breaking news
Dr B R Ambedkar Konaseema
-
సీట్ రైట్..
వసతులున్న కాలేజీలకే గుర్తింపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా కళాశాలల ప్రమాణాలు పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఆ మేరకు జేఎన్టీయూ కాకినాడ ఆన్లైన్లో తనిఖీలు నిర్వహించింది. సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు అన్ని వసతులు ఉన్న వాటికే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. – డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే ● జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు ● ఇంజినీరింగ్లో 62 వేల సీట్లకు అనుమతి ● 2025–26లో 106 కళాశాలలకు గుర్తింపు ● ఉన్నత విద్యామండలికి నివేదిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలల్లో వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. జేఎన్టీయూకే పరిధిలో సీట్ల ఖరారు పూర్తయ్యింది. తొలుత ఈ నెల 11వ తేదీని ప్రకటించగా, సీట్లు కొలిక్కి రాకపోవడంతో 13వ తేదీకి మార్చారు. రాష్ట్రంలోని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి అందిస్తేనే.. అక్కడి నుంచి కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వర్సిటీకి గతంలో పాత ఉమ్మడి జిల్లాలు 8 ఉండగా ఈ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి. బీటెక్లో 62 వేల సీట్ల భర్తీకి అనుమతి 2024–25 విద్యాసంవత్సరానికి కాకినాడ వర్సిటీ పరిధిలో అనుబంధంగా ఉన్న 106 కళాశాలల్లో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వీటితో పాటు ఈ ఏడాది కొత్తగా కృష్ణా జిల్లా ఏఎన్ఆర్, ప్రకాశం జిల్లాలో శ్రీహర్షిత కళాశాలకు గుర్తింపు లభించింది. బీటెక్ విభాగంలో గత ఏడాది దాదాపు 30 కళాశాలల వరకూ డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం 4 వేల సీట్లకు అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అక్కడి సౌకర్యాలు బట్టి వాటికి అనుమతి ఇచ్చారు. కొత్త కోర్సులైన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో వీఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులకు వెయ్యి సీట్లకు పైగా అనుమతి లభించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ, ఎన్ఐటీలలో సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరు ప్రైవేట్ వర్సిటీలతో పాటు ఏ గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ బ్రాంచ్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆన్లైన్లో కళాశాలల తనిఖీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అనుబంధ కళాశాలల తనిఖీలను ఆన్లైన్లో చేపట్టారు. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ కళాశాల పరిస్థితి, క్రీడా మైదానం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలన చేస్తారు. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్థారణ కమిటీ ఈ పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫారసు మేరకు ఏయే కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్థారణ కమిటీ సిఫారసులే కీలకం. ఈ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. -
రూ.లక్ష విరాళం అందజేత
కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ మైదానంలో ఆగస్టులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, మహిళల హాకీ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీఎన్జీవో జిల్లా శాఖ రూ.లక్ష విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గత వారంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ర్యాలీ, క్రీడల ఘన నిర్వహణకు సంఘాల తరఫున చేయూతనందించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో జిల్లా ఏపీఎన్జీవో శాఖ రూ.లక్ష మొత్తాన్ని సమకూర్చింది. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సోమవారం ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్, పేపకాయ వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందించారు. ఈ మేరకు సంఘ నేతలను జేసీ అభినందించారు. జేసీని కలసిన వారిలో సంఘ జిల్లా సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, సంయుక్త కార్యదర్శి శశికుమార్ ఉన్నారు. -
ఆస్తి కాజేసి.. తండ్రిని గెంటేసి..
● రాజమహేంద్రవరంలో కుమార్తెల నిర్వాకం ● దొంగ దారిలో నాన్న ఇంటి రిజిస్ట్రేషన్ ● బ్యాంకు ఖాతాలోని సొమ్ము స్వాహా ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన వృద్ధుడు సీటీఆర్ఐ: సాధారణంగా తండ్రిపై కుమార్తెలకు ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందని చెబుతుంటారు. కొడుకులు చూడకుండా వదిలేసిన చాలామంది తండ్రులు తమ కూతుళ్ల దగ్గర ఆశ్రయం పొందుతున్న సంఘటనలు చాలా చూస్తాం. అయితే రాజమహేంద్రవరంలో ఇద్దరు కుమార్తులు తమ తండ్రినే మోసం చేసి, ఆయన ఇల్లు రాయించుకుని, బ్యాంకు ఖాతా లోని డబ్బులను కూడా కొట్టేశారు. ఆ వృద్ధుడు సోమవారం ఆర్డీవోకు ఫిర్యాదు చే యడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇవీ.. సీతంపేటకు చెందిన యోన్నంశెట్టి రాములుకు ప్రస్తుతం 72 ఏళ్లు. ఆయన 40 ఏళ్లగా సీతంపేటలోని సొంతింట్లో నివసిస్తున్నాడు. కాలేజీ అటెండర్గా ఉద్యోగం చేసి విశ్రాంతి జీవనం గడుపుతున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహాలు చేసి అత్తవారిళ్లకు పంపేశాడు. కుమారుడు ఉద్యోగ రీత్యా చైన్నెలో ఉంటున్నాడు. అయితే 2020లో రాములు భార్య చనిపోవడంతో తండ్రికి తోడుగా ఉండటానికి వచ్చిన కుమార్తెలు ఇక్కడే తిష్ట వేశారు. తమ అన్నయ్యకు తెలియకుండా తండ్రి డబ్బును, ఆస్తిని కాజేశారు. 2023లో ఇంటిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించున్నారు. అలాగే తండ్రికి తెలియకుండా ఆయన బ్యాంకు ఖాతాలోని రూ.15 లక్షలను తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. విచిత్రమేమిటంటే.. ఆ ఇంటి దస్తావేజులను బ్యాంకులో తాకట్ట్టు పెట్టి గతంలోనే రుణం తీసుకున్నారు. అయినా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే రాజమహేంద్రవరంలో రిజిస్టర్ చేయడం విశేషం. తండ్రి నుంచి ఆస్తి, డబ్బులు తీసుకున్న అనంతరం ఆయనను కొట్టి, నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో కుమారుడు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీనిపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని తెలపగా, సోమవారం పీజీఆర్ఎస్కు వచ్చారు. వృద్ధాప్యం కారణంగా వినపడకపోవడంతో పాటు నడవలేని పరిస్థితిలో ఉన్న రాములు అవస్థ చూసిన ఏఓ సుజాత.. ఆర్డీవో కార్యాలయం బయటికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
క్వాంటం టెక్నాలజీ ఎఫ్డీపీ ప్రారంభం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్డీపీ కన్వీనర్ డాక్టర్ వి. పెర్సిస్ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ జి. కీర్తి మరిట, సీఎస్ఈ హెచ్ఓడి డాక్టర్ బి.కెజియయారాణి పాల్గొన్నారు. -
బంగారం, నగదు చోరీ
తుని: పట్టణంలోని తామాకులవారి వీధిలో గల ఇంటిలో బంగారం, నగదును చోరీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు నక్కా లోకేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకేష్, కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పెద్దాపురం మరిడమ్మ తల్లిని దర్శించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. కింది పోర్షన్లోకి వెళ్లి మంచినీరు తాగి తాళాలు వేశారు. అనంతరం మేడపైకి వెళ్లి అందరూ నిద్రపోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి కిందికి రాగా తలుపులు తెరచి, తాళాలు పగలుకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి గమనించగా, బీరువాలోని 100 గ్రాముల బంగారం, రూ.4 వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు తుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ విజయ్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన గదిని పరిశీలించి, వేలిముద్రలను సేకరించింది. -
అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం
కొత్తపేట: అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన అధ్యక్షతన సోమవారం కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాలుగు అర్జీలు స్వీకరించారు. బొబ్బర్లంక ఏటిగట్టు ఆక్రమణలను తొలగించాలని, కొత్తపేటలో కౌశిక డ్రైనేజీని శుభ్రం చేయాలని, కొత్తపేట మండలానికి సంబంధించి రెండు భూ సమస్యలపై దరఖాస్తులు అందాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను సంతృప్తి స్థాయిలో మెరుగుపరిచి, ప్రజలకు సుపరిపాలనను చేరువ చేసే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలన్నారు. అధికారులు తమకు అందిన అర్జీపై క్షేత్రస్థాయిలో పూర్తిగా అర్జీదారుని సమక్షంలో విచారణ చేయాలన్నారు. వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్థలాల పరిశీలన స్థానికంగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ), డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్డీఓ) కార్యాలయాల ఏర్పాటుకు భూసేకరణకై చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న భూములను ఆయన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలసి పరిశీలన చేశారు. కలెక్టర్ మహేష్ కుమార్ కొత్తపేటలో అర్జీల స్వీకరణ -
బాస్కెట్ బాల్ రన్నర్గా ఏపీఎస్పీ
కాకినాడ రూరల్: రాజమహేంద్రవరం ఎస్కేవీటీ కాలేజీలో ఈ నెల 13న జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ – 2025 రన్నర్గా కాకినాడ ఏపీఎస్పీ జట్టు నిలిచింది. ఈ విషయాన్ని ఏపీఎస్పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. రామచంద్రపురం జట్టుతో పైనల్ మ్యాచ్లో హోరాహోరీగా తలపడిందన్నారు. పోటీలో పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన సోమవారం అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహేష్, శంకర్, రాజేష్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. -
జనసేన నాయకుడి ఇసుక దందా
పెరవలి: కూటమి నాయకుల ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా జనసేన గ్రామ అధ్యక్షుడు అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన జనసేన గ్రామ అధ్యక్షుడు మేడిచెర్ల భాస్కర శివ కుమార్ అదే గ్రామంలో అక్రమంగా 700 టన్నుల ఇసుకను నిల్వ చేశాడు. దీంతో గ్రామస్తులందరూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు దాడి చేసి ఆ ఇసుక గుట్టను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్పై కేసు నమోదు చేయాలో లేక జరిమానా విధించాలో కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక నిల్వలపై తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. దాడిలో జిల్లా మైనింగ్ అధికారి శైలజ, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి మామిడికుదురు: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అన్నంనీడి మహాలక్ష్మి (101) సోమవారం మృతి చెందారు. ఆమె 1924 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. తొమ్మిది మంది మనవలు, మనవరాళ్లు, 16 మంది ముది మనవలు ఉన్నారు. ఆమె మరణించే వరకు తన పనులు తానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. 25 ఏళ్ల నుంచి ఒంటి పూట భోజనం చేస్తున్నారన్నారు. గ్రామంలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 17న జాబ్మేళా కొత్తపేట: స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కేపీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) అండ్ ప్లేస్మెంట్ సెల్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్బీ మోటార్స్, కేపీపీ పేపర్స్, అవంతి ప్రోజెస్ ఫుడ్స్, ఎల్ఐసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఐజాన్ ఎక్స్పీరియన్సెస్, ఫోక్స్కాన్, హుండాయ్ మోబిస్, ఎస్ఎస్ఆర్ ఎల్టీఎల్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, శివానిక్, ఇసుజు మోటార్స్ తదితర సంస్థలు ఈ మేళాకు హాజరై తమ ఆయా కంపెనీల్లో సుమారు 820 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్, పీజీ చదివిన వారందరూ తమ సర్టిఫికెట్లతో జాబ్మేళాకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 81798 24845, 97043 02775, 98497 11253 నంబర్లను సంప్రదించాలి. ● అక్రమంగా 700 టన్నుల నిల్వ ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
తిరుమల విద్యార్థులకు అభినందన
రాజమహేంద్రవరం రూరల్: నీట్ 2025 ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి డి.కార్తిక్ రామ్కిరీటిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్–2025లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించిన కె.యశ్వంత్ సాత్విక్, ఎస్సీ కేటగిరీలో ఆలిండియా రెండవ ర్యాంకు సాధించిన కె.ప్రణీత్లకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ ఘనతను సాధించిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును మంత్రి లోకేష్ అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలసి ఆయా విద్యార్థులు సోమవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటే చాలెంజ్ అన్నారు. దాన్ని స్వీకరించాలే తప్ప అధైర్యపడకూడదన్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కలల సాధనకు నిరంతరం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
దుప్పట్లు ఉతికేందుకు టెండర్
● విడుదల చేసిన అన్నవరం దేవస్థానం ● ‘సాక్షి’ కథనానికి స్పందన ● ప్రస్తుతం నామినేషన్ విధానంలో నెలకు రూ.60 వేల చెల్లింపు అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని సత్రాల గదులలో ఉపయోగించే దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లు, రగ్గులను ఉతికేందుకుగాను దేవస్థానం అధికారులు సోమవారం టెండర్ పిలిచారు. గత మార్చి నుంచి ఇవి ఉతికేందుకు గాను నామినేషన్ మీద నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఈ నామినేషన్ మీద కేటాయించారన్న విమర్శ కూడా ఉంది. టెండర్లు పిలిస్తే ఇంకా తక్కువకు వీటిని ఉతుకుతారనే అభిప్రాయం నెలకొంది. గత నెల 23న స్థానిక రజకవృత్తిదారుడు కింతాడ శ్రీనివాసరావు తాము నెలకు రూ.45 వేలకే వాటిని ఉతుకుతామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘సత్యదేవునికే టెండర్’ శీర్షికన వార్త ప్రచురితమైంది. 21 వరకూ దరఖాస్తులకు గడువు దేవస్థానంలో రెండేళ్లపాటు పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ సత్రం గదులలో మంచాలపై వేసిన దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లను ఉతికించే పని కూడా నిర్వహించేది. అప్పుడు వాషింగ్ మెషీన్ల ద్వారా శుభ్రం చేసేవారు. ఆ సంస్థ కాంట్రాక్టు పూర్తి కావడంతో గత మార్చి నుంచి నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తూ శుభ్రం చేయిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. పైగా వాటిని ఉతికేందుకు మెటీరియల్ను దేవస్థానమే అందజేస్తోంది. ప్రస్తుతం మనుషులు ఉతుకుతుండడంతో అంతగా శుభ్రంగా ఉండడం లేదని, వాసన వస్తున్నాయన్న ఫిర్యాదులు భక్తుల నుంచి వస్తున్నాయి. దీంతో వాషింగ్ మెషీన్లు టెండరు దారుడే సమకూర్చుకుని ఉతికి ఇచ్చేందుకు టెండర్ పిలిచారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. -
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
పెద్దాపురం: స్మార్ట్ మీటర్లను, విద్యుత్ సర్దుబాటు చార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. దీనిలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమ పోస్టర్ను సోమవారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఇంటినీ దోచుకునేలా అదానీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ, స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ కరెంటు బిల్లు వచ్చిన 15 రోజులు, నెల రోజుల లోపు సొమ్ములు కట్టేవారమని, ఇక నుంచి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్.. ఇప్పుడు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన.. ప్రజల మీద కరెంటు చార్జీలు, స్మార్ట్ మీ టర్ల రూపంలో దాడి చేస్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతంలోనూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న పాల్గొన్నారు. -
కొబ్బరి రాజసం
● పెరుగుతున్న ధర ● ఇప్పటికే కొబ్బరి, కురిడీలకు రికార్డు స్థాయి రేటు ● కురిడీ కొబ్బరి రూ.29,500 ● పచ్చి కొబ్బరి రూ.20 వేలు ● శ్రావణ మాసంలో మరింత పెరిగే అవకాశం సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కొబ్బరి ఉత్పత్తుల ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. స్థానికంగా పచ్చి కొబ్బరి, కురిడీ కొబ్బరి, కొత్త కొబ్బరి వంటి ఉత్పత్తులు దొరకడమే గగనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నడంతో మార్కెట్లో కొబ్బరి ఉత్పత్తులకు మరింత డిమాండ్ వస్తుందని రైతులు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మారె్క్ట్లో జోష్ శ్రావణ మాసానికి ముందే అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో జోష్ వచ్చింది. తాజాగా కురుడి కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. మార్కెట్లో సోమవారం పాత కాయలలో గండేరా రకం (పెద్ద కాయలు) వెయ్యి కాయల ధర రూ.29,500 పలికింది. దీనిలోని చిన్న కాయి ధర రూ.28 వేలు. గత శనివారం మార్కెట్లో గండేరా రకం ధర రూ.26,500 ఉండగా, గటగాట రకం ధర రూ.25,500 ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు రకాలకు కలిపి రూ. 2,500 నుంచి రూ.మూడు వేల వరకు పెరగడం విశేషం. ఇక కొత్త రకం కాయలలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.28,500 వరకూ ఉండగా, గటగట రకం రూ.27 వేల వరకూ ఉంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కురిడీ కొబ్బరి వ్యాపారం మొత్తం కోనసీమ కేంద్రంగా సాగుతుండగా, పచ్చి కొబ్బరి, కొత్త కొబ్బరి వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. కురిడీ కొబ్బరితో పాటు పచ్చి కాయ ధరలు సైతం రికార్డు స్థాయిలో ధర ఉంది. ప్రస్తుత మార్కెట్లో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.19 వేల నుంచి రూ.21 వేల వరకూ ధర ఉంది. తగ్గిన దిగుబడి దక్షిణాదిలో కొబ్బరి అధికంగా పండే నాలుగు రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో గత ఆరేడు నెలలుగా సగటున వచ్చే దిగుబడిలో 30 శాతం మాత్రమే దిగుబడి వస్తోంది. దీనితో ఉత్తరాది రాష్ట్రాల అవసరాలన్నీ ఏపీ నుంచి వెళ్లే కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి అధికంగా పడుతున్నా, కోనసీమ జిల్లాలో మాత్రమే కురిడీ కొబ్బరి తయారీ అధికం. ఈ జిల్లాలో సైతం కొబ్బరి కాయను చెట్టు నుంచి దింపిన వెంటనే ఏదో ఒక రూపంలో జాతీయ మార్కెట్కు తరలిపోతోంది. దీనితో కురిడీ కొబ్బరి నిల్వలు సైతం అయిపోతున్నాయి. ఈ కారణంగానే ధర అనూహ్యంగా పెరిగింది. నిలిచిన అమ్మకాలు శ్రావణ మాసం మార్కెట్పై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దక్షణాదిన దిగుబడులు పెరగకపోవడంతో స్థానికంగా వచ్చే కొబ్బరికి మరింత డిమాండ్ వస్తోందని రైతులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కొబ్బరి వెయ్యికాయల ధర రూ.25 వేల వరకూ చేరుతుందని రైతులు నమ్ముతున్నారు. దీనికి తోడు రైతు సంఘాల నాయకులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామాజిక మాధ్యమాలపై ద్వారా ధర మరింత పెరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనితో రైతులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. కొందరు రైతులు శ్రావణ మాసం వారం రోజులు వస్తోందనగా జరిగే మార్కెట్ను బట్టి అమ్మకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనితో కోనసీమ జిల్లాలో రైతుల వద్ద పచ్చికొబ్బరి కొనుగోలు దాదాపు లేదనే చెప్పావచ్చు. ఇది వ్యాపారులకు మింగుడుపడడం లేదు. శ్ఙ్రీగతంలో కొబ్బరికాయ రూ.15 ఉంటేనే రైతులు ముందుగానే దింపులు చేసి అమ్మకాలు చేసేవారు. ఇప్పుడు దిగుబడి కొబ్బరి తోటల్లో రాశులుగా ఉన్నా.. కొబ్బరికాయ ధర రూ.21 ఉన్నా కూడా తొందరపడి అమ్మకాలు చేయడం లేదు అని అమలాపురం మండలం కామనగరువుకు చెందిన ఒక వ్యాపారి సాక్షి వద్ద వాపోయాడు. ●ధర పెరిగే అవకాశం శ్రావణం మాసం వచ్చే కొద్దీ కొబ్బరికి ధర పెరుగుతోందనే అంచనా తో ఉన్నాం. ప్రస్తుతం మార్కెట్లో అదే వాతావరణం ఉంది. అందుకే మా రైతులంతా జాగ్రత్తగా అమ్మకా లు చేస్తున్నాం. తమిళనాడులోనే కాదు, మనకు దిగుబడులు తగ్గుతు న్నాయి. ధర అధికంగా ఉన్నందున దిగుబడులు తగ్గాయనే ఆందోళన స్థానిక రైతులకు కనిపించడం లేదు. – ఇళ్ల గోపి, కొబ్బరి రైతు, గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట మండలం శ్రావణ సీజన్ ప్రస్తుతం ఆషాడమాసం జరుగుతోంది. అయినా కూడా కొబ్బరి ఉత్పత్తుల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఈనెల 25వ తేదీ నుంచి శ్రావణం మొదలు కావడమే. ఇప్పటికే శ్రావణ మాసం కొనుగోలు మొదలైంది. దేశ వ్యాప్తంగా శ్రావణమాసం నుంచి పెద్ద ఎత్తున పూజలు మొదలు కానున్నాయి. పండుగల సీజన్ కూడా ఆరంభం కానుంది. వినాయక చవితి, తరువాత దసరా, దీపావళి పంటి పండుగలు ఉన్నాయి. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాదిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మన రాష్ట్రంలో కూడా పూజలు, శుభ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. వీటికి కూడా కొబ్బరి పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఈ కారణంగా అటు ఉత్తరాది రాష్ట్రాలోనే కాకుండా స్థానికంగా కూడా కొబ్బరికాయకు డిమాండ్ పెరగనుంది. -
మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ
అమలాపురం టౌన్: మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలని అమలాపురం ఫస్ట్ క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిసే్ట్రట్ ఎస్.శ్రీరేఖ అన్నారు. మిడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో సోమవారం అమలాపురం పురవీధుల్లో వన్ కేఎం వాక్ (అవగాహన ర్యాలీ) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కోర్టుల సముదాయం వద్ద మేజిస్ట్రేట్ శ్రీరేఖ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం వన్ కేఎం వాక్, మంగళవారం బైక్ ర్యాలీ, బుధవారం సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వారోత్సవాల తొలి రోజు అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్చే పోస్టర్ల ఆవిష్కరణ జరిగిందన్నారు. జిల్లా రవాణాధికారి (ఆర్టీవో) దేవిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ సీఐ పి.వీరబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ర్యాలీలో న్యాయవాదులు, పోలీసులు, ప్యానల్ లాయర్లు, లోక్ అదాలత్ మెంబర్లు, పారా లీగల్ వలంటీర్లు, మిరియాం విద్యా సంస్థల విద్యార్థులు, బార్ అసోసియేషన్ కోశాధికారి నందెపు శ్రీవెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరిచెట్లను కూల్చేస్తున్న గోదావరి
మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది. పీజీఆర్ఎస్కు 265 వినతులు అమలాపురం రూరల్: అర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) బీఎల్ఎన్ రాజకుమారి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రాజకుమారి, ఇతర అధికారులు 265 వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ఆశవర్కర్ల పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పీజిఆర్ఎస్లో స్వీకరించబడవన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి డీఎంహెచ్వో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి, డీఎల్డీవో వేణుగోపాలరావు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 35 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చి, తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. వాటిపై ఎస్పీ చర్చించి, పరిష్కారం కోసం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుల దర్యాప్తులో ఎంత మాత్రం అలక్ష్యం చేయవద్దని అధికారులకు ఆదేశించారు. మహిళా పోలీసుల బదిలీలో అవకతవకలు అమలాపురం టౌన్: జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసుల బదిలీల ప్రక్రియలో తప్పులు ఉన్నాయని, వాటిని తక్షణమే సవరించి, బదిలీలు సక్రమంగా సాగేటట్టు చేయాలని జిల్లా మహిళా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ బి.కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బదిలీల మార్గదర్శకాలను అనుసరించకపోవడంతో కొందరు మహిళా పోలీసులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. మెడికల్ గ్రౌండ్స్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదని, పౌస్ (భార్యాభర్తలు) విషయాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని, ఒకే మండలంలో పోస్టింగ్లు ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల ఆ తరహా బదిలీలు జరిగాయని, ఒకే చోట ఇద్దరికి బదిలీల ఆర్డర్లు ఇచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వాపోయారు. జిల్లాలో 40 మందికి పైగా మహిళా పోలీసులకు బదిలీల మార్గదర్శకాలను పాటించకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షురాలు కె.వెంకట ధనలక్ష్మి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు, బదిలీల బాధితులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. -
సేంద్రియ సాగుతో అనేక లాభాలు
● రైతులకు అవగాహన కల్పించాలి ● వ్యవసాయశాఖ అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎరువుల లభ్యత, ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాల ఆచరణ, ఖరీఫ్ సాగు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానికంగా లభించే ముడి వనరులను వినియోగించడం ద్వారా హానికరమైన రసాయన ఎరువులు, వాడకం తగ్గుతుందన్నారు. తద్వారా భూసారం మెరుగవుతుందని, భూములు చౌడు బారకుండా నేల ఆరోగ్యం బాగుంటుందన్నారు. రసాయనాలు లేకుండా తెగుళ్లు, కలుపు మొక్కలను నియంత్రించడానికి ప్రకృతి సేంద్రియ పద్ధతులు ఉపయోగపడతాయన్నారు. జీవామృతం పంచగవ్య వర్మీ కంపోస్ట్ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ సాంకేతికత ఆధారిత వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచితే, వ్యవసాయ ఖర్చులు చాలా వరకూ తగ్గిపోతాయన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా సరఫరా చేయాలని, వాటిని వ్యాపారులు అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రణా చర్యలు బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. 1,004 యూనిట్లకు కనెక్షన్లు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకూ 1,004 యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చారని, ఆగస్టు 15 నాటికి మరిన్ని కనెక్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోలార్ రూఫ్టాప్ ఏజెన్సీలతో ఆయన సమీక్షించారు. ఈ పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, 300 యూనిట్ల పరిమితి వాడకానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఉత్పత్తికి పరిమితి లేదని పేర్కొన్నారు. సమావేశంలో బ్యాంకు ఎల్డీ ఎం.వర్మ తదితరులు పాల్గొన్నారు. -
నాయకత్వ టీచింగ్
● 12 సామర్ాధ్యల్లో నైపుణ్యాభివృద్ధికి హెచ్ఎంలకు శిక్షణ ● బ్యాచ్కు 250 మంది వంతున రెసిడెన్షియల్ మోడ్లో ట్రైనింగ్ ● నేడు చెయ్యేరు శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభం రాయవరం: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు పలు కార్యక్రమాలను విద్యాశాఖ, సమగ్ర శిక్షా సంయుక్తంగా చేపడుతున్నాయి. ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వృత్యంతర శిక్షణనిస్తోంది. 21వ శతాబ్దపు నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్ (సాల్ట్)లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధనోపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసేందుకు నాలుగు రోజుల శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ రెసిడెన్షియల్/నాన్ రెసిడెన్షియల్ విధానంలో కొనసాగనుంది. 12 నాయకత్వ నైపుణ్యాలు 2026 నాటికి పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తోంది. స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, పాఠ్యాంశాల బోధన నిర్వహణ, అభ్యాస సంస్కృతిని ప్రోత్సహించడం, పరిశీలన, అభిప్రాయం, డేటా ఆధారిత దిశలు, పాఠశాల వనరుల నిర్వహణ, ఆర్థిక వనరుల నిర్వహణ, కమ్యూనికేషన్ ప్రభావం, సంఘర్షణ నిర్వహణ, సహకారాన్ని నిర్మించడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పాఠశాల భద్రత, వాతావరణ మార్పు అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లోని అవసరాలు, విశ్లేషణ ఆధారంగా సామర్థ్యాలను రెండు లెర్నింగ్ సైకిల్స్లో నేర్పిస్తారు. విపత్తు సమయాల్లో నిర్వహణ, పాఠశాల భద్రత అంశాల్లో ప్రధానంగా శిక్షణ ఉంటుంది. సీమాట్ పర్యవేక్షణలో.. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ (సీమాట్) పర్యవేక్షణలో ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాచ్కు 250 వంతున మోడల్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంలు, గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన వారికి, ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ వస్తారు. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో ఈ ఏడాది మే నెలలో శిక్షణ పొందిన 10 మంది మాస్టర్ ట్రైనీలు ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రీ, పోస్ట్ టెస్ట్లు ట్రైనింగ్లో భాగంగా రెసిడెన్షియల్ విధానంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు ఉదయం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారికి అవసరమైన శిక్షణతో పాటు, మానసికోల్లాసానికి అవసరమైన ఆటలు, పాటలు, యోగా, ధ్యానం తదితర అంశాల్లో కూడా ప్రవేశం కల్పిస్తారు. ట్రైనింగ్కు ముందు ప్రీ టెస్ట్, ట్రైనింగ్ అనంతరం పోస్ట్ టెస్ట్ను ప్రధానోపాధ్యాయులకు నిర్వహించి, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వివిధ పద్ధతుల ద్వారా నిరంతర సమగ్ర మూల్యాంకనం చేసి, వారిలో నాయకత్వ పెంపుదల సూచీని అభివృద్ధి చేస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పర్యవేక్షణలో, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగనుంది. ● సద్వినియోగం చేసుకోవాలి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడే నాయకుడు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమైనది. సాల్ట్ ప్రాజెక్టులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ను సమగ్ర శిక్ష తరఫున నిర్వహిస్తున్నారు. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● ఏర్పాట్లు పూర్తి లీడర్ షిప్ ట్రైనింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. పాల్గొనేవారికి అవసరమైన మౌ లిక సదుపాయాలను కల్పించాం. మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణకు తొలి విడతలో 250 మంది ప్రధానోపాధ్యాయులు హాజరవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు శిక్షణ పొందడం ద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చు. – జి.మమ్మీ, ఏపీసీ, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం
బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ సభలో నేతల ధ్వజం అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్యీర్యమైందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు, అక్రమ కేసులు మొదలయ్యాయని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఒకే మాటగా అన్నారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక వాసర్ల గార్డెన్స్లో ఆదివారం అమలాపురం అసెంబ్లీ నియెజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ ముగ్గురూ పోలీసుల ఏక పక్ష తీరుపై ప్రసంగించారు. అల్లవరం మండల పార్టీ అధ్యక్షుడు కొనుకు బాపూజీ కుమారుడిపై, అమలాపురానికి చెందిన పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు దంతులూరి రోహిత్ వర్మపై ఇటీవల పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రాబో యేది జగన్ ప్రభుత్వమే. అప్పుడు పోలీసులుగా మీరు ఇబ్బంది పడకతప్పదని హెచ్చరించారు. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేతపై నిలదీద్దాం జిల్లాలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయడం అంటే ప్రశ్నించే గొంతును నొక్కేయడమేనని వారు అన్నారు. సాక్షి టీవీ ప్రసారాలు పునరుద్దించే దాకా మన పోరాటం సాగాలని స్పష్టం చేశారు. డిష్ల్లోకి మారతామని కేబుల్ ఆపరేటర్లకు చెప్పాలని సూచించారు. అమలాపురం రూరల్ సీఐకి విశ్వరూప్ హెచ్చరిక అమలాపురం రూరల్ సీఐగా పనిచేస్తున్న డి.ప్రశాంత్కుమార్ కూటమి ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. సీఐ ప్రశాంత్కుమార్...గుర్తుంచుకో... వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే, నిన్ను ఆ అయిదేళ్లూ వీఆర్లో ఉంచి తీరతామని విశ్వరూప్ హెచ్చరించారు. అల్లవరం పార్టీ అధ్యక్షుడి కుమారుడు రమేష్పై అన్యాయంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించావని విశ్వరూప్ అన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దారులన్నీ తలుపులమ్మ సన్నిధానానికే.. తుని రూరల్: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం మూడో ఆదివారం.. అమ్మవారిని విశేషంగా ఆరు టన్నుల కూరగాయలతో శాకంబరిగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా లోవ దేవస్థానానికి తరలివచ్చారు. తీవ్రమైన రద్దీతో 16వ నంబరు జాతీయ రహదారి నుంచి లోవ ఆర్చి గేటు వరకూ పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం ఆరు గంటలకు కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రావడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మందుబాబుల ఆగడాలు.. వాహనాలు నిలిపివేయడంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో కొంతమంది భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించి, కనిపించిన ప్రతి చెట్టుకూ ఉపారాలు సమర్పించారు. లక్ష మంది వరకూ భక్తులు రాగా క్యూలైన్ల ద్వారా ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని 50 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5,51,700, పూజా టికెట్లకు రూ.6,92,720, కేశఖండన శాలకు రూ.62,500, వాహన పూజలకు రూ.3,340, వసతి గదుల అద్దెలు రూ.1,09,892, విరాళాలు రూ.2,83,244 కలిపి మొత్తం రూ.17,03,396 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ధరను తరిగిన అరటి!
● రెండు నెలల్లో సగానికి పడిపోయిన రేటు ● దిగుబడి పెరగడమే కారణం ● మే నెలలో రూ.500 పలికిన కర్పూర రకం గెల, నేడు రూ.250 ● శ్రావణమాసం కోసం రైతులు, వ్యాపారుల ఎదురుచూపులు రావులపాలెం: మే నెలలో రైతుకు లాభాలు తెచ్చిన అరటి, రెండు నెలలు గడిచే సరికి నేడు నష్టాలను తెచ్చిపెడుతోంది. మే, జూన్ నెలల్లో ఈదురుగాలుల ప్రభావం లేకుండా ప్రకృతి అనుకూలించడంతో అరటి చెట్లు పడిపోకుండా ప్రతీ ఏడాది కంటే రైతుకు ఎక్కువ దిగుబడిని అందిస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు, రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణ, కడప, వినుకొండ, పార్వతీపురం, సాలూరు ఇలా అరటి పండే అన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగింది. రాష్ట్రంతోపాటు తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల్లో అరటి అందిరావడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. దిగుబడి పెరగడంతో ధర పతనమై, అరటి రైతు నష్టాలను చూడాల్సి వస్తోంది. మే నెలలో రూ.500 అమ్మిన కర్పూర రకం అరటిగెల ప్రస్తుతం రూ.250 పలుకుతోంది. రెండు నెలల్లో ప్రారంభం కంటే ప్రస్తుతం దిగుబడి పెరిగింది. మే నెలలో వ్యాపారులు 10 టన్నుల లారీ సరుకు రూ.1.60 లక్షలకు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం 10 టన్నుల లారీని రూ. 90 వేల నుంచి రూ.1లక్షకు ఖరీదు చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు పరిధిలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, మండపేట, పి.గన్నవరం, సిద్ధాంతం మండలాలతోపాటు, ఖండవల్లి, పెరవలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో సుమారు 12 వేల హెక్టార్లలో అరటి సాగు అవుతుంది. వీటిలో ప్రధానంగా ఆరు రకాల అరటి సాగు జరుగుతుంది. సుమారు 70 శాతం కర్పూర రకం అరటి సాగు ఉంటుంది. 20 శాతం చక్కెరకేళీ రకం (తెలుపు, ఎరుపు) మిగిలిన 10 శాతం బొంత, బుషావళి, అమృతపాణి రకాలు ఉంటాయి. సీజన్లో అంటే మార్చి నుంచి జూన్, జూలై నెలల వరకూ సగటున రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలలను రైతులు రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు తీసుకువస్తుంటారు. దీంతో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వ్యాపారం జరుగుతుంది. కర్పూర రకం అరటి గెలలుపొలాల వద్దే అమ్మకం ధర లేకపోవడంతో రైతులు మార్కెట్కు గెలలు తీసుకురాకుండా పొలాల వద్దకు వస్తున్న వ్యాపారుల(కొనుగోలుదారుల)కు విక్రయిస్తున్నారు. దీంతో సగం సరకు మార్కెట్కు రాకుండా నేరుగా పొలాల నుంచి ఎగుమతి అవుతుంది. మార్కెట్కు తరలించేందుకు రైతుకు గెలకు కూలి అదనంగా రూ.50 ఖర్చు అవుతుండడం, అరటి ధర లేకపోవడంతో రైతులు పొలాల వద్దే వ్యాపారులకు విక్రయాలు చేస్తున్నారు. సహజంగా సీజన్లో రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఒడిశా, బిహార్, జార్ఘండ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు, రాష్ట్రంలో వైజాగ్, పార్వతీపురం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, చిత్తూరు తదితర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం తమిళనాడు, ఒడిశౠ, తెలంగాణ రాష్ట్రాలకు, రాష్ట్రంలో విశాఖ, సాలూరు, పార్వతీపురం, గుంటూరు, తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి. అయితే ఒడిశాలో ఒక ప్రాంతంలో కలరా వ్యాధి రావడంతో అక్కడ అరటి, మామిడి వినియోగం తగ్గిందని, అధిక వర్షాలు, లారీల సమ్మె కారణంగా రావులపాలెం మార్కెట్ నుంచి ఒడిశాకు పెద్దగా ఎగుమతులు జరగడం లేదని వ్యాపారులు అంటున్నారు. పూరీ జగన్నాథస్వామి రథోత్సవం జూన్ 27 తేదీన జరిగింది. అక్కడ స్థానికులు రథోత్సవం అనంతరం 15 రోజులు ఎటువంటి పూజలు చేయరని దీంతో అరటి వినియోగం తగ్గిందని అంటున్నారు. ఒడిశాలో ఇలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా సరకు ఉండటంతో ఇక్కడ అరటి వెళ్లడం లేదని, వెళ్లినా ధర ఉండటం లేదని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలో అరటి ధరల్లో వ్యత్యాసాలు అరటి రకం మే నెల ప్రారంభంలో ధరలు ప్రస్తుత ధరలు కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట కర్పూర 200 600 100 300 చక్కెర కేళీ (తెలుపు) 300 700 200 500 బుషావళి 150 400 100 250 బొంత(కూరఅరటి) 150 400 100 300 అమృతపాణి 250 700 200 450 చక్కెర కేళీ(ఎరుపు) 300 800 200 600 శ్రావణమాసం కోసం ఎదురుచూపులు అరటి రైతులు, వ్యాపారులు మరో 15 రోజుల్లో వచ్చే శ్రావణమాసం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అరటి ధర లేకపోవడం, దిగుబడి అన్ని ప్రాంతాల్లో ఉండటంతో శ్రావణమాసం వస్తే పూజలు జరుగుతాయని, మన రాష్ట్రంతో పాటు ఒడి శాలో కూడా వినియోగం పెరుగుతుందని రైతులు, వ్యాపారులు శ్రావణం కోసం ఆశగా చూస్తున్నారు. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, ఊబలంక అరటి రైతుకు నష్టం వస్తుంది ప్రసుత్తం అరటికి ధర పలకడం లేదు. మార్కెట్కు గెలలు తీసుకురావడానికి సైకిల్కు రూ.300 కూలి ఇవ్వాల్సి వస్తుంది. కనీసం ఆ డబ్బు మిగులుతుందని పొలాల వద్దకు వస్తున్న వ్యాపారులకు వచ్చిన రేటుకే రైతులు గెలలు అమ్ముతున్నారు. ప్రారంభంలో వచ్చిన లాభాన్ని, పెట్టుబడిని కూడా ప్రస్తుత నష్టం అధిగమిస్తుండటంతో అరటి రైతులకు ఈ ఏడాది కలిసిరాలేదు. – కె.పెద్దిరెడ్డి, కౌలు రైతు, ఊబలంక రెండు నెలల్లో సగానికి ధర పడిపోయింది ఏప్రిల్, మే నెలలో ప్రారంభంలో ఉన్న ధర, ప్రస్తుతం లేదు, కర్పూర రకం సగానికి పడిపోయింది. దీంతో రైతులకు ఊహించని నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. మార్కెట్ ఇలానే ఉంటే రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ద్వారంపూడి నారాయణరెడ్డి, రైతు, రావులపాలెం. దిగుబడి ఉన్నా, రేటు లేదు ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగుంది. అయితే ప్రారంభంలో ఉన్న రేటు ఇప్పుడు లేదు. దీంతో చేల వద్దకు వస్తున్న వ్యాపారులకు వచ్చిన రేటుకు గెలలు విక్రయిస్తున్నాం. మార్కెట్ కి తీసుకువస్తే అదనంగా ఖర్చవుతుంది తప్ప ఉపకారం లేదు. ఈ పరిస్థితి మారితేనే రైతుకి కొంత ఊరట లభిస్తుంది. శ్రావణమాసమైన ధర బాగుండాలని కోరుకుంటున్నాం. బి పెద్దిరాజు, రైతు, ర్యాలీ . -
కొనసాగుతున్న నీటి ఉధృతి
అయినవిల్లి: గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం వృద్ధగౌతమి (తొగరపాయ)పాయలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వృద్ధగౌతమి నదిపై పాత వంతెన ముంపునకుగురైంది. చింతనలంక, మడుపల్లిలంక, శానపల్లిలంక,వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, పొట్టిలంక గ్రామాల్లోని పల్లపు భూముల్లో పంట చేలు వరద నీట మునిగాయి. కూరగాయ, అరటి తదితర పంటలు నీట మునిగాయి. వరదనీటి ముంపు వల్ల పంటలు పూర్తి నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్తేశ్వరం–కోటిపల్లి రేవులో వదర ఉధృతి కొనసాగుతోంది. లంక గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న పాడి పశువులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పడవలపై తరలిస్తున్నారు. -
వరద నీటి బెడద
నదీపాయల్లోనూ..వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. కోనసీమ జిల్లా సరిహద్దులో ఉన్న పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాల ప్రజలు మండలంలోని వైవీ పాలెం ఏటిగట్టు నుంచి పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో పడవపై వెళ్తున్న లంక గ్రామాల ప్రజలు -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
బాలాజీస్వామికి దండిగా ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉభయ దేవేరులతో కొలువైన స్వామివారికి సుప్రభాత సేవతో మేలు కొలుపు చేసి తొలి హారతి ఇచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,75,490 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,00,480 విరాళంగా అందించారన్నారు. 5,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. 3,200 మంది స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలు కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,73,820 ఆదాయం వచ్చినట్లు ఈఓ సురేష్బాబు తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.41,203 రాగా మొత్తం 2,15,023 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు భక్తులకు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీ/అదనపు డీజీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ సతీ సమేతంగా శనైశ్చరుని దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. దోమల నివారణకు చర్యలు జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు కొత్తపేట: డ్రెయిన్లు, మురుగునీటి నీటి గుంటలు, నీటి నిల్వల్లో గంబూషియా చేపలను వదలి దోమలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో దోమల లార్వాను నియంత్రించి, తద్వారా దోమల నివారణపై వైద్య, ఆరోగ్య శాఖ కొత్తపేట, రావులపాలెం సబ్ యూనిట్ల పరిధిలోని ఆరు మండలాల హెల్త్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. జిల్లాలో డ్రైన్లు, నీటి నిల్వల్లో లార్వా నియంత్రణకు మత్స్యశాఖ కడియం హేచరీస్ నుంచి 1.50 లక్షల గంబూషియా చేపలను తీసుకువచ్చి వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 60 రెసిడెన్షియల్ హాస్టళ్లు ఉన్నాయని, అన్ని హాస్టల్స్లోనూ లోపలి గోడలకు ఏసీఎం 5 శాతం మందు పిచికారీ చేయించినట్టు తెలిపారు. జిల్లాలో 49 గ్రామీణ పీహెచ్సీలు, 7 అర్బన్ పీహెచ్సీల ద్వారా గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటినీ సందర్శించి సీజనల్ వ్యాధులపై సర్వే చేస్తున్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 15 డెంగీ, 2 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర పంచాంగకర్తల విద్వత్ సభలు అమలాపురం టౌన్: అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ కాసు కళ్యాణ మండపంలో ఆదివారం నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పంచాగ కర్తల విద్వత్ సభలు జరుగుతాయని మహాసంఘ్ సభ్యుడు, అమలాపురం పంచాంగ కర్త ఉపద్రష్ట నాగాదిత్య తెలిపారు. అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ (ఏబీబీఎం) ఉభయ తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు డాక్టర్ నిట్టల వీఎస్ఆర్ కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు జిల్లాలోని పంచాంగ కర్తలు ఈ సమావేశాలకు విధిగా హాజరై విజయవంతం చేయాలని నాగాదత్య విజ్ఞప్తి చేశా రు. 15న పంచాంగకర్తలకు శ్రీగురు పురస్కారా లు అందజేస్తుందని వివరించారు. భారతీయ తె లుగు దృక్ గణిత సమాఖ్య సేవా సంఘం కూడా విద్యత్ సభలకు సహకరిస్తోందని తెలిపారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదాలు అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
ముంచెత్తుతున్న వరద
వరద పెరిగితే మరింత ముప్పు ఈ వరదే ఆదివారం ఉదయానికి కాస్త పెరిగితే ఆయా మండలాల్లోని లంక గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంది. వరద మొదటి ప్రమాద హెచ్చరిక అనివార్యమైతే కోనసీమలోని ప్రధానంగా 21 లంక గ్రామాలకు ముంపు ముప్పు తప్పదు. పి.గన్నవరం మండలంలో లంక గ్రామాలైన జి.పెదపూడి లంక, అరిగెల వారిపాలెం, బూరుగులంక తదితర గ్రామాలను వరద ముంచెత్తే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక పి.గన్నవరం మండలం చాకలిపాలేనికి సమీపంలోనే ఉంటుంది. కనకాయపేటలోని కాజ్వే కిందకు వరద నీరు ఉధృతంగా చేరుతోంది. పి.గన్నవరం మండలంలో తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికే నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమలాపుం టౌన్: జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు వరద ముప్పుపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలను వరద చుట్టుముడుతోంది. ఇక జిల్లాలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు ఎర్ర నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పి.గన్నవరం మండలం జి.పెదపూడి లంకకు వెళ్లేందుకు నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో లంక వాసుల్లో ఆందోళన మొదలైంది. అలాగే అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన ముక్తేశ్వరం–కోటిపల్లి తాత్కాలిక రహదారిలో వరద అవస్థలు మొదలయ్యాయి. పడవ ప్రయాణాలపై అప్రమత్తంగా అంతకంతకు పెరుగుతున్న వరదతో పడవ ప్రయాణాలకు దాదాపు తెరపడింది. అయితే పలు లంక గ్రామాల ప్రజల రాకపోకలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పడవల్లో అత్యంత జగ్రత్తలతో చర్యలు తీసుకున్నారు. వదర వల్ల కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద గోదావరిలో పంటు ప్రయాణాలు నిలచిపోయాయి. పోలవరం, భద్రాచలం వద్ద పెరుగుతున్న వరదతో జిల్లాలోని లంక గ్రామాలపైన, నదీ పాయలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆదివారం నాటికి కోనసీమలోని అప్పనపల్లి, ముక్తేశ్వరం, చాకలిపాలెం వద్ద గల కనకాయలంక కాజ్వేలు ముంపున పడే ప్రమాదం ఉంది. ఈ కాజ్వేలు ఉన్న ప్రాంతాల్లో పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగించాల్సివస్తోంది. కోటిపల్లి–ముక్తేశ్వరం రేవులో తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడం, పంటు ప్రయాణాలు నిలిపివేయడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగవకు మిగులు జలాలు పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో కోనసీమ జిల్లాకు క్రమేపీ వరద పెరుగుతోంది. జిల్లాలో పి.గన్నవరం, అయినవిల్లి, కె.గంగవరం, కపిలేశ్వరపురం, మామిడికుదురు, ముమ్మిడివరం,ఐ.పోలవరం మండల్లాలోని తొలుత పల్లపు ప్రాంతాలకు వరద నీరు చేరుతోంది. తొగరపాయ వంతెనను తాకితే కాజ్వే మునకే అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని పాత తొగరపాయ వంతెనను వరద నీరు తాకుతోంది. ఈ పాత వంతెన మునిగితే సమీపంలోని కాజ్వే కూడా మునిగిపోతోందని ఆ మండలంలోని లంక వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముక్తేశ్వరం–కోటిపల్లి మధ్య గౌతమీ నదీ పాయపై నిత్యం వేలాదిమంది ప్రయాణికులను రేవు దాటించే పంటు ప్రయాణాలకు బ్రేకులు పడ్డాయి. కె.గంగవరం మండలం కోటపల్లి వద్ద గౌతమి నది వరద నీటితో క్రమేపీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఆదివారం ఉదయానికి వరద పెరిగితే కోటిపల్లిలోని మత్స్యకార కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే సఖినేటిపల్లి–పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య వశిష్ట నదీపాయపై సాగుతున్న పంటు ప్రయాణాలు, అలాగే రాజోలు మండలం సోంపల్లి–అబ్బిరాజుపాలెం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలను కలిపే జి.మూలపొలం– పల్లంకుర్రు గ్రామాల మధ్య రేవు ప్రయాణాలు నిలిచిపోయే అవకాశం ఉంది. లంక గ్రామాల ప్రజల ఆందోళన పల్లపు ప్రాంతాలకు ముంపు ముప్పు ఎర్రనీటితో పొంగుతున్న నదీపాయలు -
బీమా.. భారమే!
వరినాట్లు వేస్తున్న రైతు కూలీలు ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా దెబ్బతిన్న వరిపంటను చూపుతున్న అన్నదాత (ఫైల్)● అన్నదాతను ముంచిన కూటమి ప్రభుత్వం ● ఎకరాకు రూ.769 ప్రీమియం పిడుగు ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా చర్యలు ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైనా సకాలంలో విత్తనాలు, ఎరువులను సరఫరా చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం అన్నదాతపై మరో పిడుగు పడేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకం (పీఎంఎఫ్బీవై) ప్రీమియం భారాన్ని గత వైఎస్సార్ సీపీ చెల్లించి అన్నదాతను ఆదుకుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందించకపోగా వివిధ పథకాలను రద్దు చేసి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు చెల్లిస్తామన్న హామీ ఏడాది పూర్తయినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ధాన్యం సొమ్ములను సకాలంలో విడుదల చేయపోవడంతో రైతులు అప్పులు తెచ్చి ఖరీఫ్ సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.06 లక్షల మంది వరి సాగుచేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్నా ఫసల్ బీమాపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంపై పంటల బీమా ప్రీమియంను రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్కు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమా వర్తించదని వ్యవసాయశాఖ చెబుతుండటంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం భారం రూ.12.45 కోట్లు రైతులను ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2016లో ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.769 ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. అయితే 2019 రబీ పూర్తయ్యే వరకూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉచిత పంటల భీమాను అమలు చేయకుండా రైతులపై ప్రీమియం భారం వేసింది. 2019 మే 30న అధికార బాధ్యతలు చేపట్టిన అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం ఫసల్ బీమా ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకుని లక్షలాది మంది రైతులకు ఆసరాగా నిలిచింది. కూటమి ప్రభుత్వం నేటికీ స్పందించకపోవడంతో ప్రతి సీజన్కు రూ.12.45 కోట్లు ప్రీమియం చెల్లింపుల భారం అన్నదాతపై వేస్తోంది. బీమాతో ప్రయోజనాలెన్నో ప్రధానమంత్రి ఫసల్ యోజన ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. వాతావరణ పరిస్థితు ల ప్రభావంతో తుపానులు, వరదలు వంటి ప్రకృతి వై పరీత్యాలు సంభవించినప్పుడు పంటకు నష్టం వాటిల్లి తే సత్వరమే రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. రైతు నష్టపోతే వ్యవసాయశాఖ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తే 72 గంటల లోపు సంబంఽధిత బీమా సంస్థ స్పందించి పరిహారం మంజూరు చే స్తుంది. జిల్లాలో కొంతమంది రైతులు బ్యాంకులు, సొ సైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతుల నుంచి ప్రీ మియం సొమ్మును మినహాయించుకుని మిగిలిన సొ మ్మును రైతు ఖాతాలో జమ చేస్తారు. అలాగే రుణాలు తీసుకోని రైతులతో పాటు కౌలు రైతులు ఫసల్ బీమా చెల్లించకుంటే పరిహారం అందే అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం సుమారు 60 లక్షల మంది మాత్రమే పంట రుణాలు తీసుకుని ప్రీమియం చెల్లించారు. మిగతా రైతులు మాత్రం సొంతంగా పంటల బీమా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. బీమా లేకుంటే దక్కదు ధీమా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు ఉచిత పంటల బీమా వర్తింపజేయలేదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదు. ఈ ఏడాది వర్షాలు, తుపానులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రీమియం చెల్లించని రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్క రూపాయి కూడా మంజూరు కానందున సత్వరమే రైతులందరూ ప్రీమియం చెల్లించి పంటలను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఇక ఉచిత పంటల బీమా అమలు చేయదని ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందేనని రైతులు ఒక అభిప్రాయానికి వచ్చారు. దీంతో ప్రతి రైతుకు ఎకరాకు రూ.769 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచిత బీమా అమలు చేయాల్సిందే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా దిరిగా ఉచిత పంటల బీమా అమ లు చేసి రైతులను కూటమి ప్రభు త్వం ఆదుకోవాలి. వ్యవసాయం చేయడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రీమియం భారాన్ని రైతులను భరించమనడం సరికాదు. దీని పై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలి. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులపై తీవ్రమైన భారం పడుతోంది. – గుణ్ణం రాంబాబు, రైతు, సర్పంచ్ గుమ్మిలేరు, ఆలమూరు మండలం కౌలు రైతులకు పెనుభారం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయకపోవడం వల్ల కౌలురైతులపై పెనుభారం పడుతోంది. రైతుకు ఎకరాకు రూ.769 భారం వేయడం సరికాదు. వరి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు భారం వేయడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు ఒక పైసా ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తించింది. – కోట బూరయ్య, రైతు -
సారె.. అచ్చెరువొందేలా!
అమలాపురం రూరల్: శ్రీనివాస అన్నదాన మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో పద్మావతి, అలివేలు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు, మిఠాయిలు చీర, సారె సమర్పించారు. ఆలయ అర్చకుడు బీరక భీమ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత సంప్రదాయ బద్ధంగా ముత్తైదువులు సారెను కోలాటంతో ఊరేగింపుగా ఆలయ సన్నిధికి తీసుకువచ్చారు.గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అమలాపురం రూరల్: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన, చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం లింగ నిర్ధారణ నిషేధత చట్టం – 1994 అమలుపై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ సలహాకమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ చేసే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఎం.దుర్గారావు దొర, అదనపు డీఎంహెచ్ఓ భరత లక్ష్మి, అదనపు జిల్లా ఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం : జనాభా పెరుగుదలపై అవగాహన పెంచడానికి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు. ఆరోగ్యం, విద్య అందరికీ సమా న అవకాశాలను కలిగించే సమ్మిళిత విధానాలను ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించాలన్నారు. -
లంకలపై గోదావడి
● ముంచుకొస్తున్న వరద నీరు ● పి.గన్నవరంలో నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ ● పడవలపై ప్రయాణాలు ● ముక్తేశ్వరం – కోటిపల్లి రేవు బంద్ ● కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ● ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఉదయం 2.82 లక్షల క్యూసెక్కుల విడుదల ● సాయంత్రానికి 3.54 క్యూసెక్కులకు చేరిక సాక్షి, అమలాపురం: గోదావరి ఉరకలేస్తోంది. అఖండ గోదావరిలో వరద పెరుగుతుండగా.. దిగువ నదీపాయలలో లంకలను వరద తాకుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు మిగులు జలాలు పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో కోనసీమ జిల్లాలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వారం రోజుల క్రితం పెరిగి తగ్గిన వరద గురువారం నుంచి తిరిగి పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2,45,910 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. వచ్చిన నీటిని తూర్పు డెల్టాకు 4 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,450 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6,500 చొప్పున 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు 2,32,160 క్యూసెక్కులను విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో వరద మరింత పెరగడంతో దిగువకు 3,54,341 క్యూసెక్కులను వదిలిపెట్టారు. పోలవరం, భద్రాచలం వద్ద వరద పెంపు ప్రభావం జిల్లాలోని లంక ప్రాంతాలపై పడింది. పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు మండలాలోని లంక గ్రామాలను వరద నీరు తాకుతోంది. ఇక పడవ ప్రయాణాలే.. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక వెళ్లే తాత్కాలిక రహదారి వరదకు కొట్టుకుపోయింది. దీనితో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఊడిముడిలంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు నేరుగా రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా యంత్రాంగం ఇక్కడ పడవలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, మహిళలు, రైతులు, స్థానికులు రోజువారీ ప్రయాణాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ గ్రామాలకు చెందినవారు నవంబరు నెలాఖరు వరకు అంటే ఇంచుమించు నాలుగు నెలలకు పైగా ఇక పడవల మీదే రాకపోకలు చేయాల్సి ఉంది. వరద ఉధృతి మరింత పెరిగే కొద్దీ స్థానికుల కష్టాలు రెట్టింపు కానున్నాయి. వరదలకు గ్రామాల్లో ఇళ్లల్లోకి ముంపు నీరు చేరుతుంది. ఈ సమయంలో స్థానికులు డాబాలు, మేడలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే తాత్కాలిక పునరావస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిందే. రైతులు పండించే పంటలను పడవల మీద తరలించాల్సి వస్తుంది. ఇది వారికి భారం కానుంది. వరద ఉధృతి పెరిగితే పంటలు నష్టపోవడం పరిపాటి. విద్యార్థులు, మహిళలు, అనారోగ్య బాధితులు ఈ నాలుగు నెలలు పడవలపై ప్రయాణాలు చేయడం తప్పని పరిస్థితి. వరద మరింత పెరిగితే రెండో వైపు ఉన్న కాజ్వే సైతం ముంపు బారిన పడి ఈ లంక వాసులు అక్కడ కూడా మరోసారి పడవల మీద ప్రయాణం చేయాల్సి ఉంది. ఇదే మండలాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక, అనగారిలంక, పుచ్చల్లంక వాసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల అవస్థలను చూసి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊడిముడిలంక వంతెనకు రూ.49 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్త నడకన సాగుతున్నాయి. పనువు వేగంగా సాగి ఉంటే స్థానికుల కష్టాలు చాలా వరకు తీరేవి. కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు ప్రయాణం సైతం నిలిచిపోయింది. ఇక్కడ కూడా గౌతమి ఉధృతికి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి సైతం కొట్టుకుపోయింది. ఈ కారణంగా రేవు మూసివేశారు. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కోటిపల్లి మీదుగా రామచంద్రపురం, కె.గంగవరం మండలంలోని గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు వీరంతా ఇటు రావులపాలెం, జొన్నాడ మీదుగా లేదా అటు ముమ్మిడివరం, యానం మీదుగా రాకపోకలు చేయాల్సి ఉంది. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలకు రేవు ప్రయాణాలు నిలిచిపోవడం భారంగా మారనుంది. వరద ఉధృతి పెరిగితే సఖినేటిపల్లి – నరసాపురం, సోంపల్లి – అబ్బిరాజుపాలెం, జి.మూలపొలం – పల్లంకురు రేపు ప్రయాణాల సైతం నిలిచిపోను న్నాయి. -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
కాకినాడ క్రైం: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని, నిందితులకు నేర చరిత్ర ఉన్న విషయాన్ని దాస్తున్నారని ఆరోపించారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్శాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
తీరంపై జలఖడ్గం
● కోతకు గురవుతున్న విలువైన భూములు ● దివిసీమ ఉప్పెన నుంచీ ఆటుపోట్లు ● ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం ● వందలాది ఎకరాలు ఇప్పటికే కనుమరుగు ● రక్షణ చర్యల్లో అధికారులు విఫలం మలికిపురం: సముద్ర తీరప్రాంత భూముల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఇక్కడ సముద్ర అలల ఉధృతి అధికంగా ఉండడం వల్ల విలువైన పేదల భూములు, పేదలకు పట్టాలుగా ఇచ్చిన భూములు కోతకు గురై కనుమరుగవుతున్నాయి. మామిడికుదురు మండల కరవాక గ్రామం నుంచీ మలికిపురం మండలం గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం, అంతర్వేది కర, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం గ్రామాల సముద్ర తీర భూములు ఇలా కోతకు గురవుతున్నాయి. ఇక ప్రధానంగా సముద్రంలో వెళ్లే ఓడల రాక పోకలు మార్గ నిర్దేశకంగా అంతర్వేది పల్లిపాలెం వద్ద ఉన్న లైట్హౌస్కు కూడా సముద్ర అలల వల్ల ముప్పు పొంచి ఉంది. ఇక్కడ సముద్రం నానాటికీ ముందుకు చొచ్చుకువస్తోంది. 1980 దశకంలో దివి సీమ ఉప్పెన సమయంలో లైట్హౌస్కు సమీపంలోని పల్లిపాలెం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో ప్రమాదం ముందే ఊహించిన ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం పల్లిపాలెం కొత్తగా ఏర్పడ్డది. అప్పటి లైట్హౌస్ కొట్టుకుపోవడంలో నౌకాదళం కొత్తగా లైట్హౌస్ నిర్మించింది. ఉప్పెన తరువాత 2010 వరకూ ఇక్కడ భూభాగం విస్తరించింది. మొత్తం బయటపడక పోయినా కొట్టుకుపోయిన పాత లైట్హౌస్ బయటపడి వందలాది ఎకరాలు మేటలు వేసింది. అప్పట్లో భూములు పోగొ ట్టుకున్న యజమానులతో పాటు ఆక్రమణదారులు కూడా ఈ భూములను సాగు చేసుకున్నారు. అయితే 2010 నుంచి పూర్వపు స్థితి పునరావృతం అవుతోంది. 2010 నాటికి లైట్హౌస్కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం ప్రస్తుతం లైట్హౌస్ను తాకుతోంది. 2006 సునామి సమయంలో కూడా సముద్రం ఇంత ఉధృతంగా లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక్క అంతర్వేది కర నుంచి పల్లిపాలెం వరకూ మాత్రమే ఈ పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్ప నుంచి పేరుపాలెం వరకూ ఈ పరిస్థితి కొనసాగుతోంది. సముద్రంలో మేటలు కూడా అంతర్వేది పల్లిపాలెం సాగర సంగమ ప్రాంతం. నాసిక్లో పుట్టిన గోదావరి అఖండ గోదావరిగా మారి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తోంది. డెల్టా ప్రాంతం కావడంతో అనాదిగా ఇక్కడ గోదావరి ప్రవాహంలో మట్టి వచ్చి సముద్రపు మేటల వేయడం వల్ల క్రమేపీ భూభాగం పెరుగుతూ వచ్చింది. తాజాగా ఈ భూములు పెరగడం అటుంచి ఉన్న భూమి కోతకు గురవుతోంది. పదేళ్ల క్రితం వరకూ సాగర సంగమం సమీపంలో సముద్రం మధ్యలో వేసిన భారీ ఇసుక మేటలు కూడా ప్రస్తుతం కనుమరుగయ్యాయి. పేదలు నష్టపోతున్నారు సముద్ర తీర గ్రామాలలో అలల కోత అధికంగా ఉంటుంది. దానివల్ల విలువైన భూములు కోతకు గురై సముద్రంలో కలసిపోతున్నాయి. ఎస్సీ సొసైటీలకు ప్రభుత్వ పరంగా సంక్రమించిన ఈ భూములలో సాగవుతున్న సరుగుడు తోటలు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. – కొంబత్తుల చంద్రశేఖర్, సొసైటీ మాజీ అధ్యక్షులు, శంకరగుప్తం రక్షణ చర్యలు తీసుకోవాలి తీర ప్రాంత సొసైటీ, జిరాయితీ భూములలో సరుగుడు తప్ప వేరే సాగు ఉండదు. ఇలా వచ్చే కొద్దిపాటి సంపాదనే ఇక్కడి పేదల జీవనాధారం. దీనిపై రక్షణ చర్యలుతీసుకుని కోతను అరికట్టాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం. గతంలో అధికారులు పరిశీలించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. – తాడి నీలకంఠం, అంతర్వేది ఇక వలస పోవాల్పిందే సముద్ర ఉధృతికి తీరం కోత, ఉప్పునీరు ముంచెత్తడం వంటి సమస్యలతో విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. కొబ్బరి, సరుగుడు తోటలు నాశనం అయ్యాయి. ప్రభుత్వం శ్రద్ద పెట్టక పోతే ఈ గ్రామాల రైతులు వలసపోవాల్సిందే. – యెనుముల నాగు, సర్పంచ్, కేశనపల్లి వందల ఎకరాలు సముద్రం పాలు ఇప్పటికే సముద్ర తీరం వెంబడి వందలాది ఎకరాల్లో సరుగుడు, కొబ్బరి తోటలు కెరటాల ఉధృతికి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అనేక మంది రైతులు విలువైన భూములను నష్టపోయారు. ఉన్న భూములనైనా కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులను ముక్త కంఠంతో కోరినా స్పందన లేదు. లైట్హౌస్కు ముప్పే దివిసీమ ఉప్పెన ప్రభావంతో లైట్హౌస్తో పాటు, పల్లిపాలెం గ్రామం జలమయమైంది. అప్పట్లో ఇక్క డ ఉన్న మత్యకారులు కొందరు జలసమాధి కాగా కొందరు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డా రు. అప్పటి లైట్హౌస్ కొట్టుకుపోవడంతో కొత్త లైట్ హౌస్ నిర్మించారు. తాజాగా అలల ఉధృతికి దానికి కూడా ముప్పు పొంచిఉందని స్థానికులు చెప్తున్నారు. -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న సుగుణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. అత్యధిక స్థాయిలో ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. -
డొక్కలెండుతున్నాయ్!
● కొండెక్కిన కొబ్బరి కాయలు ● తిరోగమనంలో డొక్క ధర ● రైతుల వద్ద టన్నుల కొద్దీ నిల్వలు ● రెండు నెలల కిందట ట్రాక్టర్ సరకు రూ.1,500 ● ఇప్పుడు రూ.500 ఎదురు ఇచ్చి ఎగుమతులు సాక్షి, అమలాపురం: కొబ్బరి ధర కొండెక్కింది.. రికార్డు స్థాయిలో పెరిగింది.. దానికి తగ్గట్టు పెరగాల్సిన పీచు ఉత్పత్తుల ధర తిరోగమనంలో కొట్టుమిట్టాడుతుంది.. ఇలా పీచు పరిశ్రమ విలవిల్లాడుతోంది.. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న కొబ్బరి డొక్క రైతులకు శిరోభారంగా మారింది. అత్యంత విలువైన డొక్క కొంత రోడ్ల వెంబడి, తోటల్లో చెత్తగా మారిపోతుండగా, మరికొంత అగ్నికి ఆహుతవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పీచు పరిశ్రమ అత్యంత పెద్దది. కొబ్బరి సాగు జరుగుతున్న ప్రాంతాల్లో పీచు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు భారీ ఎత్తున ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాలు ఉంది. ఇక్కడ కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో క్వాయర్ ఉత్పత్తులది అగ్రస్థానం. విలువ ఆధారిత పరిశ్రమల్లో 80 శాతం క్వాయర్ ఆక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 వరకూ చిన్న, పెద్దా పీచు ఉత్పత్తి కేంద్రాలు ఉంటే, ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 740 వరకూ పీచు, తాళ్ల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీచు ఉత్పత్తి కేంద్రంలో రోజుకు టన్ను నుంచి ఐదు టన్నుల వరకూ పీచు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి రూ.125 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అంచనా. ఎగుమతుల్లో సింహభాగం అంటే 70 శాతం చైనాకు వెళ్తుండగా, మిగిలిన ఎగుమతి మలేషియా, సింగపూర్, జపాన్తోపాటు గల్ఫ్, యూరప్ దేశాలకు ఉంటుంది. అంతకంతకూ పతనం ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.22 పలుకుతోంది. కానీ విచిత్రంగా కొబ్బరి పీచు ధరలు మాత్రం పతనమయ్యాయి. ఎగుమతులూ తగ్గాయి. తడి పీచు కిలో రూ.ఆరు పలుకుతుండగా, పొడి పీచు రూ.8 వరకూ ఉంది. తడి పీచు ఎండబెట్టి బేళ్లుగా మార్చి విక్రయిస్తే కిలో రూ.12 వరకూ వస్తోంది. కానీ పెట్టుబడి వ్యయం పెరగడంతో గిట్టుబాటు కావడం లేదు. తడి పీచు సగటు ధర కిలో రూ.తొమ్మిది వరకూ ఉండగా, ఇప్పుడు రూ.ఆరుకు చేరింది. చివరకు కొబ్బరి తాళ్ల ధరలు సైతం తగ్గాయి. 24 అడుగుల 100 ముక్కల కట్ట హైదరాబాద్ మార్కెట్లో రూ.150 మాత్రమే ఉంది. గతంలో ఇది రూ.220 వరకూ పలికేది. ముంబయికి వెళుతున్న తాళ్లకు మాత్రం రూ.180 వరకూ వస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం ఇటీవల కాలంలో పీచు, తాళ్లు, కొబ్బరి పొట్టు వంటి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగింది. పీచు పరిశ్రమ నష్టాలకు ఇది కొంత కారణమవుతోంది. ఒక్క కార్మికుడికి రోజు వేతనం రూ.600 వరకూ ఉంది. ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత కార్మికుల సంఖ్య తగ్గిందని, కానీ వారికి చెల్లించే జీతం పెరిగిందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లుల షాక్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పీచు పరిశ్రమల యజమానులకు విద్యుత్ చార్జీల షాక్ తగులుతోంది. యూనిట్ విద్యుత్ ధర రూ.ఆరు. కానీ అదనపు లోడు వినియోగం, ఇంధన చార్జీలు, అపరాధ రుసుం పేరుతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. యూనిట్ ధర రూ.10 నుంచి రూ.12 వరకూ కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. నాలుగు వేల యూనిట్లు వచ్చే మధ్య తరహా పరిశ్రమకు రూ.24 వేల విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, కొంతమందికి రూ.40 వేల వరకూ వస్తోంది. ఎక్కడికక్కడే పేరుకుపోయి.. రెండు నెలల కిందట టన్ను కొబ్బరి డొక్కను స్థానిక పీచు ఉత్పత్తిదారులు రూ.1,500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు నిలిచిపోవడంతో కొబ్బరి తోటల్లో డొక్క టన్నుల కొద్దీ ఉండిపోయింది. ఈ డొక్కను ఉచితంగా తీసుకు వెళ్లాలని రైతులు పరిశ్రమల యజమానులను వేడుకుంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఎదురిచ్చి వదిలించుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తి తగ్గడం వల్ల అక్కడ పీచు పరిశ్రమల యజమానులు రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి డొక్క కొనుగోలు చేసి తీసుకు వెళ్తుండడం గమనార్హం. ఇక్కడ తోటల్లో పేరుకుపోయిన డొక్కను నిర్జీవ ప్రాంతాలకు తరలించడం, లేకుంటే తగలబెట్టడం చేస్తున్నారు. భారీ పరిశ్రమలు రావాలి పీచు పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే జిల్లాలో భారీ పరిశ్రమలు రావాలి. ఒక్కో పరిశ్రమ వద్ద పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు కావాలి. ప్రతి మండలంలో క్వాయర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రైమిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)లో ఇప్పుడు రూ.50 లక్షల వరకూ రాయితీతో కూడిన రుణం ఇస్తుంది. ఇది కనీసం రూ.కోటికి పెంచాలి. అప్పుడు పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. – వేగి వెంకటేశ్వరరావు, డైరెక్టర్, కోనసీమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్ యాంత్రీకరణ అవసరం తమిళనాడు పీచు ఉత్పత్తిదారులు ఒక్కడి కొబ్బరి డొక్కను కొనుగోలు చేసి పీచు ఉత్పత్తి చేస్తున్నారు. కొనుగోలు, రవాణా ఖర్చులు భారమే అయినా వారికి లాభాలు వస్తున్నాయి. మన పీచు ఉత్పత్తిదారులకు ఆధునిక యంత్రాలు లేక లాభాలు రావడం లేదు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల వద్ద డొక్క వృథాగా పేరుకుపోతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. – పెదమల్లు నాగబాబు, క్వాయర్ రంగ నిపుణుడు, పాశర్లపూడిలంక -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో సామాజిక సమతూకం
పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట: వైఎస్సార్ సీపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని కమిటీల్లో సామాజిక సమతూకం పాటిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా కమిటీలో కొత్తపేట మండలం పలివెలకు చెందిన షేక్ వల్లీబాబా సెక్రటరీ యాక్టివిటీగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన నియోజకవర్గ ముస్లిం నాయకులతో కలసి గురువారం రావులపాలెం మండలం గోపాలపురంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ముస్లిం సంప్రదాయ టోపీ అందించి సత్కరించారు. ప్రతిగా జగ్గిరెడ్డి వల్లీబాబాను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కమిటీల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించడంలో భాగంగా వల్లీబాబాకు సెక్రటరీ యాక్టివిటీగా పదవి ఇచ్చామన్నారు. ముస్లింలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రావులపాలెం పెద్ద, చిన్న మసీదుల అధ్యక్షులు బాషా, మీరా, ఉపాధ్యక్షుడు జహంగీర్, కోశాధికారి జహంగీర్, సభ్యులు సందాని, అమీర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి వైద్యానికి చేయూత రావులపాలెం: ఆరేళ్ల చిన్నారి వైద్యానికి రావులపాలెం కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు రూ.1.25 లక్షల సాయం అందించారు. పెరవలి గ్రామానికి చెందిన కళ్యాణి మౌనిక (6) నాలుగు నెలల కిందట కాగితాలు వెలిగించి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ శరీరమంతా కాలిపోయింది. ఇప్పటి వరకూ రెండు సర్జరీలు చేశారు. ఇంకా వైద్యం అందించాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగాక చిన్నారి పరిస్థితి చూసి బెంగతో ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబం కావడంతో సాయం కోసం కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులను ఆశ్రయించింది. దీంతో సంస్థ సభ్యులు పెరవలి వెళ్లి దాతల ద్వారా సేకరించిన మొత్తం రూ. 1.25 లక్షలను మౌనికకు అందజేశారు. పంచాయతీకి ‘పచ్చ’పాతం అమలాపురం రూరల్: గున్నేపల్లి అగ్రహారం పంచాయతీ కార్యాలయం పచ్చరంగును పులుముకుంది. ఇది టీడీపీ కార్యాలయాన్ని తలపించింది. పంచాయతీ కార్యాలయం ఆనుకుని ఎంపీపీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాన్ని మూసివేసేలా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, సర్పంచ్ పెద్దిరెడ్డి రాముతో ముద్రించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం పేరు కూడా కనిపించకుండా ఫ్లెక్సీని పెట్టడంపై విస్మయం చెందారు. పంచాయతీ కార్యాలయాల కు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, స్టిక్కర్లు, ప్రజాప్రతినిధుల ఫొటోలు అతికించరాదని నిబంధన ఉంది. అయినా ఇలా ఏర్పాటు చేసినా అధికారులు ప ట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది పంచాయతీ కార్యాలయమా.. లేక టీడీపీ కార్యాలయమా అని మండిపడ్డారు. రబీ ధాన్యం సొమ్ము విడుదలసాక్షి, అమలాపురం: జిల్లాలో రబీ ధాన్యం సొమ్ములు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం రెండు నెలల తరువాత ఈ సొమ్ములు విడుదల చేయడం గమనార్హం. జిల్లాలో 379 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 32,996 రైతుల వద్ద నుంచి రూ.620.98 కోట్ల విలువైన 2,69,986 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీనిలో 23,491 రైతుల ఖాతాల్లో రూ.432.11 కోట్లు చెల్లించారు. మిగిలిన 9,505 రైతులకు రూ.188.87 కోట్లను పెండింగ్లో ఉంచారు. వీటిని గురువారం చెల్లించినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. -
ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి
అనపర్తి: తన భార్య కొమ్ము బుజ్జిపై హత్యాయత్నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు దుప్పలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి(ఎన్వీ), అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత మహిళ భర్త సత్తిబాబు అన్నారు. గురువారం పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయిల్ వద్ద ఆయన తమ గోడు చెప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెప్పుకోవడానికి ఉదయం రామవరంలోని ఆయన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఫోన్ లాక్కుని దానిలో ఉన్న ఫొటో, వీడియో ఆధారాలను డిలీట్ చేసి సాయంత్రం ఫోన్ తిరిగి ఇచ్చారని సత్తిబాబు ఆరోపించారు. దీనిపై ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తానని ఇజ్రాయిల్ వద్ద సత్తిబాబు వాపోయారు. నెల రోజుల క్రితం కుక్కను తప్పించే క్రమంలో తన తోడల్లుడు వీరబాబు వృద్ధుడిని బైక్తో ఢీకొట్టాడని, ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేయగా వీరబాబు బెయిల్పై బయటకు వచ్చారన్నారు. పది రోజులుగా మాజీ సర్పంచ్ కుమారుడు ఎన్వీ విపరీతంగా వేధిస్తున్నాడని, దీంతో ఎన్వీ ఇంటికి వెళ్లగా రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీరబాబును చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తన భార్య బుజ్జి, వీరబాబుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సత్తిబాబు డిమాండ్ చేశారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు. -
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి ఫ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్ -
గోదారి ఇబ్బందులు
పి.గన్నవరం: వరద వచ్చేసింది.. నీటి ప్రవాహం ఉధృతమవుతోంది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తాత్కాలిక రహదారులు కొట్టుకుపోవడంతో వరదల సీజన్ తగ్గే వరకూ సుమారు మూడు, నాలుగు నెలల పాటు ఆయా లంక గ్రామాల ప్రజలు బయటకు రావాలంటే పడవలపైనే ప్రయాణించాలి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్ రాకపోకలకు బ్రేక్ అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. -
బుద్ధుని బోధనలతో ప్రపంచ శాంతి
మాజీ మంత్రి సూర్యారావు అమలాపురం రూరల్: గౌతమ బుద్ధుని బోధనలతో ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని బుద్ధ విహార్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. గురువారం అమలాపురం త్రిరత్న బుద్ధవిహార్లో ఆషాఢ బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. తొలుత బుద్ధుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ దలైలామా వారసుల ఎంపికలో చైనా పాత్ర ఉండని, దాని సర్వాధికారం దలైలామాదేనని అన్నారు. దాలైలామా మరణానంతరమే వారసులను ఎంపిక చేస్తారన్నారు. మానవాళి హింసను వీడి శాంతి మార్గం వైపు పయనించాలని గౌతమ బుద్ధుడు బోధించారన్నారు. బుద్ధ విహార్ జనరల్ సెక్రటరీ డీబీ లోక్, కమిటీ చైర్మన్ నాగాబత్తుల ప్రసాదరావు, ప్రతినిధులు పెనుమాల చిట్టిబాబు, కాశి వెంకట్రావు, దోనుపాటి నాగేశ్వరరావు, ఈవీవీ సత్యనారాయణ, బత్తుల రాజన్బాబు, కోడూరి శ్రీరామ్మూర్తి, గోసంగి ఆనందరావు, దోనుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి.. భక్తజన ఝరి
అన్నవరం: స్థానిక సత్యదేవుని సన్నిధిలో వ్యాసపూర్ణిమ (ఆషాఢ పూర్ణిమ) వేడుకలను గురువారం నిర్వహించారు. దర్బారు మండపంలో వ్యాస మహర్షికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రాంగణంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం నీరాజనమంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం వేదపండితులు పాల్గొన్నారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు వెయ్యి జరగ్గా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులు నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదం స్వీకరించారు. -
మెగా పేరెంట్స్ మీటింగ్.. కూటమి నాయకులకు దిమ్మ తిరిగిపోయింది!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాలనుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది. ఈరోజు(గురువారం, జూలై 10) జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండటం లేదంటూ ఆందోళనకు దిగారు. కేవలం మీటింగ్ల సమయంలోనే మాత్రమే పిల్లలకు మంచి భోజనాలు పెడుతున్నారని, మిగతా సమయాల్లో భోజనంలో నాణ్యత కరువైందని నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అందించిన బ్యాగులు కూడా ఏమాత్రం నాణ్యత లేవని ఓ విద్యార్థి తండ్రి ప్రశ్నించాడు. దాంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. తల్లిదండ్రుల నుంచి ఈ తరహా నిరసన ఎదురవుతుందని ఊహించని కూటమి నాయకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దిమ్మతిరిగి పోయిన ఈ ఘటనతో తల్లిదండ్రులను సముదాయించే యత్నం చేశారు కూటమి నాయకులు. -
గోదారి జలజడి
సాక్షి, అమలాపురం: గోదారి ఎరుపెక్కింది.. పరవళ్లు తొక్కుతూ ముందుకు వస్తోంది.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వేగంగా పరుగులు తీస్తోంది. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటు తగిలింది. కాటన్ బ్యారేజీకి నీరు వచ్చి చేరుతోంది. రెండు, మూడు రోజుల నుంచి వరద నీరు పెరగడం, తగ్గడం జరుగుతోంది. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు మాత్రం వరదల సీజన్ వచ్చింది. గోదావరికి వరద పోటు తగలడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు బుధవారం సాయంత్రం 2,30,624 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. వాస్తవంగా ఆదివారం 2,11,837 క్యూసెక్కులకు పెరిగి తరువాత తగ్గింది. తిరిగి పెరుగుతోంది. గోదావరికి ఈ ఏడాది వరదల సీజన్ ముందుగానే మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే ముందు ముందు వరద పెరిగే అవకాశముంది. ఈ నెల నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వరదల సీజన్. తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. జలదిగ్బంధమే.. గోదావరి వరద ఉధృతిని బట్టి జిల్లాలో ముంపు తీవ్రత అధికంగా ఉంటోంది. 18 మండలాల్లో 103 గ్రామాలు వరదల బారిన పడతాయి. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లోని లంక గ్రామాలకు తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక్కడ పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పలు గ్రామాలకు పడవల మీదనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొద్దిపాటి వరదకే పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, బూరుగులంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేటపై తొలి ప్రభావం ఉంటోంది. తరువాత ఇదే మండల పరిధిలో జొన్నలంక, మానేపల్లి శివాయలంక, పల్లెపాలెం, కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీ, తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ కొత్తలంక, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు మత్స్యకార కాలనీలో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరద పెరిగే కొద్దీ మిగిలిన ప్రాంతాల్లోనూ ముంపు అధికమవుతోంది. ఏటిగట్లు.. నిర్వహణకు తూట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి, గౌతమీ, వశిష్ట, వైనతేయ, కోరంగి నదులు సుమారు 260.80 కిలో మీటర్లు కాగా, వీటికి రక్షణగా నిర్మించిన ఏటిగట్టు పొడవు 535 కిలోమీటర్లు. ఇందులో కాటన్ బ్యారేజీ ఎగువన అఖండ గోదావరి కుడి, ఎడమ ఏటిగట్ల పొడవు 83.73 కిలోమీటర్లు. కాగా గౌతమీ కుడి, ఎడమ ఏటిగట్టు, కోరింగ ప్రాజెక్టు ఫ్లడ్ బ్యాంకులు కలిపి 204.70 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వశిష్ట, వైనతేయ కుడి, ఎడమ ఏటిగట్టు పొడవు 246.30 కిలోమీటర్లు. గౌతమీ ఎడమ ఏటిగట్టు పరిధిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి, కె.గంగవరం మండలం సుందరపల్లి, కూళ్ల శివారు ఎస్సీ పేట, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక వద్ద ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. గౌతమీ కుడి ఏటిగట్టు పరిధిలో కొత్తపేట మండలం బోడిపాలెం వంతెన వద్ద గట్టు ఆధునీకరణ జరగలేదు. భారీ వరద వస్తే ప్రమాదకరమే. వృద్ధ గౌతమీ కుడి గట్టు పరిధిలో కాట్రేనికోన మండలం కుండలేశ్వరం పుష్కరాల రేవు వద్ద గట్టు అత్యంత బలహీనంగా ఉంది. వైనతేయ కుడి ఏటిగట్టు పరిధిలో పి.గన్నవరం మండలం డొక్కా సీతమ్మ అక్విడెక్టు నుంచి నాగుల్లంక వరకూ ఏటిగట్టు లేదు. మానేపల్లి, నాగుల్లంక, మామిడికుదురు మండలం పాశర్లపూడి, పాశర్లపూడిబాడవ, పెదపట్నం వద్ద బలహీనంగా ఉన్నాయి. వశిష్ట ఎడమ ఏటిగట్టు పరిధిలో రాజోలు మండలం తాటిపాక మఠం వద్ద కొంత, రాజోలు సోంపల్లి, రాజోలు ఆంజనేయస్వామి ఆలయం నుంచి శివకోడు వరకు ఏటిగట్టు ఎత్తు, పటిష్ట పనులు చేయలేదు. మలికిపురం మండలం దిండి, రామరాజులంకలతోపాటు పెద్ద వంతెన వద్ద నుంచి సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లిలంక వరకు గట్టు బలహీనంగా ఉంది. పి.గన్నవరం ఎల్.గన్నవరం, మొండెపులంక లాకుల వద్ద ఇదే పరిస్థితి. లంక వాసుల్లో గుబులు కానరాని అధికారుల ముందస్తు చర్యలు నామమాత్రంగా సమీక్షలు పలుచోట్ల ఏటిగట్లు బలహీనం శిథిలావస్థలో ఫ్లడ్ స్టోరేజ్లు ఫ్లడ్ ‘స్టోరేజ్’ అంతంత మాత్రమే.. ఏటిగట్ల రక్షణ కోసం ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అధికంగా ఫ్లడ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫ్లడ్ స్టోరేజ్లు ఆరు కాగా, 15 పర్మినెంట్ ఫ్లడ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇవి కాకుండా వరదల సమయంలో 14 అడిషనల్ ఫ్లడ్ స్టోరేజ్లను ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని రకాల ఫ్లడ్ స్టోరేజ్లు ఏడు ఉండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 26, కాకినాడ జిల్లాలో మూడు చొప్పున ఉన్నాయి. వరద విపత్తులను తట్టుకునేందుకు, గట్లు గండ్లు పడకుండా ఇక్కడ సామగ్రి ఉంచేవారు. ఇటీవల కాలంలో ఫ్లడ్ స్టోరేజ్ ఆలనాపాలనను నీటిపారుదల శాఖ అధికారులు గాలికి వదిలేశారు. ఈ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో సామగ్రి ఉంచడం లేదు. జిల్లా యంత్రాంగం సైతం ఏటిగట్ల వద్ద వరదల సమయంలో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడం, కలెక్టరేట్ కేంద్రంగా ఒకటి రెండు సార్లు సమీక్షలు నిర్వహించడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల వరదల సమయంలో అటు లంక వాసులు మాత్రమే కాకుండా డెల్టా వాసులు కూడా భయం భయంగా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. -
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గణనకు షెడ్యూల్ విడుదల జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది. ప్రాధాన్యం ఇస్తే మేలు ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు 2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లాల వారీగా జనాభా వివరాలు జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ కోనసీమ కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సమన్వయంతో ముందుకు సాగాలి
వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ప్రసాద్ అమలాపురం టౌన్: నేర పరిశోధన, రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలు, బాధితులకు సత్వర న్యాయం వంటి ప్రధాన విషయాల్లో పోలీసులు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేసినప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలిపారు. వాటిపై ఇతర శాఖల అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని సమీక్షించారు. ముఖ్యంగా సరిహద్దు తగదాలపై రెవెన్యూ అధికారులు, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా రవాణా శాఖ అధికారులతో, బాలికలు, మహిళల భద్రతా విషయాలపై సోషల్ వెల్ఫేర్ శాఖతో ఎస్పీ చర్చించారు. విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక కమిటీల నియామకంపై అధికారులతో సమీక్షించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్బీపీ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.పార్ధసారథి, డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్ బాషా, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పి.జ్యోతిలక్ష్మి, జిల్లా హైవే అథారిటీస్ ఏఈ ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు. -
సహకార సీఈఓల ధర్నా
మలికిపురం: కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు ధర్నా చేశారు. ఈ మేరకు బుధవారం మలికిపురం డీసీసీబీ వద్ద నిరసనకు దిగారు. మలికిపురం బ్యాంక్ పరిధిలో 10 సహకార సంఘాల సీఈఓలు, సిబ్బంది పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈఓలు రామలింగేశ్వరరావు, ఆకుల బోగేశ్వరరావు, రంగరాజు, రామరాజు, జగదీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు మొక్కలు నాటేందుకు సన్నాహాలు రాయవరం: ‘అమ్మ పేరిట ఒక మొక్క’ అనే కార్యక్రమాన్ని గురువారం పాఠశాలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో మెగా పేటీఎం 2.0 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. పాఠశాలల్లో తగినంత స్థలం లేని పక్షంలో ఇంటి వద్ద లేదా రహదారుల పక్కన మొక్కలు నాటి వాటి సంరక్షణను నాటిన వారే చేపట్టే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్లపాటు మొక్కలు సంరక్షించే బాధ్యతలను పక్కాగా చేపట్టేందుకు గ్రీన్ పాస్పోర్టును విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు. -
ఇదేండబ్బా ప్రచారం
ప్రచారం.. పనిభారం ఈ కార్యక్రమ మార్గదర్శకాల్లోనే నాలుగైదు రోజుల ముందు నుంచే ఏమేమి చేయాలో కార్యకలాపాలను పొందుపర్చారు. పాఠశాలల్లో పాఠా లు చెప్పాల్సిన ఉపాధ్యాయులను తల్లికి వందనం పథకాన్ని ప్రచారం చేసేవారిగా ప్రభుత్వం మార్చేసింది. 17 కమిటీలను వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రభుత్వం చెప్పడంతో ఉపాధ్యాయులంతా ఇదే పనికి తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు సచివాలయ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను భాగస్వాములను చేశారు. వీరిని ఒక్కో పాఠశాలకు పర్యవేక్షకులుగా నియమించారు. వారి శాఖల పనిని పక్కన పెట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించే స్థితికి తీసుకొచ్చారు. విద్యా సంస్థలపై ఆర్థిక భారం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించామని చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సంబంధించిన ఖర్చులను స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. దాతల ద్వారా నిర్వహణ సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో అమలుకు సాధ్యమా అనేది విద్యా సంస్థల నిర్వాహకులను వేధిస్తుంది. చివరికి చేతి చమురు వదిలించుకోక తప్పదన్న భావనతో నిర్వాహకులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం నిర్వహణలోని ప్రతి క్షణాన్ని ఫొటోలు, వీడియోలు తీసి నిర్దేశించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కపిలేశ్వరపురం: చేసేది తక్కువ... గొప్పలెక్కువ అన్నట్టు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. విలువైన ప్రజాధనాన్ని ప్రచారానికే కేటాయిస్తుంది. ఇప్పటి వరకూ యోగా దినోత్సవం పేరుతో సుమారు రూ.300 కోట్లను ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయంటూ గొప్పలు చెప్పుకొంది. అదే కోవలో నేడు మరో ప్రచారానికి సిద్ధం చేసింది. మెగా పేరెంట్స్, టీచర్స్ డే కార్యక్రమాన్ని మెగా పీటీఎం 2.0 పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించేందుకు కార్యాచరణ చేసింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం వెనుక కూటమి ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. దీని నిర్వహణకు పరిమితంగా నిధులను కేటాయించి, స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని చెబుతోంది. ప్రైవేట్ సంస్థల్లో ఆ యాజమాన్యం సొంత ఖర్చుతో కార్యక్రమాన్ని పండగలా చేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రస్తుతం ఈ కార్యక్రమం తలకు మించిన భారంగా మారుతోంది. నేడు విద్యా సంస్థల్లో కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల ఫలితాల వివరాలతో కూడిన హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినప్పటికీ ప్రధాన అజెండా కాస్తా కూటమి ప్రభుత్వ ప్రచారమే. తల్లికి వందనం సాయం అందజేశామన్న విషయాన్ని ఫోకస్ చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో తల్లికి వందనం పేరుతో కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఈ మార్గదర్శకాలను లీప్ యాప్ నుంచి పొంది అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఈ నెల 4న ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు అమలాపురం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం సన్నాహక సమావేశం నిర్వహించారు. 8న జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్కు జిల్లా సన్నాహక సమావేశం జరిపారు. పిల్లలకు పాఠాలు చెప్పే పనిని పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థ నిర్వాహకులు, బాధ్యులను కూటమి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించమనడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇది సాధ్యమయ్యేనా..? పాఠశాలల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులతో మొక్కలను నాటాలని సూచించారు. ఆ మొక్కలను విద్యార్థి బాధ్యతగా సంరక్షించాలని చెబుతున్నారు. రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అది సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ప్రత్యేక నిధులను, సిబ్బందితో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వివాదాలు రాకుండా చూడాలని.. పేరెంట్స్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులు సహజంగా తమ పిల్లల చదువు వివరాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం వివరాలను సైతం తెలుసుకోవాలని అనుకుంటారు. ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం లబ్ధిదారుల్లో అనేక మంది అర్హులకు సాయం అందలేదు. అందని వారంతా అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందే గమనించిన ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్లో వివాదాలు రాకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే అని, ప్రోటోకాల్ విషయాల్లో రాజకీయాలు తలెత్తకుండా చూసుకోవాలంటూ సూచించింది. మెగా పీటీఎం 2.0 పేరుతో కార్యక్రమం తల్లికి వందనంపై సొంత బాకా ఉపాధ్యాయులకు పనిభారం పక్కదారి పట్టిన విద్యాబోధన చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించాలి మెగా పీటీఎం 2.0 పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. పాఠశాలల్లో విద్యా బోధన ప్రక్రియ సన్నగిల్లేలా దీనికి రూపొందించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులు కేటాయించాలి. –రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు, ఆలమూరు -
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
కూటమి ప్రభుత్వ మోసాలపై గర్జిద్దాం..
ముమ్మిడివరం: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన మోసాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కోదమ సింహాలై గర్జించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్కుమార్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అఽతిథిగా విచ్చేసి మాట్లాడారు. తొలిత సభా వేదిక వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగ్గిరెడ్డితోపాటు నియోజకవర్గ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై నియోజకవర్గంలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై జగ్గిరెడ్డి షెడ్యూల్ను వివరించారు. నిరసన కార్యక్రమాలను గ్రామ, మండల స్థాయిల్లో విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు అనేక హామీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిలో న్యాయం జరిగిందని అన్నారు. పార్టీ కార్యకర్తలకు సుముచిత స్థానం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలపై జగన్మోహన్రెడ్డి సారథ్యంలో పోరాటం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ వెంకట సతీష్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పథకాలను పక్కనబెట్టి, అభివృద్ధిని విస్మరించిందన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకుడు మాతా మురళి, డిల్లీ నారాయణ, పెయ్యల చిట్టిబాబు, కాశి బాలమునికుమారి, నల్లా నరసింహమూర్తి, కుడుపూడి శంకరరావు, కాదా గోవిందకుమార్, రాయపురరెడ్డి జానకిరామయ్య, కమిడి ప్రవీణ్కుమార్, కాశి రామకృష్ణ, పిన్నమరాజు వెంకట పతిరాజు, పెన్మత్స చిట్టిరాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో దొమ్మేటి శామ్యూల్ సాగర్, నేల కిశోర్, ముదునూరి సతీష్రాజు, కోలా బాబ్జీ, జగతా పద్మనాభం, నడింపల్లి సూరిబాబు, బొంతు బుజ్జిబాబు, చింతలపాటి శ్రీనురాజు, కాశి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు -
ఐటీ సర్వీసెస్ అకాడమీతో ఉద్యోగావకాశాలు
అమలాపురం రూరల్: జిల్లాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సర్వీసెస్ శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసి మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫ్లెక్సీ వ్యాన్ (యూఎస్ఏ) సీఐఓ చిక్కాల విద్యాసాగర్ ముందుకు వచ్చారని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లో విద్యాసాగర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరామ్ ప్రసాద్తో సమావేశమై ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ అకాడమీని సుమారు రూ. 35 కోట్ల అంచనాతో ఏర్పాటు చే స్తున్నామని, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా విద్యాసాగర్ కృషి చేస్తామని తెలిపార న్నారు. అమలాపురం నివాసి అయిన విద్యాసాగర్ మాతృ భూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకురావడం సంతోషదాయకమన్నారు. ఈ అకాడమీ ఏర్పాటుకు జిల్లాలో సుమారు ఐదెకరా ల విస్తీర్ణంగల భూములు సేకరించాలనితెలిపారు. మినీ ఫిషింగ్ హార్బర్కు వసతులు కల్పించాలి అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ పూర్తి స్థాయి నిర్వహణ కోసం మౌలిక వసతులను కల్పించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన మినీ ఫిషింగ్ హార్బర్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సుమారు రూ. 30 కోట్లతో చేపట్టిన ఈ మినీ హార్బర్లో రూ.23 కోట్లతో పనులు నిర్వహించి 2023లో అప్పగించామని తెలిపారు. మిగిలిన రూ.7 కోట్లకు సంబంధించి విద్యుత్ సరఫరా, తాగునీరు, అప్రోచ్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉందని అన్నారు. పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా సుమారు 200 పడవలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందన్నారు. అనంతరం కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్, జాతీయ రహదారి 216 తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంశాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. -
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు ఎన్వీ రెడ్డిని అరెస్టు చేయాలి మాదిగ సంఘాల నాయకుల డిమాండ్ -
ఏటీఎం మార్చేసి.. సొమ్ము డ్రా చేసి
యానాం: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ విశ్రాంత పోలీసు అధికారినే మోసం చేసిన ఘటనలో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. యానాం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్–2 కట్టా సుబ్బరాజు కథనం ప్రకారం.. గత నెల 28న యానాం పిల్లారాయ వీధిలో ఎస్బీఐ ఎటీఎం నుంచి విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ రూ.10 వేలు డ్రా చేశారు. అయితే మినీ స్టేట్మెంట్ రాకపోవడంతో పక్కనే ఉన్న పిఠాపురం వద్ద నరసింగపురానికి చెందిన కాసీబు రాంబాబును మినిస్టేట్మెంట్ తీయమని అడిగి పిన్ నంబరు చెప్పారు. మినీ స్టేట్మెంట్ రావడం లేదని చెప్పి రాంబాబు తన వద్ద ఉన్న మరో కార్డును సత్యనారాయణకు ఇచ్చాడు. అనంతరం రాంబాబు బయటకు వెళ్లి ఆ ఏటీఎం కార్డు నుంచి రూ.70 వేలు తస్కరించాడు. జరిగిన మోసంపై సత్యనారాయణ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యానాం క్రైమ్ టీమ్ సభ్యులు జాంటీ, దుర్గారావు, మల్లాడి గణేష్లు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని రూ.వెయ్యి నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దువ్వాడ, కాకినాడ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయి. -
పరుగులు తీసిన సిబ్బంది
డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ కిక్ మామిడికుదురు: పాశర్లపూడి, పాశర్లపూడి లంక గ్రామాల సరిహద్దులో ఓఎన్జీసీ బావి వద్ద డ్రిల్లింగ్ నిర్వహిస్తుండగా, బుధవారం రాత్రి గ్యాస్ కిక్ ఇచ్చింది. 20 మీటర్ల ఎత్తులో భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్మడంతో డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు సైతం తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కొద్ది సేపటి తరువాత గ్యాస్ కిక్ను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 3 నెలల క్రితం ఈ–2003 నెంబరు రిగ్గుతో ఈ బావిలో డ్రిల్లింగ్ చేపట్టారు. 2910 మీటర్ల లక్ష్యం మేరకు డ్రిల్లింగ్ నిర్వహించాల్సి ఉంది. 2,880 మీటర్లకు డ్రిల్లింగ్ చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ కిక్ను అదుపు చేసిన అనంతరం స్థానికులు కిక్ వద్దకు చేరుకుని అధికారులపై మండిపడ్డారు. ఏం జరిగిందని నిలదీశారు. ఏం జరిగిందో తమకు కూడా తెలియదని సమాధానం చెప్పడంతో సిబ్బందిపై మండిపడ్డారు. -
యువతకు కువైట్లో ఉపాధి అవకాశాలు
రాజమహేంద్రవరం రూరల్: నిరుద్యోగ యువతకు కువైట్లో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విడిజి మురళి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యానన్ పవర్ కంపెనీ ఆఫ్ ఏపీ సంయుక్తంగా తాతృయ అనే అంతర్జాతీయ సంస్థతో కలిసి కువైట్లో ఉన్నత నైపుణ్యం కలిగిన నిర్మాణ కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్హత కలిగిన 24 నుంచి 50సంవత్సరాల వయసు కల్గిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ లేదా సీలింగ్ పనుల్లో ఐటీఐ లేదా డిప్లమా ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. 3–5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఉద్యోగావకాశం, నెలకు కువైట్ డాలర్ కెడబ్ల్యూడి 200 నుంచి 250 (భారత రూపాయలలో సుమారు రూ.56,000 – రూ70,000 వరకు) జీతంగా లభించనున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలు ఉద్యోగ ఒప్పంద కాలవ్యవధి అన్నారు. వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, వైద్య సదుపాయాలు నివాస ఏర్పాట్లను కంపెనీ అందిస్తుందన్నారు. అభ్యర్థులు తమ పాస్పోర్టు, ఐటీఐ/డిప్లమా సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్లను సమర్పించాలన్నారు. ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 99888 53335 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతిగోకవరం: అప్పటి వరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోకవరం గ్రామానికి చెందిన బొమ్మగంటి నాగభూషణం (57) తంటికొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆయన రెండు తరగతుల్లో బోధించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగా తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఇటీవల రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై తంటికొండకు వచ్చారు. కుమార్తె వివాహం చేసిన నెలలోనే.. ఉపాధ్యాయుడు నాగభూషణంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు గత నెలలో ఘనంగా వివాహం జరిపించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మేము సైతమంటూ ముందుకొచ్చి..
● పోలీసు కుటుంబాలకు సాయం ● ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా అందజేతఅమలాపురం టౌన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబాలకు కోనసీమ జిల్లా పోలీసులు మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూత అందించారు. గత నెల 26న విధి నిర్వహణలో భాగంగా ఆలమూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆలమూరు ఎస్సై మద్దాల అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నవారు మృతి చెందడంతో ఆ కుటుంబాలు పడుతున్న వేదనకు ఓదార్పుగా జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వారంతా కలసి రూ.8 లక్షలు సమకూర్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు చేతుల మీదుగా ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల చొప్పున బుధవారం అందజేశారు. అలాగే 2014 బ్యాచ్కు చెందిన ఎస్సైలు కూడా అదే బ్యాచ్కు చెందిన ఎస్సై అశోక్ మృతికి చింతిస్తూ రూ.68 వేలను బాధిత కుటుంబానికి ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్పీ కార్యాలయ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఊరూరా.. మనసారా..
● ఘనంగా వైఎస్సార్ జయంత్యుత్సవం ● పండగను తలపించిన వేడుకలు ● మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి ● అమలాపురంలో పాల్గొన్న ఎంపీ బోస్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ ● కొత్తపేటలో నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● హాజరైన మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు సాక్షి, అమలాపురం: సంక్షేమ ప్రదాత, అభివృద్ధి దార్శినికుడు, పేదల హృదయాలను గెలిచిన నాయకుడు, రైతు పక్షపాతి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగలా ఈ కార్యక్రమం జరిగింది. దివంగత మహానేతకు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ఆ మహనీయుని పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు వస్త్ర దానం, రోగులకు పాలు, పండ్ల వితరణ జరిపారు. ● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల వైఎస్సార్ జయంతిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మంటపంలో 14 మంది రైతులను సత్కరించారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకుపంచారు. అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి జరిగింది. అమలాపురం హైస్కూల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, శాసనమండలి సభ్యులు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శ్రీకాంత్తో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి పెట్టారు. ఆసుపత్రి వద్ద పేదలకు వస్త్రదానం చేశారు. స్థానిక హరి మనో వికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ● పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి పాల్గొన్నారు. స్థానిక సీహెచ్సీలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. విలస లెప్రసీ ఆస్పత్రి వద్ద రోగులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ● రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి, మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సూర్యప్రకాష్తో పాటు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ● రాజోలు నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంత్యుత్సవం ఘనంగా జరిగింది. తాటిపాక, మామిడికుదురు, మలికిపురం, శివకోడు, నగరం, సఖినేటిపల్లిలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ● మండపేట నియోజకవర్గం పరిధిలోని మండపేట పట్టణం, మండపేట రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో వైఎస్సార్ జయంతిని వేడుకలా జరిపారు. ఎమ్మెల్సీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యాలయంలో అన్నదానం, సీహెచ్సీలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ● ముమ్మిడివరం నియోకవర్గం పరిధిలోని ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక పోలమ్మ చెరువు వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఉచిత బస్సు ఏది చంద్రబాబూ?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి వినూత్న నిరసన ● క్యూఆర్ కోడ్పై ప్రయాణికులకు అవగాహన రావులపాలెం: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న ఉచిత బస్సు ఏది? అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులతో కలసి మంగళవారం ఆయన రావులపాలెం డిపోలో బస్సు ఎక్కారు. ఆయన వెంట అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఉన్నారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా మడికి వరకూ ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో జొన్నాడ సెంటర్ వద్ద రాజోలు ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికులకు ఉచిత బస్సు హామీ అమలుపై బాబు చేస్తున్న మోసాన్ని వివరించారు. ఉచిత బస్సు లేదంటూ నినాదాలు చేశారు. అనంతరం మడికిలో దిగి అక్కడి నుంచి వేరే బస్సులో తిరిగి రావులపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులకు రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సిరిపురపు శ్రీనివాసరావు, కొత్తపేట ఐటీ విభాగం అధ్యక్షుడు కొవ్వూరు సుధాకర్ రెడ్డి, కర్రి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. -
మన బడి.. మన బాధ్యత
● రేపు పాఠశాలల్లో మెగా పీటీఎం 2.0 ● ఏర్పాట్లను పూర్తి చేసిన విద్యాశాఖ రాయవరం: మన బడి.. మన చిన్నారుల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. చిన్నారుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషితో పాటుగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ముఖ్యం. దీనిలో భాగంగా గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ డే నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికి మెగా పీటీఎం 2.0గా నామకరణం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భాగంగా గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల ఫలితాలతో కూడిన హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థుల తల్లిదండ్రులకు అందించనున్నారు. విద్యార్థులు సెల్ఫోన్ అధికంగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తారు. సైబర్ నేరాలపై మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. వారితో పాటు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాలకు సంబంధించిన 30 సెకన్ల వీడియో, మూడు ఫొటోలను లీప్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1,561 పాఠశాలలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.1.65 కోట్లు విడుదల చేశారు. ఆ నిధుల నుంచి 20 శాతం మెగా పేటీఎం నిర్వహణకు వెచ్చించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశామని సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ తెలిపారు. తల్లిదండ్రులు హాజరు కావాలి తమ చిన్నారుల విద్యా ప్రగతిని తెలుసుకునేందుకు, పాఠశాల అ భివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు తల్లిదండ్రులు మెగా పీటీఎంకు హాజరవ్వాలి. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమావేశాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలను డీవైఈవో, ఎంఈవోలకు అందజేశాం. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం -
ఆస్పత్రికి వెళుతూ మృత్యు ఒడికి..
● బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ ● భార్య మృతి ● భర్త, పిల్లలకు గాయాలుతాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని పటవల జంక్షన్ వద్ద మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దడాల ఝాన్సీలక్ష్మి (28) మృతి చెందింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఇంజరం గ్రామానికి చెందిన దడాల శేఖర్ తన భార్య ఝాన్సీలక్ష్మి, ఇద్దరు కుమారులను తీసుకుని కాకినాడ ఆస్పత్రికి వెళుతుండగా ఆయిల్ ట్యాంకర్ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఝాన్సీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పటవల గ్రామ పంచాయతీ మహిళా పోలీసు కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య మృతదేహం వద్ద శేఖర్ బోరున విలపించడం అక్కడివారిని కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యతో పాటు వ్యాయామం అవసరం
● రాజ్యసభ సభ్యుడు బోస్ ● అమలాపురం జెడ్పీ బాలుర హైస్కూల్లోక్రీడా పరికరాల ప్రారంభం అమలాపురం టౌన్: ప్రతి విద్యార్థి చదువుతో పాటు వ్యాయామంపై శ్రద్ధ చూపేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో రూ.30 లక్షలతో అమర్చిన పలు క్రీడా పరికరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులు చదువులోనూ ప్రతిభ చూపగలరన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అభ్యర్థన మేరకు తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించి, క్రీడా పరికారాలను సమకూర్చిన ఎంపీ బోస్ను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాఠశాల క్రీడా స్థలంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సభకు ఎంపీ బోస్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు రోజూ వ్యాయామం అలవాటు చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా స్థలం ప్రాధాన్యతపై అవగాహన ఉన్న ఎంపీ బోస్ రూ.30 లక్షలతో క్రీడా పరికరాలను సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంపీ బోస్ క్రీడాభిరుచితోనే క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, వెటరన్ క్రీడాకారులు మెహబూబ్ సిస్టర్స్ సహీరా, షకీలా, వ్యాయామ ఉపాధ్యాయులు ఆకుల ఉమామహేశ్వరరావు, కుడుపూడి బుజ్జి పాల్గొన్నారు. -
బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల ధర్నా
అమలాపురం రూరల్: తమకు బిల్లులు చెల్లించనందుకు నిరసనగా జిల్లా కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మూడు సంవత్సరాలుగా 15 ఆర్థిక సంఘానికి సంబంధించిన బిల్లులు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండగ పేరుతో ఎన్ ఆర్జీ ఎస్ నిధులతో రూ.170 కోట్లు పనులు చేయించారని తెలిపారు. కనీసం జీఎస్టీ కూడా ఇవ్వలేదన్నారు. డిప్యూటీ సీఎం చెప్పారని చిన్నచిన్న కాంట్రాక్టర్లు అందరూ కలిసి పనులు చేశామని, వారం వారం పేమెంట్ ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏడు నెలలు జరిగినా బిల్లులు ఇవ్వలేదని చెప్పారు. అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కలెక్టర్కు సంఘ నాయకులు అల్లాడ వెంకటరమణ, రాయపురెడ్డి శ్రీనివాసరావు, అడ్డగళ్ల సాయిరామ్, గంధం బ్రహ్మనందం వినతిపత్రం అందించారు. 10న మెగా పీటీఎంఅమలాపురం రూరల్: కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం)ను సమర్థంగా నిర్వహించాలని నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మెగా తల్లి దండ్రులు ఉపాధ్యాయుల సమావేశ నిర్వహణ విధివిధానాలను వివరించి సన్నద్ధత చర్యలపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ మీటింగ్ గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించగా ఈ ఏడాది ప్రైవేటు విద్యా సంస్థ ల్లోనూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తల్లి పేరిట ఒక మొక్కను పాఠశాల ఆవరణ లేదా వారి ఇంటి వద్ద నాటడం ఈ ఏడాది థీమ్గా తీసుకున్నట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి, డీఈవో సలీంబాషా డీఎంఅండ్ హెచ్వో దుర్గారావు దొర పాల్గొన్నారు. ప్రభుత్వ దాతలు, ప్రజలు భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పనిచేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సచివాలయ సంక్షేమ, డిజిటల్ సహాయకులతో సమావేశం నిర్వహించారు. పీ4 కార్యక్రమం విధి విధానాలపై సమీక్షించారు. -
ప్రగతి వారధి... సంక్షేమ సారథి
గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు సాక్షి, అమలాపురం: ఒక మనిషి నిండు నూరేళ్లు జనం మధ్య ఉండాలంటే వందేళ్లు జీవించనక్కర్లేదు. సమాజానికి చేసిన సేవల వల్ల అతను మరణించిన తరువాత కూడా జనం మనసులో నిలిచిపోవడం ద్వారా నిండు నూరేళ్ల జీవనం పూర్తి చేసుకుంటారు. ఇటువంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అధిక కాలం పోరాటాలతోనే సరిపోగా.. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో సంక్షేమ సారధిగా... అభివృద్ధి ప్రదాతగా రాష్ట్రంలోనే కాదు.. దేశంలో తనకుంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల, రైతు, మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లా.. మరీ ముఖ్యంగా కోనసీమ అభివృద్ధిపై చెరగని సంతకం చేశారు. అందుకే ఆయన మృతి చెంది 16 ఏళ్లు కావస్తున్నా జనం గుండెల్లో ఆయన వేసిన ముద్ర నేటికీ చెరగడం లేదు. నేడు దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ కథనం... డెల్టా కాలువలకు కొత్త రూపం ● గోదావరి డెల్టా రూపశిల్పి సర్దార్ కాటన్ తరువాత డెల్టా వ్యవస్థ పుననిర్మాణానికి దివంగత మహానేత పెద్ద పీట వేశారు. అధ్వాన స్థితికి చేరిన డెల్టా వ్యవస్థ మొత్తం రూపరేఖలను మార్చేందుకు సిద్ధమయ్యారు. కాటన్ చేతిలో రూపొందిన గోదావరి డెల్టా వ్యవస్థలో చిన్నచిన్న మరమ్మతు పనులు, క్లోజర్ పనులు మినహా పెద్దగా ఆధునీకరణ పనులు చేపట్టలేదు. వైఎస్సార్ హయాంలో రూ.1,160 కోట్లతో పంట కాలువల, రూ.550 కోట్లతో మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. ● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని సుమారు 10.60 లక్షల ఎకరాల వరి ఆయకట్టుకు సంవృద్ధిగా సాగునీరు వెళ్లేందుకు, పంట చేల నుంచి ముంపు నీరు దిగేందుకు ఆయన చర్యలు చేపట్టారు. వైఎస్సార్ బతికి ఉండగా వేగంగా జరిగిన పనులు ఆయన మృతితో ఆటకెక్కాయి. ● పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా కొత్తగా 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు తీసుకురావడమే కాకుండా... డెల్టాలో 10.60 లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకున్నారు. ● ఐలెండ్కు సాగునీరందించే అన్నంపల్లి అక్విడెక్టు ఆధ్వానంగా మారడంతో రూ.48 కోట్లతో కొత్త అక్విడెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ‘అచ్చ తెలుగు అన్నదాత’ దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు స్ఫురణకు వచ్చినప్పుడు నెత్తిన తలపాగా.. మోముపై చిరు నవ్వు.. తెల్లని దుస్తులు.. తెలుగు వారి సంప్రదాయ పంచెకట్టు గుర్తు రాకమానవు. అచ్చ తెలుగు పల్లె రైతు ఆహార్యంతో వైఎస్సార్ రైతుకు ఒక బ్రాండ్ అంబాసిడర్. రైతు కట్టూ బొట్టూ మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతు అనుకూల విధానాలు, రైతుకు మేలు చేసే పనులతో రైతు పక్షపాతిగా వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నాడు ఉమ్మడి జిల్లా రైతుల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరువరు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సైతం తండ్రి బాటలోనై రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. రైతు పక్షపాతం రైతులకు మేలు జరుగుతోంది అంటే ఎటువంటి కార్యక్రమం అమలు చేయాలన్నా వైఎస్సార్ వెనకడుగు వేయలేదు. అందుకే రైతు అనుకూలమైన నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకునేవారు. దానిలో ముఖ్యమైంది ఉచిత విద్యుత్. దీనివల్ల జిల్లాలో ఉద్యాన రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ముఖ్యంగా కొబ్బరి, అరటి, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు ఉచిత విద్యుత్ చేసిన మేలు అంతాఇంతా కాదు. జిల్లాలో మొత్తం 20,452 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉండగా, వీటిలో 11,901 పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందుతోందంటే అందుకు దివంగత నేత వైఎస్సార్ కారణం. ● 2008లో గోదావరి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి ఏర్పడింది. అప్పట్లో సీఎం హోదాలో రాజమహేంద్రవరం వచ్చిన వైఎస్సార్ పరిస్థిని అర్థం చేసుకున్నారు. రూ.7.50 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. డ్రెయిన్లపై క్రాస్బండ్ల ఏర్పాటు, మోటార్లతో కాలువల్లో నీరు చేలకు మళ్లింపుతోపాటు గోదావరిలో వృథా నీటిని పంట కాలువలకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. తరువాత కాలంలో ఎప్పుడు నీటి ఎద్దడి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే విధానంతో రబీని గట్టెక్కిస్తుండడం విశేషం. ● 2007 ఏడాది కొబ్బరి సంక్షోభంలో ఉంది. నాడు కోనసీమకు చెందిన రైతులు స్వయంగా వైఎస్సార్ను కలిసి చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఆయన కొత్త కొబ్బరి (తయారీ కొబ్బరి)పై ఉన్న రెండు శాతం వ్యాట్ పన్నుకు మినహాయింపు ఇచ్చారు. మరో సందర్భంలో కేజీ రూ.9.20 చేసి కొబ్బరి కాయను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయించారు. ఇక్కడే పలు కార్యక్రమాలకు శ్రీకారం ● వైఎస్సార్కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఒక ప్రత్యేకాభిమానం ఉండేది. ఆ కారణంగానే ఆయన ఇక్కడ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోనసీమకు వైఎస్సార్ చేసిన మేలు అంతాఇంతా కాదు. భారీ వరదలు వచ్చిన ప్రతిసారి ఏటిగట్లకు గండ్లుపడి కోనసీమకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం చెప్పలేనంత ఉండేది. 2006లో గోదావరికి రికార్డు స్థాయిలో వచ్చిన వరదల వల్ల జిల్లాలో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్ జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్ల పటిష్ట పనులకు రూ.550 కోట్లు కేటాయించగా, పనులు పూర్తయ్యే సమయానికి రూ.650 కోట్లకు చేరింది. ఆయన హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయి. ● గోదావరి నదీ కోత నివారణకు రూ.90 కోట్లు కేటాయించి గ్రోయిన్లు, రివిట్మెంట్ల నిర్మాణాలు చేపట్టారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక కోతలు ఆగి ఇంకా ఆ గ్రామాలు ఉన్నాయంటే అందుకు వైఎస్సార్ కారణం. ● రాజీవ్ గృహకల్పలో భాగంగా అమలాపురం మండలం నల్లమిల్లిలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మొదటసారి ఈ కార్యక్రమానికి అమలాపురంలో శ్రీకారం చుట్టారు. ఇదే జిల్లా అల్లవరంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీవ్నగర్ బాటకు సైతం అమలాపురం మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టారు.ఉచిత విద్యుత్ బోర్లు ‘కోనసీమ’పై చెరగని... వైఎస్సార్ సంతకం కాటన్ తరువాత డెల్టా ఆధునీకరణకు పెద్ద పీట డెల్టా కాలువ వ్యవస్థకు రూ.1,160 కోట్లు రూ.550 కోట్లతో మురుగునీటి కాలువ వ్యవస్థ ఆధునీకరణ ఏటిగట్ల పటిష్ట పనులకు రూ.650 కోట్లు రూ.48 కోట్లతో అన్నంపల్లి అక్విడెక్టు పనులు కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం -
డ్రైవింగ్కు లైసెన్స్ ముఖ్యం
నిబంధనల పర్యవేక్షణకు సహకరించాలి రహదారులపై వెహికల్ డ్రైవింగ్ రూల్స్ పాటించడంపై అధికారులు తనిఖీలు చేస్తుంటారు. వారికి విద్యార్థులు విధిగా సహకరించాలి. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపాలన్న ఆలోచన విడనాడాలి. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల కళ్లు గప్పి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లిపోవాలన్న ఆలోచన సరికాదు. విద్యార్థులను ఆటోలో తరలించేవారు 10 కిలోమీటర్ల లోపు ఉన్న విద్యాసంస్థలకు మాత్రమే తీసుకెళ్ళాలి. ఆటో నడిపే కార్మికుని పక్కన ప్రయాణికులు కూర్చోకూడదు. ఆటోకు రెండు వైపులా రక్షణ కవచం ఉండాలి. డ్రైవర్కు లైసెన్స్, వాహనానికి పర్మిట్ తప్పనిసరి. ● చదువు కోసం పోతూ చావు కొని తెచ్చుకోవద్దు ● కళాశాలకు బైక్పై ప్రయాణం ప్రమాదకరం ● ఆకతాయి పనులతో అనర్థం ● సురక్షిత ప్రయాణంతో మంచి భవిష్యత్తు కపిలేశ్వరపురం: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు నెలకావొస్తోంది. ఫలితాల వెల్లడి, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవడం, పై చదువులకు కళాశాలను ఎంచుకోవడం, అడ్మిషన్ తీసుకోవడం తదితర ప్రక్రియలతో జూన్ నెల బిజీ బిజీగా సాగింది. ఇక నుంచి పాఠ్యాంశాల బోధన, అంతర్గత స్థాయి పరీక్షల నిర్వహణ తదితర వాటితో విద్యార్థులు చదువుల్లో తలమునకలు అవుతారు. కళాశాలకు వెళ్లడం ఎంత అవసరమో ఆ ప్రయాణం సురక్షితంగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవడమూ అంతే అవసరం. సురక్షిత ప్రయాణం ఆవశ్యకతపై ఈ కథనం... పిల్లలకు వాహనాలిస్తే తండ్రిపై క్రిమినల్ కేసు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్, వెహికల్ డ్రైవింగ్ రూల్స్ రూపొందించారు. సినిమాలో హీరో తరహాలో వాహనాన్ని నడపాలన్న తపన వెనుక ప్రాణహాని పొంచి ఉందని గ్రహించాలి. పదో తరగతి , ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వారి వయసు రీత్యా వాహనాన్ని నడిపే అర్హత ఉండదు. 18 ఏళ్లు నిండినవారు లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేయడం సరికాదు. అలా చేస్తే రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ జరిమానా విధిస్తారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. అతిక్రమించి ఇచ్చినట్టయితే తండ్రిపై కేసు నమోదు చేస్తారు. నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలి. టూ వీలర్పై ముగ్గురు ప్రయాణం చేయడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం నేరం. గతంలో ప్రమాదాలకు గురైన విద్యార్థులిలా... ● 2024 ఫిబ్రవరి 15న మండపేట మెహర్బాబా ఆశ్రమం సమీపంలో లారీ ఢీకొని పట్టణంలోని ప్రైవేటు కళాశాలలోని సెకండ్ ఇంటర్ విద్యార్థి పడాల మధుసాయి మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. ● 2023 ఫిబ్రవరి 26న అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం శివారు టి.సావరం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అమలాపురంలోని కళాశాలకు ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తున్న నందెపు రాజేష్ (17), అల్లపల్లి నాగేంద్ర (17) మృతిచెందారు. ● 2023 జూన్ 3న అమలాపురం మండలం నడిపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనుమల ప్రశాంతి (06) నడిపూడిలో మట్టి ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ● 2023 మే 19న అమలాపురం మహిపాల వీధికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని గంగా లక్ష్మీ జాహ్నవి (11) గాంధీనగర్ వద్ద మట్టి ట్రాక్టర్ ఢీకొని అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ● 2023 డిసెంబర్ 3న మండపేట పట్టణంలోని మారేడుబాక వంతెన వద్ద కారు ఢీకొని మారేడుబాక గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి మాడెం ప్రవీణ్ (11) మృతిచెందాడు. ఆకతాయి పనులు సైతం అనర్థాలను తెస్తాయి విద్యార్థులు నదిలో స్నానాలకు దిగడం, జనావాసాల్లో రాళ్లు, కర్రలు విసరడం, వాహనాలను వంకరటింకరగా నడపడం వంటి ఆకతాయి పనులకు పాల్పడటం అనర్థం తెచ్చే ప్రమాదం ఉంది. 2023 మే 21న ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన అయినవల్లి మండలం పెద్దిపాలెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి మోటూరి త్రిలోక్(17), కొత్తపేట సాయిబాబా మందిర సమీప నివాసితుడైన నర్సరీ కూలి గెడ్డం కరుణకుమార్ (22) మృతిచెందారు. వారి స్నేహితుడు కోరుమిల్లికి చెందిన అయినవిల్లి భవానీశంకర్ పుట్టినరోజును జరుపుకున్న తర్వాత వారు నదిలో స్నానానికి వెళ్లారు. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి. సినిమా, సోషల్ మీడియా ప్రభావాలతో వాహనాలను నడపాలని కానీ, వేగంగా నడపాలని కానీ అనుకోవడంలోనే ప్రమాదం పొంచి ఉంది. రహదారిపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అతిక్రమిస్తే వాహనం నడిపేవారి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. మరెవరినైనా ఢీకొంటే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొనే ప్రమాదమూ ఉంటుంది. – పి.దొరరాజు, సీఐ, మండపేట రూరల్ -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం, కుమ్మరికిమ్ముడుపల్లికి చెందిన బోనంగి నూకరాజు(50) తుని రైల్వే స్టేషన్లో రెండో నంబర్ ఫ్లాట్పారం నుంచి ఒకటో నంబరు ఫ్లాట్ఫారానికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత... కరప: ఇంట్లో వంట చేస్తుండగా విషసర్పం కాటువేయగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన బోనంగి లోవతల్లి(31) ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక విషసర్పం కాటువేసింది. వెంటనే ఆమెను చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు లోవతల్లి భర్త ప్రసాద్కు మధ్య గొడవలు జరిగి ఏడాది కాలంగా గురజనాపల్లిలో తల్లితో పాటు ఉంటోంది. ఆమెకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె సోదరి రాచకొండ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దళితులపై పెరిగిన అరాచకాలు
ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. స్థానిక అరిగెలపాలెంలో సోమవారం జరిగిన ఆర్పీఐ ముఖ్య నాయకుల సమావేశంలో లోక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుల రాక్షసి విలయ తాండవం చేస్తోందన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ దళిత బాలికపై 17 మంది అత్యాచారం చేస్తే ఇప్పటిదాకా దోషులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. దోషులకు కూటమి ప్రభుత్వ పెద్దలు అండగా నిలిచారని, ఈ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి నిర్వీర్యమైందని చెప్పారు. ఇరాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో దళితులపై దాడులు, అరాచకాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని అన్నారు. చంద్రబాబు సంపద సృష్టి, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆర్భాట ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ప్రజా సంక్షేమం, హామీల అమలు, లా అండ్ ఆర్డన్ అనే మూడు ముఖ్యమైన విషయాలను విస్మరిస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు ఈవీవీ సత్యనారాయణ, గోసంగి ఆనందరావు, చిలకపాటి సాంబశివరావు, నాగాబత్తుల ప్రసాదరావు పాల్గొన్నారు. -
బస్పాస్లకు వేళాయె
● ఉచిత, రాయితీ బస్సుపాసుల మంజూరుకు ప్రభుత్వం చర్యలు ● 12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు అవకాశం రాయవరం: విద్యా సంవత్సరం పునః ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతమైంది. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఉదయాన్నే కళాశాలలకు వెళ్లేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రజా రవాణా శాఖ ఏటా ఉచిత, రాయితీ బస్సుపాసులను మంజూరు చేస్తుంది. 2025–26 విద్యా సంవత్సరానికి ఆర్టీసీ బస్పాస్ల జారీ ప్రారంభమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 7,657 పాస్లు జారీ చేశారు. చదువులకు ఊతం జిల్లాలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం ఆర్టీసీ డిపోల నుంచి విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత, రాయితీ బస్సు పాస్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీపీఏఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల సెలవుల తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా రవాణా శాఖ బస్సు పాసు కౌంటర్లు ప్రారంభించింది. బస్సు రూటు ఆధారంగా రాయితీ చార్జీని నిర్ణయిస్తారు. ఎవరెవరికి ఇస్తారంటే 12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా బస్పాసులను జారీ చేస్తారు. ఇవి ఏడాది వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ పాస్ల ద్వారా విద్యార్థులు తమ నివాసం నుంచి 20 కిలోమీటర్ల వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకుగాను విద్యార్థి ఫొటో, స్కూల్ యాజమాన్యం నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మిగతా వారికి రాయితీతో బస్పాసులు మంజూరు చేస్తారు. పాసు ధరతో పాటు సంవత్సరం గుర్తింపు కార్డు కోసం రూ.100, నెలవారీ గుర్తింపు కార్డు రూ.50, సర్వీసు చార్జీ రూ.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ బస్పాస్లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో మంజూరు చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్ కోసం ప్రిన్సిపాల్ సంతకం చేయించుకుని తిరిగి పొందాల్సి ఉంటుంది. సాధారణ విద్యార్థులకు జూన్ నుంచి ఏప్రిల్ వరకు, ఐటీఐ, పారా మెడికల్ వంటి కోర్సులు చదివే వారికి మే నెలలో పాసులు మంజూరు చేస్తారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీగా పరిగణలోకి తీసుకుని దూరాన్ని బట్టి రాయితీ ఇస్తారు. రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు, అమలాపురం డిపోల నుంచి గతేడాది ఫ్రీ బస్పాస్లు, రాయితీ బస్పాస్లు, దివ్యాంగులకు 67,399 మందికి బస్పాస్లు జారీ చేశారు. ప్రతి విద్యార్థికి రాయితీపై ప్రతి విద్యార్థి రాయితీ బస్ పాస్ పొందవచ్చు. చార్జీలో ఒక వంతు మాత్రమే విద్యార్థి చెల్లించేలా ఈ పాస్లు జారీ చేస్తారు. విద్యార్థి నివాసం నుంచి 50 కిలోమీటర్ల వరకు రాయితీ పాస్ జారీ చేస్తారు. కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ సమర్పించాలి. విద్యార్థి ఫొటో జత చేయాలి. విద్యార్థి నెలావారీ, మూడు నెలలకోసారి, సంవత్సరం పాస్లు పొందవచ్చు. మంత్లీ పాస్ ఐడీ కార్డులకు రూ.100 వంతున చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. కళాశాల విద్యార్థులు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్కార్డు జిరాక్స్ జత చేయాలి. స్టడీ సర్టిఫికెట్తో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, సెల్ నంబర్ ఇవ్వాలి. దరఖాస్తులను సమీప డిపో మేనేజర్ పరిశీలించి పాస్ మంజూరుకు సిఫారసు చేస్తారు. వీటిని మంజూరు కౌంటరులో ఇచ్చి నిర్ణీత రుసుం చెల్లించి పాస్ పొందవచ్చు. సద్వినియోగం చేసుకోవాలి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున బస్పాస్ల జారీ ప్రక్రియను ప్రారంభించాం. ప్రభుత్వం అందించే బస్సు పాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. 50 కిలోమీటర్ల పరిధి వరకు రాయితీ బస్సు పాసులు జారీ చేస్తున్నాం. సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాస్లు జారీ చేస్తున్నాం. – ఎస్టీపీ రాఘవకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గతేడాది జారీ చేసిన బస్పాస్లు ఇలా కేటగిరీ ఆఫ్ పాస్ జారీ చేసిన పాస్లు 12 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచిత పాస్లు 2,274 18 ఏళ్ల లోపు విద్యార్థినిలకు ఉచిత పాస్లు 8,342 విద్యార్థులకు నెలవారీ పాస్లు 34,210 మూడు నెలల పాస్లు 14,830 ఇయర్లీ పాస్లు 57 దివ్యాంగులకు జారీ చేసిన పాస్లు 1,820 మంత్లీ సీజన్ పాస్లు 5,866 -
కలెక్టరేట్ వద్ద ఉద్యాన సహాయకురాలి ధర్నా
అమలాపురం రూరల్: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఉద్యాన సహాయకుల కౌన్సెలింగ్లో అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు అంబాజీపేట మండలం ముక్కామల సచివాలయం ఉద్యాన సహాయకురాలు రంప లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలో 52లో ర్యాంకుతో గతల నెల 29 తేదీన జరిగిన కౌన్సెలింగ్లో కొత్తపేట మండలం అవిడి– 2, వానపల్లి, మెడెకుర్రులో ఏదో ఒక చోటుకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటే అవిడి–2కు బదిలీ ఇచ్చారని తెలిపారు. ఇంటికి వెళ్లిసరికి రాజకీయ వత్తిడితో ఆ బదిలీని రద్దు చేశారని వాపోయారు. దీనిపై ఉద్యాన శాఖ ఏడీ పీవీ రమణను కలవగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖినేటిపల్లి మండలం రామరాజు లంకకు బదిలీ చేసినట్టు చెప్పారన్నారు. చిన్నపిల్లలతో ఉన్న తనకు అవిడి–2కు బదిలీ ఇవ్వాలని ఆమె జాయింట్ కలెక్టర్ నిషాంతికి ఫిర్యాదు చేశారు. లండన్ సీఎంఏ సమావేశానికి ఆహ్వానం అమలాపురం టౌన్: ప్రపంచంలో 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 18న లండన్లో జరగనున్న సర్వ సభ్య సమావేశానికి భారతదేశం నుంచి అమలాపురానికి చెందిన సీఎంఏ సభ్యుడు డాక్టర్ పీఎస్ శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో డాక్టర్ శర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం వివరించారు. సీఎంఏకు అనుబంధంగా పనిచేస్తున్న స్టాప్ టీబీ ఇనిషియేటివ్ సబ్ కమిటీ సభ్యుడిగా తాను నియమితులైన సంగతిని కూడా డాక్టర్ శర్మ తెలిపారు. -
అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
● అట్టహాసంగా 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ ● హాజరైన ప్రముఖ ఆథ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అరుణాచల మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన 63 మంది నాయనార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకులు డాక్టర్ టి.అరుణాచల కార్తికేయ శివాచార్య వైభవంగా నిర్వహించారు. వీటితోపాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని జెట్టి శివకుమార్ దంపతులు, లక్ష్మీ హయగ్రీవుడు విగ్రహాన్ని శ్రీహరి రాజబాబు దంపతులు, సూర్యభగవానుడు విగ్రహాన్ని దంతులూరి సుభద్రరామరాజు దంపతులు, కాలబైరవుడు విగ్రహాన్ని గిరిధరరెడ్డి దంపతులు, గంగామాత విగ్రహాన్ని బలభద్రుడి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించారు. అనంతరం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మార్మోగింది. రాచపల్లి వెళ్లే ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తి మార్గమే శరణ్యం భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువురు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
తమ్ముళ్ల కారు కూతలు!
● నడిరోడ్డుపై బయటపడ్డ వర్గ పోరు ● కారు అడ్డం వచ్చిందనే వంకతో దుర్భాషలు టాస్క్ఫోర్స్: టీడీపీ నేతల గ్రామాల పర్యటన కుమ్ములాట, తోపులాటలకు నిలయమైంది. వారి మధ్య వర్గపోరును బహిర్గతం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఎంపీ పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుమారుడు పెందుర్తి అభిరామ్ సోమవారం కాన్వాయ్లో బయలుదేరారు. రాజానగరం మండలం పాలచర్ల, కోరుకొండ మండలం గాడాల అనంతరం మునగాలకు బయలుదేరిన కాన్వాయ్లో మొదటి నుంచి వాహనాలు ఓవర్ టేక్ చేసుకోవడం వివాదానికి కారణమయ్యింది. అటు నుంచి పలు గ్రామాలకు కాన్వాయ్ వెళ్లింది. కోరుకొండ మండలం మునగాలలోని కార్యక్రమానికి వెళ్తుండగా పెందుర్తి కారుకు మరో వర్గం కారు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెందుర్తి వర్గానికి చెందిన నాయకుడిని దుర్భాషలాడటంతో వివాదం తీవ్రతరమయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండడంతో రుడా చైర్మన్ పదవి పెందుర్తి అభిరామ్కు వస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అది అభిరామ్కు దక్కకపోవడంతో నాటి నుంచి వివాదాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆ వివాదాలు మునగాల ఘటన ద్వారా బయట పడ్డాయి. కూటమిలోని ఇతర నాయకులు జోక్యం చేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. పార్టీలో ఆధిపత్య పోరు ఇలా నడిరోడ్డుపై దుర్భాష లాడటం వరకూ వెళ్లింది. కూటమిలోని పార్టీ నాయకులు, స్థానికులు, రైతుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంఽశమైంది. -
బంధాన్ని కాదని.. అనుబంధాన్ని తెంచుకుని..
● రైలు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు ● తండ్రిని వద్దంటున్న కుమారుడు.. తనకు భర్త లేడంటున్న భార్య తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచుకుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబంధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవశాత్తూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం కాల్దారి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబ సభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు. అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని, అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వడంతో రైల్వే పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసినా ఇబ్బంది లేదు సుధీన్రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తండ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు. -
మోసానికి చిరునామా చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్: మోసానికి చిరునామాగా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిందని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయసారథి అన్నారు. సోమవారం కొంతమూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనని తనకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపారన్నారు. అంతకంటే దారుణం ఏమిటంటే కాటవరం సచివాలయం, సీతానగరం మండలం అనే అడ్రస్సులో నివసిస్తున్నట్లుగా ఆ సర్టిఫికెట్లో తెలియజేశారన్నారు. గిన్నిస్బుక్ రికార్డుల కోసం మృతిచెందిన వారి పేరిట సైతం యోగాలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు జారీచేయడం, వారి పనితీరుకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేదవాడికి అందించాల్సిన ఏ ఒక్క స్కీమును అందించని సీ ఎం చంద్రబాబు, ఒక్కరోజు యోగా దినోత్సవం కోస ం రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం దారుణం అన్నారు. -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు
● స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్కు ఫిర్యాదు ● ఫెన్సింగ్ క్రీడాకారుడు గౌతమ్రాజ్ సామర్లకోట: సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ స్పోర్ట్సు కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రముఖ ఫెన్సింగ్ క్రీడాకారుడు ఎం గౌతమ్రాజ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్చైర్మన్కు వినతి పత్రం అందజేశానన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే అభ్యర్థి పేరుపై మరోకరు టోర్నమెంట్లో పాల్గొంటున్నారన్నారు. దాంతో స్పోర్ట్సులో కనీస పరిజ్ఞానం లేనివారు స్పోర్ట్సు కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించని వారికి నకిలీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సాఫ్ట్బాల్ ఆటకే పరిమితం కాకుండా ఫెన్సింగ్ ఆటలోనూ ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఫెన్సింగ్ ఆటను ముసుగు ధరించి ఆడటం వలన ఎవరు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని దందా జరుగుతోందని చెప్పారు. విద్యార్ధులను క్రీడలలో ప్రాత్సహించవలసిన ఫెన్సింగ్ అసోసియేషన్ క్రీడాస్ఫూర్తిని అణగదొక్కుతోందన్నారు. దొడ్డిదారిలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గౌతమ్రాజ్ కోరారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
జేసీ నిషాంతి అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యల పట్ల సత్వరమే స్పందించి పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం సంతృప్తి కరంగా అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 290 అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీదారుడి సంతృప్తి లక్ష్యంగా సమస్యను పరిష్కరించాలన్నారు. తమ ఫిర్యాదు స్థితిని ఆన్లైన్, 1100 కాల్ సెంటర్ ద్వారా తెలుసు కోవచ్చునన్నారు. డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డీసీహెచ్ ఎస్ కార్తీక్, డీఎంహెచ్వో ఎం.దుర్గారావు దొర, డీఎఫ్ఓ ఎంవీప్రసాద రావు, ఎస్డీసీ ఈ. కృష్ణమూర్తి, డీఎల్డీ వో రాజేశ్వరరావు డీఎస్ఓ ఎ.ఉదయభాస్కర్, డీపీవో శాంత లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 24 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై వినతులను అందజేశారు. ఎస్పీ ప్రతి అర్జీదారునితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను విచారించారు. -
నాలుగేళ్లుగా నాట్లే లేవు
అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో సుమారు 70 ఎకరాల ఆయకట్టు ఉంది. బెండ కాలువ సాగునీరు రాకపోవడంతో పంచనది మురుగునీటి కాలువ నుంచి ఉప్పునీరు ఎగదన్ని పంట పొలాల్లోకి చేరుతుంది. దీనివల్ల నాలుగేళ్లుగా ఇక్కడ వరి నాట్లు వేయలేదు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు రైతులు పలుసార్లు ఫిర్యాదు చేసినా నేటికీ పరిష్కారం కాలేదు. ● ఇదే మండలం కొమరిగిరిపట్నంలో 50 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ ఐదేళ్లుగా ఖరీఫ్ లేదు. ఇటీవల కాలంలో రబీ కూడా ఉండడం లేదు. పంట పొలాల దిగువన ఉన్న ఆక్వా చెరువుల నుంచి ఉప్పు నీరు ఎదురెక్కడంతో నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు సాగు వదిలేశారు. ఇప్పుడు ఖరీఫ్ సాగు చేద్దామన్నా నారుమడులు, నాట్లు వేసే పరిస్థితి లేదు. భూమున్న పేదోళ్లం అయ్యాం కొమరగిరిపట్నంలో మూడు ఎకరాల్లో సాగు చేసేవాడిని. ఇప్పుడు భూమి ఉన్నా సాగుకు పనికి రాకుండా పోయాయి. మురుగునీరు దిగే అవకాశం లేక విలువైన భూములు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మేమిప్పుడు భూమున్న పేదోళ్లం అయ్యాం. – ఉండ్రాజవరపు యేసు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం అల్లవరం మండలం మొగళ్లమూరులో సాగుకు పనికిరాని వరి చేలు -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
మామిడికుదురు: పవిత్ర కర్భలా పుణ్యభూమిలో అశువులు బాసిన హజరత్ ఇమామ్ హుస్సేన్ అతని పరివారానికి ముస్లింలు రక్తం చిందిస్తూ నివాళులర్పించారు. మొహర్రంలో భాగంగా ఆదివారం నగరంలో పీర్లు, గుమ్మటాలను ఊరేగించారు. హుస్సేన్ అని నినదిస్తూ బ్లేడులు, కత్తులు, గొలుసులతో శరీరాలను గాయపర్చుకుంటూ రక్తం చిందించారు. గుండెలు బాదుకుంటూ మాతం చేశారు. నగరం పంజా నుంచి పంజీషా వరకూ జరిగిన ఊరేగింపులో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గుమ్మటాలను దర్శించుకున్నారు. -
నిండా ముంచేలా..
సాక్షి, అమలాపురం: కష్టాలు కొన‘సాగుతున్నాయి’.. పుడమిపుత్రులను నిండా ముంచుతున్నాయి.. తొలకరి సాగును పూర్తిగా దూరం చేశాయి.. గతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు, భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి చేలు నీట మునగడం పరిపాటి. కానీ ఇప్పుడు జూలైలో కురుస్తున్న కొద్దిపాటి వర్షానికే ఆకుమడులు నీట మునగడం చూసి రైతులు నిర్ఘాంత పోతున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం వంటి శివారుల్లో చేలు ముంపుబారిన పడడం అనేది గతం... ఇప్పుడు ఆత్రేయపురం వంటి మెరక ప్రాంతాల్లో కూడా చేలు ముంపునీట ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు సాగు భరోసా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ సొమ్ము తొలి ఏడాది లేదు.. రెండో ఏడాది ఆ ఊసేలేదు.. నెలలు గడుస్తున్నా ధాన్యం సొమ్ములు లేవు.. ఉచిత బీమాను ఎత్తేశారు. అసలు బీమా పరిహారం ఇస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఇలా జిల్లాలోని ఆయకట్టు రైతుకు సాగు చేసే ధైర్యం లేక తొలకరి పంటను వదిలేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు ఇది. చెరువులు కాదు... చేలు తామరాకులు, కలువ పువ్వులతో అందంగా కనిపిస్తున్నది చెరువు అనుకున్నారో.. తప్పులో కాలేసినట్టే. ఇది వరి చేను. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో తొలకరి సాగు చేయాల్సిన చేలల్లో ముంపునీరు వీడక ఇలా చెరువుల్లా మారిపోయాయి. నైరుతి వచ్చిన తరువాత సరైన వర్షం లేకపోయినా చేలల్లో రెండు, మూడు అడుగుల ఎత్తున నీరు చేరింది. ముంపునకు భయపడి ఏటా ఇక్కడ తొలకరి సాగును రైతులు వదిలేస్తున్నారు. ఈ ఏడాది నారుమడులు వేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ గ్రామంలోనే కాదు.. ఈ మండలంలో శివారు గ్రామాలైన వానపల్లిపాలెంతో పాటు ఎన్.కొత్తపల్లి, ఎస్.యానాం, వాసాలతిప్ప, కూనవరం, గోపవరం, చల్లపల్లిలో సుమారు 2 వేల ఎకరాల్లో వరి సాగును వదిలేస్తున్నారు. ఖరీఫ్కు ఆదిలోనే హంసపాదు కొద్దిపాటి వర్షానికే మునిగిన పొలాలు రూ.2.30 కోట్లతో సైఫన్ నిర్మించిన చోటే ముంపు సాగుకు వెనకడుగు వేస్తున్న రైతన్నలు -
పంట.. వేసేది లేదంట
కాట్రేనికోన మండలంలో రైతులకు ఏ టా తొలకరి సాగు చే యడం జూదంగా మారింది. విపత్తుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు సాగు చేద్దామన్నా ఈ ఏడాది సాగునీరు సకాలంలో విడుదల చేయలేదు. ఆలస్యంగానైనా సాగు మొదలు పెడదామనుకుంటే కూనవరం స్ట్రె యిట్ కట్ ద్వారా సముద్రం నీరు నేరుగా పంట చేలకు చేరడంతో భూములు చవుడు బారిపోతున్నాయి. దీంతో పంట వేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అన్నీ సమస్యలే.. తొలకరి పంటకు ఈ ఏడాది సాగునీరు ఆలస్యమైంది. చాలా మంది రైతులు సాగుకు దూరంగా ఉండనున్నారు. ఇదొక్కటే కాదు. అన్నీ సమస్యలే. ముంపు వెతలు, కూలీల కొరత వేధి స్తుంది. కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారే కాని, వ్యవసాయ పనులంటే ముందుకు రావడం లేదు. చాలా మంది రైతులు సాగు వదిలేయడానికి ఇదొక కారణం. – వెర్రిబాబు, కాట్రేనికోన కాలువల వ్యవస్థ... అవస్థ ఆక్వా సాగు రాజోలు దీవిలో వరి సాగుకు ఉరివేస్తోంది. మురు గునీటి కాలువల వ్య వస్థ అధ్వానంగా ఉండడానికి తోడు ఆక్వా చెరువుల నుంచి వ్య ర్థాలు కాలువల్లోకి తోడేస్తున్నారు. దీనివల్ల మురుగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి చేల నుంచి ముంపునీరు దిగడం లేదు. అలాగే ఆక్వా చెరువుల నుంచి నీరు చేలల్లోకి వస్తుండడంతో రైతులు సాగు చేయలేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని శివారు ప్రాంతాల్లో రైతులు తొలకరి సాగుకు దూరమయ్యారు. మురుగునీటి కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉన్నంత కాలం సాగు చేయలేమని చెబుతున్నారు. ఆక్వా వ్యర్థాలన్నీ కలిసి.. మా చేలను చూస్తే నారు వేసే ధైర్యం రావడం లేదు. పంట, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. రొయ్యల చెరువుల వల్ల ఉప్పునీరు చేరడంతో నాట్లు వేసినా దెబ్బతింటున్నాయి. తొలకరి పంటను రైతులంతా దాదాపు మర్చిపోయారు. – దొడ్డా రాంబాబు, రైతు, గొంది, సఖినేటిపల్లి మండలం -
అంతటా ఆధ్యాత్మిక పరవశం
● తొలి ఏకాదశి వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం ● కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం కొత్తపేట: మది నిండా భక్తితో... వెంకన్న స్వామి నామస్మరణతో భక్తజనం మురిసింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసింది. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 4.30 గంటలకు స్వామివారి మూలమంత్ర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. మరోపక్క అష్టోత్తర పూజలు, కల్యాణోత్సవం జరిపారు. స్వామివారికి సాయంత్రం గరుడ వాహన, పల్లకీ సేవలు నిర్వహించారు. భక్తుల ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి రూ.14,17,965 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. అంతర్వేది.. భక్తుల పెన్నిధి సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. నిత్య అభిషేకం, సుదర్శన హోమ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుమారు 6 వేల మందికి అన్నదాన పథకంలో భోజన వసతిని కల్పించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్కరోజే రూ.4,13,719 ఆదాయం వచ్చిందని ఏసీ తెలిపారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మామిడికుదురు శివాలయం నుంచి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. గోవిందనామ స్మరణ చేస్తూ భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అప్పనపల్లి బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నారు. 6,500 మంది స్వామిని దర్శించుకోగా, 4,200 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.4,79,852 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. -
కలల తీరం చేరాలిలా..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులోకి కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇలా.. ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్సైట్లో అడ్మిషన్పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు కాకినాడ 6,343 కోనసీమ 2,868 తూర్పు గోదావరి 6,011 మొత్తం 15,222 నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ కాకినాడలో 2 హెల్ప్లైన్ కేంద్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలుస్వయంగా చూసుకోవడం మేలు వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్టేషన్ దగ్గర నుంచి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనే ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకోవాలి విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యమున్నది కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. – డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల -
కామాక్షీ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పణ
అమలాపురం టౌన్: ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన అమలాపురం శ్రీకామాక్షీ పీఠంలోని అమ్మవారికి మహిళలు ఆషాఢం సారె సమర్పించారు. పీఠానికి తరచూ వచ్చే మహిళలు ఆషాఢం సారెతో పాటు దాదాపు రూ.లక్ష విలువైన 10 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. పట్టణంలోని పలు వీధుల నుంచి మహిళలు చీర సారెతోపాటు బంగారు మంగళ సూత్రాలు, పలు రకాల మిఠాయిలతో పీఠానికి ప్రదర్శనగా వచ్చారు. పీఠం బ్రహ్మ గోవిందవజ్జుల నాగబాబు బ్రహ్మత్వంలో ఉత్తరాధికారి విఘనస రాఖీప్రేమ్ తొలుత కామాక్షీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు, పీఠంలోని ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి, ట్రస్ట్ సభ్యులు వీరా నాగేశ్వరరావు, మట్టపర్తి సత్యనారాయణ, పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి దంపతులు, కామనగరువు సర్పంచ్ దాసరి అరుణకుమారి దంపతులు పాల్గొన్నారు. మహిళలు సరిపెల్ల అనంతలక్ష్మి, విజయకుమారి, బాలిరెడ్డి రాధిక, వెత్సా రత్నరాధిక తదితరులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. 9 నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ అమలాపురం రూరల్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రవాణా వాహనాలు, మోటార్ వాహనాల తనిఖీ అధికారులచే జారీ చేసే ిఫిట్నెస్ సర్టిఫికెట్లను ఈ నెల 9 నుంచి ఎ.వేమవరంలో ఏర్పాటైన ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా జారీ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఫిట్నెస్ స్లాట్లు అన్ని ఏటీఎస్కు బుక్ అవుతాయని, దీనికోసం సాఫ్ట్వేర్లో సవరణలు చేశారన్నారు. వాహనదారులు, అదేవిధంగా ఆటో, లారీ ఓనర్స్ యూ నియన్లు గమనించి ఏటీఎస్ ద్వారా వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకుని, ధ్రువీకరణ పత్రాలు పొందాలని ఆయన కోరారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. 1100 కాల్ సెంటర్కు అర్జీదారులు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అడగవచ్చన్నారు. కొత్త ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్లలోని 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. అర్జీదారులు ఆయా స్థాయిల్లో తమ సమస్యలను నమోదు చేసుకుని పరిష్కారం పొందాలన్నారు. -
వేధింపుల పర్వం.. ‘వెలుగు’ వీఓఏ ఆత్మహత్యాయత్నం..
సఖినేటిపల్లి/మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో డీఆర్డీఏ వెలుగు విభాగం వీఓఏ తాండాల ఆదిలక్ష్మి ఆత్మహత్యా యత్నం చేశారు. తమ విభాగంలో వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగారు. అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలోని ఒక గ్రామైక్య సంఘానికి ఆరేళ్లుగా ఆదిలక్ష్మి వీఓఏగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గెడ్డం సులోచన ఆ సంఘానికి అధ్యక్షురాలిగా, ఆఫీసు బేరర్ (ఓబీ)గా ఉన్నారు. ఆమె గతంలో ఓబీగా పనిచేస్తూ మధ్యలో మానేసి, తిరిగి ఇటీవల ఆ బాధ్యతలు చేపట్టారు. పాలనాపరమైన అంశాలు, రుణాలకు సంబంధించిన నగదు విషయంలో సులోచన, ఆదిలక్ష్మి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఇవి తీవ్రరూపం దాల్చి తరచూ మాటామాటా పెరుగుతుండడంతో కలత చెందిన ఆదిలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అకారణంగా వేధిస్తున్నారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మి శనివారం మాట్లాడుతూ.. కొంతకాలంగా వెలుగులో వేధింపులు అధికమయ్యాయని వాపోయారు. సమాఖ్య నిధుల విషయంలో తన తప్పులేకపోయినా, రికార్డులు, బ్యాంకు అకౌంట్లు సక్రమంగా ఉన్నప్పటికీ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వచ్చే జీతాల చెక్కులను పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెడితేనేగానీ ఇవ్వడంలేదని, అకారణంగా దూషిస్తున్నారని ఆదిలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. గ్రూపుల వద్దకు వెళ్తే తిడుతున్నారని ఆర్నెల్లుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించకుంటే పనిచేయలేనని లేఖ కూడా రాశానని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం దురదృష్టకరం.. ఈ ఘటనపై వెలుగు ఏపీఎం అజయ్ స్పందిస్తూ.. సులోచన, ఆదిలక్ష్మి మధ్య వివాదాలను సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పారు. వారిద్దరినీ ఇటీవల కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. ఆ సందర్భంగా ఒకరిపై మరొకరు కేకలు వేసుకోవడంతో చర్చలు వాయిదా వేశామన్నారు. ఈ దశలో వీఓఏ ఆదిలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమని అజయ్ అన్నారు. -
9 కిలోల గంజాయి స్వాధీనం
నలుగురి అరెస్టు ముమ్మిడివరం/ఐ.పోలవరం: సర్కిల్ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు. సీఐ ఎం.మోహన్కుమార్ ముమ్మిడివరంలో విలేకరులతో మాట్లాడుతూ మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద ఐదుగురు యువకులు గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామని, వారిలో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిలో ముగ్గురు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో ఐ.పోలవరం ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!
జిల్లాలో జంతువులు వివరాలు ఇలా... పెంపుడు కుక్కలు 11,159 ఆవులు 70,846 గేదెలు 1,67,106 గొర్రెలు 1,67,052 మేకలు 72,076 పందులు 1,207 పౌల్ట్రీ 1,77,86,778 ● మూగజీవాల పెంపకంపై అవగాహన అవసరం ● వాటిపై ప్రేమ మాటున పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ● అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ జునోసిస్ డే రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: సమాజంలో జంతు ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో వాటి వల్ల వచ్చే వ్యాధులపై వాటిని పెంచుకునేవారికి లేదనేది వాస్తవం. వైద్య పరిశోధన ప్రకారం జంతువల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సుమారు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. జూనిటిక్ వ్యాధులను వైరస్ బాక్టీరియల్, పారసైటిక్ వ్యాధులుగా విభజించారు. వైరస్ వలన సంక్రమించే వ్యాధులలో రేబిస్, మెదడువాపు వ్యాధి, బర్డ్ఫ్లూ వంటివి ముఖ్యమైనవి. బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధుల్లో బ్రూసెల్లా, సాల్మోనెల్లా, లెప్టోసైరోసిస్ మొదలైనవి ఉన్నాయి. కుక్కకాటుతో రేబీస్, పందుల వల్ల మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. జునోసిస్ ఎలా వచ్చిందంటే... పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీపాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ రోజుకు గుర్తుగా ఏటా ప్రపంచ జునోసిస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎంతో అవసరం పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని, సమయం లేక అశ్రద్ధ చేస్తుంటారు. దీని వల్ల అవి కరిచిన, రక్కిన సందర్భాలలో ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. అందువల్ల వాటికి వ్యాక్సినేషన్ చేయించడం ఎంతో అవసరమని గుర్తించాలి. జాగ్రత్తలివీ ● పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలి. ● టీకాల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలి. ● పెంపుడు జంతువులను, వాటి ఆహారాన్ని లేదా వ్యర్థాలను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. లిట్టర్ బాక్సులు, పంజరాలను తరచుగా శుభ్రం చేయాలి. ● బయట తిరిగే జంతువులకు క్రమం తప్పకుండా క్రిములను తొలగించాలి. ● పెంపుడు జంతువులు అడవి జంతువులతో కలవకుండా చూడటంతో పాటు, సరైన రక్షణ లేకుండా గాయపడిన అడవి జంతువులను రక్షించడానికి ప్రయత్నించకూడదు. ● జంతువుల అనారోగ్య లక్షణాలను గమనించాలి. ప్రవర్తన, ఆకలి, లేదా ఏవైనా మార్పులను గమనించడం, ఏదైనా ఆసాధారణమైనది గమనిసై వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. పాడి రైతులకు ఇలా.. ● బలమైన జీవభద్రతా చర్యలను అమలు చేయాలి. ● పశువుల దగ్గరకు అవసరమైన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ● జంతు సమూహాల మధ్య కదిలేటప్పడు పాద రక్షలు, రక్షిత దుస్తులను ఉపయోగించాలి. ● పశుశాలలు, పాలు పిండే ప్రదేశాలు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ● క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ● అనారోగ్యంతో ఉన్న జంతువులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. కోళ్ల రైతులకు జాగ్రత్తలివీ ● ఒకే వయస్సు ఉన్న పక్షులను కలిపి పెంచాలి. ● గుంపుల మధ్య పూర్తిగా శుభ్రపరిచి, ఆ ప్రాంతంలో క్రిమి సంహార మందులు చల్లాలి. ● అడవి పక్షులతో సంపర్కాన్ని నివారించడానికి వలలు లేదా మూసిన గూళ్లను ఉపయోగించాలి. ● ఆహారం తీసుకోవడంలో లేదా గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల వంటి ఆనారోగ్య లక్షణాలను గమనించడంతో పాటు, అసాధారణ మరణాలు లేదా లక్షణాలను వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి. అవగాహన పెంచుకోవాలి ● జూనోటిక్ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటి కప్పడు తెలుసుకోవాలి. ● జంతు ఆరోగ్యం, జూనోసిస్పై వర్క్షాప్లు లేదా సెమినార్లకు హాజరుకావాలి. ● అనుమానిత జూనోటిక్ వ్యాధులను గుర్తిస్తే పశువైద్యులు, అధికారులకు తెలియజేయాలి. వైద్యుల సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజెస్ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, మెదడువాపు వంటివి ఈ రకమైనవే. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్యుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో కుక్కలను పెంచేవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయించకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. ఆదివారం రాజమ హేంద్రవరం ఏరియా పశువైద్యశాలలు, అనపర్తి, బి క్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు వేస్తున్నాం. జునోసిస్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు. అలాగే పెంపుడు జంతువులకు, వాటితో దగ్గరగా మెలిగే యజ మానులకు, పశుసంవర్ధకశాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లుకు, జంతువధశాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశువైద్యాధికారి, తూర్పుగోదావరి ముందస్తు నివారణ మేలు జునోసిస్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనుషులకు, అటు జంతువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాణాంతక జోనోసిస్ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే చాలా వరకు వీటిని ఆరికట్టవచ్చు. జునోసిస్ వ్యాధుల సంక్రమణ, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ ఏడీ, అనపర్తి ప్రేమ ఒక మత్తు. అది మనుషుల మీదయినా.. మూగ జీవాల మీదయినా. వీటి ప్రేమ అన్కండీషనల్. చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు.. ఏళ్ల తరబడి ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకి పడిపోని మనిషుండడు. అవి ఏ స్థితిలో ఉన్నా దానిని ముద్దుచేస్తూ.. దాని నోటిలో చేతులు పెడుతూ.. దగ్గరకు తీసుకుని గాఢాలింగనాలు చేసుకుంటూ ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. పాముకు పాలు పోసి పెంచినా దాని సహజ లక్షణం కాటు వేయడం. అలాగే కుక్కలు.. పిల్లులు.. కోతులు.. కుందేళ్ల వంటి మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచినా స్వాభావికంగా చర్మం.. విసర్జకాలు.. వెంట్రుకలు.. చొంగ తదితరాలు ఎప్పటికీ ప్రమాద హేతువులే. వీటి నుంచి వచ్చే ఉపద్రవాలను గుర్తెరిగి తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటికి సంక్రమించే పలు రకాల వ్యాధులు మానవులకు హానికరం కాకుండా చూసుకుంటూ వాటి ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో చర్యలు తీసుకుంటూనే వాటిని పెంచుకునేవారికి ఆ దుష్ప్రభావాలు సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూగజీవాలు.. వాటి వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జునోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
రాజీ మార్గమే రాజ మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 85 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవని పేర్కొన్నారు. వీటిలో తాము 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసు లు, మొత్తం 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగినద న్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీమార్గంలో పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాదిలో చేపట్టిన నాలుగు లోక్ అదాలత్లలో రూ.167 వందల కోట్లు కక్షి దారులకు నష్టపరిహారంగా అందజేసినట్టు తెలిపారు. తాజాగా పీడీజే కోర్టులోని 01/2025 కేసుకు బాధితుల కుటుంబానికి రూ.1.15 కోట్లు, 379/2023 కేసులో రూ.80 లక్షలు, 135/2025 కేసులో రూ.38.5 లక్షల చెక్కులను అంద చేశామన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు. మొత్తం బెంచీలు 47 కాగా 6179 కేసులకు అవార్డులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల వరకు 473 సివిల్ కేసులు, 5514 క్రిమినల్ కేసులు, 192 పీఎల్సీ కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇంకా కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు. -
హత్య కేసు నిందితులకు రిమాండ్
సామర్లకోట: మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ (19) హత్య కేసు నిందితులు నూతలకట్టు కృష్ణప్రసాద్, దూల్లపల్లి వినోద్లను శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్ విలేకర్లకు తెలిపారు. చెల్లితో మాట్లాడుతున్నాడని ఆమె అన్న కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్తో కలసి కార్తిక్ను హత్య చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్లోకి కార్తిక్ను తీసుకువెళ్లి గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితులు అంగీకరించారని, వీఆర్వో నాగేశ్వరరావు సమక్షంలో వివరాలు సేకరించి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. కార్తిక్ తండ్రి నొక్కు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చామని, కృష్ణప్రసాద్ను ఎ1గా నమోదు చేశామని సీఐ తెలిపారు. -
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
ఒక్కరోజు ఆదాయం రూ.60.42 లక్షలు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఏడు శనివారాల వ్రతంతో పాటు సాధారణ దర్శనాలకు వచ్చిన భక్తుల హరినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ.60,41,722 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ధర్మపథంలో భాగంగా నృత్య కళాకారుల బృందం వేంకటేశ్వర వైభవం, తదితర కూచిపూడి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. -
అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్
కాకినాడ రూరల్: రూరల్ మండలం వాకలపూడి గ్రామ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్న అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలుపై శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలశాఖ అధికారుల పర్యవేక్షణలో సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరావు, ఇన్స్పెక్టర్ రాంబాబు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. -
కూటమిలో మట్టి పంచాయితీ!
మర్లావ, ఆర్బీ పట్టణాల్లో జనసేన x టీడీపీ పెద్దాపురం: గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. మండలంలోని మర్లావ గ్రామంలో టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ జేసీబీతో ఏలేరు కాలువ మట్టిని తరలించుకుపోవడాన్ని జనసేన నాయకులు గవరసాని దివాకర్ వర్గీయులు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే మండలంలోని దివిలి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ తమకు చెప్పకుండానే చేస్తున్నారని నీటి సంఘం ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు జట్లా విజయ్బాబు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే విధంగా మండలంలోని ఆర్బీ పట్నంలో చెరువు మట్టి తవ్వకాల విషయంలోనూ జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య పోరు సాగుతోంది. అధికారులు ఇరువర్గాలకు చెప్పలేక మౌనం దాల్చడంతో ఆధిపత్యపోరులో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. 18 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టివేత ● కేసు నమోదు చేసిన అధికారులు ● రూ.8.28 లక్షల సరకు స్వాధీనం దేవరపల్లి: నల్లజర్లలోని ఓ బియ్యం మిల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు లారీలో తరలిస్తున్న 400 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండలంలోని యర్నగూడెం–పోతవరం రోడ్డులో పట్టుకున్న బస్తాల్లో సుమారు రూ.8.28 లక్షల విలువైన 18 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్టు మండల పౌరసరఫరాల అధికారి ఎ.సత్యనారాయణ తెలిపారు. కాగా అధికారులు నిర్వహించిన వేలంలో ఈ బియ్యాన్ని పాడుకుని తరలిస్తున్నట్టు మిల్లు యజమాని చూపిన పత్రాలు కాల పరిమితి ముగిసినవని గుర్తించినట్టు అధికారులు గుర్తించారు. లారీని, అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని డీటీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎస్. తాతారావు, సీఐ మధుబాబు, ఏఎస్ఓ నాగాంజనేయులు, వీఆర్వో ఎస్కే బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీ ఎయిమ్స్లో జాన్వికి సీటు
చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (ఎయిమ్స్)లో సీటు సాధించింది. ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల (కేజీహెచ్)లో ఎంబీబీఎస్ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. -
760 టన్నుల ఇసుక అక్రమ నిల్వ స్వాధీనం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు, బీజాపురి టౌన్షిప్లో రోడ్లపై అక్రమంగా నిల్వ చేసిన గోదావరి ఇసుకను వాహనాలతో సహా టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు మనీషా, శైలజ, ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేసి రెండు చోట్ల నిల్వ చేసిన 760 టన్నుల ఇసుకను, అదే సమయంలో అక్కడకు అర టన్నులోడుతో వచ్చిన లారీని సీజ్ చేశారు. కాగా ఇసుక రవాణా బిల్లు ఉదయం తీసుకున్నప్పటికీ దానితోనే రోజంతా వీలైనన్ని ట్రిప్పులు వేస్తున్నట్టు గుర్తించారు. ఇసుక అక్రమ నిల్వలపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి డి. ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. -
మానసిక ప్రశాంతతకు విపశ్యన ధ్యానం
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: ఒత్తిడిని అధిగమించి శాంతి సాధనకు విపశ్యన ధ్యానం మంచి మార్గమని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎంఈవోలు, హెచ్ఎంలతో ఈ ధ్యానంపై సమీక్షించి విద్యార్థులతో సాధన చేయించాలని సూచించారు. చదువుకునే విద్యార్థులలో ఒత్తిడిని అధిగమించేందుకు, ఆధ్యాత్మిక మార్గం సాధనకు ఈ ధ్యానం ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 8 వసతి గృహ పాఠశాలల్లో ఈ ధ్యానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు వ్యక్తిగత శ్రద్ధతో ఈ ధ్యానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను వయసుల వారీగా విభజించి ఆగస్టు 15 నాటికి డీఈఓకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఈ మేరకు మౌలిక వసతులు సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. విపశ్యన ధ్యాన గురువు వాణి మాట్లాడుతూ జిల్లాలో 8 రెసిడెన్షియల్ పాఠశాలలో మిత్ర కార్యక్రమం ద్వారా 2700 మంది విపశ్యన ధ్యాన యోగలో శిక్షణ పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ధ్యాన యోగ గురువులు లక్ష్మయ్య, నాగార్జున, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంఈవోలు పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ వేతనాల సవరణ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి నాన్ మస్తర్ రోల్ వేతనాలు సవరించినట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. నైపుణ్యం కలవారికి రూ.734 నుంచి రూ.764 వరకు, మధ్యస్థాయి నైపుణ్యం చూపేవారికి రూ.518 నుంచి రూ.539 వరకు, నైపుణ్యం లేని పనివారికి రూ.416 నుంచి రూ.433 ల వరకు పెంచడం జరిగిందన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి వేతనాల సవరణ కోసం వివిధ విభాగాల ఇంజినీర్లు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లతో సంప్రదింపులు జరిపి వేతనాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
కర్ణాటక ఓపెన్ చెస్ విజేత అక్షయ
జాతీయ స్థాయికి ఎంపిక అమలాపురం రూరల్: మండలంలోని సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఓపెన్ చెస్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. కర్ణాటకలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న అక్షయ చదువుతో పాటు చెస్లో తన ప్రతిభను చాటి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత ద్వారా జాతీయ స్థాయికి అర్హత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. సవరప్పాలేనికి చెందిన అక్షయ తల్లిదండ్రులు వృత్తి రీత్యా కర్ణాటకలో స్థిరపడ్డారు. అక్షయ విజయంపై గ్రామంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఆమె జాతీయ స్థాయిలో విజయం సాధిచాలని అక్షయ తాతయ్య సత్తి ప్రసాద్, నానమ్మ వరలక్ష్మి, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. -
పనస.. ‘ఫల’ప్రదం
పనస సాగుకూ కోనసీమ పెట్టింది పేరు. మార్చి నుంచి జూలై వరకూ పనస సీజన్. ఒక్కో చెట్టుకు 50 నుంచి 100కు పైగా కాయలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా కొబ్బరిలో అంతర పంటగా సుమారు 100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అంబాజీపేట కేంద్రంగా ఏటా రూ.కోటి విలువైన పనస కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఏ దిల్ ‘మ్యాంగో’మోర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పండే బంగినపల్లి కాయకు యమ క్రేజ్ ఉంది. ఈ సీజన్లో ఇక్కడ పండే బంగినపల్లికి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు చైన్నె, బెంగళూరులో కూడా డిమాండ్ ఉంది. గూడపల్లితో పాటు చుట్టుపక్కల సుమారు 2 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. -
ఆశ్చర్య‘పోక’ తప్పదు
కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత. ‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా. గుండెలు ‘గెల’చిన ఎర్ర చక్కెరకేళీ ఎర్ర చక్కెరకేళీ రుచిలో రారాజు. తమిళ వాసులు అమితంగా ఇష్టపడతారు. టైప్–2 మధుమేహ బాధితులూ నిర్భయంగా తింటారు. కోనసీమతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకూ ఉంటోంది. రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి రోజుకు సగటున రెండు లారీల ఎర్ర చక్కెరకేళీ ఎగుమతి అవుతోంది. -
ప్రతిభావంతుల లెక్క తేలింది..
● జిల్లాలో పూర్తయిన సర్వే ● కొత్తగా 327 మంది గుర్తింపు ● జిల్లాలో ఇప్పటికే 2,896 మంది పిల్లలు ● గుర్తించిన వారికి సమీప పాఠశాలల్లో అడ్మిషన్లు రాయవరం: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం సహిత విద్యలో భాగంగా భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వారి స్థాయి, అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేందుకు వారికి ఈ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయి. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల బలోపేతానికి సమగ్ర శిక్షా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా భవిత కేంద్రానికి వచ్చే చిన్నారులతో పాటు, రాకుండా ఇంటి వద్దే ఉంటున్న చిన్నారుల లెక్క తేల్చేందుకు మే 13వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించారు. సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో జిల్లాలో ఉన్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు మరికొంత మందిని గుర్తించారు. జిల్లాలోని 22 మండలాల్లో ఇప్పటికే 2,896 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉండగా, తాజాగా చేసిన సర్వేలో 327 మందిని గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందేలా జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. యూ–డైస్లో నమోదు విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను మండల యూనిట్గా లెక్కించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 2,986 మందితో పాటు, కొత్తగా గుర్తించిన 327 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో వారి వయసుకు అనుగుణంగా ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తూ, ఆయా పాఠశాలల యూ–డైస్ కోడ్లో విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లల వాస్తవ గణాంకాల్లో పారదర్శకతతో పాటు, వారు ఎక్కడ చదువుతున్నారనేది తెలుసుకునే అవకాశం ఉంది. భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు ఏడుగురు ఫిజియోథెరపిస్టులు చిన్నారులకు సేవలందిస్తున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులు కావటంతో వీరికి ఆటపాటలతో చదువులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన ఆట పరికరాలు, వస్తువులను కేంద్రాలకు సమకూరుస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలో ఇరువురు ఐఈఆర్పీలు కేంద్రానికి వచ్చే చిన్నారులకు విద్యను అందిస్తారు. వీరితో పాటు ప్రతి కేంద్రంలో ఒకరిని ఆయాగా నియమించారు. శారీరక వైకల్యం అధికంగా ఉన్న చిన్నారులకు ఇంటి వద్దనే అవసరమైన వైద్య సేవలు అందించేలా ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా పాఠశాలకు వెళ్లని విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల ఇళ్లకు ఐఈఆర్పీలు వెళ్లి బోధన చేస్తారు. జిల్లాలో పరిస్థితి ఇదీ జిల్లాలో భవిత కేంద్రాలు 22 ప్రత్యేక అవసరాల పిల్లలు 2,986 భవిత కేంద్రాలకు వచ్చే వారు 486 హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ 220 పొందుతున్న వారు కేంద్రాల్లోని ఐఈఆర్పీలు 44 ఆయాలు 22 ఫిజియోథెరపిస్టులు 07 -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో ఐదుగురికి చోటు
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలలో జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ సమాచారాన్ని జిల్లా పార్టీకి పంపించింది. రాష్ట్ర వలంటీర్స్ విభాగం జోనల్ అధ్యక్షుడిగా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కట్టా రామ శేఖర్, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జోనల్ అధ్యక్షునిగా భూపతి అజయ్కుమార్ (రాజోలు నియోజకవర్గం), రాష్ట్ర స్టూడెంట్ విభాగం అధికార ప్రతినిధిగా తాడి సహదేవ్ (రాజోలు నియోజకవర్గం), రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కార్యదర్శిగా పడాల శ్రీహరికృష్ణ రెడ్డి (కొత్తపేట నియోజకవర్గం) నియమితులయ్యారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రుద్రరాజుమలికిపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రుద్రరాజు వెంకట నరసింహ శ్రీ పద్మరాజు (చిన్నరాజా) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి రుద్రరాజు రామలింగరాజు కుటుంబం నుంచి చిన్నరాజాకు పార్టీ పదవి దక్కడంపై నియోజక వర్గ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. చిన్నరాజా శనివారం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అలుపెరుగని కృషి చేస్తానన్నారు. తనకు పదవి కోసం సహకరించిన నియోజకవర్గ కోఆర్డినేటరు గొల్లపల్లి సూర్యారావు, నాయకులు కేఎస్ఎన్ రాజు, జంపన బుజ్జీరాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు, జెడ్పీటీసీలు దొండపాటి అన్నపూర్ణ, బల్ల ప్రసన్న కుమారి, మట్టా శైలజ, కుసుమ వనజ కుమారి, పాటి శివకుమార్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశం అమలాపురం రూరల్: ఈ నెల పదో తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో ఈ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి ‘విట్నెస్’ అవసరమా? అమలాపురం టౌన్: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలలో జరిగే మెగా పీటీఎంలో విట్నెస్ అధికారిని పాఠశాల హెచ్ఎం నియమించి వారి చేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలనే సమగ్ర శిక్ష రాష్ట్ర శాఖ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వీరు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో విట్నెస్ అధికారి విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు కలిసి విద్యార్ధుల క్రమశిక్షణపైన, విద్యాభివృద్ధిపైన మాట్లాడుకోవటానికి ఇంత తతంగం అవసరమా అని వారు ప్రశ్నించారు. బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను పరిమితం చేస్తామని చెప్పిన విద్యా శాఖ దానికి భిన్నంగా బోధనేతర కార్యక్రమలకూ వినియోగించడం తగదని నాయకులు పేర్కొన్నారు. శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి 3,84,962 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
ఉద్యాన పంటలు భేష్ ● అరుదైన ఎర్ర చక్కెరకేళీ సాగులో అగ్రస్థానం ● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు ● కేరళను మించిన ‘వక్క’ ● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత ● గూడపల్లి మామిడికి యమ క్రేజ్సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటల సాగులో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులైతే ఇక్కడి ఉత్పత్తుల కొనుగోలుకు ఎంతో ఆసక్తి చూపుతారు. పంటల సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు రుచిలోనూ చవులూరించడమే ఇందుకు కారణం. ఆను‘పాను’ తెలుసు కోనసీమ నుంచి వెళ్తున్న తమలపాకును ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆనుపానులు తెలుసుకుని ఇక్కడ రైతులు పండించే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు చెబుతుంటారు. జిల్లాలోని పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి మండలాల్లో సుమారు 240 ఎకరాల్లో ఈ పంట పండుతోందని అంచనా. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ వరకు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
రత్నగిరిపై భక్తజనవాహిని
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ● 1,500 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని 25 వేల మంది భక్తులు దర్శించుకోగా 1,500 మంది వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 5 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు తొలి ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పాలతో, 9 గంటలకు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగిస్తారు. ‘లోవ’ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లి, తిరిగి వచ్చే భ క్తుల కోసం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యా కెట్లు సుమారు లక్ష సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత నెల 29న తొలి ఆదివారం 75 వేల ప్ర సాదం ప్యాకెట్లు విక్రయించగా, రూ.15 లక్షల ఆదా యం సమకూరింది. ఈసారి లోవ భక్తులు మరింత ఎ క్కువగా ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరంలో రత్నగిరి తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
అభినందన సీమ
రావులపాలెం మండలం గోపాలపురంలో తమలపాకు తోటలు బ్రాండింగ్ కోసం కృషి కోనసీమలో పండే గూడపల్లి మామిడి, ఎర్ర చక్కెరకేళీ, పనస, తమలపాకు, పోక, ఇతర ఉద్యాన పంటలకు అరకు కాఫీ తరహాలో ప్రత్యేక బ్రాండింగ్ కోసం కృషి చేస్తున్నాం. దీంతో పాటు సాగు విస్తీర్ణం పెంచేందుకు, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నాం. – బీవీ రమణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇస్తున్నాం
సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. భవిత కేంద్రాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. కేంద్రాల పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – ఎంవీవీ సత్యనారాయణ, సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్, ప్రతి ఒక్కరికీ సహిత విద్య ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. శారీరక, మానసిక పరిస్థితికి అనుగుణంగా వారికి అవసరమైన విద్యను భవిత కేంద్రాల ద్వారా కల్పిస్తున్నాం. వారికి అవసరమైన ఉపకరణాలు అందించడంతో పాటుగా, అలవెన్సులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భవిత కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టరు, అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ నియామకం
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కమిటీలో పలువురిని కేంద్ర కార్యాలయం నియమించింది. కమిటీ ఉపాధ్యక్షులుగా కుడుపూడి విద్యాసాగర్ (బుజ్జి) (పి.గన్నవరం నియోజకవర్గం), కొయ్య బంగారుబాబు (రామచంద్రపురం), దూలం వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు) (మండపేట), నాతి సత్యనారాయణ (ముమ్మిడివరం), గుత్తుల వాసు (కొత్తపేట), కూనపరెడ్డి ఎస్ఆర్వి ప్రసాద్ (రాజోలు). సుభాష్ చంద్రబోస్ (అమలాపురం), ప్రధాన కార్యదర్శులుగా పెట్టా శ్రీనివాసరావు (రామచంద్రపురం), వెలగల సత్యనారాయణ (మండపేట), వాత్సవాయి కృష్ణంరాజు (కొత్తపేట), రాయపురెడ్డి జానకి రామయ్య (ముమ్మిడివరం), ఈద రవిరెడ్డి (రాజోలు), కోశాధికారిగా కాలెపు నాగ శ్రీనివాసరావు (అమలాపురం), సెక్రటరీ ఆర్గనైజేషనల్గా పి.గన్నవరానికి చెందిన కొంబత్తుల ఏసుబాబు, వాసంశెట్టి నాగ భూషణం (పెదబాబు), నంబూరి శ్రీరామచంద్రరాజు, రామచంద్రపురానికి చెందిన చిట్టూరి శ్రీనివాసరావు, మాత నూకారావు, మండపేటకు చెందిన పలివెల మధు, కొప్పిరెడ్డి వెంకట శివ ప్రసాద్, ముమ్మిడివరానికి చెందిన సక్కెలి వెంకటేశ్వర్లు, అంకాడి అంజిబాబు, కొత్తపేట నుంచి బండారు దొరబాబు, నంగెడ్డ రంగారావు, దొడ్డారపు వీర వెంకట సుబ్బారావు, మాగాపు విజయకుమార్, రాజోలు నుంచి తులా సత్యనారాయణ, కొల్లాటి నరసింహస్వామి. అమలాపురం నుంచి ఆర్.నాగేశ్వరరావు, చింతా రామకృష్ణ. బడుగు మేరి, సెక్రటరీ యాక్టివిటీలుగా పి.గన్నవరం నుంచి బొంతు శ్రీనివాసరావు, పిల్లి శ్రీనివాసరావు, రామచంద్రపురం నుంచి చొల్లంగి బాలు ప్రకాష్, వెన్నేటి సుందర రామ్కుమార్, మండపేట నుంచి గుడిమెట్ల శివరామకృష్ణ (రాంబాబు), టేకిమూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం నుంచి కళా వెంకట రమణ, బడుగు శ్రీనివాసరావు, కొత్తపేట నుంచి గొలకోటి సూర్య ప్రకాష్, షేక్ వల్లీబాబు, వాకలపూడి సుబ్బారావు, దొడపాటి పనసయ్య, రాజోలు నుంచి తాడిచెర్ల మల్లీశ్వరిలను నియమిస్తూ జిల్లా పార్టీ కార్యాలయానికి సమాచారం పంపించింది. వైద్యులు, విద్యార్థులకు అండగా వైఎస్సార్ సీపీ ●అమలాపురం టౌన్: గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలనుకుంటే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసి నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్, జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ అన్నారు. స్థానిక పార్టీ విద్యార్థి విభాగం కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకో వైద్య కళాశాల నిర్మాణంలో జాప్యం వల్ల వైద్య విద్య చదవాలనుకునే పేద విద్యార్థులు, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నిర్వాకం వల్ల అక్కడి మెడికోలు పర్మెనెంట్ రిజస్ట్రేషన్ సర్టిిఫికెట్లు పొందలేక ఇబ్బంది పడుతున్న వైనంపై వారు ధ్వజమెత్తారు. వైద్య విద్యార్థులు, వైద్యులకు పార్టీ విద్యార్థి విభాగం సంఘీభావం తెలుపుతోందన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపు మేరకు ఈ సమస్యలపై 7వ తేదీన విజయవాడ ఎన్టీఆర్ వర్శిటీ వీసీకి వినతి పత్రం అందించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థి విభాగం ప్రతినిధులు బడుగు మోహన్, పెట్టా సత్తిబాబు, ముత్యాల జగన్, మారే రవితేజ, జల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా పట్టాల పండగ
●● ఘనంగా జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం ● కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ● బంగారు పతకాలు, పట్టాల ప్రదానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూకేలో శుక్రవారం 11వ స్నాతకోత్సవం వర్సిటీ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్సిటీ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. 2023 మే 31న 9వ స్నాతకోత్సవం, 2024 జనవరి 30వ తేదీ వర్సిటీ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు వరుసగా మూడవ సారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు పొందేవారు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు(సుబుకోటా)కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు మధ్య 40మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్స్ అవార్డ్స్ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెల్ఫీలతో సందడి చేశారు. పరిమితంగా అనుమతి ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. షెడ్యూల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని సమాచారం ఇవ్వగా ఆయన వేడుకలకు హాజరుకాలేదు. ముఖ్యఅతిథి శ్రీ కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట)మాట్లాడుతూ సాంకేతిక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాల్టీల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు స్టార్టప్ల కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషనన్ సెల్స్ విశిష్టతను తెలిపారు. రేపటి యూనికార్న్లుగా మారేందుకు సొంత స్టార్టప్లను ప్రారంభించాలనుకునే జేఎన్టీయూకే విద్యార్థులను ఆయన అభినందించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపడుతున్న పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దాలని, మార్పులు చేయడంలో ధైర్యం, ధృడ నిశ్చయం, పెద్ద కలలు కనే సాహసం, సాంకేతిక కార్యకలాపాలలో లోతైన పరివర్తనకు ధైర్యం అవసరమని పట్టభద్రులకు సూచించారు. పరిశోధన కోసం నూతన కోణాలను అవలంబించాలని, సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్ట్లను చేపట్టాలని కోరారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలు, పరిశ్రమలలో పరిశోధనలను జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జాతీయ క్వాంటమ్ మిషన్లో పాల్గొని సమాజ ప్రయోజనం కోసం అధునాతన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. అమృత్ కాల్కు సంబంధించి స్పష్టమైన విజన్ను రూపొందించడానికి, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. అధిక కొవ్వు గల పదార్థాలను తీసుకోరాదని, పొగ తాగడం, మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, దీనికి ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం ఉప కులపతి ప్రొ.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. ఈ స్నాతకోత్సవంలో 99 మంది రీసెర్చ్ స్కాలర్స్కు పీహెచ్డీ అవార్డులు అందజేశారు. కలెక్టర్ శ్రీ ఎస్.షణ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్రనాఽథ్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కొప్పిరెడ్డి పద్మరాజు, శ్రీనివాసకుమార్, కే.మురళీకృష్ణ, శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
భూముల రక్షణలో యంత్రాంగం
● రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సేకరించిన భూమికి కంచె ఏర్పాటు ● అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం సాక్షి, అమలాపురం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన రైల్వే ప్రాజెక్టు.. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సేకరించిన భూములకు ఫెన్సింగ్, లేదా స్తంభాలు వేయాలని నిర్ణయించింది. రెండు దశాబ్దాల క్రితం సేకరించిన భూమికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. కోటిపల్లి – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద గౌతమీ నది వంతెన నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకు రైల్వే శాఖ గతంలో భూమి సేకరించింది. దీనికి అప్పట్లోనే పరిహారం చెల్లించింది. సేకరించిన భూమి రైల్వే శాఖ పరిధిలోకి వచ్చినా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టిలేదు. రైల్వేలైన్ కోసం సేకరించిన ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2000లో మొదలైన ప్రాజెక్టు పనులకు 2016 వరకు పెద్దగా నిధులు కేటాయింపు జరగలేదు. ఇప్పుడు ప్రాజెక్టుకు నిధులు వచ్చి నిర్మాణాలు జరుగుతున్నా అవి కేవలం నదీపాయలపై మూడు వంతెనల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనితో శానపల్లిలంక నుంచి భట్నవిల్లి వరకు సేకరించిన భూమి రికార్డులలో రైల్వే పరిధిలో ఉండగా వాస్తంగా అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నారు. రెండు పుష్కరకాలాల తరువాత ఈ భూమిపై వివాదం రేగింది. ఇప్పుడు ఇస్తున్నట్టుగా పరిహారం ఇవ్వాలని కొంతమంది కోర్టును ఆశ్రయించడం, దీనిపై స్టే ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ కేసులపై స్టేలను కోర్టు ఎత్తివేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వేలైన్కు సేకరించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడం, లేదా స్తంభాలు పాతడం చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వైనతేయ, వశిష్ట నదీపాయలపై వంతెనలకు సేకరించిన భూములకు, కొత్తగా సేకరించే భూముల విషయంలో కూడా ఇదే తరహా అవలంబించాలని నిర్ణయించింది. పనిలో పనిగా జాతీయ రహదారి 216 ఈ, ఇతర నిర్మాణాలకు సేకరించిన భూముల పరిరక్షణకు సిద్ధమైంది. దీనిపై జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రక్రియలో ఎన్హెచ్, ఆర్అండ్బీ, రైల్వే శాఖలు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం భూసేకరణ పురోగతిని పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఆర్డీవోలు పి.శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, ఎన్హెచ్ డీఈఈ టి.నిక్కి క్రేజీ పాల్గొన్నారు. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి కొత్తపేట: ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అల్లూరి జయంతి పురస్కరించుకుని శుక్రవారం ఆత్రేయపురంలో ఆయన అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అల్లూరి సీతారామరాజు పార్కు, ఆ గ్రామ సెంటర్లో సీతారామరాజు విగ్రహాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి నాగిరెడ్డి, ముదునూరి కృష్ణంరాజు, వేగేశ్న గోపాలరాజు, గొట్టుముక్కల గోపి పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరులో అల్లూరి పాత్ర చారిత్రాత్మకం : జిల్లా ఎస్పీ కృష్ణారావు అమలాపురం టౌన్: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు పోరు సలిపారని, అందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చారిత్రాత్మకమని ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జయంతి సభలో ఎస్పీ మాట్లాడారు. తొలుత మన్యం వీరుడు అల్లూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్బీపీ ప్రసాద్ స్వాతంత్య్ర సమరంలో అల్లూరి పాత్రను వివరించారు. జిల్లా ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాసరావు, సోషల్ మీడియా పర్యవేక్ష సీఐ జి.వెంకటేశ్వరరావు, ఆర్మ్డ్ ఆర్ఐ బ్రహ్మానందంలతో పాటు ఎస్పీ కార్యాలయ ఎస్సైలు, సిబ్బంది విప్లవ వీరుడు అల్లూరి సేవను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించారు. -
రేషన్షాపులకు చేరని బియ్యం
అయినవిల్లి: ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రేషన్ బియ్యం వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం నిలిపేసి పాత విధానంలో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల మూడోవ తేదీ దాటినా అయినవిల్లి మండలంలోని చాలా వరకూ షాపులకు రేషన్ బియ్యం దిగుమతి కాలేదు. దీంతో రేషన్షాపు యజమానులు చేసేది లేక లబ్ధిదారులను వెనుకకు తిరిగి పంపిస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ఒకటో తేదీనే రేషన్ బియ్యం ఇంటికి వచ్చేవని, కూటమి ప్రభుత్వం విధానం మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వెళ్లి అక్కడ తలుపులకు తాళాలు దర్శన మిస్తున్నాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులకు పరిస్థితి వివరించారు. మండలంలోని 41 రేషన్ షాపులు ఉండగా 30 శాతం షాపులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. గోడౌన్లో బియ్య సరఫరా లేకపోవడంతో ఆలస్యం అయిన మాటా వాస్తవమేనని, స్టాకు రాగానే మిగిలిన 70శాతం షాపులకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. -
కోనసీమ రైలుకు పచ్చజెండా
టీడీపీ సర్కారుకు ముందు చూపు లేక● తొలుత ఈ రైల్వేలైన్కు అమలాపురం భట్లపాలెం వద్ద రైల్వేస్టేషన్ రావాల్సి ఉంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో రైల్వేస్టేషన్కు శంకుస్థాపన కూడా జరిగింది. అక్కడ నుంచి భైర్రాజు ఫౌండేషన్ భవనం మీదుగా కామనగరువు, రోళ్లపాలెం, పేరూరు పేరమ్మ అగ్రహారం మీదుగా బోడసుకుర్రు చేరాల్సి ఉంది. ఇప్పుడున్న జాతీయ రహదారి 216 బైపాస్కు, అమలాపురం పట్టణం మధ్య నుంచి ఈ లైన్ వెళ్లాల్సి ఉంది. ● 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్కు ఇబ్బంది ఏర్పడుతోందనే ముందు చూపు లేకుండా 216 బైపాస్ నిర్మాణం చేశారు. దీంతో పాత రెల్వే ఆలైన్మెంట్ ప్రకారం ట్రాక్ నిర్మాణం చేస్తే పలుచోట్ల బైపాస్ రోడ్డును ఆనుకుని వెళుతోంది. దీనివల్ల రైల్వే లైన్ నిర్మాణం సాధ్యం కాదు. పైగా బైపాస్ నుంచి ఎక్కడ రోడ్డు దిగినా రైల్వే ట్రాక్ దాటుకుని పట్టణంలోకి రావాల్సి ఉన్నందున రైల్వేగేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. ● ఇబ్బందులు గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భట్నవిల్లి సమీపంలో బైపాస్ మొదలయ్యే ప్రాంతం కన్నా ముందు నుంచే రైల్వేలైన్ వెళ్లేలా చూడాలని నిర్ణయించింది. దీని ప్రకారం రైల్వేట్రాక్ నిర్మాణం జరిగేలా భూసేకరణకు ప్రతిపాదించింది. రైల్వేలైన్ భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది. ● దీనివల్ల కేవలం రెండుచోట్ల జాతీయ రహదారి 216 దాటాల్సి వస్తుంది. ఈ ఆలైన్మెంట్కు సంబంధించి అధికారులు సర్వే చేపట్టారు. సర్వే పనులు వేగంగా జరిగాయి. కొత్త ఆలైన్మెంట్లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్లైన్లు, నివాస గృహాలు, ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం పైప్లైన్లను ఈ సర్వేలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణకు రాజోలు దీవిలో సర్వే వేగంగా చేశారు. కోనసీమ రైల్వేలైన్ ప్రాజెక్టుకు చిక్కుముళ్లు వీడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు సంబంధించి వేసిన కేసుల విషయంలో హైకోర్టు ఉదారంగా స్పందించింది. కొత్త, పాత అలైన్మెంట్కు సంబంధించి భూ సేకరణ, సర్వేల విషయంలో ఉన్న స్టే లను ఎత్తివేసింది. దీంతో సర్వే పనులు వేగంగా జరుగనున్నాయి. మూడు నదీపాయలపై నిర్మించాల్సిన వంతెనలకు సంబంధించి పిల్లర్లు పూర్తి కాగా, రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజకోనుంది. ● భూసేకరణకు వీడిన ఆటంకాలు ● కొత్త అలైన్మెంట్ సర్వేకు లైన్ క్లియర్ చేసిన హైకోర్టు ● సర్వేకు నిధులు కేటాయించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● అప్పుడే మలికిపురం.. అమలాపురం మండలాల్లో మొదలైన సర్వే ● ప్రతి ఏటా నిధులు సాధించిన జగన్ సర్కారు సాక్షి, అమలాపురం: కోనసీమ రైల్వేకు ఉన్న ప్రధాన అడ్డంకి వీడింది. రైల్వేలైన్ భూసేకరణ, రీ అలైన్మెంట్ సర్వేల విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ధర్మాసనం బుధవారం ఎత్తివేసింది. దీంతో సర్వే పనులు తిరిగి వేగం అందుకోనున్నాయి. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ఆలైన్మెంట్ వల్ల భూములు కోల్పోతున్న వారు కోర్టును ఆశ్రయించారు. శానపల్లిలంక నుంచి అమలాపురం భట్నవిల్లి వరకు 20 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన వారు తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు విషయాలపై గతంలో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు వాటిని ఎత్తి వేయడంతో సర్వే పనులు జోరందుకోనున్నాయి. కోనసీమ రైల్వేలైన్ నిర్మాణ పనులకు 2000లో శంకుస్థాపన జరిగింది. 2001లో తొలి అలైన్మెంట్ వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణం చేయాలని నాటి వాజ్పేయి సర్కార్ నిర్ణయించింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పూర్తయిన రైల్వేలైన్ అక్కడ నుంచి నర్సాపురం వరకు రెండు దశాబ్ధాలు అవుతున్నా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు పనులు 2016 నుంచి తిరిగి ఊపందుకున్నాయి. గోదావరి మూడు నదీపాయలపై నిర్మించే వంతెనలకు సంబంధించి పిల్లర్ల పనులు పూర్తయ్యాయి. గౌతమీపై కోటిపల్లి– శానపల్లిలంకల మధ్య నిర్మిస్తున్న వంతెనకు గెడ్డర్లు, ఇతర ట్రాక్కు సంబంధించి టెండర్లు ఖరారై పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్ మొత్తం పొడవు 102.507 కిమీలు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 45.30 కిమీల నిర్మాణం పూర్తికాగా, కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57.207 కిమీల వరకు నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి అమలాపురం శివారు భట్నవిల్లి వరకు 12.05 కిమీల వరకు గతంలో భూసేకరణ సైతం పూర్తయ్యింది. అమలాపురం నుంచి నర్సాపురం వరకు 45.157 కిమీల వరకు నిర్మించాల్సిన రైల్వేలైన్కు భూసేకరణ పెండింగ్లో ఉంది. దీనిలో వైనతేయ, వశిష్ఠలపై వంతెన నిర్మాణాలకు భూసేకరణ జరిగింది. మిగిలిన రైల్వే ట్రాక్కు, స్టేషన్ల నిర్మాణాలకు భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణకు నిధులిచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుమారు 600 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అంచనా. నిధులు మంజూరు కావడంతో అప్పట్లోనే జిల్లా యంత్రాంగం అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో రైల్వేలైన్కు అవసరమైన భూమి గుర్తించేందుకు సర్వే చేపట్టింది. రైల్వేశాఖతోపాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2020–21 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.1,490 కోట్లు కేటాయించారు. అంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున రూ.300 కోట్లు కేటాయించినట్టు. గత టీడీపీ పాలనలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.1,035 కోట్లు అంటే సగటున రూ.207 కోట్ల చొప్పున కేటాయించడం విశేషం. -
గురుకుల పాఠశాలలో ఉడకని అన్నం
– ఎస్సీ హాస్టల్లో రుచిలేని భోజనాలు అమలాపురం రూరల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్, లక్ష్మిరెడ్డి బుధవారం రాత్రి అమలాపురం రూరల్ మండలం సమనస గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనాలు పెట్టే సమయంలో తనిఖీ చేయడంతో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. ఉడకని అన్నం విద్యార్థులకు పెట్టడాన్ని ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. విద్యార్థులు తినకుండా వదిలి వేయడంతో ఆరా తీసి ప్రశ్నించారు. దాంతో పలు లోపాలు ఉన్నట్లు ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. అనంతరం కామనగరువు బీవీ రమణయ్య కాలనీలో గల ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాన్ని ఫుడ్ కమిషన్ సభ్యుల బృందం తనిఖీ చేసింది. గురుకుల పాఠశాలలో గుర్తించిన లోపాల కంటే మరింతగా అక్కడ సమస్యలు ఉన్నట్లు ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంటే ఎస్సీ హాస్టల్లో మాత్రం గతంలో ఇచ్చిన బియ్యాన్ని వండి విద్యార్థులకు పెడుతున్నారు. అంతేకాకుండా వండిన కూరల్లో రుచి కనిపించలేదు. ఆ రుచి లేని ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడం వల్ల పలువురు విద్యార్థులు భోజనాలు చేయనట్లుగా తనిఖీల్లో తేలింది. దాంతో ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వార్డన్లపై చర్యలకు ఆదేశించారు. -
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రైతును కదిలించినా ధాన్యం సొమ్ము రాలేదంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. గొప్ప చెప్పి.. చిప్ప చూపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. అప్పు పుట్టక.. కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి మార్కెట్లో నగదు చలామణీ భారీగా పడిపోయింది. దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు. జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు కాకినాడ రూ.80 కోట్లు కోనసీమ రూ.189 కోట్లు తూర్పు గోదావరి రూ.130 కోట్లు మొత్తం రూ.399 కోట్లు నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు ధాన్యం సొమ్ము ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్న అప్పులతోనే ఖరీఫ్ సాగు అట్లపాడులో 9.2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఎకరాకు రూ.45 వేల వరకూ పెట్టుబడి పెట్టి రబీ సాగు చేశాను. ఎకరాకు 49 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్ 27న రైస్మిల్లుకు తోలాను. రూ.7.60 లక్షల వరకూ రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినా ప్రభుత్వం ఇంకా మా డబ్బులు జమ చేయలేదు. దీంతో, మళ్లీ అప్పులు చేసి ఖరీఫ్ సాగు చేపట్టాను. – కొత్తపల్లి సత్యనారాయణ, కౌలు రైతు, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం -
రామలక్ష్మిని రప్పించేందుకు ఏర్పాట్లు
అమలాపురం రూరల్: మస్కట్లో చిక్కుకున్న అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మిని స్వదేశానికి తీసుకురావాలన్న విన్నపంపై కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్పందించారు. విలసకు చెందిన రామలక్ష్మి మస్కట్లో చిక్కుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసుకు రావాలంటూ విలపిస్తూ ఓ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ఈ ఏడాది మార్చి నెలలో ఉపాధి నిమిత్తం ఆమెను మస్కట్ పంపాడు. అక్కడ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇంటి యజమానులు తిండి సక్రమంగా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వాపోయింది. మస్కట్లో రామలక్ష్మి అక్కడి భారత రాయబార కార్యాలయం వద్దకు వెళ్లినా ఎవరూ స్పందించలేదని, అధికారులు ప్రజాప్రతినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసురావాలని వేడుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె కుమారుడు సతీష్ తెలిపాడు. ఈ అంశంపై కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారి రమేష్ తక్షణమే స్పందించి భారత రాయబారం కార్యాలయం నుంచి రెండు రోజులలో ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి వెల్లడించారు. -
జగన్ను కలిసిన శిరీష్
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శిరీష్ తండ్రి దివంగత మిండగుదటి మోహన్ పార్టీ జిల్లా నేతగా ఆది నుంచి కరోనా వరకూ సేవలు అందించారు. అప్పట్లో జగన్ను కలిసినప్పుడు తీసిన ఫొటోను చూపించారు. అప్పుడు జగన్ ఆ ఫొటోపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చారని శిరీష్ చెప్పారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల పరిశీలకుల నియామకంరావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గురువారం తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పరిశీలకుతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ ప్రతాలను వారికి అందజేశారు. వాటితో చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం – కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం – మాత మురళి, అమలాపురం – పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి.గన్నవరం – పెన్మత్స చిన్న భద్రరాజు, రాజోలు– వంటెద్దు వెంకన్ననాయుడు, కొత్తపేట – సిరిపురపు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిపారు. ధనిక, పేద తారతమ్యం తగ్గాలి అమలాపురం రూరల్: ప్రైవేట్ పీపుల్స్ ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా ధనిక, పేదల మధ్య తారతమ్యం తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. వివిధ జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జేసీ టీ. నిశాంతి, డీఆర్ఓ రాజకుమారి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
భీమేశ్వరాలయం నుంచి తలుపులమ్మకు సారె
రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ అమ్మవారికి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆషాఢం సారెను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని బుధవారం సమర్పించారు. లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమేశ్వరాలయ అర్చకుడు మద్దిరాల రాజ్కుమార్శర్మ, చండీ పారాయణదారులు జుత్తుక చిన్న, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన ‘ఢీ’ఎస్సీ రాయవరం: కలల కొలువును సాధించాలన్న లక్ష్యంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు డీఎస్సీ–2025 పరీక్షలకు హోరాహోరీగా సన్నద్ధమయ్యారు. ఉపాధ్యాయ కొలువులో స్థిరపడాలని కలలుకన్న వారి కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడి పరీక్షలకు హాజరయ్యారు. గత నెల ఆరో తేదీ నుంచి టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్ రావిరాల నేతృత్వంలో జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పర్యవేక్షణలో నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పరీక్ష కావడంతో కంప్యూటర్ సౌకర్యాలున్న కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజినీరింగ్ కళాశాల, అమలాపురం భట్లపాలంలోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10,356 మంది హాజరు జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో 10,356 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 11,349 మంది అభ్యర్థులకు రెండు పరీక్షా కేంద్రాలు కేటాయించగా, 1,083 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు డీఈవో డాక్టర్ సలీం బాషా తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని, ఎక్కడా అక్రమాలు, అవకతవకలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. -
రైతు సమస్యలపై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్ డ్రైన్లు పట్టించుకోకుండా ఖరీఫ్ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నీటి తీరువా వసూలుపై ఆగ్రహం కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కల్పించుకుని సర్చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట పీడీఎస్ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్ గోడౌన్లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఖరీఫ్ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్పర్సన్ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజి వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు మెట్టకు సాగునీరు మాటేమిటి? జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు -
ఏం సాధించారని సుపరిపాలన?
ఏడాది పాలనలో అంతా దగాయే. ఏం సాధించారని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే, సుపరిపాలన పేరుతో ప్రజలందరూ స్వాగతించేవారు. ఇప్పుడు ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. గుడి, బడి తేడా లేకుండా మద్యం షాపులు ఇష్టారాజ్యంగా పెట్టారనా..? గల్లీగల్లీకి బెల్ట్ షాపులు పెట్టారనా..? – జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ పరిశీలకురాలు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం బాండ్లు పెద్ద బోగస్ గత ఎన్నికల్లో కూటమి పార్టీలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో ఇచ్చిన హామీలు, ఇవ్వబోయే పథకాలకు సంబంధించిన డబ్బుల మొత్తాలతో ఇంటింటికీ ప్రజలకిచ్చిన బాండ్లు ఓ పెద్ద బోగస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కు లేనప్పుడు ఇక ఆ బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకపోవడంతో వాటిని మూలన పడేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏదోలా అధికారం చేజిక్కించుకునేందుకు వల్ల కాని హామీలు ఇచ్చారు. ఇదే బాండ్ల బాగోతం. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ జగన్ పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే జగన్ పాలనలో అమలైతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. తండ్రీకొడుకులు బాబు, లోకేష్లే కాకుండా, పవన్కల్యాణ్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు కాని హామీలను మభ్యపెట్టి సుపరిపాలన అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించి గ్రామాల్లోకి వెళుతున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. – గొల్లపల్లి సూర్యారావు, పార్టీ కో–ఆర్డినేటర్, రాజోలు నియోజకవర్గం రైతులను వంచించిన ప్రభుత్వం మనజాలదు ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి పంటకు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ డబ్బులు వేయలేదు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు 100 రోజులైనా డబ్బులు వేయకుండా అన్నదాతలను అవస్థలపాలు చేసింది. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనజాలదని గతంలోని చంద్రబాబు ప్రభుత్వాల చరిత్రలే చెబుతున్నాయి. – డాక్టర్ పినిపే శ్రీకాంత్, పార్టీ కో–ఆర్డినేటర్, అమలాపురం నియోజకవర్గం గడప గడపకూ వెళ్లి మోసాలను ఎండగడదాం ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను మనం గడప గడపకూ వెళ్లి ఎండగడదాం. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు అప్పులు సృష్టిస్తున్నారు. మాట్లాడితే అబద్ధాలు, వంచనలు. వీటితోనే పాలన సాగుతోంది. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పోరాటాలు చేయాల్సి ఉంది. అందుకు మనమంతా కార్యసాధకులై సిద్ధమవుదాం. – పిల్లి సూర్యప్రకాష్, పార్టీ కో–ఆర్డినేటర్, రామచంద్రపురం నియోజకవర్గం జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం జిల్లా ప్రజలు జగన్ అంటే ఓ నమ్మకం అని ఇప్పుడు కూటమి పాలన చూశాక తెలుసుకున్నారు. చంద్రబాబు అంటే ఓ మోసం అని ఇప్పుడు అమలు చేయలేని హామీలు చూసి వారి నమ్మకం బలపడింది. జగన్ చేసేదే చెబుతాడు. బాబు చేయలేని పనులు కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేయడంలో మొనగాడు. అందుకే ప్రజలు నేడు జగన్ను మళ్లీ సీఎం చేయాలన్న తలంపుతో చంద్రబాబు మోసాలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. – గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ కో–ఆర్డినేటర్, పి.గన్నవరం నియోజకవర్గం -
కూటమి వంచనపై ప్రజారణం
మేనిఫెస్టో నూరు శాతం అమలు ఘనత జగన్దే.. దేశంలో ఇప్పటి వరకూ 18 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశంలోనే ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలు నూరు శాతం అమలు చేయలేదు. అలా నూరు శాతం అమలు చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు మేనిఫెస్టోను మోసాలకు, అబద్దాలకు కేరాఫ్ చేశారు. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు మోసాలకు పెట్టింది పేరు చంద్రబాబు చంద్రబాబు అంటేనే మోసాలకు పెట్టింది పేరు. సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఇతర పార్టీలను తోడేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు అలవాటైపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే తన ఆఖరి రాజకీయ మజిలీ అన్నట్టుగా సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలిచ్చి, మరో నాటకానికి తెర తీశారు. ఒంటరిగా పోటీ చేసే జగన్ అంటేనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు వణుకు పుడుతోంది. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గ్రామాల్లో ప్రజలకు వివరిద్దాం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరుతో పార్టీ ఇచ్చిన మార్గదర్శకాలతో ప్రజల్లోకి వెళదాం. ప్రజలకు బాబు, పవన్ కల్యాణ్ చేసిన హామీల మోసాలను వివరిద్దాం. ఇక నుంచి జిల్లా పార్టీకి, పార్టీ శ్రేణులకు ఇదే అజెండా. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపడదాం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో బాబు చేసిన మోసాలపై అవగాహన కల్పిద్దాం. ఇందుకోసం జిల్లాలోని పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, పార్టీ కో–ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమై ఉండాలి. – చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టౌన్/అమలాపురం రూరల్: చంద్రబాబు ఏడాది పాలన మోసాలపై వైఎస్సార్ సీపీ జిల్లా శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని.. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’పై పార్టీ నిర్దేశించిన నిరసన ప్రణాళికను క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ఎ–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బొత్స ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత సభా వేదికపై దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బొత్సతో పాటు, పార్టీ జిల్లా ముఖ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారింటీ’పై జిల్లాలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై బొత్స దిశానిర్దేశం చేశారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాబు ఏడాది పాలనలో హామీలు, మోసాలు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన బాండ్లు తదితర అంశాలను బొత్స జిల్లా పార్టీ కార్యకర్తలకు వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బెదిరించి మాట్లాడుతున్న తీరును ఆయన ఎండగట్టారు. వారి బెదిరింపులు, అదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై జిల్లాలో చేపట్టే నిరసనల షెడ్యూల్ను వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఈ నిరసనల పర్యవేక్షణకు ఒక్కో నియోజకవర్గం నుంచి నియమించిన పార్టీ పరిశీలకుల పేర్లను వెల్లడించారు. నిరసన కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా శ్రమించాలని పిలుపునిచ్చారు. బొత్స సత్యనారాయణతో పాటు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి తదితరులు చంద్రబాబు ఇచ్చిన హామీలు, మోసాలు, ఏడాది పాలనలో వంచనలను దుయ్యబట్టారు. అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, పితాని బాలకృష్ణ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాకా ప్రసన్నకుమార్, అమూడ మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, ప్రచార కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాఽథ్రెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, జిన్నూరి వెంకటేశ్వరరావు, వంగా గిరిజాకుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, జానా గణేష్, తోరం గౌతమ్రాజా, కటకంశెట్టి ఆదిత్యకుమార్, చీకట్ల కిషోర్, దొమ్మేటి సత్యమోహన్ పాల్గొన్నారు. ఇప్పుడు కుప్పలుతెప్పలుగా అప్పులు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల పాలవుతోందని తెగ బాధ పడిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతకుమించి అప్పులు చేసి పాలిస్తున్నాడు. అప్పుడు జగన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లలో సంక్షేమ ఫలాలు వేస్తే, ఇప్పుడు చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయకుండానే రాష్ట్రాన్ని అప్పుల్లో కుప్పలుతెప్పలుగా ముంచేశాడు. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బాబూ ష్యూరిటీలపై నిలదీద్దాం చంద్రబాబు ఎన్నికల్లో ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ అంటూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి లేదు. 20 లక్షల ఉద్యోగాల మాట గాలికి వదిలేశారు. స్కిల్ డవలప్మెంట్ వల్ల యువతకు ఉద్యోగాలు వచ్చాయని అబద్ధం చెబుతూ నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాడు. ఇదే జగన్కు, చంద్రబాబు మధ్య ఉన్న తేడా. – పినిపే విశ్వరూప్, పార్టీ కో–ఆర్డినేటర్, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం సెక్షన్–30తో ఇబ్బంది పెట్టాలనుకున్నారు జిల్లాలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను అడ్డుకునేందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసు జులుంను ఉపయోగించింది. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లో సెక్షన్–30 పోలీస్ యాక్ట్ను అమలు చేసి, సభ జరగకుండా ఇబ్బంది పెట్టాలనుకుంది. అరిచేతి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరనట్టుగా ఈ సభకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు పోలీస్ ఆంక్షలను కాదని తరలివచ్చారు. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ బాబు ఏడాది పాలన మోసాలపై గ్రామాల్లో వివరించండి ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’పై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి నిరసనలపై పార్టీ జిల్లా శ్రేణులకు రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం పవర్పాయింట్ ప్రజెంటేషన్తో బాబు మోసపూరిత హామీలను ఎండగట్టిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం -
తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది..
తూర్పు గోదావరి: బాగా చదువుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిరుద్యోగులైన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి.తెలంగాణలో పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చాగల్లుకు చెందిన యువతి మృతి చెందడంతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న(22) ఈ దుర్ఘటనలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్గా ఉద్యోగంలో చేరిన ప్రసన్న మరణాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తండ్రి శ్రీనివాసరావు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న కాగా, చిన్న కుమార్తె ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. ప్రసన్న అత్త కొడుకు కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన యాతం మహేష్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కూడా రెండు నెలల క్రితమే అదే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పనిపై మహేష్ బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకుని.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ప్రసన్న కూడా ప్రమాదానికి గురైందని గ్రహించి ఆమె తల్లిదండ్రులకు మహేష్ సమాచారం అందించాడు. సోమవారం సాయంత్రం శ్రీనివాసరావు, రామలక్ష్మి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.ఎన్నో ఆశలతో..దుర్ఘటనలో మృతిచెందిన ప్రసన్న బీ–ఫార్మసీ చది వింది. ఉన్నత చదువు అభ్యసించి జీవితంలో మంచి స్థానం సాధించాలని ఆశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఫ్యాక్టరీలో స్టైఫండ్ తీసు కుంటూ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగంలోకి చేరింది. ఎం–ఫార్మసీ చేయాలన్న తపనతో ఓ శిక్షణ సంస్థలో కూడా చేరింది. ఇదే విషయాన్ని దుర్ఘటనకు ముందురోజు ఆమె తల్లితో ఫోన్లో చెప్పింది. తాను ఎం–ఫార్మసీ చదివేందుకు ఫీజు చెల్లించానని ఆనందం పంచుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే క్లాసులకు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఎంతో ఆనందాన్ని పంచుకున్న కుమార్తె తమను విషాదంలో విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.కన్నీరుమున్నీరైన చెల్లెలు చిన్ను(ప్రసన్న) కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండేదని, తామిద్దరం అక్కాచెల్లెలైనా.. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ప్రసన్న చెల్లెలు ప్రభుకుమారి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రసన్న ఇంటి వద్ద బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. -
మూడేళ్లు దాటుతున్నా..
జాతీయ రహదారి 216ఏలో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్ 22న పనులు మొదలు కాగా, ఇంకా పూర్తి కాలేదు. దీంతోపాటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని మోరంపూడి వద్ద ఫ్లై ఓవర్ కూడా జొన్నాడతో పాటు ప్రారంభించారు. ఇప్పటికే మోరంపూడి ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా, జొన్నాడ మాత్రం బాలారిష్టాలు దాటడం లేదు. పిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిపై గెడ్డర్లు, శ్లాబ్ వేయాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు. అప్రోచ్ నిర్మాణం కోసమని పి.గన్నవరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తే, అక్రమార్కులు తవ్వకాలు చేసి కాసులు దండుకున్నారు. నిర్మాణ పనుల వల్ల జొన్నాడ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ స్తంభించి, ఇటు రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. -
కోటిపల్లి వంతెన ప్రతిపాదనలతో సరి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడ్డాక ముక్తేశ్వరం, కోటిపల్లి రేవు మధ్య రాకపోకలు పెరిగాయి. దీంతోపాటు దశాబ్ద కాలంగా హామీగా ఉండిపోయిన ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య వంతెన నిర్మాణం సైతం తెరపైకి వచ్చింది. కత్తిపూడి–నర్సాపురం ఫెర్రీ (కేఎన్ఎఫ్) రోడ్డులో భాగంగా కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పడ్డాక రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందినవారు కలెక్టరేట్, ఇతర పనుల కోసం జిల్లా కేంద్రమైన అమలాపురం రావడం పెరిగింది. ఇప్పుడు పడవలు, పంట్లపై రాకపోకలు చేయాల్సి రావడం వాహనచోదకులకు వ్యయప్రయాసగా మారింది. దీంతో ఇక్కడ వంతెన ఆవశ్యకతను గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనూరాధ విశేష కృషి చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీని ఒప్పించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అప్పట్లో ఆయన ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు కూడా. ప్రభుత్వం మారడంతో దీని ఊసే లేకుండా పోయింది. -
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి. పెదలంక వద్ద వంతెన అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు. -
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఆదేశాలు అమలాపురం రూరల్: జిల్లాలో వివిధ పథకాల కింద కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పలు నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. జొన్నాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు, వంతెన అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయని, వారం రోజుల్లో బాగు చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అప్రోచ్ రోడ్లను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. పాశర్లపూడి జంక్షన్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, గెద్దాడలో పనులు సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. టోల్ ప్లాజా నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలన్నారు. అయినవిల్లిలో 400 కేవీ ఉప కేంద్రానికి, నూతనంగా 130 కేవీ 64 టవర్లకు భూసేకరణ పూర్తయిందన్నారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి శానిపలిలంక వద్ద రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. నరసాపురం బైపాస్ రోడ్డుకు 98 శాతం భూసేకరణ పూర్తయిందన్నారు. ఊడిమూడిలంక–జి.పెదపూడిలంక వంతెనను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. వాడపల్లి వద్ద సైఫాన్ పనులను వేగవంతం చేయాలన్నారు. ద్రాక్షారామలో ఇండస్ట్రియల్ పార్క్కు 4 ఎకరాల స్థల సేకరణ చేసినట్టు చెప్పారు. జేసీ టి.నిషాంతి, ఏపీ ఐసీసీ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. వంతెన పనులపై సమీక్ష పి.గన్నవరం: ఊడిమూడిలంక–జి.పెదపూడిలంక గ్రామాల వశిష్ట నదీపాయపై రూ.49.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులపై కలెక్టర్ మహేష్కుమార్ తన కార్యాలయంలో సమీక్షించారు. పీఆర్ ప్రాజెక్ట్ ఈఈ పి.రామకృష్ణారెడ్డి, డీఈ అన్యం రాంబాబు, కాంట్రాక్టర్ పీపీ రాజు పనుల పురోగతిని కలెక్టర్కు, జేసీ నిశాంతికి వివరించారు. జరుగుతున్న పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు. -
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పిలుపు అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం మండలం ఇందుపల్లిలోని ఎ–కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో బుధవారం సాయంత్రం జరగనున్న బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరవుతున్న ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పార్టీ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి పథకాల అర్హతతో కూడిన మొత్తం సొమ్ముకు సంబంధించి బాండ్లు అందించిన కూటమి పార్టీల నేతలు.. నేడు ఆయా పథకాలు అమలు చేయకుండా దగా చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన పథకాల ష్యూరిటీ అంతా బోగస్ అని ఇందుపల్లిలో జరిగే సభ ఎండగట్టనుందని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా వంచించిందన్నారు. బాబు ఇచ్చిన హామీలు, మోసాలపై నిలదీసేందుకు నిర్వహిస్తున్న ఈ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ను అనుసరించాలి డీఈవో డాక్టర్ సలీం బాషా ఐ.పోలవరం: ప్రధానోపాధ్యాయుల టేబుళ్లపై అకడమిక్ క్యాలెండర్ ఉండాలని, దానిని హెచ్ఎంలు తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆదేశించారు. మండలంలోని మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, పాఠశాలల్లో నూరు శాతం ఎన్్రోల్మెంట్ జరగాలన్నారు. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చదవాలన్నారు. ప్రతి విద్యార్థికి ఎస్ఆర్కేవీఎం కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బోధనాభ్యసన, పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తరచూ వారి పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి, వారిలో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్ఎం సరెళ్ల సుజాతకు నిర్దేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో వండాలని, విద్యార్థులంతా భుజించేలా రుచిగా, శుచిగా వండేలా హెచ్ఎం పర్యవేక్షించాలని సూచించారు. -
రెండు పొక్లెయిన్లు సీజ్
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లిలంకలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు పొక్లెయిన్లను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ మంగళవారం సీజ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, పెదకందాలపాలెం, మానేపల్లిలంకలో ర్యాంపులను తహసీల్దార్ పి.శ్రీపల్లవితో కలిసి ఆర్డీఓ పరిశీలించారు. మానేపల్లిలంకలో ఉన్న పొక్లెయిన్లను సీజ్ చేసి మైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 15 వరకూ జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు జరపరాదని కలెక్టర్ ఆదేశించారన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లకుండా బాటలను కట్ చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో డ్రోన్ల ద్వారా సర్వే చేయించి, సంబంధిత వ్యక్తులకు డిమాండ్ నోటీసులు పంపిస్తామని ఆర్డీఓ చెప్పారు. -
వెలుగుకు కమ్మిన చీకట్లు
సీసీ మృతితో భార్యకు హామీ ఇచ్చి.. డీఆర్డీఏ అధికారుల తీరు ఆ శాఖలో ఓ చిరుద్యోగి నిండు ప్రాణాలను బలితీసుకుంది. గత మే నెల రెండో తేదీన అమరావతిలో జరిగిన పునర్నిర్మాణ సభకు అధికారులు చేపట్టిన డ్వాక్రా మహిళల తరలింపులో భాగంగా బస్సులో డ్యూటీకి పంపబడిన డీఆర్డీఏ వెలుగు విభాగం మలికిపురం మండల క్లస్టర్ కో–ఆర్డినేటర్ డీటీ నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లాకు చెందిన నాగరాజు కొంత కాలంగా మలికిపురం వెలుగు కార్యాలయంలో పరిమిత జీతంతో కాంట్రాక్టు పద్ధతిలో క్లస్టర్ కో ఆర్డినేటర్గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పటికే రెండు రోజుల నుంచీ అనారోగ్యంతో ఉన్న నాగరాజును అమరావతి సభకు బస్సులో డ్యూటీ వేశారు. అనారోగ్యం కారణంగా సెలవు ఇవ్వాలని అడిగినా అధికారులు ఆలకించలేదు. సభకు రాకపోతే జీతాలు ఇవ్వలేమని చెప్పినట్టు సమాచారం. సభ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఉంగుటూరు మండలం కై కరం వద్ద బస్సు దిగి, రోడ్డు దాటుతున్న నాగరాజును కోళ్ల వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. షాక్లోనే నాగరాజు భార్య భర్త మృతి చెందిన సంఘటనతో నాగరాజు భార్య ఇప్పటికీ షాక్లో ఉన్నారు. అప్పట్లో నాగరాజు భార్యకు సీసీ పోస్టు ఇస్తామని కొందరు నమ్మించారు. తీరా ఆమెకు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందలేదు. జిల్లాలో మహిళల నుంచి చందాలు వసూలు చేసి, ఆర్థిక సాయమిచ్చి చేతులు దులుపుకొన్నారు. నాగరాజుకు ఇంటర్ పాసైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగరాజు జీతం మినహా కుటుంబానికి ఆధారం లేదు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారనేది గ్యారంటీ లేదు. ఫ సిబ్బంది కొరతతో సతమతం ఫ 66 సీసీ, 19 ఏపీఎం పోస్టుల ఖాళీ ఫ ఎంసీపీ, హెచ్సీఎల్ యాప్లతో మరింత భారం ఫ రూ.కోట్లలో టర్నోవర్, కాంట్రాక్టు సిబ్బందితోనే కాలక్షేపం మలికిపురం: జిల్లా డీఆర్డీఏ పరిధిలోని వెలుగు విభాగంలో సిబ్బంది లేక చీకట్లు అలముకున్నాయి. జిల్లా వెలుగు కార్యాలయాల్లో కొంత కాలంగా 66 సీసీ (క్లస్టర్ కోఆర్డినేటర్), 19 మండలాలకు ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్)ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఎంసీపీ, హెచ్సీఎల్ యాప్లను ప్రవేశపెట్టి సిబ్బందిపై మరింత భారం పెంచింది. ఈ నేపథ్యంలో వెలుగు అధికారులు గ్రామస్థాయిలో వీవోఏలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వారి నుంచి సహాయకులుగా దరఖాస్తులను స్వీకరించారు. రాజకీయ పైరవీలు, పోటీ నుంచి తప్పించడానికి ఈ పోస్టులకు జీతాలు ఇవ్వలేని తాత్కాలిక వలంటీర్లుగా అధికారులు నామకరణం చేశారనే ప్రచారం నడుస్తోంది. ఆనక సీసీలుగా రెగ్యులర్ చేస్తామని లోపాయికారిగా మండల స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు అంటున్నారు. సాధారణంగా సీసీ పోస్టులకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ జీతాలుంటాయి. వెలుగులో చాలా కాలంగా ఇవి కాంట్రాక్టు పద్ధతిలోనే ఉన్నాయి. గ్రామ స్థాయిలో సీనియర్లను కాదని ఇష్టానుసారం నియామకాలను చేపట్టడంతో, సఖినేటిపల్లి మండల వీవోఏ సీనియర్లు, పొరుగు క్లస్టర్ వారిని తమ క్లస్టర్లలో నియమించారని మరికొందరు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే సదరు అధికారులను నిలదీయగా, ఈ విషయం వివాదాస్పదం కావడంతో.. వాటిని రద్దు చేస్తున్నామని సఖినేటిపల్లి మండల ఏపీఎం అజయ్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డీఆర్డీఏ పీడీని అడగడంతో, అవి సీసీ పోస్టులు కాదని, కేవలం సహాయకులేనని బదులిచ్చారు. ఈ నియామకాల్లో కింది స్థాయి అధికారుల మధ్య డబ్బు చేతులు మారుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజమాయిషీ లేక.. వెలుగు విభాగంలో కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఈ విభాగానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారులు లేరు. డీఆర్డీఏ మాత్రమే పర్యవేక్షిస్తుంది. మండల స్థాయిలో ఏపీఎంలు ఉంటారు. వీరు కూడా కాంట్రాక్టు బేస్లోనే పని చేస్తారు. ఒక్కో మండలంలో రూ.20 కోట్ల పైబడి సీ్త్ర నిధి రుణాలుగా ఇస్తున్నారు. అలాగే రూ.వందల కోట్ల బ్యాంకు రుణాల లావాదేవీలు జరుగుతాయి. ఇలాంటి కీలక ఆర్థిక వ్యవస్థకు మండల స్థాయిలో కాంట్రాక్టు సిబ్బంది ఉండడం గమనార్హం. రుణాలు ఇవ్వాలన్నా, గ్రూపుల వెరిఫికేషన్ చేయాలన్నా మండలానికి ముగ్గురు సీసీ (క్లస్టర్ కో–ఆర్డినేటర్లు) ఉంటారు. వీరు కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే పని చేస్తున్నారు. ఏపీఎం, సీసీలు పూర్తి స్థాయిలో ఉన్నారా అంటే అదీ లేదు. అందువల్లే వెలుగులో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో సీ్త్ర నిధి, మహిళల పేరుతో బినామీ రుణాలు, బ్యాంకులకు రీ పేమెంట్లు జరగకపోవడం వంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. పోస్టుల ఖాళీలతో గందరగోళం ఇప్పటికే తీవ్ర పనిభారంతో ఉన్న వీవోఏ నుంచి తాజాగా జిల్లాలో ఇన్చార్జి సీసీ అంటూ నూతన పోస్టులు ఎర వేశారు. గ్రామ స్థాయిలో వీవోఏల నుంచి దరకాస్తులు తీసుకోవడంతో, ఆయా గ్రామాల్లో వీవోఏల పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. జీతాల్లేని సీసీ సహాయకులుగా వెళ్తే, తమ వీవోఏ పోస్టులు ఉంటాయో, లేవో అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. దీంతో ఇన్చార్జి సీసీలుగా నియమితులైన వీవోఏల్లో గందరగోళం నెలకొంది. మండలానికి మూడుకు పైగా వీవోఏ పోస్టులు ఖాళీలు ఏర్పడనున్నాయని అంటున్నారు. అక్కౌంటెంట్లదే హవా జిల్లాలోని మండల స్థాయి వెలుగు కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న అక్కౌంటెంట్లదే హవా నడుస్తోంది. మహిళా సంఘాలు, సమాఖ్యలు ఏర్పడి 28 ఏళ్లయింది. అప్పట్నుంచి ఒకే అక్కౌంటెంట్ మండల కేంద్రాల్లో ఉన్నారు. వీరు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. సొంత ప్రాంతాలు కావడంతో మహిళా సమాఖ్యలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సమాఖ్య అక్కౌంట్ నుంచి వీరు జీతాలు పొందడం గమనార్హం. ఇన్నేళ్లుగా వీరికి బదిలీలు లేవు. వీరు ఇతర మండలాలకు వెళ్లకపోవడంతో, మండల సమాఖ్య నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే అభియోగాలూ ఉన్నాయి. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం జిల్లా వెలుగు విభాగంలో సిబ్బంది కొరత ఉంది. దీనిపై సెర్ప్కు నివేదిక ఇచ్చాం. ప్రస్తుతం తాత్కాలికంగా సహాయకులను తీసుకుంటున్నాం. అవి సీసీ పోస్టులు కాదు. నియామకం పొందిన వారి నుంచి పక్కాగా లేఖలు తీసుకుంటాం. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. మండల స్థాయి సిబ్బంది అక్రమాలకు పా ల్పడి, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం. – జయచంద్ర గాంధీ, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఏ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న గూడ్స్ ఆటో
జొన్నాడకు చెందిన డ్రైవర్ మృతి కిర్లంపూడి: ఆగి ఉన్న లారీని గూడ్స్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద చోటుచేసుకుంది. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీధర్(43) గూడ్స్ఆటోలో విశాఖపట్నానికి పువ్వుల లోడుతో కిరాయికి వెళ్లాడు. అక్కడి నుంచి న్యూస్ పేపర్ల లోడును వేసుకుని రాజమండ్రికి తిరిగొస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మరణించాడు. అతడి సోదరుడు సూరిశెట్టి గంగాజలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో సూరిశెట్టి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీధర్ 12 ఏళ్లుగా జొన్నాడలో నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమాని శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఇక తమకు దిక్కెవరంటూ మృతదేహం వద్ద కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు. -
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్ కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు. ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్ గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా.. అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు. పెరగనున్న కాంట్రాక్ట్..? గత నవంబర్తో ముగిసిన కేఎల్టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ దానిని రద్దు చేసి మళ్లీ జూన్ 12న రీటెండర్ కొత్త షరతుల ప్రకారం రూ.80 లక్షలకు పెరిగే అవకాశం -
20 వేల మంది రైతులకు రూ.255 కోట్లు పెండింగ్
ఎన్హెచ్ టు ఎన్హెచ్ ఎప్పుడో? జాతీయ రహదారి 216 (కత్తిపూడి నుంచి ఒంగోలు), జాతీయ రహదారి 216ఏ (దివాన్ చెరువు నుంచి రావులపాలెం మీదుగా గుండుగొలను వరకు) ఉన్న జాతీయ రహదార్లను అనుసంధానం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్హెచ్ ముందుకొచ్చింది. ఎన్హెచ్–ఈ అమలాపురం పేరూరు నుంచి ముక్కామల, కొత్తపేట మీదుగా రావులపాలెం సమీపంలోని మార్కెట్ యార్డు వరకు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత దీనికి రూ.450 కోట్లు కేటాయించారు. తర్వాత ఇది రూ.735 కోట్లకు చేరిందని అంచనా. ఏడు మీటర్ల వెడల్పున ఉన్న రహదారిని పది మీటర్ల వెడల్పున నిర్మించనున్నారు. దీనిలో అమలాపురం సమీపంలోని నడిపూడి నుంచి పేరూరు వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి ఉంది. ఇప్పటి వరకు ఈదరపల్లి నుంచి కొత్తపేట వరకున్న ఆర్అండ్బీ రహదారి మరింత వెడల్పు కానుంది. ఈ రోడ్డు పూర్తయితే రెండు జాతీయ రహదారుల మధ్య మరో ఎన్హెచ్ రోడ్డు వచ్చినట్టవుతోంది. ఈ ప్రాజెక్టుకు గతంలో భూసేకరణకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమేర గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రతిపాదన రావడంతో.. ఇందుపల్లి, ఇతర ప్రాంతాల వాసులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. వీరు ప్రత్యామ్నాయ రహదారిని సూచిస్తున్నా స్థానికంగా పట్టించుకునేవారు లేరు. దీంతో ఈ రోడ్డు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశ దాటలేదు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జున్నూరి రామారావు అల్లవరం: ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించిన సివిల్ సప్లయిస్ అధికారులు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయకుండా రెండు నెలలుగా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జున్నూరి రామారావు ఓ ప్రకటనలో ఆరోపించారు. మే నెల తొలి వారం తర్వాత రైతుల వద్ద తీసుకున్న ధాన్యానికి నేటికీ ఒక్క రూపాయి చెల్లించలేదని, జిల్లాలో సుమారు 20 వేల మంది రైతులకు రూ.255 కోట్ల ధాన్యం డబ్బు రావాల్సి ఉందన్నారు. రోజువారీ వడ్డీకి, బంగారు నగలు కుదవ పెట్టి తెచ్చిన డబ్బుతో దాళ్వా పండించారని. పంట అమ్మి అప్పులు తీర్చుదామనుకున్న రైతులకు కూటమి ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. వేలాది మంది రైతులు వడ్డీ భారం భరించాల్సి వస్తోందన్నారు. రైతుల ఇబ్బందులు సివిల్ సప్లయిస్ మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులు, మద్యం దుకాణాలకు ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి డబ్బులుంటాయని, రైతులకు ధాన్యం సొమ్ము చెల్లించడానికి చేతులు రావని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు ఒక్క రూపాయికే ఎకరం భూమిని కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం, ధాన్యం డబ్బు చెల్లింపులో తాత్సారమేమిటని నిలదీశారు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి, మంత్రి నాదెండ్ల మనోహర్కు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి సోమవారం రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తున్నా, ఎందుకు స్పందించడం లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సాగుకు రైతులు పెట్టుబడి కోసం మళ్లీ అప్పులు చేయాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెండు రోజుల్లో ధాన్యం డబ్బు జమ చేయకపోతే రైతులు పోరాటానికి సన్నద్ధం అవుతారని హెచ్చరించారు. -
700 లీటర్ల డీజిల్ పట్టివేత
తాళ్లరేవు: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 700 లీటర్ల డీజిల్ను పట్టుకున్నట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీజిల్ను అక్రమంగా తరలిస్తున్న పాలకొల్లుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ట్రాక్టర్తో పాటు, 700 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. ఐదుగురు జూదరుల అరెస్టు జగ్గంపేట: జగ్గంపేట శివారు గుర్రంపాలెం రోడ్డులో పోలవరం కాలువ వద్ద పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎస్సై రఘునాథరావు, సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. -
రేపు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ సమావేశం
విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పిలుపు అమలాపురం రూరల్: ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు నిర్వహించే సమావేశ వేదికై న అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ఎ–కన్వెన్షన్ హాలును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో పాటు పార్టీ నేతల బృందం సోమవారం పరిశీలించింది. ఆ రోజు కార్యక్రమానికి పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ని ప్రారంభిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి తెలిపారు. ఆ రోజు జరిగే జిల్లా స్థాయి పార్టీ సమావేశానికి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశ వేదికై న ఎ– కన్వెన్షన్ ఫంక్షన్ హాలును జగ్గిరెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదటి శిరీష్, పార్టీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్రాజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, రూరల్ మండల అధ్యక్షుడు గుత్తుల చిరంజీవి, సెంట్రల్ డెల్టా బోర్డు మాజీ చైర్మన్ కుడుపూడి బాబు, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కొల్లాటి దుర్గాబాయి, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, దూడల ఫణి, కల్వకొలను ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీని పరిష్కరించండి: కలెక్టర్
అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న ప్రతి అర్జీని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్ వద్ద ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సుమారు 250 అర్జీలను కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, ఎస్డీఎస్ కృష్ణమూర్తి, డీఎల్డీఓ రవీంద్ర స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి అర్జీని సంబంధిత జిల్లా అధికారులకు అందించి, నిర్దేశిత గడువు లోగా పరిష్కరించేలా చూస్తున్నామన్నారు. వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, రెవెన్యూ అంశాలపై అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ ఎస్.కార్తీక్, డీపీఓ శాంతలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్ఈలు కృష్ణారెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, డీఎస్ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 32 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు. అర్జీదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి వారితో కొద్దిసేపు మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎస్పీ చొరవ చూపారు. అదృశ్యమైన తన తమ్ముడి అచూకీ తెలపాలని, రెండు నెలల కిందట అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుంకర సత్యనారాయణ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి కొద్దిసేపు నేలపైనే బైఠాయించాడు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. పోలీసులు తక్షణమే అతడిని అక్కడి నుంచి లేవదీసి ఏమైనా సమస్య ఉన్నా, ఫిర్యాదు ఉన్నా నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి చెప్పాలని సూచించారు. దీంతో బాధితుడు సత్యనారాయణ జిల్లా ఎస్పీని కలసి తన సమస్యపై ఏకరవు పెట్టాడు. తన చిన్నాన్న కొడుకు సుంకర ఈశ్వరరావు 15 ఏళ్లుగా అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో ఉంటున్నాడని, కొబ్బరి ఒలుపు పనిచేసుకుంటూ జీవించే తన తమ్ముడు గత మార్చి 14 నుంచి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని పేర్కొన్నాడు. ఈ అదృశ్యం కేసును త్వరితగతిన విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలి అమలాపురానికి చెందిన మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ (టీడీపీ)పై, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణానికి చెందిన తోలేటి ఓం ప్రకాష్ ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. బాకీ నిమిత్తం తనను వేధిస్తున్నాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రైవేటు ఫీజులుం
● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యథేచ్ఛగా దోపిడీ ● ఒకటో తరగతికే కనీస ఫీజు రూ.25 వేలు ● బస్సుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ● యూనిఫామ్, నోట్ బుక్స్కు అదనపు భారం సాక్షి, అమలాపురం: ‘కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన రోగి విషయంలో వైద్యులు చెప్పిందే వేదం.. చేయించిందే పరీక్షలు.. కట్టమన్నదే ఫీజు.. మారు మాట్లాడకుండా అన్నీ వినాల్సిందే. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలోనూ అదే జరుగుతోంది. వారు చెప్పినంతే ఫీజు.. పుస్తకాలకు, యూనిఫామ్ వంటి వాటికి ఎంతంటే అంతే.. నోరు మెదపకుండా చెల్లించాల్సిందే’ అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో అంటున్న మాటలు ఇవి. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థులకు పెనుభారంగా మారాయి. వేలకు వేలు ఫీజులకు తోడు యూనిఫామ్, టై, బెల్టు, బూట్లు, పాఠ్య, రాత పుస్తకాలు.. ఇలా అన్నీ తాము చెప్పిన చోటే తాము చెప్పిన ధరకే కొనాలంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న ఆంక్షలు తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విద్యా విధానంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 454 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిపై విద్యాశాఖ నియంత్రణ రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారుల చేతులు కట్టేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందో కనీసం అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఒకటో తరగతి ఫీజు రూ.25 వేల పైనే.. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో అయితే రూ.50 వేల కూడా ఉంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఫీజులు పెరుగుదల 30 శాతం దాటిందని అంచనా. ఇది మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీనికితోడు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్కు అదనం. బస్సు ఫీజులు అయితే మరింత భారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కిలోమీటరుకు విద్యార్థుల నుంచి బస్సు ఫీజు రూ.1.30 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఏడాదికి బస్సుకు రూ.10 వేలు మొదలు రూ.15 వేల వరకూ వసూలు చేస్తుండడం గమనార్హం. దీంతో ఒకటో తరగతి విద్యార్థికే మొత్తం అన్నీ కలిపి రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకూ ఖర్చు అవుతోంది. పర్యవేక్షణ కమిటీలు ఎక్కడో? ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న నిబంధనల అమలుకు కనీసం కమిటీలు ఎక్కడా కనిపించడం లేదు. త్రీ మెన్ కమిటీ రూపంలో మండల విద్యాశాఖ అధికారి, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఒక క్లస్టర్ స్కూల్ హెడ్యాస్టర్లతో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, అవి అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా విద్యార్థులు ఉండాలంటే అందుకు తగ్గ వాతావరణం కల్పించాలి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకంతోపాటు ఆట స్థలం కూడా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏమీ కానరావు. బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నా అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాస్తవ రూపంలో అవి అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పరిశీలిస్తామని చెప్పడం తప్ప అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి. అలాగే ఫీజులు కూడా వసూలు చేయాలి. విద్యా శాఖ కూడా ఫీజుల వసూలుపై నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు తీసుకోకుండా చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ఫీజులు తగ్గించపోతే ఉద్యమం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రతి స్కూల్ వద్ద నియమ నిబంధనలతో నోటీసు బోర్డు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫీజులు తగ్గించకపోతే ఉద్యమం చేస్తాం. అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న విద్యా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. –రేవు తిరుపతిరావు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గత ప్రభుత్వంలో నిరంతర నిఘాగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై నిరంతరం నిఘా కొనసాగేది. ఫీజులకు సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించే వారు. దీంతో యాజమాన్యాలు వెనకాడే పరిస్థితి ఉండేది. 2020 విద్యా విధానం ప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి మూడు రకాల ఫీజులు ప్రకటించింది. ఈ ఫీజులన్నీ కూడా 2023–24 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి. దాని ప్రకారం నర్సరీ మొదలు పదో తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అయితే రూ.10 వేల మొదలు రూ.12 వేల వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకూ, కార్పొరేషన్ ప్రాంతాల్లో రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేయాలని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ‘కూటమి’ కొనసాగించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నర్సరీ విద్యార్థికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఫీజులు వేస్తున్నారు. ఇవి కాకుండా యూనిఫాం పాఠశాలలలో, లేదా యాజమాన్యం సూచించిన షాపులో కొనుగోలు చేయాలనే ఆంక్షలతో పాటు, టై, బెల్టులు పాఠశాలలోనే కొనుగోలు చేయాలని అంటున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు మాత్రమే వినియోగించాలని నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు. ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి వాటిని విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు తమ దృష్టికి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప, తాము ఎన్ని పాఠశాలలు తనిఖీ చేసింది.. ఏ ఏ పాఠశాలల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి.. వాటి నియంత్రణకు యాజమాన్యాలకు చేసిన సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ప్రకటించలేక పోతుండడం గమనార్హం. -
కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయించాలి
అంబాజీపేట: కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సామాజిక వేత్త, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నేలపూడి స్టాలిన్బాబు సెంట్రల్ జీఎస్టీ అదనపు చీఫ్ కమిషనర్ ప్రశాంత్కుమార్ కాకర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి ప్రశాంత్ కుమార్ ఇటీవల ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్బాబు ఆయనకు విశాఖపట్నంలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ సుభిక్షమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఎంతో ఖ్యాతి గాంచిందని, ఇటీవల కోనసీమ తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అనంతపురం కంటే తక్కువగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారని వివరించారు. జీఎస్టీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆయనకు వివరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారని స్టాలిన్ బాబు తెలియజేశారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. వైద్యం ప్రారంభించే సమయంలోనే రోగి లేదా వారి బంధువులకు సేవల వివరాలు, ధరలను స్పష్టంగా వివరించాలన్నారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రజా వైద్యానికి వైఎస్ జగన్ పెద్దపీట
అమలాపురం టౌన్: కరోనా కష్ట కాలంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సేవలను ప్రజల దరిచేర్చారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ గుర్తు చేశారు. అంతలా వైద్య సేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సోమవారం అమలాపురంలో ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజారోగ్య వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందని, మంత్రి సత్యకుమార్ ఈ వాస్తవాలను గ్రహించి మాట్లాడితే బాగుంటుందని కిషోర్ సలహా ఇచ్చారు. కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి ఓ రక్షణ కవచంలా ఉండి ప్రతి కరోనా రోగికి ప్రభుత్వ వైద్యం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. కొన్ని వేల కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు– నేడు పథకం ద్వారా సకల సౌకర్యాలు అంటే సీటీ స్కాన్, ఎమ్మారై మెషీన్లు, డయాలసిస్ యూనిట్లు తదితరాలను కల్పించారని స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆస్పత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజా వైద్యం పట్ల అంత ప్రేమ ఉంటే నాడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. నేటి నుంచి డెంగీ నివారణ మాసోత్సవాలు అమలాపురం టౌన్: జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణలో భాగంగా మంగళవారం నుంచి జాతీయ డెంగీ మాసోత్సవాలు–2025 నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర వెల్లడించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో డెంగీపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన బ్యానర్లను సోమవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా దుర్గారావు దొర మాట్లాడుతూ డెంగీ, మలేరియా, ఫైలేరియా నివారణకు పలు జాగ్రత్తలు, సూచనలతో వైద్య శాఖ గోడ పత్రికలు, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించిందన్నారు. డెంగీ కారణంగా తీవ్రమైన జ్వరం లేదా అంతకంటే ఎక్కువ తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, బలహీనత, అలసట వంటి రుగ్మతలు అనివార్యమవుతాయని ఆయన చెప్పారు. ఇంట్లో పరిసరాల శుభ్రత పాటించి, నిల్వ నీరు లేకుండా చూడాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ కాగానే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలని సూచించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కార్తీక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్రావు, జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి సత్యకుమార్ ఆలోచించి మాట్లాడాలి ఫ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్ -
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ ● ఇతర దేవతా విగ్రహాలు కూడా.. ● తరలిరానున్న ప్రముఖులు నాయనార్లు ఎవరంటే.. తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. : నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వా మివారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికే య శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతి ష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజే శ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వా మీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. విజయవంతం చేయాలి ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి. – స్వామి రామానంద, శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి -
అన్నదాతపై అధికార జులుం!
● తన పొలంలో పంటను అన్యాయంగా కోసి విక్రయించడంపై ఆగ్రహం ● జెండాలు పాతి ఊరిలో పరువు తీశారు ● వెల్ల సోమేశ్వరస్వామి ఆలయ ఈఓపై కౌలు రైతు ఫిర్యాదు రామచంద్రపురం: కంచే చేను మేసిన చందంగా దేవదాయశాఖ వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల అండదండలతో ఖర్చుల పేరిట స్వామివారి సొమ్ములు మింగేస్తున్నారని మండలంలోని వెల్ల సోమేశ్వరస్వామి వారి దేవస్థానం ఈఓ సీహెచ్ శ్రీనివాస్పై ఓ రైతు ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే స్వామి వారికి సుమారు 104 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయ సేవలకు 40 ఎకరాలు పోగా మిగిలిన 48 ఎకరాలను గ్రామానికి చెందిన రైతులకు బహిరంగ వేలంలో మూడేళ్లకోసారి కౌలుకు ఇస్తుంటారు. మిగిలిన 16 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోకపోగా సదరు ఆక్రమణదారులపై ఎకరానికి ఇంత అని సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 48 ఎకరాల నుంచి ఆలయానికి ఏటా సుమారు రూ.27 లక్షల ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇదిలా ఉండగా ఈఓ కూటమి నేతల ప్రోద్బలంతో ఇంకా గడువు ఉండగానే కౌలు చేస్తున్న రైతులను వెళ్లగొట్టి తమ అనుయాయులకు ఆ భూములు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే వెల్లలోని దేవదాయ శాఖ అధికారి కార్యాలయం ఎప్పుడూ తాళం వేసి ఉండడం చర్చనీయాంశమవుతోంది. కౌలు చేస్తున్న 12 మందిలో సుమారు 5 నుంచి ఆరుగురికి బకాయిలు కట్టాల్సి ఉంది. వీరిలో గ్రామానికి చెందిన పట్నాల గణపతి మూడేళ్లుగా 3 ఎకరాలు సాగు చేస్తూ ఆఖరి సంవత్సరంలో రెండో పంట పండిన తరువాత శిస్తు కట్టి తదనంతరం తిరిగి నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏప్రిల్ 23న సదరు భూమిలో ఈవో ఎర్రజెండాలు వేయించారు. ఆ సమాచారాన్ని కూడా గణపతికి ఇవ్వలేదు. కూటమి నేతల ఒత్తిడితో 3 ఎకరాల్లోని పంటను మే 17న కోయించి మాసూళ్లు చేయించి కొనుగోలుదారునితో కుమ్మకై ్క ధాన్యాన్ని విక్రయించారని ఆ రైతు ఆరోపిస్తున్నారు. దీనిపై సదరు రైతు రాజకీయ ఒత్తిళ్లతో దౌర్జన్యం చేసి తన పంటను మాసూలు చేసి, జమా ఖర్చులు చెప్పకుండా ధాన్యాన్ని విక్రయించారని, ఈ మేరకు ఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులకు గణపతి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఈఓ శ్రీనివాస్ వెల్లతో పాటు, మరో 12 ఆలయాలకు ఇన్చార్జి ఏఓగా కూడా ఉన్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఈఓ నిరాకరించారు. నా పరువుకు నష్టం కలిగించారు రెండో పంట చేతికి వచ్చే సమయంలో ఎటుంటి నోటీసులు ఇవ్వకుండా చేలో జెండాలు వేసి గ్రామంలో నా పరువు తీసేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈఓ శ్రీనివాస్ నా పంటను కోసేసి జమా ఖర్చులు చెప్పలేదు. కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. ఆయన చేసిన దౌర్జన్యంపై పోలీసులను ఆశ్రయించాను. దీనిపై కోర్టులో పరువునష్టం దావా కూడా వేస్తాను. – పట్నాల గణపతి, దేవస్థానం భూమి కౌలు రైతు -
అయినవిల్లిలో భక్తజన సందోహం
స్వామివారికి రూ.2.21 లక్షల ఆదాయం అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 48 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇరుగురు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీగణపతి హోమంలో 18 జంటలు, పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు పాల్గొన్నాయి. స్వామి వారి సన్నిధిలో ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఐదుగురు చిన్నారులకు తులాభారం, ఒక చిన్నారికి అన్నప్రాశన నిర్వహించారు. స్వామికి ముగ్గురు భక్తులు తలనీలాలు సమర్పించారు. 31 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3100 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.2,20,638 ఆదాయం లభించినట్లు ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గ భవాని తెలిపారు. వాడపల్లిలో వసతి గదులకు రూ.9.9 లక్షల విరాళంకొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వసతి గదుల నిర్మాణానికి ఓ కుటుంబం రూ.9.9 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ క్షేత్రానికి శనివారం వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారికి వసతి గదుల నిర్మాణానికి, వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం విశాఖపట్నం కేఆర్ఎం కాలనీకి చెందిన కీర్తిశేషులు బలభద్రుని వెంకటనాగ సత్యసాయి సిరి అంజన తల్లిదండ్రులు విజయలక్ష్మి – మాధవరావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు పై మొత్తాన్ని సమర్పించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తుల అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు. ఆదివారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.7,81,206 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. -
చిరు ప్రాణానికి చిటుక గండం
● నిర్లక్ష్యమే ప్రమాద హేతువు ● అప్రమత్తతతో ముందుగా మేలుకోవాలి ● టీకాతో ప్రాణానికి తప్పనున్న ముప్పు రాయవరం: తొలకరి పలకరించింది. భూమిపై గడ్డి మొలుస్తోంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు గడ్డి మొలిచే ప్రాంతాల్లో నిద్రావస్థలో ఉన్న క్రిములు బలపడి జీవాలు తినే పచ్చగడ్డి ద్వారా పశువుల పొట్టలోకి వెళ్తాయి. ఈ క్రిములు పశువుల్లోని చిటుకు వ్యాధికి కారణమవుతాయి. గొర్రెలు, మేకల్లాంటి జీవులు చిటుకు రోగం బారిన పడితే నిమిషాల్లోనే చనిపోతాయి. ఆవులకు, గేదెలకు జబ్బవాపు, గొంతువాపు టీకాల మాదిరిగానే చిటుకు రోగానికి గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తారు. అందుకే ‘చిటుకు’ రోగంపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో గొర్రెలు, మేకలు సుమారు 48 వేల పైబడి ఉన్నాయి. వీటికి ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. అలాగే తొలకరికి ముందుగా గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు ప్రతి పశువైద్య కేంద్రం ద్వారా ఆవులకు, గేదెలకు టీకాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులు వ్యాధి ఎప్పుడు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ పద్ధతులపై పెంపకందారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యాపించేది ఇలా గొర్రెలు, మేకలకు గాలికుంటు, మసూచి, పీపీఆర్, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు త్వరగా సోకుతాయి. ఒక మంద నుంచి మరో మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకర, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స బదులు నివారణే ముఖ్యమైందని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముదే ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిటుకు వ్యాధి మేకలకన్నా గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. నివారణ చర్యలు ఇవీ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. అకాల వర్షాలు, తొలకరి వర్షాలకు పెరిగిన గడ్డిని పశువులు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వరి కోసిన తర్వాత మిగిలిన కర్రలను ఎక్కువగా మేపకూడదు. గొర్రెలు, మేకలకు మూడు నెలలకోసారి నట్టల నివారణ మందు వేయాలి. 30 రోజుల వయసు కలిగిన గొర్రెలు, మేక పిల్లలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వ్యాధికారక బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు, విషపదార్థం విడుదల కావడంతో ఈ వ్యాధి సోకుంది. వ్యాధి సోకిన గొర్రె గిర్రున గాలిలో ఎగిరి కింద పడి మరణిస్తుంది. చిటికెలో జీవాలు చనిపోతాయి కనుకనే చిటుక వ్యాధిగా పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాలు రాత్రి బాగా ఉండి తెల్లవారే సరికల్లా ఎక్కువ సంఖ్యల్లో జీవాలు మత్యువాత పడుతుంటాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా కళ్ల ముందే హఠాత్తుగా గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. జ్వరం, పళ్లు కొరకడం, వణకడం, బిగుసుకుని పోవడం, కాళ్లతో పొట్టను తన్నుకోవడం, చెట్లకు గట్టిగా తలను ఆనించి ఉండడం, కాళ్లు బిగిసి పట్టి నడవడం, శ్వాస కష్టమవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత దశలో అధిక విరేచనాలు, కడుపు నొప్పి, మందకొడిగా ఉండడం, సరిగ్గా మేయకపోవడం వంటి లక్షణాలుంటాయి. ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం చిటుకు వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించాలి. వ్యాధి సోకకముందే నిరోధక టీకాలు వేయిస్తే జీవాల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జిల్లాలో టీకాలు వేయడం ప్రారంభించాం. అన్ని పశువైద్యశాలలు, ఆర్బీకేల్లో తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. గొర్రెలు, మేకల యజమానులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వెంకట్రావు, జేడీ, పశు సంవర్ధక శాఖ, అమలాపురం -
లక్ష్మీ నృసింహుని సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలమ్ సాహ్ని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద కమిషనర్ సాహ్నికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలికారు. వారికి స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ అందజేశారు. తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, మండల ఆర్ఐ వి.రామరాజు, వీఆర్వో ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారి ఆదాయం రూ.2,25,339 ఆలయంలో స్వామివారి లడ్డు ప్రసాదం విక్రయాలు, ప్రత్యేక దర్శనములు, వివిధ సేవల టికెట్లు ద్వారా రూ.1,12,272, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తుల విరాళాలు ద్వారా రూ.1,13,067 కలిపి మొత్తం రూ.2,25,339 ఆదాయం వచ్చినట్టు ఏసీ ప్రసాద్ తెలిపారు. -
టచ్ చేసి చూడు!
సఖినేటిపల్లి: తూర్పు తీరంలో జెల్లీ షిష్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో హైడ్రోజోవా తరగతికి చెందిన విష పురుగులు పెద్దఎత్తున తీరానికి చేరుకుంటున్నాయి. జెల్లీ ఫిష్లలో ఒక వర్గానికి చెందిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంతర్వేది బీచ్లో అధికంగా సంచరిస్తున్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిని ‘అగ్గిబాటా’లని పిలుస్తున్నారు.పొరపాటు గానీ.. అందంగా ఉన్నాయని మక్కువతో వీటిని తాకితే అంతే సంగతులు. వాటిని తాకుతున్న వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో భారీ గాలులకు, సముద్రం ఆటుపోట్ల సమయాల్లో ఇవి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని తప్పించుకునేందుకు స్వచ్ఛమైన సముద్ర తీరానికి సైతం వస్తుంటాయి. ఇవి సమూహంగా జీవిస్తూ.. నీటిపై తేలియాడుతూ సమూహంగానే ఒడ్డుకు వస్తుంటాయి. బ్లూ డ్రాగన్ జెల్లీ విషపూరితమే అంతర్వేది బీచ్లో గుర్తించిన బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ మాత్రం పూర్తిగా విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్ అట్లాంటికస్. ఇది బ్లూ బటన్ జెల్లీ ఫిష్లను ఆహారంగా తీసుకుంటుంది. బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్లో ఈకల వంటి నీలిరంగు పువ్వులను తలపించే భాగాన్ని తాకితే అంతే సంగతి. వాటిల్లో విషం ఉంటుంది. ఈ ఫిష్ వెనుక భాగంలో గాలి బుడగ మాదిరి నిర్మాణం ఉంటుంది. అందువల్ల ఇవి కూడా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ వంటి సమస్యలకు లోనవుతారు.తాకితే ఇబ్బందులేచేపలు కాకపోయినా వీటి పేరు చివర ఫిష్ అని ఉండటం వల్ల వీటిని కూడా కొందరు జలపుష్పాలుగా భ్రమించే అవకాశం ఉంది. నిజానికి ఇవి ఒక రకమైన సముద్ర జీవులు. వీటిని ఎవరైనా తాకితే కుడతాయి. తద్వారా అలెర్జీ వచ్చి శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుడతాయి. అంతర్వేది తీరంలో గుర్తించిన బ్లూ బటన్ జెల్లీ ఫిష్ విషపూరితం కాదని మత్స్యకారులు చెబుతున్నారు. బటన్ వంటి ఆకారాన్ని పోలి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామం పోర్పిటా పోరి్పటా. దీని శరీర భాగంలో ఫోటో అనే గ్యాస్ నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి ఉండే స్పర్శకాల(టెంటకిల్స్)లో నెమటోసిస్ట్ అనే కణాలుంటాయి. మనుషులు లేదా ఏదైనా జీవి వీటిని తాకితే తమను తాము రక్షించుకోవడానికి ఈ జెల్లీ ఫిష్లు టెంటకిల్స్తో కుడతాయి. ఇవి కుట్టడం ప్రాణాంతకం కాదని సైన్స్ నిపుణులు అంటున్నారు.ప్రాణాంతకం కాదు కానీ..వీటి స్పర్శకాలలో నిమటోసిస్ట్ అనే విషపదార్థం ఉంటుంది. ఇవి వలలో పడితే బాక్స్ (పెట్టె) ఆకారంలో శరీరాన్ని పట్టుకుని తీయాలి తప్ప స్పర్శకాలను తాకకూడదు. ఇవి కుడితే ప్రాణాంతకం కాదు. కానీ.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తుంటాయి. పొరపాటున వీటివల్ల ఏదైనా అపాయం జరిగితే ఎసిటిక్ యాసిడ్(వెనిగర్)లో గుడ్డను లేదా దూదిని ముంచి శరీరంపై పెట్టాలి. ఆ తర్వాత తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్సీ -
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్టాప్ బాక్స్లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన యంత్ర పరికరాలు -
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. – కె.గంగమణి, విద్యార్థిని సాగు విధానాలు తెలుస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది. – పి.ఝాన్సీ, విద్యార్థిని క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. – ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా -
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు ● రైతుల ద్వారా సాగుపై అవగాహన ● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు అంకితమయ్యేలా శిక్షణ ● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం అంటున్న అధికారులు పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు ● రూ.65 లక్షల విలువైన బంగారంగా స్వాధీనం కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని బెదిరించి దోచుకోవడంతో కేసు ● పోలీసుల అదుపులో నలుగురు ● పరారీలో ఇద్దరు రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారని సీఐ వివరించారు. -
అనుమానంతో స్నేహితునిపై కత్తితో దాడి
కొత్తపేట: తన భార్య విషయంలో స్నేహితుడిపై అనుమానంతో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. వానపల్లి గ్రామానికి చెందిన మానుపాటి రాజేష్ మోడేకుర్రు గ్రామానికి చెందిన పితాని సతీష్ను కత్తితో గాయపర్చిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై జి. సురేంద్ర తెలిపిన వివరాల మేరకు రాజేష్, సతీష్ కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలసి చదువుకున్నారు. రాజేష్ వానపల్లి మాలకొండయ్యనగర్ వద్ద చికెన్ వ్యాపారం చేసుకుంటుండగా, సతీష్ కులాంతర వివాహం చేసుకుని మందపల్లిలో నివసిస్తున్నాడు. కాగా సతీష్ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ముమ్మిడివరం వెళ్తూ వానపల్లిలో రాజేష్ దుకాణం వద్ద ఆగాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా రాజేష్ తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిన విషయాన్ని చెప్పగా, సతీష్ తాను నచ్చచెప్పి తీసుకువస్తానని ఊరడించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని అనుమానించిన రాజేష్ చికెన్ కోసే కత్తితో సతీష్ మెడపై దాడి చేశాడు. పదునుగా ఉన్న కత్తి వేటుకు అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాల్సి ఉందని ఎస్సై సురేంద్ర తెలిపారు.