అతి పెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు.అంబాజీపేట మండలం మొసలపల్లి – ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాలు జరుగుతాయి. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వరుడు, కె.పెదపూడి – మేనకేశ్వరుడు, ఇరుసుమండ – ఆనంద రామేశ్వరుడు, వక్కలంక – విశ్వేశ్వరుడు, నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి. ముక్కామల – రాఘవేశ్వరుడు, మొసలపల్లి –భోగేశ్వరుడు, పాలగుమ్మి – చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహారం – వీరేశ్వరుడు, గంగలకుర్రు – చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరుడి ప్రభలు ప్రసిద్ధి చెందాయి.కొత్తపేట ప్రభల తీర్థం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఆయా వీధులకు చెందిన 11 ప్రభలు వివిధ దేవతా మూర్తులను అలంకరించుకుంటాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, రాత్రి బస్టాండ్ వద్ద బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పైరెండు వీధులతో పాటు బాణసంచా కాల్చుతున్నారు.అంబాజీపేట మండలం వాకలగరువు రావిచెట్టు సెంటర్లో జరిగే తీర్థానికి అరుదైన గుర్తింపు ఉంది. జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలలోని ప్రభలన్నింటికన్నా ఇక్కడ అతి పెద్ద ప్రభలను ఉంచుతారు. తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, వాకలగరువు ఉమా సర్వేశ్వరస్వామితో పాటు గున్నేపల్లి ప్రభలు కొలువు తీరుతాయి. వాకలగరువు, తొండవరం ప్రభలు ఎత్తుగా నిర్మించడంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఈ రెండు ప్రభలను 55 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. తాటి, వెదురు, పోక చెట్లను ఉపయోగించి భారీ ప్రభలను తయారు చేస్తుంటారు. రంగు రంగు కంకర్లు, నూలు వ్రస్తాలతో వీటిని అందంగా ముస్తాబు చేస్తారు. వీటికి వరి కంకులు, కూరగాయలతో పాటు నెమలి పింఛాలను అలంకరిస్తారు. సుమారు 10 అడుగుల నుంచి 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల నుంచి 55 అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రభలు కనీసం టన్ను బరువు ఉంటాయి. -
అప్పులతో పాలన సాగిస్తున్న చంద్రబాబు
● 18 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు ● మెడికల్ కళాశాలలకు రూ.5,200 కోట్లు ఖర్చు చేయలేరా! ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వరూప్ ● భోగిమంటలో పీపీపీ జీవో ప్రతుల దహనం అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పులతో రాష్ట్రాన్ని అతి కష్టంగా నడిపిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్టినేటర్ పినిపే విశ్వరూప్ అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అమలాపురం మండలం భట్నవిల్లిలోని ఆయన నివాస ప్రాంగణంలో బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగి మంటలో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడేందుకు వాటిలో కేవలం రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేసి కోటి సంతకాలు సేకరించి, గవర్నర్కు అందించినా చంద్రబాబు ప్రభుత్వ మెండిగా వ్యవహరిస్తోందన్నారు. ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన మనుషులకు పీపీపీ విధానంలో ఇచ్చేస్తున్నారని విమర్శించారు. రద్దు చేసేవరకూ పోరాటం ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రూ.1700 కోట్లు ఖర్చుచేయనున్న చంద్రబాబు ప్రభుత్వానికి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు డబ్బు లేకపోవడం హాస్యాస్పదమన్నారు. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ వందేళ్లలో రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి వెంకటేశ్వరబాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, చేనేత సెల్ అధ్యక్షుడు జాన గణేష్, ఎంపీపీ ఇళ్ల శేషారావు, జెడ్పీటీసీ సభ్యడు పందిరి శ్రీహరి రామ్గోపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సంసాని చంద్రశేఖర్, గుత్తుల చిరంజీవి, కొనుకు బాపూజీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సరేళ్ల రామకృష్ణ, ఎంపీటీసీలు చొల్లంగి సుబ్బిరామ్, వాసంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రతినిధులు బొడ్డు బుజ్జి, ఇళ్ల గోపాలకృష్ణ, తిక్కా వెంకట ప్రసాద్, దూడల ఫణికుమార్, ఈతకోట శ్రావణ్, తిరుకోటి సతీష్, గుద్దటి నాగరాజు, ఊటల ఉదయ్, సంతోష్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో భోగి
ఐ.పోలవరం: జిల్లా ప్రజలు బుధవారం భోగి పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి, సంబరాలు జరుపుకొన్నారు. చిన్న పిల్లలకు భోగిపండ్లు పోశారు. ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి సంతోషంగా గడిపారు. ప్రతి ఇళ్లూ బంధుమిత్రులు, స్నేహితులతో కిటకిటలాడింది. ప్రభల తీర్థానికి బందోబస్తు అంబాజీపేట: మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో శుక్రవారం జరిగే ప్రభల తీర్థానికి కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో 314 మందితో భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్టు పి.గన్నవరం సీఐ వై.భీమరాజు తెలిపారు. ఎస్సై కె.చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ పార్టీలు తీర్థంలో సంచరిస్తారన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల దారి మళ్లింపు కొత్తపేట: సంక్రాంతి ప్రభల ఉత్సవం సందర్భంగా గురువారం కొత్తపేట మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ప్రభల ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కనుమ పండగ (శుక్రవారం) రోజు జరుగుతుండగా, కొత్తపేటలో మాత్రం సంక్రాంతి (గురువారం) నాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బంది పడకుండా డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యా మ్నాయ మార్గాలను నిర్దేశించామన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ అమలాపురం, రావులపాలెం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించామన్నారు. రావులపాలెం వైపు నుంచి అమలాపురం వెళ్లే వాహనాలన్నీ బోడిపాలెం వంతెన నుంచి వాడపాలెం, వానపల్లి, అయినవిల్లి ,ముక్తేశ్వరం మీదుగా అమలాపురం వెళ్లాలన్నారు. అదే విధంగా అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు పలివెల వంతెన నుంచి పలివెల గ్రామం, గంటి మలుపు, ఈతకోట మీదుగా జాతీయ రహదారి ఎక్కాలని సూచించారు. సంక్రాంతి శుభాకాంక్షలుఅమలాపురం రూరల్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకై న సంక్రాంతి పండగను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. ఆయన బుధవారం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో కనువిందుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సముద్రమంత సైన్యం గోష్పాదమంతైంది ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కురు పాండవ సంగ్రామం 18వ రోజు 11 అక్షౌహిణుల సముద్రమంత కురుసైన్యం గోష్పాదమంత అయ్యిందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన చివరి రోజు యుద్ధ విశేషాలను వివరించారు. సర్వసైన్యాధి అయిన శల్యుని, అతడి సోదరుని ధర్మరాజు వధిస్తాడు. సహదేవుడు శకునిని వధిస్తాడు. వికల మనస్కుడైన దుర్యోధనుడు ఒంటరిగా, కాలి నడకన వెళ్లి జల స్తంభన విద్య ద్వారా నీటి మడుగులోకి ప్రవేశిస్తాడు. ఈ వార్త తెలిసిన పాండవులు మడుగు వద్దకు వెళ్లి దుర్యోధనుని యుద్ధానికి ఆహ్వానిస్తారు. తన వారందరూ మరణించారు కనుక, రాజ్యం మీద తనకు ఆసక్తి లేదని, అది పాండవులకే ఇచ్చి వేస్తానని దుర్యోధనుడు అంటాడు. దానంగా ఇచ్చిన రాజ్యాన్ని మేము స్వీకరించ బోమని ధర్మరాజు చెబుతాడు. భీముడు గదతో తొడలు బద్ధలు కొట్టగా దుర్యోధనుడు రణభూమిలో పడిపోతాడని సామవేదం అన్నారు. 20 లోపు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 7వ తరగతి మార్కుల సర్టిఫికెట్లను ఈనెల 20వ తేదీ లోపు సిద్ధం చేసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు. -
ఇది జగన్ సాధించిన నైతిక విజయం
అల్లవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు విడుదల చేసిన జీవోపై మూడు నెలల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన నైతిక విజయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. సామాన్యులకు ఉచిత విద్య, వైద్యాన్ని దూరం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీలను ఆమె భోగిమంటలో వేసి దహనం చేశారు. అల్లవరం మండలం మొగళ్లమూరులో బుధవారం ఆమె నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. -
ప్రభల తీర్థం.. కన్నుల వైభవం
● కోనసీమ ప్రభలకు ఎంతో గుర్తింపు ● ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల రాక సాక్షి, అమలాపురం/అంబాజీపేట/ కొత్తపేట: జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. ముఖ్యంగా కోనసీమలో జరిగే ప్రభల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవాలు ముఖ్యమైనవి. వీటితో పాటు చిరుతపూడి (అవిడి డ్యామ్ సెంటర్), మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరులలో అతి పెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు. జగ్గన్నతోటలో.. అంబాజీపేట మండలం మొసలపల్లి – ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాలు జరుగుతాయి. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వరుడు, కె.పెదపూడి – మేనకేశ్వరుడు, ఇరుసుమండ – ఆనంద రామేశ్వరుడు, వక్కలంక – విశ్వేశ్వరుడు, నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి. ముక్కామల – రాఘవేశ్వరుడు, మొసలపల్లి – భోగేశ్వరుడు, పాలగుమ్మి – చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహారం – వీరేశ్వరుడు, గంగలకుర్రు – చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరుడి ప్రభలు ప్రసిద్ధి చెందాయి. సంక్రాంతి నాడే.. కొత్తపేట ప్రభల తీర్థం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఆయా వీధులకు చెందిన 11 ప్రభలు వివిధ దేవతా మూర్తులను అలంకరించుకుంటాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, రాత్రి బస్టాండ్ వద్ద బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పైరెండు వీధులతో పాటు బాణసంచా కాల్చుతున్నారు. 55 అడుగుల ఎత్తులో.. అంబాజీపేట మండలం వాకలగరువు రావిచెట్టు సెంటర్లో జరిగే తీర్థానికి అరుదైన గుర్తింపు ఉంది. జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలలోని ప్రభలన్నింటికన్నా ఇక్కడ అతి పెద్ద ప్రభలను ఉంచుతారు. తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, వాకలగరువు ఉమా సర్వేశ్వరస్వామితో పాటు గున్నేపల్లి ప్రభలు కొలువు తీరుతాయి. వాకలగరువు, తొండవరం ప్రభలు ఎత్తుగా నిర్మించడంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఈ రెండు ప్రభలను 55 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. బరువు టన్నుకు పైబడే.. తాటి, వెదురు, పోక చెట్లను ఉపయోగించి భారీ ప్రభలను తయారు చేస్తుంటారు. రంగు రంగు కంకర్లు, నూలు వస్త్రాలతో వీటిని అందంగా ముస్తాబు చేస్తారు. వీటికి వరి కంకులు, కూరగాయలతో పాటు నెమలి పింఛాలను అలంకరిస్తారు. సుమారు 10 అడుగుల నుంచి 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల నుంచి 55 అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రభలు కనీసం టన్ను బరువు ఉంటాయి. గుర్తింపు సరే.. నిధులు ఎక్కడ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండగా గుర్తించింది. తాము వచ్చాక ప్రభల తీర్థానికి గుర్తింపు వచ్చిందన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ గుర్తింపు వల్ల ఈ తీర్థానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అధికారులు మాత్రం ఈ గుర్తింపు వల్ల కేవలం పరిపాలనా సౌకర్యాలు మాత్రమే కలుగుతాయని చెబుతున్నారు. నిధుల మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వంలోనే అసలైన గుర్తింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2023లో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో దీనిని రాష్ట్ర శకటంగా గుర్తించి ప్రదర్శనకు ఉంచారు. తీర్థం ఉట్టిపడేలా ఈ శకటం మీద పదకొండు ప్రభలను సంప్రదాయ బద్ధంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. నాటి రిపబ్లిక్డే పెరేడ్తో ఇది జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని కోనసీమ వాసులు ఇప్పుడు గుర్తుక చేసుకుంటున్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టొద్దు
ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నల్లజర్ల/జంగారెడ్డిగూడెం: ‘వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టవద్దని ముందే చెప్పాం. అయినా కూటమి నాయకులు, కార్యకర్తలు వినడం లేదు. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. ప్రజలు మీకిచ్చిన పదవీకాలంలో మరో రెండు సంక్రాంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జరిగేది మీరే చూస్తారు...’ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆర్.శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసుల వేధింపులకు గురైన యువకులను బుధవారం శ్యామల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో ఇక్కడ కొందరు తమ్ముళ్లకు అన్యాయం జరిగిందని, ఒక అక్కగా వారిని కలవాలని వచ్చానని శ్యామల చెప్పారు. అనంతరం పడమర చోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు గొడ్డును బాదినట్లు బాదుకుంటూ రోడ్డుపై నడిపించడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ తమ పార్టీ శ్రేణుల మంచితనమే చూశారని, ఇక నుంచి రెచ్చిపోయే ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్తకు తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శ్యామల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కూడా వచ్చి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. -
కల్యాణం.. కడు వైభోగం
స్వామి, అమ్మవార్లకు కల్యాణ వస్త్రాలు తీసుకు వస్తున్న చైర్మన్ రాజు, ఈఓ చక్రధరరావు దంపతులు వాడపల్లి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో గోదారంగనాథ స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని క్షేత్రాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భోగి పండగ సందర్భంగా మంట వేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు గోదాదేవిని పెండ్లి కుమార్తెగా, రంగనాథ స్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి భక్తజనం నడుమ ఆ క్షేత్రంలోని కల్యాణ వేదిక పైకి తోడ్కొని వచ్చారు. స్వామివారికి ఎమ్మెల్యే సత్యానందరావు, చైర్మన్ వెంకట్రాజు, డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ క్రతువును వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతంలో భాగంగా అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావైని అనుసంధానించి, చివరిగా కల్యాణంతో ముగించి గోదారంగనాథుల కృపకు పాత్రులు కావడం అత్యంత అవశ్యమని పండితులు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకించారు. సుమారు రెండు వేల మంది అవివాహితులు యువతీ, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. -
శివమణికంఠకు జాతీయ స్థాయి గుర్తింపు
కోటనందూరు: ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2026లో కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలేనికి చెందిన కొరుప్రోలు శివమణికంఠ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగిక విద్యను అందిస్తూ ప్రయోగశాల జ్ఞానాన్ని నేరుగా పొలాలకు తీసుకెళ్లే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. శివమణికంఠ తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యక్షంగా పంచుకున్నారు. టాప్– 5 ప్రతిపాదనల్లో శివమణికంఠ ప్రతిపాదన ఉండడంతో ఆయనకు జాతీయ గుర్తింపు లభించింది. విద్య, పరిశోధనకు వ్యవసాయాన్ని అనుసంధానించే తన తన వినూత్న ఆలోచనలు దేశ వ్యవసాయ అభివృద్ధికి దిశానిద్దేశం చేస్తాయని నిపుణులు అన్నారు. విజయనగరం ట్రైబుల్ వెల్ఫేర్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న శివమణికంఠను స్థానిక పెద్దలు, అధ్యాపకులు అభినందించారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య చింతూరు: స్థానిక శబరినది ఒడ్డున చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. శబరినది ఒడ్డున ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన చెందక వెంకటేష్(27)గా గుర్తించామని, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే శక్తివంతం ఏకాదశ రుద్రులు అంబాజీపేట: విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ఎన్నో ప్రాచీన దేవాలయాలు నేడు జీర్ణ దశకు చేరుకోవడంతో వాటి పునర్నిర్మాణం కోసం ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు హంపీలోని పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. కె.పెదపూడిలో ప్రముఖ సిద్ధాంతి రాపాక శేషాచలం స్వగృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కోనసీమలో ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల దేవాలయాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అన్నవరం, అంతర్వేది లాంటి ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయన్నారు. విజయనగర సామ్రాజ్యంలో హంపిలో నిర్మించిన పలు దేవాలయాలు జీర్ణోద్ధారణ చేసే ముందు కోనసీమలో ఉన్న ఏకాదశ రుద్రుల దర్శించుకోవడం శ్రేయస్కరమని స్వామీజీ చెప్పారు. ఏకాదశ రుద్రుల పేర్లు వేరైనా వారి అంశ ఒక్కటేనని అన్నారు. ఏకాదశ రుద్రులు ఈ నాటివారు కారని వేదాలలోనే ఉందన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ఉన్నట్లు హంపిలో హనుమ జన్మభూమి నిర్మిస్తామన్నారు. రాబోయే 2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయని, ప్రభుత్వం భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందు ఏకాదశ రుద్రుల దేవాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు. -
● జై.. పలికారు
● లక్షణంగా సందడి ఓడలరేవు బీచ్లో పతంగులను ఎగుర వేస్తున్న పర్యాటకులు అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం చైన్నెలోని మేరీనా బీచ్ను తలపించింది. తారాడి ధర్మారావు ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా కై ట్ ఫెస్టివల్ నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి పిల్లాపాపలతో గాలి పటాలను ఎగురవేశారు. కై ట్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకులకు ఉచితంగా పతంగులను అందించారు. – అల్లవరం మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేశారు. లక్షకు పైగా పిడకలతో తయారు చేసిన దండను గ్రామంలో ఊరేగించి అనంతరం ఆ దండను భోగి మంటలో వేసి సందడి చేశారు. – మామిడికుదురు పందేలకు సై అన్నారు.. బరుల వద్ద ఎక్కడ చూసినా క్యూ కట్టారు.. ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద కోడిపందేలు పెద్దఎత్తున జరిగాయి. రూ.కోట్లలో సాగుతున్న ఈ పందేలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భారీగా వచ్చారు. ఆ బరి వద్ద కార్ల పార్కింగ్కు స్థలం సరిపోలేదు మరి. – ఐ.పోలవరం -
రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం
● జగ్గన్నతోటలో ఎన్నడూ లేని సంస్కృతి ● ఫ్లెక్సీలు తొలగించకుంటే తీర్థానికి వచ్చేది లేదన్న గ్రామస్తులు అంబాజీపేట: కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం రగులుతోంది. బుధవారం గంగలకుర్రులో గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రులకు చెందిన గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగ్గన్నతోటను రాజకీయ తీర్థంగా మార్చారని సమావేశం ఆరోపించింది. మునుపెన్నడూ లేనివిధంగా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నూతన సంస్కృతికి తెర తీశారని ప్రభల కమిటీ సభ్యులు ఆరోపించారు. ఫ్లెక్సీలు తొలగించకుంటే రెండు గ్రామాల నుంచి వచ్చే ప్రభలు కౌశిక గట్టుపైనే ఉండి, తీర్థంలోకి వచ్చేది లేదన్నారు. అనంతరం ప్రభలు జరిగే జగ్గన్నతోట ప్రాంతాన్ని గ్రామస్తులు, భక్తులు పరిశీలించారు. ఈ విషయమై పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజుకు ఫిర్యాదు చేశారు. 470 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గనతోట ప్రభల తీర్థంలో ఇప్పటి వరకూ ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని, జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించవద్దన్నారు. శివకేశవ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభల తీర్థ విశిష్టతను తెలుపుతూ 2020లో ప్రధాని మోదీకి లేఖ రాశారని, దానికి బదులుగా ఏకాదశ రుద్రులపై సందేశం పంపారన్నారు. 2023లో 74వ గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రుల ప్రభలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటంగా ప్రదర్శించినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఎంఎం శెట్టి వివరించారు. సీఐ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫ్లెక్సీని నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తీర్థంలో కాకుండా బయట ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని తక్షణమే తొలగించాలని సీఐకు వారు వివరించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తొలగించడం కుదరదని, చట్టవిరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామాల్లో ఘర్షణలు, కవ్వింపు చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రభల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. -
సంస్కృతికి జైకొట్టి.. భక్తి మార్గాన్ని నిలబెట్టి
అన్నవరం: మన సంస్కృతికి అద్దం పడుతూ.. భక్తి మార్గానికి జై కొడుతూ ‘భోగి’భాగ్యాలు ప్రసాదించాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలోని పలు దేవస్థానాల్లో భోగి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని, ఇవి మనుషుల అనుబంధాలను పెంచుతాయని తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. భోగి పండగ సందర్భంగా బుధవారం అన్నవరం రత్నగిరిపై రామాలయం ఆవరణలో సంక్రాంతి వేడుకలను స్వామీజీ ప్రారంభించారు. పాడి పంటలు, పశువులతో పెనవేసుకున్న మన సంస్కృతిని గుర్తుచేసే అపురూపమైన పండగ భోగి అని స్వామీజీ తెలిపారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటను పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రజ్వలన చేశారు. అనంతరం రామాలయం ఆవరణలో తెలుగు సంస్కృతిని ప్రతిబంబిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామీజీ ప్రసంగిస్తూ అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఏటా దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా.. సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై రామాలయం వద్ద భోగి వేడుకలను పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. ఇక్కడ గ్రామీణ వాతావరణ అలంకరణ ఆకట్టుకుంది. ఒకవైపు పొంగలి వంట, ఇంకో వైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, ఎడ్ల బండి, భోగిపళ్లు, బొమ్మల కొలువు, తాడిచెట్టు, కొబ్బరి చెట్టు, ఈతచెట్టు, కుమ్మరి సారి తదితరాలు అందరినీ అలరించాయి. అలాగే జానపద కళారూపాల ప్రదర్శన కనువిందు చేసింది. సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసు, హరిదాసులు, కళాకారుల కోలాట నృత్యాలు రంజింపజేశాయి. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఆసుపత్రి ఫార్మసీ సూపర్వైజర్ వల్లూరి మాధవి తదితరులు మట్టి కుండలపై పొంగలి, పాయసం వండి భక్తులకు పంచిపెట్టారు. వీటికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించే అవకాశం కల్పించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తుల విగ్రహాలు, ధాన్యపురాశి మీద గణపతి విగ్రహం అందరినీ అకట్టుకున్నాయి. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, పవన్, సుధీర్, శర్మ తదితరులు పూజలు చేశారు. ‘భోగి’భాగ్యాలు నింపేలా వేడుకలు రత్నగిరిపై వేడుకలు ప్రారంభించిన సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఉమ్మడి జిల్లాలోని పలు దేవస్థానాల్లో సంబరాలు -
పల్లెల్లో పండగ ఛాయలు
ఐ.పోలవరం/ అమలాపురం రూరల్: తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండగ సంక్రాంతి గడియలొచ్చాయి. దీంతో పచ్చని కోనసీమ సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఎక్కడెక్కడ ఉన్నవారు రావడంతో రావడంతో జిల్లాకు కొంత వరకై నా సంక్రాంతి వెలుగు వచ్చింది. వీధుల్లో కళ్లాపులు.. రంగువల్లులతో పల్లెలు, పట్టణాలకు పండగ కళ వచ్చింది. భోగి మంటలకు పాత సామానులు, కొబ్బరి దుంగలను వీధుల్లో యువకులు సిద్ధం చేస్తున్నారు. హరిదాసులు, డూడూ బసవన్నల రాకతో పండగ ఛాయలు కనిపిస్తున్నాయి. బస్టాండ్లు కిటకిట నాలుగు రోజుల పండగకు జిల్లా వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. వలస వెళ్లిపోయినవారితో బోసిపోయిన పల్లెలు వారి రాకతో కళకళలాడుతున్నాయి. రణగొణ ధ్వనులు, ఆప్యాయతానురాగాలకు దూరమైన జీవనం, యాంత్రిక బతుకులకు సెలవు ఇచ్చి వలసదారులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. భోగి మంటలకు కొబ్బరి, తాటి దుంగలు, పిడకలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆతిథ్యానికి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సున్నుండలు, పోకుండలు, జంతికలు, ఇలంబీకాయలు, కొబ్బరినూజు, వెన్నప్పాలు, గోరుమిటీలు, పొంగడాలను ఇప్పటికే తయారు చేశారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్లలో పండగ సందడి లేకున్నా... భోగికి ఒక రోజు ముందు మంగళవారం వస్త్ర, బంగార మార్కెట్ కొంతమేర కళకళలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, వెళ్లేవారితో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నేడు భోగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండగ తొలి రోజు వచ్చేదే ‘భోగి’. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి, భూమికి దూరంగా జరుగుతాడు. దీనివల్ల భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు గతంలో చలి మంటలు వేసుకునేవారు. ఇదే సమయంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ రైతులు వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలు వెనుక పురాణం కథనాలు, శాసీ్త్రయ కారణాలు కూడా ఉన్నాయి. భోగి మంటలతో సంక్రాంతి పండగకు నాంది పలుకుతారు. ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి సంబరాలు మొదలు పెడతారు. పిల్లలకు తలపాగా లాగా చుట్టి భోగి పండ్లను (రేగి పళ్లు, జామ పళ్లు, పూలు, నాణేలు కలిపి) పోస్తారు. దీనివల్ల వారు ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలని కోరుకుంటారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. ఈ రోజు ధనుర్మాసానికి ముగింపు. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగానే భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనంటారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి, ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో ఉంది. కోనసీమ జిల్లాకు వచ్చిన ఇతర ప్రాంత వాసులు పండగ ముందు రోజు మార్కెట్లో హడావుడి వస్త్ర వ్యాపారాల వద్ద కొంత సందడి -
పోలీసుల రాకతో పందెం రాయుళ్ల పరారీ
కామనగరువులో సాగిన కోడి పందేలు, పోలీసుల రాకతో పందెం రాయుళ్లు వదిలేసిన కోడిపుంజులు సాక్షి, అమలాపురం: రాజకీయ అండదండలను చూసుకుని పందెం రాయుళ్లు బరితెగించారు. సంక్రాంతి పండగకు ముందే కోడిపందేలు నిర్వహించి పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కోడి పుంజులు వదిలి పరారయ్యారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాలవారిపాలెంలో ఒక మంత్రి కొబ్బరి తోటలో పండగకు ముందు రోజు మంగళవారం సాయత్రం కోడిపందేలు జోరుగా సాగాయి. ఈ పందేలను వీక్షించేందుకు వాహనాల్లో వందలాది మంది జనం గుమిగూడారు. రాజకీయ నాయకుల ప్రోద్బలాన్ని చూసుకుని పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. రూ.లక్షల్లో బెట్టింగులు వేస్తూ పందేలు సాగించారు. ఈ పందేల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోడిపుంజులు వదిలి పందెం రాయుళ్లు పరారయ్యారు. చివరికి బరిలో కోడిపుంజులు మిగిలాయి! -
సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి
అమలాపురం రూరల్: సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో ఉద్యోగులతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంక్రాంతి పండగ ప్రాధాన్యతను తెలియ జేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ కలెక్టరేట్లో ఎకో ఫ్రెండ్లీ విధానానికి నాంది పలుకుతూ తొలి దశలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉచితంగా అందించామని, రెండో దశలో సంక్రాంతి సందర్భంగా మట్టి పాత్రలు పంపిణీ చేశామన్నారు. డీఆర్ఓ మాధవి మాట్లాడుతూ కోడి పందేలు, జంతు హింస సంబంధిత కార్యక్రమాలు నిషేధించామన్నారు. ఎడ్ల బండిపై జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు కలెక్టరేట్ ప్రాంగణంలో విహరించి సందడి చేశారు. డీఎస్ఓ అడపా ఉదయభాస్కర్, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ ,కలెక్టరేట్ ఉద్యోగి భరత్ పాల్గొన్నారు. -
తొలి ప్రభల తీర్థం... చిరతపూడిలో..
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతి అంటే ప్రభల తీర్థం.. ప్రభల తీర్థం అనగానే కోనసీమ స్ఫురణకు వస్తుంది. అటువంటి కోనసీమలో ప్రభల తీర్థం మొదలైంది ఎప్పుడనేదానిపై స్పష్టత లేదు. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర ఉందని మాత్రం వేద పండితులు, తీర్థాల నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. అయితే కోనసీమ జిల్లాలో తొలి ప్రభల తీర్థం తమ గ్రామంలో ప్రారంభమైందని చెబుతున్నారు చిరతపూడి ప్రభల తయారీ నిర్వాహకులు. పూర్వం చిరతపూడిని చిరుతపూడి అగ్రహారంగా పిలిచేవారు. చిరతపూడి పొలిమేర (అవిడి డ్యామ్ సెంటరు ప్రభల తీర్థం) ప్రాంతంలో ప్రభల తీర్థం మొదలై 476 సంవత్సరాలు అయిందని, నాటి నుంచి నేటి వరకు తీర్థాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభల తీర్థం మొదలు కావడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద నిర్వహిస్తున్న ప్రభల తీర్థం స్ఫూర్తినిచ్చింది. ఈ గ్రామానికి చెందిన కర్ర చందన శాస్త్రి పూర్వం కోటప్పకొండకు పరమేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ చూసి వచ్చి స్థానికంగా కనుమ పండగ రోజు ప్రభల తీర్థాన్ని ప్రారంభించారు. పంచముఖాలైన శివుని ఆలయాలు చిరతపూడి అగ్రహారం చుట్టుపక్కల ఉండడంతో అందరికీ అనుకూలంగా చిరతపూడి ఊరి పొలమేరలో ప్రభల తీర్థం నిర్వహించాలని సంకల్పించారు. అందుకు సంబంధించి ఆయా గ్రామాల పెద్దలను సంప్రదించి ప్రభల ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతం రెండు నియోజకవర్గాలకు, నాలుగు గ్రామాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ తీర్థానికి కూడా విశిష్టత ఉంది. శివుని పంచముఖాలు చిరతపూడి నుంచి సద్యోజాత రుద్రుడు (బ్రహ్మేశ్వర స్వామి), నరేంద్రపురం నుంచి వామదేవ రుద్రుడు, కుందాలపల్లి నుంచి అఘోరా రుద్రుడు, ఈశాన్య రుద్రుడు ప్రబల తీర్థానికి తరలివస్తారు. ఈ పంచముఖాల శివుని ఆలయాలు వెలసి సమీపంలో ఉండడంతో గ్రామాల పెద్దలు చిరతపూడి సరిహద్దులో ప్రభల తీర్థం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ తీర్థంలో తల్లి ప్రభలతోపాటు మరో 55 ప్రభలు కొలువు తీరుతాయి. ఇక్కడ తీర్థంలో తొలుత చిరతపూడికి చెందిన బ్రహ్మేశ్వరుడి ప్రభ కొలువు తీరుతారు, తీర్థం ముగిసిన తరువాత మాత్రమే తిరిగి వెళుతుంది. ఆనాటి నుంచి విజయవంతంగా.. ప్రభల తీర్థాన్ని అప్పట్లో కొనసీమ చిరతపూడి అగ్రహారంలో నిర్వహించారు. కర్ర చందన శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభల ఉత్సవాన్ని ప్రారంభించారు. శివుని పంచముఖాలు అయిన ఐదు ఆలయాలు ఇక్కడే ఉండడం వల్ల అందరికీ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో చిరుతపూడి గ్రామ శివారులో ఉత్సవాన్ని చేయాలని అప్పటి పెద్దలు నిర్ణయించి ఘనంగా జరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు చిరతపూడిలో ప్రభల ఉత్సవం విజయవంతంగా కొనసాగుతోంది. – కొత్తలంక కొండలరావు శర్మ, వేద పండితుడు, చిరతపూడి 476 సంవత్సరాల నుంచి నిర్వహణ గుంటూరు జిల్లా కోటప్ప కొండ ప్రభల తీర్థం స్ఫూర్తి తరువాత మిగిలిన ప్రాంతాలకు విస్తరణ -
సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం రత్నగిరిపై రామాలయం ముందున్న ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక్కడ పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ తుని తపోవనం స్వామీజీ సచ్చిదానంద సరస్వతి బుధవారం ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించనున్నారు. అనంతరం, భక్తులనుద్దేశించి సంక్రాంతి విశిష్టతపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తారు. భోగి మంట, జానపద కళారూపాల ప్రదర్శనలకు రత్నగిరిపై ఏర్పాట్లు చేశారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తాటాకులతో వేసిన గుడిసె, కొబ్బరి, ఈత, తాటి చెట్లు, తామర, కలువ పూలతో కూడిన కొలను, ధాన్యపు రాశి, నుయ్యి, రచ్చబండ, కోడిపుంజులు, ఎడ్లబండి, పొట్టేలు, ఆవు దూడ వంటి కళారూపాలు ఏర్పాటు చేస్తున్నారు. గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల సాయిబు, జంగమ దేవర, కొమ్మదాసరి సందడి చేయనున్నారు. సత్యదేవుని వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం, రాజగోపురాలను విద్యుద్దీపాలు, పుష్పమాలికలతో అలంకరిస్తున్నారు. భోగి పండ్లు వేసేందుకు ఉదయం 9 గంటలకు చిన్నారులను సంక్రాంతి వేడుకల వద్దకు తీసుకుని రావాలని అధికారులు కోరారు. -
గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు జరిపేందుకు ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు అధికారులు శ్రమించారు. ప్రధానంగా గోదా రంగనాథుల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా అవివాహితులు తరలివస్తారనే అంచనాతో వారికి షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గోదాదేవి కల్యాణ పూజలో పాల్గొనేందుకు సుమారు 1,700 మంది ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. భోగి మంటకు దుంగలు, దండలు సిద్ధం సంక్రాంతి పండగల్లో తొలిరోజు బోగి పండగ సందర్భంగా భారీ భోగి మంట వేసేందుకు కలప దుంగలు సిద్ధం చేశారు. దేవస్థానం గోశాల సిబ్బంది 10 నుంచి 12 అడుగులు చొప్పున 100 బోగి దండలు సిద్ధం చేశారు. నేటి నుంచి బాస్కెట్బాల్ పోటీలు రామచంద్రపురం: స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు 14వ ఆల్ ఇండియా 21వ ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ వుమెన్ సంక్రాంతి టోర్నమెంట్లో భాగంగా ప్రథమ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్స్ బాల బాలికల బాస్కెట్బాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్టు రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలిన్, ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, హరీష్ మాథుర్, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 17 వరకు జరిగే ఈ పోటీల ముగింపు సభకు ఆర్డీఓ డి.అఖిల, డీఎస్పీ బీ రఘువీర్ పాల్గొని బహుమతి ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. 20న విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ అమలాపురం రూరల్: 2026–27 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న విద్యుత్ చార్జీలపై ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ పీవీ ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని విద్యుత్శాఖ కోనసీమ ఎస్ఈ రాజేశ్వరి తెలిపారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన టారిఫ్ పిటిషన్లపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద ఏపీఈపీడీఎల్ సర్కిల్ ఆఫీస్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని జనం తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. కోనసీమ సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆథర్ బుక్ లీగ్ పోటీల్లో రియోనాకు ద్వితీయ స్థానం రంగంపేట: ఢిల్లీకి చెందిన బ్రీ బుక్స్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో జూలియస్ జర్నీ టు గుడ్నెస్ అనే పుస్తకం రంగంపేట హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయిని వి.రమ్యసుధ కుమార్తె రియోనా రచించింది. రాజమహేంద్రవరంలో మూడో తరగతి చదువుతున్న రియోనా, ఆథర్ బుక్ లీగ్ పోటీలో 1,500 మంది చిన్నారి రచయితలతో పోటీపడి ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానం సంపాదించిందని రమ్యసుధ తెలిపారు. పుస్తకాన్ని బుధవారం ఢిల్లీలో భారత్ మండపంలో ఆవిష్కరించనున్నారని, ఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగే ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దీనిని ఉంచనున్నారని చెప్పారు. -
ఇన్స్పేస్ శిక్షణ పొందిన ‘నన్నయ’ అధ్యాపకురాలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ శీలం రాజ్యలక్ష్మి భారత అంతరిక్ష శాఖకు చెందిన ఇన్ స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అఽథారైజేషన్ సెంటర్) ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణను పూర్తి చేశారు. ఈ విషయాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మంగళవారం విలేకరులకు తెలిపారు. బెంగళూరులోని దేవనపల్లిలో ఈ నెల 4 నుంచి 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ లాంచ్ వెహికల్ డిజైన్, మిషన్ ప్లానింగ్, అవియానిక్స్ అభివృద్ధి, గైడెన్స్ – నావిగేషన్ – కంట్రోల్, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ వ్యవస్థలపై విస్త్రతంగా అవగాహన కల్పించారన్నారు. ఆమెను వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తదితరులు అభినందించారు. -
కండలు ప్రదర్శించి.. పతకాలు సాధించి..
● ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ పోటీలు ● సుమారు 150 మంది బిల్లర్లు రాక అమలాపురం టౌన్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమలాపురంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ –2026 పోటీలు సోమవారం నిర్వహించారు. అమలాపురానికి చెందిన స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరిట నిర్వహించిన ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 150 బాడీ బిల్డర్లు వచ్చి తమ కండలను ప్రదర్శించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ప్రారంభించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన జరిగిన పోటీల ప్రారంభ సభలో ఎంపీ మాట్లాడారు. దివంగత కాశీ విశ్వనాథం కుమారుడైన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ను జిల్లా యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రధాన కార్యదర్శి, అమలాపురం హెల్త్ ఫిట్నెస్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పోటీలను పర్యవేక్షించారు. మొత్తం 12 విభాగాల్లో జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కోచ్లు ఎం.పోలయ్య, బి.ప్రకాష్, బి.కృష్ణ, అహ్మద్ మోహిద్, వై.శ్రీనివాసరావు, ఎం.సముద్రం, ఎన్.క్రాంతి కుమార్ వ్యవహరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల పద్మరాజు, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టైటిల్ విన్నర్గా గణేష్ ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీల ఓవరాల్ చాంపియన్గా టైటిల్ విన్నర్ స్థానాన్ని పెద్దాపురానికి చెందిన బాడీ బిల్డర్ జి.గణేష్ గెలుచుకున్నారు. రన్నర్గా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పి.సాయిగణేష్ నిలిచారు. విజేతలకు షీల్డ్లు, పతకాలు, సర్టిఫికెట్లను బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు తదితరులు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కిర్లంపూడి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలెరో వ్యాన్ ఢీకొని, ఆపై రోడ్డు దాటేందుకు ఆగిఉన్న వ్యక్తిపై బోల్తా పడడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన పిన్నం లవకుశలు (74) వ్యవసాయ పనులు చేసుకుంటూ కొడుకులతో కలసి జీవిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వాటర్ ప్లాంట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు లవకుశలు రోడ్డు దాడుతున్నాడు. ఈ సమయంలో యర్రవరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు బెల్లం లోడుతో వెళుతున్న బొలెరో వ్యాన్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని అంబులెన్స్లో రాగంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. బూరుగుపూడి ఊరు శివారున ఉన్న పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకునేందుకు మోటార్ సైకిల్పై రోడ్డు దాటేందుకు ఎదురు చూస్తున్న పెద్దాపురం మండలం చదలాడ గ్రామానికి చెందిన పల్లా భాస్కరరావు (44)పై ఆ వ్యాన్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భాస్కరరావు కుమారుడు పల్లా సునీల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు.CLS -
షికారుకు పోదాం.. చలో చలో
● అభయారణ్యంలో ఫుల్ జోష్ ● పర్యాటకుల కోసం ముస్తాబు ● ప్రత్యేక ఆకర్షణగా మినీ థియేటర్, అక్వేరియం ఆనందం.. ఆపై భద్రత పర్యాటకులకు మరింత ఆనందాన్ని అందించడంతో పాటు వారి భద్రతే లక్ష్యంగా అదనపు సౌకర్యాలు కల్పించాం. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడ విశేషాలను తెలిపై విధంగా మినీ థియేటర్, ప్రకృతి ప్రేమికుల కోసం అక్వేరియం, ప్రకృతి స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఉడెన్ బ్రిడ్జిలపై గుంపులు, గుంపులుగా తిరగడం చేయరాదు. పండగ రద్దీ దృష్ట్యా ఐదు ప్యాసింజర్ బోట్లతో పాటు, మరో మూడు స్పీడు బోట్లు అందుబాటులో ఉంచాం. లైఫ్ జాకెట్ వేసుకున్న వారిని మాత్రమే బోటు షికారుకు అనుమతిస్తాం. –ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్, కోరంగి అభయారణ్యం అభయారణ్యంలో బోటు షికార్ తాళ్లరేవు: పచ్చదనం రా రమ్మని పిలుస్తోంది.. ప్రకృతి ఒడిలో ఒదిగిపోమని ఆహ్వానిస్తోంది.. పర్యాటకులు సరదా గడిపేందుకు బోటు షికారు చక్కని అనుభూతిని మిగుల్చుతోంది.. సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రం కోరంగి అభయారణ్యం ముస్తాబైంది. ప్రకృతి ఒడిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో గడిపేందుకు వేదిక అవుతోంది. సందర్శకులను మరింత ఆకర్షించడంతో పాటు, వినోదాన్ని పంచే విధంగా అటవీ శాఖ మరిన్ని సదుపాయాలను కల్పించింది. అభయారణ్యం విశేషాలను తెలియజేసే మినీ థియేటర్, మత్స్య, పక్షి జాతులను వీక్షించే విధంగా అక్వేరియం, ప్రకృతి స్టాల్స్ను ఏర్పాటు చేసింది. ఏటా జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఏడాది నుంచి రోజుకు నాలుగు వేల మందికిపైగా సందర్శించే అవకాశం ఉండడంతో పాటు ఒక ట్రిప్పునకు 150 మంది బోటు షికారు చేసే విధంగా చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చే సందర్శకుల కోసం తాగునీరు, తినుబండారాలు, శీతల పానీయాల దుకాణాలను ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా వంటలు చేసుకునే అవకాశం కల్పించారు. ఉడెన్ బ్రిడ్జిలకు మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అభయారణ్యాన్ని సందర్శించవచ్చు. ఆకర్షణీయం.. అక్వేరియం అభయారణ్యం ప్రాంతంలో సంచరించే మత్స్య జాతులను పర్యాటకులు వీక్షించే విధంగా నూతనంగా భారీ అక్వేరియం ఏర్పాటు చేశారు. ఇది అభయారణ్యానికే ప్రత్యేక ఆకర్షణ కానుంది. దీంతో పాటు మడ అడవుల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా డాక్యుమెంటరీని రూపొందించి మినీ థియేటర్లో పది నిమిషాలు ప్రదర్శించే విధంగా రూపొందించారు. అదేవిధంగా వివిధ రకాల పక్షులను పర్యాటకులు చూసే విధంగా ప్రత్యేక భారీ పంజరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రకాల మొక్కలను కూడా ప్రదర్శించనున్నారు. ఆసక్తి ఉన్నవారికి మొక్కలను విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. హుషారు.. బోటు షికారు ఇక్కడ పర్యాటకులకు బోటు షికార్ ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఏపీ టూరిజం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బోట్లపై గోదావరి పాయలో ప్రయాణించి సముద్రం కలిసే ప్రాంతానికి తీసుకు వెళతారు. అక్కడి నుంచి మడ అడవుల అందాలతో పాటు, కాకినాడ సిటీ అందాలు పర్యాటకులను అలరిస్తాయి. మడ చెట్లపై సంచరించే వివిధ రకాల పక్షులు, జంతువులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అదేవిధంగా కేరళ తరహాలో మడ అడవుల్లో ఉండే చిన్నపాటి క్రీక్ (పిల్ల కాలువలు)ల్లో పర్యాటకులు బోట్లపై సందర్శించే విధంగా క్రీక్ విజిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోట్పై విహరిస్తూ అభయారణ్యం అందాలను ఆస్వాదించడం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. పక్షులు, మొక్కలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి స్టాల్ కోరంగి అభయారణ్యం స్వాగత ద్వారం వద్ద పర్యాటకుల సందడి (ఫైల్) -
● గంగిరెద్దుల ఆట.. హరిదాసుల పాట
మామిడికుదురు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచి భోగి దండలు సంక్రాంతి పండగకు ముందు వచ్చే భోగి రోజున అందరూ మంట వద్దకు వెళ్లి ఆవు పిడకల దండలు వేస్తుంటారు. గతంలో ముందుగానే పల్లెల్లో ఆవుపేడతో భోగి పిడకలను తయారు చేసుకుని దండలు కట్టి మంటల్లో వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో భోగి పిడకలు మార్కెట్లో విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసి మంటల్లో వేస్తున్నారు. దండ సైజును బట్టి రూ.30 నుంచి రూ.40, రూ.50. రూ.100, రూ.150 ఇలా పలు రకాల రేట్లకు విక్రయిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రులు తీసుకొచ్చి పిడకల దండలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకలో డూడూ బసవన్నలుపెదపట్నంలంకలో మోటారు సైకిల్పై హరిదాసుసంక్రాంతి పండగ రానే వస్తోంది.. పల్లెలకు డూడూ బసవన్నలు, హరిదాసులతో సందడి నెలకొంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.. సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలే కాదు.. మన జానపద కళల సజీవ రూపం. హరిలో రంగ హరి అంటూ దీవించే హరిదాసులు, సన్నాయి డోలు వాయిద్యాలకు అనుగుణంగా ఆడే గంగిరెద్దులు, రకరకాల రూపాలతో అలరించే పగటి వేషగాళ్లు.. వీరంతా మన సంస్కృతికి వెన్నెముక. పండగ వేళ ఇళ్ల ముంగిటకు వస్తున్న చేతివృత్తుల వారిని, జానపద కళాకారులను ఆదరిస్తూ.. మన మూలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – మామిడికుదురు -
కువైట్లో కె.ఏనుగుపల్లి మహిళ మృతి
పి.గన్నవరం: కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన ఒక మహిళ మృతి చెందింది. గత శుక్రవారం ఈ ప్రమాదం జరగ్గా సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. స్థానికుల వివరాల ప్రకారం.. శేరు విజయలక్ష్మి (55) జీవనోపాధి నిమిత్తం గత 20 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం ఆమె కువైట్ దేశానికి వెళ్లింది. అప్పటి నుంచి ఒక ఇంట్లో హెల్పర్గా పనిచేస్తోంది. ఈక్రమంలో గత శుక్రవారం యజమాని కుటుంబ సభ్యులతో పాటు ఆమె కారులో కువైట్ సిటీ నుంచి జహ్రా వైపు వెళ్తుండగా 7వ రింగ్ రోడ్లో ప్రమాదం జరిగింది. ఇందులో ఇంటి యజమాని కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో పాటు విజయలక్ష్మి మృతి చెందింది. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విజయలక్ష్మి మృతదేహాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి కె.ఏనుగుపల్లికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విజయలక్ష్మికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు మద్యం మత్తులో వ్యక్తిపై దాడి అనపర్తి: మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తి ఒకరిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉంది. బిక్కవోలు పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బిక్కవోలు జువ్వలదొడ్డి ప్రాంతానికి చెందిన నర్సిరెడ్డి బాలాజీ స్థానిక వంతెన సెంటర్ నుంచి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో అకారణంగా దూషిస్తూ కిలో రాయి తీసుకుని అతని తలపై కొట్టాడు. బాలాజీ కింద పడిపోవడంతో మళ్లీ ముక్కుపై దాడి చేసి పరారయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న తునికి చెందిన యువకులు పంతాడి దుర్గా ప్రసాద్ (21), ఆసనాల ప్రసాద్, ఆసనాల మహేష్లు చేబ్రోలు సమీపంలోకి వచ్చే సరికి భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా 216 రోడ్డులో వెనుక నుంచి బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటకు చెందిన లారీ తవుడు లోడ్తో అనపర్తి వెళ్తూ ఢీకొంది. దీంతో మోటార్ సైకిల్తో సహా ముగ్గురు యువకులు రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసనాల ప్రసాద్, మహేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని.. కె.గంగవరం: కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండల చినకోరుమిల్లి గ్రామానికి చెందిన అంబడి సుబ్బారావు (45) వ్యవసాయ కూలి. ఇటీవల కుటుంబ సభ్యులంతా పనుల నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లారు. ఆదివారం చిన కోరుమిల్లిలో యూత్ క్రిస్మస్లో పాల్గొనేందుకు తిరిగి గ్రామానికి వచ్చారు. దుస్తులు కొందామని రామచంద్రపురానికి భార్య మరియమ్మతో కలసి మోటారు సైకిల్పై వెళ్తుండగా పామర్రు వచ్చేసరికి, సాయితేజ అనే యువకుడు కారుపై ఎదురుగా వస్తూ ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. మరియమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పంటబోదెలోకి దూసుకుపోయింది. దీనిపై ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: తొమ్మిది చోరీ కేసుల్లో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ ఏటిమొగ ప్రాంతానికి చెందిన రేకాడి వెంకటేశ్వర్లు గత ఏడాది కాకినాడ, జగన్నాథపురంలో గోళీలపేట, శ్రీరామనగరపురం వీధి, చిన్న మార్కెట్ సెంటర్, గోగి దానయ్యపేట, పప్పులమిల్లు శ్రీరామనగర్ వెనుక వైపు డాల్మిల్లు, దుర్గాటెంపుల్ స్ట్రీట్, ఆకాశపువారి వీధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీలు చేశాడు. బాధితులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. కోర్టు విచారణలో వెంకటేశ్వర్లు నేరం రుజువు కావడంలో పైవిధంగా శిక్ష పడింది. -
కాలు దువ్వుతున్న కోడిసీమ!
హాస్యాస్పదంగా మారిన పోలీసు హెచ్చరికలు ఒకవైపు పందేలు అడ్డుకుంటామని జిల్లాలో స్టేషన్ ఎస్ఐల నుంచి ఎస్పీ వరకు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా జూదాల నిర్వాహకులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అధికార పార్టీ కీలక నేతల వత్తాసుతో బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకున్న ఒకటి, రెండు బరుల వద్దకు వెళ్లి హెచ్చరికల ఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మురమళ్ల, అల్లవరం వంటి రూ.లక్షలలో పందేల జరిగే బరుల వద్ద ఇటువంటి ఫ్లెక్స్లు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పందేల నిర్వహణకు విరివిగా బరుల ఏర్పాటు కోర్టు ఆంక్షలు, పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ ఐ పోలవరం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో మరీ జోరుగా.. గుండాటల నిర్వహణకూ ప్రత్యేక సౌకర్యాలు సామాజిక మాధ్యమాలలో రా.. రమ్మని ఆహ్వానాలు ప్రతి చోటా అనధికార వేలం పాటలు సాక్షి, అమలాపురం: కోడి పందేలు, గుండాటలు అడ్డుకోవాలని కోర్టులు ఆంక్షల విధిస్తోంది. జూదాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా జూదరాయుళ్లు వెరవడం లేదు. వెనకడుగు వేయడం లేదు. పందేల కోసం కాలు దువ్వుతున్నారు. క్రీడా మైదానాల స్థాయిలో భారీ బరుల నిర్మాణలు చేస్తున్నారు. గతంలో కనీసం సంక్రాంతి వరకు పందేల నిర్వహణను రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల వత్తాసుతో పందేల నిర్వహణ బహిరంగం అయింది. ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి సామాజిక మాధ్యమాలలో పందేలకు రా.. రమ్మని ఆహ్వానాలు పంపించడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది వీటిని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ప్రాంతం అనేది లేకుండా జిల్లాలో ప్రతి మండలంలో పందేలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కోడి పందేలు, గుండాటల నిర్వహణలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. టీడీపీ, జననసే చోటామోటా నాయకులు సైతం పందేల నిర్వహణకు సై అంటున్నారు. కోడిపందేల వద్ద జరిగే గుండాటలకు వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పందేల బరుల వద్ద కిళ్లీ షాపులు, అనధికార మద్యం షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా పందెం బరులు అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం మండలంలో పందేలు జరగనున్నాయి. ఇక్కడ కోడూరుపాడు, అల్లవరం, గుత్తులవారిపాలెం, రెల్లుగడ్డ, గుండెపూడి గ్రామాలు, ఉప్పలగుప్తం మండలంలో భీమనపల్లి పంచాయతీ శివారు భట్టుపాలెం, గొల్లవిల్లి, పెదగాడవిల్లి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, ఎస్.యానంలో కోడి పందేల నిర్వహణకు బరులు రెడీ అవుతున్నాయి. ఎస్.యానం సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల నిర్వహణకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. చినగాడవిల్లి శివారు ప్రాంతంలో జగనన్న కాలనీలో స్థానికులు అభ్యంతరం చెబుతున్నా అధికార పార్టీకి చెందినవారు కోడి పందేల నిర్వహణకు బరులు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. అమలాపురం రూరల్ పరిఽధిలోని కామనగరువు, పేరూరు, సమనస, వన్నెచింతలపూడి గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం, రావులపాడుల వద్ద భారీగా పందేలు నిర్వ హించేలా ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారులను ఆనుకుని పందేల బరులు సిద్ధం చేస్తున్నారు. ఆలమూరు మండలం మడికి, జొన్నాడల వద్ద కూడా జాతీ య రహదారుల సమీపంలోనే పందేలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట, పలివెల, ఆత్రేయపురం, లొల్ల లాకుల సమీపంలో పందేలు జరగనున్నాయి. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం పట్టణంలోనే మూడుచోట్ల పందేల నిర్వహణకు చురుగ్గా పనులు చేస్తున్నారు. రామచంద్రపురం మండలంలో నాలుగు బరులు, కె.గంగవరం, కాజులూరు మండలాల్లో ఐదు చొట్ల చొప్పున బరులు సిద్ధం చేస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామల, అయినవిల్లి మండలం సరిపల్లి, విలస, పి.గన్నవరం మండలంలో పోతవరం, ఉడిమూడి, డి.ఎస్.పాలెంలో కోడిపందేలు జరగనున్నాయి. రాజోలు దీవిలో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో బరులు అధికంగా ఉన్నాయి. ఈ రెండు మండల కేంద్రాలతోపాటు లక్కవరం, శివకోడు, కాట్రేనిపాడు, ములికిపల్లి, గోగన్నమఠం, పొన్నమండ, కడలి, దిండిల్లో పందేల వేసేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. రూ.లక్షల్లో బేరసారాలు కొబ్బరి తోటల్లో ట్రాక్టర్ల సాయంతో చదును చేసి పందెం రాయుళ్లు రాకపోకలు నిర్వహించడానికి అనువుగా తాత్కాలిక రహదారుల ఏర్పాటు, మోటారు సైకిల్ పార్కింగ్, కూర్చోని చూడటానికి ప్రత్యేకంగా కుర్చీలను తరలించారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల నడుమ కోడి పందేలు నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలతో పాటుగా గుండాట నిర్వహించుకునేలా రూ.లక్షల్లో బేరసారాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా జూదం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 23 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 23 అర్జీలు వచ్చాయి. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. సర్పంచ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి పోలీస్ గ్రీవెన్స్కు జిల్లా దళిత ఐక్య వేదిక ప్రతినిధులు హాజరై కామనగరువు సర్పంచ్, ఆమె భర్తపై అమానుషంగా దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఏఎస్పీ ప్రసాద్కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. దళిత ఐక్య వేదిక జిల్లా చైర్మన్ డీబీ లోక్, కన్వీనర్ జంగా బాబూరావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు తదితరులు ఏఎస్పీని కలిసి సర్పంచ్ దంపతులపై జరిగిన దాడిని వివరించారు. అర్జీలకు పరిష్కార మార్గాలు చూపాలి అమలాపురం రూరల్: అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నూరు శాతం పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు డీఆర్ఓ కే. మాధవి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఆమె నిర్వహించారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, డీఎల్డీవోలు రాజేశ్వరరావు, వేణుగోపాల్ 150 అర్జీలను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి సంతృప్తి కర స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. -
హైడ్రో డాటిక్ ప్రెషర్ తగ్గడం వల్లే బ్లో అవుట్ అదుపు
● ఓఎన్జీసీ అధికారుల గొప్పతనం లేదు ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఽ అమలాపురం రూరల్: మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ఓఎన్జీసీ అధికారుల గొప్పతనం వల్ల ఆరలేదని, బావిలో హైడ్రో డాటిక్ ప్రెషర్ తగ్గడం వల్లే ఆగిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో చమురు సంస్థల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చమురు సంస్థల వల్ల కోనసీమ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోరారు. కోనసీమలో తరచు బ్లో అవుట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్లో అవుట్ల వల్ల భూమి కుంగిపోయి సముద్రం వెనకకు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమలో వేలాది ఎకరాలు భూములు ఉప్పుగా మారుతున్నాయని అన్నారు. కోనసీమలో 1993లో కొమరాడ, 1995లో పాసర్లపూడి, 1997 దేవరలంక, 2024లో ఉప్పుడిలో చమురు సంస్థల నిక్షేపాలు వెలికి తీసే సమయంలో రిగ్గుల వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. 2014లో నగరం వద్ద గెయిల్ పైపులైన్ పేలిన ఘటనలో 22 మంది మృతి చెందారన్నారు. కేజీ బేసిన్ పరిధిలో వేలాది కోట్ల రూపాయల సరకును చమురు సంస్థలు తరలించుకుపోతున్నప్పటికీ, స్థాని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని అన్నారు. కోనసీమ వాసులకు ఉచిత వంట గ్యాస్ పథకాన్ని సైతం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు. -
డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు పోరాటం
రైతుల అఖిలపక్ష సమావేశం తీర్మానం అమలాపురం రూరల్: కోనసీమ జిల్లాలో కాలువలు, డ్రైన్ల వ్యవస్థను ప్రభుత్వం ఆధునీకరించాలని, లేకుంటే రైతు సంఘాలతో పోరాటం చేస్తామని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన రైతుల అఖిల పక్ష సమావేశం హెచ్చరించింది. కోనసీమలో కాలవలు, డ్రైనేజీలు ఆక్రమణలతో మూసుకుపోవడంతో రైతులు ఖరీఫ్ సాగు మానేస్తున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. అమలాపురం మండలం సమనస గ్రామంలో మీ డెవలపర్స్ వినాయక లేఔట్స్లో సోమవారం రైతుల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉప్పులగుప్తం మండలం కూనవరం, అల్లవరం మండలం రామేశ్వరం సముద్ర మొగలు మూసుకుపోయి ముంపు సమస్య ఏర్పడి రైతులు నష్ట పోతున్నారని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు( బాబి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ రైతు సంఘాలు ఒక వేదికపైకి వచ్చి సమస్యలను ప్రభుత్వం దుష్టికి తీసుకు వెళ్లాలన్నారు. తెలుగు రైతు విభాగం నాయకులు యాళ్ల బ్రహ్మానందం, ఆకుల లక్ష్మణరావు మాట్లాడుతూ శంకరగుప్తం డ్రైయిన్ ఆధునీకరణ వల్ల రైతులకు ఉపయోగం ఉండదన్నారు. బీకేఎస్ ఆఖిల భారత కార్యవర్గ సభ్యులు జలగం కుమార్స్వామి మాట్లాడుతూ క్రాప్ హాలిడే ద్వారా కోనసీమ రైతుల ఉద్యమాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. వెబ్లాండ్ పోర్టల్లో లోపాలు, రెవెన్యూ తప్పిదాలు రైతుకు శాపాలుగా ఉన్నాయన్నారు. ఉత్పత్తి వ్యయంలో 70 శాతం మేర కూడా మద్దతు ధర రావడం లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కీలక మార్పులు చేయాలని, థర్డ్ పార్టీ బీమా ద్వారా పొలాలలో జరిగే ప్రమాదాలకు రైతులకు రక్షణ కల్పించాలి సమావేశం తీర్మానం చేసింది. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుకూరి సత్యనారాయణరాజు, సంయుక్త కార్యదర్శి గుబ్బల రమేష్, రైతు సంఘాల ప్రతినిధులు రంబాల బోసు, బొరుసు మురళి, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, యాళ్ల వెంకటనందం, బొక్కా ఆదినారాయణ, ముత్యాల జమీలు, మట్లా మహాలక్ష్మి ప్రభాకర్, అప్పారి వెంకటరమణ పాల్గొన్నారు. -
వివేకానందుని ఆదర్శాలు శాశ్వత ప్రేరణ
అమలాపురం రూరల్: స్వామి వివేకానంద మహోపదేశం యువతను ధైర్యం, ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిపిస్తుందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్, ఎస్పీ రాహుల్ మీనా, కలెక్టరేట్ ఏవో విశ్వే శ్వరరావులు స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే ఈ పవిత్ర దినంలో యువతకు ఆయన ఆదర్శాలు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ యువతకు మార్గ దర్శకుడిగా నిలిచిన స్వామి వివేకానంద తన ఆలోచనలు, ఉపదేశాల ద్వారా దేశానికి గర్వకారణం అయ్యారన్నారు. పండగ ముసుగులో ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరిక అమలాపురం టౌన్: సంక్రాంతి పండగ వేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్మీనా స్పష్టం చేశారు. పండగల ముసుగులో ఎవరైనా గీత దాటితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ మీనా సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కోడి పందేలు, జూదాలు ఆడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. జూదాలకు దూరంగా ఉండాలని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆటోల ద్వారా మైక్ అనౌన్స్మెంట్లు ఇస్తూ, కర పత్రాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సాయం కోసం డయల్ 112కి గాని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని సూచించారు. అంతర్వేది ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ సఖినేటిపల్లి: అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న లక్ష్మీనరసింహాస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల వాల్ పోస్టర్ను సోమవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు. అంతకు మందు ఆలయంలో అర్చకులు స్వామి సన్నిధిలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టూరిజం గెస్ట్హౌస్లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ అధ్యక్షతన డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, సర్పంచ్ కొండా జాన్బాబు, ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
● హుర్రె.. ఔరా గొర్రె పొట్టిగా ఉండే పుంగనూరు ఆవులు.. చిన్నగా ఉన్న కుక్కలను చూస్తుంటాం.. కానీ పొట్టి రకం గొర్రెలు ఉంటే ఆశ్చర్యమే కదా.. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల ప్రేమ్కుమార్ కర్ణాటకలో ‘బన్నూరు’ రకం పొట్టి గొర్రెలు నాలుగింటిని రూ.లక్షకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. సాధారణంగా ఈ రకం గొర్రెలు 8 నుంచి 10 ఏళ్ల వరకు జీవిస్తాయన్నారు. చూడటానికి బుట్ట బొమ్మల మాదిరిగా ఉంటాయని, ఇళ్లల్లో షోగా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయని ప్రేమ్కుమార్ వివరించారు. వీటి నిర్వహణ ప్రత్యేకంగా ఏమీ ఉండదని, పచ్చి, ఎండు గడ్డి తింటాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ రకం గొర్రెలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. అంబాజీపేటమాచవరంలో అబ్బురపరుస్తున్న పొట్టి గొర్రెలు -
పండగ సందడి లేదు
సంక్రాంతి పండగ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా సంతోషంగా గడిపేవారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండగకు ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జనవరి నెల ప్రారంభం నుంచీ సందడి సందడిగా ఉండేది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరంగా ఉన్న వారు వస్తేకానీ పండగ వాతావరణం రావడం లేదు. సెల్ఫోన్ వచ్చిన తర్వాత సంక్రాంతి పండగ రీల్స్లో మాత్రమే కనిపిస్తోంది. – గంటి శ్రీరామ్మూర్తి, రిటైర్డ్ ఉద్యోగి, అంబాజీపేట తప్పదన్నట్టు తిరుగుతున్నాం గంగిరెద్దులు ఊరూరా తిప్పుకుంటూ ఉపాధి పొందుతున్నాం. సంక్రాంతి సమయంలోనే నాలుగు డబ్బులు వస్తున్నాయి. గతంలో ఈ పండగ సమయంలో వచ్చిన సొమ్ములు ఏడాదంతా సరిపోయేవి. ఇప్పుడు పండగ అయిన వెంటనే కూలీ పనులకు వెళ్లకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. – పోసయ్య, ముక్కామల, అంబాజీపేట మండలం -
పండగవేళా ఎదురుచూపులే..
● జిల్లా ఆటోవాలా యూనియన్ అధ్యక్షుడు సత్తిరాజు ఆవేదన అమలాపురం టౌన్: సంక్రాంతి సీజన్లోనూ ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని జిల్లా ఆటోవాలా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఆటో డ్రైవర్ల జవనోపాధిపై గట్టి దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఈ మేరకు సత్తిరాజు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆటో డ్రైవర్ల పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పిల్లలకు బట్టల కొనుగోళ్లకు, రెండు నెలల ఆటో వాయిదాలకు సరిపడే డబ్బులను కష్టించి సంపాందించేవాళ్లమని, జనాలు రోడ్లపై కిటకిటలాడుతున్నా ఆటో డ్రైవర్లకు తగిన బేరాలు, ప్రయాణికులు లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొద్దిమంది ఆటో డ్రైవర్లకు మాత్రమే రూ.15 వేల సాయాన్ని అందించి, మిగిలిన వారికి ఇవ్వలేదని అన్నారు. జిల్లా బార్ ఫెడరేషన్ కన్వీనర్గా అజయ్కుమార్ అమలాపురం టౌన్: జిల్లా బార్ ఫెడరేషన్ ఆదివారం ఏర్పాటైంది. అమలాపురం బార్ అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఆరు బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఫెడరేషన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెడరేషన్ కన్వీనర్గా అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్కుమార్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్గా ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డి నాగేశ్వరరావు, సభ్యులుగా రాజోలు బార్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వ న్యాయవాది గుబ్బల రజిత, ముమ్మిడివరం బార్ నుంచి రామాయణం మహేశ్వరరావు, అమలాపురం బార్ ప్రధాన కార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, రామచంద్రపురం బార్ అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు, కొత్తపేట బార్ అధ్యక్షుడు నేతల మోహనరావు, రాజోలు బార్ అధ్యక్షుడు అయ్యప్ప, ఆలమూరు బార్ అధ్యక్షుడు కాండ్రేగుల భీమశంకరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. అమలాపురంలో జిల్లా కోర్టు కోసం సేకరిస్తున్న భూముల వద్ద న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని సూచించారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు, మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. -
మాల ఉద్యోగుల పరిరక్షణకు కృషి
మాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రత్నప్రసాద్ అమలాపురం టౌన్: మాల ఉద్యోగులపై జరుగుతున్న దాడుల నియంత్రణకు, వాటిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మాల ఉద్యోగుల పరిరక్షణ సమితి కృషి చేస్తుందని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బూసా రత్న ప్రసాద్ తెలిపారు. స్థానిక సర్ ఆర్థర్ కాటన్ పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఆదివారం జరిగిన జిల్లా మాల గెజిటెడ్ అధికారులు, మాల హక్కుల పరిరక్షణ సమితి సమావేశానికి రత్న ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమితి జిల్లా ప్రతినిధి పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మాల గెజిటెడ్ అధికారుల హక్కుల పరిరక్షణపై చర్చించింది. సమావేశంలో మాల హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు చింతా వెంకటేశ్వర్లు, సమతా సైనిక దళ్ నాయకురాలు శ్వేత మాట్లాడారు. జిల్లా కమిటీ చైర్మన్గా ప్రసాదరావు అనంతరం సమావేశం మాల గెజిటెడ్ అధికారులు, మాల హక్కుల పరిరక్షణ సమితికి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కమిటీ చైర్మన్గా నాగాబత్తుల ప్రసాదరావు, కో చైర్మన్లుగా పెనుమాల చిట్టిబాబు, కాశి వెంకటరావు, రేవు ఈశ్వరరావు, కన్వీనర్గా కుసుమ ప్రభుదాస్, కో కన్వీనర్లుగా నాగాబత్తుల నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణ, కోశాధికారిగా సాపే బాలరవి, లీగల్ అడ్వైజర్గా ఐఎన్ మల్లేశ్వరరావు, ఈసీ సభ్యులుగా వి.భానోజీరావు, కత్తుల ఆనందరావు, ముత్తాబత్తుల ఆనందరావు, సరెళ్ల సంజీవరావు, బి. సాల్మన్రాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సమితి రాష్ట్ర అధ్యక్షుడు రత్న ప్రసాద్ తదితరులు అభినందించారు. మాల ఉద్యోగులపై దాడులు జరగకుండా నూతన కమిటీ పర్యవేక్షించాలని ఆయన సూచించారు. -
నాటి సందళ్లు ఏమాయె!
● వచ్చాం.. వెళ్లాం అన్నట్టుగా సాగుతున్న పెద్ద పండగ ● నాటి కళ కానరాని పల్లెలు ● ఒకప్పుడు వారం పది రోజుల ముందే దిగిపోయే పిల్లాజెల్లా ● నేడు ఆ మూడు రోజులకే పరిమితం ● అంతా ఇన్స్టెంట్ సంతోషాలే ● రీల్స్లో.. యూట్యూబ్లలో మాత్రం ఆటలు, పాటలు, మ్యూజిక్కులు ● రోజులు మారిపోయాయంటున్న పెద్దలు సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పేడ కళ్లాపులు.. ఇలవేల్పు ముగ్గులతో ముస్తాబయ్యే పూరి పాకలు.. పెంకుటిళ్ల ముంగిట మంచి ముత్యాలు పోసినట్లుగా రంగవల్లులు. రెండు వరుసల ఇళ్ల మధ్య చూడ చక్కని ముగ్గులు.. డూడూ బసవన్నలు.. వీధి చివర భోగి మంటలు.. ఊరి చివర కోడి పందేలు.. హరిలో రంగ హరి కీర్తనలు... కిటకిటలాడే వస్త్ర దుకాణాలు.. అన్నదాత ఇంట ధాన్యపు రాశులు.. పాల పొంగులు.. కొత్త అందాలతో ముస్తాబయ్యే ఆవులు.. ఎద్దులు.. ఎడ్ల బండ్లు.. ఇదీ తెలుగు పల్లెల్లో సంక్రాంతి కళ. పండగ వస్తుందంటే చాలు వారం పది రోజుల నుంచి ప్రతి ఇంటా.. ప్రతి పల్లెలో ఒక రకమైన జోష్. వస్త్ర దుకాణాల వద్ద కొనుగోలుదారులతో పట్టణాల్లో ఒకటే సందడి. కాని ఇప్పుడు ముగ్గులు వేయని పల్లెలు.. కొనుగోలుదారులు లేని పట్టణాలలోని మార్కెట్లు చూస్తుంటే సంక్రాంతి సందడి జిల్లాలో మూడు రోజులకే పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సందడి అంతా ఒకప్పటి వైభవమేనా అంటే ప్రస్తుతం జిల్లాలోని పల్లెలు, పట్టణాలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి బంధువులు, వలస వెళ్లిన స్థానికులు రావడం మొదలైనా ఇంకా పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకోలేదు. పెద్దవారిని కదిలిస్తే తమ చిన్ననాటి పండగ వాతావరణం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోతున్నారు. ‘ఉద్యోగాలు, ఉపాధి అంటూ చాలా మంది గ్రామాలకు దూరమయ్యారు. ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారు వచ్చే వరకు పల్లెకు పండగ సందడి రావడం లేదు’ అని ఊరిలో ఉన్న పెద్దలు వాపోతున్నారు. పల్లెల్లోని పూరిళ్ల అలుకులు ఇంకా మొదలు కాలేదు. వీధులలో ముగ్గుల సందడి లేదు. అడపాదడపా గంగిరెద్దువాళ్లు, హరిదాసులు, కొమ్మదాసరులు వస్తున్నారు. ఈ వృత్తిని సంప్రదాయంగా, కుటుంబ వారసత్వంగా భావిస్తున్న కొందరు మాత్రమే ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. ‘మా చిన్న నాట వారం రోజుల ముందు నుంచే పిల్లలు, యువకులు భోగి మంటలు వేసేందుకు దుంగలు, పాత చెక్క సామాన్లు పోగు పెట్టేవారు. ఇప్పుడు భోగి ముందు రోజుకే వీటి సేకరణ పరిమితమైంది. భోగి మంటలు చిన్నబోతున్నాయి’ అని అంబాజీపేటకు చెందిన బొంతు సోమేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ధనుర్మాసం నుంచి ఇళ్ల వద్ద పేడ కళ్లాపులు వేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం గోదావరి జిల్లాలో ఆనవాయితీ. ఇప్పుడు కళ్లాపులు లేవు. ముగ్గుల సైజులు కూడా తగ్గిపోయాయి. పట్టణాలు వెలవెల పల్లెలు మాత్రమే కాదు.. వస్త్రాలు, హోమ్నీడ్స్, బంగారం, వాహనాల కొనుగోళ్లు లేక పట్టణాలు సైతం వెలవెలబోతున్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన వస్త్ర వ్యాపార ప్రదేశం శ్రీదేవి మార్కెట్ వీధిలో కూడా సాయంత్రం కొంత వరకు సందడి ఉన్నా గతంలోని పండగ రోజులతో పోలిస్తే అంతంత మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో పెద్ద పెద్ద మాల్స్ వద్ద కొంత సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల సోమ, మంగళవారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతాయని వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. ‘ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల లబ్ధి లేదు. వరి, ఆక్వా రైతులు దెబ్బ తిన్నారు. రియల్ ఎస్టేట్ మరీ దారుణంగా ఉంది. దీని వల్ల ఈ ఏడాది కొనుగోళ్లు సగం కూడా లేవ’ని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పండగ అంతా రీల్స్లో గోదావరి జిల్లాలో పండగంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలోని రీల్స్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సప్ ఏది తెరిచి చూసినా పండగ సందడి కనిపిస్తోంది. గంగిరెద్దులు, రంగురంగుల ముగ్గులు, గోదావరి రుచులు, కోడి పందేలు ఇలా సంక్రాంతి అంతా రీల్స్లో హల్చల్ చేస్తోంది. అసలైన పండగంతా రీల్స్లోనే కనిపిస్తోంది. వీటికి బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా హోరెత్తిస్తోంది. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పండగ సంబరాల వల్ల ఈ ఏడాది జిల్లాలో కొంత వరకు సంక్రాంతి సందడి కనిపించింది. ముగ్గులు లేక బోసిపోతున్న వీధులు అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని ప్రధాన వీధి. ఈ గ్రామ సమీపంలోనే జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోంది. ఈ ఊరి నుంచి వెళ్లే ప్రభ కౌశికను దాటి వెళ్లడం చూసేందుకు వేల మంది తరలివస్తారు. పదేళ్ల క్రితం సంక్రాంతి అంటే ఊరంతా ఒక ఉత్సాహం. ఎక్కడా లేని పండగ వాతావరణం. వీధిలో బంధువులతోను, ప్రభ కట్టేవారితోను, ఇంటి ముంగిట రంగవల్లులు వేసే మహిళలతోనూ, లోగిళ్లలో పెద్దలు చిన్నారులు కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉండేది. పండగ ఘడియలు వచ్చినా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. -
గోదారి పాయల్లో హైలెస్సా..
● కోనసీమలో కేరళ తరహా పోటీలు ● సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీకి రంగం సిద్ధం ● వేదిక కానున్న ఆత్రేయపురం కొత్తపేట: సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించే ప్రధాన పంట కాలువలు. ఆ పక్కా.. ఈ పక్కా ప్రధాన రహదారులు. వాటిని ఆనుకుని పచ్చని వరిచేలు.. ఉద్యాన పంటలు, కొబ్బరితోటలు, సుమ వనాలు.. ప్రకృతి అందాలతో కనువిందైన వేదిక కోనసీమ. గౌతమి – వశిష్ట నదుల మద్య కోనసీమ అందాలు ప్రకృతి రమణీయాలు. ప్రధానంగా బొబ్బర్లంక బ్యారేజ్ నుంచి లొల్ల లాకుల మధ్య ప్రయాణం మరింత ఆహ్లాదం. ఇటువంటి చోట పంట కాలువలో కేరళ తరహా పడవ పోటీల నిర్వహణకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కేరళ తదితర రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. లొల్ల లాకుల నుంచి ఉచ్చిలికి మధ్య సాగనున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఇప్పటికే చేరుకుని సాధన చేస్తున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సంక్రాంతికి మూడు రోజుల ముందే ఆత్రేయపురం ఉత్సవం పేరిట సంక్రాంతి సంబరాలు ఆదివారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత ఏడాది రాష్ట్రస్థాయి డ్రాగన్ పడవల పోటీల స్ఫూర్తిని కొనసాగిస్తూ జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ, దాతలు, జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఎగ్జిబిషన్ కమ్ సేల్స్, పిల్లలకు, మహిళలకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం కేంద్రంగా తాడిపూడి వారధి నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వహకులు తెలిపారు. 11న ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, 12, 13వ తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, 13వ తేదీ గాలిపటాల పోటీలు జరగనున్నట్లు తెలిపారు. డ్రాగన్ పడవల పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్ర, కేరళ ఇతర రాష్ట్రాల నుంచి 250 మందితో 25 జట్లు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈత పోటీలకు జాతీయస్థాయిలో 200 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. 300 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు, 100మంది గాలిపటాల పోటీల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆత్రేయపురం మహాత్మాగాంధీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సినీ ఆర్కెస్ట్రా, నారీ నారీ నడుమ మురారి లాంచింగ్కు ప్రసిద్ధ సినీనటుడు శర్వానంద్ రానున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. -
యువతకు అండగా ఉంటా
● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ● జాబ్మేళాకు విశేష స్పందన● తరలివచ్చిన 4,850 మంది నిరుద్యోగ యువతీ యువకులు ● పాల్గొన్న సుమారు 70 కంపెనీలు రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. జగనన్న తరఫున తన వంతు కర్తవ్యంగా స్థానిక హోటల్ మంజీరా సరోవర్లో శనివారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారని భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 70 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 4,850 మంది యువతీ యువకులు తరలివచ్చారన్నారు. వారిలో ప్రతిభ కలిగిన సుమారు 450 మందికి నియామక పత్రాలు అందచేశామన్నారు. తదుపరి రెండో రౌండ్ ఇంటర్వ్యూ లు జరుగుతాయని అప్పుడు సుమారు 400 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగం రాని యువత కంగారు పడాల్సిన అవసరం లేదని, ఉద్యోగ విషయంలో వాళ్లకు నేను ఎప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలకు పాతరేసి నిరుద్యోగ యువతను త్రిశంకు స్వర్గంలో నిలబెట్టారన్నారు. సిటీ ఎమ్మెల్యే హంగు, ఆర్భాటం తప్ప ఇంకేమి లేనట్టు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ అనే నేను సిటీ ప్రజల సంక్షేమం కోసం, వారి శ్రేయస్సు కోసం, యువత శ్రేయస్సు కోసం పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ జగనన్న ఆదేశాల మేరకు పని చేస్తూనే ఉంటానన్నారు. ఈ పండుగ సమయంలో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు మన అందరి మీద, జగనన్న కుటుంబం మీదా ఉండాలని ఆయన ఆకాక్షించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేయడం గర్వ కారణమన్నారు. త్వరలో కోనసీమ జిల్లాలో జాబ్మేళాకు చర్యలు చేపడతామన్నారు. మాజీ ఎమ్మల్యే తలారి వెంకటరావు, శ్రీనివాస్ నాయుడు, రౌతు సూర్యప్రకాశ రావు, తూర్పు గోదావరి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ భరత్రామ్ పిన్న వయస్సులో ఈ విధమైన కార్యక్రమం చేయడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులను ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఎంత బాధ పడుతున్నారో, వారి కుటుంబాలు ఎంత క్షోభకు గురవుతున్నాయో ఈ అంధ ప్రభుత్వానికి కనపడటం లేదని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలు వీటితో అధికారం చేపట్టి ప్రజా సమస్యలను విస్మరించి కేవలం అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, హత్యలు, మానభంగాలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్లు ఇలా నిరంకుశ పాలనతో ప్రజలను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎంపీ పల్లి సుభాస్చంద్రబోస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ప్రయాణాల్లో మహిళలు అప్రమత్తం
● అపరిచితుల మాటలు నమ్మవద్దు ● ఊళ్లకు వెళ్లేవారు ‘ఎల్హెచ్ఎంఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి అమలాపురం టౌన్: సంక్రాంతి పండగల సందర్భంగా ప్రయాణాలు చేసే మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిక అంటూ విడుదలైన ఈ ప్రకటనలో ఊళ్లకు వెళ్లే మహిళలు తమ విలువైన నగలు, నగదును లగేజీ బ్యాగ్లు, హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకుని ఆటోలు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, అటువంటి సమయంలో మీ పక్కన కూర్చున్న మహిళలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిమ్మల్ని, మీ దృష్టిని ఏమార్చి బ్యాగ్లలోని విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంటుందని, అపరిచిన ఆడవారి మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పండుగలకు ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లోని తమ విలువైన బంగారు నగలు, డబ్బులు తదితర వాటిని సాధ్యమైనంత వరకూ మీ బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దని, అనివార్య పరిస్థతుల్లో పోలీసులు సమకూర్చే ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కార్యాలయం సూచించింది. ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డౌన్ లోడ్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ యాప్ డౌన్ లోడ్, పోలీసుల నిర్వహణ అంతా పూర్తి ఉచితం, ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని మీరు ఊళ్లకు వెళ్లడం వల్ల పోలీసులు మీ ఇంటిపై పూర్తి నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చూస్తారని జిల్లా ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది. -
మూల్యం చెల్లించాల్సిందే!
● కోనసీమలో కానరాని పండగ సందడి ● సలసల కాగుతున్న నూనె ధరలు ● అదే దారిలో నిత్యావసర వస్తువులు ● గత ఏడాది కన్నా 30 శాతం పెరుగుదల ● బెంబేలెత్తుతున్న సగటు జీవులు సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పంట ఉత్పత్తుల కోత.. ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం.. సంప్రదాయాలను పాటించడం.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం.. బంధాలను బలోపేతం చేసుకోవడం.. పిండి వంటలు వండుకోవడం.. నూతన వస్త్రాలు, వాహనాలలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం.. సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడం.. పండగ నాలుగు రోజులు సొంతవారితో సందడి చేయడం.. ఇలా సంక్రాంతి పండుగల్లో అన్నీ ఆనందకరమైన విషయాలే. కాని పంటి కింద రాయిలా ఈ ఏడాది పండగకు నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. రొయ్యలు, చేపలు, మాంసాహారాలు.. బస్సు టిక్కెట్లు, వెండి, బంగారాలు ఇలా ప్రతీ ధరలు నింగినంటడంతో సామాన్యులకు పండుగ భారంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు కనపడేవి. దీంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగి నగదు చెలామణీ జరిగేది. ప్రభుత్వం మారాక నగదు బదిలీలు లేకపోవడం.. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడకపోవడంతో ఏం కొనాలన్నా నాలుగుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. హతవిధీ.. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంతో మూల్యం చెల్లించుకుంటున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారు. పిండి వంటలకు ధరా ఘాతం నూనె, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పిండి వంటల పేరు చెబితేనే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. 2024 పండగతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కిలో వంట నూనె ధర సగటున రూ.140 వరకు ఉండగా నేడు రూ.160కి పెరిగింది. కందిపప్పు రూ.120, మినపప్పు కేజీ రూ.80 నుంచి రూ.110, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120 వరకు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చిక్కీ గోధుమ పిండి ఇస్తామని కేవలం అమలాపురం పట్టణంలో 11,634 కార్డుదారులకు మాత్రమే పరిమితం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్) అందించేవారు. అరకిలో పంచదార, కిలో చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. బాబు వచ్చిన తరువాత కందిపప్పును నిలిపివేశారు. రాకపోకల్లో బాదుడు.. సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్, చైన్నె, బెంగుళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంతూళ్లు అయిన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సులు, రైళ్లు సీట్లు లేకపోవడం ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. బస్సులలో నాన్ ఏసీ సీటింగ్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సీటింగ్ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదో తేదీన అయితే ఏకంగా రూ.2,600 నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సీటింగ్ ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉండగా, స్లీపర్ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం. పండగ కానుకలు లేవు రేషన్ దుకాణాల ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు పంచదార, నెయ్యి, ఆయిల్, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగనే కాకుండా ఇతర రోజుల్లోనూ కూడా ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. బయట నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి. – మట్టపర్తి విజయ్ కుమార్, గంగలకురు అగ్రహారం, అంబాజీపేట మండలం కోడి.. చేప.. రొయ్య.. ఆలోచనే రానంతగా.. సంక్రాంతి పండగ ప్రభావంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది. పందెం కోడి పుంజు రకాన్ని బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉంది. నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. ఇక మాంసం ధరలకు వస్తే బ్రాయిరల్ కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. వనామీ రొయ్యల ధర 100 కౌంట్ కేజీ ధర రూ.250 వరకు ఉండగా, చందువా చేప కిలో రూ.500, పండగొప్ప రూ.400 వరకు పలుకుతోంది.బంగారం.. వెండి.. గతకాలపు మాటేనేమో.. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభంతో బంగారం, వెండి ధరలు ఆకాశానికి ఎగబాకాయి. సంక్రాంతి పండగ సమయంలో ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేయడం రైతులకు, కాస్త స్తోమత ఉన్నవారికి, మధ్య తరగతి వారికి ఆనవాయితీ. కాని ప్రస్తుత మార్కెట్లో 22 క్యారెట్ గ్రాము ధర రూ.12,900 వరకు ఉంది. కాసు (ఎనిమిది గ్రాములు) ధర రూ.1,03,200 వరకు పలుకుతోంది. రెండేళ్ల క్రితం పండగ సమయంలో కాసు బంగారం ధర రూ.46,840. రెండేళ్ల క్రితం కేజీ వెండి ధర రూ.75 వేలు కాగా, ప్రస్తుత ధర రూ.2.75 లక్షలు. కలలో కూడా ఊహించని ధర ఇది. కార్తికం కన్నా తగ్గినా.. ఇప్పటికీ కూర‘గాయాలే’ కార్తిక మాసంతో పోలిస్తే ఇప్పుడు కూరగాయల ధరలు తగ్గాయి. అయినా సామాన్యులు కొనే స్థాయిలో లేవు. మార్కెట్లో కిలో బీరకాయల ధర రూ.50 వరకు ఉండగా, దొండకాయలు రూ.50, క్యాబేజీ రూ.35, క్యాప్సికం రూ.90, బీట్రూట్ రూ.55, క్యారెట్ రూ.50, మామిడికాయలు రూ.160 వరకు ఉంది. పచ్చిమిర్చి రూ.40 వరకు ఉండగా, కొత్తిమీర కట్ట రూ.25 పలుకుతోంది. ఉల్లిపాయలు కేజీ రూ.25 నుంచి రూ.30 వరకు ధర పలుకుతోంది. తెల్ల బీన్స్ గింజలు రూ.250 వరకు ఉంది. -
బ్లో అవుట్ ఘటనపై నేడు కలెక్టర్ సమీక్ష
మలికిపురం: మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లో అవుట్ ఘటనపై లక్కవరంలో ఆదివారం ఉదయం 12 గంటలకు బాధిత గ్రామాల ప్రజలతో కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సమీక్షించనున్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ల సమక్షంలో బాధితులతో ఈ సమీక్ష ఉంటుందని తహసీల్దారు టి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. దృక్ సిద్ధాంతం మేరకే పండగల నిర్ణయం అమలాపురం రూరల్: పండగల తేదీల్లో తేడాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని బండారులంకకు చెందిన పంచాంగకర్త కాలెపు భీమేశ్వరరావు కోరారు. వివిధ పంచాంగాలలో వేర్వేరు తేదీలలో పండగలను సూచించడమే ఇందుకు కారణమన్నారు. శనివారం ఆయన దీనిపై వివరణ ఇస్తూ ఈ విధమైన నిర్ణయాల్లో తేడా రాకుండా 1956లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధృక్ పద్ధతి సరైనదని తీర్మానించారని, ఆ తీర్మానాన్ని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రత్నగిరిపై భక్తుల రద్దీ ● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహణ ● దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమవడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజన సౌకర్యం కలుగచేశారు. కాగా, ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యునిగా సత్యనారాయణరాజు సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన కుందరాజు సత్యనారాయణరాజుకు అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా రాజోలుకు చెందిన కుందరాజు సత్యనారాయణరాజును నియమించారు. ఫ్లెమింగో ఫెస్టివల్కు రాము కార్టూన్ అమలాపురం రూరల్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్కు మండలంలోని బండారులంకకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు మాడా రాము గీసిన కార్టూన్ అర్హత సాధించింది. రాష్ట్ర కార్టూనిస్టుల సంఘం సమర్పణలో మండల విద్యా, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వ్యంగ్య చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై రాము గీసిన కార్టూన్ పెట్టనున్నారు. వివిధ ప్రదర్శనలతో పాటుగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద కార్టూన్లను ప్రదర్శనలో ఉంచారు. -
ప్రభల ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కొత్తపేట: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలను ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఉత్సవ కమిటీలకు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ప్రభల ఉత్సవాలకు భిన్నంగా కొత్తపేటలో అనాదిగా మకర సంక్రాంతి పర్వదినం నాడు ప్రభల ఉత్సవాలు, ఆ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్పులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 15న జరిగే ఉత్సవాల తీరుతెన్నుల గురించి శనివారం సాయంత్రం ఎస్పీ రాహుల్ మీనా స్థానికంగా డీఎస్పీ సుంకర మురళీమోహన్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా ఎంత సేపు ఉత్సవాలు జరుగుతాయి.. బాణసంచా కాల్పులు.. ఎన్ని వేల మంది జనం తరలివస్తారనే అంశాలపై చర్చించారు. కొత్తపేటలో ప్రభల విడిది, బాణసంచా కాల్చే ప్రదేశాలు పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 2 వీలర్, 4 వీలర్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ డైవర్షన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ చారిత్రాత్మక ప్రభల తీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 16న కనుమ పండుగ రోజున జరిగే ప్రభల తీర్థాలకు తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. వారి వెంట ఎస్సై జి.సురేంద్ర తదితరులు ఉన్నారు. -
ఆలయ పూజారిపై కత్తితో దాడి
తాళ్లరేవు: మండలంలోని జార్జిపే ట రామాలయం పూజారిపై కత్తితో దాడి జరిగింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన ఇంద్రగంటి వీర వెంకట సత్య సూర్యసుబ్రహ్మణ్య సుందరేశ్వరశర్మ జార్జిపేట రామాలయం పూజారిగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయమే ఆలయానికి వచ్చిన శర్మ 9.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి ఆలయంలోకి వెళ్లేందుకు బయట కాళ్లు కడుగుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొండమూరి శివయ్య కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పూజారి చేతులపై, ఉదరంపై తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు హుటాహుటిన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపా రు. పాత కక్షల నేపథ్యంలోనే శివయ్య పూజారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
శనైశ్చరునికి ప్రత్యేక తైలాభిషేకాలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రాతఃకాల సమయంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,68,870, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.1,70,300, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.30,501 ఆదాయం వచ్చిందని ఈఓ సురేష్బాబు వివరించారు. -
కాలువలో మహిళ మృతదేహం
రావులపాలెం: మండలంలోని గోపాలపురం గ్రామ ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించినట్టు ఎస్సై కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతురాలి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించామని ఎస్సై వివరించారు. ఆమె వంటిపై ఎరుపు రంగు జాకెట్, ఎరుపు రంగు చీర ఉందన్నారు. కాలువ ఎగువ ప్రదేశం నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ 94407 96567, ఎస్సై 99890 32059 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఆగిన బ్లోఅవుట్
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5న సంభవించిన భారీ బ్లోఅవుట్ మంటలను శనివారం ఉదయం 10.30 గంటలకు పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఆరు రోజుల శ్రమ ఫలించడంతో ఓఎన్జీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున మంటలు బాగా తగ్గడంతో నీరు చల్లుతూ సిబ్బంది వెల్ మౌత్ వద్దకు వెళ్లారు.పరిస్థితిని అధ్యయనం చేసి దెబ్బతిన్న భాగాలను తొలగించి.. బ్లోఅవుట్ ప్లగ్ను ప్రత్యేక క్రేన్తో వెల్కు అమర్చడంతో గ్యాస్ మంటలు పైకి వెళ్లడం ప్రారంభమైంది. అనంతరం ప్లగ్ ద్వారా గ్యాస్ లీకేజీని అదుపుచేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకున్న ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, రెస్క్యూ టీమ్ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం 12 గంటలకు వెల్ మూసివేత చర్యలలో భాగంగా ప్రత్యేక యంత్రాల ద్వారా బావిలోకి మడ్ పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు.ఇది సమష్టి విజయం ఇరుసుమండ బ్లోఅవుట్ను ఆరు రోజులు శ్రమించి సమష్టి కృషితో అదుపు చేశాం. సిబ్బంది, రెస్క్యూ టీమ్ అహర్నిశలూ శ్రమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పూర్తిస్థాయిలో సహకరించారు. ప్రస్తుతానికి బ్లోఅవుట్ ప్లగ్ వేసి మూసేశాం. వెల్ను కూడా మడ్తో మూసివేశాం. తరువాత చర్యలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. – శంతన్దాస్, ఓఎన్జీసీ ఈడీ–కం–అసెట్ మేనేజర్, రాజమహేంద్రవరంత్వరితగతిన మూసివేశాం బ్లోఅవుట్ మంటలను చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ చేశాం. ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది సాంకేతికతతో పనిచేశారు. ఘటన సంభవించిన నాటినుంచి ఈ రోజు వరకూ అలుపెరగకుండా పని చేశాం. – గాజుల శ్రీహరి, ఇన్చార్జి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ -
అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ బ్లోఅవుట్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది. దీంతో అక్కడికి ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది కాలిన వ్యర్థాలను తొలిగించారు. మంటలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.జనవరి 5న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో ఓఎన్జీసీ మోరి బావి5లో భారీ బ్లోఅవుట సంభవించింది. ఓఎన్జీసీ సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ ఎగజిమ్మింది. దీంతో పెద్దఎత్తున 100 మీటర్ల పైకి మంటలు లేశాయి. అగ్నికీలల తీవ్రత చూసి బెంబేలెత్తిపోయిన రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదం జరిగిన మోరి-5 నంబర్ బావి ఓఎన్జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. భద్రతాకారణాలు సరిగ్గా లేకపోవడంతో 12 ఏళ్లక్రితమే దీనిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించడంతో దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం మళ్లీ అక్కడే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వెదజల్లుల్లో సీమసాగు..!
పెట్టుబడి కలసివస్తోంది వెదజల్లు పద్ధతిలో ఒక్క రోజులోనే.. ఒక్క మనిషితో ఎకరాకు సరిపడా విత్తనాలు చల్లిస్తున్నాం. ఎకరాకు ఎలా చూసినా రూ.ఐదు వేలకు పైబడి పెట్టుబడి మిగులుతోంది. నేను నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ విధానం వల్ల రూ.20 వేలకు పైబడి పెట్టుబడి మిగులుతోంది. రెండు బస్తాలు (60 కేజీలు) విత్తనం కూడా కలిసి వస్తోంది. – జి.నారాయణ, కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం ● మూడొంతుల రైతులది ఇదే పద్ధతి ● కూలీల కొరతకు ఉత్తమ విధానం ● తగ్గుతున్న పెట్టుబడి వ్యయం ● స్వల్ప కాలంలోనే అధిక దిగుబడి ● మిగిలిన చోట్ల బెంగాలీలతో ఊడ్పులు ● జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో రబీ సాగు ● ఇప్పటి వరకు 41,404 ఎకరాల్లో సాగు ఐ.పోలవరం/ఉప్పలగుప్తం: గోదావరి డెల్టాలో రబీ సాగు ఆలస్యమైంది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 31 నాటికి నాట్లు, వెదజల్లులు పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం పావు వంతు మాత్రమే పూర్తయ్యాయి. పరిస్థితి చూస్తుంటే జనవరి నెలాఖరు వరకు నాట్లు పడేలా ఉంది. కూలీల కొరతకు తోడు పెరుగుతున్న పెట్టుబడులను తగ్గించుకునే ఉద్దేశంతో రబీ రైతులు పలు యత్నాలు మొదలుపెట్టారు. వీరిలో చాలా మంది వెదజల్లును ఆశ్రయిస్తుండగా, మరి కొంతమంది బెంగాలీ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలో 1.70 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతోందని అధికారుల అంచనా. కాని ఇంత వరకు కేవలం 41,404 ఎకరాలలో వెదజల్లు, నాట్లు వేశారు. దీనిలో 8,027 ఎకరాల్లో నాట్లు కాగా, 33,377 ఎకరాల్లో వెదజల్లు, మరో 3,643 ఎకరాలకు సరిపడా నారుమడి ఉంది. మూడొంతులు వెదజల్లు డెల్టాలో మూడు వంతులు వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నారు. నాట్లు వేయడం రైతులకు వ్యయ, ప్రయాసలతో కూడుకున్న అంశంగా మారింది. ఎకరాకు స్థానిక కూలీలతో మడిలో విత్తనం చల్లడం, నారు సేకరణ, నాట్లు వేయడానికి సుమారు రూ.ఎనిమిది వేల వరకు ఖర్చవుతోంది. అదే వెదజల్లు పద్ధతిలో ఒక్క మనిషితో విత్తనాలు చల్లిస్తున్నారు. ఇందుకు రూ.ఏడు వందల నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చవుతోంది. ఇక్కడే రైతుకు రూ.ఏడు వేల వరకు మిగులుతోంది. వెదజల్లులో విత్తన వినియోగం కూడా చాలా తక్కువ. సాధారణ నారుమడి పద్ధతిలో 30 కేజీల విత్తనం వాడుతుండగా, వెదజల్లుకు 12 నుంచి 15 కేజీలు సరిపోతోంది. దీనికి తోడు పంట కూడా 10 నుంచి 15 రోజుల ముందే దిగుబడి వస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉండడం, ప్రధానంగా కూలీల కొరత అధిగమించే అవకాశం ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విధానంలో కలుపు ఎక్కువ వచ్చే అవకాశముందని కొందరు రైతులు ఆ పద్ధతికి దూరంగా ఉంటున్నారు. కాని వెదజల్లు అన్ని విధాలుగా మంచిదని, కలుపును కూడా సమర్ధవంతంగా నివారించేందుకు మందులు, ఉత్తమ యజమాన్య పద్ధతులున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
బ్రాయిలర్.. లేయర్దీ అదే దారి.. దేశవాళీ పందెం కోళ్లు, నాటు కోళ్లతో పాటు బ్రాయిలర్, లేయర్ కోళ్ల ధరలు సైతం భారీగా పెరిగియి. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. పండగతో పాటు కోళ్లు పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్ల వీటి ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.పందెం పెరిగే కొద్దీ.. గోదావరి జిల్లాలంటేనే కోడి పందేలకు పెట్టింది పేరు. పెద్ద పండగకు ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో వందలాది బరులలో పందేలు సహజం. ఈ నేపథ్యంలో పందెం కోళ్లకు రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. బరిలో పందెం పెరిగే కొద్దీ వీటి ధరా అదే స్థాయిలో పెరుగుతుంది. జిల్లాలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, మలికిపురం మండలాల్లో వీటిని పెద్ద ఎత్తున పెంచుతున్నారు.నానాటుకీ గిరాకీ పందెం కోడి స్థాయి కాకున్నా నాటు కోళ్లకు సైతం డిమాండ్ ఎక్కువే. రెండు కేజీల నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. గత నెలలో వీటి ధర రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఉండగా, పండగ పేరు చెప్పి ధరలు పెంచేశారు. కొక్కొరుకో జరా..!పెద్ద పండగ ప్రభావం కోళ్లపై పెద్దగానే పడింది. వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మూడు రోజుల పెద్దపండగ సందర్భంగా పందేలకు, మాంసాహార విందులకు వీటిని ఎక్కువగా వినియోగించే అవకాశముండడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగవమ్మా.. కొండ దిగిరావమ్మా అని ప్రజలు బతిమలాడుతున్నారు. సాక్షి, అమలాపురం -
యువజన నేతల నిర్బంధం దారుణం
● వారిపై అక్రమ కేసులు రద్దు చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ● కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల ధర్నా అమలాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, వాటి అమలు కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు తెరుస్తున్నారని వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల, విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్త విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, పార్టీ యువజన విభాగం, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీసీ జిల్లా యువజ విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థి, యువకులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నించే వారిని అణచి వేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తోందని, రౌడీషీట్లు తెరుస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశ విధానాలాను విరమించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువకులను ఇబ్బందిపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్టు చరిత్రలో లేదన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం విద్యార్థి యువజన సంఘాల నాయకులతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నెల రోజులు గడవకముందే ప్రశ్నించి ఉద్యమిస్తున్న విద్యార్థి, యువకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక దేశాలలో విద్యార్థులు ఉద్యమించి ప్రభుత్వాన్ని కూల్చిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం వారంతా డీఆర్ఓ కొత్త మాధవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భారత్భూషణం, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, అంబాజీపేట వైఎస్సార్ మండల అధ్యక్షుడు విత్తానాల శేఖర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ములపర్తి శ్రీను, రాష్ట్ర యువజన విభాగం అధికారి ప్రతినిధి ఉండరాల సంతోష్కుమార్, విద్యార్థి విభాగం రిజినల్ కోర్టినేటర్ జిల్లేళ్ల రమేష్, రామచంద్రపురం నియోజకవర్గం విద్యార్థి, ఏఐఎస్ఎఫ్ నాయకులు రవికుమార్, యువత విభాగాల అధ్యక్షులు గుత్తుల రమేష్, మాదిరెడ్డి పృథ్వీరాజ్, వివిధ విభాగాల అధ్యక్షులు బూల పృథ్వీరాజు, విత్తానాల రమేష్, రాజులపూడి మురళీకృష్ణ, గొవ్వాల రమేష్, దొంగ చిన్నా, గోపి రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
లాభసాటి దిగుబడి
నేను 18 ఎకరాలలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. దాదాపు పదేళ్ల నుంచి బెంగాలీ కూలీలను వాడుతున్నాను. నాట్ల సమయంలో స్థానిక కూలీలు సర్దుబాటు కావడం లేదు. అందుకే ఏటా నాట్ల సమయానికి ఏజెంట్ల ద్వారా వారిని రప్పిస్తాను. వీరు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాన్ని నాటుతారు. పైగా వీరికయ్యే ఖర్చు స్థానిక కూలీలతో పోల్చుకుంటే తక్కువే. – నిమ్మకాయల నాగేశ్వరరావు, రైతు, మునిపల్లి ఉప్పలగుప్తం మండలం ఏటా వస్తుంటాం ఖరీఫ్, రబీ సమయాల్లో జరిగే నాట్లకు ఏటా వచ్చి పని చేసుకుపోతాం. నవంబర్లో ఇక్కడకు వచ్చాం. నెల్లూరులో నెల పాటు నాట్లు వేసి తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దాదాపు 20 రోజులు పని చేస్తాము. తర్వాత సొంతూళ్లకు వెళ్లి పనులు చేసుకుంటాం. మాకు మేస్త్రి ఉంటాడు. అన్ని ఖర్చులు మేస్త్రి పెట్టుకుని ఎకరానికి రూ.3,500 వరకు మాకు ఇస్తాడు. – నరేష్ చంద్ర గైన్, వలస కూలి, నార్త్ 24 పొంగనాడ్ జిల్లా, పశ్చిమబెంగాల్ -
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా అనురాధ
అల్లవరం: అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తున్న పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనురాధకు పలువురు పార్టీ నాయకు లు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. బ్లో అవుట్ బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలి మలికిపురం: ఇటీవల ఇరుసుమండలో జరిగిన గ్యాస్ విస్పోటం వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని, ఇళ్లు వదలి పారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ ీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో గ్రామంలో ధర్నా జరిగింది. ఆయన మాట్లాడు తూ ముసలివారు, పిల్లలు, మహిళలు తలో ది క్కుకు వెళ్లిపోవడంతో ఇళ్లలో దొంగలు పడి దొరి కింది దొరికినట్టు దోచుకుపోయారని, ఈ గ్యాస్ బావులు ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడంతో భద్రతా చర్యలు లోపించాయని, పర్యవేక్షణ కూ డా లేదని, అపారమైన చమురు, గ్యాస్ను గుజరా త్ కంపెనీలు తరలించుకుపోయి, రూ.కోట్లు కొల్ల గొట్టి ఇక్కడ కనీసం సామాజిక బాధ్యత కింద గ్రా మాలను అభివృద్ధి చేయలేదని ఆగ్రహించారు. తక్షణమే నిపుణులతో విచారణ జరిపి గ్యాస్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. 14న గోదా కల్యాణం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భోగి పండగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఈ కల్యాణాన్ని నిర్వహించనున్నట్టు ఈఓ తెలిపారు. కారణాంతరాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్న యువతీ యువకులు ఈ కల్యాణంలో పాల్గొనడం వల్ల శీఘ్రంగా ఓ ఇంటివారవుతారని భక్తుల నమ్మకం. ఈ మేరకు వాడపల్లి క్షేత్రంలో నిర్వహించే కల్యాణానికి అవివాహితులైన భక్తులు విశేషంగా హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. భక్తులంతా సంతృప్తి చెందేలా చూడాల్సిన బాధ్యత ఆలయ వర్గాలపై ఉన్నదని ఈఓ సూచించారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. -
రక్షణ గోడలు నిర్మించాలి
ఘాట్రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద వాహన ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలి. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో రహదారి అధ్వానంగా తయారైంది. ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలి. అప్పుడే ఇబ్బందులు ఉండవు. – సవలం అమల, ఎంపీపీ, చింతూరు భారీ వాహనాలు నిషేధించాలి ఘాట్ రోడ్లో భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కంటైనర్లు, ఊక లారీలు తరచూ ఘాట్ రోడ్లో నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు వీటిపై తగిన చర్యలు చేపట్టాలి. – వేగి రాజా, వ్యాపారి, మోతుగూడెం, చింతూరు మండలం అవగాహన కల్పించాలి ఘాట్ రోడ్లో డ్రైవింగ్పై వాహనదారులకు రవాణా అధికారులు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఈ రోడ్లో పల్లానికి దిగే సమయంలో వాహనాలు సెకండ్ లేదా థర్డ్ గేరులో దిగాల్సి ఉండగా ఆయిల్ మిగులుతుందనే కక్కుర్తితో న్యూట్రల్ గేరులో దిగుతున్నారు. దీంతో మలుపుల వద్ద వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. – ఎం.శివరామకృష్ణ, మోతుగూడెం, చింతూరు మండలం -
ప్రయాణాలు ఘాట్లో.. ప్రాణాలు గాల్లో
చింతూరు: కాస్త ఆగండి.. రాత్రి పూట ప్రయాణాలు మానండి.. ఘాట్ రోడ్డులో వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నా, ఎక్కడా వాహనాలకు బ్రేక్ పడడం లేదు.. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఎందరో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.. గత నెల 12న తెల్లవారు జామున చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యూ పిన్ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. రాత్రి ప్రయాణమే ప్రమాదానికి కారణమని భావించిన అధికారులు అదే రోజు నుంచి ఘాట్రోడ్డులో రాత్రిళ్లు వాహన రాకపోకలు నిషేధించారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రాల సరకు రవాణాకు చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్లు అనువుగా ఉంటాయి. అందుకే ఆంధ్రా, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు చెందిన సరకు రవాణా వాహనాలతో పాటు బస్సులు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గఢ్కు కొబ్బరికాయలు, బెల్లం, ఉల్లిపాయలు, కోళ్లతో పాటు కూరగాయలు అధికంగా రవాణా అవుతాయి. ఒడిశాకు చేపలు, ప్లాస్టిక్ వస్తువులు, కోళ్ల రవాణా జరుగుతుంది. మరోవైపు విలీన మండలాల నుంచి తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ధాన్యం, పొగాకు, అపరాలు అధికంగా తరలిస్తుంటారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఇటుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ రాకపోకలను అధికారులు నిషేధించారు. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ లారీలు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. పగలు రద్దీ దృష్ట్యా భారీ వాహనాలు సైతం రాత్రిళ్లు ప్రయాణిస్తూ మలుపులు వద్ద ఎత్తు ఎక్కలేక నిలిచిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు చింతూరు వైపున, అటు మారేడుమిల్లి వైపున రాత్రిళ్లు వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడా ప్రమాదాలు ఆగడం లేదు. మరోవైపు ఘాట్ రోడ్లో భారీ వాహనాల రాకపోకలపై సరైన నియంత్రణ లేక తరచూ మలుపుల వద్ద ఎత్తు ఎక్కలేక నిలిచిపోతున్నాయి. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మరోమారు నిషేధాజ్ఞలు కాగా ఘాట్రోడ్డులో రాత్రిపూట వాహనాల రాకపోకలపై రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్రాజ్ మరోసారి ఈ నెల 6న నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటవాలు మలుపులు, రాత్రిపూట రహదారి సరిగా కనిపించకపోవడం, వన్యప్రాణుల సంచారం కారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై పోలీసు, అటవీ, ఆర్అండ్బీతో పాటు స్థానిక ప్రభుత్వ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు. ఘాట్ రోడ్డులో మలుపు వద్ద నిలిచిపోయిన భారీ వాహనంఫ ఘాట్ రోడ్డులో రాత్రి ప్రయాణాలు ఫ నిషేధాజ్ఞలు ఉన్నా ఆగని వైనం ఫ నిఘా వ్యవస్థ లేక నియంత్రణ కరవు ప్రమాదాలు... మరణాలు ఘాట్ రోడ్డులో సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 12న చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలోకి బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ ఎగువ రహదారి పైనుంచి దిగువ రహదారిపై పడడంతో ఏడుగురు మృతి చెందారు. గతంలో చింతూరులో సువార్త సభలకు వచ్చిన క్రైస్తవులు ఆటోలో వెళుతున్న క్రమంలో లోయలోకి జారిపడడంతో ఐదుగురు చనిపోయారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడకు వెళ్తున్న భవానీ భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఘాట్ రోడ్డులోని దుర్గ గుడి సమీపంలో లోయలో పడడంతో ఏడుగురు భవానీలు దుర్మరణం పాలయ్యారు. పై సంఘటనల్లో నాలుగు రాత్రి పూట జరిగినవే కావడం గమనార్హం. ఇవన్నీ పెద్ద సంఘటనలే. కాగా ఇదే ఘాట్ రోడ్డులో ఒకరు, ఇద్దరు చొప్పున మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. -
ఆస్పత్రుల్లో శానిటేషన్ వర్కర్ల శ్రమ దోపిడీ
అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్కర్లతో కలిసి సీఐటీయూ జిల్లా ప్రతినిధులు గురువారం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దుర్గాప్రసాద్, నూకల బలరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు జీవో ప్రకారం రూ.18,600 జీతం ఇవ్వాలన్నారు. దానిలో పీఎఫ్, ఈఎస్ఐలకు రూ.2600 తీసివేయగా రూ.16 వేలు చొప్పున చెల్లించాలన్నారు. కానీ మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ ఆ వర్కర్లకు రూ.10 వేలు మాత్రమే ఇస్తూ, వారి సొమ్మును, శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై కార్మిక మంత్రి, ఆస్పత్రి సూపరింటెండెంట్లకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రావాల్సిన జీతాల గురించి అడిగినందుకు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఐదుగురి వర్కర్లను తొలగించారన్నారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి పేరుకు 100 పడకల ఆస్పత్రిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ 60 పడకలే ఉన్నాయన్నారు. దీంతో అదనంగా ఉన్నారన్న వంకతో ఆ ఐదుగురి వర్కర్లను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ధర్నాలో నినాదాలు చేశారు. వర్కర్ల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ములను గత కాంట్రాక్టర్ కట్టలేదని, ఆ కాంట్రాక్టర్ నుంచి సొమ్ములను రికవరీ చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్టర్లు సొమ్ములు దోచుకునే విధానానికి స్వస్తి పలికాలన్నా రు. పరిిస్థితి ఇలానే కొనసాగితే సీఐటీయూ తరఫున వర్కర్లకు అండగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్యకు సంబంధించి జరిగే పబ్లిక్ పరీక్షలపై డీఐఈవో కె.చంద్రశేఖర్బాబు గురువారం ఏఎస్ఎన్ కళాశాలలో జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. ఈనెల 21న నైతికత, మానవ విలువలు, 23న పర్యావరణ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వీటికి జిల్లాలోని 123 జూనియర్ కళాశాలల నుంచి 13,131 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ కచ్చితంగా ఈ పరీక్షల్లో అర్హత సాధించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో వారికి ఇంటర్ పరీక్షల ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం జారీ కాదని తెలిపారు. గతంలో ఇంటర్మీడియెట్ చదివి ఈ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు ఎవరైనా ఉంటే, వారు కూడా హాజరు కావచ్చని వివరించారు. ఆ విద్యార్థులు ఏ కళాశాలలో చదివారో అక్కడే పరీక్ష రాయాలన్నారు. ఈ నిబంధనలపై అవగాహన కల్పించాలని జిల్లాలోని జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల కమిటీ సభ్యులు వై.లక్ష్మణరావు, జె.శాంతకుమారి, కె.శ్రీనివాస రావు, వై.సుబ్బారావు, బి.సింహాద్రి ప్రసంగించారు. సమావేశంలో ఏఎస్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎస్ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ కాంప్లెక్స్ పురోగతిపై సమీక్ష అమలాపురం రూరల్: జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్లాటిడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ స్థితి, ఎంఓయూ తుది రూపం, అనుమతుల పొందడం కోసం ప్రతి నెలా జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి తరచూ సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు వేగంగా పారిశ్రామిక స్థలాలు అందేలా సమన్వయం చేయాలన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో రెండు ఎకరాలు, అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో 6.83 ఎకరాల ప్రభుత్వ భూమి, కొత్తపేట నియోజకవర్గంలో దేవరపల్లిలో 5 ఎకరాలు, రాజోలు నియోజకవర్గంలో రెండు ఎకరాలు గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో రైతులతో భూసేకరణకై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఫుల్ హుషార్
సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగ త్వరలో రాబోతోంది. ప్రతిసారీ ఈపాటికే ఎక్కడ చూసినా పండగ సందడి కనిపించేది. కానీ ఈసారి ఆ జోష్ లేదు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పిండి వంటలు చేసుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొండెక్కిన బస్సు టిక్కెట్ ధరలతో సొంతూరుకు రావడానికి దూర ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వ్యాపారాలు కూడా అనుకున్న స్థాయిలో లేవని వస్త్ర, బంగారు ఆభరణాలు, ఆటోమొబైల్ వ్యాపారులు నీరుగారి పోతున్నారు. కానీ ఒక్క మద్యం వ్యాపారులు మాత్రం పండగ కోసం ‘ఫుల్’ హుషారుగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగినట్టుగా మద్యాన్ని భారీగా నిల్వ చేసుకుంటున్నారు. పనిలో పనిగా ధరలు పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మద్యం విక్రయాలపై ఆశలు సంక్రాంతి పండగ అమ్మకాలపై మద్యం వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టుగా వైన్ షాపు ల వద్ద భారీగా నిల్వలు ఉంచారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు అంచనాలకు మించి అమ్మకాలు జరిగాయి. దీంతో సంక్రాంతి పండగ సీజన్లో మరింత అధికంగా జరుగుతాయి వ్యాపారులు లెక్కలు వేసుకుంటున్నారు. రూ.15.29 కోట్ల విక్రయాలు నూతన సంవత్సర వేడుకలకు జిల్లాలో అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబరు 30వ తేదీన జిల్లాలో 11,045 ఐఎంఎల్ మద్యం కేసులు, 4,346 బీర్ల కేసులు విక్రయించారు. వాటి విలువ దాదాపు రూ.8.85 కోట్లు. ఇక 31న 8,107 ఐఎంఎల్ మద్యం కేసులు, 3,388 బీర్ల కేసుల అమ్మకాలతో రూ.6.44 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఈ రెండు రోజులు కలిపి 19,152 ఐఎంఎల్ కేసులు, 7,734 బీర్ల కేసులు అమ్ముడుపోగా రూ.15.29 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన రూ.4.37 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 31వ తేదీన రూ.6.44 కోట్లు జరగడం గమనార్హం. గత ఏడాది కన్నా 67 శాతం మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. ఈ ఏడాది డిసెంబరు 31 కన్నా ముందు రోజు 30న భారీగా అమ్మకాలు జరిగాయి. పండగకే ఎక్కువ వినియోగం నూతన సంవత్సర వేడుకల కన్నా పండగకే మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ ఏడాది సంక్రాంతి పండగ జనవరి 14 బుధవారం భోగితో మొదలవుతోంది. తొమ్మిదో తేదీ రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో చాలా మంది 8వ తేదీన బయ లుదేరి వస్తున్నారు. 18వ తేదీ ఆదివారం తిరిగి వెళ్లనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు జిల్లాలోని తమ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో ఏకంగా పది రోజుల పాటు గడపనున్నారు. ఈ కారణంగా పండగ సీజన్లో కనీసం మూడు రెట్లు అమ్మకాలు జరిగే అవకాశముంది. దీనికి తగినట్టుగానే మద్యం షాపుల యజమానులు మద్యం ఐఎంఎల్ కేసులు, బీర్లు కేసులను నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన అమలాపురం ఐఎంఎల్ డిపోల వద్ద మ ద్యం లోడు లారీలు, వ్యాన్లు బారులు తీరుతున్నాయి. సిండికేట్లు జిల్లాలోని మద్యం షాపులలో 80 శాతం సిండికేట్లుగా మారి అమ్మకాలు చేస్తున్నారు. వీటిలో అధికార టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల అనుచరులు, కొన్ని చో ట్ల నేరుగా కీలక ప్రజాప్రతినిధులు బినామీలను పెట్టి మద్యం వ్యాపారం చేస్తుండడంతో ధరలను అడ్డుకోవ డం ఎకై ్సజ్ అధికారులకు సాధ్యం కావడం లేదు. అమలాపురం మున్సిపాలిటీ, అంబాజీపేట మండలాలు వంటి రెండు, మూడు చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో మద్యం అదనపు ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ధరలు పెంచి అమ్మకాలు చేయడం, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎకై ్సజ్ అధికారులు మద్యం దుకాణాలను తనిఖీ పేరుతో ఒకటి, రెండు రోజులు హడావుడి చేశారు. ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ తర్వాత చేతులు ఎత్తేశారు. పండగలో మద్యం అమ్మకాలపై వ్యాపారుల ఆశలు ఇప్పటికే దుకాణాల్లో భారీగా నిల్వలు న్యూఇయర్కు ముందే పెంచేసిన ధరలు మందుబాబుల జేబులకు చిల్లు పట్టించుకోని అధికార యంత్రాంగం ధరల దందా పండగలో భారీ అమ్మకాల మీదనే కాదు, ధరలు పెంచి లాభాలు కొల్లగొట్టేందుకు సైతం మద్యం వ్యాపారులు సిద్ధమయ్యారు. ప్రతి క్వార్టర్ బాటిల్పై రూ.పది చొప్పున పెంచేశారు. తద్వారా జిల్లాలో మద్యం అమ్మకాల మీద ఈ పండగ సీజన్లోనే రూ.లక్షలు కొల్లగొట్టనున్నారు. మొదట ట్రైలర్గా నూతన సంవత్సర అమ్మకాల కన్నా వారం రోజుల ముందు ముమ్మిడివరం నియోజకవర్గంలో మద్యం రేట్లు పెంచి అమ్మకాలు చేశారు. ఇక్కడ మద్యం ప్రియుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో మిగిలిన నియోజకవర్గంలో సైతం రేట్లు పెంచడం మొదలు పెట్టారు. -
● మర్యాద పూర్వకంగా..
రావులపాలెం/అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కలిశారు. అలాగే ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కూడా జగన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీగా శ్రీనివాసరావుముమ్మిడివరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరానికి చెందిన ప్రముఖ న్యాయవాది కోన వెంకట శ్రీనివాసరావును ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా నియమించారు. ఆయన గతంలో ముమ్మిడివరం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధిగా పలు పదవులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కో ఆర్డినేటర్ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీను, పెనుమత్స చిట్టిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కొబ్బరి రైతులకు ఊరట అంబాజీపేట: నీటి కొబ్బరికాయ ధర పెరగడంతో రైతులకు ఊరట లభించింది. వారం రోజుల నుంచి కొబ్బరికాయల ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. కొబ్బరి దిగుబడులు తగ్గుముఖం పట్టడంతో నీటి కాయల ధర పెరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం నీటి కొబ్బరికాయ (పచ్చి) రూ.15 వేల నుంచి రూ.16 వేలకు, ముక్కుడు కాయలు రూ.16 వేల నుంచి రూ.18 వేలకు పెరిగాయి. రానున్న సంక్రాంతి, శివరాత్రికి మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. -
ఎన్నికల హామీలను అడిగితే కేసులా?
● చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్ ● నేడు కలెక్టరేట్ వద్ద నిరసన రామచంద్రపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన విభాగాల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని గాంధీపేటలో గల పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తున్నాయన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని విద్యార్థి సంఘాలు అడిగితే తట్టుకోలేకపోతున్నారన్నారు. అలా ప్రశ్నించిన విద్యార్థులపై రౌడీషీట్లు ఓపెన్ చేయటం ఎంతవరకు సమంజసమని అడిగారు. జాబ్ కేలండర్ విడుదల చేయా లని విజయనగరం జిల్లాలో నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ప్రభు త్వ తీరుకు నిరనసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల నేతృత్వంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
పిల్లాపాపలతో పరుగులు తీశాం
● బ్లోఅవుట్ బాధితుల ఆవేదన ● ఎమ్మెల్యే దేవకు సమస్యల వినతి ● ‘సాక్షి’ కథనానికి స్పందన మలికిపురం: ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్తో బెంబేలెత్తిపోయామని, వెంటనే పిల్లాపాపలను తీసుకుని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని బాధితులు వాపోయారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే దేవకు తమ ఆవేదనను వెల్లడించారు. కాగా.. పునరావాస కేంద్రాలలో అరకొర సౌకర్యాలు అనే శీర్షికతో జనం పడుతున్న బాధలను బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే దేవ ఇరుసుమండ, లక్కవరం కాలనీకి వెళ్లి బాధితులతో మాట్లాడారు. పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలోని యువత తమను అప్రమత్తం చేసిందని, ఓఎన్జీసీ కనీసం సైరన్ కూడా వేయలేదన్నారు. కట్టుబట్టలతో పరుగులు తీయడంతో పునరావాస కేంద్రాలలో జీవశ్చవాలుగా బతికామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓఎన్జీసీ, డ్రిల్లింగ్ సంస్థలతో మాట్లాడతానని, తాత్కాలికంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3 వేలు, 50 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. భయం భయంగానే.. బ్లో అవుట్ సమీపంలోని ప్రజలు ఇంకా సోమవారం అనుభవించిన నరక యాతన, భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. బ్లో అవుట్ మంటలు తగ్గడంతో బుధవారం ఇంటికి చేరుకున్నా వారి కళ్ల ముందు అప్పటి దృశ్యాలే కదలాడుతున్నాయి. వారిని కలవడానికి వెళ్లి ‘సాక్షి’ బృందంతో ఆ విషయాలే పంచుకున్నారు. చాలామంది ఇళ్లకు తిరిగి రాలేదు. -
ఆరని చిచ్చు
● బ్లోఅవుట్లతో కోనసీమ బెంబేలు ● పచ్చని జిల్లాలో చమురు చిచ్చు ● పాశర్లపూడి ఘటనకు 31 ఏళ్లు ● ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న ప్రజలు నిద్రలేని రాత్రులు మా ఇంటి నుంచి గ్యాస్ పైప్లైన్ వెళ్లింది. భారీ శబ్దం మా ఊరి వరకు వినిపించింది. మా వద్ద పైప్లైన్ పేలిందేమోనని భయపడ్డాం. కానీ దేవర్లంక వద్ద అని తర్వాత తెలిసింది. అది మా ఊరికి దూరమే అయినా 65 రోజులు పాటు నిద్రలేని రాత్రులు గడిపాం. – సోమరపల్లి పద్మనీ కుమార్, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం మండలం. పాశర్లపూడి బావి బ్లో అవుట్ (ఫైల్) సాక్షి, అమలాపురం: కోనసీమ పేరు వినగానే పచ్చని పొలాలు, ఎత్తయిన కొబ్బరి చెట్లు, గలగలపారే గోదావరి గుర్తుకు వస్తాయి. ఇక్కడి వాతావరణం కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. కోనసీమలో నివసిస్తే ఎంత బాగుంటుందో అని సగటు పర్యావరణ అభిమానులు కోరుకుంటూ ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది పైకి కనిపించే కోణం మాత్రమే. చమురు సంస్థల కార్యకలాపాలతో కుంపటిపై కోనసీమ విలవిల్లాడుతోంది. ప్రస్తుతం మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో ఏర్పడిన బ్లోఅవుట్తో జిల్లా ప్రజలు ఉలిక్కి పడ్డారు. గతంలో 1995 జనవరి 8న పాశర్లపూడిలోనూ బ్లోఅవుట్ ఏర్పడింది. దాన్ని ఆర్పేందుకు 65 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్గా గుర్తింపుపొందిన పాశర్లపూడి ఘటనపై ప్రత్యేక కథనం. సాంకేతిక లోపం అల్లవరం మండలం దేవర్లంక (పాసర్లపూడి వద్ద) 19వ సెక్టార్ సైట్లో డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం భారీ బ్లో అవుట్కు దారి తీసింది. ఇది జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తవుతోంది. పాశర్లపూడి బ్లోఅవుట్గా పేరొందిన ఈ విపత్తు దేశం చమురు, సహజ వాయువుల వెలికితీత చరిత్రలో మాయని మచ్చగా మారింది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన చేసుకుంది. అంతకుముందు కోనసీమలో ఒకటి రెండు చోట్ల చిన్న బ్లోఅవుట్లు జరిగినా ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ పాశర్లపూడిలో అణుబాంబు పేలినట్టు భారీ శబ్దంతో గ్యాస్ ఎగదన్ని, మంటలు చెలరేగడంతో సమీప వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. రాకాసి మంటలు పాశర్లపూడి బ్లోఅవుట్ శబ్దం అప్పట్లో సుమారు ఐదు మండలాలకు పూర్తిస్థాయిలో వినిపించింది. వంద మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి మంటలు చూసి ప్రజలు బెంబెలెత్తిపోయారు. సమీపంలోని అల్లవరం, దేవర్లంక గ్రామాలకు చెందిన వందల మంది కట్టుబట్టలతో, ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా అక్కడ నుంచి పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపారు. వందలాది కొబ్బరి చెట్లు క్షణాల్లో మాడిమసైపోయాయి. రాత్రి వేళల్లో బ్లో అవుట్ వెలుగు రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు కూడా కనిపించేదంటే అతిశయోక్తి కాదు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం అంత పెద్ద బ్లో అవుట్ జరిగినా ఓఎన్జీసీలో ఎటువంటి మార్పు రాలేదు. చమురు, సహజ వాయువుల అన్వేషణ, వెలికితీత వంటి సమయాల్లో తరచూ బ్లో అవుట్లు జరుగుతున్నా, గ్యాస్ పైప్లైన్లు లీకు అవుతున్నా చీమ కుట్టినట్టయినా లేకుండా పోయింది. మామిడికుదురు మండలం నగరం గ్యాస్ పైప్లైన్ లీకేజు కారణంగా 22 మంది మృత్యువాత పడ్డారు. అయినా ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు తమకు పట్టనట్టుగా వ్యవహిస్తున్నాయి. ఫలించిన వాటర్ అంబ్రెల్లా విధానం ఓఎన్జీసీ నిపుణులు బ్లోఅవుట్ను ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. విదేశాల నుంచి నిపుణులను తీసుకువచ్చినా వారి వల్ల కూడా కాలేదు. చివరకు ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ విభాగం అధికారి కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలోని క్రైసిస్ మేనేజ్మెంట్ బృందం రంగంలోకి దిగింది. ఆయన సూచన మేరకు వాటర్–అంబ్రెల్లా విధానం అమలు చేయబడింది. అన్ని వైపుల నుంచీ బ్లోఅవుట్ పైకి నీళ్లు, నురగ (ఫోమ్) వెదజల్లటం ద్వారా మంటల్ని అదుపు చేయాలని నిర్ణయించారు. చివరకు అదే ఫలించి 36 గంటల్లోపే మంటలు అదుపులోకి వచ్చాయి. అంటే దాదాపు 65 రోజుల తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. బ్లో అవుట్ కారణంగా సంస్థకు అప్పట్లో రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. -
నేడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష
అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం ఇంజనీరింగ్ కాలేజీ, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ బేస్డ్ డిపార్టమెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఆమె బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జేసీ నిషాంతి అన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో కమిటీ సభ్యులతో సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు జిల్లాస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, కంట్రోల్ రూమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 25,907 మంది మొదటి, రెండో సంవత్సర విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. -
ఓఎన్జీసీ బావిలో మళ్లీ ఎగసిపడ్డ మంటలు
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ మోరి బావి నంబరు 5లో జరిగిన బ్లో అవుట్ ఇంకా కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నానికి మంటల తీవ్రత తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మార్పుల కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. బావిని పూర్తిగా మూసివేయడానికి అవసరమైన వెల్ క్యాపింగ్ ప్రక్రియపై అధికారులు ఇంకా స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. గ్యాస్ ఒత్తిడి స్థిరంగా లేకపోవడం వల్ల చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పటికీ, మంటలు మళ్లీ ఎగసిపడటం ఆందోళన కలిగిస్తోంది. -
ఆరని బ్లో అవుట్ చిచ్చు
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి నంబరు ఐదులో సంభవించిన బ్లో అవుట్ కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడం వల్ల మంటల తీవ్రత మంగళవారం మధ్యాహా్ననికి చాలా వరకూ తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ బావికి పూర్తి స్థాయిలో వెల్ క్యాపింగ్ (మూసేయడం) చేయడంపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.పన్నెండేళ్ల క్రితం కూడా ఇలాగే డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ ఒత్తిడి నిలకడగా లేక ఇబ్బంది పడిన ఇంజినీర్లు ఈ బావిని అప్పట్లో మూసివేశారు. ఇప్పుడు కూడా నిలకడ లేకుండా గ్యాస్ ఉబికి వస్తుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు.రాజమహేంద్రవరం, నరసాపురం, తూర్పుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల (జీసీఎస్) నుంచి విపత్తు నివారణ బృందాలు ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. గ్యాస్, చమురు కలిసి మండుతున్నందున మంటల తీవ్రత, చుట్టూ అలముకున్న వేడిని తగ్గించేందుకు ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని జల్లుతున్నారు.మంటల తీవ్రతకు బావి వద్ద రిగ్ పడిపోవడంతో పాటు, పైపులూ కరిగిపోయాయి. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు, ఇంజినీర్లు దూరం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఈ బావిలో సుమారు 40 వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని భావిస్తున్నారు. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడంలో ఇంజినీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. ఎన్ని మీటర్ల లోతు నుంచి పైప్లైన్ దెబ్బ తిందనే దానిపై అంచనా వేస్తున్నారు. ఈలోపు ప్రత్యేక జాకెట్లతో నిపుణులు మంటల్లోనే బావి వద్దకు వెళ్లే అవకాశం ఉంది. బావి వద్ద కరిగిపోయిన ఐరన్ పైపులు, రిగ్ మెటీరియల్ తొలగించి, వెల్కు సరిపడే క్యాప్ డిజైన్ చేయాల్సి ఉంది. దీనికి అణుగుణంగా ఘటన స్థలానికి వెల్క్యాప్, భారీ క్రేన్లను తరలించారు.ఒకేసారి అదుపు చేయడం వల్ల ఇబ్బందులు ఒకేసారి మంటలు అదుపు చేయడం వల్ల శాస్త్రీయంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో క్రమక్రమంగా నాలుగు రోజుల్లో మంటలను అదుపు చేయనున్నట్టు ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. బోరు బావికి వారం రోజుల్లో క్యాపింగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొంటున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన గ్యాస్ లీకేజీ నియంత్రణ బృందాలు రెండు ముంబై నుంచి డ్రిల్లింగ్ ప్రాంతానికి చేరుకున్నాయి.పునరావాస కేంద్రాల్లోనే రెండు గ్రామాల ప్రజలు మరోవైపు సమీపంలోని రెండు గ్రామాల ప్రజలు చాలా మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వస్తే రాత్రి దొంగలు పడి దోచేశారని ఒకరు, తమ పెంపుడు మేకలను దొంగలు ఎత్తుకు పోయారని మరొకరు చెప్పారు. ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని కట్టుబట్టలతో వస్తే పునరావాస కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. బ్లో అవుట్ జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంది. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.ప్రైవేట్ కంపెనీలతోనే ముప్పుఓఎన్జీసీ పరిధిలోని బావుల డ్రిల్లింగ్ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం వల్లే తరచూ కోనసీమలో బ్లో అవుట్లు చోటుచేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో జరిగిన ప్రమాదంతో ఈ వాదన తెర మీదకు వచి్చంది. ఇక్కడ డ్రిల్లింగ్ పనులను గుజరాత్కు చెందిన డీప్ ఇండస్ట్రీకి ఓఎన్జీసీ అప్పగించింది. ప్రమాదం జరిగే అవకాశముందని పన్నెండేళ్ల క్రితం మూసివేసిన ఈ బావిలో తిరిగి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భయపడినట్టుగానే మంటలు ఎగసిపడ్డాయి. గతంలో కాట్రేనికోన మండలం ఉప్పూడిలోనూ కోల్కతాకు చెందిన పీఎఫ్హెచ్ సంస్థ లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ చేస్తున్న బావి వద్దనే బ్లో అవుట్ చెలరేగింది.48 గంటల పాటు శ్రమిస్తేనే కానీ మంటలను అదుపు చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓఎన్జీసీ సంస్థ బావుల్లో సుమారు 2,600 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేసి, ఆ పరిధిలో ఉన్న చమురు, సహజ వాయువులు వెలికితీస్తోంది. ఆ తరువాత వాటిని మూసివేస్తోంది. కొంత కాలం తరువాత వాటిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. పెద్దగా అనుభవం లేని ఆ సంస్థలు మరింత లోతుగా డ్రిల్లింగ్ చేపడుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల బ్లో అవుట్లతో మంటలు రేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
జీఎస్టీ పెంపుపై పొగాకు రైతుల నిరసన
● దేవరపల్లిలో భారీ ర్యాలీ ● మూడు రోడ్ల జంక్షన్లో మానవహారం పొగాకుపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని దేవరపల్లిలో భారీ ర్యాలీ చేస్తున్న పొగాకు రైతులు మార్కెట్లో దొరుకుతున్న అక్రమ విదేశీ సిగరెట్లను చూపిస్తున్న రైతులు దేవరపల్లి: సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన భారీ జీఎస్టీ పెంపును నిరసిస్తూ మంగళవారం దేవరపల్లిలో పొగాకు రైతులు ధర్నా చేశారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా దేవరపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి, మూడు రోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. టుబాకో బోర్డు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన జరిపి, బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. పెంచిన ఎకై ్సజ్ డ్యూటీ, జీఎస్టీ తగ్గించాలని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని, అక్రమ సిగరెట్లను అరికట్టాలని, పొగాకు పంటను కాపాడాలని నినాదాలు చేశారు. రైతుల జీవనానికి ముప్పు రైతు సంఘం నాయకులు కరుటూరి శ్రీనివాస్, కాట్రు సత్యనారాయణ, గద్దే శేషగిరి, పిన్నమనేని మధుమోహన్, యాగంటి సాయిబాబు, ఈలపోలు చిన్ని, పలువురు రైతులు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పొగాకు రైతుల జీవనానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో సిగరెట్లపై 22 శాతం పన్ను పెంచినప్పుడు పరిశ్రమ కొనుగోళ్లు తగ్గి పొగాకు ధరలు దాదాపు 25 శాతం పడిపోయాయన్నారు. అప్పట్లో కిలోకు రూ.23 వరకూ రైతులు నష్టపోయారని, ప్రస్తుతం ప్రకటించిన పన్ను పెంపు 50 నుంచి 60 శాతం వరకు ఉంటుందని నాయకులు తెలిపారు. ఇటువంటి పెరుగుదల భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. దీని వల్ల అక్రమ సిగరెట్లు మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులోని వస్తాయన్నారు. పెంచిన జీఎస్టీ వల్ల ప్రస్తుతం రూ.17 ఉన్న సిగరెట్ ధర రూ.25 అవుతుందన్నారు. వెయ్యి సిగరెట్లపై రూ.2 వేల నుంచి రూ.4,500 వరకూ ఉన్న పన్ను.. ఇప్పుడు రూ.8 వేలకు పెరుగుతుందన్నారు. అక్రమ సిగరెట్లకు ఊతం భారీ పన్నుల వల్ల అక్రమ సిగరెట్ వ్యాపారం పెరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో దాదాపు 26 శాతం సిగరెట్లు అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.23 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని వివరించారు. కాగా.. మూడు వేలం కేంద్రాల నుంచి వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధం ఫేమ్ వర్క్ కన్వర్షన్ ఆఫ్ టుబాకో క్రాప్ (ఎఫ్సీటీసీ) నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను దెబ్బతీస్తున్నాయి. జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల దేశీయ సిగరెట్ల వినియోగం తగ్గి, నాన్ టాక్స్బుల్ (అక్రమ) సిగరెట్ల వినియోగం పెరుగుతుంది. పొగాకు ఉత్పత్తులు, సాగు చేస్తున్న రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగాకు పంటకు సమాన ఆర్థిక శక్తి గల ప్రత్యామ్నాయ పంటలు, దీర్ఘకాలిక అవసరాలు తీర్చే పంటలను ప్రభుత్వాలు పొగాకు రైతులకు చూపించాలి. లక్షల మంది కార్మికులు, వేల మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఈ జీఎస్టీని సరళం చేసి పొగాకు పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్లాలి. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు


