-
తీర్పు భద్రం.. భవిత గోప్యం
బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్ ముమ్మిడివరం: శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజిలో డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ వద్ద భద్రతా చర్యలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షుశుక్లా పరిశీలించారు. ఇంజినీరింగ్ కశాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో నియోజకవర్గాల వారీగా వాహనాలలో పోలింగ్ సిబ్బంది తీసుకుని వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామగ్రి స్వీకరణ స్ట్రాంగ్ రూమ్లో భద్రతా ఏర్పాట్ల ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. అయా రిటర్నింగ్ అధికారుల పరిశీలన అనంతరం అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, పోలింగ్ సామగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా స్వీకరించి వారికి కేటాయించిన స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్ట్రాంగ్రూమ్లకు సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రివెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జి.కేశవరెడ్డి, జీవీవీ సత్యనారాయణ, ఏ.శ్రీరామచంద్రమూర్తి, డీవీఎస్ ఎల్లారావు, వి.మదన్మెహన్రావు, ఎస్.సుధాకర్, ఏఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. ● ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ● లెక్కలతో పార్టీల కుస్తీ ● మహిళలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటింగ్తో అధికార పార్టీలో ధీమా ● జిల్లాలో అర్ధ రాత్రి వరకు పోలింగ్ ● తెల్లవారు జామున స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు సాక్షి అమలాపురం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లపై ఇప్పుడు అందరి దృష్టి. స్వారత్రిక ఎన్నికల ఓటింగ్ పూర్తవడంతో అభ్యర్థుల జాతకాలను ఈవీఎంలు తేల్చనున్నాయి. వారి రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల అనుకున్న నాటి నుంచి సోమవారం రాత్రి పోలింగ్ ముగిసే వరకు వ్యయప్రయాలకు లోనై... తమ శక్తి యుక్తులన్నింటినీ ధారబోసి తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితం కోసం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు ఈవీఎంలలో తమకు పడిన ఓట్లపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ గడపాల్సిందే. మరోవైపు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరాయి. నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలోకి చేరింది. పోలింగ్ ముగిసినా అభ్యర్థులలో హైరానా తగ్గలేదు. పట్టణాలలో వార్డులు, గ్రామాల వారీగా తమకు పడిన ఓటింగ్పై లెక్కల తీసేపనిలో బీజీగా ఉన్నారు. పురుషులు, మహిళలు, యువత, వృద్ధులు, కూలాలు, మతాల వారీగా తమకు పడిన అనుకూల ఓటింగ్పై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామాలు, మండలాల వారీగా లెక్కలు వేసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు, మెజార్టీలపై అంచనాలకు వస్తున్నారు. మహిళా ఓటింగ్ పెరగడం ప్రతి పక్ష టీడీపీ, జనసేన పార్టీలలో గుబులు రేపుతోంది. వీరితోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మరీ ముఖ్యంగా పింఛన్దారులు పెద్ద ఎత్తున ఓటింగ్కు వచ్చారు. ఉత్సాహంగా ఓటు వేశారు. ఇవన్నీ తమకు ప్రతికూలంగా మారుతాయని వారు భయపడుతున్నారు. గ్రామీణ ఓటరు పోటెత్తడంతో అధికార పార్టీ అభ్యర్థులలో గెలుపుపై ధీమా పెంచింది. స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో ఆలస్యమైంది. అంచనాలకు మించి ఓటర్లు రావడం, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో ఈవీఎంలను చేర్చడం సోమవారం రాత్రి కుదరలేదు. పోలింగ్ పూర్తయిన తరువాత కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరులో ఉన్న శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీకి ఈవీఎంలు చేర్చారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి విధుల నుంచి బయటకు వచ్చేసరికి పోలింగ్ సిబ్బందికి తెల్లవారింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈవీఎంల తరలింపు చోటు చేసుకుంది. ఓటింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తినా ఓటింగ్కు సమయం సరిపోలేదు. మధ్యాహ్న సమయంలో ఎండ కారణంగా ఓటింగ్కు దూరంగా ఉన్న ఓటర్లు సాయంత్రం పోటెత్తారు. దీంతో ఆరు గంటల సమయంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వరుసలో నిలుచున్న వారికి కూపన్లు ఇచ్చి అధికారులు ఓటింగ్కు అనుమతి ఇచ్చారు. ఓటర్లు అధికంగా ఉన్నచోట ఓటింగ్ రాత్రి పద కొండు గంటల వరకు సాగింది. జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వినియోగించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరాయి. పోలింగ్ ముగిసిన తరువాత సెక్టార్ల వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సామగ్రి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నాయి. ఇక్కడ మూడంచల భద్రతను కల్పించారు. పార్లమెంట్ పరిధిలో 83.84 శాతం పోలింగ్ : ఓటువేసిన 12,84,008 మంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,31,410 మంది ఓటర్లు ఉండగా, 12,84,008 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 83.84 శాతంగా నమోదయ్యింది. గత ఎన్నికలతో సమానంగా ఓటింగ్ పడింది. పార్లమెంట్ పరిధిలో పురుషుల ఓట్లు 7,59,104 కాగా, 6,44,189 మంది (84.86 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7,72,285 మంది మహిళా ఓట్లకు గాను 6,39,808 మంది (82.84 శాతం) ఓటు వేశారు. పార్లమెంట్ పరిధిలో పురుషులు కన్నా మహిళా ఓట్లు అధికంగా ఉన్నా ఓటింగ్లో మాత్రం పురుషులు అధికంగా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ పరిధిలో ఇతర ఓట్లు 21 మంది కాగా 11 మంది (52.38 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఓట్లు వేసిన నియోజకవర్గం కొత్తపేటలో 2,14,975 మంది ఓట్లు వేయగా, ఓటింగ్ శాతం మండపేటలో 87.06 శాతం (1,91,959 ఓట్లు) నమోదయ్యింది. సోషల్ మీడియాలో కవ్విస్తే కఠిన చర్యలు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఎస్పీ శ్రీధర్ అమలాపురం టౌన్: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియా ఆధారంగా పోస్టింగ్లతో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా లేని పోని అలజడులు సృష్టించినా, ప్రోత్సహించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్ర పరిచినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆ స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ శ్రీధర్ మంగళవారం మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెలుగా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న రెచ్చగొట్టే ప్రచారాలపై ఎస్పీ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఓటింగ్ జరిగింది ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటు వేసిన ఓటు వేసిన ఓటు వేసిన మొత్తం ఓటింగ్ ఓటింగ్ పురుషులు మహిళలు ఇతరులు ఓటర్లు శాతం రామచంద్రపురం 2,03,207 87,429 86,487 1 1,73,917 85.59 ముమ్మిడివరం 2,45,296 1,03,951 1,01,212 0 2,05,163 83.64 అమలాపురం 2,13,508 89,007 86,837 1 1,75,845 82.36 రాజోలు 1,97,920 77,351 79,048 1 1,56,400 79.02 పి.గన్నవరం 1,98,602 84,467 81,279 3 1,65,749 83.46 కొత్తపేట 2,52,383 1,07,762 1,07,210 3 2,14,975 85.18 మండపేట 2,20,494 94,222 97,735 2 1,91,959 87.06 -
వైభవంగా చండీహోమం
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతి లో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల, అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. మంగళవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, చండీహోమం, కళా హోమాలు, అభిషేకాలు తదితర పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేక పూలతో అలంకరించి నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం సదస్యం, సభా పూజ, పండిత సత్కారం నిర్వహించారు. పండిత సదస్యంకు జిల్లాలో పలు ఆలయా ల్లో పనిచేస్తున్న వేద పండితులు హాజరవడంతో వేద ఘోషతో మురమళ్ల క్షేత్రం మార్మోగింది. ఈ ఉత్సవాలలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సావాల సందర్భంగా ఆలయ ఆవరణలో పచ్చిపూల అలంకరణ, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, గవ్యాంతం, కళాన్యాసములు, పూర్ణాహుతి, వసంతోత్సవం, వృద్ధ గౌతమీ తీరంలో త్రిశూల స్నానం, స్వామి వారిని అమ్మవారిని రథంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహణ, రాత్రి పుష్పోత్సవం, పవళింపు సేవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఘనంగా వీరేశ్వరుని బ్రహ్మోత్సవాలు -
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
● తెల్లారిన కూలీల బతుకులు ● ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ ● రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ● ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన ● మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన ● న్యాయం చేయాలంటూ రహదారిపై ఆందోళన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురేష్కు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కార్మికుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్ష్మి, కుమారులు నాగరాజు, సురేష్, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్టీవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : జెడ్పీ చైర్మన్ విప్పర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉండి, ఆదుకుంటామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. మృతుల కుటుంబాలను మంగళవారం రాత్రి ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరగైన వైద్య సేవలందించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సూచించారు. -
రత్నగిరికి కల్యాణశోభ
ఫ 18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఫ 24 వరకూ నిర్వహణ ఫ 19వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం అన్నవరం: సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారికి ఎడమ భాగాన లక్ష్మీదేవి అంశగా దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున శంకరుడు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే దివ్యధామం ఈ హరిహర క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విఖ్యాతం. కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై గత నెల 28వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించారు. నిత్య కల్యాణాలు రద్దు కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు. సీతారాములే పెళ్లి పెద్దలు భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం. ఇదీ కల్యాణోత్సవాల క్రమం ఫ మే 18: వైశాఖ శుద్ధ దశమి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులుగా అలంకరిస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఫ మే 19: వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి 9 నుంచి 11.30 గంటల వరకూ రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఫ మే 20: వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం నిర్వహిస్తారు. ఫ మే 21: వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం నిర్వహిస్తారు. ఫ మే 22: వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొండ దిగువన దేవస్థానం గార్డెన్స్లో సత్యదేవుని వనవిహారోత్సవం. ఫ మే 23: వైశాఖ పౌర్ణమి గురువారం ఉదయం 8.30 గంటలకు పంపా నదిలో స్వామివారి శ్రీచక్రస్నాన మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన కార్యక్రమాలు. ఫ మే 24: వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం రాత్రి 7 గంటలకు నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా రథోత్సవం సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వామివారికి రూ.1.04 కోట్ల వ్యయంతో భారీ టేకు రథంపై నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథాన్ని ఇప్పటికే గత నెల 26న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆ రథానికి రంగులు వేసే కార్యక్రమంతో పాటు, ఆరు చక్రాలకు పట్టీలు, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు, ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసి, ఆ రోజు ఉదయం 9 గంటలకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ వేయనున్నారు. దీనికోసం రథం ఉన్న పంపా సత్రం గేట్లు తొలగించి ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. పంపా సత్రం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా సత్యదేవుని తొలి పావంచా వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ పంపా సత్రానికి తీసుకుని వస్తారు. రథాలను లాగడంలో అనుభవం కలిగిన ధవళేశ్వరానికి చెందిన నిపుణులను ఈ రథోత్సవానికి తీసుకుని వస్తున్నామని అధికారులు తెలిపారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
కిర్లంపూడి: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. మండల పరిధి వేలంకలోని పోలింగ్ బూత్లో సోమవారం వైఎస్సార్ సీపీ కార్యకర్త అడబాల శ్రీనుపై దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం మండలం, పవర గ్రామంలో ఉన్న ట్రినిటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట నరసింహం ఆసుపత్రికి పరామర్శించారు. జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల సచివాలయాల కన్వీనర్ జోకా శ్రీను, దోమాల గంగాధర్ పలువురు ఉన్నారు. -
కిటకిటలాడిన రైల్వే స్టేషన్
సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన ప్రయాణికులు ఆయా ప్రాంతాలకు మంగళవారం తిరుగు ప్రయాణం అయ్యారు. దాంతో మంగళవారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి అనేక మంది కాకినాడ జిల్లాలో వివిధ గ్రామాలకు తరలి వచ్చారు. ఓట్లు వేసి అందరూ ఒకేసారి మంగళవారం ఆయా ప్రాంతాలు చేరుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే రిజర్వేషన్ టిక్కెట్లు లభించక పోవడంతో అనేక మంది సాధారణ టిక్కెట్లు తీసుకొని రిజర్వేషన్ బోగీలలోకి ఎక్కారు. దాంతో రిజర్వేషన్ చేయించుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీటీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నా తమ సీట్లలోకి ఇతరులు వచ్చారని రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు కనిపించలేదని రిజర్వేషన్ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ బోగీలలో కిక్కిరిసి ప్రయాణం చేశారు. తిరుగు ప్రయాణాలతో రద్దీ రిజర్వేషన్ బోగీలోనూ సాధారణ ప్రయాణికులు -
దాడి కేసు నమోదు
రాయవరం: మండలంలోని కూర్మాపురంలో సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడి కేసు నమోదు చేసినట్లు రాయవరం ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వీరబోయిన వీరవెంకటదుర్గాప్రసాద్ వలంటీర్గా పనిచేసి ఇటీవల రాజీనామా చేశాడు. సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సమయంలో వలంటీర్ బయట వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీకి చెందిన చెక్కు మహేష్ మరో 13 మంది దుర్గాప్రసాద్ వద్దకు వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడకు ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని తాళ్లరేవు బైపాస్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాళ్లరేవు పరదేశమ్మ వీధికి చెందిన నారాయణరావు బైక్పై వెళుతుండగా కారు బైక్ను ఢీకొని పక్కనే ఉన్న పంట చేలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పదేళ్ల కుర్రాడికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు హుటాహుటిన వారిని తాళ్లరేవు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు కాలేదని, వివరాలు తెలియరాలేదని కోరంగి పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ దాడులు
ఆత్రేయపురం: ఎన్నికల పోలింగ్ ముగిసినా ఇంకా తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి తెగబడడంతో ఆత్రేయపురంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఆత్రేయపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వెంకట కృష్ణంరాజు అలియాస్ గోపి, అతని తమ్ముడు భాస్కర విజయ నరసింహరాజు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీ నేత ముదునూరి బద్రిరాజు కొంతమందితో కలిసి వీరితో ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంకట కృష్ణంరాజు, అతని తమ్ముడు విజయ్ మంగళవారం ఉదయం గ్రామంలో ఉన్న రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్ వద్ద వీరితో గొడవ పడిన ముదునూరి బద్రిరాజు మరికొంత మందిని తీసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు తలపడ్డాయి. దీంతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇరువర్గాలను చెదరగొట్టే సమయంలో ఎస్ఐ శ్రీనివాస్కు కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తులపై, అల్లర్లకు పాల్పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆత్రేయపురంలో వివాదం సద్దుమణిగింది: డీఎస్పీ కేవీ రమణ ఎన్నికల నేపథ్యంలో ఆత్రేయపురంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య ఏర్పడిన వివాదం సద్దుమణిగిందని డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. ఆత్రేయపురంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులు వాట్సాప్లో ఒకరిపై ఒకరు చాలెంజ్లు చేసుకోవడంతో వివాదం తలెత్తిందన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. బెదిరింపులకు భయపడం:ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని , అలాంటి బెదిరింపులకు భయపడేది లేదని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం ఆత్రేయపురంలో వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడి ఘటన తెలుసుకుని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు హద్దులు దాటితే తాము సహించబోమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటామని జూన్ 4 వరకు ఓపికతో ఉండాలని కోరారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి -
హత్య కేసు నిందితులపై హత్యాయత్నం
అమలాపురం టౌన్: తన భార్యను హత్య చేశారన్న అక్కసుతో పాత కక్షను దృష్టిలో పెట్టుకుని భర్త ఓ కుటుంబంపై మంగళవారం ఉదయం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో మెయిన్ రోడ్డుపై జరిగిన ఈ హత్యాయత్న ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. అమలాపురం రూరల్ మండలం సమనన గ్రామానికి చెందిన కోండ్రు కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో తన భార్యను హత్య చేసిన ఆ కుటుంబంలోని ఇంటి యజమాని, ఇద్దరు కొడుకులు, అల్లుడు, అల్లుడు కుమార్తె అయిదేళ్ల చిన్నారిపై కోండ్రు కోటేశ్వరరావు ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. పట్టణ సీఐ కె.కృష్టోఫర్ కథనం ప్రకారం...సమనస గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోండ్రు కోటేశ్వరరావు, మంగం బాలయోగి కుటుంబాల మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయి. దీంతో కోటేశ్వరరావు భార్యను అమలాపురం ఎన్టీఆర్ మార్గ్లో 2012 సంవత్సరంలో మంగం బాలయోగి కుటంబీకులు హత్య చేశారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ హత్య కేసుకు సంబంధించి మంగం బాలయోగి, అతని ఇద్దరి కుమారులు, అల్లుడు మంగళవారం అమలాపురంలోని కోర్టు వాయిదాకు వచ్చారు. వారితో పాటు బాలయోగి మనమరాలు (కూతురు కుమార్తె) చొప్పెల గుణశ్రీ (5) కూడా ఉంది. తన భార్య హత్య కేసులో కోర్టు వాయిదాకు బాలయోగి కుటుంబీకులు వస్తున్నారన్న సమాచారంపై పాత కక్షతో ప్రతీకార చర్య తీసుకోవాలన్న కోపంతో కోటేశ్వరరావు కత్తితో తన ఆటోలో అమలాపురం వచ్చి మాటు వేశాడు. తొలుత బాలయోగి కుటుంబీకులను ఆటోతో ఢీకొట్టి వారిపై హత్యాయత్నానికి తెగబడ్డాడు. అయితే బాలయోగి కుటుంబీకులు దాదాపు తప్పించుకున్నారు. అయితే వారి కూడా ఉన్న మనమరాలు గుణశ్రీకి కత్తి వేటు పడి తలకు గాయమైంది. ఆ బాలికను తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలయోగి కుమారుడు విజయ్ కూడా దాడిలో స్వల్పంగా గాయపడ్డాడు. నడి రోడ్డుపై కత్తితో దాడికి పాల్పడడం, ఓ చిన్నారిని గాయపరచడంతో స్థానికులు కోటేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. స్థానికుల చేతిలో గాయపడ్డ కోటేశ్వరరావు కూడా స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. కోటేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రిష్టోఫర్ తెలిపారు. బాలయోగి కుటుంబీకులపైనా కేసు నమోదు కోండ్రు కోటేశ్వరరావుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగానే అతడు గాయపడ్డ ఘటనపై కూడా బాలయోగి కుటుంబీకులపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ కె.కృష్టోఫర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు కూడా సందర్శించి పరిశీలించారు. కోటేశ్వరరావును బాలయోగి కుటుంబీకులు కూడా ప్రతిఘటించారన్న సమాచారంపై కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా వారిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. ఇరు పక్షాల నుంచి అందిన ఫిర్యాదులపై విచారిస్తున్నామని తెలిపారు. సరిహద్దు వివాదం, పాత కక్షతో ప్రతీకార చర్యకు యత్నం అయిదేళ్ల బాలిక తలకు గాయం... మరో వ్యక్తికి స్వల్ప గాయం దాడి చేసిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి -
పాడి పశువుల సంరక్షణ కోసం
రాజానగరం: గ్రామీణ ప్రాంతాలలో రైతులు పశుసంపదను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. పాడి పశువులు అనారోగ్యానికి గురైతే అన్నదాతలు ఎంతగానో తల్లడిల్లిపోతారనే విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా హైడ్రాలిక్ సిస్టమ్తో కూడిన వైఎస్సార్ సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 108 తరహాలోనే వీటికి కూడా 1962 టోల్ఫ్రీ నంబరును కేటాయించి, రైతన్నల పశుసంపద పరిరక్షణకు చేదోడు వాదోడుగా నిలిచారు. 2022 మే 19న ప్రారంభమైన ఈ ఉచిత సర్వీసు ద్వారా నియోజకవర్గంలో ఇంతవరకు 4,085 పాడి పశువులకు వైద్య సేవలందించారు. ● మీనీ గోకులం (ఆరు పశువులకు సరిపడేలా షెడ్డు నిర్మించుకునేందుకు) పథకం ద్వారా యూనిట్కి రూ. ఒక లక్ష 40 వేలు చొప్పున రూ. ఒక కోటి 80 వేల వ్యయంతో 72 షెడ్డులను నిర్మించారు. ● పశు నష్టం (ఆవు, గేదె, మేక, గొర్రె) వాటిల్లిన సమయంలో రైతులను ఆదుకునేలా అమలు చేస్తున్న పశు నష్ట పరిహార పథకం (దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరం లేదు) ద్వారా 405 మంది రైతులకు రూ. కోటి 21 లక్షల 50 వేలు పరిహారంగా అందజేశారు. ● కేవలం రూ.340 ప్రీమియంతో మూడేళ్ల కాలవ్యవధితో కూడిన వైఎస్సార్ పశు బీమా పథకం (ప్రమాదాలలో మరణించిన పశువులకు) ద్వారా 40 మంది రైతులకు రూ.12 లక్షలు బీమా చెల్లించారు. ● ఒక లక్ష 96 వేల పశువులకు, పెంపుడు జంతువులకు గడచిన నాలుగేళ్లలో గాలి కుంటు, హెచ్.ఎస్. దొమ్మ, బ్రూసిల్లా, లింకిస్కిన్ డిసీజెస్, పీపీఆర్ పోండు, షీప్ పాక్స్ వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలతోపాటు నట్టల నివారణకు రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. ● ఉచిత కృత్రిమ గర్భధారణ పథకం అమలు ద్వారా రూ. ఒక లక్ష 68 వేలు వెచ్చించారు. ● మేలు రకం పశుగ్రాస విత్తనాల సరఫరాకు రూ. 3.45 లక్షలు ఖర్చు చేశారు. -
పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
రూ.1.50 లక్షల ఆస్తినష్టం అంబాజీపేట: గంగలకుర్రులో మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు పడి కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి రూ.1.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సానబోయిన రామకృష్ణకు చెందిన శ్రీలక్ష్మీ దుర్గా క్వాయర్ ఇండస్ట్రీకి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. విద్యుత్ వైర్లపై కొబ్బరి ఆకు పడటంతో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు చెలరేగి కొబ్బరి పీచు దగ్ధమైంది. ఎగుమతికి సిద్ధంగా ఉన్న పీచు అగ్నికి ఆహుతి కావడంతో రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు రామకృష్ణ తెలిపారు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి అమలాపురం అగ్నిమాపక దళాధికారి కె.మురళీ కొండబాబు తన సిబ్బందితో చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
సత్యదేవునికి గొడుగుల సమర్పణ
అన్నవరం: గుడివాడకు చెందిన అమ్మ కనస్ట్రక్షన్స్ అధినేత మాటూరి రంగనాఽథ్, శ్రీవల్లి దంపతులు సత్యదేవుని ఊరేగింపులో వాడే గొడుగులను మంగళవారం స్వామివారికి సమర్పించారు. వీటిని ప్రతి రోజు స్వామివారి ఊరేగింపులో ఉపయోగించాలని దాత దంపతులు కోరినట్లు ఏఈఓ కృష్ణారావు తెలిపారు. సెల్ఫోన్ షాపులో అగ్నిప్రమాదం కాజులూరు: మండల కేంద్రమైన కాజులూరులో మంగళవారం ఒక సెల్ఫోన్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి సర్వం కాలిబూడిదయింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఎదుట ఉన్న బలభద్రుని కామేష్ సెల్ఫోన్ షాపులో తెల్లవారుజామున మంటలు సంభవించాయి. లోపల నుంచి పొగలు వస్తుండటంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి షాపు యజమానికి సమాచారమందించారు. ఆయన హుటాహుటిన వచ్చి షాపు షట్టరు తెరవగా లోపల మంటలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించగా సిబ్బంది వచ్చి మంటల ఆర్పివేశారు. అయితే అప్పటికే షాపులోని సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, జిరాక్స్ మెషీన్లతో పాటు ఖరీదైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఆస్తి నష్టం సుమారు రూ.15 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బోటు తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడలో ఉన్న ఉమ్మిడి విజయ్కుమార్కు చెందిన బోట్ల తయారీ కేంద్రంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైబర్ షీట్లు, బోటు తయారీ పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.7లక్షల నష్టం వాటిల్లినట్టు విజయ్కుమార్ తెలిపారు. -
సీబీఎస్ఈ ఫలితాలలో అగ్రగామిగా నిలిచిన శ్రీ షిర్డీసాయి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీబీఎస్ఈ 10, 12 వ తరగతి ఫలితాలలో శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీ విద్య మంగళవారం వెల్లడించారు. 10వ తరగతిలో బీవీఆర్ సాహితి 500 మార్కులకుగాను 484 మార్కులతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా, జె.సుహాస్సాయి 479 మార్కులతో ద్వితీయ స్థానం, ఎ.రేణుసాయిశ్రీ 478 మార్కులతో తృతీయ స్థానం సాధించారన్నారు. ఈ పరీక్షలకు 82 మంది హాజరుకాగా వారిలో 22 మంది 90 శాతం పైగా మార్కులు, 63 మంది విద్యార్థులు 80 శాతం పైగా మార్కులతో డిస్టింక్షన్లో ఉతీర్ణులయ్యారన్నారు. తమ కళాశాలలో 12వ తరగతి విద్యార్థిని కె.శ్రీలాస్య 500 మార్కులకుగాను 489 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా, 485 మార్కులతో జి.శ్రీవిద్య ద్వితీయ స్థానం, 481 మార్కులతో బి.లక్ష్మణనాయుడు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. 12వ తరగతిలో మొత్తం 300 మంది విద్యార్థులు హాజరుకాగా 45 మంది 90 శాతం పైగా మార్కులు సాధించగా, 216 మంది 80 శాతం పైగా మార్కులతో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారన్నారు. బోర్డు ఫలితాలలోనే కాక సీబీఎస్ఈ ఫలితాలలోను తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇంతటి ప్రతిభ చూపిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయ అధ్యాపక బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి.శ్రీవిద్య, ప్రిన్సిపాల్ జేఎస్వీ.ప్రసాదరెడ్డిలు లక్ష్యా, దీక్షా, డ్యాఫ్నీ డీన్లను అభినందించారు. 18న జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 18వ తేదీన ప్రముఖ ఎల్అండ్టీ సంస్థ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.వేణుగోపాలవర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఐటీఐ ఉత్తీర్ణులైన ఫిట్టర్, ఎలక్రీషియన్, డ్రాఫ్ట్, సివిల్, వెల్డర్, ప్లంబర్, వైర్మెన్, కార్పెంటరీ ట్రేడ్ విద్యార్థులు అర్హులని, దాదాపుగా 1,600 ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థులకు మూడు నెలల శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం ఏపీ, తెలంగాణ, చైన్నె, బెంగళూరు రాష్ట్రాల్లో నియమిస్తారని, ఆసక్తి గలవారు ఉదయం 9గంటల్లోపు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. -
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉడుమూడి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారి పక్కన ట్రాక్టర్ ఫై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
అమలాపురం రూరల్ : సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 87 మోడల్ పోలింగ్ కేంద్రంలో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈదరపల్లిలో కలెక్టర్ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆయన పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఓటు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఏ.వేమవరప్పాడు పోలింగ్ బూత్ను కలెక్టర్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల పనితీరుపై ఆరా తీశారు. క్యూ నిలుచుని ఓటేసిన ఎస్పీ శ్రీధర్ అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ అమలాపురంలోని రాతిబడి పోలింగ్ కేంద్రంలో 59వ బూత్లో తన ఓటు హక్కును సోమవారం ఉదయం వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి అందరితోపాటు క్యూలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. కాలు విరిగినా బాధ్యత మరువక.. అంబాజీపేట: శ్రీకాకుళంలో మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న నెల్లి షర్మిల ఉత్సాహంగా తన మొదటి ఓటును వేసేందుకు తన స్వగ్రామమైన కె.పెదపూడి వచ్చింది. ఓటు వేసేందుకు వస్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కుడికాలు విరిగిపోయింది. వైద్య పరీక్షలు చేయించుకుని సాయంత్రం షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకుని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఓటు వేసి వచ్చి మృత్యుఒడికి మామిడికుదురు: గోగన్నమఠం గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణ (52) ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి పిట్స్తో కుప్ప కూలిపోయారు. ఆయనను వెంటనే రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు సత్యనారాయణ అదే గ్రామంలోని 203వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం ఈ ఘటన జరిగింది. చేపల వేట ద్వారా జీవనం సాగించే సత్యనారాయణకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలింగ్ కేంద్రం వద్ద పిచ్చికుక్క దాడి పది మందికి గాయాలు రాజానగరం: మండలంలోని సూర్యారావుపేట పోలింగ్ బూత్ వద్ద ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిలబడిన ఓటర్లపై దాడి చేసి, గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో పది మంది గాయపడగా, అందులో ఓ బాలిక కూడా ఉంది. స్థానికులు ఆ కుక్కను వెంటాడి హతమార్చారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రాథమిక ఆర్యోగ కేంద్రానికి తరలించి, వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. -
టీడీపీ అభ్యర్థి ఆనందరావును నిలదీసిన గ్రామస్తులు
ఉప్పలగుప్తం: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో బూత్ల పర్యవేక్షణకు మండలంలోని ఎన్.కొత్తపల్లి గ్రామానికి వచ్చిన టీడీపీ అఽభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావును గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలో పలు పోలింగ్ బూత్లు సందర్శించుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా పసుపు కండువా మెడలో వేసుకుని ఆనందరావు ఎన్.కొత్తపల్లి బూత్లోకి ప్రవేశించారు. అక్కడున్న మహిళలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలంటూ విజ్ఙప్తి చేశారు. వెంటనే స్పందించిన మహిళలు ఇది ప్రచార సమయం కాదని పోలింగ్ కేంద్రాల్లో పసుపు కండువా వేసుకుని వచ్చి ఓటు వేయమని అడగటం ఓటర్లను ప్రలోభ పెట్టినట్టేనని ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అసహనానికి గురైన ఆనందరావు వెంటనే అక్కడ నుంచి వెనుతిరిగి తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. బెండమూర్లంకలో కోడ్ ఉల్లంఘనఅల్లవరం: బెండమూర్లంకలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు. సోమవారం బెండమూర్లంకలోని పోలింగ్ కేంద్రానికి పసుపు కండువాతో ఆనందరావు రావడంపై పలువురు ముక్కున వేలేసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీకి చెందిన కండువాలను వేసుకోకూడదన్న ఎన్నికల నియమావళిని అతిక్రమించి కేంద్రంలోకి వెళ్లారు. కోడ్ ఉల్లంఘించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు తప్పుపట్టారు. -
గుళికలు కలిపిన అన్నం తిన్న ఆవు మృతి
మరో ఆవుకు అస్వస్థత అమలాపురం టౌన్: ఎవరో గుళికలు కలిపిన అన్నం పాడేయంతో ఆ అన్నాన్ని తిన్న ఆవు మృతి చెందింది. మరో ఆవు అస్వస్థతకు గురైంది. పట్టణంలోని కల్వకొలను వీధిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో సంచరించే ఈ రెండు ఆవులు గుళికల కలిపిన అన్నం తిని ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలకు చెందిన గో సేవకులు స్పందించి తక్షణమే దానికి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ చీకట్ల వెంకట నారాయణ స్వయంగా వచ్చి వైద్య సేవలు అందించారు. ఓ ఆవు మృతి చెంది, మరో ఆవు అస్వస్థతకు గురికావడంతో గో సేవకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల సేవకులు కాశి రతన్రాజు, గొవ్వాల అచ్యుతరామయ్య, చాగంటి ప్రసాద్, పంజా స్వామి, పోతురాజు నరసింహరావు తదితరులు ఆవులకు వైద్య సేవలించిన వారిలో ఉన్నారు. -
ఓటెత్తిన చైతన్యం
పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు ● యువతతోపాటు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున రాక ● మండుటెండల్లో సైతం బారులు తీరిన ఓటర్లు ● చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంసాక్షి అమలాపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఓటింగ్ జోరుగా సాగింది. ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన ఓటర్ల రాక సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారితోపాటు కొత్తగా ఓటు వచ్చిన యువతతోపాటు, వృద్ధులు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్తోపాటు ఇతర పట్టణాల నుంచి వచ్చిన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. విదేశాలలో ఉండి వివిధ పనుల మీద వచ్చిన వారు సైతం ఓటు వేసి వెళ్లారు. మండుటెండను సైతం జనం లెక్క చేయలేదు. మధ్యాహ్న సమయంలో కూడా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున కనిపించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు బారులు తీరారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతోపాటు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా ఓటర్లు వెనుతిరగలేదు. ఓటు వేసే వెళ్లాలనే పట్టుదలను ప్రదర్శించారు. ఈసారి ఓటింగ్ పెంచేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. పోస్టల్ ఓటు, హోమ్ ఓటింగ్తోపాటు ఓటు విలువను చాటిచెబుతూ జిల్లా యంత్రాంగం చేసిన ప్రచారం ఫలితాన్నిచ్చింది. గోదావరి మధ్యన ఉన్న లంక గ్రామాలు, సముద్రతీరంలోని గోదావరి నదీపాయల మధ్య ఉన్న మత్స్యకార గ్రామాలు, ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం పరిధిలోకి వచ్చే హోప్ ఐలెండ్లో పోలింగ్ చురుగ్గా సాగింది. ఆరు గంటల సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారికి అధికారులు ప్రత్యేక టోకెన్లు అందజేసి పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసిన ప్రముఖులు జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాపాక వర ప్రసాదరావు మలికిపురం మండలం చింతలమోరిలో కుటుంబ సభ్యులతోను, టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ అమలాపురంలో ఓటు వేశారు. అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అమలాపురం మండలం భట్నవిల్లిలోను, టీడీపీ అభ్యర్థి ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలోను, కొత్తపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురం, టీడీపీ అభ్యర్థి బండారు సత్యాందనరావు కొత్తపేట మండలం వాడపాలెంలోను, మండపేట వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు, టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట పట్టణం, రామచంద్రపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం మండలం హసన్బాద్, టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణం చప్పిడివారి సావరం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముమ్మిడివరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకటసతీష్కుమార్ మమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని చిప్పలపాలెం, టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఓటు వేశారు. పి.గన్నవరం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం మండలం ఉడిమూడిలంకలో, రాజోలులో జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ మలికిపురం మండలం దిండిలో ఓటు వేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈదరపల్లిలో, ఎస్పీ ఎస్.శ్రీధర్ అమలాపురం పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతం అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల అందరికీ టోకెన్లు అందించి ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాట్లు చేసి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ నిరంతరం విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి సుమారు 1,600 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుపుతునట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని గత 2019 సార్వత్రిక ఎన్నికలలో 86శాతం ఓట్లు పోలు అవ్వగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అంతకు మించి పెరిగే అవకాశం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సౌకర్యార్థం ఎండ వేడిమిని నుంచి ఉపశమనం పొందే విధంగా షామియానాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించామన్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో 15,31,410 మంది ఓటర్లు ఉన్నారు. రాత్రి పదిన్నర గంటల సమయానికి 12,35,125 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ పరిధిలో 80.165 శాతం పోలింగ్ జరిగింది. పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా కొత్తపేట నియోజకవర్గంలో 2,09,595 ఓట్లు పడగా, అత్యల్పంగా రాజోలు నియోజకవర్గంలో 1,54,888 మంది ఓటు వేశారు. ఓటింగ్ శాతం ఇలా.. నియోజకవర్గం ఉదయం ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పదిన్నర 9 గంటలు 11.15 గంటలు 1 గంటకు 3 గంటలకు ఐదు గంటలకు గంటలకు రామచంద్రపురం 12.79 30.61 49.19 64.56 78.27 85.48 ముమ్మిడివరం 8.01 25.99 41.99 56.09 69.56 82.60 అమలాపురం 11.27 28.24 46.77 61.44 72.23 82.38 రాజోలు 9.21 25.28 41.02 54.49 67.2 78.26 పి.గన్నవరం 7.92 23.51 39.45 53.95 67.68 81.81 కొత్తపేట 8.10 24.37 40.43 54.00 68.25 83.05 మండపేట 9.27 27.02 43.50 58.95 72.32 84.34 ఆయా సమయాల్లో ఓటింగ్ నమోదు.. నియోజకవర్గం మొత్తం ఉదయం 9 మధ్యాహ్నం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పదిన్నర ఓటర్లు గంటలకు 11.15 గంటలకు 1 గంటకు 3 గంటలకు ఐదు గంటలకు గంటలకురామచంద్రపురం 2,03,207 25,993 62,209 99,952 1,31,181 1,59,043 1,73,707 ముమ్మిడివరం 2,45,296 19,650 63,753 1,03,010 1,37,584 1,70,635 2,02,617 అమలాపురం 2,13,508 24,060 60,303 99,856 1,31,186 1,54,223 1,75,890 రాజోలు 1,97,920 18,233 50,030 81,191 1,07,841 1,33,147 1,54,888 పి.గన్నవరం 1,98,602 15,722 46,684 78,341 1,07,150 1,34,404 1,62,474 కొత్తపేట 2,52,383 20,451 61,517 1,02,032 1,36,275 1,72,249 2,09,595 మండపేట 2,20,494 20,488 59,585 95,907 1,29,982 1,59,466 1,85,954 ఎన్నికలను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్సీలు సార్వత్రిక ఎన్నికలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్సీ ఎస్.శ్రీధర్ పర్యవేక్షించారు. అమలాపురం మండలం వేమవరంలో పోలింగ్ బూత్లను పరిశీలించడంతోపాటు ఎన్నికల జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పరిశీలించారు. ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కలెక్టర్, ఎస్సీలు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఓటు చైతన్యం వెల్లువెత్తింది. తమ పాలకులను... ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా తమ వంతు కోసం ఎదురుతెన్నులు చూశారు. ఉదయం నుంచే ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. వృద్ధులు.. యువకులు.. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. తమ అంచనాల మేరకు ఓటింగ్ జరగడంతో జిల్లా యంత్రాంగం సంతృప్తి వ్యక్తం చేసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
ఓటేసేందుకు విదేశాల నుంచి వచ్చిన సోదరులు
అమలాపురం టౌన్: ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలన్న సంకల్పంతో ఆ సోదరులిద్దరూ విదేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి వచ్చారు. వివరాల్లోకి వెళితే అమలాపురం రూరల్ మండలం బండారులంక శివారు బ్యాంక్ కాలనీకి చెందిన సోదరులు కుక్కుల శ్రీనుబాబు, వీర వెంకట సత్యనారాయణ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. శ్రీనుబాబు మస్కట్ దేశంలోని ఓ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంజినీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే, అతని సోదరుడు వీర వెంకట సత్యనారాయణ కువైట్ దేశంలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోదరులిద్దరూ శుక్ర, శనివారాల్లో సొంతూరికి చేరుకున్నారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఓట్లు వేసి తిరిగి తాము ఉద్యోగాలు చేస్తున్న దేశాలకు వెళ్లిపోతామని సోదరులు శ్రీనుబాబు, వీర వెంకట సత్యనారాయణ చెప్పారు. ఓట్లు వేయాలన్న సంకల్పం, బాధ్యతతోనే విదేశాల నుంచి వ్యయ భారమైనా వచ్చామన్నారు. దీంతో ఓటు హక్కుపై వారికున్న చైతన్యాన్ని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మద్యం అక్రమ రవాణాపై విస్తృత దాడులు ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను తనిఖీ చేసిన పోలీస్ అబ్జర్వర్ అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికలు జరిగే ముందు రోజు జిల్లాలో నిఘా బృందాలు అక్రమ మద్యం, నగదు రవాణాపై ఆదివారం విస్తృత దాడులు, తనిఖీలు చేశాయి. జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన దాడులు, తనిఖీల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదివారం రాత్రి తెలిపింది. ● జిల్లాలో అక్రమ రవాణాకు సంబంధించి నిఘా బృందాలు 12 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశాయి. వారి నుంచి 20 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 143 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 34.98 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 140 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నాయి. ● జిల్లా పోలీసులు, నిఘా బృందాల ప్రతినిధులు చెక్ పోస్ట్ల్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.13.40 లక్షల నగదును సీజ్ చేశారు. ● అమలాపురం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.33, 210 నగదును సీజ్ చేశారు. ● అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు సంబంఽధించి ఆయా నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా పోలీస్ అబ్జర్వర్, ఐపీఎస్ అధికారి ఎంవీ చంద్రకాంత్ తనిఖీ చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ఏ విధంగా జరుగుతోంది. సిబ్బంది భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. -
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలి ●
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● కొత్తపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన ● అధికారులు, సిబ్బందికి సూచనలు కొత్తపేట: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటర్లకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరగనున్న పోలింగ్కు సంబంధించి స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శుక్లా ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ సిబ్బంది హాజరు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఆర్ఓ) జీవీవీ సత్యనారాయణ, ఏఈఆర్ఓలతో డిస్ట్రిబ్యూషన్, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని దృష్ట్యా త్వరితగతిన పోలింగ్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పోలింగ్లో జిల్లా ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకునేందుకు ఆన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులతో సెక్టార్ ఆఫీసర్ మార్గ దర్శకత్వంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఆయా పీఎస్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమగ్రంగా చేపడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు. కొద్దిపాటి వర్షం పడినా సురక్షితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రిసెప్షన్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లా ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం జిల్లా ఎస్పీ శ్రీధర్ హెచ్చరిక అమలాపురం టౌన్: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు. ఎన్నికల సజావుగా సాగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లా అంతటా ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న దృష్ట్యా అయిదుగురి కంటే ఎక్కువ మంది ఓ చోట గుమికూడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, మాజీ ఆర్మీ ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను మరోసారి గుర్తు చేశారు. ఓటర్ల సెల్ఫోన్లను పోలింగ్ బూత్ల్లోకి అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చినవారు తప్ప ఇతరులెవరూ ఉండకూడదు. వాహనాలకు కూడా అనుమతి లేదన్నారు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించుకునేందుకు అనుమతి ఉందని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా ఓటు హక్కు ప్రశాంతంగా వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు, అనవసరమైన వార్తలను వ్యాప్తి చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోవకు ఎన్నికల ఎఫెక్ట్ తుని రూరల్: లోవ దేవస్థానానికి వచ్చే భక్తులపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. సాధారణంగా ఆదివారం 10 వేల మంది వరకు భక్తులు లోవ దేవస్థానికి వచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా సోమవా రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ వారం లోవకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం ఉదయం నుంచి సా యంత్రం వరకు 4 వేల మంది భక్తులు తలుపుల మ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులి హోర ప్రసాదాలు, పూజా టికెట్లు, వసతి గదుల అద్దెలు, తదితర వివిధ విభాగాల నుంచి రూ. 1,71,283 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. -
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
ఫ ఉమ్మడి తూర్పున రూపురేఖలు మారిన పల్లెలు ఫ అధునాతన సౌకర్యాలతో బడులు, ఆసుపత్రులు ఫ సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ క్లినిక్లతో గ్రామాల్లోనే సేవలు ఫ పారిశ్రామికాభివృద్ధికీ పెద్ద పీట ఫ కళ్ల ముందే కనిపిస్తున్న మార్పు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎందరో ఉద్దండులు ఏలిన ఉమ్మడి తూర్పు గోదావరి రాజకీయ చైతన్యానికి మారుపేరు. పునర్విభజనతో ఈ జిల్లా కాస్తా మూడు జిల్లాలైంది. అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సహజంగానే రాజకీయాల్లో ‘తూర్పు’ సెంటిమెంట్ను బలంగా విశ్వసిస్తారు. ఈ జిల్లాల ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర దశ, దిశలను నిర్దేశిస్తాయని నమ్ముతారు. నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరకులోయతో కలిపి నాలుగు లోక్సభ, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో ఒకటైన రంపచోడవరం జిల్లాల విభజన అనంతరం పాడేరు జిల్లాలో కలిసింది. ఉమ్మడి జిల్లాలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ, అధికార పక్షమైన టీడీపీల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. ఈ పోరులో టీడీపీ కేవలం నాలుగంటే నాలుగు (పెద్దాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట) అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలతో పాటు, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, అరకులో ఎంపీ సీట్లలో ప్రజలు అప్రతిహతమైన మెజార్టీలు అందించడంతో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. నాడు ప్రతిపక్ష నేతగా నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో మేనిఫెస్టో రూపొందించారు. దీనిని తు.చ. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్ సీపీకి దాదాపు అన్ని వర్గాల ప్రజలూ పట్టం కట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగించారు. ఆర్థికంగా అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రతి ఇంటా ప్రగతి జెండా ఎగురవేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం పైగా అమలు చేశారు. పార్టీ, కులం, మతం, వర్గం చూడకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందజేసి ప్రజల మనసుల్ని చూరగొన్నారు. ప్రధానంగా గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకుని వచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారకుండానే అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టి మరీ పింఛన్లు అందించారు. ‘నాడు–నేడు’తో బడులు, ఆస్పత్రుల స్వరూపాన్నే మార్చేసి, విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. కోవిడ్ వంటి కష్టకాలం ఎదురైనా, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనా బాధితులకు వెన్నంటే నిలిచి, వారి ప్రాణాలకు భరోసా ఇచ్చారు. ప్రగతికి పెద్దపీట ఫ పల్లె, పట్టణమనే తేడా లేకుండా అవసరమైన ప్రతిచోటా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఫ ఉమ్మడి జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలు, వైద్య, ఆరోగ్య రంగం, ఇతర రంగాలతో పాటు మునుపెన్నడూ లేనివిధంగా కారుణ్య నియామకాల ద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఫ నూతన పారిశ్రామిక విధానం ద్వారా కాకినాడ జిల్లావ్యాప్తంగా గడచిన ఐదేళ్లలో రూ.875.18 కోట్ల పెట్టుబడులతో 3,586 మందికి ఉపాధి కల్పించేలా 10 పెద్ద పరిశ్రమలు స్థాపించారు. వీటిలో రూ.330 కోట్లతో 5 రొయ్యలు ప్రాసెసింగ్కు సంబంధించినవి ఉండటం విశేషం. వీటి ద్వారా రోజుకు 232 టన్నుల రొయ్యలను శుద్ధి చేస్తున్నారు. సుమారు 2,956 మంది నేరుగా ఉద్యోగాలు పొందారు. ఇంకా యు.కొత్తపల్లి మండలం కేఎస్ఈజెడ్లోని పొన్నాడ, పెద్దాపురం మండలం జి.రాగంపేట, ప్రత్తిపాడు మండలం లంపకలోవ వద్ద వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి. ఆక్వా, ఆహార పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఫ కాకినాడ జిల్లాలో 2019–20 నుంచి ఇప్పటి వరకూ రూ.390 కోట్ల పెట్టుబడులతో 3,516 మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 16,394 మంది ఉపాధి పొందుతున్నారు. ఫ నవ్య తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ తొలి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడితో గ్రాసిమ్ కాస్టిక్ సోడా ప్లాంట్ నిర్మించింది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతోంది. ఫ గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రూ.260 కోట్ల అంచనాతో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.50 కోట్ల విలువైన 20.07 ఎకరాల భూమి కేటాయించింది. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 210 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది. ఫ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి గ్రామం వద్ద రూ.1,350 కోట్ల పెట్టుబడితో త్రివేణి రెన్యువబుల్స్ సంస్థ ఆధ్వర్యాన సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు లభించాయి. ఫ ఇంకా నల్లజర్ల మండలం పోతవరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామం వద్ద ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 2,427 ఎంఎస్ఎంఈల ఏర్పాటు ద్వారా 10,179 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ఉమ్మడి జిల్లాలో ప్రజలకు రూ.వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధిని అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం తోడుగా నిలిచింది. పారిశ్రామికాభివృద్ధికీ పెద్ద పీట వేస్తోంది. ఆ ధైర్యంతోనే ‘మీ ఇంటిలో ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా మంచి జరిగి ఉంటేనే ఓటేయండి’ అని ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ధైర్యంగా అడిగారు. దీనికి అనుగుణంగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం జరిగే పోలింగ్లో అన్ని వర్గాలకూ మంచి చేసిన ముఖ్యమంత్రికి మద్దతు తెలిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారితో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బస్సులు, రైళ్లలో ఒక రోజు ముందుగానే స్వస్థలాలకు ఆదివారం నాటికే చేరుకున్నారు. మరికొందరు సోమవారం ఉదయానికి చేరుకోనున్నారు. గడచిన ఐదేళ్లుగా తమ తమ కుటుంబాలకు జరిగిన మేలును, కళ్ల ముందే కనిపిస్తున్న మార్పును గుర్తుంచుకుని, సంక్షేమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో వారున్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాలు, అక్రమాల పాలన మరోసారి వద్దు బాబూ అంటూ ఓటుతో బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు ప్రకటించిన సూపర్ సిక్స్, సెవెన్ హామీలను సైతం ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడున్న పథకాలకు డబుల్, త్రిబుల్ ఇస్తానంటూ ఆయన ఊదరగొడుతున్నా జన స్పందన కరువవుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పరుగులు పెట్టించిన ప్రస్తుత ప్రభుత్వానికే మరోసారి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో ఆయా వర్గాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో అభివృద్ధి జరిగిందిలా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫ జిల్లాలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. లంక గ్రామాలకు వారథులు నిర్మించారు. రహదారులను బాగు చేశారు. ఫ గోదావరి లంక, మత్స్యకార గ్రామాల దాహార్తిని తీర్చేందుకు రూ.1,650 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ రూ.450 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయి. ఫ 979.734 ఎకరాల లంక భూములకు సంబంధించి 2,991 మంది లబ్ధిదారులకు లీజు పట్టాలు పంపిణీ చేశారు. ఫ నాడు–నేడులో ఆరు పీహెచ్సీలను రూ.9.21 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఫ గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా 515 సచివాలయాలను అభివృద్ధి చేశారు. రూ.72.88 కోట్లతో 1,102 పనులు చేపట్టారు. ఫ మన బడి నాడు–నేడు కింద మొదటి విడతలో 436 పాఠశాలలను రూ.104.96 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతలో 761 పాఠశాలలను, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రూ.257 కోట్లతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఫ పేదలకు రికార్డు స్థాయిలో మొదటి విడతలో 24,644 ఇళ్లు మంజూరు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వైఎస్సార్ పట్టణ పథకం ద్వారా రూ.443.59 కోట్లతో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్సార్ గ్రామీణ పథకం ద్వారా 9,810 ఇళ్ల నిర్మాణం రూ.176.58 కోట్లతో జరుగుతున్నాయి. ఫ ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనే సంకల్పంతో 1,834 ఆవాసాల్లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లు నిర్మించారు. 209 జగనన్న కాలనీ లే అవుట్లలో కుళాయిల ఏర్పాటుకు రూ.45.75 కోట్లు కేటాయించారు. ఫ గడచిన ఐదేళ్లలో రహదారులు, భవనాల నిర్మాణాలకు రూ.299.40 కోట్లు ఇచ్చారు. ఫ పి.గన్నవరం మండలంలో లంక గ్రామాల ప్రజల కష్టాలను గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.49.50 కోట్లతో గోదావరిపై వంతెన పనులు చురుకుగా జరుగుతున్నాయి. -
యువోత్సాహం
నమ్మకం కలిగించాలి నాయకుడనే వాడు ప్రజలకు నమ్మకం కలిగించాలి. విశ్వసనీయతకు మారుపేరుగా ఉండాలి. ఒకసారి అవకాశం ఇస్తే కొన్నేళ్లు పాటు దానిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలి. అలాంటి నాయకుడికే నా ఓటు. – దడాల అక్ష, ఇంజినీరింగ్ విద్యార్థి, తూరంగి పేద విద్యార్థులకు మేలు చేయాలి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలి. కులం ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక వెనుకబాటును ప్రామాణికంగా తీసుకుని అవకాశాలు కల్పించాలి. అలాంటి నాయకుడికే నా ఓటు. – సీహెచ్ సిద్ధార్థ, డిగ్రీ విద్యార్థి, కాకినాడ కాకినాడ సిటీ: ఎన్నికల విషయంలో యువ ఓటర్ల దృక్పథం మారుతోంది. ఎన్నికల, ఓటింగ్పై గతంలో యువకులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘంతో పాటు, పలు సంస్థలు ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్రచారం చేయడంతో, యువత ఆలోచనా సరళి మారింది. 18 ఏళ్లున్న వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడంతో కాకినాడ జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. జిల్లాలో మొత్తం 16,99,122 మంది ఓటర్లుండగా, యువ ఓటర్ల సంఖ్య 7,36,101 మంది ఉన్నారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన, మెచ్చిన నేతను ఎన్నుకునేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటున్నారు. అవినీతి రహితంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే నేతనే ఎన్నుకుంటామని ప్రతినబూనుతున్నారు. యువత భవితకు భరోసా కల్పించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతనే ఈసారి ఎన్నుకుంటామని చెబుతున్నారు. తొలిసారిగా ఓటు వేసేందుకు.. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని తొలిసారిగా పొందిన యువత ఓటేసేందుకు సిద్ధమవుతోంది. భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. దేశంలో బీటెక్, డిగ్రీ, ఇతర యూజీ కోర్సులు చేస్తున్న వారు, తొలిసారిగా ఓటు హక్కు పొందారు. వీరంతా ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి తమకు నచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన వారు సమర్థ నాయకత్వానికి ఓటు వేస్తామని, ఏళ్ల అనుభవం, ఇతర అంశాలను పట్టించుకోమన్నారు. యువత ఆశయాలను అర్థం చేసుకుని ముందుకు నడిపించ గలిగే నేతకు జై కొడతామంటున్నారు యువత. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా యువత ఓటర్లే కీలకం. దీంతో అన్ని రాజకీయ పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. వీరు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉరకలేస్తున్న కొత్త ఓటరు యువత ఆశయాలు అర్థం చేసుకునే నాయకుడే రావాలి సమర్థ పాలన అందించే వారికే ఓటు తొలిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్ల మనోగతం జిల్లాలో యువ ఓటర్లు నియోజకవర్గం 18–19 20–29 30–39 తుని 4,506 40,146 61,534 ప్రత్తిపాడు 3,550 36,958 61,386 పిఠాపురం 3,640 37,867 63,680 కాకినాడ రూరల్ 3,999 41,358 68,199 పెద్దాపురం 3,416 35,771 60,036 కాకినాడ సిటీ 3,680 39,381 62,449 జగ్గంపేట 3,450 37,245 63,800 మొత్తం 24,241 2,68,776 4,41,084మంచి నాయకుడిని ఎన్నుకుంటాం అబద్ధపు హామీలిచ్చి మోసం చేసే నాయకుడిని కాకుండా, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, రైతులకు, మహిళలకు, పేద వర్గాల వారికి మేలు చేసే వారికే నా ఓటు. – కాకర మణికంఠ, కాకినాడ హామీలు నెరవేర్చాలి ఎన్నికల్లో పోటీ చేసేవారు తాము ప్రకటించిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు చేయగలిగాలి. అలాంటి వ్యక్తికే నేను ఓటు వేస్తాను. ఎన్నికల సమయంలో హామీలిచ్చి, వాటిని నెరవేర్చలేని నాయకులు మనకు అవసరం లేదు. – చిల్లా కిషోర్, డిగ్రీ విద్యార్థి, కాకినాడ -
నకిలీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురి అరెస్టు
రంగంపేట: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన దాడుల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ సీఐ ఎస్.రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పిట్టా సోమసోఖర్ ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించగా నల్లమిల్లి, సింగంపల్లి, ఆనూరు గ్రామాల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న మామిడాల సూరిబాబు, మేడిశెట్టి సతీష్, బల్ల వీరప్రభ, యాగా రాంబాబు, నాగులపల్లి బాబూరావులను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 20 లీటర్ల నకిలీ మద్యం, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ ఎస్ఐ జి.అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement