breaking news
Dr B R Ambedkar Konaseema
-
సాగునీటి పంపిణీకి ప్రత్యేక ప్రణాళిక
అమలాపురం రూరల్: జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులు, రైతు నీటి సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఖరీఫ్ పంటకు సంబంధించి సాగు నీటి యాజమాన్యం, పంట కాలువల నిర్వహణ, నీటి విడుదల ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ప్రవాహం అధికంగా ఉన్నచోట నీటిని మళ్లించి, దిగువ ప్రాంతాలకు చేరేలా ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘ నాయకులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, ఇతర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో రీ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి, లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే పురోగతి, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, ఈకేవైసీ నమోదు, మ్యూటేషన్లు, సబ్డివిజన్ల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టరేట్లో సమీక్షించారు. జిల్లాలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ పరిమితుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ సంఘాల ఆర్థిక పరిస్థితి, నాబార్డ్ నిబంధనల మేరకు క్యాష్ క్రెడిట్ పునరుద్ధరణపై చర్చించారు. -
దగా డీఎస్సీపై నిరసన సెగ
ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించడం చంద్రబాబుకు అలవాటే. ఆ ప్రకారమే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి పీఠ మెక్కారు. ఇప్పుడు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ద్రోహం చేశారు. అనర్హులకు ఉద్యోగాలను అమ్ముకుని, కష్టబడి చదివిన అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఈ నేపథ్యంలో దగా పడిన నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ నిలిచింది. కూటమి చేసిన అన్యాయంపై నిరసన గళమెత్తింది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించింది.● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన ● కదం తొక్కిన యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ● అమలాపురంలో ర్యాలీ ● హాజరైన ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు ● కూటమి తీరును ఎండగడుతూ నినాదాలు సాక్షి, అమలాపురం/ అమలాపురం రూ రల్/ ఉప్పలగుప్తం: చంద్రబాబు ప్రభుత్వంలో యువత, విద్యార్థులు, నిరుద్యో గులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలో మంగళవారం భారీ ప్రదర్శన చేశారు. వందల మంది పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగం ప్రతినిధులు నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ ఆందోళనకు నిరుద్యోగ యువత, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలిపారు. నల్ల వంతెన నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా జరిగిన ఈ పాదయాత్రకు వందల మంది తరలి రావడంతో అమలాపురం – ముక్తేశ్వరం రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరపాలని, నీట్ లీకేజీని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా, డీఎస్సీ అక్రమాలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కేఎస్ఎన్ రాజు, ఎస్ఈసీ సభ్యులు కాశి బాల మునికుమారి, సాకా మణికుమారి, సాకా ప్రసన్న కుమార్, కుడుపూడి భారత్ భూషణం, కుడుపూడి వెంకటేశ్వర బాబు, తోరం భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, కర్రి నాగిరెడ్డి, దంగేటి రాంబాబు, కర్రి పాపారాయుడు, జక్కంపూడి వాసు, వంటెద్దు వెంకన్నాయుడు, పాటి శివకుమార్, రాష్ట్ర, జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రతినిధులు మిండుగుదిటి శిరీష్, తోరం గౌతమ్ రాజా, కొల్లు త్రినాథవర్మ, ఎస్కే ఖాదర్, సలాది సతీష్, సుదా గణపతి, పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, జిల్లేల రమేష్, వంగా గిరిజ కుమారి, చీకట్ల కిషోర్, ఉండ్రు వెంకటేష్, దొమ్మేటి సత్య మోహన్, ఉంగరాల సంతోష్ కుమార్, కుంచే రమణరావు, మందపాటి కిరణ్ కుమార్, పలివెల సుధాకర్, సరేళ్ల రామకృష్ణ, నల్లా వర ప్రసాద్, దంతులూరి రోహిత్ వర్మ, రుద్రరాజు, చిన్న రాజా, సుంకర సుధ, మద్దింశెట్టి ప్రసాద్, తాడి సహదేవ్, విత్తనాల మూర్తి, బళ్ల శ్యామ్, ములపర్తి శ్రీను, పందిరి రాజేష్, విత్తనాల మూర్తి, దొంగ బాలాజీ, తెన్నెటి కిశోర్, బడుగు మోహన్, చల్లా ప్రభాకరరావు, పెన్మెత్స చిట్టిరాజు, కొవ్వారి సుధాకరరెడ్డి, పొగాకు శ్రీను పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులను చూపిస్తున్న యువజన , విద్యార్థి విభాగాలనాయకులువిచారణ జరపాలి కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. – విప్పర్తి వేణుగోపాలరావు, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ చర్యలు తీసుకోవాలి డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. నిరుద్యోగులకు కూటమి అన్యాయం చేసింది. దానిపై వెంటనే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం కోఆర్డినేటర్ లోకేశ్ రాజీనామా చేయాలి డీఎస్సీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–2 అధ్యక్షురాలు అందరికీ అన్యాయం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. – డాక్టర్ పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అంగడిలో పోస్టులు డీఎస్సీలో అర్హులకు అందజేయాల్సిన ఉద్యోగాలను కూటమి నాయకులు అంగడిలో అమ్ముకున్నారు. ఉద్యోగానికి వెలకట్టి, అనర్హులను అందలం ఎక్కించారు. – పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ముమ్మిడివరం కోఆర్డినేటర్ భవిష్యత్తుతో చెలగాటం విద్యార్థులు, యువత, నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలతో లక్షల మంది అర్హుల కలలు నాశనమయ్యాయి. – పాముల రాజేశ్వరీదేవి, రాజోలు కో ఆర్డినేటర్ -
ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు
అమలాపురం టౌన్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆగస్టు ఒకటి నుంచి పశు వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బి.నాగేశ్వరరావు తెలిపారు. ఇదే సమయంలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం మహిళా డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని పశు సంవర్ధక ఏరియా వైద్యాలయంలో సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని వైద్యాధికారులు, సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య శిబిరాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఆవులకు లంపి స్కిన్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. తెలుగుదేశమే ఫేక్ పార్టీ ● ఆ నిజం మంత్రి లోకేశ్ తెలుసుకోవాలి ● వైఎస్సార్ సీపీ నాయకురాలు జమ్మలమడక నాగమణి కాకినాడ రూరల్: తెలుగుదేశమే ఫేక్ పార్టీ అని, ఆ పార్టీ డీఎన్ఏ ఏమిటో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి హితవు పలికారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని ఉద్దేశించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎలా కబళించారో తెలుగు ప్రజలందరికీ తెలుసనన్నారు. ఆ విషయంపై లోకేశ్కు అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి పార్టీని స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొడ్డి దారిన చేజిక్కుంచున్న వాళ్లే ఫేక్ అని స్పష్టం చేశారు. తాజాగా ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఇంటింటికి తెలుగుదేశం అంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు, లోకేశ్ తెరతీశారని మండిపడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రజల వద్దకు ఏ ధైర్యంతో వెళ్లాలా అని ఆందోళన చెందుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టినా, వాటిని ఆ స్థాయిలో అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో సాగుతున్నాయన్నారు. 31న కాకినాడలో జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడలోని గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.గోపీకృష్ణ, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ వర్మ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ (ఎలక్ట్రికల్, ఫిట్టర్), ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ఆ ఉదయం 10 గంటలకు కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీకి హాజరుకావాలన్నారు. ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నైపుణ్యం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 86399 51441, 86398 46568 నంబర్లను సంప్రదించాలని కోరారు. ప్రధాని సభకు ఆర్టీసీ బస్సులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు జిల్లాలో అర్టీసీ బస్సులు పంపుతున్నామని జిల్లా ప్రజారవాణాధికారి మనోహర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30, 31, ఆగష్టు 1న పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఫ చెప్పినా వినకుండా.. రహదారులపై ప్రయాణించే వాహనాలు వెనుక వచ్చే వారికి ఇబ్బంది లేకుండా వెళ్లాలి. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ముందుకు సాగాలి. కానీ కొందరు డ్రైవర్లు పరిమితికి మించి లగేజీ వేసుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వారి మాటలను పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారిపై గండేపల్లి మండలం మురారి శివారున మినీ వ్యాన్లో పరిమితికి మించి సామగ్రిని తరలిస్తున్నారు. – గండేపల్లి -
యువత తరఫున ఉద్యమం
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసేంత వరకు నిరుద్యోగ యువత తరఫున ఉద్యమం చేస్తాం. నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకు పైసా నిధులు కేటాయించలేదు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నైతిక బాధ్యత లేదా? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలను అమ్ముకున్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి లోకేశ్కు నైతిక బాధ్యత లేదా?. – చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు త్వరలో తిరుగుబాటు కూటమి పాలకుల అవినీతి, అక్రమాలపై ప్రజలు త్వరలోనే తిరగబడతారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు దోచిపెట్టడానికే చంద్రబాబు సంపద సృష్టి చేస్తున్నారు. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, మండపేట కో ఆర్డినేటర్ నిరుద్యోగ భృతి ఏది? కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదు. డీఎస్సీ 2025పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ యువతకు మోసం నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. యువతను మోసం చేసిన ఈ ప్రభుత్వం.. పాలించే అర్హత కోల్పోయింది. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ అవకతవకలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే చెల్లించారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. – పిల్లి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు,కో ఆర్డినేటర్ -
కరిచర్లగూడెంలో పెద్దపులి!
● పామాయిల్ తోటలో మకాం ● పొలాల్లో ప్రత్యేక బృందాల రిస్క్యూ ఆపరేషన్ దేవరపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు కొంత కాలంగా దడ పుట్టిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల మధ్య పొలా లకు చేరుకుంది. సోమవారం మండలంలోని కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్టు పాదముద్రల ద్వారా గుర్తించిన అటవీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీ శాఖ రాజమహేంద్రవరం రేజ్ అధికారి దావీద్ రాజు ఆధ్వర్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. 60 మంది సిబ్బందిని 5 బృందాలుగా పంపి గాలింపు చేపట్టారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా దాని కదలికలను గమనిస్తున్నారు. మంగళవారం ఉదయం నందిగూడెం అటవీ ప్రాతం నుంచి తొక్కిరెడ్డిగూడెం మీదుగా కరిచర్లగూడెం బొల్లేరు చెరువు సమీపంలోకి చేరుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆవుదూడను చంపి సమీపంలోని కొబ్బరి, కోకో, ఆయిల్పామ్ తోటల్లోకి లాక్కెళ్లినట్టు గుర్తించిన అధికారులు తోటను చుట్టిముట్టి అక్కడ బోను ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్, డ్రోన్ సహాయంతో పులిని పట్టుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం శ్రీశైలం టైగర్ టీం, జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. -
పీజీఆర్ఎస్కు 271 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 271 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ప్రజలు స్కాన్ చేసి, ప్రభుత్వ సేవలపై తమ అభిప్రాయాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
రూ.50 వేల అప్పు.. 5 సెంట్ల భూమి కబ్జా
పిల్లల చదువుల కోసం 2017 జనవరి 8న ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన నున్న సూరిబాబు వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాను. ఆ సమయంలో ప్రామిసరీ నోటుతో పాటు ఆధార్ కార్డు ప్రతులు, ఖాళీ పేపర్పై సంతకాలు తీసుకున్నారు. 2017 జనవరి 28న అసలు, వడ్డీ పూర్తిగా చెల్లించేందుకు వెళ్లగా దుర్భాషలాడి తనను అక్కడి నుంచి పంపించేశారు. ఖాళీ పేపర్పై తనతో చేయించుకున్న సంతకాన్ని దుర్వినియోగం చేసి, ఉట్రుమిల్లిలో తనకు చెందిన 5 సెంట్ల భూమి కబ్జా చేశారు. సూరిబాబుపై చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం. – బలభద్రుని వెంకటేశ్వరరావు, కుమ్మర్ల వీధి, రామచంద్రపురం (ఈ సమస్యపై ఎస్పీ రాహుల్ మీనాకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.) -
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
ఫ అదిరేలా ఆషాఢం సారె అమలాపురం సుబ్బారాయుడి చెరువు సెంటర్లో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు సోమవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సీనియర్ న్యాయవాది కూచిమంచి మల్లపరాజు, నాగమణి, వారి కుమారుడు, మరో న్యాయవాది శశిధర్ శ్రీరామ్, సుజాత దంపతుల ఆధ్వర్యాన ఆ ప్రాంత మహిళలు అమ్మవారికి ఆషాఢం సారె వైభవంగా సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు సారెతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, అమ్మవారి సన్నిధిలో నివేదించారు. ఈ సంప్రదాయాన్ని ఇక నుంచి ఏటా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయంలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. – అమలాపురం టౌన్ఫ పసుపు నీళ్లతో బోనం వేడుకఆషాఢ మాసం సందర్భంగా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో గ్రామ దేవతలకు సోమవారం పసుపు నీళ్లతో బోనం వేడుక కోలాహలంగా నిర్వహించారు. రాజమహేంద్రవరానికి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యాన స్థానిక శ్రీ ఉమా మూలేశ్వరస్వామి ఆలయం నుంచి మహిళలు లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ ఊరేగింపు నిర్వహించి, బిందెలతో పసుపు నీళ్లు తెచ్చి బోనాలు సమర్పించారు. సమరసత సేవా ఫౌండేషన్ గోదావరి విభాగం మహిళా కన్వీనర్ పద్మశ్రీ, ధర్మ ప్రచారక్ మల్లేశ్వరరావు, మండల కో కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. – ఆలమూరు -
పోలీస్ గ్రీవెన్స్కు 27 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 27 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే తమ తమ చాంబర్లలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 27 అర్జీలు రాగా.. అధికంగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. వారికి ఎస్పీ, ఏఎస్పీలు కౌన్సెలింగ్ చేశారు. ఆక్వా అక్రమ సాగుతో పర్యావరణానికి విఘాతం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: ఆక్వా అక్రమ సాగుతో జిల్లాలో ప ర్యావరణానికి విఘాతం కలుగుతోందని ఎమ్మెల్యే కుడుపూ డి సూర్యనారాయణరావు అన్నారు. ఈ సమస్య ను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో సోమ వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, గోదావరి పరీవాహక ప్రాంతాలు, మడ అడవు లు, డి–పట్టా భూముల్లో సైతం ఆక్వా అక్రమ సాగు యథేచ్ఛగా జరుగుతోందని అన్నారు. కోనసీమలో దశాబ్దాలుగా చమురు, గ్యాస్ నిక్షేపాల ను వెలికి తీస్తున్న చమురు సంస్థలు తమ లాభా ల్లో కొంత భాగాన్ని ఆయా ప్రాంతాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద వెచ్చించాలనే నిబంధన ఉందని గుర్తు చేశారు. అయితే, చమురు సంస్థలు నోరున్న ప్రజాప్రతినిధులకు తాయిలాలుగా ఇచ్చేసి, అరకొరగా విదిలిస్తున్నాయని ఆరోపించారు. అందువల్లనే ప్రజాప్రతినిధులు పర్యావరణం, ఆక్వా అక్రమ సాగు గురించి మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. సీఎస్ఆర్ నిధుల ను సద్వినియోగం చేయాలని డిమాండ్ చేశారు. ఐ.పోలవరం మండలంలో 200 ఎకరాల మడ అడవులను నరికేసి, ఆక్వా చెరువులు అక్రమంగా తవ్వేశారని ఆరోపించారు. ఇవన్నీ డి–పట్టా భూములన్నారు. జిల్లాలో సహజ వనరులను ధ్వంసం చేసి, ఆక్వా అక్రమ సాగు చేస్తున్న చోట్ల స్థానికులు స్పందించి, తన వద్దకు వస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా సహాయపడతానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు చెప్పారు. కోనసీమ మహిళా రచయిత్రిల సంఘం ఆవిర్భావం అమలాపురం టౌన్: కోనసీమ రచయితల సంఘానికి అనుబంధంగా కోనసీమ రచయిత్రిల సంఘం ఆవిర్భవించింది. దీనికి గౌరవాధ్యక్షులుగా డాక్టర్ ప్రభల జానికి (అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు), పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి (అమలాపురం) సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని 23 మంది రచయిత్రులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని అనంతలక్ష్మీదేవి తెలిపారు. -
యువత పోరాటం స్ఫూర్తిదాయకం
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య కాకినాడ రూరల్: రమణయ్యపేట ఇందిరా కాలనీలో సోమవారం ఉదయం సిరిమల్లి పవన్ కుమార్ (21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేసిన పవన్ కుమార్ ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి ట్రావెల్స్లోను, తల్లి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉదయం విధులకు వెళ్లిన తర్వాత పవన్ కుమార్ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తల్లి సిరిమల్లి దుర్గాభవాని ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పవన్కుమార్ కుటుంబం 2004లో కరీంనగర్ నుంచి కాకినాడకు వచ్చి స్థిరపడింది. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు ఉద్యమాన్ని అంకితమిస్తున్నామని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆ నిరసనకు తమ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారన్నారు. యువతతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలుసుకోవాలన్నారు. ఈ కారు ఎవరిదో! కాట్రేనికోన: పల్లంకుర్రు శివాలయం సమీపంలోని చింతల చెరువు రోడ్డులో అనుమానాస్పద కారు కలకరం లేపుతోంది. ఏపీ 05 ఈడబ్ల్యూ 0123 నంబర్ గల కారును కొన్ని నెలలుగా రోడ్డు పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు పార్కు చేసి వదిలేశారు. ఆ కారు సుదీర్ఘ కాలం ఉండటంతో కుట్ర కోణం ఏమైనా ఉందానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కారు నంబర్ ఆధారంగా సమాచారం సేకరించి అపరిచితులను గుర్తించాలన్నారు. -
ప్రకృతి సంపద పరిరక్షణలో ఎఫ్బీవోలు కీలకం
రాజానగరం: దేశంలోని ప్రకృతి సంపదను పరిరక్షించడంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్బీవో)ల పాత్ర కీలకమని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధనుంజయరావు అన్నారు. అటవీ సంపదను కాపాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఎఫ్బీవోలకు సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ధనుంజయరావు మాట్లాడుతూ పర్యావరణ స్థిరత్వానికి, వాతావరణ సహనశీలతకు వ్యవసాయం, ఉద్యానం, అడవులు అనుసంధానమైన మూలస్తంభాలన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖతో తమ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకోవాలని భావిస్తుందన్నారు. అకాడమీ డైరెక్టర్ బి.విజయ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కి నూతనంగా ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అలా 2017 నుంచి ఇప్పటివరకు అకాడమీలో 878 మంది అటవీ ఫ్రంట్లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అకాడమీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ తీగల దొంగలు దొరికారు
ఫ రెండు కేసుల్లో 9 మంది అరెస్ట్ ఫ వివరాలు వెల్లడించిన సీఐ వీరయ్య గౌడ్ రాజానగరం: వెలుగుబంద, పాలచర్ల తదితర ప్రాంతాల్లోని లేఅవుట్లలో ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి తీగలను, పొలాల్లో బోర్ల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను చోరీ చేస్తున్న రెండు ముఠాలను పట్టుకున్నామని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మంగి సుధాకరరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా రంగినిగూడకు చెందిన కిల్లో రాజు, బోండాంకు చెందిన పొంగి విజయ్, బసికి చెందిన కొర్రా ప్రహ్లాదలను ఒక కేసులో అరెస్ట్ చేశామన్నారు. వీరు గత ఏడాది నుంచి రాజానగరం, సీతానగరం, కొవ్వూరు మండలాల్లోని విద్యుత్ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని, వీరిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి రూ.3,57,500 విలువైన 1,430 కిలోల అల్యూమినియం కండక్టింగ్ వైరును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఫ మరో కేసులో కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన శివగంగ బాబూరావు, నేమవరపు మురళీకృష్ణ, మేడిశెట్టి మణికంఠ, బసమని వీరబాబు, శివగంగ రాజులను అరెస్ట్ చేశారని సీఐ తెలిపారు. వీరు కూడా రాజానగరం, సీతానగరం మండలాల్లోని పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి, దానిలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నారన్నారు. తోటల్లో ఉండే గెస్ట్ హౌస్ల వద్ద, లేఅవుట్లలోని విద్యుత్ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని తెలిపారు. వీరిపై జిల్లాలో 9 కేసులు నమోదు కాగా రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఏడు కేసులు ఉన్నాయన్నారు. వీరి నుంచి 361 కేజీల అల్యూమినియం తీగలను కరిగించి తయారు చేసిన దిమ్మలు, 23 కేజీల రాగి దిమ్మలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఒక ఆటో, రెండు బైకులను స్వాధీనపర్చుకున్నామని వివరించారు. ఎస్సై ప్రియకుమార్ ఆధ్వర్యంలో ఈ రెండు కేసులలో చోరులనుచాకచక్యంగా పట్టుకున్నారని సీఐ తెలిపారు. -
84,800 సీట్లకు అనుమతి
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ –కాకినాడకు అనుబంధంగా ఉన్న 103 కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల నిమిత్తం 84,800 సీట్ల భర్తీకి అనుమతిచ్చారు. అలాగే, జేఎన్టీయూకేలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్ల పెంపుదలకు కూడా అనుమతి వచ్చింది. సీఎస్ఈ, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ వంటి విభాగాల్లో ఇప్పటి వరకూ ఒక్కో దానికి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 55 సీట్లు మాత్రమే ఉండేవి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నుంచి కొత్తగా వచ్చిన అనుమతితో ఒక్కో సెక్షన్కు 60, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6 కలిపి మొత్తం 66 సీట్లు ఇచ్చారు. ఒక్కో కోర్సుకు రెండు సెక్షన్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలికి నివేదిక రాష్ట్రంలోని అన్ని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యా మండలికి నివేదిస్తేనే అక్కడి నుంచి ఆన్లైన్లో కళాశాలల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక అనుబంధ కళాశాలలు కలిగి ఉండటంతో పాటు సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఉన్నత విద్యా మండలికి నివేదిక పంపించింది. ఈ నెల 21 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా.. కళాశాల, కోర్సు ఎంపికకు కీలకమైన వెబ్ ఆప్షన్లకు ఈ నెల 31 వరకూ అవకాశముంది. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే గుర్తింపు ఇచ్చామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. అటువంటి కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. జేఎన్టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో సీట్లు పెంచి కొత్తగా మరో సెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్ కొప్పిరెడ్డి పద్మరాజు తెలిపారు. దీంతో, మరింత మంది విద్యార్థులకు కళాశాలలో చేరే అవకాశం లభిస్తుందని, ర్యాంకు ఆధారంగా అర్హులైన వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. -
చెత్త వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
పెరవలి: కట్టుకున్న భర్త మృతి చెందాడు, చేతికంది వచ్చిన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కొవ్వూరు పట్టణంలో చెత్త వ్యాన్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన మోస మణికంఠ (19) పెయింటింగ్, కూలి పనులు చేసుకుంటూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని మోటారు సైకిల్పై ఇంటికి వస్తున్న అతడిని మున్సిపాలిటీకి చెందిన చెత్త వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మణికంఠను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లి నాగమణి విలపిస్తూ ఆసుపత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. తండ్రి లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఆసరాగా ఉన్న సమయంలో భగవంతుడు తీసుకుపోయాడని, తాను ఎవరి కోసం బతకాలి అంటూ దీనంగా రోదించింది. డ్రైవర్ లేకపోవడంతో.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ చెత్త వ్యాన్ను అనుభవం ఉన్న డ్రైవర్ కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది నడిపినట్టు తెలిస్తోంది. ఆ వ్యాన్కు శాశ్వత డ్రైవర్ లేకపోవటంతో పారిశుధ్య కార్మికులే నడుపుతున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. -
కొండంత భారం తగ్గాల్సిందే!
చెక్కుల బౌన్స్పై ఆగ్రహం వివిధ వ్యాపారస్తులు ఇచ్చిన సుమారు 20 చెక్కులు బౌన్స్ కావడంపై ట్రస్ట్బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కు బౌన్స్ అయిన సందర్భంగా ఆ వ్యాపారులు డబ్బును జమ చేయకపోతే వారిపై కేసులు వేయాలని సూచించారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, ట్రస్ట్బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఫ అన్నవరం ట్రస్ట్బోర్డు సమావేశంలో సభ్యుల తీర్మానం ఫ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై చర్చ ఫ లీజు బకాయి ఫైళ్ల పరిశీలన అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో షాపుల లీజుదారులు బకాయిలు చెల్లించకపోతే వెంటనే షాపులను మూసివేయించాలని దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు ఆదేశించారు. చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో వివిధ షాపులను టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకున్న వ్యాపారస్తులు దేవస్థానానికి రూ.నాలుగు కోట్లు బకాయి పెట్టారని ‘సాక్షి’ పత్రికలో కొండంత భారం శీర్షికన శనివారం ప్రచురితమైన వార్త ఆధారంగా చర్చ జరిపారు. కాఫీ మెషీన్ల షాపుల నుంచి పూజా ద్రవ్యాల దుకాణాల వరకు అన్ని వ్యాపారాల బకాయిలుపై ట్రస్ట్ బోర్డు సభ్యులు సమీక్షించారు. వచ్చే సమావేశం నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ఆదేశించారు. కాగా.. ఈ నెలలో రూ.2.60 కోట్ల బకాయిలు వసూలు చేశామని అధికారులు తెలిపారు. ఆ మొత్తంలో కొత్తగా వేలం జరిగిన రెండో నెంబర్ పూజా ద్రవ్యాల షాపు పాడిన నిర్వాహకుడు జమ చేసిందే రూ.1.20 కోట్లు ఉండడం విశేషం. ఇతర తీర్మానాలు ఫ సత్యగిరిపై విష్ణుసదన్ ఉత్తరం వైపుగల ఖాళీ స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 300 గదుల సత్రం నిర్మాణానికి టీటీడీ ఈవోను కోరుతూ తీర్మానం చేశారు. ఫ దేవస్థానం కళాశాల విద్యార్థులకు దేవస్థానం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని తీర్మానించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి దాతలు ఇచ్చిన విరాళాల నుంచి మధ్యాహ్న భోజనం పెట్టడానికి గతంలో తీర్మానించి ఈ నెల రెండో తేదీ నుంచి మూడు రోజులు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్నదానం నిధుల వినియోగంపై విమర్శలు రావడంతో నిలిపివేశారు. ఫ రత్నగిరిపై 23 అడుగుల ఎత్తు కలిగిన గరుడ విగ్రహాన్ని కాంక్రీట్తో నిర్మించేందుకు కాకినాడకు చెందిన దాత లింగంగుంట సుమలత ముందుకు వచ్చినందున, దీనిపై నిర్ణయాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేశారు. ఫ ప్రముఖ దాతలు, దేవస్థానం ట్రస్ట్బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు మట్టే సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డిలకు ట్రస్ట్బోర్డు సమావేశం అజెండా పంపకపోవడంపై సభ్యుడు రావిపాటి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. ఫ ఆలయ ప్రాకారంలో అగరవత్తుల విక్రయ షాపు, నిర్మాల్య పత్రితో తయారు చేసే ఉత్పత్తుల విక్రయించే షాపుతో భక్తులకు అసౌకర్యంగా ఉన్నందున వీటి లీజు రద్దు చేసే విషయాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. ఫ ఈఓ కార్యాలయం దిగువన గల పాత మెయిన్ క్యాంటీన్ను సేవా కార్యకర్తలకు వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సభ్యులుతీర్మానించారు. -
సర్కారుపై సమరశంఖం
సాక్షి, అమలాపురం: ఏదో ఒక విధంగా అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చిన చంద్రబాబు అండ్ కో.. గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను షరా మామూలుగా తుంగలో తొక్కేశారు. చంద్రబాబు చెప్పిన ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి మాటలు నమ్మి తాము మోసపోయామని నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా దగా చేసిన సర్కారుపై వారు పిడికిలి బిగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అడుగడుగునా దగా ● నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు గొప్పగా డప్పేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా భృతిపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో సుమారు 10 వేల మంది నిరుద్యోగులు భృతికి అర్హులుగా ఉన్నారని అంచనా. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున లెక్కిస్తే ఏడాదికి రూ.3 కోట్లు అవుతుంది. రెండేళ్లకు కలిపి రూ.6 కోట్ల మేర నిరుద్యోగులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాగా, జిల్లాలో 4.50 లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా నిరుద్యోగిగా ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 4.50 లక్షలకు పైగా నిరుద్యోగులున్నట్లు అనధికార అంచనా. ఆవిధంగా లెక్కిస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.135 కోట్లు పైగా ఉంటుంది. దీని ప్రకారం జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వం రెండేళ్లకు కలిపి రూ.270 కోట్లకు పైగా నిరుద్యోగ భృతి బకాయి పడింది. ● ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. తద్వారా జిల్లాలోని సుమారు 1,065 మంది యువతను రోడ్డున పడేసింది. ● జిల్లాలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే అమరావతి, అడపాదడపా విశాఖకు తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. మరోవైపు స్థానికంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మూత పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● జిల్లాలో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.17 కోట్లకు చేరాయి. ఈ ఏడాది సుమారు 27 వేల నుంచి 32 వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో సొమ్ము పడకపోవడంతో ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో క్వార్టర్కు రూ.15 వేల వరకూ రావాల్సి ఉండగా, కొందరు విద్యార్థులకు నాలుగు నుంచి ఏడు క్వార్టర్ల వరకూ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కో విద్యార్థికి రూ.60 వేల నుంచి రూ.1.05 లక్షల వరకూ రావాల్సి ఉంది. ● 2025–26 విద్యా సంవత్సరానికి ఇంకా ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐల్లో అడ్మిషన్లు పూర్తి కాలేదని, అందుకే తొలి క్వార్టర్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బకాయిలపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడం గమనార్హం. ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్టీఎఫ్ నిధులు తక్షణమే విడుదల చేయాలనే డిమాండుతో జిల్లాలోని 49 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గతంలో ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదు. వెనుక దగా ముందు దగా.. కుడి ఎడమల దగా దగా అంటూ మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో అక్షరీకరించిన ‘చేదుపాట’.. చంద్రబాబు ప్రభుత్వంలో అక్షర సత్యంగా నిలుస్తోంది.నేటి నిరసన ఇలా.. యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 9 గంటలకు అమలాపురంలో నిరసన ప్రదర్శన జరగనుంది. స్థానిక నల్లవంతెన వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ పాదయాత్రగా ఈ ప్రదర్శన సాగుతుంది. డీఎస్సీ అక్రమాలపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచీ పార్టీ, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. విజయవంతం చేయాలి చంద్రబాబు ప్రభుత్వ దగాకోరు విధానాలతో రాష్ట్రంలోని యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అమలాపురం నల్ల వంతెన వద్ద వంటెద్దు వెంకన్నాయుడు కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకూ ఈ ర్యాలీ జరుగుతుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలి. నీట్ ప్రశ్న పత్రం లీకేజీని నిరసిస్తూ లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ వేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోనూ డీఎస్సీ పేపర్ లీకై ంది. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి. టాప్ ర్యాంకర్లను చివరిలో పెట్టారు. తద్వారా అర్హులకు అన్యాయం జరిగింది. దీనిపై సీబీఐ విచారణ చేయడంతో పాటు, దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంటు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా యువత, విద్యార్థుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. – చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే పిడికిలి బిగిస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులు నేడు అమలాపురంలో భారీ నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేతల పిలుపు డీఎస్సీలో అక్రమాలతో అన్యాయం చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ అవకతవకలు వెలుగు చూశాయి. మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నష్టపోయిన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల రాజీనామా చేసినట్లుగానే.. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ జోరందుకుంది. యువత, విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
రాష్ట్ర స్థాయిలో రంగంపేట విద్యార్థినుల సత్తా
ఫ క్లే మోడలింగ్ పోటీల్లో ప్రథమ స్థానం ఫ అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు రంగంపేట: రాష్ట్ర స్థాయి క్లే మోడలింగ్ పోటీల్లో రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. కాకినాడ జిల్లా కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో ఈ నెల 26న వరల్డ్ వైల్డ్ ఫారెస్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యాంగ్రోవ్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన సత్య, జ్ఞాన, లక్ష్య, కార్తీక, సంతోషిణితో కూడిన బృందం ఆ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిందని ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థినులకు శిక్షణ అందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రమ్యసుధ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. తమ విద్యార్థినులు కోరింగ ఆవరణ వ్యవస్థ అంశంపై క్లే మోడల్ను రూపొందించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుని ప్రథమ బహుమతిని సాధించారని వివరించారు. విజేత విద్యార్థినులను, గైడ్ టీచర్ రమ్యసుధను మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా అభినందించారు. -
మోదీ పాలనలో 152 సార్లు పేపర్ల లీక్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 152 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని, అయితే ఏ ఒక్కదానిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సోమవారం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, వారి ఇళ్లలో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీయే విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ తలపెట్టిందని రుద్రరాజు అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొని లారీ బోల్తా
రావులపాలెం: జాతీయ రహదారిపై రావులపాలెంలోని కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. కోల్కతా నుంచి భీమవరానికి బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన గొట్టాలను ఈ లారీలో తీసుకువెళుతున్నారు. రావులపాలెం వద్ద డ్రైవర్కు నిద్రమత్తు వచ్చి, డీవైడర్ను ఢీకొనడంతో లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డైవరుకు స్వల్ప గాయాలు అయ్యాయి. హైవే, పోలీసులు అధికారులు గొట్టాలను వేరే లారీపైకి లోడ్ చేయించి క్రేన్ సాయంతో లారీని తొలగించారు. -
ముంపు సమస్యకు తాత్కాలిక పరిష్కారం
ఆత్రేయపురం: లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం గ్రామాల్లో పంట పొలాల ముంపు సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. ముంపు బారిన పడిన పంట పొలాలను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ నెల 20న పరిశీలించి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుతో కలసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జగ్గిరెడ్డి ఆ సందర్భంగా హెచ్చరించారు. దీంతో కూటమి ప్రభుత్వం దిగి వచ్చింది. ముంపులో ఉన్న పంట పొలాలను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, ఇరిగేషన్, డ్రైనేజీ ఈఈలు వెంకటేశ్వరరావు, కిషోర్ తదితరులు ఈ నెల 22న స్వయంగా పరిశీలించారు. ముంపునకు గల కారణాలను డ్రైనేజీ ఉన్నతాధికారిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, ఒకవైపు శివారు భూములకు సాగునీరు అందడం లేదని, మరోవైపు ఆత్రేయపురం, వాడపల్లి, లొల్ల గ్రామాల్లో వరి పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అమలాపురం బ్యాంకు కాలువకు సోమవారం నీటి విడుదలను తగ్గించారు. ముంపు పొలాల్లోని నీటిని బ్యాంకు కాలువలోకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి చాలా వరకూ ముంపు తగ్గింది. ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని ఎంపీపీ కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కనుమూరి శ్రీనురాజు తదితరులు కోరారు. -
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
పాత నోట్లకు గుడ్బై?.. కొత్త కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం!
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాయి. ఈ నోట్లు నీటిలో నానవు, చింపినా చిరగవు. అందుకే ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా పాలిమర్ నోట్ల ముద్రణ వైపు అడుగులు వేస్తున్నాయి. మన దేశం కూడా త్వరలోనే పాలిమర్ కరెన్సీ నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సంవత్సరాంతానికి తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రపంచంలోని పలు దేశాలు ముద్రించిన పాలిమర్ నోట్లను సేకరించారు. ఆయన ఇప్పటికే 68 దేశాలకు చెందిన 144 పాలిమర్ కరెన్సీ నోట్లు సేకరించారు. మన దేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు పుష్కర కాలం కిందటే పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచన చేసిందని, అది మనకు సరిపడదని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టిందని సేకరణకర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. ఆయన సేకరించిన తన ఖజానాలో భద్రపరుచుకున్న పలు దేశాల పాలిమర్ కరెన్సీ నోట్లను ఆయన మీడియాకు చూపారు. కృష్ణ కామేశ్వర్ సేకరించిన పలు దేశాల పాలిమర్ కరెన్సీ నోట్లు అమలాపురం టౌన్: -
నానవు.. చిరగవు
● త్వరలో మనకూ ప్లాస్టిక్ కరెన్సీ ● 68 దేశాలకు చెందిన పాలిమర్ నోట్లు ● సేకరించిన కృష్ణ కామేశ్వర్ అమలాపురం టౌన్: ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాయి. ఈ నోట్లు నీటిలో నానవు, చింపినా చిరగవు. అందుకే ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా పాలిమర్ నోట్ల ముద్రణ వైపు అడుగులు వేస్తున్నాయి. మన దేశం కూడా త్వరలోనే పాలిమర్ కరెన్సీ నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సంవత్సరాంతానికి తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రపంచంలోని పలు దేశాలు ముద్రించిన పాలిమర్ నోట్లను సేకరించారు. ఆయన ఇప్పటికే 68 దేశాలకు చెందిన 144 పాలిమర్ కరెన్సీ నోట్లు సేకరించారు. మన దేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు పుష్కర కాలం కిందటే పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచన చేసిందని, అది మనకు సరిపడదని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టిందని సేకరణకర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. ఆయన సేకరించిన తన ఖజానాలో భద్రపరుచుకున్న పలు దేశాల పాలిమర్ కరెన్సీ నోట్లను ఆయన మీడియాకు చూపారు. -
గతి తప్పిన రుతురాగం
సాక్షి, అమలాపురం: ‘వర్షాలు కురవాలని జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో కప్పలకు పెళ్లిళ్లు చేసి, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. భజనలు చేస్తూ గ్రామ దేవతలను ప్రార్థించి వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు. ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి. కానీ, వాన జాడ మాత్రం కానరావడం లేదు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ వాన కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న కోనసీమ రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. చినుకు రాలకపోవడంతో కోనసీమలో వాతావరణం రెండో వేసవిని తలపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో పొలాలు బీటలువారుతుండగా, నారుమడులు ఎండిపోతున్నాయి. సాగు ప్రారంభ దశలోనే రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కానరాని వరద జాడ వర్షాభావం ప్రభావం జీవనది గోదావరి ప్రవాహంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కనిపించగా, ఈ ఏడాది ఆ జాడే లేదు. బ్యారేజీ నుంచి ఆదివారం 14,400 క్యూసెక్కుల మిగులు జలాలను మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టారు. గత ఏడాది ఇదే రోజున 2,16,302 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్లింది. జూన్ 1 నుంచి జూలై 25 వరకూ ధవళేశ్వరం బ్యారేజీకి మొత్తం 85.151 టీఎంసీల నీరు మాత్రమే చేరగా, గత ఏడాది ఇదే కాలవ్యవధిలో ఏకంగా 472.792 టీఎంసీలు వచ్చాయి. దాదాపు ఐదో వంతు కూడా నీటి లభ్యత లేకపోవడాన్ని బట్టి గోదావరి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు మరింత ఇబ్బందికరం వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే డెల్టాలో వరి నారుమడులు ఎండిపోతున్నాయి. కొబ్బరి, అరటి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు నీటి కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి లంక ప్రాంతాలు, మోటార్ల సౌకర్యం లేని డెల్టా శివార్లలో కొబ్బరి తోటలు తలలు వాల్చేస్తున్నాయి. లంక గ్రామాల్లో పశుగ్రాసం కొరత మొదలై పశు పోషకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గత ఏడాది, ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 25 వరకూ గోదావరిలో నీటి లభ్యత, వినియోగం వివరాలు (టీఎంసీలలో)గత నెల 17న కొత్తపేట మండలం వాడపాలెం గ్రామస్తులు పెళ్లి చేసిన కప్పలువరుణుడి కరుణ కోసం..: అమలాపురం రూరల్ రంగాపురంలో ఈ నెల 22న కప్పలతో ఊరేగింపుజిల్లాలో జూన్, జూలై నెలల్లో వర్షపాతం లోటు (మిల్లీమీటర్లలో)మండలం జూన్ జూలై (25 వరకూ) నమోదైనది సాధారణ లోటు నమోదైనది సాధారణ లోటు అయినవిల్లి 39.9 103.4 –61.4 30.2 247.7 – 87.8 రామచంద్రపురం 44.1 87.0 –49.3 37.7 224.3 – 83.2 ఆలమూరు 95.5 107.4 –11.1 169.0 225.0 – 24.9 రావులపాలెం 52.6 107.5 –51.1 21.8 227.5 – 90.4 కొత్తపేట 22.4 96.5 –76.8 38.1 223.4 – 82.9 కె.గంగవరం 45.0 102.6 –56.1 54.4 226.9 – 75.8 పి.గన్నవరం 62.8 113.0 –44.4 47.7 215.7 –78.1 ముమ్మిడివరం 51.5 126.0 –59.1 48.1 230.8 –79.1 ఐ.పోలవరం 73.4 114.1 –35.7 37.8 219.9 –82.4 అంబాజీపేట 21.1 122.7 –82.8 27.3 220.2 –87.5 మామిడికుదురు 69.7 121.4 –42.6 21.2 192.7 –89.0 రాజోలు 41.3 126.4 –67.4 27.4 203.4 –86.5 మలికిపురం 97.9 90.9 +7.7 64.8 185.9 –65.1 సఖినేటిపల్లి 100.3 140.3 –28.5 31.6 204.3 –84.3 అల్లవరం 58.3 117.3 –50.3 15.2 210.3 –92.8 అమలాపురం 54.3 118.0 –54.0 82.5 215.1 –61.7 ఉప్పలగుప్తం 60.4 111.1 –40.2 42.2 203.5 –79.3 కాట్రేనికోన 105.9 134.8 –10.5 52.7 218.2 –75.9 జిల్లా సగటు వర్షపాతం జూన్ 57.9 112.5 48.5 శాతం జూలై 25 వరకూ 40.6 218.9 81.4 శాతం ఫ ఎల్నినోతో జిల్లాలో రెండో వేసవి వాతావరణం ఫ కప్పలకు పెళ్లిళ్లు చేసినా.. కరుణించని వరుణుడు ఫ జూన్లో వర్షపాతం లోటు 48.5 శాతం ఫ జూలై 81.4 శాతం లోటు ఫ ఎండిపోతున్న నారుమడులు ఫ నీటి కోసం రైతన్న ఎదురుచూపులు ఫ డెల్టాపై ఆందోళన నీడ గత ఏడాది ఈ ఏడాది తూర్పు డెల్టా కాలువకు 14.995 17.109 మధ్య డెల్టా కాలువకు 7.901 9.448 పశ్చిమ డెల్టా కాలువకు21.504 26.727 డెల్టా కాలువలకు మొత్తం వినియోగం 44.400 53.284 సముద్రంలోకి విడిచిపెట్టిన జలాలు 430.392 31.867 బ్యారేజీకి వచ్చిన మొత్తం నీరు 472.792 85.151గత, ఈ ఏడాది జూలై 26న కాలువలకు విడుదల చేసిన నీరు 9,100 (క్యూసెక్కులు) 14,700 (క్యూసెక్కులు) గత, ఈ ఏడాది జూలై 25న సముద్రంలోకి విడిచిపెట్టిన నీరు 2,16,302 (క్యూసెక్కులు) 14,900 (క్యూసెక్కులు) -
ఒక్క ప్రమాదమూ జరగకపోవడమే లక్ష్యం
రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం – ప్రాణాలు కాపాడదాం, సున్నా ప్రమాదాలే మన లక్ష్యం, సురక్షిత ప్రయాణమే ఉత్తమ సేవ అనే భావనతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలి. అదే ప్రమాద రహిత వారోత్సవాల ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు, వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నాం. – వైవీవీఎన్ కుమార్, ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో మేనేజర్ -
శాకంబరిగా ఉప్పాలమ్మ
కరప: గ్రామదేవత ఉప్పాలమ్మ తల్లిని ఆదివారం శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వైస్ ఎంపీపీ పాట్నీడి సత్యభీమేశ్వరరావు(భీమన్న) సమకూర్చిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వేపకొమ్మలు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కరప పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉప్పాలమ్మను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిన్నారి మురళీకృష్ణ, గొర్రెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈనెల 29న పౌర్ణమి రోజున అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి, ఈ కాయకూరలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
త్వరలో ఓరియంటేషన్ తరగతులు
ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టుల రూపకల్పనపై త్వరలోనే సైన్స్ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి నేందుకు ఇన్స్పైర్ మనక్ పోటీలు ఒక చక్కటి అవకాశం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఆ బాధ్యత సైన్స్ ఉపాధ్యాయులదే.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు ప్రాజెక్టులు తయారు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
సున్నాయే మిన్న
కొత్తపేట: ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రతి డ్రైవర్ లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ ఏటా జూలై 25 నుంచి 31వ తేదీ వరకూ ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని రావులపాలెం, అమలాపురం, రాజోలు ఆర్టీసీ డిపోల అధికారులు శనివారం నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల డ్రైవర్లు, గతంలో ప్రమాదాలు చేసిన వారు, ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు గ్యారేజీల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రమాద నివారణ చర్యలు తెలియజేస్తూ, డిపో పరిధిలో గతంలో ప్రమాదాలు జరిగిన స్థలాలకు తీసుకువెళ్లి స్వయంగా చూపించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. జీరో యాక్సిడెంట్లే లక్ష్యమంటూ డ్రైవర్లు, కండక్టర్లకు భద్రతా కార్డులు ఇస్తున్నారు. డ్రైవర్లకు జాగ్రత్తలు ఫ బస్సు బయలుదేరడానికి 20 నిమిషాల ముందు వచ్చి గ్యారేజీలో బస్సు కండిషన్ సరిచూసుకోవాలి. బ్రేకులు, స్టీరింగ్, లైట్లు, టైర్లు తదితర సాంకేతిక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. బస్సు నడిపే రూటుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫ బస్టాండు లోపలకు వెళ్లే, బయటకు వచ్చే ప్రాంతాలు, గ్రామ/పట్టణ కూడళ్లు, స్కూల్, ఆఫీస్ జోన్ల వద్ద పాదచారులు, ద్విచక్ర వాహనాల కదలికలను గమనిస్తూ బస్సును నెమ్మదిగా నడపాలి. ఫ బస్సు నడిపే ముందు బ్లైండ్ స్పాట్లలో పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనించాలి. ఫ ఆరు లేదా నాలుగు వరుసల జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఎడమ లేన్లోనే బస్సు నడపాలి. మలుపుల వద్ద తప్పనిసరిగా ఇండికేటర్లు వాడాలి. ఫ సెల్ఫోన్ డ్రైవింగ్ వద్దు. ఫ ప్రయాణికులు, సిబ్బంది బోనెట్పై కూర్చోవడానికి అనుమతించరాదు. వారితో మాట్లాడుతూ బస్సు నడపరాదు. ఫ బస్సు రివర్స్ చేసేటప్పుడు కండక్టర్ లేదా బస్సు స్టేషన్ సిబ్బంది సహాయం పొందాలి. ఫ స్టేజీలో ప్రయాణికులు దిగి, ఎక్కిన తరువాత కండక్టర్ సూచనల మేరకు మాత్రమే బస్సును కదల్చాలి. ఫ ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించేటప్పుడు ఎదురుగా లేదా వెనుక వస్తున్న వాహనాలను కూడా గమనించి, సరైన సిగ్నల్ ఇవ్వాలి. ఫ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఫ అతి వేగం, అసహనంతో నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం తాగి బస్సు నడపడం వంటివి మానాలి. ఫ డ్రైవింగ్ సమయంలో అలసటగా అనిపిస్తే వెంటనే బస్సు ఆపి, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఫ తడి రోడ్లపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఫ ఘాట్ రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించాలి.ఫ ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు ఫ సురక్షిత డ్రైవింగ్పై డ్రైవర్లకు శిక్షణ -
మడ అడవుల సంరక్షణ అందరి బాధ్యత
తాళ్లరేవు: దేశంలోనే రెండో అతి పెద్ద మడ అటవీ ప్రాంతం కోరింగా అభయారణ్యం, మడ అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అన్నారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా కోరింగా అభయారణ్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ టి.జ్యోతి మాట్లాడుతూ, కోరింగా ప్రాంతంలో విస్తారంగా ఉన్న మడ అడవులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యాన ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఉద్యమాలకు పెద్ద దిక్కు ముద్రగడ
అమలాపురం టౌన్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాలకు పెద్ద దిక్కు అని వివిధ రాజకీయ పార్టీల నేతలు కొనియాడారు. ఆయన మరణంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఉద్యమాల పరంగా ఓ పెద్ద దిక్కును కోల్పో యినట్లయ్యిందని అన్నారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆధ్వర్యాన అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఆదివారం దివంగత ముద్రగడ పద్మనా భం జిల్లా స్థాయి సంతాప సభ నిర్వహించారు. సమి తి రాష్ట్ర నాయకుడు నల్లా పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నేతలు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ, ముక్కుసూటితనం ఉన్న ముద్రగడను కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, ముద్రగడ మరణంతో ఉద్యమాల ఊపిరి ఆగిందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ, తన తండ్రి దివంగత బాలయోగి, ముద్రగడ ఒకేసారి ఎంపీలుగా పని చేశారని చెప్పారు. ముద్రగడతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పాముల రాజేశ్వరీదేవి కన్నీరు పెట్టుకున్నారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అముడా) చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా అధికార ప్రతినిఽధి సూదా గణపతి, మాజీ కౌన్సిలర్ చిట్టూరి పెదబాబు, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, అడబాల సత్యనారాయణ, టీడీపీ, జనసేన నాయకులు మెట్ల రమణబాబు, నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను తదితరులు కూడా ప్రసంగించారు. ఫ ఘనంగా నివాళులర్పించిన అఖిలపక్ష నేతలు ఫ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన సంతాప సభ -
బాల శాస్త్రవేత్తలకు ఆహ్వానం
రాయవరం: విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు సరికొత్త వేదిక సిద్ధమైంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2026కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 10–17 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలను వెలికి తీసేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదిక కానుంది. ఈ ఏడాది ‘సుస్థిరత కోసం సైన్న్స్, ఆవిష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంతో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ గైడ్ టీచర్ల సాయంతో ఈనెల 31లోగా పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇలా.. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అధికారిక పోర్టల్ ఎస్సీఎస్సీ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి పేరు, వయసు, ఈ మెయిల్ ఐడీ, ఫొటోగ్రాఫ్తో పాటు ప్రాజెక్ట్ శీర్షిక అవసరం. ఈ మెయిల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసి వివరాలు పరిశీలించి ఓకే చేయాలి. ఈ నెల 1 నుంచి దేశ వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఒంటరిగా గానీ లేదా ఇద్దరు కలిసి ఒక టీమ్ గానీ ప్రాజెక్టు సిద్ధం చేయవచ్చు. విద్యార్థులు తయారు చేసిన నివేదికను తెలుగు లేదా ఇంగ్లిష్ భాషలో సమర్పించవచ్చు. ఐదు ఉప అంశాలు ప్రతి పాఠశాల 5 ముఖ్యమైన ఉప అంశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్ట్నైనా తప్పనిసరిగా సమర్పించాలి. ● వ్యర్థాల నిర్వహణ కోసం ఆర్–5 సూత్రం: (రెడ్యూస్, రీయూజ్, రీట్రైవ్, రీడిజైన్, రీసైకిల్) ● ఇంధనం/శక్తి(ఎనర్జీ)కోసం ఈ–4 సూత్రం (ఎక్స్ప్లోర్, ఎక్స్పరిమెంట్, ఎన్హేన్స్, ఎవాల్వ్) ● జల సంరక్షణలో భాగంగా నీరు (హార్వెస్టింగ్, రీసైక్లింగ్, కన్జర్వేషన్) ● ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆరోగ్యకర ఆచరణలు అనే అంశాలు ఉంటాయి. ● అప్లికేషన్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ సస్టైనబిలిటీపోటీలు ఎప్పుడంటే? జిల్లా స్థాయిలో పోటీలు అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలలో, జాతీయ స్థాయి పోటీలు వచ్చే ఏడాది జనవరి తర్వాత నిర్వహిస్తారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. జిల్లా నుంచి అధిక శాతం మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
మమ అనిపింఛెన్..
రాజమహేంద్రవరం సిటీ: దశాబ్దాల తరబడి జీవితాన్ని విధులకు అర్పించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వృద్ధాప్య జీవితం అగమ్యగోచరంగా తయారైందని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో 34–38 ఏళ్ల పాటు తమ ఉద్యోగ జీవితంలో అహర్నిశలు శ్రమించి పని చేసిన తమకు మందుల కొనుగోలుకు సైతం సరిపోని పెన్షన్ ఇస్తున్నారని దీని వలన జీవితం దుర్భరంగా మారిందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. 2014కు పూర్వం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఈపీఎఫ్ఓ ద్వారా రూ.వెయ్యి పెన్షన్ వచ్చేది. 2014 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.వెయ్యి నుంచి మూడు వేలు పెన్షన్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ విధమైన పెన్షన్తో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక పింఛన్కు అనర్హులే.. తాము ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులుగా చేయడం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ సైతం పొందేందుకు అనర్హులమయ్యామని వారు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వృద్ధాప్యంలో జీవితాన్ని కొనసాగించాలంటేనే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదుట ఎన్నిసార్లు నిరసనలు చేపట్టినా ఏ విధమైన చర్యలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి మినిమం పెన్షన్ రూ.9000 పెంచడంతో పాటు, రెండు డీఏలు ప్రకటించి రిటైర్డ్ ఉద్యోగి కుటుంబానికి వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. జిల్లా పింఛన్దారులు కాకినాడ 615 తూర్పుగోదావరి 365 డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 380 మొత్తం 1360 ప్రభుత్వ పింఛన్ కన్నా తక్కువ పింఛన్ సంస్థ, ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు నిరాదరణ రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది పింఛన్దారులు -
పందిరి సాగు.. లాభాలు బాగు
● లంక భూముల్లో ఎంతో అనుకూలం ● విత్తనశుద్ధి, జాగ్రత్తలు తప్పనిసరి ● విత్తన కొనుగోలుకు హెక్టార్కు రూ.మూడు వేల సాయం ఆలమూరు: వర్షాకాలం ప్రారంభమైనందున లంక భూముల్లో పందిరిపై సాగు చేసే కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడంతో పాటు నీటిని నిలుపుకొనే లంక మట్టి నేలలు ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అసలు ఈ సమయంలో ఏయే పంటలు సాగు చేయవచ్చు, విత్తనాలు కొనుగోలు, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కొత్తపేట డివిజన్ ఉద్యాన శాఖాధికారి జి.కోటేశ్వరరావు వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ పందిరి కూరగాయలైన బీర, ఆనప, కాకర, పొట్ల, గుమ్మడి, బూడిద గుమ్మడితో పాటు వంగ, బెండ, టమాటా తదితర రకాలను సాగు చేసి అధిక దిగుబడులను సాధించవచ్చు. అన్ని సీజన్లలో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే దొండ సాగును ఏడాది పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆనప, బీర, పొట్ల, కాకర పంటను పందిరిపై పెంచితే మంచి నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 25 వేల ఎకరాల్లోనే సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3.75 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా కేవలం 25 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యానశాఖ గతంలో రాయితీపై విత్తనాలను పంపిణీ చేయడగా ప్రస్తుతం ఆ పథకం నిలిచిపోయింది. విత్తనాల కొనుగోలు కోసం ఉద్యానశాఖ కేవలం హెక్టార్కు రూ.మూడు వేలు మాత్రమే ఆర్థికసాయం అందిస్తుంది. వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్ నారును ఉద్యానశాఖ సూచనలకు అనుగుణంగా రైతులే తయారు చేసుకుంటే పెట్టుబడి ఆదా అవుతుంది. కూరగాయలు సాగు చేసే రైతులు తమ భూమి పాస్బుక్, ఆధార్కార్డు, విత్తనాల బిల్లును ఉద్యానశాఖకు అంందజేస్తేనే ఈ రాయితీ అందుతుంది. విత్తే ముందు ఇలా.. కూరగాయల సాగుకు తొలుత విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి మూడు గ్రాముల ధైరమ్, ఐదు గ్రాముల ఇమిడా క్రోఫిన్ మందును ఒక దాని తరువాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేస్తే కూరగాయ మొక్కలు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. విత్తే ముందు ఎకరానికి ఆరుటన్నుల పశువుల ఎరువు, 35 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ మిశ్రమాన్ని విత్తన గుంటల్లో వేయాలి. విత్తిన 25–30 రోజుల్లో లేదా పిందె దశలో సుమారు 30 కిలోల నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి మొక్కలకు అందించాలి. కూరగాయల సాగు వేయాలని నిశ్చయించుకుంటే వేసవిలోనే దుక్కి దున్ని ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయ తోటలకు ఈ సీజన్లో పెంకు పురుగు, బూడిద తెగుళ్లు సోకే అవకాశం ఉంది. నులిపురుగు కూడా పంటను దెబ్బతీసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. -
నీవెంటే.. నేనంటూ..
మలికిపురం: కొంగుముడులు వేసుకుని.. కొత్త జీవితం ప్రారంభించిన వేళ.. చేసిన ప్రమాణాలను ఆ దంపతులు కడవరకూ గుర్తు పెట్టుకునే పయనించారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడంతో మొదలైన వారి జీవిత ప్రయాణం.. చివరి అడుగు వరకూ కలిసే సాగింది. ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తోడుగా నిలిచిన వారు.. వీడని నీడలా.. ఒకరి వెంట మరొకరంటూ కలిసే వెళ్లిపోయారు. భర్త తుదిశ్వాస విడిచిన రెండు రోజుల్లోనే భార్య కూడా మరణించిన సంఘటన మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కానేటి తాతారావు (87), ఝాన్సీలక్ష్మి (74) భార్యాభర్తలు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తాతారావు అండమాన్ – నికోబార్ దీవుల్లో పౌర సరఫరాల శాఖ అధికారిగా పని చేసి రిటైరయ్యారు. సుమారు 20 ఏళ్ల కిందట సొంతూరికి వచ్చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు డాక్టర్ రామ్మోహన్ హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్నారు. కుమార్తె శైలజ, చిన్న కుమారుడు రవికుమార్ అండమాన్లోనే ఉంటున్నారు. తాతారావుకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగుండటం లేదు. దీంతో, ఆయనను చూసేందుకు పెద్ద కుమారుడు డాక్టర్ రామ్మోహన్ దంపతులు, కుమార్తె శైలజ దంపతులు ఇటీవల విశ్వేశ్వరాయపురం వచ్చారు. వారి సమక్షంలోనే తాతారావు ఈ నెల 24న గుండెపోటుతో మృతి చెందారు. అండమాన్లో ఉన్న చిన్న కుమారుడు రవికుమార్ రాక కోసం తాతారావు మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉంచారు. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే ఉదయం 10.30 గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో తాతారావు భార్య ఝాన్సీలక్ష్మి ప్రాణాలు విడిచిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా జీవన సహచరుడిగా ఉన్న భర్త మరణాన్ని భరించలేక ఆమె కూడా చనిపోవడంతో అందరూ పెద్ద పెట్టున విలపించారు. కుటుంబ సభ్యు లు గుండె దిటవు చేసుకుని, దంపతులిద్దరి అంత్యక్రియలనూ కన్నీటి వేదన నడుమ ఒకేసారి నిర్వహించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే.. అందునా భర్త మృతదేహం ఉండగానే భార్య మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఫ 24న గుండెపోటుతో భర్త మృతి ఫ ఆయన వెనుకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన భార్య ఫ విశ్వేశ్వరాయపురంలో విషాదం -
పశుగ్రాసంపై ఎల్నినో ఎఫెక్ట్
ఐ.పోలవరం: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించినంత మేర కురవకపోవడంతో జిల్లాలో ఈ ఏడాది పశుగ్రాసానికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పశుగ్రాసాన్ని నిల్వ చేసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పాడి రైతులకు సూచిస్తున్నారు. ఆ సూచనలివీ.. ఫ కరవు పరిస్థితులను తట్టుకునే జొన్న, సజ్జ, మొక్కజొన్న, స్టైలో, హెడ్జ్ లూసెర్న, గినియా గడ్డి వంటి పశుగ్రాస పంటలు సాగు చేయాలి. ఇవి తక్కువ నీటితో పెరుగుతాయి. నీటి వసతి ఉన్న రైతులు సీఓ–4, సీఓ–5 హైబ్రిడ్ నేపియర్, గినియా గడ్డి, పారా గడ్డి సాగు చేస్తే ఏడాది పొడవునా పచ్చి మేత అందుబాటులో ఉంటుంది. బహు సంవత్సరాల రకాలను పెంచడం వల్ల ప్రతి 45 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. ఫ వరి కోత తర్వాత మిగిలే గడ్డిని వృథా చేయకుండా యూరియా, ఖనిజ మిశ్రమంతో శుద్ధి చేసి, పశువుల మేతగా ఉపయోగించాలి. దీనివలన గడ్డి పోషక విలువ 30 శాతం వరకూ పెరుగుతుంది. అలాగే, మొక్కజొన్న కాండాలు, వేరుశనగ తొక్కు వంటి పంట అవశేషాలను కూడా దాణాగా మార్చుకోవచ్చు. ఫ గ్రామాల్లోని సామూహిక మేత భూములను సంరక్షించి, వర్షాలు కురిసిన వెంటనే గడ్డి విత్తనాలు జల్లి పునరుద్ధరించుకోవాలి. నియంత్రిత మేత విధానం పాటించడం ద్వారా గడ్డి తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. పొలాల గట్లపై సుబాబుల్, అగస్త్య, గ్లిరిసిడియా, మునగ వంటి పశుగ్రాస చెట్లను నాటితే ఆకు మేతతో పాటు నీడ కూడా లభిస్తుంది. లంక గ్రామాల వాసులు ఏటిగట్ల మీద కూడా పశువుల మేత పెంచుకునే అవకాశముంది. ఫ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అజోల్లా, హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిమేత ఉత్పత్తిని ప్రోత్సహించాలి. 20 చదరపు అడుగుల స్థలంలో అజోల్లా పెంచితే రోజుకు 2 కిలోల వరకూ మేత వస్తుంది. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాల దిగుబడి పెరుగుతుంది. హైడ్రోపోనిక్ పద్ధతిలో 7 రోజుల్లోనే మొక్కజొన్న, జొన్న గింజల నుంచి పచ్చి మేత తయారు చేయవచ్చు. ఫ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు భూమిని లీజుకు తీసుకుని గ్రామ స్థాయిలో పచ్చి పశుగ్రాసం సాగు చేసి, సభ్యులైన రైతులకు తక్కువ ధరకే నిరంతరం సరఫరా చేయాలి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఫ పశుగ్రాసం కొరత ఉన్న సమయంలో అధిక ఉత్పాదకత కలిగిన పశువులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరానికి మించి పశువులను పెంచవద్దు. కరవును బాగా తట్టుకునే గొర్రెలు, మేకలు, దేశీ పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. పంటలు దెబ్బ తిన్నా ఇవి రైతులకు స్థిరమైన ఆదాయాన్నిస్తాయి. వేసవి తీవ్రత, వర్షాభావం వల్ల పశువులకు వేడి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటికి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పశువుల కొట్టాల్లో గాలి వెలుతురు, నీడ ఉండేలా చూసుకోవాలి. ఫ కరవు పరిస్థితులను తట్టుకునే రకాలు సాగు చేయాలి ఫ పంట అవశేషాలను వినియోగించుకోవాలి ఫ మేత భూములను పునరుద్ధరించుకోవాలి ఫ రైతులకు పశు సంవర్ధక శాఖ సూచన దాణా అందుబాటులో ఉంది పశువుల దాణా 50 కేజీల బస్తా రూ.1,020కే అందుబాటులో ఉంది. రైతులు పశుగ్రాస భద్రత కల్పించుకోవాలి. – డాక్టర్ ప్రవీణ్, పశు వైద్యాధికారి, ఎదుర్లంక, ఐ.పోలవరం మండలం -
బతుకు దుర్భరంగా ఉంది
నా వయస్సు 83 సంవత్సరాలు. 38 ఏళ్ల పాటు సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (ఎస్టీఐ) ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. నెలకు నాకు రూ.600 పెన్షన్ వస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగ విరమణ తరువాత జీవితం దుర్భరంగా మారింది. – కస్తూరి రామచంద్రరావు, రిటైర్డ్ ఉద్యోగి వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు నా వయస్సు 71 సంవత్స రాలు. ఆర్టీసీలో 36 ఏళ్ల పాటు గ్రేడ్–3 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైరయ్యాను. ప్రతి నెల నాకు ఈపీఎఫ్ఓ ద్వారా రూ.2475 మాత్రమే అందుతుంది. వైద్య ఖర్చులకు ఏ మాత్రం సరిపోని దుస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీస పింఛన్ రూ.9 వేలకు పెంచి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలి. – ఓఆర్ బాబు, రిటైర్డ్ ఉద్యోగి, రాజమహేంద్రవరం జీవితం దయనీయం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జీవితం దయనీయంగా ఉంది. నిత్యావసరాల కొనుగోలు మాట అటుంచితే ఆరోగ్యం కోసం మందులు కొనుగోలుకు సైతం ఉపయోగం లేని పెన్షన్ ఇస్తున్నారు. తక్కువ పెన్షన్ అందుతున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ మంజూరయ్యే విధంగా వెసులుబాటు కల్పించాలి. – యర్రంశెట్టి కొండలరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు● -
ఆర్డీఓగా ధర్మరాజు నియామక ఉత్తర్వుల నిలిపివేత
అమలాపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న ఇ.ధర్మరాజును అమలాపురం ఆర్డీఓగా నియమిస్తూ ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఆయన బదిలీని నిలుపు చేస్తున్నట్లు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.సాయిప్రసాద్ తెలిపారు. దీంతో, ధర్మరాజు ప్రస్తుత పోస్టులోనే కొనసాగనున్నారు.ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం అమలాపురం రూరల్: ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ వై.నైదియాదేవి అన్నారు. ప్రజాబంధువు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జేసీ ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఏఐసీసీ సభ్యుడిగా, హ్యాండ్లూమ్స్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కోటయ్య ఎంతో సేవ చేశారని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార ఉద్యమ బలోపేతానికి జీవితాంతం కృషి చేశారని చెప్పారు. చేనేత రంగంలో పని చేసిన వాసా సుబ్బారావు, మేరేటి సుబ్రహ్మణ్యం కాశిన బసవరాజు (బండారులంక), వరదా వీరన్న (మాగం), ఇమ్మంది సత్యనారాయణ(మూలపొలం)లను చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు పప్పుల శ్రీనివాసరావు ఆధ్వర్యాన సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు 30న సప్తకళా వేడుకలు ఐ.పోలవరం: పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్ (పీటీఎం), ప్రజ్ఞా సాహితి సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 30న ఐ.పోలవరంలో సప్తకళా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన రావి బేబీ సత్యవాణి కూచిపూడి నృత్య ప్రదర్శన, రంగస్థల నటి మహంతి రమణ బృందంతో తారామణి నాటక ప్రదర్శన, ప్రముఖ మెజీషియన్ వి.శ్రీరామారావు మ్యాజిక్ షో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇంకా శాస్త్ర దిగ్గజాలు అనే అంశంపై వక్తృత్వం, పాటల పరిమళాలు, కవితా లహరి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్య అతిథిగా పరిపాలనాధికారి బీహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, విశిష్ట అతిథిగా ఎంఈఓ ఎన్.ప్రసాద్ కుమార్ పాల్గొంటారన్నారు. కార్యక్రమాల బ్రోచర్ను నిర్వాహకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రేవు యజ్ఞశ్రీ, ప్రత్తి సత్తిబాబు, ఎ.వెంకట నారాయణ, వి.లక్ష్మీనారాయణ, పల్లెపు వెంకటేశ్వరరావు, ఎస్.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న వ్యాన్
అమలాపురం రూరల్: ఈదరపల్లి నుంచి ముక్కామల వైపు వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలగుమ్మి సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ వ్యాన్ను ఎదురుగా ఈదరపల్లి వైపు వస్తున్న వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న నలుగురికి గాయాలు కాగా అమలాపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ఘటనపై ఏ విధమైన ఫిర్యాదు అందలేదని తాలూకా ఎస్సై తెలిపారు. పల్లెవెలుగు బస్సును.. దేవరపల్లి: రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వెళుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు అల్ట్రా బస్సును దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద మహారాష్ట్ర నుంచి చాగల్లుకు కోళ్లమేత తీసుకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం–దేవరపల్లి పాత జాతీయ రహదారిలో 40 మంది ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వెళుతున్న పల్లెవెలుగు బస్సును ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో జంగారెడ్డిగూడేనికి చెందిన కుక్కల పద్మకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. క్వారీలు, క్రషర్ల నుంచి మెటల్ లారీలు ఎక్కువ సంఖ్యలో తిరగడం, ఆదివారం ఉదయం వర్షం కురవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోయారు. వేగంగా దూసుకొచ్చి.. గంగవరం: ఓ కారు వేగంగా దుకాణాల వైపు దూసుకువచ్చి.. పక్కనే బైక్తో ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టిన ఘటన గంగవరం పాతవీధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దుకాణాలపైకి కారు దూసుకురావడంతో దుకాణాలకు ఉన్న గోడలు, గేట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న చోడి చిన్నబ్బాయిదొర, రామన్నదొరలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో గోకవరం తరలించి, అక్కడ నుంచి 108లో రాజమహేంద్రవరానికి తరలించారు. రాజవరం గ్రామానికి చెందిన చోడి చిన్నబ్బాయిదొరకు తలకు, కాళ్లకు తీవ్ర గాయం కాగా, గంగవరం గ్రామానికి చెందిన మడకం రామన్నదొరకు రెండు కాళ్లకు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నబ్బాయిదొర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం: ముద్రగడ గిరిబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం మరణం మా కుటుంబానికి తీరని లోటు’’ అని ఆయన కుమారుడు గిరిబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా తండ్రికి నివాళులర్పించిన అందరికీ మా కృతజ్ఞతలు. నా తండ్రిని బతికించేందుకు వైఎస్ జగన్ చాలా ప్రయత్నం చేశారు. ముద్రగడ ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు. ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు’’ అని గిరిబాబు తెలిపారు.నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం. ఇది రాజకీయ లబ్ధికాదు. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం. వైఎస్ జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది. ముద్రగడ చెప్పినట్టే నడుచుకున్నాం. మా సోదరి క్రాంతిని రానివ్వద్దని ముద్రగడ మాకు చెప్పారు. కానీ పోలీసులు బలవంతంగా క్రాంతిని తీసుకొచ్చారు. మేం క్రాంతిని తీసుకురావద్దని చెప్పినా పోలీసులు వినలేదు’’ అని ముద్రగడ గిరిబాబు చెప్పారు.అంబటి రాంబాబుపై కేసు పెట్టడం సరికాదు. అంత్యక్రియలకు అధికార లాంఛనాలు వద్దని మేమే చెప్పాం. మా తండ్రి అంత్యక్రియలు ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు. నా సోదరి క్రాంతిని అడ్డుపెట్టుకుని జనసేన రాజకీయం చేస్తోంది. నా సోదరి క్రాంతి చేసింది మహాపాపం’’ అని గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరమ్మతులకు ‘గుడిమెళ్లంక’ మోటార్లు
మలికిపురం: గుడిమెళ్లంక సమగ్ర మంచినీటి సరఫరా పథకం పనులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన సాక్షిలో ‘కష్టాల కన్నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ పథకంలో పాడైన మోటార్లను గుజరాత్కు మరమ్మతుల నిమిత్తం పంపారు. గత 15 రోజులుగా ఇక్కడి 38 గ్రామాలకు తాగునీరు అందని విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ నివారం ఎస్పీ రాహుల్ మీనాతో కలసి పథకం పనులను పరిశీలించి, తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గుడిమెళ్లంక సీపీడబ్ల్యూ పథకం ద్వారా 4 మండలాలకు సంబంధించి 29 గ్రామ పంచాయతీల పరిధిలోని 97 ఆవాసాలకు, వాటిలోని సుమారు 1,18,983 మంది ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్టేక్ వెల్ వద్ద ఏర్పాటు చేసిన 50 హెచ్పీ మోటార్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే 70 హెచ్పీ సామర్థ్యం గల రెండు మోటార్లు కాలిపోవడంతో ముడి నీటిని సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పంపించడంలో అంతరాయం ఏర్పడిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇప్పటికే ఒక మోటారును రీవైండింగ్ చేసి తిరిగి అమర్చగా, మరో మోటారును ఈ నెల 27వ తేదీలోగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే, గుడిమెళ్లంకలో నిర్మాణంలో ఉన్న 6.00 ఎంఎల్డీ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ పనులను కలెక్టర్ పరిశీలించి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని ఎల్–నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ఏవీఎస్ రాజన్, సంబంధిత ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటి ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ -
5న దేవరపల్లికి వైఎస్ జగన్
దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తారని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత శనివారం తెలిపారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. యువత సమస్యలపై 28న వైఎస్సార్ సీపీ నిరసనరామచంద్రపురం రూరల్: ఈ నెల 28న వైఎస్సార్ సీపీ యువజన–విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న నిరసన ర్యాలీ పోస్టర్ను మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆవిష్కరించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఈ మేరకు సూర్యప్రకాశ్ మాట్లాడుతూ దేశంలో నీట్ ప్రశ్నా పత్రాల అక్రమాలు, రాష్ట్రంలో ఫీజు రీయింబర్సుమెంటు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన బకాయిలు, విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అమలాపురం నల్లవంతెన వద్ద వంటెద్దు వెంకయ్యనాయుడు కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్డిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లాలోని 7 నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇన్చార్జి నియామకంలో జాప్యం ఎందుకు?అధిష్టానం తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం పి.గన్నవరం: నియోజకవర్గ టీడీపీకి ఇన్చార్జిని నియమించకపోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈనెల 27 నుంచి చేట్టాల్సిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సన్నాహక సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో జరుగుతుండగా కొందరు కార్యకర్తలు లేచి ఇన్చార్జిని నియమించకుండా ఎన్నాళ్లు జాప్యం చేస్తారని నాయకులను నిలదీశారు. ఇన్చార్జి లేకుండా తాము కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావాలని వారు ప్రశ్నించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తుల సాయి, గంధం పల్లంరాజు శ్రేణులను వారించి సమస్యను అధిష్టానానికి వివరిస్తామని సముదాయించారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో కరప: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరప గ్రామంలోని అగ్నికుల క్షత్రియుల వీధికి చెందిన వాడ్రేవు నూకరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని శనివారం కాకినాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. కరప పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చే సరికి రామచంద్రపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జవ్వగా, డ్రైవర్ సీటులో నూకరాజు ఇరుక్కుపోయాడు. స్థానికులు స్పందించి రక్త గాయాలతో ఉన్న నూకరాజును ఆటో నుంచి బయటకు తీసి, 108లో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చని సీమకు..!
రెక్కలు కట్టుకుని● వైనతేయ దీవుల్లో సైబీరియన్ పక్షుల స్థిర నివాసం ● ఐదేళ్లలో లక్షలకు చేరిన పక్షులు ● అటవీ శాఖకు సైతం చిక్కని ప్రదేశం మలికిపురం: ఆసియాలోనే అతి పెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం కొల్లేరు కొంప మునిగినట్టేనా.. వేసవి విడిదికి అక్కడికి వచ్చే విదేశీ జాతి పక్షులు మరో దారి వెతుక్కున్నాయా.. అంటే అవుననక తప్పదు. ఆక్వా చెరువులు, పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న కొల్లేరులో ఉండలేక సైబీరియన్ జాతి పక్షులు కోనసీమ జిల్లా వైనతేయ నదీ ద్వీపాలను ఆవాసయోగ్య ప్రాంతాలుగా ఎంచుకున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ లెక్కల్లో లేని పక్షుల అడవి ఇది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని పక్షుల ఆవాస ప్రాంతం ఇది. బయటి ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ ఇన్ని పక్షులు ఉన్నాయనే విషయం నిత్యం చేపల వేట సాగించే మత్స్యకారులకు కూడా తెలియదు. అదే వైనతేయ నదీ తీరంలోని గోగన్నమఠం, కరవాక మధ్య వైనతేయ లంకలు. ఇక్కడ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడ మడ అడవులను సైతం ఆక్రమించి రొయ్యల చెరువుల సాగు జరిగింది. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ చెరువుల సాగు నిలిచిపోయి మడ అడవులు మళ్లీ విస్తారమై యథాతథ స్థితికి రావడంతో విదేశీ పక్షులకు ఆవాసయోగ్యంగా మారింది. వలస పక్షుల శాశ్వత నివాసం ప్రస్తుతం వైనతేయ లంకలు సైబీరియా వలస పక్షుల శాశ్వత నివాసంగా మారాయి. స్థానికంగా పెద్ద బాతు అని పిలిచే ఈ పక్షులు ఇక్కడ లక్షల్లో ఉన్నాయి. ఈ పక్షి శాసీ్త్రయ నామం గద్వాల్ మారెకా స్ట్రేపెరా. ఐదేళ్ల క్రితం అరకొరగా కనిపించే ఈ పక్షులు నేడు లక్షల్లో కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యమే. కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్ర అధికారుల సమాచారం ప్రకారం ఈ పెద్ద బాతు కొల్లేరులో లేదు. జూలై నెల ప్రాంతాల్లో వచ్చే వర్షాల సమయంలో చల్లని వాతావరణం కోసం ఈ పక్షులు సైబీరియా నుంచి ఇక్కడకు వస్తాయి. తిరిగి ఫిబ్రవరిలో ఎండల ధాటికి తట్టుకోలేక మళ్లీ సైబీరియా వెళ్లిపోతాయి. అయితే ఐదేళ్లుగా అవి ఇక్కడే ఉండిపోవడం గమనార్హం. సాధారణ బాతుల కంటే భిన్నంగా.. ఈ పెద్ద బాతులు స్థానికంగా పెంచుకునే బాతుల కన్నా భిన్నంగా ఉంటాయి. పోలిక సుమారు ఒకేలా ఉన్నా జీవన శైలి మాత్రం పూర్తి విభిన్నం. సాధారణ బాతు నీళ్లలో నెమ్మదిగా ఈదుతుంది. ఆపద వస్తే ఎగరలేదు. ఈ సైబీరియన్ బాతు మాత్రం నీటిలో ఎక్కువసేపు మునిగి ఉండగలదు.. వేగంగా ఈదగలదు.. ఆహారం కోసం వేటాడగలదు. అంతే కాదు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ పక్షులు నాలుగు నుంచి రెండు వందలకు పైగా కలిసి గుంపులుగా వెళ్తుంటాయి. ఒక నెలలో పది వరకూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఓ మాదిరిగా ఎగిరే వయసు వచ్చిన పిల్లలను దగ్గరలో వేటకు తీసుకువెళ్లడం, ఆపదలో సైతం వాటిని వదలకుండా అత్యంత వేగంగా కదులుతూ రక్షించుకుంటుంది. గోదారి నీరు పడినట్టుంది! గోదావరి జిల్లాల నుంచి అనేక మంది కవులు, నటులు తమ యాస, భాష, వ్యంగ్యంతో రాణించారు. కాస్త బాగున్నాడు అంటే గోదారి నీళ్లు పడ్డాయిరా వీడికి అని పూర్వీకులు అంటారు. అలా ఈ సైబీరియన్ పక్షులకు సైతం ఈ గోదావరి నీళ్లు పడినట్టున్నాయి. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. ఆహారం కోసం నిత్యం వంద కిలోమీటర్ల పయనంనిత్యం ఉదయం ఐదు గంటలకు ఇక్కడి పక్షులన్నీ ఒకేసారి గాల్లోకి లేచి సుమారు వంద కిలోమీటర్లు పైబడి పయనించి గోదావరి చప్పనీరున్న చోట మాత్రమే వాలి చేపలు, ఇతర జీవులను తీసుకుని మళ్లీ సాయంత్రానికి ఇక్కడి గూళ్లకు చేరుకుంటాయి. వాటిని చూడాలన్నా.. వాటి కిలకిలరవాలను విని ఆస్వాదించాలన్నా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బోట్లలో ఆయా లంకల వద్దకు వెళ్లాల్సిందే. వైనతేయ నది బంగాళాఖాతంలో కలిసే ముందు శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ సంగమ ప్రాంతంలో ఈ లంకలు ఉన్నాయి. ఐదేళ్లలో లక్షలకు చేరాయి గత ఐదేళ్లలో ఈ పక్షులు లక్షలకు పైబడి చేరాయి. నదిలో దీవుల మధ్య మడ అడవుల్లో వీటి శాశ్వత నివాసాలు ఉన్నాయి. ఉదయమే మేము బోట్లపై చేపల వేటకు వెళ్లేటప్పుడు ఇవన్నీ ఒకేసారి లేచి వేటకు వెళ్లి మళ్లీ సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. ఈ పక్షులను అటవీ శాఖ గుర్తించి సంరక్షించాలి. – అర్ధాని శ్రీను, గోగన్నమఠం -
విలువలు కలిగిన నేత ముద్రగడ
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● రావులపాలెంలో వైఎస్సార్ సీపీ నేతల సంతాపంరావులపాలెం: కులమతాలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయం చేసిన నాయకుడు మాజీ మంత్రి, స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తదితర నేతలు గుర్తు చేసుకున్నారు. స్థానిక కాస్మోపాలిటిన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ)లో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను శనివారం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, పీఏసీ సభ్యుడు తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన పోరాటాలు, అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ముద్రగడ మృతికి వారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకుడు కర్రి నాగిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్, రాష్ట్ర కార్యదర్శులు గొల్లపల్లి డేవిడ్ రాజు, గంధం రవికుమార్, జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బోణం సాయిబాబా, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, మండల కన్వీనర్లు తమ్మన, శ్రీను, బొక్కా కరుణాకరం, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, బొక్కా వెంకటలక్ష్మి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు రాజా, సీనియర్ నాయకుడు కామిశెట్టి అమ్మన్న, చల్లా ప్రభాకరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు షేక్ వల్లీబాబా, గొలకోటి సూర్యప్రకాష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఈద రవిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు పాల్గొన్నారు. -
అంతర్వేదికి పోటెత్తిన భక్తులు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో రద్దీగా మారింది. వేకువ జాము నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలో నిత్యం నిర్వహించే స్వామివారి అభిషేకం, సుదర్శన హోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షించారు. కాగా ఎండోమెంట్స్ కమిషనర్ ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులు, సస్యానుకూల వర్షాలు కురవాలని వరుణ సూక్త పారాయణం చేశారు. ఆలయ ఈవో ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి రద్దీకి తగ్గట్టుగా నిత్యాన్నదాన పథకంలో భక్తుల భోజన వసతికి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. -
రత్నగిరిపై బారులు తీరిన భక్తులు
అన్నవరం: తొలి ఏకాదశి పర్వదినం, శనివారం కలిసి రావడంతో అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది వివాహాలు చేసుకున్న దంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో తీవ్ర రద్దీ నెలకొంది. సుమారు 40 వేల మంది భక్తులు విచ్చేశారు. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీతో మధ్యాహ్నం వరకు అంతరాలయ దర్శనం నిలిపివేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మందికి అన్నదానంలో భోజనం సౌకర్యం కల్పించారు. కాగా.. ఆదివారం ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు. తొలి ఏకాదశి పూజలు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ జరిపారు. తొమ్మిది నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందచేసి ప్రసాదాలు నివేదించారు. -
గిడ్డంగుల అభివృద్ధికి చర్యలు
అమలాపురం రూరల్: జిల్లాలో గిడ్డంగుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులకు పంటల బీమా అందేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, క్వాయర్ పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన చాంబర్లో మూడు వేర్వేరు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.గిడ్డంగుల అభివృద్ధికి అమరావతి కేంద్ర గిడ్డంగుల సంస్థ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. వరి, కోకో, కొబ్బరి ఉత్పత్తులకు డిమాండు పెరుగుతోందని, ఆక్వా కల్చర్ రంగానికి ప్రత్యేక నిల్వ సదుపాయాలు అవసరమన్నారు. సురక్షిత నిల్వతో పాటు రుణ సదుపాయం, రవాణా, పురుగుల నివారణ వంటి అదనపు సేవలు అందించాలని సంస్థకు సూచించారు. పంటల బీమా ప్రచారం వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు అధికారులతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమాపై సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను రక్షించడమే లక్ష్యమన్నారు. వరి బీమాకు ఆగస్టు 15, అరటికి జూలై 31 చివరి తేదీలని తెలిపారు. క్వాయర్ పరిశ్రమకు ప్రోత్సాహం ఉద్యాన, బ్యాంకు అధికారులతో క్వాయర్ పరిశ్రమలపై సమీక్షించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా తేనెపీచు ఉత్పత్తులను రోడ్లు, నీటిపారుదల శాఖల్లో వాడాలన్నారు. మార్కెటింగ్, సాంకేతికతపై ప్రత్యేక కమిటీలు, కేంద్ర, రాష్ట్ర సబ్సిడీ పథకాలపై అవగాహన, సూక్ష్మ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణ, ఎగుమతుల ప్రోత్సాహంపై దృష్టి పెట్టాలన్నారు.కలెక్టర్ మహేష్ కుమార్ -
వాడపల్లి.. భక్తజన సంద్రం
ఆత్రేయపురం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి లక్షకు పైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల ప్రదక్షిణలతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఆదాయం భారీగా సమకూరినట్టు ఈఓ, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. కాలి నడకన సైతం భక్తులు భారీగా వచ్చారు. అధిక సంఖ్యలో వాహనాల రాతో ఆలయ కారు పార్కింగ్ వద్ద, కొత్త వంతెన, లొల్ల లాకులు వద్ద ట్రాఫిక్కు పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఏడు శనివారాల వ్రతానికి, ఏకాదశి సందర్భంగా, సాధారణ దర్శనాలకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయం ఆవరణలో వెంకట్ అనే భక్తుడు మైక్లో చేసిన ప్రచారం ఆకట్టుకుంది. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం తదితర కార్యక్రమాలను దర్శించిన భక్తులు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ముదు నూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించిన భక్తులు తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఏడు శనివారాల వ్రత ప్రదక్షిణలు చేసిన భక్తులు -
ఆశలన్నీ జలసమాధి
రామచంద్రపురం రూరల్: కాలువలో స్నానానికి వెళ్లి అన్నాచెల్లెళ్లు (ముగ్గురు) మృత్యువాత పడిన ఘటనతో రామచంద్రపురం మండలం వెలంపాలెంలో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకుంది. కాలువలో స్నానం చేయాలన్న ఆ చిన్నారుల సరదా ముగ్గురు తల్లులకు గర్భశోకం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోతుల మధు సాల్మన్ రాజు, శాంతకుమారి దంపతులకు నలుగురు కుమార్తెలు. ఏడాది క్రితం మధు సాల్మన్ రాజు మృతి చెందడంతో గురువారం హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, రావులపాలెం సమీపంలోని తాతపూడి వద్ద ఉంటున్న నాలుగో కుమార్తె తమ పిల్లలతో సహా వెలంపాలెం గ్రామానికి వచ్చి కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఒకరిని కాపాడబోయి మరొకరుగా.. హైదరాబాద్ చందానగర్లో ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలు శనివారం తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. శుక్రవారం కాకినాడ బీచ్కు, కోరంగి అభయారణ్యానికి వెళదామని అనుకున్నారు. కానీ వెళ్లకపోవడంతో సాయంత్రం పెద్ద కుమార్తె బొక్కే లత కుమారుడు వీరేంద్ర (18) మరో ఆరుగురు చిన్నారులను బైక్పై ఎక్కించుకుని సమీపంలోని వెంకటాయపాలెం కాలువ వద్దకు స్నానానికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మూడో కుమార్తె వేమన మంజుప్రియ కుమార్తె వర్షిత పావని (15) నీటి మునిగి పోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో వీరేంద్ర, రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత కుమారుడు రంజిత్ కుమార్ (15) కూడా నీట మునిగి మృత్యువాత పడ్డారు. వారితో పాటు వెళ్లిన మిగిలిన చిన్నారులు వెంటనే ఇంటిలోని వారికి, స్థానికులకు సమాచారం అందించారు. మృతదేహాల వెలికితీత ఆర్డీఓ సరళావతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, సీఐ ఎం. వెంకట నారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ఫైర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహకారంతో రెస్య్సూ నిర్వహించి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులకు అండగా నిలిచారు. బొక్కే వీరేంద్ర, వేమన వర్షిత పావని, కనికెళ్ల రంజిత్ కుమార్ మృతదేహాలుచిన్నారులను మింగేసిన కాలువరాఖీ కట్టించుకుని వెళతామన్నారుహైదరాబాద్కు శనివారం తిరుగు ప్రయాణం నిమిత్తం టికెట్లు తీసుకున్న నేపథ్యంలో తమ చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని వెళతామని తన అక్కల కుమారులు చెప్పినట్టు కాళిదాసు రాజకుమారి (నాలుగో కుమార్తె) కన్నీటి పర్యంతమైంది. వారందరూ కాలువకు వెళ్లిన తర్వాత తాను తన చిన్న కుమార్తెకు చెవి పోగులు కుట్టించాలని బైక్ తీసుకుని రమ్మని పలుమార్లు ఫోన్ చేశానని తెలిపింది. అయితే ఫోన్ను వారితో పాటు వెళ్లిన తన పెద్ద కుమార్తెకు ఇచ్చేసి వారు స్నానానికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ కాలువలో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి ఫ వీరందరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు ఫ తాతయ్య సంవత్సరీకానికి రాక ఫ తెల్లవారితే హైదరాబాద్కు బయలుదేరేవారే.. ఫ ఇంతలో కాటేసిన మృత్యువు ఫ మూడు కుటుంబాలకు తీరని శోకం పేద కుటుంబాలే.. ఫ పెద్ద కుమార్తె బొక్కే లత, గనిరాజు దంపతులది పసలపూడి. భర్త కర్ణాటకలో వెల్డింగ్ పని నిమిత్తం ఉంటుండగా లత తన తల్లి శాంతకుమారితో కలసి హైదరాబాద్ చందానగర్లో ఇళ్లల్లో పని చేసుకుంటూ కుమారుడు, కుమార్తెతో కలసి జీవిస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడిని పోగొట్టుకుని కన్నీరుమున్నీరు అవుతోంది. ఫ రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత, సత్యనారాయణ దంపతులది అంగర గ్రామం. హైదరాబాద్లో వాచ్మన్గా పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ ప్రమాదంలో పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నారు. ఫ మూడో కుమార్తె వేమన మంజు ప్రియ, భర్త ఆనంద కుమార్లది అంగర సమీపంలోని పడమర ఖండ్రిగ గ్రామం. ఆనంద కుమార్ చనిపోవడంతో మంజు ప్రియ హైదరాబాద్ చందానగర్లో ఇళ్లలో పనిచేసుకుంటూ తన కుమారుడు, కుమార్తెలతో జీవిస్తోంది. ఈ ప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది. -
విద్యా సంస్థల బంద్ విజయవంతం
అమలాపురం టౌన్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో విద్యార్థి సంఘాలు దేశ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ జిల్లాలోనూ విజయవంతమైంది. పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక గడియారం స్తంభం సెంటర్, మద్దాలవారిపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు. నీట్ పరీక్ష వంటి పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. నీట్ పరీక్ష పేపరు లీకేజీని తట్టుకోలేక మృతి చెందిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు కె.శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, వీసీకే పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ, పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లీప్ స్కూల్గా ఐ.పోలవరం జెడ్పీహెచ్ఎస్
ఐ.పోలవరం: లీప్ పాఠశాలగా ఐ.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్తింపు పొందడం అభినందనీయమని ఎమ్మెల్యే, విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష అమలాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ సమస్యలపై 94 అర్జీలు ఐ.పోలవరం: ఒక నెల – ఒక గ్రామం – నాలుగు పర్యటనలు కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 94 అర్జీలను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి స్వీకరించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఆర్డీవో సరళావతి, డీఆర్డీఏ డి.రాంబాబు, డిప్యూటి కలెక్టర్ కె.అచ్యుత కుమారి పాల్గొన్నారు. మట్టి వాహనాల అడ్డగింపు అయినవిల్లి: మండలంలోని మడుపల్లి నుంచి చింతనలంక లాకులు మీదుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 15 రోజులుగా అక్రమార్కులు ఇక్కడ మట్టి తవ్వకాలు చేస్తున్నారని, రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఏటిగట్టు రోడ్డును ధ్వంసం చేయడంతో పాటు మట్టి వాహనాలను అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు ● 241 గ్రాముల బంగారుఆభరణాల స్వాధీనం ● జీఆర్పీ డీఎస్పీ ప్రమోద్ రాజమహేంద్రవరం సిటీ: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 241 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు స్థానిక జీఆర్పీ డీఎస్పీ కె.ప్రమోద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో నమోదైన రెండు హ్యాండ్బ్యాగ్ చోరీ కేసులలో దర్యాప్తు అనంతరం వీరిని పట్టుకున్నట్టు తెలిపారు. -
ఆదాయానికి పెన్ముప్పు
● లేఖర్ల పెన్డౌన్తో భారీగా తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కొత్తపేట: భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ పేరుతో చేపట్టిన నిరవదిక సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లతో పాటు రిజిస్ట్రేషన్లపై ఆధారపడిన డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడి సుమారు 600 మంది దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, సహాయకులతో పాటు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకురావడం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం వచ్చేది ఇలా.. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, వాటిలో అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు, ఆలమూరు కార్యాలయాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ నెల 17న (శుక్రవారం) 336 రిజిస్ట్రేషన్లు కాగా రూ.82.05 లక్షల ఆదాయం వచ్చింది. 18న అత్యధికంగా 548 రిజిస్ట్రేషన్లు జరగ్గా, వాటి నుంచి రూ.3.56 కోట్లు సమకూరింది. ఆ విధంగా జిల్లాలో రోజుకు సరాసరి 250 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా రూ.2 కోట్లు ఆదాయం వస్తుంది. తగ్గిన రిజిస్ట్రేషన్లు ఈ నెల 20 నుంచి దస్తావేజు లేఖర్ల నిరవదిక సమ్మెతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. జిల్లాలో 20న ఒక్క (ఆత్రేయపురం) రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.58,640, 21న 2 (కొత్తపేట, అంబాజీపేట) జరగ్గా రూ.14,760, 22న ఒకటి (ఆత్రేయపురం) రిజిస్ట్రేషన్తో పాటు ఇతర బాండ్లతో రూ.17,230, 23న ఐ.పోలవరంలో 2 రిజిస్ట్రేషన్లకు రూ.1,75,100 ఆదాయం వచ్చింది. -
2న విశాఖలో సాహిత్య, సాంస్కృతిక వైభవోత్సవాలు
సఖినేటిపల్లి: విశాఖపట్నంలో ఆగస్టు 2న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సాహిత్య, సాంస్కృతిక వైభవోత్సవాలు ఏర్పాటు చేసినట్టు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. శుక్రవారం సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ 170వ జాతీయ స్థాయి సాహిత్య, సాంస్కృతిక వైభవోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశాఖ క్రాంతి కిరణాలు పేరిట నిర్వహించే ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి కవులు, రచయితలు, అభిమానులు తరలిరానున్నట్టు ప్రతాప్ పేర్కొన్నారు. 9 ప్రైవేట్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా రవాణాఽశాఖ అధికారి డి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మండలంలోని ఈతకోట టోల్ ప్లాజా వద్ద 34 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా నిబంధనలు పాటించని 9 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.16 వేలు అపరాధ రుసుము విధించామన్నారు. యువతిని బెదిరించిన ఘటనపై ఫిర్యాదు సఖినేటిపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డుపై వెళుతున్న యువతి ఓ ఇద్దరు యువకులు చెయ్యి పట్టుకుని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన యువతిని అడ్డగించి ఎక్కడకు వెళుతున్నావ్, నిన్ను కిడ్నాప్ చేస్తాం, మీ తాత మాతో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఈ విషయం ఎవరికై నా చెబితే మీ అంతు తేలుస్తాం అని బెదిరించినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్కు జైలు
తాళ్లరేవు: ఆటోను ఢీకొని ఎనిమిది మంది మహిళల మృతికి కారణమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్కు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కాకినాడ జిల్లా అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ శుక్ర వారం తెలిపిన వివరాల మేరకు.. 2023లో జాతీయ రహదారి 216పై కోరంగి పంచా యతీ సుబ్బారాయుని దిమ్మ వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది మహిళల్లో ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ అయిన ముంగమూరి మహేష్ (సీతానగరం మండలం వంగలపూడి), వేగిరాజు సుధీర్ (తెలంగాణ)లను అరెస్ట్ చేసి జైలుకు పంపా రు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ 84 మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరచగా, పి.మురళీకృష్ణారెడ్డి దర్యాప్తు నిర్వహించి సాక్షులను విచారించారు. న్యాయమూర్తి కె.మోతీలాల్ ఆ సాక్ష్యాలను పరిశీలించి, ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎంవీఎస్ఎస్ ప్రకాశరావు, డి.నాగబాబులు వాదన వినిపించారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతుగూడెం: మోటారు సైకిల్పై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చరణ్ నాయక్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి గుంటూరుకు పది కేజీల గంజాయిని బైక్పై ఇద్దరు యువకులు తరలిస్తున్నారు. గుర్తేడు మండలం బొడ్డుగంటి పంచాయతీ పరిధిలో డొంకరాయి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరుకు చెందిన సద్దాం పవన్ మాధవ్, కుందేటి చెన్నకేశవరావును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. లోవలో జంతుబలి నిషేధించాలి తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానంలో జంతుబలి, మద్యాన్ని నిషేధించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఆయన గురువారం కుటుంబ సభ్యులతో లోవ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠం తరఫున అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, మహా హారతి సేవలు నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. లోవలో జంతువులను వధించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నిషేధించాలని కోరుతూ కార్యనిర్వహణ అధికారికి లేఖ ఇచ్చినట్టు తెలిపారు. -
ఎల్నినో ప్రభావంతో పంటలకు చీడపీడలు
● సస్యరక్షణ చర్యలు తప్పనిసరి ● రైతులకు వ్యవసాయాధికారుల అవగాహన అనపర్తి: ఎల్నినో ప్రభావంతో అడపాదడపా కురిసే వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలకు ఖరీఫ్ వరి పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. మండలంలోని పులగుర్త గ్రామంలో గురువారం ఆత్మ సౌజన్యంతో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు జాగ్రత్తలు వివరించారు. ఆ ప్రకారం.. ● ఎల్నినో నేపథ్యంలో వరిని ఆకునల్లి ఆశించి, ఆకులు ఎర్రబడతాయి. దాని నివారణకు డైకాఫోల్ 5.0 మిల్లి లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎండాకు తెగులు సోకితే పొలంలోని పాత నీటిని తీసివేసి ఆరగట్టి తిరిగి నీరు పెట్టాలి. నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఎకరాకు 20 కిలోలు చల్లాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ హైడ్రాకై ్సడ్ 2.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● గడ్డి దుబ్బు తెగులు లేదా కాండం కుళ్లు తెగులు క నిపిస్తే, నివారణకు టెబ్యూకోనజోల్ 2.0 మిల్లీ లీ టర్ల మందు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఎలుకల నివారణకు పొలం గట్లను చెక్కుకొని, అక్కడక్కడా ఎలుక బుట్టలు అమర్చుకొంటే, వలస పోయే ఎలుకలు అందులో పడి చనిపోతాయి. ఎలుక బొరియల్లో పొగబారించాలి. బ్రోమోడయోలిన్ 2 శాతం ఎర మందు (96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు బ్రోమోడయోలిన్ మందు) తయారు చేసి, 10 గ్రాముల పొట్లాలుగా కట్టి, ఎలుక బోరియల వద్ద అమర్చాలి. రైతులందరూ ఈ ప్రక్రియను సామూహికంగా చేపట్టాలి. ● వరిలో మొవ్వు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరంట్రనిలిప్రోల్ 0.3 గ్రాములు లేదా క్లోరిఫైరీఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
నల్ల చొక్కాలతో దస్తావేజు లేఖర్ల నిరసన
అమలాపురం టౌన్: జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్డౌన్ నిరసనలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి, అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్లను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఇందుకోసం విడుదల చేసిన జీఓ–396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల ద్వారా నాలుగో రోజు కూడా ప్రభుత్వం రూ.10 కోట్లు పైగా ఆదాయం కోల్పోయింది. మొత్తం నాలుగు రోజుల్లోనూ దాదాపు రూ.50 కోట్ల వరకూ రాబడికి బ్రేక్ పడింది. కక్షిదారులకు దస్తావేజు లేఖర్లు డాక్యుమెంట్లు రాసి ఇస్తే, వాటిపై అధికారులు రాజముద్ర వేసి అధికారికంగా జారీ చేస్తారు. దస్తావేజు లేఖర్ల నిరసనలతో కక్షిదారులకు రిజిస్ట్రేషన్ సేవలు అందడం లేదు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు చేపట్టిన నిరసనలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి సురేష్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్గోపాల్, సంయుక్త కార్యదర్శులు వెలుతురుపల్లి సుబ్బు, గనిశెట్టి భోగిరాజు తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. -
కూటమిలో ఉనికిపాట్లు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమిలో ‘ఉనికి’పాట్లు మొదలుపెట్టారు.. ఎవరికి వారు మైలేజ్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమిలో టీడీపీ నేతల దందాలు పేట్రేగిపోతున్నాయి. మద్యం మాఫియాతో పాటు, ఇసుక, మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలకు ప్రాతినిథ్యం ఇవ్వగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన జనసేన, బీజేపీ నేతలకు మాత్రం ఎంట్రీ ఉండటం లేదు. ఈ పరిణామం బీజేపీ, జనసేన నేతల్లో మింగుడుపడని అంశంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇదే తంతు సాగుతోంది. కూటమంటే కేవలం టీడీపీ అనే భావన ప్రజల్లో కలుగుతుండటంతో మిత్రపక్ష పార్టీలు నయా పంథాకు తెర తీశాయి. కూటమిలో తామూ ఉన్నామంటూ ప్రజలకు తెలిపేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. యాత్ర.. సొంత పాత్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని బీజేపీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందనే చర్చ విస్తతంగా జరుగుతోంది. ఇటీవల రాజమహేంద్రవరం నుంచి బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులతో భారీ ర్యాలీగా పోలవరం సందర్శనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో టీడీపీ, జనసేన నేతలు లేకపోవడం చర్చకు దారితీసింది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ మైలేజ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. ఇదేమని ప్రశ్నించిన రాజకీయ విశ్లేషకులకు బీజేపీ నేతలు వింతైన వాదన వినిపిస్తున్నట్లు సమాచారం. పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని.. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశంగా చెబుతున్నారు. పోలవరంతో బీజేపీకి దశాబ్దాలుగా ఎమోషనల్ బాండింగ్ ఉందని, జనతా పార్టీ కాలం నుంచే పోలవరం కోసం ఉద్యమాలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం చేర్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఒంటరిగా పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల్లో సై అంటూ.. కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టున్న అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు, కూటమిని బలపర్చేందుకు తగ్గి పోటీ చేశామని, రాబోయే ఎన్నికల్లో అదే విధంగా పోటీ చేస్తామనడం అసంభవమన్నారు. భవిష్యత్తులో అలాంటి విధానం వర్తించదన్నారు. జనసేనకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని, ఇందులో టీడీపీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేదని నర్మగర్భంగా వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే జనసేన, టీడీపీ మధ్య క్షేత్ర స్థాయిలోనే కాదు.. పై స్థాయిలో సైతం విభేదాలు ఉన్నాయన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ పరిణామం టీడీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. ఇప్పటికే పార్టీ కోసం శ్రమించిన అనేక మంది టీడీపీ శ్రేణులు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. అలాంటి తరుణంలో జనసేన నేతలు పక్కలో బల్లెం తరహాలో తయారవుతుండటంతో టీడీపీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి తూర్పులో విభేదాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఎమ్మెల్యే స్థానాలు త్యాగం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అత్యధిక శాతం పోస్టులు టీడీపీ నేతలకే కట్టబెట్టారు. బీజేపీ, జనసేన నేతలకు మాత్రం నామమాత్రంగా కేటాయించారు. ఇకపై ఆ విధానం ఉండదని చర్చించుకుంటున్నారు. ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. కూటమిలో భాగమైనా.. అధికారిక కార్యక్రమాలకు శేషారావు దూరంగా ఉంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేన నేతలకు అందలం వేయడం, బీజేపీ, టీడీపీ నేతలను విస్మరించడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. ఫ కొవ్వూరు నియోజకవర్గంలోనూ ఇదే తంతు సాగుతోంది. ఫ రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి. ఫ పిఠాపురం నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ సీనియర్ నేత వర్మకు జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎంతగా అంటే.. టీడీపీలో సీనియర్ నేత అయినా వర్మను ఇన్చార్జి పదవి నుంచి తొలగించే స్థాయికి చేరిందంటే ఏ స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఫ అమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు, జనసేన నేతలకు పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది. కూటమిలో మిత్రపక్షమైన, ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గాల్లోనే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగుతోంది. ఫ జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విభేదాలు ఫ ప్రాధాన్యం చాటుకునేలా బీజేపీ పోలవరం యాత్ర ఫ స్థానిక సంస్థల్లో బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని నాదెండ్ల ప్రకటన ఫ ఈ పరిణామాలతో కూటమిలో ఏం జరుగుతుందోనని చర్చ -
బుగ్గిపాలైన జీవనాధారం
● కాలిపోయిన మూడు టీ పాయింట్లు ● మరో హోటల్కు పాక్షికంగా నష్టం దేవరపల్లి: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని దేవరపల్లి జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు (టీ పాయింట్లు) పూర్తిగా కాలిపోగా, ఓ హోటల్ పాక్షికంగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టీ పాయింట్లో ఉద యం ఐదు గంటల సమయంలో టీ కాస్తుండగా మంటలు వ్యాపించాయి. అవి పక్కనే గల మరో రెండు దు కాణాలకు పాకి మూడు కాలిబూడిదయ్యాయి. వీటికి అనుకుని ఉన్న ఓ హోటల్ పాక్షికంగా దెబ్బతింది. మంటలకు దుకాణాల్లోని వంట గ్యాస్ సిలిండర్లు పేల డంతో పరిసర ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గోపాలపురం మండలం పెద్దాపురం, గోపాలపురానికి చెందిన పిల్లి లక్ష్మణరావు, దాసి చందు, కందుల రామకృష్ణ ఈ దుకాణాలను అద్దెకు తీసుకుని టీ పాయింట్లు ఏర్పాటు చేశారు. అప్పులు చేసి వీటిని నిర్వహిస్తున్నామని, ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. మంటలు వ్యాపించిన సమయంలో టీ కాస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. -
మోడల్ స్కూలులో ఏకోపాధ్యాయ పాఠశాల విలీనం
అమలాపురం టౌన్: మున్సిపాలిటీ పరిధి పేరమ్మ అగ్రహారంలోని ఆచార్య వినోభాభావే మున్సిపల్ ప్రా థమిక పాఠశాల ఒకే ఒక్క విద్యార్థితో కొనసాగుతోందంటూ ‘మూతబడులు’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు. ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బండారు అద్విత్ను అతడి సోదరి కీర్తన మూడో తరగతి చదువుతున్న స్థానిక సూర్య నగర్లోని గోపాలకృష్ణ గోఖలే మున్సిపల్ ప్రాథమిక పాఠశాల(మోడల్ స్కూలు)లో గురువారం చేర్చారు. పేరమ్మ అగ్రహారం పాఠశాల టీచర్ సత్యకుమార్ను భూపయ్య అగ్రహారం పాఠశాలలో డెప్యూటేషన్పై నియమించారు. -
పారా స్పోర్ట్స్లో భరద్వాజ ప్రతిభ
కాకినాడ రూరల్: సమగ్ర శిక్షా పీఎంశ్రీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్లో తిమ్మాపురం గ్రామానికి చెందిన భవిత సెంటర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి రెడ్డి భరద్వాజ ప్రతిభ చూపాడు. 400, 100 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు, షాట్ఫుట్లో కాంస్య పతకం సాధించినట్టు కాకినాడ రూరల్ ఐఈఆర్టీ వెంకటలక్ష్మి తెలియజేశారు. భరద్వాజను ఎంఈఓలు ఈశ్వర శాస్త్రి, బి.శ్రీనివాస్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పీడీ జయలక్ష్మి, భవిత సెంటర్కు చెందిన వీర గణేష్ పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్లో కానిస్టేబుల్ సత్తా అల్లవరం: ఓడలరేవు మైరెన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.అప్పన్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి వెండి పతకం గెలుచుకున్నాడు. మహారాష్ట్రలోని జౌరంగబాద్లో ఈ నెల 18 నుంచి 21 జరిగిన మాస్టర్స్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 120 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను గురువారం అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్లో కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్షుడు యనుముల పద్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అప్పన్న గతంలో రెండు సార్లు 550 కేజీల బరువుల ఎత్తి, జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
26న ముద్రగడ సంస్మరణ సభ
అమలాపురం టౌన్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ, అన్న సమారాధన స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కాపు రిజర్వేషన్ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి తెలిపారు. స్థానిక రాతి బడి వద్ద గురువారం జరిగిన జిల్లా కాపు ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సంస్మరణ సభ, అన్న సమారాధన ఏర్పాట్లపై కాపు నాయకులు చర్చించారు. విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవన్ కుమార్, సూదా గణపతి, నల్లా స్వామి, కర్రి రాఘవ, నల్లా అజయ్, నల్లా సంజయ్, కల్వకొలను ఉమ, చిక్కం కిట్టు, కంచిపల్లి అబ్బులు, బోణం సత్య వరప్రసాద్, పత్తి దత్తుడు, మామిడిపల్లి రాము, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముద్రగడకు జోహార్లు అర్పించారు. -
అమలాపురం టీడీపీలో..
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026● జిల్లా కేంద్రంలో రసవత్తర రాజకీయం ● ‘నామినేటెడ్’ కోసం అడుగడుగునా ఆరాటం ● ‘స్థానిక’ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో ముదిరిన ఆధిపత్య పోరు ● కొత్త రక్తం పేరుతో పాత వారిని పక్కన పెడుతున్న లోకేష్ ముక్కలాట3సాక్షి, అమలాపురం: అమలాపురం టీడీపీలో మూడు ముక్కలాట మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాగుతున్న ఆధిపత్య పోరు.. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ జిల్లాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ తర్వాత పరాకాష్టకు చేరింది. సీనియర్ నాయకుడు మెట్ల రమణబాబు, ఇటీవల పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న గంధం పల్లంరాజు, లోకేష్ వర్గంగా చెప్పుకుంటున్న చెరుకూరి సాయిరామ్ల మధ్య సాగుతున్న పోరు టీడీపీ క్యాడర్కు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకురావడంతో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత నియామకాలు, స్థానిక వ్యవహారాల్లో ప్రాధాన్యం దక్కించుకునే ప్రయత్నాల్లో మూడు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా అమలాపురం మున్సిపాలిటీలో తమ హవా చాటుకోవాలని, ఎక్కువ సీట్లు సాధించాలని ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూండటంతో స్థానిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త రక్తం పేరుతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తమను పార్టీ, ప్రభుత్వ పదవులకు దూరంగా ఉంచుతున్న తీరును సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మెట్ల’కు ఉక్కపోత పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుకు సొంత పట్టణం అమలాపురంలోనే ఉక్కపోత ఎదురవుతోంది. మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు రాజకీయ వారసుడైన రమణబాబుకు 2014–19లోను, తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగలేదని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. తొలుత ఆప్కాబ్ చైర్మన్, తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి ఆశించినా దక్కలేదు. కార్పొరేషన్ల కేటాయింపులోనూ మొండిచేయి చూపారు. దీంతో, ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అది కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కుటుంబంలో మూడో తరానికి చెందిన మెట్ల సత్యనారాయణరావు(సత్య)ను మున్సిపల్ చైర్మన్ చేయాలని ఆ వర్గం ఆశిస్తోంది. అయితే, ఆ పదవిని జనసేనకు ఇవ్వనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి రమణబాబులో వ్యక్తమవుతోంది. Xపల్లంరాజు ఆధిపత్య ప్రదర్శన మరోవైపు పార్టీ జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ జిల్లా కేంద్రంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కోనసీమలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా రాజకీయాలతో సంబంధం లేకపోయినా, ఆయన తన వర్గాన్ని పోగు చేసి నిర్వహించిన ఈ ర్యాలీ కొత్త వివాదాలకు దారి తీసింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నప్పటికీ వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయిని కూడా పక్కన పెట్టి పల్లంరాజు వ్యవహరిస్తూండడం టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తోంది. ఇక రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ కూడా తనదైన శైలిలో పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అమలాపురంలో తనకు ప్రత్యేక వర్గం లేకపోయినా లోకేష్ ఆశీస్సులున్నాయనే సంకేతాలిస్తూ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో పార్టీలో కీలక బాధ్యతలు లేదా నామినేటెడ్ పదవి తనకే దక్కుతుందని ఆయన అనుచరులు ధీమాగా ప్రచారం చేస్తున్నారు. బయటకు అందరూ ఐక్యత ప్రదర్శిస్తున్నా, తెర వెనుక ప్రతి నిర్ణయంపై ఈ మూడు వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ అంతర్గత ఆధిపత్య పోరు అమలాపురం రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. -
ఆటంకాలు దాటేనా!
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్షిప్ పేరుతో ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసింది. 12 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని ప్రకటించింది. అయితే పోటీల నిర్వహణకు నియోజవర్గానికి కేవలం రూ.5 వేలు మాత్రమే కేటాయించింది. ఈ సొమ్ముతో ఎలా నిర్వహించాలో తెలియని పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడింది. అలాగే క్రీడా పరికరాలు సమకూర్చకపోవడం, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో నిర్వహణ కత్తిమీద సాములా మారింది. వసతుల కొరత జాతీయ క్రీడా దినోత్సవాన్ని (ధ్యాన్చంద్ జయంతి, ఆగస్టు 29) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలసి రూ.90 లక్షల ప్రైజ్మనీతో అమరావతి చాంపియన్ షిప్ పేరుతో క్రీడా పోటీలకు సన్నాహాలు చేశాయి. ఈ టోర్నమెంట్ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. క్రీడాప్రాధికార సంస్థతో పాటు విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించాలని, పోటీల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలల మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను వినియోగించుకోవాలని ఇప్పటికే ఆయా యూనివర్సిటీలు, కళాశాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో వసతులు, మైదానాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాయామ అధ్యాపకులు లేకపోడంతో ఈ టోర్నమెంట్ నిర్వహణ క్రీడాభివృద్ధి ఽఅధికారులకు కత్తిమీద సాములా తయారైంది. మరో వైపు ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడాయాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ నత్తనడకగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి షెడ్యూల్ అమరావతి చాంపియన్ షిప్ను ఈ నెల 15 నుంచి ఆగస్టు 26 వరకు నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు కురవడంతో నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 27 నుంచి షెడ్యూలు ప్రకటించారు. అండర్ 17, 23 విభాగాల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగాతో కలిపి 12 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ నెల 27న తుని క్రీడా వికాస కేంద్రం, 28న ప్రత్తిపాడు జెడ్పీ పాఠశాల, 27న జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల, 28న పెద్దాపురం లూథరన్ పాఠశాల, 29న పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల, 30న కాకినాడ ఆర్బన్ పరిధిలో, 31న కాకినాడ రూరల్ పరిధిలో కాకినాడ డీఎస్ఏలో నియోజకవర్గస్థాయిలో పోటీల నిర్వహణకు క్రీడాప్రాధికార సంస్థ అధికారులు షెడ్యూలు ప్రకటించారు. దాతలే ఆధారం నియోజకవర్గ స్థాయిలో పోటీల నిర్వహణకు కేవలం రూ.5 వేలను ప్రభుత్వం కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యేలు, దాతల సహకారంతో పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. అవుట్ డోర్ గేమ్స్ అయిన వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించేందుకు అనువైన క్రీడా మైదానాలు లేకపోవడం, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీల కొరత, మైదానాలు అంతంత మాత్రంగా ఉండడంతో పోటీల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందని క్రీడాసంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. పెద్దాపురం లూథరన్ హైస్కూల్ మైదానం కాకినాడ డీఎస్ఏలో వర్షం కారణంగా బురదగా మారిన మైదానం ఆదేశాలు ఇవే.. పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు మిడ్డే మీల్స్లో భోజన సదుపాయాలు కల్పించాలి. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లాకు వచ్చే క్రీడాకారుల్లో బాలికలు, మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పురుషులు, బాలురకు ఒక వైపు చార్జీలు మాత్రమే అందిస్తారు. ఇక ప్రైజ్ మనీ రూ.90 లక్షలు ప్రకటించినా ఏ స్థాయిలో ఎంత ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. అమరావతి చాంపియన్ షిప్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశం పోటీల నిర్వహణకు షెడ్యూల్ విడుదల అరకొరగా నిధుల కేటాయింపు నిర్వాహకులకు కత్తిమీద సాము వేధిస్తున్న మైదానాల కొరత, వసతుల లేమి -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పోషకాల పండుగ
● తాటిపండుతో ఎన్నో ఉపయోగాలు ● నోరూరించే వంటకాలు ● రుచికరమైన స్వీట్ల తయారీ ● తినడానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు ఆలమూరు/మలికిపురం: వేసవిలో మండే ఎండలు, వేడి నుంచి ఉపశమనానికి తాటిముంజెలను తింటూ ఉంటాం. అలాగే శీతాకాలం చివరిలో వచ్చే తేగలంటే అందరికీ ఇష్టమే. ఈ రెండు కాలాల మధ్య మనకు లభించే తాటిపండుకు ఎన్నో పోషక గుణాలున్నాయి. దీని గుజ్జు నుంచి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. ప్రముఖ స్వీట్ షాపుల్లోనూ తాటి పండు వంటకాలు లభిస్తున్నాయి. ముంజెకాయ పండిపోయి తాటి పండు రూపంలో చెట్టు నుంచి నేల మీదకు పడుతుంది. దాని నుంచి తీసిన గుజ్జుతో ఇడ్లీలు, గారెలు, రొట్టెలు చేసుకుని తినడం మన పూర్వకాలం నుంచీ వస్తోంది. ఆధునిక కాలంలో తాటిగుజ్జుతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. కనుమరుగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒకప్పుడు ఎక్కడ చూసినా తాటిపండ్లు విరివిగా లభించేవి. కానీ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు చెట్ల నుంచి జారి పడిన తాటిపండ్లను రైతులు తమ చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేవారు. కానీ నేడు పల్లెల్లో కూడా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి, తాటిపండును సైజును బట్టి రూ.30 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. రుచి మధురం తాటిపండు గుజ్జుకు బెల్లం, వరి నూక, కొబ్బరి కోరును సమపాళ్లలో కలిపి ముద్దగా తయారు చేస్తారు. దానిలో గారెలు, రొట్టెలు తయారు చేసుకోవచ్చు. తాటి గుజ్జుతో తయారు చేసిన తాండ్ర మరింత రుచికరంగా ఉంటుంది. ముందుగా గుజ్జును శుభ్రమైన తాటాకు చాప మీద రోజూ పొరలా పూస్తుంటారు. అలా ఎండిన గుజ్జు కొద్ది రోజుల తర్వాత మందంగా మారి తాండ్రగా తయారవుతుంది. ఈ తాండ్రను చిన్నారులు అమితంగా ఇష్టపడతారు. తాటిగుజ్జుతో చేసిన వంటకాలు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి. ఆరోగ్యకరం తాటి పదార్థాల్లో ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి అధిక పోషకాలు ఉండటం వల్ల మానవ శరీరంలో కణజాల పెంపునకు దోహద పడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. తాటి టెంకలో ఉండే పీచుతో జీర్ణకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తేగలు తింటే మలబద్ధకం దూరమవుతుంది. తాటి ముంజెలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలువ దనాన్ని ఇస్తాయి. తాటి తాండ్రను తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని. టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారు మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
నేడు మెగా పీటీఎం
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకూ మెగా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం 4.0 నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు. జిల్లాలోని 1,409 విద్యా సంస్థల్లో చదువుతున్న 76,132 మంది విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల చదువు పురోగతి, ఫలితాలు, ప్రభుత్వ పథకాల అమలు, పాఠశాల అభివృద్ధి పనుల గురించి వివరించనున్నామన్నారు. విద్యార్థులకు సమగ్ర పురోగతి నివేదికలు ఇవ్వడంతో పాటు లీప్ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త జి.మమ్మీ, జిల్లా విద్యా శాఖ అధికారి వి.నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణం సెప్టెంబర్లోగా పూర్తి చేయాలి అమలాపురం రూరల్: జిల్లాలో చేపడుతున్న 400/132 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం, 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్షించారు. కొత్తపేట నుంచి అయినవిల్లి వరకూ 22 కిలోమీటర్ల మేర 400 కేవీ లైన్ పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తం 64 టవర్లలో 62 పూర్తయ్యాయని, మిగిలినవి, వైర్లు బిగించే పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ, ట్రాన్స్కో ఈఈలు పుల్లయ్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. హైవే పనులపై కలెక్టర్ ఆగ్రహం అమలాపురం రూరల్: జిల్లాలో జాతీయ రహదారి–216 విస్తరణ, జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంపై కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హైవే అధికారులను హెచ్చరించారు. ఈ పనులపై హైవే, ఏపీ ట్రాన్స్కో అధికారులతో కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్షించారు. జిల్లాలో ఎన్హెచ్–216 విస్తరణలో భాగంగా 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల తరలింపు పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ ఈఈని ఆదేశించారు. అనంతరం జొన్నాడ ఫ్లై ఓవర్ పనులపై ఎన్హెచ్ ఏఈ శృతి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ వద్దని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్డు టెండర్లు పూర్తయ్యాయని, ఆగస్టులో కాంట్రాక్టర్లతో సమీక్షించి నవంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్రాలు, సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సరళావతి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘గంట మందారం’
కొత్తపేట: సాధారణంగా మందార పువ్వు పైకి లేదా పక్కకు విడుస్తుంది కానీ ఈ మందారం తల కిందకి దించి గంట ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని గంట మందారం పిలుస్తారు. స్థానిక కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలు, నర్సరీల నుంచి రకరకాల మొక్కలు తెచ్చి తన ఇంటి పెరట్లో పెంచుతుంటారు. కడియపులంకలో ఒక నర్సరీ నుంచి రామం నెల క్రితం గంట మందారం మొక్కను తెచ్చి పాతారు. దానికి రెండు రోజుల క్రితం మొగ్గ పూసింది. అది బుధవారం పుష్పంగా విడిచిందని రామం తెలిపారు. -
7 నెలలుగా నీరే ఆధారం!
● ఏడేళ్లుగా మంచంపైనే జీవనం! ● నేతన్న దీనావస్థ పిఠాపురం: తన చేతులతో అందమైన చీరలు నేసిన నేతన్నకు నేడు ఎంతో కష్టం వచ్చింది. చేయి తిరిగిన చేనేత కార్మికుడిగా పేరొందాడు. అనుకోని అతిథిలా వచ్చిన ఆపద అతనిని మంచాన పడేసింది. గత ఏడేళ్లుగా ఆయన మంచానికే పరిమిత మయ్యాడు. శరీరం రాను రాను క్షీణించడంతో ఆహారం ఏదీ లోపలికి వెళ్లక కేవలం తాగు నీరు మాత్రమే ఆధారంగా ఏడు నెలలుగా జీవన పోరాటం చేస్తున్నాడు. కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు పొన్నగంటి అప్పారావు పరిస్థితి ఇది. ఆయన భార్య గతంలో మృతి చెందగా ఒక్కగానొక్క కూతురి వద్దే ఆయన ఉంటున్నారు. ఏడేళ్ల క్రితం కాలికి వచ్చిన పుండు ఆయనను మంచాన పడేలా చేసిందని ఆయన బంధువులు చేప్తున్నారు. అది మానినా లేవలేని స్థితిలోకి వెళ్లిన అప్పారావు ఏడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. గత ఏడు నెలల క్రితం వరకు అతి కష్టం మీద ఆహారం అందించే వాళ్లమని, ఏడు నెలల నుంచి కేవలం మంచినీరు తప్ప మరేది తీసుకోలేక పోతున్నాడని అయినవారు తెలిపారు. చేనేత పైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం భారమనుకోకుండా ఆయనను గంట గంటకు మంచినీరు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఒక కేవలం తాగునీటితో ఇన్నాళ్లుగా జీవనం సాగించడాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఇదేం.. దారిద్య్రం
● ఛిద్రమైన రోడ్లు ● తూతూమంత్రంగా ప్యాచ్ వర్కులు ● వాహనచోదకులకు ఇబ్బందులు ● గుంతలు పూడ్చిన కొద్ది రోజులకే మళ్లీ శిథిలం సీటీఆర్ఐ: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు ఉంది నగరంలోని రోడ్ల పరిస్థితి. నగరంలోని రోడ్లు మరి అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్లపై గోతులతో నిండి ప్రమాదకరంగా మారాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రమాదాలతో చెలగాటమాడటమేనని వాహనచోదకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పాలన మొదలై రెండేళ్లు పూర్తయింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని రోడ్లు అద్దంలా మెరిసేలా తయారు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క రోడ్డుకు కూడా మోక్షం కలగలేదు. నగర ఎమ్మెల్యే శంకుస్థాపనలతోనే సరిపెట్టడంతో నగరంలో అసలు రోడ్లకి మోక్షం కలుగుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత లేని ప్యాచ్ వర్కులతో సరి నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అప్పటికప్పుడు రోడ్లపై ప్యాచ్ వర్కులు చేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల రోడ్లపై గుంతలను పూడ్చడానికి అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. కానీ నాణ్యత లేకపోవడంతో మళ్లీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు పూర్తి స్థాయిలో రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల తాత్కాలికంగా గుంతలను పూడ్చడానికి ప్యాచ్ వర్కులు చేశారు. స్థానిక వైజంక్షన్ నుంచి నందం గనిరాజు జంక్షన్ వరకు, బైపాస్ రోడ్డు నుంచి తాడితోట సెంటర్ వరకు, క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలాచెరువు సెంటర్ వరకు, టీటీడీ రోడ్డు, కంబాలచెరువు జంక్షన్, పేపర్మిల్లు రోడ్డు, సీతంపేట, ఆర్యాపురం, వీరభద్రపురం, ఆనంద్నగర్ వంటి పలు రద్దీ ప్రాంతాల్లో ప్యాచ్ వర్కులు చేశారు. కానీ ఈ ప్యాచ్ వర్కులు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారాయి. పాత రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి అక్కడ తారు వేసి ప్యాచ్ వర్కులు చేశారు. పాత రోడ్డు కంటే అదనంగా అరడుగు మందంలో కొత్తగా ప్యాచ్ వర్క్ చేయడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనచోదకులు ప్రయాణించేటప్పుడు పాత రోడ్డు నుంచి గుంతలు పూడ్చిన వైపునకు బైక్ నడపడంతో టైర్ స్కిడ్ అయి ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్దిష్ట ప్రమాణంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లు పూడ్చడంతో వాహనచోదకులు నానాఅగచాట్లు పడుతున్నారు. బోల్తా కొట్టిన ఆటో క్వారీ మార్కెట్ నుంచి లాలాచెరువు వెళ్లే రోడ్డులో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ గొయ్యిలో పడి ప్రమాదాల బారిన పడటంతో ఆ గొయ్యిలో మట్టి కప్పి తాత్కాలికంగా గొయ్యి పూడ్చారు. కానీ మొన్న కురిసిన వర్షాలకి మట్టి కొట్టుకుపోయి గోతిలో నీళ్లు నిండిపోయాయి. సుబ్బారావునగర్కి చెందిన దడాల సత్తయ్య ఆటో ప్రయాణం చేస్తుండగా ఆ గోతిలో పడి ఆటో బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్తో పాటు, ప్రయాణికుడు సత్తయ్యకి తీవ్ర గాయాలయ్యాయి. సత్తయ్యకి కాలు ఆటోకింద పడిపోవడంతో అతని కాలు విరిగింది. దీంతో పనులు చేసుకోలేక కుటంబంతో నానా ఇబ్బందులు పడుతున్నాడు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి
రామచంద్రపురం రూరల్: కుటుంబ భారం మోసే యువకుడి మృతితో ఆ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వెలంపాలెం గ్రామానికి చెందిన యడ్ల రామాంజనేయులు (33) తాపీ పని చేస్తూ వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాడు. అతడికి 8 మంది అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. కుటుంబ బాధ్యత నెత్తిమీద వేసుకుని అక్కల పెళ్లిళ్లు చేయడంతో పాటు వారి మంచిచెడు అతడే చూస్తూ ఉంటాడు. వృద్ధురాలైన తల్లి కళ్లు కనిపించని స్థితిలో అతడే ఆధారంగా ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం ద్రాక్షారామలో ఒక ప్రైవేటు భవనం పై అంతస్తులో పిట్ట గోడ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఊచ జారి 33 కేవీ విద్యుత్ లైన్ వైరు తగలడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీనితో స్థానికులు ద్రాక్షారామలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో రామాంజనేయులు సోదరుడు యడ్ల వెంకన్న ఫిర్యాదు, ఆసుపత్రి సమాచారాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. జయహో జాతీయ పతాక.. మామిడికుదురు: స్థానిక పాఠశాలలో బుధవారం జాతీయ జెండా (పతాక) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ నమూనా (మ్యాప్) ఆకారంలో నిలబడి, చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని అందరినీ అలరించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిందని స్కూల్ కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి జూలై 22వ తేదీని జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. మన జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
● ఆదిత్య ప్రొ వైస్ చాన్సలర్ సతీష్రెడ్డి ● అట్టహాసంగా హ్యాండ్బాల్ క్రీడలు ప్రారంభం ● దక్షిణాది రాష్ట్రాల నుంచి 250 మంది క్రీడాకారుల హాజరు పెద్దాపురం: విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఆదిత్య విద్యా సంస్థల ప్రో వైస్చాన్సలర్ నల్లమిల్లి సతీష్రెడ్డి తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి నేతృత్వంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని విద్యాలయాల క్రీడాకారులకు స్థానిక పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయంలో బుధవారం హ్యాండ్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలను సతీష్రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ జవహార్ నవోదయ విద్యాలయాలు విద్యతో పాటు ఆటలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నతమైన పౌరులను అందిస్తోందన్నారు. సుమారు 250 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్దాపురం నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్ఎస్ కీర్తి, మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, ఎన్సీసీ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు చక్రవర్తి, అనురాథ, సీహెచ్ జనార్దన్ నాయుడు, పి.రామారావు, ప్రేమలత, రాజ్యలక్ష్మి, ఎం.లక్ష్మణరావు, కె. విజయ్కుమార్, కె.రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. -
చిట్టీల పేరుతో మోసం
పోలీసులకు బాధితుల ఫిర్యాదు నిడదవోలు: చీటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఓ మహిళపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై జగన్మోహన్రావు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని గౌడవీధికి చెందిన మెరకనపల్లి తిరుమల అనే మహిళ 8 ఏళ్లుగా చీటీలు వేస్తోంది. ఆ నమ్మకంతో తన వద్ద చిట్టీలు వేసిన 70 మందికి చెందిన రూ.90 లక్షలతో ఈనెల 18 తేదీ నుంచి ఆమె కనపడకుండా పోయింది. బాఽధితులకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి ఆమె భర్త వెంకటరమణను అడగగా తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కుమారుడి అప్పగింత ● పశ్చిమ బెంగాల్ నుంచి తప్పిపోయి వచ్చిన యువకుడు ● హృదయాలయంలో ఆశ్రయం నిడదవోలు: స్థానిక సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హృదయాలయం మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఆటిజంతో బాధ పడుతున్న 18 ఏళ్ల యువకుడిని బుధవారం నిర్వాహకులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ వర్ధమాన జిల్లా దబిపూర్ గ్రామం నుంచి కింగ్షుక్ అనే యువకుడు గతనెల 22న రాజమహేంద్రవరం వచ్చాడు. అతడిని రాజమండ్రి చైల్డ్ వేల్ఫేర్ కమిటీ ఇక్కడి మానసిక దివ్యాంగుల కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి అతడి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు తల్లిదండ్రుల కాంటాక్టు నంబరు తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. అతడి తల్లిదండ్రులు కృష్ణందీ మెడక్, రాఖీ మెడక్ బుధవారం హృదయాలయానికి చేరుకోగా అధికారుల సమక్షంలో వారి కుమారుడిని అప్పగించినట్టు నిర్వాహకులు దండే గణేష్ బాబు, ఎడ్యుకేటర్ బలగం విశాలాక్షి తెలిపారు. -
నిరీ్జవ నేలలో ఉద్యాన హేల
ఆదర్శంగా నిలుస్తున్న నర్సరీ రైతు మామిడికుదురు: చుట్టూ ఆక్వా చెరువులు.. ఎటు చూసినా రొయ్యలు, చేపల సాగు. అలాంటి చోట సున్నితమైన మొక్కల పెంపకమా? సాధ్యం కాదంటూ కొందరు పెదవి విరిచారు. కానీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. తలపెట్టిన కార్యాన్ని రెండేళ్లలోనే సాకారం చేసి లూటుకుర్రు గ్రామాన్ని నర్సరీ పటంలో నిలబెట్టారు. ఆయన పేరు బోనం సత్తిరాజు. చదివింది పదో తరగతే అయినా మొక్కల పెంపకంపై ఉన్న మక్కువ, అనుభవం నర్సరీ రంగంలో రాణించేలా చేశాయి. ఇప్పటికే కడియం, అనంతపురం జిల్లాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం లూటుకుర్రులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నర్సరీని ప్రారంభించారు. ఆక్వా చెరువుల మధ్య మొక్కల పెంపకం కత్తి మీద సామే అయినా, ప్రత్యేక శ్రద్ధతో అనుకూల వాతావరణాన్ని సృష్టించి అద్భుత ఫలితాలు సాధించారు. ఇక్కడి మొక్కలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుండటం విశేషం. వ్యాపారమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో నిలుస్తున్నారు సత్తిరాజు. స్వగ్రామంలో ఉపాధి కల్పనే లక్ష్యం నా సొంత ఊరు లూటుకుర్రులో నర్సరీ పెట్టి ఇక్కడి యువతకు ఉపాధి చూపించాలనేది నా బలమైన కోరిక. చుట్టూ ఆక్వా చెరువులు ఉండటంతో ఇక్కడ మొక్కలు బతకవని చాలామంది చెప్పారు. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని నమ్మాను. శాస్త్ర సాంకేతిక పద్ధతులు, సరైన యాజమాన్య విధానాలు పాటించి రెండేళ్లలోనే ఆశించిన ఫలితాలు సాధించాం. ఈ రోజు మన ఊరి మొక్కలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటే చాలా గర్వంగా ఉంది. – బోణం సత్తిరాజు, లూటుకుర్రు -
గంజాయితో ఏడుగురి అరెస్టు
నాలుగున్నర కేజీల సరకు స్వాధీనం రాజోలు: చెడు వ్యసనాలు, మద్యానికి బానిసైన ఏడుగురు యువకులు గంజాయి విక్రయానికి పాల్పడి సఖినేటిపల్లి పోలీసులకు చిక్కారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ బి.సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొపనాతి దుర్గాప్రసాద్ అనే రింటు, మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికు చెందిన రాయుడు యశ్వంత్, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన కొల్లాటి ధర్మరాజు అనే ధర్మ, కేశవదాసుపాలేనికి చెందిన చెల్లుబోయిన భగవాన్ అనే చింటూ, ఉయ్యూరి వారి మెరక కంతేటి వారి పోడు గ్రామానికి చెందిన కడలి ప్రదీప్కుమార్ అనే పాండు, అదే గ్రామానికి చెందిన మత్తి ఆనంద్కుమార్, కేశవదాసుపాలానికి చెందిన కడలి హర్షవర్ధన్లను బుధవారం అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. నర్సీపట్టణంలోని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుంచి దుర్గాప్రసాద్ గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించే ఉద్దేశంతో మిగిలిన స్నేహితులతో కలసి అంతర్వేది దేవస్థానం గ్రామంలోని బీచ్ వద్ద ఈ నెల 21న చిన్న పొట్లాలుగా కడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 4.690 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ధర్మరాజు, యశ్వంత్, కిరణ్రాజు గత నెల 25న మోరిపోడులోని రంపాలమ్మ గుడి సమీపంలో గంజాయి, మద్యం సేవించి వి.వి.మెరక, కె.వి.పోడు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లు విసరడం, కోళ్ల దొంగతనాలు చేసి బీభత్సం సృష్టించారు. అలాగే స్థానికంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బొమ్మతో ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి వారిని అరెస్టు చేసిన అరెస్టు చేసిన సీఐ సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావులను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు. మహిళ మృతి కేసులో 13 ఏళ్ల జైలు ఇద్దరు దోషులకు కోర్టు తీర్పు యానాం: పట్టణ పరిధిలో 2011లో జరిగిన ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి కేసులో విచారణ అనంతరం బుధవారం ఇద్దరికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే యానాంకు చెందిన ఓలేటి సత్యవతి 2011 మే 9వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి నుంచి పుదుచ్చేరి మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో ఫడ్బ్యాంకు రోడ్డు, ఉదయకృష్ణ కాలనీ, దరియాలతిప్పకు చెందిన ఎ1 చెక్క శ్రీనివాసు, ఎ2 బలసాడి వెంకటేశ్వర్లును దోషులుగా నిర్ధారిస్తూ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం పై విధంగా తీర్పు ఇచ్చింది. దానితో పాటు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధించినట్టు సీఐ డి.సురేష్బాబు తెలిపారు. -
వ్యాపారాలు వెలవెల
ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో నవనాయక ఫలాలు, సంవత్సరాధిపతి గురించి వివరిస్తూ అధిపతిని బట్టి మిగిలిన గ్రహాలు ఫలితాలిస్తుంటాయని చెప్తారు పండితులు. పాలకుడిని బట్టి యంత్రాంగం వ్యవహరిస్తుంది. అలా ఉంది పరిస్థితి. చాలా కాలంగా కోనసీమ జిల్లాలో కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్టు తయారైంది పరిస్థితి. అన్ని రంగాలు దాదాపు పడకేసి అటు వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకు ముందడుగు పడనీయడం లేదు. ఒక్కో రంగానిది ఒక్కో సమస్య. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా అని అన్ని వర్గాలవారూ ఎదురు చూస్తున్నారు. సాక్షి, అమలాపురం: ఓ వైపు వ్యవసాయం.. మరో వైపు ఉద్యానం.. ఇంకో వైపు ఆక్వా.. వాటితో పాటు నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, బంగారం, భవన నిర్మాణ రంగం ఇలా కోనసీమ జిల్లా ఓ పెళ్లింట సందడిలా ఉంటుంది. అటువంటి ఈ జిల్లా నేడు అన్ని రంగాల్లో సంక్షోభంలో చిక్కుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. కుదేలైన రియల్ బూమ్ రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం దాదాపు స్తంభించింది. లే అవుట్లలో ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లలో విక్రయాలు దాదాపు పూర్తిగా పడిపోయాయి. భూ, రిజిస్ట్రేషన్ల విలువలు పెరిగి, ఐటీ నిబంధనల ప్రభావంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఏళ్ల తరబడి అమ్ముడుపోక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా జిల్లాలో రిజిస్ట్రేషన్లు 50 శాతానికి పడిపోయాయి. కళ తప్పిన భవన నిర్మాణాలు ఇళ్ల రుణాలు లేకపోవడం, నిర్మాణాలు నిలిచిపోవడంతో ఈ రంగం వ్యాపారం 70 శాతానికి పడిపోయింది. సిమెంట్, ఇనుము, ఇసుక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముడిసరుకు ధరలు పెరగడం, మట్టి లభ్యత తగ్గడం, కూలీల కొరతతో బట్టీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరిలో 2,300 ఇటుక బట్టీలు ఉండగా వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మంది ఆధారపడి ఉన్నారు. అన్ సీజన్లో జీడిపప్పు ఆషాఢం అన్ సీజన్ కావడం.. జీడిగింజల ధరలు ఎక్కువగా ఉండటంతో చిన్న వ్యాపారులు కొనుగోళ్లు చేయడం లేదు. మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో టర్నోవర్ 40 శాతం తగ్గింది. కొబ్బరికి తమిళనాడు సరుకు సెగ అంబాజీపేట కొబ్బరి మార్కెట్ సంక్షోభంలో ఉంది. స్థానికంగా కొబ్బరి కాయ రూ.15 ఉంటే, తమిళనాడు నుంచి రవాణాతో కలిపి రూ.12.50కే వస్తోంది. దీంతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారు. రోజువారీ వ్యాపారం లక్షల్లో ఉండాల్సింది వేల్లోనే ఆగిపోతోంది. వ్యవసాయం సాగడం లేదు నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు 150 కోట్ల వ్యాపారం జరిగే ఎరువులు, పురుగు మందుల విక్రయాలు 60 శాతం పడిపోయాయి. ఆక్వా రంగం సైతం పూర్తిగా స్తంభించిపోయింది. వెలవెలబోతున్న అమలాపురం వస్త్రాల మార్కెట్ వీధిఘోరంగా ఉంది నిర్మాణ రంగం చాలా ఘోరంగా దెబ్బతింది. క్రయ విక్రయాలు లేక వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అనుకున్న మేర వ్యాపారాలు సాగకపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వ గృహ రుణాల మంజూరులో జాప్యం జరగడంతో పాటు అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. – కేవీఆర్ లక్ష్మణ్, శ్రీ శ్రీనివాస ఎంటర్ ప్రైజెస్, రామచంద్రపురం రియల్ ఎస్టేట్ స్తంభించింది రియల్ ఎస్టేట్ రంగం స్తంభించింది. గతంలో ప్లాటు కొందామని వచ్చేవారు ఇప్పుడు రావడం లేదు. బ్యాంకు రుణాలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్లో నమ్మకం లేకపోవడంతో పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయాయి. జిల్లాలో ఆక్వా రంగం దెబ్బతినడం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. – కొర్లపాటి గోపి, రియల్టర్, అంబాజీపేట తీవ్రంగా నష్టపోతున్నాం ఆక్వా రంగం సంక్షోభం వల్ల తమకు వ్యాపారం లేక ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతున్నాం. ఇంజిన్ ఆయిల్, ఇంజన్ స్పేర్ పార్టులు, రేడియేటర్ సామాన్లు అమ్ముతుంటాను. ఈ ఏడాది సగానికి సగం అమ్మకాలు పడిపోయాయి. ఆక్వా సాగు అంతంత మాత్రంగానే జరుగుతుండటంతో వ్యాపారం లేక నష్టాల బారిన పడుతున్నాం. – ఆర్.మల్లీశ్వరరావు, వ్యాపారి, మురమళ్ల, ఐ.పోలవరం మండలం సంక్షోభంలో చిక్కుకుని ఇటుక పరిశ్రమ సంక్షోభంలో ఉంది. విక్రయాలు లేక గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇటుక తయారీ ఖర్చుకు, విక్రయ ధరకు పొంతన లేకపోయింది. ఇదే క్రమంలో ముడిసరకు కొరత తీవ్రంగా వేధిస్తోంది. – చల్లా ప్రభాకరరావు, ఇటుక పరిశ్రమ మండల సమాఖ్య అధ్యక్షుడు, ఆలమూరు ఆషాఢం అంతా అన్సీజనే ప్రస్తుత ఆషాఢ మాసంలో జీడిపప్పు వ్యాపారానికి అన్సీజన్. ఈ కాలంలో ఎక్కువ రేటులో ఉన్న జీడి గింజలతో వ్యాపారానికి చిన్న వ్యాపారులు చొరవ చూపడం లేదు. అలాగే ఈ కాలంలో మార్కెట్లో పప్పుకు డిమాండ్ తక్కువగా ఉంది. – జక్కంపూడి మాణిక్యాలరావు, జీడిపప్పు వ్యాపారి, మోరి, సఖినేటిపల్లి మండలం సంక్షోభంలో పచ్చని సీమ అన్ని రంగాల్లోనూ స్తంభించిన లావాదేవీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందిపై ప్రభావం -
ముంపు నివారణకు తక్షణ చర్యలు
● కలెక్టర్ మహేష్ కుమార్ ● ముంపు పొలాల పరిశీలన ఆత్రేయపురం: లొల్ల గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘అక్కడ అలా.. ఇక్కడ ఇలా..’ కథనానికి ఆయన స్పందించి జేసీ నైదియాదేవి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, డ్రైన్ల విభాగం ఈఈ కిశోర్లతో కలసి నీట మునిగిన పొలాలను పరిశీలించారు. సమస్యకు గల కారణాలను డ్రైన్స్ ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులు మాట్లాడుతూ రెండు రోజుల పాటు అమలాపురం బ్యాంక్ కాలువను లెవెల్ మట్టం తగ్గించాలని, శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. ఆ మేరకు కలెక్టర్ ఈఈని ఆదేశించారు. తాత్కాలికంగా ముంపు తగ్గించడానికి ఆది, సోమ, మంగళవారాల్లో నీటిమట్టం తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీవో జీవీవీ సత్యనారాయణ, స్థానిక తహసీల్దార్ ఆర్డీ రామచంద్రమూర్తి, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, ముంపు ప్రాంత రైతులు పాల్గొన్నారు. పూడిక తొలగింపు పరిశీలన అమలాపురం రూరల్: కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఆర్డీఓతో కలిసి ముక్కామల–ఈదరపల్లి రహదారి పరిధిలోని నడిపూడి వద్ద వంటకాలువలో చేపడుతున్న పూడిక, కలుపు తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సామాన్యుల ప్రాణాలకు భద్రత కరువు ● బాపట్ల మాజీ ఎంపీ నందిగం ● హత్యకు గురైన సాయి కుటుంబానికి పరామర్శ రావులపాలెం: రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదని బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రావులపాలెంలోని కొత్తకాలనీలో ఇటీవల హత్యకు గురైన అనే సాయి కుటుంబ సభ్యులను ఆయన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్తో కలసి బుధవారం పరామర్శించి సాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పి దండాలు పెట్టి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం నేడు దోచుకునే పనిలో బిజీగా ఉందని సురేష్ అన్నారు. రాష్ట్రంలో సామాన్యుల ప్రాణాలకు భద్రత లేదని, ఒకవేళ చనిపోతే వారి కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదన్నారు. ఎదురు తిరిగి ఏదైనా అడిగితే కేసులు పెడుతున్నారని, రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తున్నారని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వంగలపూడి బాబూరావు తదితరులు ఉన్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనకు కృషి చేయాలి సాక్షి, అమలాపురం: జిల్లాలో స్వర్ణాంధ్ర–2047 విజన్ లక్ష్య సాధనకు జిల్లా, మండల స్థాయి ఆర్థిక పురోభివృద్ధి, ప్రణాళికలు అత్యవసరమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ జీడీడీపీ, జీఎండీపీపై నిర్వహించిన సామార్థ్యాభివృద్ధి – శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక ప్రొఫెసర్, ఐదుగురు నిపుణుల బృందం ఈ శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి, విశ్వసనీయ గణాంకాలతో స్వర్ణాంధ్ర–2047 సాధనలో భాగస్వాములు కావాలని అధికారులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ వైఖోమ్ నైడియా దేవి, డీఆర్వో వి.సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వైరస్ వేళ.. నిర్లక్ష్యమేల!
చర్యలు తీసుకుంటున్నాం కరోనా అనుమానిత లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్సీలలో ఐదు బెడ్లు, సీహెచ్సీలలో పదేసి బెడ్లతో వార్డులు సిద్ధం చేస్తున్నాం. పరీక్షల కిట్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నాం. – కోమల, డీఎంహెచ్వో, తూర్పుగోదావరి సాక్షి, రాజమహేంద్రవరం: సమాజాన్ని అతలాకుతలం చేసి లక్షలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో అన్ని చోట్లా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో వస్తున్న వారికి పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించేసి చికిత్స అందిస్తున్నారు. అక్కడితో తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులిపేసుకుంటున్నారు. మహమ్మారి వైరస్ నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. ఎందుకు ఇలా.. జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న విషయాలను, వైరస్ సోకడానికి ముందు సంబంధిత వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారో అన్న విషయాలు అటు జనానికి, ఇటు మీడియాకు జీజీహెచ్ పెద్దలు తెలియజేయడం లేదు. వైరస్ సోకిన వారు ముందుగా ఎక్కడికి వెళ్లారో తెలిస్తే, ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానిత లక్షణాలతో బాధపడితే తక్షణమే అప్రమత్తమై పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఏమీ చెప్పకపోవడంతో చాలా మంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గు అని భావిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటువంటి వారు తీవ్రతను అంచనా వేయకపోతే పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. మరోవైపు ప్రభుత్వ అనుకూల మీడియాకు జీజీహెచ్ పెద్దలు లీకులిచ్చి మమ అనిపించేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్ వైద్యులు కరోనా తీవ్రతను తగ్గించి చూపుతున్నారని, కేసుల వివరాలు బహిరంగంగా వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరుకు చేరిన పాజిటివ్ కేసులు జిల్లాలో ఐదో వేవ్లో తొలిసారిగా ఈ నెల 19న రాజమహేంద్రవరం నగరంలోని ఓ యువకుడికి కరోనా సోకింది. 21న నిర్వహించిన పరీక్షల్లో మరో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారిలో గోపాలపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ కొద్ది రోజుల కిందట జీజీహెచ్లో ప్రసవించారు. ఆమెకు జ్వరం, జలుబు తగ్గకపోవడంతో కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కొంతమూరుకు చెందిన 54 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో రావడంతో పరీక్షించగా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం 8 మందిని పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని, వారంతా బొమ్మూరు, దేవీచౌక్, కంబాలచెరువు ప్రాంతాలకు చెందిన వారని జీజీహెచ్ అధికారులు తెలిపారు. అనుమానిత లక్షణాలతో ఓపీకి వచ్చిన వారిని పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యిందన్నారు.ఫ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఫ క్రమంగా పెరుగుతున్న కేసులు ఫ ప్రజలను అప్రమత్తం చేయని వైద్య, ఆరోగ్యశాఖ ఫ రోగులకు చికిత్సతో సరి -
వాడపల్లి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఆలయంలోని అభివృద్ధి పనులను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రానున్న ఐదేళ్లలో నిత్యం 3 లక్షల వరకు ఐదు లక్షల వరకు భక్తులు దర్శించే అవకాశం ఉన్నందున ఆ మేరకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న 2, 3 నెలల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో చర్చించి ప్రణాళిక రూపొందించాలన్నారు. తొలుత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో నిర్మించే ప్రసాదం, వసతి భవనం నిర్మాణానికి సీఎం 12 కోట్లు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆలయ అభివృద్ధిపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ నైడియాదేవి, ఏఎస్పీ మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడో రోజుకు చేరిన లేఖర్ల పెన్డౌన్ అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్లలో ప్రైవేటు సేవలను వ్యతిరేకిస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్డౌన్ నిరసన బుధవారం నాటికి మూడో రోజుకు చేరింది. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దాదాపు రెండు వేల మంది పనులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీనివల్ల రూ.కోట్లలో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించాయి. ఈ మేరకు రోజుకు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఈ నెల 1 నుంచి నిరసనలు చేపట్టిన దస్తావేజు లేఖర్లు దశల వారీ ఉద్యమంలో భాగంగా 20వ తేదీ నుంచి 31 వరకూ పెన్ డౌన్ చేపడుతున్నారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజులేఖర్లు బుధవారం మధ్యాహ్నం సహ పంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వద్దకు వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అమలాపురం దస్తావేజులేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్గోపాల్, సంయుక్త కార్యదర్శులు పెద్దిరెడ్డి దుర్గేష్, వెలుతురుపల్లి సుబ్బు, సంఘ ప్రతినిధులు గుమ్మడి సురేష్, యల్లమిల్లి సత్యనారాయణ, సిరిపల్లి మూర్తి తదితరులు పెన్ డౌన్ నిరసన చేపడుతున్నారు. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యునిగా అరిగెలఅమలాపురం టౌన్: రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా అంబాజీపేటకు చెందిన కోనసీమ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (కోకో ఫెడ్) చైర్మన్ అరిగెల బలరామమూర్తి నియమితులయ్యారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ చేతుల మీదుగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన ఈ నియామక ఉత్తర్వులను బుధవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కోకో ఫెడ్, డీసీఐసీ సభ్యుడు బీవీవీ సత్యనారాయణ, పలు వినియోగదారుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రేపు విద్యా సంస్థల బంద్ అమలాపురం టౌన్: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాఽ ద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టనున్న బంద్ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్ పిలుపునిచ్చారు. అమలాపురంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ నీట్ పేప ర్ లీక్ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 20 మంది వి ద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ తప్పిదం జరిగి దాదాపు మూడు నెలలు గడస్తున్నా ఆత్మహత్యలు చేసుకున్న 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిసేందుకు ఇప్పటి వరకూ ప్రయత్నించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోందని అన్నారు. -
అనధికార లే అవుట్లపై కొరడా
కాకినాడ రూరల్: అనధికార లేఅవుట్లపై కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (కౌడా) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లాలో మూడు రోజులుగా వాటిని ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారు. బుధవారం నాటికి తొడంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం కత్తిపూడి, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలలో సుమారు 22 నాన్ లే అవుట్లకు సంబంధించి సుమారు 80ఎకరాలలో రోడ్లు, నిర్మాణాలు ధ్వంసం చేశారు. వాటిలో ప్లాట్ల మధ్య ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. జిల్లాలో సుమారు 200కు పైగా అనధికార లే అవుట్లు ఉంటాయిని ప్రాథమిక అంచనాతో కౌడా అఽధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అనధికార లేఅవుట్ల తొలగింపు చర్యల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్లో మూడు బృందాలను ఏపీఓలతో ఏర్పాటు చేశారు. కాగా.. కౌడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులు మంజూరుకావన్నారు. విద్యుత్, నీరు, ప్లానింగ్ అనుమతులు లభించక కొనుగోలుదారులు నష్టపోతారన్నారు. -
దాతల పేర్లు తొలగించడం సరికాదు
పెదపూడి: జి.మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంపై ఏడు గుర్రాల రథం వద్ద గతంలో ఏర్పాటు చేసిన దాతల శిలాఫలకం, పేర్లు తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రముఖ దాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన అన్నయ్య, దివంగత నేత, మాజీ సర్పంచ్ ద్వారంపూడి అమ్మిరెడ్డి సుమారు 11 బిస్కెట్ల బంగారంతో కేజీ బరువుగల బంగారు కిరీటాన్ని తయారు చేయించి సూర్యనారాయణస్వామి మూల విగ్రహానికి అందజేశారన్నారు. తర్వాత 2016–17లో దేవస్థానానికి సంబంధించిన కమిటీ ప్రతినిధులు గోపురం ఎదురుగా ఏడు గుర్రాల మీద సూర్యనారాయణస్వామి ఉండే విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తనను అడిగారన్నారు. ఆ విగ్రహానికి సుమారు రూ.6.50 లక్షలు ఖర్చయ్యిందని, 2018 జనవరి 24న ప్రారంభించామన్నారు. దానిపై విగ్రహ దాత చింతపండు అమ్మిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి అని తన పేరు ముద్రించారన్నారు. అయితే ఆ పేర్లను గత సోమవారం రాత్రి స్థానిక టీడీపీ నేత గోపిరెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పల్లిపేటలో రూ.5 లక్షల ప్రభుత్వ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారన్నారు. దానికి దాత సూరారెడ్డి రూ.3.50 లక్షలు వెచ్చించారన్నారు. దీంతో ఆ భవనానికి దాత పేరు వేసుకున్నారన్నారు. దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చారన్నారు. మార్కెట్ సమీపంలో స్కూలు ఎప్పటినుంచో ఉందని, దానికి కొన్ని గదులు రెడ్డి బాబు నిర్మించారన్నారు. ఆ స్కూల్ పేరును ఆయన భార్య కాశిరత్నం పేరుగా మార్చేశారన్నారు. అయితే గ్రామ పంచాయతీ, ప్రభుత్వ నిధులతో నిర్మించిన రామాలయం వద్ద కాంప్లెక్స్కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తండ్రి మూలరెడ్డి పేరు ఎలా పెట్టారు అని ప్రశ్నించారు. ఫ టీడీపీ నాయకుల చర్యలు దారుణం ఫ విలేకరులతో ద్వారంపూడి వెంకటరెడ్డి -
లక్ష్మీ నృసింహునికి స్వాతి నక్షత్ర పూజలు
సఖినేటిపల్లి: అంతర్వేది ఆలయంలో లక్ష్మీ నృసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పి.రామశేషాచార్యులు, ఎస్బీఎం రమేష్ ఈ పూజలు చేశారు. తొలుత వశిష్ట గోదావరి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాల ప్రధాన కలశాలతో విశేష పూజలు చేశారు. వీటితో పాటు పంచామృతాలు, వేదమంత్రాల నడుమ స్వామివారికి విశేష అభిషేకం చేశారు. అలాగే ఆలయంలో విశేష కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఆలయ ఈవో ప్రసాద్ స్వామి వారి దర్శనం, తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదానాలను పర్యవేక్షించారు. అలాగే నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష పూర్తి చేసిన భక్తులు స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొని, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో ప్రసాద్ అంతరాలయంలో భక్తులకు స్వామివారి ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. -
లేఖర్ల ఉపాధి దెబ్బ తీయడం హేయం
అమలాపురం టౌన్: దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బ తీసేలా ప్రభుత్వం వ్యవహరించడం హేయమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు చేపట్టిన పెన్డౌన్ నిరసన శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దస్తావేజుల ప్రక్రియను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. దీనికోసం విడుదల చేసిన జీఓ–396ను తక్షణం రద్దు చేయాలని, లేఖర్లకు ఉపాధికి భరోసా కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్ల సమస్యలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, నాయకులు సుంకర లక్ష్మీ మణికుమారి, సుంకర సుధ, సూదా గణపతి తదితరులు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్గోపాల్, సంయుక్త కార్యదర్శులు పెద్దిరెడ్డి దుర్గేష్, వెలుతురుపల్లి సుబ్బు, గనిశెట్టి భోగిరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద లేఖర్లు పెన్డౌన్ నిరసనలు చేస్తున్నారు. -
సమర్థంగా భూ పరిపాలన సంస్కరణల అమలు
సాక్షి, అమలాపురం: భూ పరిపాలన సంస్కరణలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ, 22–ఎ కేసులను, రీ సర్వే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐదో దశ గ్రౌండ్ ట్రూతింగ్, ఈ–కేవైసీ రిపోర్టులు, నెలవారీ ప్రగతి నివేదికలపై చర్చించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ వి.సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ అచ్యుత కుమారి, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘తూర్పు’ డ్వామా ఏపీడీగా ఎంపీడీఓ నరేష్ కుమార్ కొత్తపేట: స్థానిక ఎంపీడీఓ పీఎస్ నరేష్ కుమార్కు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీఎల్డీఓ) పోస్టింగ్ను రద్దు చేసి, డ్వామా ఏపీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో ఆయనకు డీడీఓగా ఉద్యోగోన్నతి కల్పించి, పోలవరం జిల్లా చింతూరు డీఎల్డీఓగా నియమించింది. ప్రతి అధికారీ విధిగా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయాలనే నిబంధన ఉంది. నరేష్ కుమార్ గతంలో ఎటపాక ఎంపీడీఓగా పని చేయడంతో పాటు దేవీపట్నం మండలానికి అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా చింతూరు డీఎల్డీఓ పోస్టింగ్ను ప్రభుత్వం రద్దు చేసి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్లస్టర్ డ్వామా ఏపీడీగా నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం కొత్తపేట ఎంపీడీఓ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. రాజమహేంద్రవ రంలో డ్వామా ఏపీడీగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు నరేష్ కుమార్ తెలిపారు. రెగ్యులర్ ఆర్డీఓగా ధర్మరాజు అమలాపురం టౌన్: దాదాపు ఆరు నెలలుగా అమలాపురం ఆర్డీఓగా ఇద్దరు అధికారులు ఒకరి తర్వాత ఒకరు ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తెర దించుతూ డి.ధర్మరాజు రెగ్యులర్ ఆర్డీఓగా రానున్నారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్నారు. తాజాగా అమలాపురం ఆర్డీఓగా బదిలీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో ధర్మరాజు అమలాపురం ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ గతంలో కొత్త మాధవి రెగ్యులర్ ఆర్డీఓగా పని చేశారు. ఆమె బదిలీ అనంతరం జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.మమ్మీ ఇన్చార్జి ఆర్డీఓగా నియమితులయ్యారు. అనంతరం, రామచంద్రపురం ఆర్డీఓ సరళావతి అమలాపురం ఇన్చార్జి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిలకు ఫుల్స్టాప్ పెడుతూ ఎట్టకేలకు అమలాపురం రెగ్యులర్ ఆర్డీఓగా ధర్మరాజును నియమించారు. 6 కిలోల వెండి వస్తువుల అపహరణ తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు మార్కెట్ వీధిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వ్యాపారి అద్దేపల్లి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పూజ గదిలోని దేవుడి సామగ్రిని చిందరవందర చేశారు. బెడ్ రూములోని బీరువాను బద్దలుగొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుందని బాధితులు తెలిపారు. సినిమా చూసి ఇంటికి వచ్చిన సురేష్, కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై సత్యనారాయణ బృందం ఆ ఇంటిని పరిశీలించింది. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ చోరీతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రేపు జాబ్ మేళా సాక్షి, అమలాపురం: వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అమలాపురంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళా కు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడే టా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ఆ రోజు ఉదయం 10 గంటలకే జిల్లా ఉపాధి కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. వివరాలకు 89789 05032 నంబర్లో సంప్రదించాలని వహీదా కోరారు. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
సాక్షి, అమలాపురం: ముంచెత్తేసే భారీ వర్షాలు కొన్నాళ్లుగా దాదాపు ఎక్కడా లేవు. అయినప్పటికీ గోదావరి మధ్య డెల్టా పంట కాలువ ఎగువన ఉన్న ఆత్రేయపురం మండలం లొల్ల, ఆత్రేయపురం, వాడపల్లి గ్రామాల్లో నాట్లు వేసిన వరి చేలు నిండా మునిగిపోతున్నాయి. వర్షాలు కురవకపోయినా ముంపు నీరు దిగే అవకాశం లేక ఈ దుస్థితి తలెత్తింది. రోజుల తరబడి నీట మునగడంతో నాట్లు కుళ్లిపోయి, రైతులు నష్టపోతున్నారు. కాలువల్లో అక్రమ వంతెనలు, గట్ల ఆక్రమణల వల్ల నీరు సక్రమంగా పారక పొలాల్లోకి చేరుతోంది. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ హయాంలో మురుగు కాలువ ద్వారా నీరు దిగేందుకు పంట కాలువ మీద రెండుచోట్ల సైఫన్లు నిర్మించారు. వీటిని ఆధునీకరణ పేరుతో కొత్తగా రూ.2.90 కోట్లతో పునర్నిర్మించారు. విచిత్రంగా అవి కట్టిన తరువాత చేలు రెట్టింపు మునిగిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోయినా చేలు మునిగిపోవడం గమనార్హం. దీనికి భిన్నంగా కాలువ దిగువన అమలాపురం, కొత్తపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం మండలాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. పంట కాలువలకు నీరు ఇస్తున్నా శివారు, మెరక ప్రాంతాలకు చేరడం లేదు. చంద్రబాబు పాలనలో నీటి యాజమాన్యం ఘోరంగా విఫలమవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కోనసీమ రైతులు అల్లాడిపోతున్నారు. సాగునీటి నిర్వహణలో అధికారుల విఫలం చెందడంతో ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన కోనసీమ జిల్లాలో పొలాలు బీళ్లుగా మారే ప్రమాదముందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్లోజర్ పనుల పేరుతో ఇటీవల నియోజకవర్గానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల ఖర్చు చేసినా చేలకు నీరు అందడం లేదు. క్లోజర్ పనుల్లో అవినీతి, కాలువకు అడ్డంగా ఇష్టానుసారం నిర్మాణాల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. నేడు ప్రస్తుతం మధ్య డెల్టాకు 2,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో వరి సాగు లక్ష్యం 1,13,052 ఎకరాలు. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో సాగు పోగా సుమారు 90 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పుడు సాగవుతోందని అంచనా. దీని ప్రకారం 33 డ్యూటీ (33 ఎకరాలకు ఒక క్యూసెక్కు) చొప్పున సాగునీరు ఇస్తున్నారు. సాధారణంగా డెల్టాలో దమ్ములు, నాట్లు వేసిన సమయంలోను, చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడుతున్న దశలోను 100 డ్యూటీ చొప్పున నీరు ఇస్తారు. అటువంటిది ఇప్పుడు 33 డ్యూటీ చొప్పున మాత్రమే సాగు నీరు ఇస్తూండటంతో చేలు ఎండిపోతున్నాయి. జలవనరుల శాఖ అధికారుల వైఫల్యం.. కూటమి నేతలకు ముందుచూపు లేకపోవడం, నీటిసంఘాల చేతకానితనం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫ ఆత్రేయపురంలో ముంపులో వరి చేలు ఫ అమలాపురం మండలంలో ఎండిపోతున్న పరిస్థితి ఫ వానలు లేకున్నా ఎగువన మునక ఫ కాలువకు నీరిచ్చినా దిగువన ఎండుతున్న నారు ఫ నీటి యాజమాన్యంలో ప్రభుత్వం విఫలం ఫ మండిపడుతున్న రైతులు నాడు 2009–10లో రబీలో కేవలం 82 టీఎంసీల నీటితో మొత్తం సాగును గట్టెక్కించారు. అప్పుడు కూడా మధ్య డెల్టాకు కాటన్ బ్యారేజీ నుంచి అత్యధికంగా 1,400 క్యూసెక్కుల చొప్పున నీరందించేవారు. 2009 ఫిబ్రవరిలో చేలు పాలు పోసుకుంటున్న సమయంలో కాలువకు ఇచ్చిన నీరు 1,200 క్యూసెక్కులు మాత్రమే. కానీ, ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. మధ్య డెల్టాలో ఏకంగా 1.60 లక్షల ఎకరాల్లో రబీ పంట పండించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత, అప్పటి ఇరిగేషన్ అధికారుల ఉత్తమ నీటి యాజమాన్య విధానాలు, నీటి సంఘాల నిరంతర పర్యవేక్షణ దీనికి ప్రధాన కారణం. -
పూటకో అత్యాచారం, రోజుకో హత్య
అల్లవరం/ఉప్పలగుప్తం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. పూటకో అత్యాచారం, రోజుకో హత్య అన్నట్లుగా పరిస్థితి దిగజారిందని అన్నారు. సీ్త్రలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహిచారు. ప్లకార్డులు ధరించి చంద్రబాబు ప్రభుత్వం నశించాలని, సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆందోళన అనంతరం, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, సభ్యసమాజం తల దించుకునేలా ఇటీవల గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి, దారుణంగా కొట్టి, కాళ్లతో తన్నారన్నారు. బాధితురాలి నుంచి పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా టీడీపీ నాయకులకు వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని విమర్శించారు. ఓ మహిళపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల కేసు పెడితే, పోలీసులు అత్యంత దారుణంగా తిరిగి ఆమె పైనే కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియో వివాదం, గౌరవప్రదమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉంటూ బీఆర్ నాయుడు అక్రమ సంబంధ వ్యవహారాలు.. చంద్రబాబు రెడ్బుక్ పాలనలో మహిళల దుస్థితికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. ఒక్క బాధితురాలికై నా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు ఒడిగడుతున్న దుర్మార్గులు ఏమాత్రం భయం లేకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు ఒకలా, సామాన్యులకు మరోలా చట్టాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళకు రక్షణ కల్పించలేకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని అనురాధ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసిన వారు సాయంత్రానికి ఈ భూమి మీద ఉండరని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గతంలో ప్రగల్భాలు పలికారని విమర్శించారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేయడం అత్యంత దారుణం, బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరీదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జున్నూరి రామారావు, జున్నూరి వెంకటేశ్వరరావు, సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పీకే రావు, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకన్నాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి, ఆర్టీఐ జోన్–2 అధ్యక్షుడు కేటీ వర్మ, ఎస్ఈసీ సభ్యులు కాశి మునికుమారి, కుడుపూడి భరత్ భూషణం, వివిధ విభాగాల నాయకులు సరెళ్ల రామకృష్ణ, సుంకర మణికుమారి, చొల్లంగి సుబ్బిరామ్, గుత్తుల రాజు, షేక్ అబ్దుల్ ఖాదర్, సూదా గణపతి, పార్టీ పట్టణ, అల్లవరం, అంబాజీపేట మండలాల అధ్యక్షులు సంసాని చంద్రశేఖర్ (నాని), కొనుకు బాపూజీ, విత్తనాల శేఖర్, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు కొనుకు గౌతమి, మట్టా శైలజ, గూడపాటి రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు. ఫ కూటమి పాలనలో సీ్త్రలకు రక్షణ కరువు ఫ హోం మంత్రి రాజీనామా చేయాలి ఫ వైఎస్సార్ సీపీ నేత చింతా అనురాధ డిమాండ్ ఫ అఘాయిత్యాలపై అమలాపురంలో మహిళల నిరసన -
చెరువు.. పంటలకు చెరుపు
అయినవిల్లి: అధికారం అండతో టీడీపీ, జనసేన నాయకులు కొందరు అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, దీనివలన 400 ఎకరాల్లోని తమ వరి చేలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వివరాలివీ.. మండలంలోని నేదునూరు కుమ్మరి కాలువ(మురుగు కోడు)ను ఆనుకుని పదెకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి మత్స్యశాఖ అధికారులు గతంలో అనుమతి ఇచ్చారు. ఇదే అదునుగా కూటమి నేతలు మరో ఐదెకరాలకు పైగా చెరువులు తవ్వేస్తున్నారు. మంచినీటి చేపల చెరువులకు అనుమతి ఇవ్వగా ఉప్పునీటి రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, ఉప్పునీటి బోర్లు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉప్పునీటిలోనే రొయ్యల సాగు చేస్తారు. దీనివలన చుట్టుపక్కల భూములు కూడా ఉప్పుబారి, సాగుకు పనికిరాకుండా పోతాయని వారు వాపోతున్నారు. దీనిపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా అది వెకేట్ అవడంతో కూటమి నేతలు రొయ్యల చెరువులు తవ్వారని రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ 400 ఎకరాల భూముల నుంచి ఇక్కడి పంటబోదెల ద్వారానే ముంపు నీరు దిగాల్సి ఉంటుంది. ఈ సమస్యలపై కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వారు ఆశ్రయించారు. పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై మత్స్యశాఖ ఏఈ లోవరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. చెరువులు తవ్వుతున్న వారికి నోటీసులు ఇస్తామని, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.21ఎఎంపీ102: నేదునూరు చెరువు వద్ద వేసిన ఉప్పునీటి బోరు ఫ అక్రమంగా రొయ్యల చెరువు తవ్వకాలు ఫ కూటమి నేతలపై రైతుల ఆరోపణ ఫ 400 ఎకరాల వరి చేలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన -
సకాలంలో సాగునీరు అందించాలి
అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రతి పంటకు సకాలంలో సాగునీరు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో సాగునీటి పరిస్థితిపై సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలని స్పష్టం చేశారు. ప్రధాన పంట కాలువల వెంబడి పూడికతీత పనులను వేగవంతం చేయాలని, బ్రిడ్జిల వద్ద పేరుకుపోయిన బంకమట్టిని తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి రోజూ రెండు మండలాలను సందర్శించి, సాగునీటి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. తహసీల్దార్లు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మండల స్థాయి అధికారులు ప్రతి రోజూ మూడు గ్రామాలను సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట కాలువల్లో పూడిక, గురప్రుడెక్క, తూము, కలుపు మొక్కలు తదితర అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు. -
కూటమి వైఫల్యంతోనే రైతులకు అవస్థలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● ముంపు బారిన పడిన పొలాల పరిశీలన ఆత్రేయపురం: కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు లు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో ముంపు బా రిన పడిన పంట పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జి ల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుతో కలసి ఆత్రేయపురంలో పొలాల వద్ద విలేకరులతో మాట్లాడారు. గత వేసవిలో కాలువల్లో పూడికతీత వంటి అత్యవసర పనులు చేయకపోవడంతో ప్రస్తుతం సాగునీటి సరఫరా సంక్షోభం నెలకొందన్నారు. ఆత్రేయపురంలో ఇరిగేషన్ గట్టును ఆక్రమించి బ్రాందీ షాపు ఏ ర్పాటు చేశారని, జిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ప్ర భుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. మరమ్మతుల్లో అవినీతి జగ్గిరెడ్డి మాట్లాడుతూ వేసవిలో చేపట్టిన పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో పల్లపు భూములకు శాశ్వత పరిష్కారంగా ఇటీవల ప్రభుత్వం 2.90 కోట్లతో రెండు సైఫన్లు నిర్మించిందని, అయినా ముంపు సమస్య పరిష్కారం కాకపోవడానికి పనుల్లో జరిగిన అవినీతే ప్రధాన కారణమన్నారు. ఇక్కడ సుమారు 500 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి, రైతులతో ధర్నా చేస్తామన్నారు. గత సీజన్లో రూ.9 కోట్లను పనుల నిమిత్తం విడుదల చేసినట్లు ఇరిగేషన్ మంత్రి తెలియజేశారని, ఆ నిధులు ఏమయ్యాయో సమగ్ర విచారణ చేసి నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. వేణుగోపాలరావు మాట్లాడుతూ 2019లో ధవళేశ్వరం బ్యారేజీకి 50 కొత్త గేట్లు అమర్చినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారని, అది నిజం కాదని తెలిపారు. కేవలం గేట్లకు తారు పూసి పనులు చేసినట్లుగా దేశం నాయకులు బిల్లులు కాజేశారని, దీనిపై అప్పట్లో కొందరు అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగిందన్నారు. సమావేశంలో ఆత్రేయపురం మండల పరిషత్ అధ్యక్షురాలు కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిలువూరి రామకృష్ణంరాజు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎం.కృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కనుమూరి శ్రీనురాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు గొట్టుముక్కల గోపిరాజు, ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, కేత ఏడుకొండలు, దాట్ల సూర్యనారాయణరాజు, నాయకులు వేగేశ్న గోపి, సరెళ్ల పండు, మాధవరావు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో చెరగని ముద్ర
సాక్షి, రాజమహేంద్రవరం/ సీటీఆర్ఐ: కాపు జాతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతులు ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు అని వక్తలు కొనియాడారు. ఇటీవల కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు మృతి చెందడంతో వారికి సంస్మరణ సభను రాజమహేంద్రవరంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. వేలాది మంది ముద్రగడ, జీఎస్ రావు అభిమానులు తరలివచ్చారు. జై ముద్రగడ, జై వంగవీటి, జై జీఎస్ఆర్, జై జక్కంపూడి రామ్మోహన్రావు అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీలకు అతీతంగా ముద్రగడ, జీఎస్ రావు చిత్రపటాలకు నివాళుల ర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రాజకీయ మహోన్నతుడని కీర్తించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావులు సజీవంగా లేకపోయినా, వారి సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయినా కాపుల అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం పరితపించారని కొనియాడారు. జీఎస్ రావు నీతి, నిబద్ధత కలిగిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో ముద్రగడ సంస్మరణ సభ నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు కాపులకు అందిన రోజునే ముద్రగడ ఆత్మ శాంతిస్తుందన్నారు. వంగవీటి మోహనరంగా బతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవారన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం అని అన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తోట రామకృష్ణ, గిరజాల బాబు మాట్లాడారు. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నమ్మిన లక్ష్యం కోసం ముందుకు సాగిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం అని అన్నారు. గోదావరి జిల్లాల్లో పద్మనాభం కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభంజనంలోనూ జీఎస్ రావు గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ధ్రువతారలని కొనియాడారు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని కోల్పోయామన్నారు. సత్యం కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడినట్టు.. ఇచ్చిన మాట కోసం తీసుకున్న నిర్ణయాలకు ముద్రగడ కట్టుబడి ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముద్రగడ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు పోరాడతామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కులం కోసం అహర్నిశలు ముద్రగడ శ్రమించారన్నారు. ముద్రగడ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపు కార్పొరేషన్కు నిధులివ్వడం లేదు కాపు జేఏసీ నాయకుడు దాసరి రాము మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసినా అవినీతి మచ్చ లేకుండా ఉండటం సామాన్య విషయం కాదన్నారు. కాపు జాతికి ఆయన చేసిన సేవలను మరిచిపోకూడదన్నారు. జీఎస్ రావు కాపు జాతికి అనేక సేవలు అందించారన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి రూ.మూడు వేల కోట్లు ఇస్తామని చెప్పినా, రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. అడ్వకేట్ కన్నా రజిని మాట్లాడుతూ మన జాతిలోనే మనల్ని అణగదొక్కే శక్తులున్నాయన్నారు. జీవితాంతం కాపుల కోసం పరితపించిన ముద్రగడని పొగడకపోయినా పర్వాలేదు కానీ కులద్రోహిగా చిత్రీకరించొద్దన్నారు. ఆఖరి కోరిక తీర్చేందుకే అడ్డుకున్నాం ముద్రగడ పద్మనాభం చివరి రోజుల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నేటి నుంచి తాను వ్యక్తిగతంగా ముద్రగడ కాపు అని చెప్పుకొంటానన్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నా.. ముద్రగడ ఆఖరి కోరిక తీర్చేందుకే తాను, మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడు తూ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారని, కానీ కొంత మంది మాత్రమే మంచి కార్యక్రమాలు చేసి చిరంజీవులుగా మిగిలిపోతారన్నారు. అటువంటి వారిలో ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావు ఉన్నారన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా తరలివచ్చిన ఇంత మంది మనసులో వారు సజీవంగా ఉంటారన్నారు. ఫ కాపుల అభ్యున్నతికి ముద్రగడ ఎనలేని కృషి ఫ నీతి, నిబద్ధతకు నిదర్శనం జీఎస్ రావు ఫ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఫ నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల నాయకులు రిజర్వేషన్ కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ముద్రగడ, జీఎస్ రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే ముందుకు సాగుతామన్నారు. పార్టీలకు అతీతంగా రిజర్వేషన్ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాజమహేంద్రవరం కాపు సంఘం అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు, భీమవరం ఇన్చార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు, తాడేపల్లిగూడెం ఇన్చార్జి వడ్డి రఘురామ్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ పరిశీలకులు తోట రామకృష్ణ, గిరజాల బాబు, నాయకులు జెట్టి గురునాథం, యాళ్ల సురేష్, కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, ఆరేటి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా
అమలాపురం రూరల్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ జిల్లాలోని గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయతీలు గ్రేడ్లుగా మారిన నేపథ్యంలో తమ సేవలకు ప్రాధాన్యత కల్పించి అర్హత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ జీతాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా చెల్లించే విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు జేసీకి వైఖోం నైదియాదేవికి వారి సంఘ జిల్లా అధ్యక్షుడు గండ్రు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి వేమలరావు, ఉపాధ్యక్షుడు మోరం నాయుడు, గుత్తుల భైరవస్వామి, దాసరి రాజు, కోలం నాగ బాబు తదితరులు వినతిపత్రం అందించారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 44 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 44 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చి, వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. మహిళలపై దాడులను ఖండిస్తూ నేడు నిరసన అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరజా కుమారి అన్నారు. గుంటూరు, బద్వేలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు మహిళల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. వీటికి నిరసనగా అమలాపురం ఈదరపల్లి వంతెన సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు నిరసన కార్యకమం చేపడుతున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు. షైనింగ్ స్టార్లకు సత్కారం అమలాపురం రూరల్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, షైనింగ్ స్టార్లుగా ఎంపికై న విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 136 మంది పదో తరగతి, 30 మంది ఇంటర్ విద్యార్థులకు పతకం, ప్రశంసాపత్రం, రూ.20 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందించారు. దేవదాయ శాఖ నిధుల మళ్లింపు దురదృష్టకరం అల్లవరం: తల్లికి వందనం పథకం అమలు పేరిట వివిధ శాఖల నుంచి నిధులను మళ్లించడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. దేవదాయశాఖ నుంచి రూ. 26.03 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు ఇవ్వడం, బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని తల్లికి వందనం లబ్ధిదారులకు చెల్లింపుల కోసం నిధులు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు లు జారీ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మిగతా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ గణాంకాల ఆధారంగా 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 64.76 లక్షల మంది మాత్రమే తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెండో ఏడాది 22.65 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏడాదికి రూ.13,211.82 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.10,120 కోట్లకే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 24 న తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయునున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ చేపట్టాలని, ఇతర శాఖల నిధులు మళ్లించే విధానాన్ని మానుకోవాలని కోరారు. సిటిజన్ క్యూఆర్ కోడ్లతో పారదర్శక సేవలు అమలాపురం రూరల్: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ క్యూర్ కోడ్లను ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి అన్నారు. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లో సేవలు పొందిన అనంతరం క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ ఫీడ్బ్యాక్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 230 అర్జీలను ఆమె స్వీకరించారు. -
ఉపాధిపై వేటు
సాక్షి, అమలాపురం: ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ)ను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సీ పోర్టులు, మెడికల్ కాలేజీలు, రవాణా శాఖలో ఫిట్నెట్ సర్టిఫికెట్ల అందజేత వంటి వాటిని ప్రైవేటు పరం చేసింది. ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనివల్ల సబ్ రిజిస్టర్ కార్యాలయ వద్ద లేఖర్లుగా పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారనున్నారు. వివాదాస్పద జీవో సామాన్యుడి ఆస్తి భద్రతకు గ్యారంటీ అయిన రిజిస్ట్రేషన్ వ్యవస్థపై కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పంజా వేయనుంది. ఇందు కోసం రిజిస్ట్రేషన్ సేవలను, దస్తావేజుల తయారీ విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో 396 వివాదాస్పదమవుతోంది. దీనిని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో సుమారు 600 మంది వరకు లేఖర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, హెల్పర్లు, జిరాక్స్, స్టాంప్ పేపర్ విక్రేతలు నిరుద్యోగులుగా మారనున్నారు. తొలి దఫా జిల్లా కేంద్రాల్లో.. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి దశలో 26 జిల్లా కేంద్రాలు, రెండో దశలో 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరించే జాబితా ఖరారైంది. ఈ క్రమంలో తొలి దశలో అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రైవేట్ పరం కానుంది. తర్వాత దశల వారీగా రాజోలు, ముమ్మిడివరం, మలికిపురం, మామిడికుదురు, కాట్రేనికోన, రావులపాలెం, ఆలమూరు, పి.గన్నవరం, ఐ.పోలవరం, అత్రేయపురం, కొత్తపేట, రాజనగరం కలిపి మొత్తం 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు ఇప్పటికే ఆన్లైన్, కంప్యూటర్ పరిజ్ఞానం లేని రైతులు, మహిళలు ఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్కి వెళితే వారికి సహాయం చేసే లేఖర్లు ఉండరు. ప్రభుత్వం మాత్రం ఈ విధానం తీసుకురావడం వల్ల అవినీతి తగ్గుతుందని చెబుతోంది. ఇప్పటికే రవాణా శాఖలో ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లకు పడుతున్న ఇబ్బందులు తెలియనవి కావు. ఇదే పరిస్థితి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కూడా వస్తే ఇబ్బంది తప్పదని సామాన్యులంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ సమయంలో ఈ విధానం వల్ల ఈ రంగ మరింత దెబ్బతినే అవకాశముందని రియల్టర్ల భయపడుతున్నారు. దస్తావేజు లేఖర్ల పెన్డౌన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్డౌన్ చేపట్టారు. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, రావులపాలెం సహా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేశారు. రిజిస్ట్రేషన్ సేవలు, దస్తావేజుల తయారీని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని నాయకులు చెప్పారు. రిజిస్ట్రేషన్లు ప్రైవేటుపరం జీవో విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం పెరగనున్న భూ సంబంధిత అక్రమాలు! ఉపాధి కోల్పోనున్న లేఖర్లు జిల్లా వ్యాప్తంగా పెన్డౌన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ధర్నా సామాన్యులకు ఇబ్బంది రిజిస్ట్రేషన్ అంటే సామాన్యుడికి జీవితంలో ఒకటి రెండుసార్లు వచ్చే ప్రక్రియ. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలో ఫీజు కడితే రశీదు బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రైవేటీకరణ తర్వాత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పక్కన పెడితే సర్వీస్ ఛార్జి పేరుతో ప్రైవేట్ కంపెనీలు అదనపు వసూలుకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మీ –సేవ కేంద్రాల్లో చిన్న సర్టిఫికెట్కే రూ.వందలు వసూలు చేస్తున్న అనుభవం ఉంది. అలాగే రైతుల భూముల వివరాలు, పట్టాలు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ ప్రైవేట్ సర్వర్లలోకి వెళతాయి. హ్యాకింగ్, డేటా లీక్, దొంగ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు తప్పు జరిగితే సబ్ రిజిస్ట్రార్ ను ప్రశ్నించవచ్చు. ఆ పరిస్థితి ఇక ముందు ఉండదనే అనుమానాలున్నాయి.జిల్లాలో రెండే రిజిస్ట్రేషన్లు జిల్లాలోని 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధి లోని లేఖర్లందరూ ఏకతాటిపై నిలిచి సంఘ నిర్ణయాలకు కట్టుబడి నిరసనను విజయవంతం చేశా రు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు దా దాపు స్తంభించాయి. ఆత్రేయపురం కార్యాలయంలో 2 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగగా, మిగిలిన 14 కార్యాలయాలైన అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, ఆలమూరు, ఐ.పోలవరం, కొత్తపేట, మలికిపురం, మండపేట, మామిడికుదురు, ముమ్మిడివరం, ద్రాక్షారామం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలులో ఒక్కటి జరగలేదు. జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2గా నమోదైంది. -
కుటుంబానికి భారం కాకూడదని..
రావులపాలెం: అనారోగ్య కారణాలతో తల్లిని సక్రమంగా చూడలేకపోతున్నానని తీవ్రంగా బాధపడుతున్న ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, వృద్ధురాలైన తన తల్లి కుటుంబానికి భారం కాకూడదని భావించింది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి తన తల్లిని కాలువలోకి నెట్టివేసింది. ఆ తర్వాత ఆమె కూడా కాలువలోకి దూకేసింది. ఈ విషాద ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్ద ఆదివారం జరిగింది.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో మీసాల సూర్యవతి(60), సూర్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. సూర్యవతి తల్లి వాడపల్లి బూరమ్మ(80) కూడా వారి వద్దే ఉంటున్నారు. బూరమ్మ కుమారుడు కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సూర్యవతి కూడా ఇటీవల మోకాళ్లు, నడుము నొప్పితోపాటు వివిధ అనారోగ్యాలతో బాధపడుతోంది. అనారోగ్య కారణాలతో తల్లిని సరిగా చూడలేకపోతున్నానని సూర్యవతి ఆవేదనకు గురయ్యేది.వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని...తామిద్దరం కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన సూర్యవతి ఆదివారం ఉదయం తల్లి బూరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటూ చొప్పెల్లలోని ఇంటి నుంచి బయల్దేరింది. తల్లితో కలసి రావులపాలెం మండలం ఊబలంక గ్రామం వద్దకు చేరుకుంది. గ్రామంలోని పెద్ద వంతెనపైకి చేరుకుని తల్లిని కాల్వలోకి నెట్టేసింది. ఆ తర్వాత సూర్యవతి కూడా దూకేసింది. స్థానికులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సూర్యవతి మృతదేహం నీటిపై తేలడంతో ఒడ్డుకు చేర్చారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బూరమ్మ గల్లంతైంది. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బూరమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం ఎస్ఐ చంటి తెలిపారు. -
నేటి నుంచి దస్తావేజు లేఖర్ల పెన్డౌన్
అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్–396ని రద్దు చేయాలనే డిమాండుతో దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్డౌన్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దశల వారీ ఆందోళనల్లో భాగంగా ఈ నిరసన చేపడుతున్నారు. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దాదాపు 2 వేల మంది దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి వెలుతురుపల్లి సుబ్బు తదితరులు పట్టణ సీఐ పి.వీరబాబుకు, 1, 2 సబ్ రిజిస్ట్రార్లు ఆర్.శ్రీలక్ష్మి, పి.లక్ష్మణరాజులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ డిమాండుతో ఇప్పటికే దస్తావేజు లేఖర్లు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రెండు పర్యాయాలు ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెన్డౌన్ పిలుపు నేపథ్యంలో వారు సోమవారం నుంచి కక్షిదారులకు డాక్యుమెంటేషన్ చేయరు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎప్పటిలాగే జరుగుతుంది. అయితే, దస్తావేజు లేఖర్లు మాత్రం తమ విధులకు దూరంగా ఉంటారు. -
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యాన మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి 8 గంటలకు విశేష సేవల అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. స్వామివారికి రెండు జంటలు పంచామృతాభిషేకం నిర్వహించాయి. భక్త దంపతులు 33 మంది లఘున్యాస అభిషేకాలు జరిపారు. రెండు జంటలు గరిక పూజ నిర్వహించాయి. ఓ భక్తుడు ఉండాళ్ల పూజ జరిపారు. భక్త దంపతులు 14 మంది శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకున్నారు. ఆరుగురు చిన్నారులకు అన్నప్రాశన చేశారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వమించారు. నూతన వాహనాలకు 42 మంది భక్తులు పూజలు నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం 2,530 మంది స్వీకరించారు. అన్ని విభాగాల ద్వారా ఆలయానికి రూ.2,89,866 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
యమపాశాలై..
ఎగసిన అలలే..అల్లవరం/అంబాజీపేట: ఇటీవల జరిగిన వివాహ వేడుకలో వారందరూ ఎంతో ఆనందంగా గడిపారు. తమతమ ఇళ్లకు వెళ్లే ముందు సరదాగా ఎంజాయ్ చేద్దామని బీచ్కు వెళ్లారు. అక్కడ మృత్యుపాశాల్లా ఎగసిపడిన కడలి అలలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. అపార జలరాశిలో మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఓడలరేవు బీచ్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అప్పటి వరకూ ఆనందంగా గడిపి.. కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన సూదా అరవింద్ (23) సోదరి సత్యకు, మామిడికుదురు మండలానికి చెందిన దొడ్డా ఫణికృష్ణకు ఇటీవల వివాహం జరిగింది. వీరు అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంచాల షణ్ముఖ్ (17), కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల సాయి(22)తో పాటు మంచాల జ్ఞానేశ్వర్, మంచాల ప్రేమ్చంద్, మంచాల హర్షిత, మంచాల ప్రేమ్సాయి సరదాగా గడపాలని ఓడలరేవు బీచ్కు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. ఒకే బంధువర్గానికి చెందిన వీరందరూ తొలుత అమలాపురంలోని ఓ రెస్టారెంట్లో భోజనం ముగించుకుని మోటార్ సైకిళ్లపై బీచ్కు చేరుకున్నారు. ఓఎన్జీసీ టెర్మినల్ పశ్చిమ గేటుకు సమీపాన ఉన్న ఓఎన్జీసీ వెల్స్ వద్ద రెండు గ్రోయిన్ల మధ్య అరవింద్, షణ్ముఖ్, సాయి, జ్ఞానేశ్వర్, ప్రేమ్చంద్ కలసి ఉత్సాహంగా సముద్ర స్నానానికి దిగారు. సత్య, ఫణికృష్ణ, హర్షిత, ప్రేమ్సాయి ఒడ్డున ఉన్నారు. గ్రోయిన్లతో గోతులు పడి.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు గ్రోయిన్లకు బలంగా తాకుతూండటంతో ఆ గ్రోయిన్ల వద్ద అప్పటికే భారీ గోతులు ఏర్పడ్డాయి. స్నానానికి దిగిన ఐదుగురు యువకులకు ఆ విషయం తెలియలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎగసిపడిన బలమైన అలల ధాటికి ఆ ఐదుగురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కెరటాల తాకిడికి అరవింద్, షణ్ముఖ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మంచాల సాయి ఆచూకీ గల్లంతైంది. జ్ఞానేశ్వర్, ప్రేమ్చంద్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నామని, ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకులు సముద్రంలో మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా, సాయి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు మైరెన్ సీఐ మూర్తి, అల్లవరం ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. అరవింద్, షణ్ముఖ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉన్నత స్థానానికి వెళతాడనుకుంటే.. ఈ సంఘటనలో మృతుడు సూదా అరవింద్ కొత్తపేట మండలం బిళ్లకుర్రు పోస్టాఫీసులో బీపీఎంగా పని చేస్తున్నాడు. అంబాజీపేట మండలం మాచవరంలోని తన మేనమామ మంచాల వెంకటేశ్వరరావు ఇంటి నుంచి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తూండేవాడు. ఊహించని విధంగా అరవింద్ కడలి కెరటాలకు బలి కావడంతో అతడి సోదరి దొడ్డా సత్య కన్నీరుమున్నీయ్యారు. తన తండ్రికి కొడుకు అందివచ్చాడనే ఆనందం మిగలకుండానే తమ్ముడు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఆ కుటుంబానికి ఇక దిక్కెవరంటూ బంధువులు విలపించారు. అప్రమత్తతే మమ్మల్ని కాపాడింది అరవింద్, షణ్ముఖ్, సాయితో పాటుగా ప్రేమచంద్, నేను సముద్రంలో స్నానానికి దిగాం. గ్రోయిన్ల వద్ద లోతును గుర్తించలేకపోయాం. అందరం స్నానం చేస్తూండగా ఒక్కసారిగా వచ్చిన కెరటం వచ్చింది. అందరం ప్రమాదంలో పడ్డాం. నేను అప్రమత్తమయ్యాను. ప్రేమచంద్, నేను చెయ్యి చెయ్యీ పట్టుకుని మా ప్రాణాలను రక్షించుకున్నాం. సాయి కొట్టుకుని పోతూ కొంత దూరం వరకూ కనిపించాడు. – జ్ఞానేశ్వర్ కోల్కతా నిట్లో చేరాల్సి ఉంది మాచవరానికి చెందిన షణ్ముఖ్ (శ్రీరామ్) తండ్రి నాగబాబు హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్లో, తల్లి ఆర్బీఐలో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ పాసై కోల్కతా నిట్లో సీటు సాధించిన షణ్ముఖ్ త్వరలో ఆ సంస్థలో చేరాల్సి ఉంది. ఇంతలోనే వారి ఒక్కగానొక్క కొడుకు ఈ సంఘటనలో మృతి చెందాడనే వార్తను అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగంలో చేరుతాడనుకుంటే.. కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల శేషు పెద్ద కుమారుడు సాయి బీటెక్ పాసయ్యాడు. ఇటీవలే హైదరాబాద్లో ఓల్టాస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండు మూడు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే తమ కుమారుడిని కడలి ఎక్కడికో తీసుకుపోయిందని సాయి తల్లిదండ్రులు వంశీ, శేషు రోదించారు. సత్యసాయిబాబా తన కుటుంబానికి అన్యాయం చేయడని, తన బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడని తల్లి వంశీ కన్నీటిపర్యంతమయ్యారు. సాయితో పాటు సముద్ర స్నానానికి దిగిన అతడి సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫ ఇద్దరు యువకులను కబళించిన కడలి ఫ కానరాని మరొకరి ఆచూకీ ఫ ఓడలరేవు బీచ్లో విషాదం ఫ క్షేమంగా బయటపడిన మరో ఇద్దరు -
నేను చనిపోతే అమ్మకు దిక్కెవరు!
రావులపాలెం/ఆలమూరు: వృద్ధురాలైన ఆ తల్లిది ఓ విషాద గాథ. ముగ్గుబుట్ట వంటి తల.. ముడుతలు పడిన దేహం.. మూగతనం.. ముదిమి మీద పడిన వేళ ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఆయువు.. ఆమె కళ్ల ముందే అర్ధాంతరంగా తీరిపోయింది. చూసే దిక్కు లేక.. కుమార్తె పంచనచేరింది. ఆ కుమార్తెకూ వయస్సు మీద పడుతోంది.. అనారోగ్యం వేధిస్తోంది.. తన పనులే తాను చేసుకోలేని దుస్థితి వస్తోంది.. మరోవైపు తల్లి భారం తన పైనే పడింది.. తనకేమైనా జరిగితే అమ్మను ఎవరూ చూడరేమోనని మానసికంగా వేదన చెందింది. చనిపోతానని అంటూ ఉండేది. చివరకు అన్నంత పనీ చేసింది. తల్లిని తీసుకుని కాలువలో దూకి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటనలో కుమార్తె మృతి చెందగా.. వృద్ధురాలైన తల్లి ఆచూకీ గల్లంతైంది. రావులపాలెం మండలం ఊబలంకలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వారి స్వగ్రామమైన ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరిదీ విషాద గాథే చొప్పెల్ల గ్రామానికి చెందిన వాడపల్లి బూరమ్మ (80) మూగ. మాటలు రావు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు గతంలో చనిపోయాడు. దీంతో, బూరమ్మ మానసికంగా కృంగిపోయింది. బెంగ పెట్టుకుంది. చూసే దిక్కు లేకపోవడంతో గ్రామంలోని తన కుమార్తె మీసాల సూర్యవతి (60), అల్లుడు సూర్యనారాయణ ఇంటికి చేరింది. సూర్యవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమార్తె. పదేళ్ల కిందట రాజానగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు మృతి చెందాడు. అప్పటి నుంచీ ఆమె కూడా బెంగ పెట్టుకుని, తన ఆరోగ్యం గురించి పట్టించుకునేది కాదు. పైగా ఆమె నడుము, కాళ్ల నొప్పులతో బాధ పడుతోంది. కొద్ది రోజుల కిందట శస్త్రచికిత్స జరిగింది. అయినా ఆమెకు స్వస్థత చేకూరలేదు. ఈ నేపథ్యంలో తాను చనిపోతే తల్లిని ఎవరూ చూడరేమోనని సూర్యవతి కలత చెందేది. ఈ నేపథ్యంలోనే చనిపోవాలని నిర్ణయించుకుంది. తల్లిని వృద్ధాశ్రమంలో చేరుస్తానంటూ.. ఈ నేపథ్యంలో తల్లి బూరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటూ ఆమెను తీసుకుని సూర్యవతి ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రావులపాలెం మండలం ఊబలంక షిరిడీ సాయి గుడి వద్ద ఉన్న మెయిన్ వంతెన పైకి చేరుకుని, తొలుత తల్లిని ముక్తేశ్వరం బ్యాంక్ కాలువలోకి తోసేసింది. ఆ వెంటనే తాను కూడా దూకేసింది. గమనించిన స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగి, కొంత దూరం కొట్టుకుపోయారు. ప్రవాహ వేగం చూసి కాలువలో దిగడానికి స్థానికులు భయంతో వెనుకంజ వేశారు. దాదాపు కిలోమీటరు తరువాత సూర్యవతి పైకి తేలింది. దీంతో, గ్రామానికి చెందిన యువకుడు నడింపల్లి నాగసాయి ధైర్యం చేసి, కాలువలో దూకి ఆమెను ఒడ్డుకు చేర్చాడు. అయితే, అప్పటికే సూర్యవతి మృతి చెందింది. తాను చనిపోతే తన తల్లిని ఎవరు చూస్తారనే బెంగతో కాలువలో దూకి చనిపోతానని సూర్యవతి తరచూగా వాపోయేదంటూ ఆమె కుమార్తె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. పోలీసులు బూరమ్మ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫ కుమార్తెను చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు ఫ వృద్ధురాలైన తల్లికి ఎవరూ చూడరేమోనని కలత ఫ ఇద్దరూ కాలువలో దూకి తనువు చాలించాలని నిర్ణయం! ఫ కుమార్తె మృతి.. తల్లి ఆచూకీ గల్లంతు ఫ ఊబలంకలో సంఘటన.. చొప్పెల్లలో విషాదం -
యాప్యాతన
ఆలమూరు: తొలకరి వరి సాగు జిల్లా రైతుకు శరాఘాతంగా మారింది. ఓవైపు ఎల్నినో ప్రభావంతో ఇటు వర్షాలు లేక, ప్రభుత్వం సాగునీరు సక్రమంగా అందించక గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్లోనే నారుమడులు, పచ్చని పొలాలు ఎండిపోతున్న దుస్థితి. మరోవైపు ఎరువుల పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విధానం రైతులకు తలనొప్పిగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రేషన్ పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయడంతో రైతులు నానా హైరానా పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.29 లక్షల ఎకరాల్లో సుమారు 90 వేల మంది రైతులు ఖరీఫ్ వరి సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది ఎంటీయూ–1318, ఎంటీయూ–1153, 1156, స్వర్ణ వంటి రకాలు సాగు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం అన్ని రకాలూ కలిపి జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ప్రభుత్వం సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికీ కొన్నిచోట్ల నారుమళ్లు కూడా పడని పరిస్థితి. మరోవైపు నీరు అందుతున్న ప్రాంతాల్లో నారుమళ్లు, నాట్ల దశలో వరి సాగు ఉంది. ఈ తరుణంలో పంటకు ఎరువులు అవసరమని రైతులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఐఎంఎస్ – ఎయిమ్స్) యాప్ రైతులకు ఇబ్బందికరంగా మారింది. రేషన్ పద్ధతిలో.. మునుపెన్నడూ లేని విధంగా భూమిని బట్టి రేషన్ పద్ధతిలో కేజీల లెక్కల్లోనే ఎరువులు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాప్ ద్వారా రైతుకు ఎకరాకు యూరియా 90 కేజీలు (రెండు బస్తాలు), డీఏపీ 25 కేజీలు (అర బస్తా) మాత్రమే, అది కూడా మూడు విడతల్లో ఇవ్వాలని నిర్దేశించింది. రైతుకు 60 సెంట్ల భూమి ఉంటే 54 కేజీల యూరియా మాత్రమే ఇస్తారు. అదే రెండెకరాలు పైబడితే డీఏపీ అరబస్తా ఇస్తారు. ఎకరంలోపు ఉన్న రైతుకు డీఏపీ ఇవ్వబోమని వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చెప్పిస్తోంది. నారుమడి సమయంలోనే ఎరువుల కోసం ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూంటే పైరు ఎదిగే సమయంలో మరెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందేమోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో విసిగిపోతున్న వారు.. కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరలకు కొనుగోలు చేసి, సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాప్సోపాలు గతంలో రైతులు ఎరువుల దుకాణం లేదా సొసైటీ వద్దకు వెళ్లి తమకు కావాల్సిన ఎరువులు కొనుగోలు చేసుకుని, పంటకు వేసేవారు. కానీ, యూరియా, డీఏపీ వంటి ఎరువులపై ఇస్తున్న రాయితీల భారాన్ని తగ్గించుకునే లక్ష్యంతో కేంద్ర ఈ యాప్ను అమలులోకి తెచ్చింది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకేనని చెబుతోంది. ఈ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ పేరుతో అమలు చేస్తోంది. దీంతో, రైతులు ఈ యాప్ ద్వారానే ఎరువులు పొందాల్సి వస్తోంది. దీనికోసం వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. యాప్లో వివరాలన్నీ పొందుపరచాలి. తరువాతే సంబంధిత ఎరువులు పంపిణీ చేస్తున్నారు. కౌలు రైతులకై తే కౌలు గుర్తింపు కార్డులు లేదా భూ యజమాని అంగీకారం తప్పనిసరి చేసింది. దీంతో, ఈ–కేవైసీ చేయించుకున్న రైతులు తమకు కావాల్సిన ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. యాప్పై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు ఎరువుల కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఫ ఎరువుల కోసం రైతుల హైరానా ఫ యాప్తో సమయం వృథా ఫ కేజీల లెక్కలో విక్రయాలపై అసంతృప్తి పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఎటువంటి నిబంధనలు, యాప్తో సంబంధం లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలి. రేషన్ పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు దఫాలుగా ఎరువులు ఇవ్వడం వల్ల రైతుల సమయం వృథా అవుతోంది. – అడపా వీర్రాజు (పెదబాబు), పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, సంధిపూడి, ఆలమూరు మండలం కష్టంగా ఉంది యాప్ ద్వారా ఎరువులు పొందడం చాలా కష్టంగా ఉంది. ఎరువుల కోసం పొలం పనులు మానుకుని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాలంటే ఇబ్బందే. ఒక్కోసారి సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. – నెక్కంటి సూర్యప్రకాశరావు, రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకే రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నాం. ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టి అర్హులైన రైతులందరికీ అందజేస్తున్నాం. రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే సత్వరమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి. – ఎంవీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి, అమలాపురం -
షైనింగ్ స్టార్స్కు నేడు సత్కారం
అమలాపురం టౌన్: గత విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 136 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యా శాఖ సత్కరించనుంది. కలెక్టరేట్ సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఒక్కో విద్యార్థికి పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందించనున్నారు. డీఈఓ పి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. గత విద్యా సంవత్సరం వరకూ కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలు అందించేవారు. ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 64, ప్రైవేటు పాఠశాలల నుంచి 72 మంది చొప్పున విద్యార్థులకు ఈ పురస్కారాలు అందించనున్నారు. మొత్తం 47 మంది ఓసీ, 47 మంది బీసీ, 21 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ, ముగ్గురు సీడబ్ల్యూఎస్ఎన్ విభాగాల్లో ఈ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరితో పాటు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 30 మంది విద్యార్థులకు కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు. నేడు పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) – మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో యథావిధిగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, ఇతర వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ట్రీక్కుల మారి.. ఆత్రేయపురం: అధికారం తమదే అని అధికార పార్టీకి చెందిన నేత మండలంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అతను ఏం అధికారులు చూసిచూడనట్లుగా అసలు పట్టించుకోవట్లేదు. బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిపై గతంలో ప్రభుత్వం సోషల్ ఫారెస్ట్రీ ద్వారా పెంచిన చెట్లను అధికార పార్టీ నేత ఆదివారం భారీ యంత్రాల సాయంతో పట్టపగలు నరికివేస్తున్నప్పటికీ అధికారులు ఏమి పట్టించుకోలేదు. గతంలో కూడా అతడు తన వ్యాపారానికి అడ్డొస్తుందనే నెపంతో కొన్ని భారీ చెట్లను తొలగించారని స్థానికులు అంటున్నారు. ఇంత చేస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
ఓడలరేవు తీరంలో ముగ్గురు యువకుల గల్లంతు
ఓడలరేవు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓడలరేవు సముద్ర తీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించగా, మరొకరి ఆచూకీ ఇంకా దొరకలేదు. అంబాజీపేట మాచవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఆదివారం కావడంతో వారు సముద్ర స్నానానికి వచ్చారు. సముద్రంలో దిగిన కాసేపటికి అలల తాకిడికి వారు గల్లంతయ్యారు. దాంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ట్రక్కు ఆటో బోల్తా.. ఇద్దరి మృతి
ఉప్పలగుప్తం: పొట్టకూటికి వెళ్లి.. తిరిగి వస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎన్.కొత్తపల్లి చెందిన ట్రక్కు ఆటోలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు, వానపల్లిపాలేనికి చెందిన ఎనిమిది మంది కలిసి అల్లవరం మండలం సామంతకుర్రు చెరువులో చేపల పట్టుబడికి శనివారం వెళ్లా రు. పని ముగించుకుని స్వగ్రామాలకు అదే ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్.యానాం పంచాయతీ పరిధి అయితాబత్తులవారిపేట సమీపాన ఓ మలుపు వద్దకు వచ్చేసరికి వేగంగా వస్తున్న ట్రక్కు ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. ట్రక్కులో ఉన్నవారు పంట బోదె లోని ఊబిలో కూరుకుపోగా వారిపై ఆటో పడిపోయింది. దీంతో, ఊపిరాడక ఎన్.కొత్తపల్లికి చెందిన సంగాని శ్రీరామ రాజు (30), కొండిపర్తి లోకేష్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు అతి కష్టం మీద స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు రాజు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అతడికి ఇద్దరు సోదరులు. ముగ్గురినీ తల్లి కూలి పని చేసుకుంటూ పెంచి, వివాహం చేసింది. రాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు లోకేష్ అవివాహితుడు. తల్లి విదేశాల్లో మూడు నెలల క్రితం గుండెపోటుతో చనిపోవడంతో వానపల్లిపాలెంలో అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటున్నాడు. పది నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారని, ఇంతలోనే ఘోరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని మృతదేహాల వద్ద వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయుడు ముద్రగడ
● ఆయన స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిద్దాం ● సంతాప సభలో వైఎస్సార్ సీపీ నేతలు అమలాపురం టౌన్: ఉద్యమాల చరిత్రలో ముద్రగడ పద్మనాభం పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలు అన్నారు. ముద్రగడ ఉద్యమ స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యాన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన స్థానిక గడియారం స్తంభం వద్ద శనివారం ఉదయం ముద్రగడ సంతాప సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ, ఉద్యమాల పేరు చెబితే ఠక్కున గుర్తుకు వచ్చేది ముద్రగడ పేరేనని అన్నారు. ఆయన మరణం కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ తీరని లోటేనని అన్నారు. కాపులు, బీసీలు, ఎస్సీలు కలసి ఉండాలని ముద్రగడ ఆకాంక్షించే వారని గుర్తు చేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత సోమసుందరరెడ్డితో ముద్రగడ ఎంతో స్నేహంగా ఉండేవారని గుర్తు చేసుకుని జగ్గిరెడ్డి విలపించారు. ముద్రగడతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనను బాగా కుంగదీసిందని మాజీ మంత్రి విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్ఈసీ సభ్యులు కుడుపూడి బాబు, కుడుపూడి భరత్ భూషణ్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, కర్రి నాగిరెడ్డి, పాటి శివ, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, ఉప్పలగుప్తం, అల్లవరం జెడ్పీటీసీ సభ్యులు గెడ్డం సంపదరావు, కొనుకు గౌతమి, పార్టీ అమలాపురం పట్టణం, అల్లవరం మండల అధ్యక్షులు సంసాని బులినాని, కొనుకు బాపూజీ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, షేక్ అబ్దుల్ ఖాదర్, వంగా గిరిజా కుమారి, కాశి మునికుమారి, చీకట్ల కిషోర్, జిన్నూరి వెంకటేశ్వరరావు, ఉండ్రు వెంకటేష్, కముజు రమణ, విత్తనాల మూర్తి, మద్దింశెట్టి ప్రసాద్, చొల్లంగి సుబ్బిరామ్, దొమ్మేటి సత్యమోహన్, తోరం గౌతమ్ రాజా, కల్వకొలను ఉమ, దూడల ఫణి, కర్రి రాఘవ, కల్వకొలను బాబీ తదితరులు కూడా ప్రసంగించి, ముద్రగడకు ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ ఆత్మశాంతి కోసం నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ముద్రగడ అమర్ రహే, జోహార్లు అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినదించారు. -
న్నదాతను.. లా ముంచారు
అసాక్షి, అమలాపురం: జలవనరుల శాఖ అనుమతులు లేకుండా అభివృద్ధి పేరుతో చేపట్టిన అడ్డగోలు నిర్మాణాలు కోనసీమ రైతులకు శాపంగా మారాయి. నిన్నటి వరకూ ప్రధాన పంట కాలువలకు అడ్డంగా వంతెనలు, రోడ్లు నిర్మించడంతో 22 వేల ఎకరాల ఆయకట్టు రైతులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. వందల ఎకరాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. కాలువలను కుదించిన అభివృద్ధి అమలాపురం నడిపూడి లాకుల నుంచి చల్లపల్లి వర కూ ఉన్న ప్రధాన పంట కాలువ అడుగడుగునా కుదించుకుపోతోంది. 1996–97లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి మెట్ల సత్యనారాయణరావు కాలువ కుడిగట్టును ఆక్రమించి ఎన్టీఆర్ మార్గాన్ని నిర్మించారు. 2015–16లో అప్పటి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హయాంలో ఎడమ కాలువ గట్టును ఆక్రమించి బైపాస్ రోడ్డును విస్తరించారు. దీంతో 1:1.5 వెడల్పు ఉండాల్సిన కాలువ 1:1 రేషియోకు పడిపోయింది. ఫలితంగా శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. తాజాగా గత ఏడాది ఈ కాలువపై నడిపూడి లోకల్ వద్ద, ఈ ఏడాది అమలాపురం బైపాస్ రోడ్డులో, కామన్ గరువు బైపాస్ సమీపాన రెండేసి చొప్పున మొత్తం నాలుగు వంతెనలు నిర్మించారు. ఈ వంతెనల పిల్లర్లు కాలువ మధ్యలోకి రావడంతో ప్రవాహానికి తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో, కాలువలో గ్రావిటీ (వాలుకు ప్రవహించడం) పూర్తిగా పడిపోయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వంతెనల నిర్మాణానికి అడ్డంగా వేసిన మట్టికట్టలను తొలగించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనివల్ల అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం మండలాల్లోని పలు గ్రామాలు, ముమ్మిడివరం, అల్లవరం మండలాల పరిధిలోని శివారు గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ముక్కామల సమీపాన అయినవిల్లి మండలం నేదునూరు వద్ద జాతీయ రహదారి–216లో భాగంగా రోడ్డు కుంగిపోతున్న ప్రాంతంలో గత క్లోజర్ సమయంలో రివిట్మెంట్ పనులు ప్రారంభించారు. నీరు వదిలిన తర్వాత రెండో విడత రివిట్మెంట్ పనులు మొదలుపెట్టారు. ఈ పనులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో కాలువలకు నీరు ఇవ్వలేదు. దీంతో, శివారు ప్రాంతాలకు అందక మొత్తంగా 22 వేల ఎకరాల్లో సాగు ముప్పులో పడింది. అనుమతులు లేకుండానే.. డెల్టా కాలువ పరీవాహక ప్రాంతాల్లో ఏ నిర్మాణం చేపట్టినా జలవనరుల శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ప్రస్తుతం పలుచోట్ల వంతెనలు నిర్మిస్తున్న ఆర్అండ్బీ అధికారులు, ఎన్హెచ్ అధికారులు ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు. అది తప్పని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పైగా, ఎమ్మెల్యేల దన్ను ఉందనే ఉద్దేశంతో ఒంటెద్దు పోకడలు పోయారు. తద్వారా ఆయకట్టుకు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన ఒక జేఈ స్థాయి అధికారి ఎమ్మెల్యేకి ఎదురు చెప్పలేక గత వేసవిలో దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశమైంది. కాంట్రాక్టర్, రెవెన్యూ అధికారులపై మంత్రి చిందులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగులో నారు ఎండిపోవడానికి ప్రధాన కారణం జలవనరుల శాఖ నిర్లక్ష్యం. తమ అనుమతి లేకుండా ఆర్అండ్బీ, ఎన్హెచ్ అధికారులు కాలువల్లో నిర్మాణాలు చేపట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ పలు సందర్భాల్లో వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ అధికారుల్లో లెక్కలేనితనం నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం జరిపిన పర్యటనలోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. అయినప్పటికీ ఆయన ఇరిగేషన్ అధికారులను, ఈ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న సొత పార్టీ నేతలను వదిలేసి, ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులపై చిందులు తొక్కడం విచిత్రం. చేతుల కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు వెంటనే కాలువల్లో అడ్డంకులు తొలగించి, రైతులకు నీరందించాలని మంత్రి ఆదేశించారు. పంట కాలువలపై ఇష్టానుసారం నిర్మాణాలు వంతెనలు, రోడ్ల విస్తరణ జలవనరుల శాఖ అనుమతులు నిల్ అధికార పార్టీ నేతల అండతో కాంట్రాక్టర్లు, అధికారుల బరితెగింపు ఫలితంగానే కోనసీమలో ఎండుతున్న నారుమళ్లు అమలాపురంలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు ఏటా తప్పని నీటి కష్టాలు ఇక నుంచి ప్రతిసారీ ఇక్కట్లే.. అభివృద్ధి అంటే ఆనందరావు అని చెప్పుకొంటున్న అమలాపురం ఎమ్మెల్యే కనీస నియమ నిబంధనలు పాటించకుండా కాలువలపై ఇష్టానుసారం వంతెనలు నిర్మించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. వీటికి అనుమతులే కాదు, అంచనాలు కూడా లేవనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాలువలపై అక్రమ నిర్మాణాలు పెరుగుతాయని, ఆపై అడ్డుగోలు దోపిడీ జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాల వల్ల ఇప్పుడే కాదు.. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో అమలాపురం – చల్లపల్లి పంట కాలువ పరిధిలో రైతులు నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులే కారణమని రైతులు మండిపడుతున్నారు. భవిష్యత్తులోనూ అమలాపురం నియోజకవర్గంలో సాగుకు ఇలాంటి ఇక్కట్లే తప్పవని వారు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతుకు శాపం
అమలాపురం రూరల్: సాగునీటి ప్రభుత్వ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14,200 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆ నీరు శివారు ప్రాంతాలకు ఎందుకు చేరలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వేసవిలో కాలువల నిర్వహణ, పూడికలు, అడ్డంకుల తొలగింపు వంటి పనులను ప్రభుత్వం చేయనందువల్లనే ఖరీఫ్లో నీరు లేక నారుమళ్లు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మండలంలోని చిందాడ గరువులో నీరు లేక ఎండిపోయిన నారుమళ్లను పార్టీ నాయకులతో కలసి ఆయన శనివారం పరిశీలించారు. ఎండిన పంటబోదెలు, బీడుగా మరిన నారుమళ్లలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. రైతు మట్టా సువర్ణరాజుకు చెందిన ఆకుమడిని పరిశీలించి, ఆయన కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ నాలుగుసార్లు నారుమళ్లు వేసి, నష్టపోయానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖలో ఏం జరుగుతోందో మంత్రికే తెలీదా! ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, రైతులు సొంత డబ్బుతో పాటు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నారుమళ్లు వేసి, ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారని, కానీ ప్రభుత్వం అదునుకు సాగునీరు అందించకపోవడంతో వారి పెట్టుబడులు మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వయంగా కలెక్టర్ను కలసి, సాగునీరివ్వాలని వేడుకున్నా స్పందించలేదని విమర్శించారు. జలవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చివరి ఆయకట్టులోని పంటలు ఎలా ఎండిపోతున్నాయో పరిశీలించకుండా ప్రచార కార్యక్రమాలతో సరిపెట్టడం రైతులను అవమానించడమేనని అన్నారు. కాలువల్లో పనులకు ఎవరు అనుమతిచ్చారని మంత్రే స్వయంగా ప్రశ్నించడం చూస్తే తన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మే నెలలోనే అధికారులు అప్రమత్తమై కాలువల్లో మట్టి, అడ్డంకులు తొలగించి ఉంటే ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సైఫన్ నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా సరైన ప్రణాళిక లేక, అవినీతి కారణంగా ఒకచోట నీరు నిలిచి, మరోచోట చివరి ఆయకట్టుకు చేరకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) మాట్లాడుతూ, ఈ అంశంపై తాము ఎలాంటి రాజకీయాలూ చేయడం లేదని, రైతుల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఖరీఫ్లో గడచిన 60 సంవత్సరాల్లో వర్షాలకు మునిగి నారుమళ్లు దెబ్బ తిన్నాయి కానీ, కూటమి ప్రభుత్వ వైఫల్యంతో నీరందక నారుమళ్లు ఎండిబోవడం ఇదే తొలిసారని అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ అమలాపురం, రాజోలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరీదేవి కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ నేతలు పితాని బాలకృష్ణ, కాశీ మునికుమారి, కుడుపూడి భరత్ భూషణం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, కర్రి నాగిరెడ్డి, ఇందుకుకూరి శ్రీనివాసరాజు, వంగా గిరిజా కుమారి, సంసాని నాని, సలాది సతీష్, గుమాళ్ల సురేష్, కాశీ రామకృష్ణ, మాజీ సర్పంచ్ పొనకాల గణేష్, శీలం సాయిరామ్, రాయపరెడ్డి నాగు, శీలం సూరిబాబు, రాజులపూడి మురళీకృష్ణ, రంకిరెడ్డి శంకరం, గుమాళ్ల పెదబాబీ, మాదిరెడ్డి లోవరాజు, నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్, పోలమారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 14,200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఆ నీరు శివారుకు ఎందుకు చేరలేదు? వైఎస్సార్ సీపీ నేతల సూటిప్రశ్న చిందాడగరువులో ఎండిన నారుమళ్ల పరిశీలన -
జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ
రావులపాలెం: కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో అనుసంధానం చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం ఆవిష్కరించారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ యాప్ను రూపొందించారన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిరంతరాయంగా నీటి సరఫరా అధికారులకు కలెక్టర్ ఆదేశం అమలాపురం రూరల్: ఖరీఫ్ నేపథ్యంలో రైతులకు సాగునీరు, ప్రజలకు సురక్షిత తాగునీరు నిరంతరాయంగా అందేలా అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫ రా అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి కాలువలు, డ్రెయిన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఏఈలు, నీటి సంఘాల అధ్యక్షులు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి, సంయుక్త ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఆస్తులపై ఇతర శాఖలు చేపట్టే పనులను ఆర్డీఓ ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ ఆమోదించిన తర్వాతే ప్రారంభించాలని సూచించారు. కాలువలు, డ్రెయి న్లపై ఆక్రమణలను గుర్తించి, 15 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, ఆక్రమణదారులకు చట్టపరమైన నోటీసులు జారీ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలికిపురం, శంకరగుప్తం ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 600 ఎకరాల ఆక్రమణలపై తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి
అమలాపురం టౌన్: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్ల యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపాన ఉన్న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.ఎస్తేర్ రాణి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పాలకుల అసంబద్ధ విధానాల వల్ల కార్మికులు, విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు తదితర అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మలకా సుభాషిణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచండికొత్తపేట: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ కె.నాగమానస సూచించారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను, ప్రభుత్వ బాలురు, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్న బాలుడు కె.అఖిల్ (తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం) అనారోగ్యానికి గురై ఈ నెల 11న రాత్రి రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన సంఘటనపై ఆరా తీశారు. ఆ బాలుడు ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెబుతున్నారన్నారు. హాస్టల్లో 136 మంది బాలలకు 4 రూములు మాత్రమే ఉన్నాయన్నారు. రూముల సంఖ్య పెంచాలని సాంఘిక సంక్షేమ శాఖకు సూచించామన్నారు. వంటలో పామాయిల్ వాడవద్దని, అది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పారు. విద్య, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఆరోగ్య సిబ్బందితో కూడా డాక్టర్ మానస సమీక్షించారు. బాలికల హాస్టల్లోని పిల్లలు రోడ్డు మీదకు వస్తున్నారని, సరైన రక్షణ, పర్యవేక్షణ లేదంటూ ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో టాయిలెట్లు బాగోలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్, సీడీపీఓ ఎ.గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల నిరసనఅమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వీఎస్ దివాకర్ డిమాండ్ చేశారు. పన్నెండో పీఆర్సీని వెంటనే నియమించాలని, తక్షణం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. దివాకర్ మాట్లాడుతూ, బకాయిల విడుదల, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పనిశెట్టి దామోదర్లు మంత్రులతో చర్చలు జరిపారని చెప్పారు. పెండింగ్ డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, మహిళా ఉద్యోగులకు చైల్డ్కేర్ లీవ్ పెంపుదల, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల వర్తింపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కల్యాణ్, మున్సిపల్ ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్, వీఆర్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మద్దాల బాబూజీ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి
మాజీ ఎంపీ చింతా అనురాధఅల్లవరం: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలాపురం నియోజవర్గ వ్యాప్తంగా ఖరీఫ్ సాగు సంక్షోభంలో కూరుకుపోతోందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 అధ్యక్షురాలు చింతా అనురాధ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరందక వందలాది ఎకరాల్లో నారుమడులు బీటలు వారుతున్నాయని, శివారు ప్రాంతాల్లో నారుమడులు వేయక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. రైతుల పక్షాన నిలబడతామని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం, నేడు అదే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కాలువలకు సాగునీరు విడుదల చేసి 50 రోజులు కావస్తున్నా నేటికీ శివారు ప్రాంతాలకు నీరు చేరలేదని, ఖరీఫ్ సాగు చేయాలా లేక పంట విరామం ప్రకటించాలా అనే డైలమాలో రైతులు ఉన్నారని ఆమె అన్నారు. అభివృద్ధి పేరిట కాలువలపై వంతెనల నిర్మాణం, ముక్కామల – నడిపూడి లాకుల వరకూ రివిట్మెంట్ నిర్మాణంతో కాలువలను మూసివేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఈ అనాలోచిత నిర్ణయంతో సుమారు 20 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు ఏమీ పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని, కాంట్రాక్టర్ల గోడు తప్ప రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతుల పట్ల కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలువలపై అడ్డుకట్టలు తొలగించి, పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన పోరాడతామని అనురాధ హెచ్చరించారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి పోలీసు భద్రతఆత్రేయపురం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రానికి 26 మంది పోలీసులతో శాశ్వత భద్రత కల్పిస్తున్నట్లు ఆలయన ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ రాహుల్ మీనా చర్యలు తీసుకున్నారని శుక్రవారం విలేకర్లకు చెప్పారు. ఆలయానికి గణనీయంగా భక్తులు వస్తున్నందున ఈ చర్య తీసుకున్నారన్నారు. ఈ పోలీసులకు శాశ్వత ఆవాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి వీరికి లొల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. అనపర్తిలో అరాచక పాలనఅనపర్తి: కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రి వేళ టీడీపీ ఇన్చార్జి తన అనుచరులతో దాడులకు దిగుతూంటే.. వారిని పరామర్శిస్తానంటూ బీజేపీ ఇన్చార్జి పగటి వేళ ప్రత్యర్థుల ఇళ్ల పైకి దండయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల అనపర్తి మండలం రామవరంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడిన వారిని ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, గత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నియోజకవర్గాన్ని ఐదేళ్లు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రశాంతంగా పరిపాలిస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా కవరేజికి వెళ్లిన నొక్కు శ్రీను అనే విలేకరిపై కూడా దాడి చేసి, కంటి చూపు దెబ్బ తినేలా చేశారని, అలాగే, కోటిరెడ్డి, దళిత సామాజిక వర్గానికి చెందిన నందిక సత్యనారాయణను గాయపరిచారని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు తమ అనుచరులతో కలిసి నియోజకవర్గంలో పేట్రేగిపోతున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే కుట్రపూరితంగా అదే సమయానికి వస్తానని చెప్పి, మారణాయుధాలతో గుండాలను సిద్ధం చేశారని ఆరోపించారు. -
రామరామ.. నిండా ముంచి.. ఇప్పుడెందుకు డ్రామా?
సాక్షి, అమలాపురం: కొన్నాళ్లుగా సాగునీరు అందక జిల్లాలోని పలు మండలాల్లో ఖరీఫ్ నారుమళ్లు ఎండిపోతున్నాయి. కాలువల్లో చుక్క నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. శివారుకు నీరు అందించాలంటూ అధికార కూటమి పార్టీల నేతలే రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇంత జరుగుతూంటే స్పందించని అమాత్యుడికి ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లుంది. కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మోటార్ సైకిల్పై శుక్రవారం హడావుడిగా పర్యటించారు. అనంతరం, అమలాపురం కలెక్టరేట్లో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్ లాకుల వద్ద నీటి నిర్వహణను పర్యవేక్షించానని గొప్పగా చెప్పుకున్నారు. ప్రతి చుక్కా ఒడిసిపట్టి శివారుకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారికీ ఇప్పుడే మెలకువ మంత్రి సమీక్షలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దేవ వరప్రసాద్, దాట్ల బుచ్చిబాబు, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ఇన్నాళ్లూ ఎమ్మెల్యే పట్టించుకోనేలేదు. అటువంటిది మంత్రిని చూడగానే ఒక్కసారిగా మెలకువ వచ్చినట్టు.. తమతమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు గుర్తుకొచ్చాయి. క్లోజర్ పనుల పేరుతో కోట్ల దోపిడీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నీరు రావడం లేదంటూ గళమెత్తడం చూసి రైతులు నివ్వెరపోతున్నారు. గత వేసవిలో క్లోజర్ సమయంలో ప్రతి నియోజకవర్గంలో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల పనులు చేస్తున్నామని, చివరి ఆయకట్టుకు నీరందుతోందని అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే, వాస్తవానికి నీటిసంఘాల ముసుగులో తెలుగు తమ్ముళ్లు, కీలక నేతలు ఆ సొమ్ము గరిష్టంగా స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇంత ఖర్చు చేశామని చెప్పిన తరువాత కూడా కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండటంతోనే శివారుకు నీరందడం లేదని రైతులు ఎక్కడికక్కడ గగ్గోలు పెడుతున్నారంటేనే ఈ పనులు ఏవిధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగానే మధ్య డెల్టాకు 2,800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినా అది శివారు ప్రాంతాలకు చేరడం లేదు. మరోవైపు హైవే నిర్మాణంలో భాగంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులతో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం శోచనీయమని మంత్రే స్వయంగా అంగీకరించారు. కానీ, బాధ్యత తీసుకోవాల్సిన అధికారులను వదిలేసి కాంట్రాక్టర్పై చర్యలకు ఆదేశించారు. గత ప్రభుత్వంపై బురద జల్లుడు కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో నీటి యాజమాన్య వైఫల్యంపై సమీక్షించాల్సిన మంత్రి.. ఆ విషయం కన్నా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై బురద జల్లడానికే సమయం కేటాయించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ డెల్టాను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దీనికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు గొంతు కలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా ఇంకా గత ప్రభుత్వం పైనే నెపం వేస్తున్న తీరు చూసి రైతులు విస్తుపోతున్నారు. నారు ఎండిపోతూనే ఉంది అమలాపురం మండలం చిందాడగరువులో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి రైతు మట్టా సువర్ణరాజు 10 ప్యాకెట్ల విత్తనాలు కొని 20 రోజుల క్రితం నారుమడి వేశారు. నీరు లేకపోవడంతో నారు పూర్తిగా ఎండి, చచ్చిపోయింది. వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని ఆ రైతు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితే పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. ఎండిపోయిన నారును వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పలువురు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్లే ఇప్పుడు నీటి కొరత వచ్చిందని మంత్రి చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎప్పుడు పాలించినా రాష్ట్రంలో కరువు కాటకాలు సహజమనే విషయం ప్రజలకు తెలుసన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలంలోనూ కరువు లేదని, ఆ విషయాన్ని మంత్రి ముందు తెలుసుకోవాలని అన్నారు. ఆద్యంతం సమస్యల వెల్లువఆత్రేయపురం: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన ఆద్యంతం సమస్యలు వెల్లువెత్తాయి. ఆత్రేయపురం మండలం సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువపై బొబ్బర్లంక హెడ్ లాకుల నుంచి లొల్ల లాకుల వరకూటాయన శుక్రవారం మోటార్ సైకిల్పై పర్యటించారు. తొలుత పేరవరం పంపింగ్ స్కీమ్, కాలువను పరిశీలించారు. ఈ స్కీమ్ ద్వారా కూడా సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు చెప్పారు. సెంట్రల్ డెల్టా కాలువను పరిశీలిస్తూ ఉచ్చిలి వద్దకు వచ్చేసరికి అక్కడ పెద్ద సంఖ్యలో రైతులు వేచి ఉన్నారు. ఉచ్చిలి పంపింగ్ స్కీమ్ను మూతపడి ఏళ్లు గడుస్తున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉచ్చిలి, ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం గ్రామాల్లోని మెరక భూములకు సాగునీరు అందడం లేదని, ఈ స్కీమ్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ సమీపాన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రత్యక్షంగా చూపించారు. డ్రెయిన్లపై నిర్మాణాలు కూలిపోవడం, నీరు వెళ్లకపోవడాన్ని మంత్రి పరిశీలించారు. లొల్ల లాకులను పరిశీలించి, అధ్వానంగా ఉన్నాయని అంగీకరించారు. వీటి పునర్నిర్మాణ పనులను రూ.74 కోట్లు మంజూరు చేసి, త్వరలో ప్రారంభిస్తామని మీడియాకు చెప్పారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో బ్యాంకు కాలువను ఆనుకుని ఉన్న భూముల ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక రైతు నాయకుడు చిలువూరి రామలింగరాజు, లొల్ల గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. సెంట్రాల్ డెల్టాకు సంబంధించి వైడార్ సర్వే నిర్వహిస్తున్నామని, డీపీఆర్ తయారు చేసి, ఆధునీకరణకు చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. పలివెల లాకుల ఆధునీకరణకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. కార్యక్రమాల్లో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. బొబ్బర్లంక నుంచి మురమళ్ల వరకూ బైకుపై మంత్రి పర్యటన నీరున్న కాలువలు, లాకుల పరిశీలన ఎండిపోయిన నారుమడుల వైపు కన్నెత్తి కూడా చూడని వైనం -
ప్రతి కార్యకర్తతో అనుసంధానమే లక్ష్యం
● వైఎస్సార్ సీపీ నేతలు ● జగనన్న 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణఅమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పార్టీ నాయకత్వంతో అనుసంధానమయ్యేందుకే జగనన్న 2.0 సూపర్ యాప్ను అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు అన్నారు. జగనన్న 2.0 సూపర్ యాప్ క్యూఆర్ కోడ్ను ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్టినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, నియోజకవర్గ కో ఆర్టినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ముమ్మిడివరం), డాక్టర్ పినిపే శ్రీకాంత్ (అమలాపురం), పాముల రాజేశ్వరి (రాజోలు), గన్నవరపు శ్రీనివాసరావు (పి.గన్నవరం) శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాప్ వినియోగంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమాచార మార్పిడి, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు తదితర అన్ని అంశాలనూ ఈ యాప్ ద్వారా ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారని చెప్పారు. సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న అంశాలను కుట్రలు పన్ని ఇష్టం వచ్చినట్లు డిలీట్ చేస్తున్నారని, ఈ నేపథ్యంలో నే జగన్ 2.0 సూపర్ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. ఇందులో ప్రతి కార్యకర్తా తన అభిప్రాయం నిర్భయంగా చెప్పవచ్చన్నారు. ఇది పార్టీ యాప్ కాబట్టి, కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులు మాత్రమే ఇందులో ఉంటారన్నారు. దీనివలన ఎవరు పడితే వారు డిలీట్ చేసే అవకాశం ఉండదని చెప్పారు. ఈ యాప్ను ప్రతి కార్యకర్తా డౌన్లోడ్ చేసుకుని, తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. దీని ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నాయకులతో ప్రతి కార్యకర్తా అనుసంధానమవుతారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, దంగేటి రాంబాబు, సీఈసీ సభ్యుడు కుడుపూడి బాబు, నేతలు పీకే రావు, కుడుపూడి భరత్ భూషణం, ఆర్టీఐ విభాగం జోన్–2 అధ్యక్షుడు కొల్లు త్రినాథవర్మ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్గోపాల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మండలాల అధ్యక్షులు బద్రి బాబ్జీ, కొనుకు బాపూజీ, ఎంపీపీ శేషారావు, నియోజవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెంటనే సాగునీరు అందించాలి
● లేకుంటే ధవళేశ్వరంలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం ముట్టడి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరిక ● బిళ్లకుర్రు పంట కాలువ సందర్శన ● రైతులతో కలసి ఆందోళన కొత్తపేట: మండలంలోని వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు కాలువకు రెండు రోజుల్లో సాగునీరు అందించాలని, లేకుంటే ధవళేశ్వరంలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఎస్ఈతో ఫోనులో మాట్లాడి, సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు మొర పెట్టుకున్నా బిళ్లకుర్రు గ్రామ పరిధిలోని సుమారు వంద ఎకరాలకు సాగునీరు రాక, అక్కడి రైతులు ఈ నెల 6 నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ నెల 14న పురుగు మందు డబ్బా చేతపట్టి, ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు కాలువను పరిశీలించి, ఎగువన జేసీబీతో రెండు రోజులు పూడిక తీశారు. కానీ, కిందికి మాత్రం నీరు చేరలేదు. దీంతో, రైతులు శుక్రవారం మరోసారి బిళ్లకుర్రు నక్కావారిపేట వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన జగ్గిరెడ్డి.. బాధిత రైతులకు మద్దతు తెలిపారు. వారితో కలసి, కాలువలో కూర్చుని నిరసన తెలిపారు. వెంటనే సాగునీరివ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతూ కాలువలో మోటార్ సైకిల్ నడిపారు. ‘ఈ పాలకులు, అధికారులు మా చేలకు సాగునీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు స్పందిస్తేనే మాకు సాగునీరు వస్తుంది’ జగ్గిరెడ్డికి రైతులు తమ కష్టాలు విన్నవించుకున్నారు. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏటా రైతులు రబీలో సాగునీటి కష్టాలు ఎదుర్కొంటారని, అటువంటిది ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యంతో ఖరీఫ్లోనే నానా అగచాట్లూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి రైతు సదస్సులో సాగునీటిపై సీఎం చంద్రబాబు చెప్పిన మాటలకు, ఆచరణకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులు సాగునీటి కోసం పంట కాలువలో ఎండ్రిన్ బాటిల్ పట్టుకుని నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ఖరీఫ్లో అన్ని పంట కాలువల ద్వారా రోజుకు 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఉభయ గోదావరి జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సరిపోయేదని, అటువంటిది ఈసారి 14,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా, సరైన నిర్వహణ లేక పంట కాలువల నుంచి ఆ నీరు బోదెల్లోకి చేరడం లేదని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. వేసవిలో కాలువల మరమ్మతులు, పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులకు నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేటాయించినట్లు మంత్రులు ప్రకటించారని, వీటితో రైతులకు ఉపయోగపడే ఒక్క పనీ జరగలేదని, ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభంలో ఉన్న కొత్తపేట నియోజకవర్గంలోనే శివారు భూములకు నీరు పూర్తిగా అందడం లేదంటే.. ఇక కింది ప్రాంతాల రైతుల ఇబ్బందులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు. సాగునీరు ఇవ్వలేని పక్షంలో చెల్లించిన శిస్తుల మొత్తాన్ని ఆయా రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇద్దరు నీటిసంఘం డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేయడం కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినట్టేనని జగ్గిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాకర సర్వేశ్వరరావు, పార్టీ నేత గోలకోటి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మన కాయర్ బంగారం
● బ్రాండింగ్తో అంతర్జాతీయ మార్కెట్కు ఎదగాలి ● కాయర్ కాన్క్లేవ్లో నిపుణుల సూచన ● అనాతవరంలో ప్రారంభమైన రెండు రోజుల సదస్సు సాక్షి, అమలాపురం: ‘మన దేశంలో ఉత్పత్తి చేసే కాయర్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది చెట్టు నుంచి వస్తున్న బంగారం. అయితే, సరైన బ్రాండింగ్ లేక, అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన గుర్తింపు లభించడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత నాణ్యమైన ఉత్పత్తి తయారు చేయాలి. డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలి’ అని కాయర్ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు తెలిపారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రెండు రోజుల కాయర్ కాన్క్లేవ్–2026 గురువారం ప్రారంభమైంది. ఉద్యాన, ఎంఎస్ఎంఈ, మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రారంభించారు. తొలుత కాయర్ బోర్డు కార్యదర్శి ఎంఎస్ లక్ష్మీప్రియ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. తరువాత కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాయర్ రంగ నిపుణులు, నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, కాయర్ ఉత్పత్తుల తయారీ, ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై వివరించారు. గ్రామీణ ఉపాధి పెంపునకు కాయర్ పరిశ్రమ కీలకమని అన్నారు. ‘బ్రాండ్ కోనసీమ కాయర్‘ పేరుతో మార్కెటింగ్ చేపడితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.బ్రాండ్ కోనసీమతోనే అంతర్జాతీయ డిమాండ్ బ్రాండ్ కోనసీమను విస్తృతం చేస్తేనే జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ సాధ్యం. ఇక్కడ తయారయ్యే కాయర్ ఉత్పత్తులకు ఆ స్థాయి నాణ్యత ఉండాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలను రైతులు పండించాలి. ఉత్పత్తిదారుకు, ఉత్పత్తికి మధ్య ఉన్న అతి పెద్ద అంతరాన్ని ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – టీఎల్ఎన్ రావు, సైంటిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ -
ప్రభుత్వ నిర్వాకంతోనే క్రాప్ హాలిడే పరిస్థితి
అమలాపురం రూరల్: ప్రభుత్వం పంట కాలువలకు సకాలంలో నీరు అందించనందువల్లనే అమలాపురం నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామనే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. నడిపూడి ప్రధాన పంట కాలువపై అక్రమ బ్రిడ్జిల నిర్మాణాలను, చిందాడ గరువు వద్ద ఎండిపోయిన నారుమళ్లను వైఎస్సార్ సీపీ ఆర్టీఏ రాష్ట్ర జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లు త్రినాథ్వర్మతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మే 31 తర్వాత కాలువలకు నీరు విడుదల చేసినప్పటికీ, టెయిలెండ్, ఐల్యాండ్లకు అందకపోవడాని కి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ముక్కామల నుంచి నడిపూడి మీదుగా చల్లపల్లి వరకూ ఉన్న ప్రధాన పంట కాలువ మీద అనధికార వంతెనల నిర్మాణంలో కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఈ పనులు జాప్యం చేశారని, తద్వారా నీరందకుండా రైతుల నడ్డి విరిచారని ఆరోపించారు. అధికార కూటమికి చెందిన రైతు నాయకులు కలెక్టరేట్, ఇరిగేషన్ డీఈఈ కార్యాలయాల వద్ద ధర్నా చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. సాగునీరు 46 రోజుల తర్వాత ఇవ్వడం వల్ల చివరిలో వచ్చే ప్రకృతి విపత్తులకు పంట చేతికందే పరిస్థితి ఉండదని, అందువల్లనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, ఉప్పలగుప్తం మండలం కూనవరం సముద్రం మొగలు మూసుకుపోతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని త్రినాథ్వర్మ డిమాండ్ చేశారు. తునిలో పట్టాలు తప్పిన గూడ్స్తుని: విశాఖపట్నం నుంచి నిడమనూరుకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలు వ్యాగన్ తునిలో గురువారం రాత్రి పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం – విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీఆర్పీ ఎస్సై సత్తిబాబు, స్టేషన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ గూడ్స్ రైలుకు తుని రైల్వే స్టేషన్లో లూప్ లైన్కు సిగ్నల్ ఇచ్చారు. రాత్రి 9.30 గంటలకు 17వ నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో సగం బోగీలు తాండవ బ్రిడ్జిపై ఉండిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే గరీబ్రథ్, మచిలీపట్నం, రాయగడ, ప్రత్యేక రైళ్లను అధికారులు అనకాపల్లి జిల్లా పరిధిలోని స్టేషన్లలో నిలిపివేశారు. తాండవ బ్రిడ్జిపై ఉండిపోయిన బోగీలను వేరే ఇంజిన్తో అనకాపల్లి జిల్లా గుల్లిపాడు రైల్వే స్టేషన్కు తరలించారు. పట్టాలు తప్పిన వ్యాగన్ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంతో విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగంలో దళితులకు అన్యాయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ● సాయి కుటుంబ సభ్యులకు పరామర్శ ● పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ రావులపాలెం: దళిత యువకుడు ఆనే సాయి దారుణ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక కొత్త కాలనీలో సాయి కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంజాయి మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా ఈ హత్యకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సాయిని ఇంటి నుంచి బయటకు పిలిచి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పదేపదే కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకూ కేవలం ఒక్కరి పైనే కేసు నమోదు చేశారని, మిగిలిన అనుమానితులను వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇంతటి ఘోరమైన హత్యను ఒక్క వ్యక్తి చేయడం సాధ్యమేనా అనే సందేహానికి పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ధనికులు, పలుకుబడి ఉన్నవారి విషయంలో ఒకలా, సామాన్యులకు మరోలా చట్టం అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించే ఈ కేసు దర్యాప్తును ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమగ్రంగా చేపట్టాలని, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఎస్పీని కలుస్తానని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని జగ్గిరెడ్డి చెప్పారు. -
ముద్రగడ మృతి కాపు ఉద్యమాలకు తీరని లోటు
అమలాపురం టౌన్: ముద్రగడ పద్మనాభం నీతి, నిజాయితీలకు, సమున్నత విలువలకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన మృతి కాపు ఉద్యమాలకు తీరని లోటు అని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి అన్నారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో గురువారం జరిగిన ముద్రగడ సంతాప సభలో ఆయన మాట్లాడారు. తొలుత దివంగత పద్మనాభం చిత్రపటానికి కాపు నేతలు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకూ నిలిచిన అరుదైన కాపు నేత పద్మనాభమని కొనియాడారు. కాపుల అభ్యున్నతి కోసం అహర్నిశలూ పోరాడారంటూ ఆయనతో కలసి ఉద్యమ పథంలో అడుగులు వేసిన కోనసీమ నేతలు తమ ప్రసంగాల్లో కన్నీరు పెట్టుకున్నారు. విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోనసీమ కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ. నల్లా పవన్ కుమార్, దివంగత నల్లా సూర్యచంద్రరావు కుమారులు అజయ్, సంజయ్తో పాటు సూదా గణపతి, నల్లా శ్రీధర్, తిక్కిరెడ్డి నేతాజీ తదితరులు ముద్రగడ ఉద్యమాల గురించి ప్రసంగించారు. త్వరలోనే గడియారం స్తంభం సెంటర్లో మరోసారి ముద్రగడ సంతాప సభ నిర్వహించి దాదాపు వెయ్యి మంది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తామని విష్ణుమూర్తి ప్రకటించారు. -
అంతర్జాతీయ డిమాండుకు తగినట్టుగా..
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా కాయర్ పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చు. ప్రస్తుతం కేరళంలో వ్యాపారులు, పీచు ఉత్పత్తిదారులు ఇదే వ్యూహం అవలంబిస్తున్నారు. కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఇక్కడ క్రాప్ విధానం చాలా తేడా. కొబ్బరి దిగుబడి, కాయ సైజు అన్నీ వేరుగా ఉన్నందున, కాయర్ ఉత్పత్తులను తగిన విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. నీడిల్ఫెల్ట్కు యూరప్లో మంచి డిమాండ్ ఉంది. – అజిత్ మాథ్యూ, కాయర్ స్ట్రాటజిక్ టెక్నికల్ పార్టనర్ కన్సల్టెంట్, కేరళం -
కాయర్తో మమేకమవ్వాలి
కాయర్ పరిశ్రమతో రైతులు, ఉత్పత్తిదారులు మమేకమవ్వాలి. అప్పుడే నాణ్యమైన ఉత్పత్తి, అందుకు తగిన ధర వస్తాయి. అంతర్జాతీయ పోటీకి తట్టుకుని నిలబడతాం. కేరళంలో సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీనిని కోనసీమలో కూడా అమలు చేయాలి. కేరళం ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో కాయర్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఆవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఈ పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అవసరం. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకు రావాలి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గేకొద్దీ కాయర్ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుంది. కొబ్బరి పొట్టు, కాయర్ ఫైబర్, జియో టెక్స్టైల్, కాయర్ కంపోస్ట్, యాక్టివేటెడ్ కార్బన్కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు అనుబంధ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ మార్కెట్లో మన కాయర్కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికా, చైనా దేశాల్లో వినియోగం పెరుగుతోంది. మన దేశం నుంచి చైనాకు పెద్ద ఎత్తున కాయర్ ఫైబర్ ఎగుమతి అవుతోంది. ఆటోమొబైల్, ఫైబర్ ఆధారిత పరిశ్రమల్లో వీటి వినియోగం పెరుగుతోంది. యాక్టివేటెడ్ కార్బన్కు ఇటీవల మంచి డిమాండ్ పెరిగింది. వైద్య, ఔషధ, నీటిశుద్ధి రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సుమారు రూ.5 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఆధునిక యంత్రాలు, సాంకేతికతతో నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలు సాధించి మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుంది. – సమీర్ కృష్ణ, డైరెక్టర్, కేరళం కాయర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ -
జడలు విప్పుతున్న మహమ్మారి!
ఆరేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించి.. కోట్లాది మంది ప్రాణాలను బలిగొని, ఎంతో మందిని దిక్కు లేనివారిని చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాజాగా కోవిడ్ కేసులు నమోదవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.● నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు ● వైఎస్సార్ జిల్లాలో 8 కేసులు ● వారిలో ఇద్దరి మృతి ● తిరుపతి, విశాఖ, మంగళగిరిలోనూ బాధితులు ● తాజాగా గొల్లప్రోలులో బాలిక మృతి ● ఆందోళన వద్దంటున్న వైద్యులు ● అప్రమత్తంగా ఉండాలని సూచనసాక్షి, అమలాపురం: కరోనా మహమ్మారి మిగిల్చిన గాయాలు ఇంకా మానలేదు. ఆరేళ్ల కిందట కుదిపేసిన ఈ మహమ్మారి.. మానవ సంబంధాలను చిన్నాభిన్నం, ప్రశ్నార్థకం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు.. కుటుంబ ఆధారాన్ని కోల్పోయి, దీనులుగా మిగిలిన వారు.. ఇలా కరోనా రక్కసి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ కరోనా జాడలు కనిపిస్తూండటం అందరినీ కలవరపరుస్తోంది. అటు మొన్న వైఎస్సార్ జిల్లా కడపలో 8 కోవిడ్ కేసులు వెలుగు చూడగా, వారిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తాజాగా విశాఖ నగరంలో 33 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్న అతడికి ప్రైవేటు ల్యాబ్తో పాటు అక్కడి కేజీహెచ్ ల్యాబ్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మంగళగిరిలో సైతం కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పొరుగున ఉన్న కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన పదహారేళ్ల బాలిక వెల్లూరు ఆసుపత్రిలో బుధవారం మృతి చెందడం కలవరం రేపుతోంది. దీంతో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకూ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదు. కానీ, చాలామంది ఈ లక్షణాలతో బాధ పడుతున్నట్లు సమాచారం. వీరు వైద్య పరీక్షలకు వెళ్లకపోవడంతో కేసులు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే, కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు కానీ, అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీరికి మరింత జాగ్రత్త అవసరం సాధారణ వ్యక్తులకు కోవిడ్ వస్తే స్వల్ప జ్వరం, జలుబుతో తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఊపిరిత్తులు, గుండె బలహీనంగా ఉన్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులకు దారి తీసే ప్రమాదం ఉంది. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ తీవ్రత తగ్గింది. కానీ, కొన్ని వర్గాలకు మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా, బ్రాంకై టిస్, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ బాధితులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుందా? కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్, కొందరు బూస్టర్ కూడా తీసుకున్నట్లు తేలింది. అయితే, టీకా వేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుందే తప్ప, వైరస్ అస్సలు సోకదని చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2020–22 మధ్య కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ సైతం విధించింది. అప్పట్లో కోవిడ్ నియంత్రణకు నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పటిష్ట చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, వైరస్ కట్టడికి కృషి చేసింది. నాడు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కోవిడ్ నియంత్రణకు ఎంతో దోహదపడింది. వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను వెంటవెంటనే గుర్తించారు. పెద్ద ఎత్తున కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ల్యాబ్లను సిద్ధం చేసింది. ఆక్సిజన్ సౌకర్యంతో వేలాదిగా పడకలను అందుబాటులోకి తెచ్చింది. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు.. వాటిలో ఉన్న బాధితులకు పౌష్టికాహారం, మందులు సైతం ఉచితంగా అందించి త్వరగా కోలుకునేందుకు తోడ్పాటునందించింది. కోవిడ్తో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం నాడు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. వీటన్నింటితో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ విజయవంతంగా అందించింది. ప్రస్తుతం కరోనా జాడలు కనిపిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అప్రమత్తం కావాల్సి ఉంది. కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు, ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచాలి. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.వైరస్ కట్టడికి నాడు జగన్ ప్రభుత్వం చర్యలుఈ జాగ్రత్తలు మేలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. సొంత వైద్యం వద్దు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి. రద్దీ ప్రాంతాలు, ఇండోర్ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, చిన్న పిల్లలు ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయి 94 కంటే తగ్గిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికారులు
కొత్తపేట: రైతుల ఆందోళనతో ఇరిగేషన్ అధికారులు దిగి వచ్చారు. వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధి యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో సంబంధిత రైతులు కనీసం నారుమళ్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రైతులు ఈ నెల 6న, మంగళవారం నక్కావారిపేట వద్ద కాలువలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. వీటిపై ‘సాక్షి’ ఆయా సందర్భాల్లో వార్తా కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ డి.చిన్నబాబు, ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ కె.వెంకటేశ్వరరావు, డీఈ కె.శ్రీరామ జనార్దనరావు, జేఈ వి.ప్రసన్న మాధవ్, నీటిసంఘం అధ్యక్షుడు బండారు వీరబాబు, రైతు సంఘం అధ్యక్షుడు చోడపనీడి భాస్కరరావు వాడపాలెం ఓల్డ్ చానల్ను పనసలదొడ్డి ప్రాంతంలో బుధవారం పరిశీలించారు. కాలువ ఆక్రమణలకు గురై కుచించుకుపోయిందని, మెరక అయ్యిందని, అనధికారిక తూరలున్నాయని గుర్తించారు. తక్షణం ఈ సమస్యలు పరిష్కరించి, రెండు మూడు రోజుల్లో శివారు ఆయకట్టుకు సాగునీరు అందించాలని స్థానిక అధికారులకు, నీటి సంఘానికి సూచించారు. ఆ మేరకు యుద్ధప్రాతిపదికన ఈ పనులు ప్రారంభించారు. -
పీచే కదా అని పారేయొద్దు
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో కొబ్బరికి కేరాఫ్ అడ్రస్గా గోదావరి జిల్లాలు నిలుస్తాయి. కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులు అనగానే క్వాయర్(పీచు)తో తయారు చేసే వస్తువులే గుర్తుకు వస్తాయి. అందుకే వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ కార్యక్రమం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోనసీమ జిల్లా నుంచి కొబ్బరి, క్వాయర్ను ఎంపిక చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలంటే ఎంతో కొంత క్వాయర్ పరిశ్రమలే కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి పీచు ఉత్పత్తి, తాళ్ల తయారీ, కొబ్బరి పొట్టు, పొట్టుతో ఇటుకల తయారీకే పరిమితమయ్యాయి. దీనివల్ల క్వాయర్ రంగం తరచూ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. దీనిని అధిగమించేందుకు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ప్రాథమిక దశలోనే.. రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనే 1.30 లక్షల ఎకరాల్లో దీని సాగు ఉంది. మరో 30 వేల ఎకరాలకు సరిపడా చెట్లు కాలువలు, ఇళ్లు, చెరువుల చుట్టూ ఉన్నాయి. ఏడాదికి సగటున 112 కోట్ల కాయల దిగుబడి వస్తూండగా, స్థానిక అవసరాలకు పోనూ 95 కోట్ల కాయలు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో 70 శాతం స్థానికంగా ఒలిచి, ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో క్వాయర్ పరిశ్రమ ఇంకా ప్రాథమిక దశను దాటలేదు. దేశం నుంచి గత ఏడాది సుమారు 13.43 లక్షల టన్నుల క్వాయర్ ఉత్పత్తులు ఎగుమతి కాగా, అత్యధిక వాటా తమిళనాడు, కేరళ రాష్ట్రాలదే. మన రాష్ట్రం వాట 10 శాతం కూడా ఉండదని స్థానికులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఏటా లక్షల టన్నుల కొబ్బరి డొక్కలు అందుబాటులోకి వస్తున్నా వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలు లేక రైతులు ఆశించిన ఆదాయం పొందలేకపోతున్నారు. పది కిలోల కొబ్బరి డొక్క నుంచి 3 కిలోల క్వాయర్ పీచు, 6.5 కిలోల కోకోపీట్ లభిస్తుంది. ప్రస్తుతం పీచు కిలో రూ.10 నుంచి రూ.16, కోకోపీట్ కిలో రూ.8 నుంచి రూ.15 పలుకుతోంది. విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే దీని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. గతంలో మామిడికుదురు కేంద్రంగా క్వాయర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే, క్వాయర్ బోర్డు, పరిశ్రమల శాఖ నుంచి ఆశించిన స్థాయిలో చేయూత లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.నేడు క్వాయర్ కాన్క్లేవ్ అమలాపురం అనాతవరం వేదిక ఫంక్షన్ హాలులో గురువారం నుంచి రెండు రోజుల పాటు క్వాయర్ కాన్క్లేవ్–2026 నిర్వహిస్తున్నారు. కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో వ్యాపార అవకాశాలపై కేరళ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. ఏపీఐఐసీ, నాబార్డు, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొంటారు. విలువ ఆధారిత పరిశ్రమలను ఆధునీకరిస్తే.. ప్రభుత్వం, బ్యాంకులు, క్వాయర్ బోర్డు నుంచి తగిన ఆర్థిక ప్రోత్సాహం లభిస్తే యువ పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా గోదావరి జిల్లాలు దేశంలోనే ప్రముఖ క్వాయర్ హబ్గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఇలా చేస్తే మేలు ప్రస్తుతం జిల్లాలో కొద్దిమేరకు పీచు తీసే యంత్రాలు, తాళ్ల తయారీ యూనిట్లు, కోకోపీట్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్వాయర్ వుడ్, క్వాయర్ ప్లేవుడ్, కంపోజిట్ బోర్డులు, జియో టెక్స్టైల్స్, గ్రోబ్యాగ్లు, హార్టికల్చర్ ప్యానెల్స్, మ్యాట్స్, మ్యాటింగ్లు, బ్రష్లు, ప్లాంటర్ల వంటి క్వాయర్ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అయినప్పటికీ, వీటిని తయారు చేసే యూనిట్లు జిల్లాలో లేవు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇవే ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందువలన ఈ యూనిట్లను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. స్థానికంగా కొబ్బరి పొట్టు ఉత్పత్తి అవుతున్నా.. దాని నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసే పరిశ్రమలు లేవు. ఇది చేస్తే క్వాయర్ పిత్కు ఇప్పుడు వస్తున్న దాని కన్నా ఐదు రెట్లు అదనంగా ఆదాయం వస్తుంది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు కూడా అవసరం లేదు. చిన్న స్థాయి కోకోపీట్ యూనిట్కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, ఆటోమెటిక్ పీచు యూనిట్కు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షలు, జియో టెక్స్టైల్ లేదా మ్యాట్ యూనిట్కు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు అవసరం. క్వాయర్ వుడ్ లేదా కంపోజిట్ బోర్డు పరిశ్రమకు రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పెట్టుబడి సరిపోతుంది. విలువ జోడిస్తే సిరులు కురిసే చాన్స్ గోదావరి జిల్లాల్లో పీచు పరిశ్రమలకు అపార అవకాశాలు చేయూతనివ్వని క్వాయర్ బోర్డు, ప్రభుత్వం ముందుకు రాని ఔత్సాహికులు -
గౌరవాన్ని చాటుకున్న జగన్
దివంగత ముద్రగడ పట్ల వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అపార గౌరవాన్ని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైనప్పటి నుంచీ ఆయనను కాపాడుకునేందుకు జగన్ చొరవ చూపారు. ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడి పర్యవేక్షణలో వైద్యం అందించే ఏర్పాటు చేశారు. అయితే, విధి చిన్నచూపు చూసిందేమో! ముద్రగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహాన్ని దర్శించి, నివాళులర్పించేందుకు వైఎస్ జగన్ బుధవారం మధ్యాహ్నం కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వయంగా ముద్రగడ పాడె మోసి ఆయన పట్ల తనకున్న అపార గౌరవాన్ని చాటుకున్నారు. జగన్ వెంట భారీ సంఖ్యలో అభిమానులు సైతం ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. అభిమానులు సైతం ముద్రగడ భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలో సాయంత్రం ఖననం చేసిన తరువాత, బాధాతప్త హృదయాలతో అక్కడి నుంచి వెనుతిరిగారు. -
‘ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధింపు’
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడలేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ‘‘ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ ఎప్పుడో చెప్పారు. అధికార లాంఛనాలు వద్దన్నా పోలీసులు తుపాకులతో వచ్చారు. ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారంటూ అంబటి మండిపడ్డారు. -
తక్షణం సాగునీరివ్వండి
సాగు సమ్మె ప్రకటించమంటారా? కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మనందం, కార్యదర్శి అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, రైతు నాయకులు మట్టా ప్రభాకరరావు, యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ, డెల్టాకు సాగునీరు విడుదల చేసి 45 రోజులు గడుస్తున్నా నియోజకవర్గంలోని శివారు భూములకు ఆ నీరందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో పుష్కలంగా నీరుండి, సముద్రంలోకి మిగులు జలాలు వెళ్లిపోతున్నా ఈ దుస్థితి ఏమిటని మండిపడ్డారు. ఒక్క ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో నీరివ్వలేని అధ్వాన స్థితిలో ఇరిగేషన్ అధికారులున్నారని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో కాలువలకు నీరు విడుదల చేస్తారనగా 216ఈ బైపాస్ రోడ్డు చెంతన ముక్కామల – నడిపూడి లాకుల మధ్యన రక్షణ గోడ పనులు ప్రారంభించారని, అమలాపురంలో ఏడు వంతెన అభివృద్ధి పనులకు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రక్షణ గోడ పనుల కోసం తవ్విన మట్టిని కాలువల్లో అడ్డంగా వేయడంతో సాగునీరు దిగువకు రావడం లేదని చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ 40 వేల ఎకరాలకు నీరు అందకుండా ఈ పనులు చేయడమేమిటని ప్రశ్నించారు. కాలువలో అడ్డంగా ఉన్న మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని రైతుసంఘాల ప్రతినిధులు ఆకుల లక్ష్మణరావు, రాజులపూడి మురళీకృష్ణ, రాజులపూడి నాగేశ్వరరావు, దాట్ల గోపిరాజు తదితరులు హెచ్చరించారు.● రైతుల డిమాండ్ ● ఇరిగేషన్ డీఈ కార్యాలయం ముట్టడి ● తాళాలు వేసేందుకు ప్రయత్నం ● కలెక్టరేట్ వద్ద ధర్నా ● అడ్డుకున్న పోలీసులు ● క్రాప్ హాలిడే ప్రకటిస్తామని అన్నదాతల హెచ్చరిక ● అమలాపురంలో ఉద్రిక్తత అమలాపురం రూరల్: నియోజకవర్గంలోని కాలువలకు పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలనే డిమాండుతో కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఇరిగేషన్ డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపించి, కార్యాలయానికి తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ రైతులు కార్యాలయం లోపలకు రైతులు దూసుకు వెళ్లారు. ఇరిగేషన్ డీఈ తక్షణమే వచ్చి సమాధానం చెప్పాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. డీఈ శ్రీరామ జనార్దన్ను సీఐ వీరబాబు కార్యాలయానికి రప్పించి, రైతులతో చర్చలు జరిపారు. గురువారం సాయంత్రానికల్లా పూర్తిగా నీళ్లు అందిస్తామని ఈఈ వెంకటేశ్వరరావు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
నారుమడులకు నీరు అందించండి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి అల్లవరం: సెంట్రల్ డెల్టా పరిధిలో కాలువలకు సాగునీరు విడుదల చేసి నలభై రోజులు కావస్తున్నా నేటికీ ప్రధాన కాలువల్లో సాగునీరు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు జున్నూరి రామారావు మంగళవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాలువలు తెరిచే సమయానికి వంతెల నిర్మాణాలు చేపట్టి శివార్లకు సాగునీరు రాకుండా చేశారని ఆయన మండిపడ్డారు. అమలాపురం నియోజకవర్గంలో నేటికీ నారుమడులు వేయని దయనీయ స్థితి ఏర్పడిందన్నారు. జూన్ చివరి వారంలో పడాల్సిన నారుమడులు నేటికీ వేయలేదని, నియోజకవర్గంలోని మండలాల్లో సగానికి పైగా నారుమడులు పడలేదన్నారు. ఖరీఫ్కు వెళ్లాలా, పంట విరామం ప్రకటించాలా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారని రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద కూటమి పార్టీకి చెందిన రైతు నాయకులు నిరసన తెలిపారంటే అధికారుల నిర్లక్ష్యాన్ని అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. కలెక్టర్ స్పందించి శివార్లకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పంట విరామం ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఆక్వాకు కరెంట్ షాక్
● దెబ్బ మీద దెబ్బ● ఆక్వా ఫీడర్లపై ఎడాపెడా విద్యుత్ కోతలు ● చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయే ప్రమాదం ● గత్యంతరం లేక జనరేటర్ల వినియోగం ● డీజిల్కు నెలకు రూ.3 లక్షల వరకూ అదనపు ఖర్చు ● ఇప్పటికే ట్రంప్ సుంకాలతో పడిపోయిన రేట్లు ● మరోవైపు పెరిగిన మేత ధరలు ● ఆపై విజృంభిస్తున్న వ్యాధులు ● గడగడలాడుతున్న వనామీ రైతులు ఐ.పోలవరం: దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది ఆక్వా రైతు పరిస్థితి. ఒకవైపు ట్రంప్ సుంకాలతో పడి పోయిన ధరలు.. మరోవైపు మేత ధరల పెంపు.. ఇంకోవైపు రొయ్యలపై వ్యాధుల పంజాతో ఇప్పటికే వా రు సతమతమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభు త్వం ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తోంది. ముఖ్యంగా ఆక్వా ఫీడర్లకే ప్రత్యేకంగా రోజుకు నాలుగైదు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తోంది. ఆ సమ యంలో డీజిల్ జనరేటర్లపై ఏరియేటర్లు నడపాల్సి రా వడంతో పెట్టుబడి తడిసి మోపైడె, తీవ్రంగా నష్టపోతున్నామని వనామీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఇబ్బంది జిల్లాలో అధికారికంగా 21 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా కలిపి ఇది 35 వేల ఎకరాల వరకూ ఉంది. దీనిలో తొలి పంట మొత్తం సాగు జరుగుతూండగా రెండో పంట సుమారు 24 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక మూడో పంట సుమారు 14 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈవిధంగా చూస్తే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఏడాది కాలంలో అన్ని పంటలూ కలిపి సుమారు 73 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ నిరంతరాయంగా అందాలంటే ఏరియేటర్లు పని చేయాల్సి ఉంటుంది. ఐదెకరాల రొయ్యల చెరువు సాగుకు వన్ హెచ్పీ ఏరియేటర్లు 40 కావాల్సి ఉంటుంది. అదే టు హెచ్పీ ఏరియేటర్లు అయితే 20 వరకూ అవసరం. రొయ్యల కౌంట్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు, కౌంట్ తగ్గితే 18 గంటల పాటు ఏరియేటర్లు పని చేస్తూనే ఉండాలి. పగలు 4 గంటలు, సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకూ నిరంతరాయంగా నడపాలి. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలోనే ప్రభుత్వం విద్యుత్ సరఫరా నిలిపివేస్తూండటంతో ఏరియేటర్లు నిలిచిపోతున్నాయి. దీనివలన ఆక్సిజన్ లోపంతో రొయ్యలు చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో, ఏరియేటర్లను పని చేయించేందుకు రైతులు జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. రెండేళ్లుగా సంక్షోభం వనామీ సాగు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా సమయంలో కూడా ఎదురు కాని సవాళ్లు ఇ ప్పుడు ఎదురవుతున్నాయి. ట్రంప్ సుంకాలకు తోడు అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడుతున్న ఉద్రిక్తతలతో పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా దేశానికి వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తెస్తున్న వనామీ రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. తాజాగా మేత కంపెనీలు సిండికేట్గా ఏర్పడి ధరలు పెంచేశాయి. వనా మీ రొయ్యల మేతను టన్నుకు రూ.10 వేలు, టైగర్ రొయ్యల మేతను టన్నుకు రూ.12 వేల వరకూ పెంచారు. గత నెలలో రూ.8 వేలు, రూ.10 వేల చొప్పున పెంచాలని నిర్ణయించగా, రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలతో ప్ర భుత్వం చర్చలు జరిపింది. దీనిపై, ప్రభుత్వం నిర్ణ యం తీసుకునేలోపే కంపెనీలు మరో రూ.2 వేలు అదనంగా పెంచాయి. కిలో మేత ధరను రూ.4 తగ్గిస్తామ ని చెప్పి రూ.2 మాత్రమే తగ్గించాయి. జిల్లావ్యాప్తంగా ఏడాదికి 73 వేల ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు కు 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం. ధర పెంపుతో రైతులపై రూ.225 కోట్ల అదనపు భారం పడింది. మేత ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని వనామీ రైతులు గత నెలలో కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సమస్యలు చాలవన్నట్లు రొయ్యలకు గత నెలలో వైట్గట్, వైట్స్పాట్ వంటి వ్యాధులు సోకాయి. దీంతో, రైతులు మరిన్ని నష్టాలు చవిచూశా రు. ఒకవైపు ధరలు లేక.. మరోవైపు మేత మరింత ఖరీదైన పరిస్థితుల్లో ఇప్పుడు కరెంటు కోతలు కూడా విధిస్తూండటంతో ఆక్వా సాగు చేయడం కష్టమేనని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాగు చేయలేకపోతున్నాం ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మంచిదే. కానీ, రోజుకు నాలుగైదు గంటలు కరెంటు కోతలు విధిస్తూండటంతో మాకు సాగు భారంగా మారింది. డీజిల్ ధర పెరిగింది. విద్యుత్ లేక జనరేటర్లు ఉపయోగించాల్సి రావడంతో డీజిల్ వినియోగం పెరిగి రూ.లక్షల్లో పెట్టుబడి అవుతోంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వల్ల ఉపయోగమేమిటి? ఆక్వా ఫీడర్లపై మాత్రమే కరెంటు కోతలు విధిస్తూండటంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. – దంతులూరి నానీరాజు, అన్నంపల్లి ‘చమురు’ వదిలిపోతోందిలా.. ఐదెకరాల చెరువులో ఏరియేటర్లు తిప్పడానికి గంటకు 20 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. రోజుకు 5 గంటల పాటు విద్యుత్ కోతలుంటే ఆ సమయంలో జనరేటర్లపై ఏరియేటర్లు తిప్పడానికి 100 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. దీని ప్రకారం రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.3 లక్షల వరకూ డీజిల్కే ఖర్చవుతోంది. రొయ్యల పంట చేతికి రావడానికి 4 నెలలు పడుతుంది. అంటే ఈ నాలుగు నెలల్లో డీజిల్ కోసమే వనామీ రైతులకు రూ.12 లక్షల మేర చేతి చమురు వదిలిపోతోంది. అదే కరెంటు సరఫరా సక్రమంగా ఉంటే నెలకు రూ.25 వేలు మాత్రమే అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆక్వాకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని, ఆక్వా ఫీడర్లకు విద్యుత్ కోతలు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సాగునీటిపై అలసత్వం వహిస్తే చర్యలు
అమలాపురం రూరల్: సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, నీటి పారుదల అధికారులు, కాంట్రాక్టర్లు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్ 99 శాతం పూర్తి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో 99 శాతం పూర్తయిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియపై కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో సర్ ప్రక్రియ 100 శాతం ముగిసిందన్నారు. ఆత్రేయపురం మండలంలో మాత్రమే ఇంకా స్వల్పంగా మిగిలి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అమలాపురం రూరల్: పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగలవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించడం లేదని, కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, దీనివలన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో సర్టిఫికెట్లు చేతికి రాక విద్యార్థులు నానా అగచాట్లూ పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ నంబర్–77 రద్దు చేస్తానని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శులు శ్యామ్, వినయ్, చిరు, జిల్లా నాయకులు గణేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కళా స్రవంతి వార్షికోత్సవం ● 8 మందికి ‘కళా ప్రవీణ’ ప్రదానం కొత్తపేట: కళలకు పచ్చని పంట పొలం తెలుగు నేల ప్రముఖ అంతర్జాతీయ శిల్పి, శ్రీనాథరత్నశిల్పి వుడయార్ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ అన్నారు. శ్రీకళా స్రవంతి సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంక్షేమ సేవా సంఘం 6 వ వార్షికోత్సవాన్ని మంగళవారం మండల పరిధిలోని పలివెల కళా స్రవంతి కళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కొమారిపాటి ఏసు వెంకటప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో శిల్పకళా రత్న ఆచార్య డి.రాజ్ కుమార్ వుడయార్ ముఖ్య అతిథిగా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి పలు కళా సంఘాల అధ్యక్షులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళలకు చెందిన షేక్ ఇబ్రహీం సాహెబ్, మానేపల్లి సూర్యనారాయణ, ఠాణేలంక కుమారస్వామి, మానేపల్లి త్రిమూర్తులు, మిరియాల గనిరాజు, మహంకాళి సుబ్బారావు, పెళ్ళూరి మైసూర్ రాజు, కొమ్మర నాగేశ్వరరావులను కళా ప్రవీణ బిరుదుతో సత్కరించారు. పారాలీగల్ వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీ య న్యాయ సేవాధికార సంస్థ శ్రీపారా లీగల్ వలంటీర్గా ఏడాది కాల పరిమితికి పనిచేసేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ ఎల్.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. మెట్రిక్యులేషన్, తత్సమానమైన విద్యార్హత కలిగి, 18 ఏళ్లు నిండిన వారికి మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తామన్నారు. ఈనెల 18 వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలో 50 నుంచి 100 మంది వరకు, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేట, అనపర్తి, ప్రత్తిపాడు, రంపచోడవరం, అడ్డతీగల మండల న్యాయ సేవాధికార కమిటీల పరిధిలో ప్రతి మండలానికి 25 నుంచి 50 మంది వరకు పారా లీగల్ వాలంటీర్లను ఎంపిక చేయనున్నామన్నారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలకు సమీపంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత మండల న్యాయ సేవాధికార కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులను సంప్రదించాలన్నారు. -
ఆస్తి కోసం ఆలిని కడతేర్చాడు
● రాజవోలు గ్రామంలో దారుణం ● అనాథలైన పిల్లలు ధవళేశ్వరం: సొంత అక్క కూతురుని వివాహం చేసుకున్నాడు. పైళ్ళె 17 ఏళ్లు గడిచా యి. సాఫీగా సాగుతున్న సంసారంలో ఆస్తి తగాదాలు ప్రకంపనలు సృష్టించాయి. మనస్పర్థలు ముదిరి హత్యకు దారి తీశాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజవోలు గ్రామం కోనేరు వీధికి చెందిన చింతా వరప్రసాద్ 2009లో అతని అక్క కూతురు చింతా నాగమణి (32)ని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వరప్రసాద్ వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. రాజవోలులోని అక్క పేరున ఇంటిని తన పేరున రాయాలని వరప్రసాద్ తన భార్యను వేధిస్తున్నాడు. నాగమణి సోదరితో కలిసి బాలాజీపేటలోని ఒక బిర్యానీ షాపులో పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన నాగమణితో ఎవరికి చెప్పి పనికి వెళ్లావంటూ గొడవ పడిన వరప్రసాద్ తన పనిముట్టు బాదిదతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వరప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ శివప్రియ, సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన పిల్లలు నాగమణికి ఇద్దరు పిల్లలు బొమ్మూరులో ఒక ప్రైవేటు పాఠశాలలో కుమార్తె పదో తరగతి, కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. కన్నతండ్రే తల్లిని చంపడంతో వారి రోదన కంటతడి పెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు. -
గౌతమ్ యూరాలజీలో హై పవర్ లేజర్ ప్రారంభం
కంబాలచెరువు: ఉభయ గోదావరి జిల్లాల్లో యూరాలజీ, కిడ్నీ వైద్య సేవల్లో అధుతన టెక్నాలజీతో స్థానిక గౌతమ్ యూరాలజీ, కిడ్నీ సెంటర్లో రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక 160 వాట్స్ పొటెంట్ వోల్మియమ్ హై పవర్ లేజర్ యంత్రాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి అధినేత, డాక్టర్ గౌతమ్రెడ్డి మంగళవారం తెలిపారు. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏవీ రవికుమార్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ యూరాలజిస్టు డాక్టర్ టీవీ నారాయణరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి, ప్రియాంక పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆరోగ్య ప్రదాయిని ఆషాఢం
● ఆచారాలకు సంప్రదాయాలకు నెలవైన మాసం ● ప్రతి ఆచారం వెనుక ఎంతో శాసీ్త్రయత ఆలమూరు: తొలకరి జల్లులతో ప్రకృతి శోభించే మాసం ఆషాఢం. శుభ కార్యాలు లేకపోయినా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఇది ఎంతో శుభప్రదమైనది. గ్రామ దేవతలకు జాతరలు, నైవేద్యాల సమర్పణకు నెలవైన కాలం. మేఘావృతమైన ఆకాశాలు.. చిరు జల్లుల సందోహాలు.. మునగాకు వంటకాల ఘుమఘుమలు.. నవ వధువులు గోరింట పంటలతో.. అంతే కాదు.. భావి జీవితం బాగుండాలని పెద్దల నిర్ణయం మేరకు వీడలేక వీడలేక నవదంపతులు ఎవరి పుట్టిళ్లకు వారు దారితీసే కాలమిదే. గ్రామీణాల్లో ఇవన్నీ సర్వ సాధారణమే అయినా ఇందులోని ప్రతి సంప్రదాయానికీ ఓ శాసీ్త్రయత నిమిడి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెపుతారు. మునగాకు దివ్యౌషధం ఆషాడ మాసంలో మునగాకుతో కూడిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఉష్ణ తత్వాన్ని పెంచి ప్రస్తుత శీతల వాతావరణానికి అనుగుణంగా సమతుల్యం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. అంతే కాదు దీనివల్ల లభించే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరింటాకుతో ప్రయోజనాలు అనేకం ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు లేదా పారాణి పెట్టుకోవడాన్ని అందానికే కాదు లక్ష్మీప్రదంగా కూడా భావిస్తారు. ఇది కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు నేడు మెహిందీ పేరుతో పట్టణాలకూ విస్తరించింది. గ్రీష్మం వెళ్లి వర్ష రుతువు ప్రవేశిస్తుంది. వర్షాలు పడే కాలం కావడంతో ఇంటి పనులు, పొలంపనులు చేసే మహిళలు తడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. వారి కాళ్లకు, చేతులకు, గోళ్లలో పగుళ్లకు గోరింటాకు కానీ, పారాణి కానీ దివ్యౌషధంగా పని చేస్తుందని. పండగలకు విశేష ప్రాధాన్యం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచే పండగలు వరస కడతాయి. ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే అనంత ఫలితం ఉంటుందన్నది పురాణ వచనం. సూర్య భగవానుడు దక్షిణాయణంలోకి ప్రవేశించడం ద్వారా ఈ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జైనులు ఈ నెలలోనే చాతుర్మాస వ్రతం చేపడతారు. జగన్నాథుడి రథయాత్ర, బోనాల పండగ, వారాహి నవరాత్రులు ఈ నెలలోనే వస్తాయి. దుర్గమ్మ శాకంబరిగా దర్శించునే భాగ్యం కలిగేది ఈ నెలలోనే కావడం విశేషం. -
జగన్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి
అల్లవరం: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం రానున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం, విద్యుత్ చార్జీలు, ఫీడ్ ధరల పెరుగుదల, రొయ్యలను వెంటాడుతున్న తెగుళ్లు తదితర అంశాలపై జగన్ స్వయంగా ఆక్వా రైతులను అడిగి తెలుసుకుంటారని వివరించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు, ఆక్వా రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గడువు పెంచినా.. సవాలే ‘సర్’ సాక్షి, అమలాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును ఎన్నికల కమిషన్ ఈ నెల 24వ తేదీ వరకూ పెంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ గడువు మంగళవారం రాత్రితో ముగియాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ ఫారాలు 99,662 నమోదయ్యాయి. అత్యధికంగా కాట్రేనికోనలో 11,050, ఐ.పోలవరంలో 6,302, తాళ్లరేవులో 6,229, రావులపాలెంలో 5,717, అమలాపురం రూరల్లో 5,695 వరకూ అన్ కలెక్టబుల్ ఫారాలున్నాయి. ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడం, చిరునామా మారడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాలతో వీటిని సేకరించలేకపోయినట్లు అధికారులు గుర్తించారు. గడువు మరో పది రోజులు పెంచినప్పటికీ ఈ ఫారాలు సర్లో పాల్గొనే యంత్రాంగానికి సవాలుగానే మిగలనున్నాయి. జిల్లాలో మొత్తం 13,15,007 మంది ఓటర్లకు గాను 13,14,788 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. ఇంకా 219 ఫారాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. జిల్లా పురోగతి 99.983 శాతానికి చేరింది. అయితే అన్ కలెక్టబుల్ ఫారాల పరిశీలనకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది ఆయా చిరునామాలను మరోసారి పరిశీలించి, సంబంధిత ఓటర్లను గుర్తించే చర్యలు చేపడుతున్నారు. వీటిలో మృతులను తొలగించగా, మిగిలిన వారిని గుర్తించడం సిబ్బందికి పెను సవాలుగా మారనుంది. జగ్గిరెడ్డిపై విమర్శలు సరికాదు సాక్షి, అమలాపురం: ‘కూటమి పాలన మొదలైన తరువాత ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, దౌర్జన్యాలతో అణచి వేయాలని చూస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై మాట్లాడినందుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై టీడీపీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయ డం భావ్యంగా లేదు’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్ విమర్శించారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎదురు దాడి చేయడం మాని, జగ్గిరెడ్డి లేవనెత్తిన సమస్యలకు పరిష్కా రం చూపాలని టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, దీనిపైనే జగ్గిరెడ్డి గొంతు విప్పారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక, ఫీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు నష్టపోతున్నారని, ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. -
ఎండుతున్న నారుమడుల పరిశీలన
ఐ.పోలవరం: ‘నారెండుతోంది’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు స్పందించారు. గ్రామాల్లో ఎండిపోతున్న వరి నారుమడులను మంగళవారం పరిశీలించారు. కేశనకుర్రు, జి.వేమవరం, తిల్లకుప్ప, టి.కొత్తపల్లి శివారు జి.మూలపాలెం తదితర గ్రామాల్లో మురమళ్ల పీఏపీ సెక్షన్ కింద ఇరిగేషన్ ఈఈ కాశీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండలంలో 6 వేల ఎకరాల్లో దమ్ములు పూర్తయినట్లు గుర్తించామన్నారు. నార్త్ అడ్డాల్ కాలువ సమీపాన 200, పంచాయతీ పరిధిలో 60, ఇతర గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో సాగునీరు అందడం లేదని గుర్తించినట్లు వివరించారు. ప్రస్తుతం 11.30 క్యూసెక్కులు విడుదల చేశామని, వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రత్నగిరికి ప్రసాదమే సిరి
● సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ● ఆషాఢంలో విక్రయాలకు కౌంటర్లు పెంపు ● ఆదాయం రూ.1.5 కోట్లు వస్తాయని అంచనా అన్నవరం: ముక్కోటి దేవతల ప్రసాదాలలో సత్య దేవుని ప్రసాదం ప్రత్యేకం. స్వామివారంటే భయభక్తులు ఉన్నవారెవరైనా స్వామిని దర్శించునే భాగ్యం లేకపోయినా బాధపడరు కానీ.. ప్రసాదం స్వీకరించకుండా వెళ్తే మాత్రం మనసులో చాలా బాధపడిపోతుంటారు. ఆషాఢం వచ్చిందంటే స్వామివారి ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాగని ఈ మాసంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని కాదు. ఆచార వ్యవహారాలకు ప్రధానమైన ఆషాఢ మాసంలో అన్నవరానికి అటూ, ఇటూ, సమీపంలో ఉండే ఆలయాల దర్శనాలకు వెళ్లే భక్తులు రత్నగిరి, హైవేపై ఉన్న నమూనా ఆలయం మీదుగా రాకపోకలు సాగించేటపుడు కొద్దిసేపు ఆగి ఆయా కౌంటర్లలో ప్రసాదం కొనుక్కుని వెళ్లిపోతుంటారు. దీంతో ఏటా ఈ మాసంలో ప్రసాదం విక్రయాలు విపరీతంగా ఉంటాయి. లోవకొత్తూరులోని తలుపలమ్మ తల్లి, పెద్దాపురం మరిడమ్మ తల్లి, ఇతర గ్రామదేవతలకు ఈ నెలంతా జాతరలు ఉంటాయి. దీంతో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆది వారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని సత్యదేవుని ఆలయంలో అధిక ప్రసాద విక్రయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆది, మంగళ, గురు, శుక్రవారాలలో లోవతల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఆదివారం మాత్రం ఆ సంఖ్య సుమారు 50 వేల నుంచి లక్ష ఉంటుంది. వీరిలో చాలా మంది స్వామివారి ప్రసాదాన్ని కొనుక్కుంటారు. ఈ నేపథ్యంలో నాలుగు ఆదివారాల్లో సుమారు రూ.కోటి వరకు స్వామివారి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో 60 వేల ప్యాకెట్లు, ఆదివారం పాత నమూనా ఆలయం కౌంటర్ వద్ద 30 వేలు, తొలిపాంచా కౌంటర్ వద్ద 30 వేలు రత్నగిరి కౌంటర్ల వద్ద 30వేలు కొత్త నమూనా ఆలయం వద్ద పది వేల ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. -
విలువలకు పెద్దపీట వేశారు
ముద్రగడతో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో సమున్నత విలువలకు పెద్ద పీట వేసిన నాయకుడు. – పిల్లి సుభాష్చంద్రబోస్, రాజ్యసభ మాజీ సభ్యుడు, పిల్లి సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్తీరని లోటు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు. 1978లో ముద్రగడ, 1985లో ఎమ్మెల్యేలుగా కలిసి పని చేశాం. అప్పటి నుంచీ ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాపుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేశారు. మంత్రిగా, ఎంపీగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. అటువంటి నాయకుడు మరొకరు పుట్టరు, చూడం. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు మహోన్నతుడు ముద్రగడ మరణ వార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. రాష్ట్రానికి, కాపు సామాజిక వర్గానికి ఆయన మర ణం తీరని లోటు. కాపు సామాజిక వర్గం హక్కు లు, సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి. – చింతా అనురాధ, మాజీ ఎంపీ, అమలాపురం బాధాకరం కాపు ఉద్యమానికి జీవితాంతం అంకిత భావంతో సేవలందించిన ముద్రగడ పద్మనాభం మృతి చెందడం అత్యంత బాధాకరం. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ అందరికీ ఆదర్శం ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. – గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పి.గన్నవరం -
ఉద్యమ యోధుడిమహాభినిష్క్రమణ
● ముద్రగడ మృతితో ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం ● కన్నీరు మున్నీరవుతున్న అభిమానులు ● నైతిక, రాజకీయ విలువలకు పెద్దపీట వేసిన నేత ● ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటున్న ప్రజలు కాపు ఉద్యమ శిఖరం నేలకొరిగింది. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలకు పెద్ద పీట వేసి.. సమాజానికి ఎంతో ఇచ్చి.. తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు.. అనారోగ్యంతో సుదీర్ఘ కాలం పోరాడి.. అలసిపోయి.. తనువు చాలించారు. కాపు ఉద్యమ నేతగానే కాకుండా వర్గాలకు అతీతంగా అందరి అభిమానాన్నీ మూటగట్టుకున్న ఆ మహనీయుడు ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలియడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. ప్రజా జీవితంలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తలొగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి సుగుణాలు కలిగిన అరుదైన అగ్రశ్రేణి నాయకుడు, మానవతా మూర్తి ఆయన. ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెదకాపు. ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో గొప్ప శకం ముగిసినట్లయ్యింది. పిఠాపురం/గోకవరం/ప్రత్తిపాడు/ప్రత్తిపాడు రూరల్/కిర్లంపూడి/అన్నవరం: కొన్ని పేర్లు పదవుల వల్ల కాదు.. పోరాటాల వల్ల చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా.. అందరితో ఆప్యాయంగా వ్యవహరించే తత్వంతో ప్రజల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు విడిచి పెట్టని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆత్మగౌరవం, నమ్మిన సిద్ధాంతం కోసం గొప్ప పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి. నమ్మిన ప్రజల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మహనీయుడు. ఉద్యమాలతో సంచలనం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో ముద్రగడ చేసిన దీక్షలు, పోరాటాలు, పాదయాత్రలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ప్రత్యేకించి 2016లో తునిలో జరిగిన కాపు ఐక్యగర్జన సభ పెను సంచలనం రేపింది. ఆ ఉద్యమం తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ అణచివేత చర్యలు ఆయనను మరింతగా వార్తల్లో నిలిపాయి. ఆయన కుటుంబం పట్ల అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అమానవీయ వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. ఎంత అణచివేతకు ప్రయత్నించినా రాజీ పడకుండా తను నమ్మిన సిద్ధాంతంపై ముద్రగడ మొక్కవోని పట్టుదలతో నిలిచి, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించారు. ఆమరణ దీక్షే ఆయుధంగా.. ముద్రగడ రాజకీయ జీవితంలో నిరాహార దీక్షలు ప్రత్యేక అధ్యాయమనే చెప్పాలి. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల వారికి 1956కు ముందున్న మాదిరిగానే రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో తన సతీమణి పద్మావతితో కలిసి ముద్రగడ 1994 జూలై 1న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తరువాత కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై అనేకసార్లు ఆమరణ దీక్షలు నిర్వహించి, సంచలనం సృష్టించారు. నైతిక విలువలకు ప్రాధాన్యం వ్యక్తిగత, రాజకీయ జీవితంలో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నాయకుడు ముద్రగడ. రాజకీయంగా ఆయనతో విభేదించిన వారు కూడా ఉద్యమం పట్ల ఆయన నిబద్ధతను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సామాజికవర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. ఒక్క కాపు సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల్లోనూ ఆయనకు ఆత్మీయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముద్రగడ మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ముద్రగడ పద్మనాభం మృతితో ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామం కిర్లంపూడి తీసుకువచ్చి, అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచనున్నారు.కోనసీమ గుండెల్లో...అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కలిసి కాపు ఉద్యమానికి ఊపిరులూదిన కోనసీమ కాపు నేతలు ఆయన మరణ వార్త వినగానే విచారంలో మునిగిపోయారు. ఆయనతో కలసి వేసిన ఉద్యమ అడుగులను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ఉభయ గోదావరి జిల్లాల్లో కోనసీమతో ఎంతో అనుబంధం ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం అమలాపురంలో చేపట్టిన ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అమలాపురానికి చెందిన నల్లా విష్ణుమూర్తి, నల్లా సూర్యచంద్రరావు సోదరుల ఆధ్వర్యాన 1993లో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించింది. ఆ సందర్భంగా ముద్రగడ అమలాపురం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో రథసప్తమి నాడు కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా విష్ణుమూర్తి, రాష్ట్ర కన్వీనర్గా ఆయన సోదరుడు దివంగత నల్లా సూర్యచంద్రరావు సారథ్యం వహించింది ముద్రగడ సమక్షంలోనే. కాపు రిజర్వేషన్ల కోసం అమలాపురంతో పాటు కోనసీమలోని పలు గ్రామాల్లో ఖాళీ కంచాలు, గరిటెలతో ఆయన ఆకలి చప్పుళ్లు వినిపించారు. కాపు ఉద్యమం సందర్భంగా అమలాపురంతో పాటు కోనసీమకు ముద్రగడ 37 సార్లు వచ్చి ఇక్కడి కాపుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రక్తం చిందిన చోటే రగిలిన కాపు ఉద్యమం: రావులపాలెంలో 1993లో జరిగిన సభకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంగా కాపు రిజర్వేషన్ల కోసం ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన స్వీకరించలేదు. ఆందోళనకు దిగిన కాపులపై పోలీసుల లాఠీచార్జీ చేశారు. ఆ సందర్భంగా దాదాపు 40 మంది కాపు నాయకులు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు ముద్రగడ అప్పట్లో కోనసీమకు వచ్చారు. అప్పటికే ఆయన మంత్రిగా పని చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం అప్పటి ప్రభుత్వంతో విభేదించి, పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. రక్తం చిందిన రావులపాలెం సభా వేదిక వద్దనే కొన్ని నెలలకే జరిగిన కాపు ఉద్యమ సభలో ముద్రగడ చేసిన ప్రసంగం ఉత్తేజపరిచింది. కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ ముద్రగడ నిర్వహించిన సైకిల్ యాత్ర అప్పట్లో ఓ ప్రభంజనం సృష్టించింది. అమలాపురానికి చెందిన కాపు ఉద్యమ నేతలు కల్వకొలను తాతాజీ. నల్లా పవన్ కుమార్, రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన ఆకుల రామకృష్ణ తదితరులు కాపు ఉద్యమాల పరంగా ముద్రగడ అడుగు జాడల్లోనే నడిచారు. -
ఆత్మహత్యలే శరణ్యం
● బిళ్లకుర్రు రైతుల అల్టిమేటం ● నీరు పారని కాలువలో కూర్చుని పురుగు మందు డబ్బాతో నిరసన కొత్తపేట: తక్షణం సాగునీరు అందించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని మండలంలోని బిళ్లకుర్రు పంచాయతీ పరిధిలోని యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాల రైతులు, కౌలు రైతులు అల్టిమేటం జారీ చేశారు. వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధిలోని ఈ గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాలకు సాగునీరందక నేటికీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆ గ్రామాల రైతులు ఈ నెల 6న నక్కావారిపేట వద్ద కాలువలో బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో, అధికారులు వచ్చి సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది జరిగి వారం రోజులైనా చుక్క నీరు కూడా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం మరోసారి అదే కాలువలో పురుగు మందు బాటిల్తో కూర్చుని నిరసన తెలిపారు. ఈ చానల్ ద్వారా గతంలో రెండు పంటలతో పాటు మెరక పొలాలకు కూడా నీరందేదని, కొన్నేళ్లుగా రబీలో నీరు రాక మొక్కజొన్న సాగు చేస్తున్నామని, ఈసారి ఖరీఫ్లో కూడా సాగునీరు సరఫరా చేయకుండా అధికారులు, అధికార కూటమి నాయకులు సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రెండు పంటలకు కలిపి భూ యజమానులకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ అప్పులు చేసి, భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి శిస్తు అడ్వాన్సులు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా చూస్తే ప్రధాన పంట కాలువలకు సాగు నీరు విడుదల చేసి 45 రోజులైనా ఈ చానల్కు నీరు రాక నేటికీ నారుమడులు వేయలేకపోయామని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కౌలు రైతులు వాపోయారు. సాగునీటి సరఫరాకు ఉన్నతాధికారులు తక్షణం నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. పరిహారం ఇప్పించండి.. వలస పోతాం ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు ఇరిగేషన్ ఇన్చార్జి జేఈ మాధవ్ వచ్చి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వారం క్రితం వచ్చి కూడా ఇదే చెప్పారని, ఇప్పుడూ అదే చెబుతున్నారని, ఇప్పటి వరకూ ఏం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి శిస్తు అడ్వాన్స్ చెల్లించానని, ఇప్పుడు నీరివ్వకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని యెలిశెట్టి త్రిమూర్తులు అనే రైతు పురుగు మందు తాగే ప్రయత్నం చేయగా సహచర రైతులు వారించారు. ఇరిగేషన్ అ ధికారులు, నీటి సంఘం నిర్లక్ష్యానికి తాము నష్టపోవాలా అని నిలదీశారు. సాగునీరివ్వలేకపోతే మొ త్తం చానల్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించి, తాము రైతులకు చెల్లించిన శిస్తులు, నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తంతో పట్టణాలకు వలస పోయి, కూలి పని చేసుకుని బతుకుతామని వాపోయారు. తహసీల్దార్ వై.రాంబాబు అక్కడకు చేరుకుని, సంబంధిత అధికారులతో సమీక్షించి, సమస్య పరిష్కారిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. నీటిసంఘం డైరెక్టర్ రాజీనామా సాగునీటి సరఫరాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జననేన పార్టీకి చెందిన నీటిసంఘం డైరెక్టర్ యెలిశెట్టి వీర్రాజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో అవిశెట్టి గోపాలకృష్ణ, గొలకోటి వెంకటేశ్వరరావు, యాళ్ల వెంకటేష్, యెలిశెట్టి శివాజీ, పులపకూర సత్యనారాయణ, భగవంత్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తూర్పుగోదావరి: రామవరంలో ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం రామవరంలో కూటమినేతల అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కూటమి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. కూటమి నేతల ఆగడాలను అదుపు చేయాలంటూ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రామవరంలో రోడ్డుపై బైఠాయించారు.సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పీకేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దారుణానికి టీడీపీ నేతలు ఒడిగట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. -
రివిట్మెంట్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం ఈదరపల్లి నుంచి అంబాజీపేట మండలం ముక్కామల వరకూ జాతీయ రహదారి–216ఇకి ఆనుకుని ఉన్న ప్రధాన పంట కాలువ రివిట్మెంట్ వాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైవే అధికారులతో కలసి ఈ వాల్ నిర్మాణ పనులను సిరిపల్లి వద్ద ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముక్కామల – ఈదరపల్లి ప్రధాన పంట కాలువపై ఆధారపడి పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ కాలువ గట్టు కోతకు గురవుతున్నందున రివిట్మెంట్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. దీనివలన కాలువకు, రహదారికి రక్షణ కల్పించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడవచ్చని చెప్పారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
చంద్రబాబు మాటలు.. నీటిమూటలు
● కాలువ చివరి భూములకు అందని సాగునీరు ● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు కొత్తపేట: కాలువ చివరి భూములకు సైతం సాగునీరు సమృద్ధిగా అందిస్తున్నామని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద సోమవారం నిర్వహించిన రైతు సభలో సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పారు. కానీ, ఆయన మాటలకు, ఆచరణకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ప్రధాన పంట కాలువలో నీరున్నా వాటికి అనుబంధంగా ఉన్న పిల్ల కాలువల (చానల్స్) ద్వారా ఆయకట్టుకు నీరందడం లేదు. వాడపాలెం ఓల్డ్ చానల్ కింద బిళ్లకుర్రు పంచాయతీ పరిధి నక్కావారిపేట పరిసరాల్లో సుమారు 60 ఎకరాలకు సాగునీరు అందక నేటికీ నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో యెలిశెట్టివారిపాలెం, నక్కావారిపేట, డేగలవారిపాలెం, వాకాడవారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఈ నెల 6న నీరు లేని కాలువలో కూర్చుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, వారం గడిచినా ఫలితం శూన్యం. అలాగే, అవిడి కట్లమ్మ గుడి మీదుగా వెళ్లే పోతురాజు కాలువకు ఇరువైపులా ఆయకట్టుకు నీరందక వరి నారుమడులు బీటలు తీస్తున్నాయని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. సుమారు 100 ఎకరాలకు సంబంధించి వేసిన నారుమడులు పెరిగినా కాలువకు సక్రమంగా నీరు సరఫరా కాక దమ్ములు చేయలేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీ సీజన్లో సాగునీరు సక్రమంగా అందక వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకుంటున్నామని, ఈసారి ఖరీఫ్లో సైతం వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఆయకట్టు రైతులంతా మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రైతు సంఘం నాయకుడు యెలిశెట్టి త్రిమూర్తులు తెలిపారు. బిళ్లకుర్రు నక్కావారిపేట వద్ద చుక్క నీరు లేని చానల్ -
ఈ ఒక్క రోజే సర్
● నేటితో ముగియనున్న ప్రక్రియ ● డిజిటలైజేషన్కు జిల్లాలో ఇంకా లక్షకు పైగా ఓట్లు దూరం ● మ్యాపింగ్ కాని ఓట్లు 18,433 ● రెండు లక్షలకు పైగా తేడాలు సాక్షి, అమలాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మంగళవారంతో తెర పడనుంది. గత నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నింపిన అనంతరం తిరిగి స్వీకరించి, డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. అయితే, డిజిటలైజేషన్ ఇంకా పూర్తి కాకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో మొత్తం 13,15,007 మంది ఓటర్లకు గాను సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 12,09,233 మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మిగిలిన 1,05,774 మంది ఓటర్ల ఫారాలు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతి 91.96 శాతంగా నమోదైంది. ఎన్నో సమస్యలు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి స్వీకరించడం, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియలన్నీ పేపర్ల పరంగా అద్భుతంగా సాగినట్టు కనిపిస్తోంది. కానీ, సాంకేతికంగా కుటుంబ మ్యాపింగ్లో సమస్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికీ 18,433 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. వీటిలో రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు 2,13,895 తేడాలు (తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో భారీ తేడా, పేర్లు, ఇంటి పేర్లలో తప్పుల వంటి) గుర్తించారు. వీటి పరిష్కారం కోసం బీఎల్ఓలు, ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఓట్లను సరిదిద్దడం వారికి శిరోభారంగా మారనుంది. చివరి రోజైన మంగళవారం పెండింగ్ ఫారాల నమోదు, మ్యాపింగ్ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. -
అక్రమ ఆక్వా చెరువులను నిలిపివేయాలి
అమలాపురం రూరల్: ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి గ్రామం దుప్పులలంకలో అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువులను వెంటనే నిలిపివేయాలనే డిమాండుతో గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని చెరువు పరిసరాల్లో ఎటువంటి అనుమతీ లేకుండా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడం వల్ల నీరు కలుషితమవుతోందని, భూగర్భ జలాలు ఉప్పగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, తాగునీటితో పాటు వ్యవసాయానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలకు నీరందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పశువులకు కూడా ఆ నీటిని ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఆక్వా చెరువులను మూసివేసి, గ్రామస్తులకు రక్షణ కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ సుబ్బారావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి అమలాపురం రూరల్: ప్రజల నుంచి అందిన అర్జీలను తక్షణం పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి 101 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా, వారి సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కాకినాడ డీఎంహెచ్ఓగా అనిత కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ)గా కోనాల అనితను నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ అనిత ఏలేశ్వరం మెడికల్ ఆఫీసర్గా 1998లో తొలి పోస్టింగ్ పొందారు. 1999లో పిఠాపురంలో మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి, 2002 వరకూ కొనసాగారు. అప్పటి నుంచీ 2004 వరకూ కాకినాడ జీజీహెచ్ వైద్యాధికారిగా, అనంతరం బదిలీపై 2013 వరకూ పిఠాపురం, రావికంపాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోను పని చేశారు. 2013లో డిప్యూటీ సివిల్ సర్జన్గా ఉద్యోగోన్నతి పొంది, కోనసీమ జిల్లా పి.గన్నవరం బదిలీ అయ్యారు. 2014–17 మధ్య కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారిగా పని చేశారు. 2017–21 మధ్య పెదపూడి పీహెచ్సీ సూపరింటెండెంట్గా పని చేశారు. 2021 నుంచి 2025 జనవరి వరకూ కాకినాడ జీజీహెచ్లో డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో డీసీఎస్ ఆర్ఎంఓగా పని చేశారు. ఆపై సీఎస్ ఆర్ఎంఓగా ఉద్యోగోన్నతి పొంది, అదే నెలలో శ్రీకాకుళం డీఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల్లో కాకినాడ డీఎంహెచ్ఓగా అనిత నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీఎంహెచ్ఓగా పని చేసిన డాక్టర్ నరసింహ నాయక్ జవహర్ బాల ఆరోగ్య రక్ష రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల మంజూరు ఆలమూరు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ దశల వారీగా వేతనాలు మంజూరవుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు నెలల నుంచి వేతనాలు మంజూరు చేయడం లేదు. ఈ సమస్యపై ‘అందనిధి’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 3న కథనం ప్రచురించింది. దీంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు విస్తృత కథనాలను ‘సాక్షి’ ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిధి యాప్లోని లోపాలను గుర్తించింది. దీంతో, నిధి పోర్టల్ను పక్కన పెట్టి, ఈ ఏడాది జూన్ వరకూ గతంలో మాదిరిగా సీఎఫ్ఎంఎస్ విధానంలో వేతనాలు మంజూరు చేశారు. తమ సమస్యలను ‘సాక్షి’.. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ వేతనాలు మంజూరయ్యాయని కాంట్రాక్టు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. -
పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీదేవి సమేత కుమారారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. పరమ శివునికి ప్రీతికరమైన రోజు, స్వామి వారి జన్మ నక్షత్రం ఆరుద్ర కలసి రావడంతో కార్తిక సోమవారాన్ని గుర్తు చేసేలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి పుష్కరిణి జలాలు, పాలతో స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఉచిత దర్శనానికి ఆలయం మొదటి అంతస్తులోను, ప్రత్యేక దర్శనానికి ఆలయ ప్రాంగణంలోను బారులు తీరారు. వీఐపీల తాకిడి కూడా పెరగడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తెల్లవారుజామున తొలి అభిషేకం, తొలి పూజలను అర్చకులు నిర్వహించారు. వీటిని భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. కాలభైరవ స్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, మూలవిరాట్, ఉపాలయాలను, స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యాన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
జగన్ రాకతోనే ఆక్వా సమస్యలకు పరిష్కారం
● 15న భీమవరంలో ఆక్వా సదస్సుకు జగన్ హాజరు● ఆక్వా రైతులు తరలి రావాలి● రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి తాళ్లరేవు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతోనే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇంజరం పంచాయతీ అరటికాయలంకలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యాన, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ముదునూరి సతీష్రాజు, మెండా వెంకన్న, పిన్నమరాజు శ్రీనివాసరాజు, వేగిరౌతు రాజబాబు తదితరులు తమ సమస్యలు వివరించారు. ఇరవయ్యేళ్ల క్రితం ఆక్వా మేత బస్తా రూ.1,200 ఉండగా ప్రస్తుతం రూ.2 వేలకు పైగా పెరిగిందన్నారు. అయితే, 20 ఏళ్ల క్రితం ఉన్న రొయ్యల ధరలు కూడా ప్రస్తుతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా జోన్లోని చెరువులన్నింటికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వాపోయారు. రొయ్యల రైతులకు ఎప్పటికప్పుడు ధరలను తెలియజేసే ఆక్వా బ్రహ్మ యాప్లో రొయ్యల ధరలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు విన్న అనంతరం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కంచే చేను మేస్తున్న చందంగా ఎగుమతిదారులతో ప్రభుత్వం కుమ్మకై ్క ఆక్వా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆక్వా రైతులకు మేలు చేస్తారని రెండేళ్లుగా ఎదురు చూశామని, ఇప్పటికీ వారికి న్యాయం జరగకపోవడంతో ఈ నెల 15న భీమవరంలో ఆక్వా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్కు కూడా ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని, రైతులకు న్యాయం జరిగేందుకు ఆయన రైలులోనైనా భీమవరం వచ్చి అండగా ఉంటారని చెప్పారు. ఈ సదస్సుకు ఆక్వా రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పీ–4 కార్యక్రమంలో చెరువులన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ, చెయ్యేరు చెరువు అదే మాదిరిగా ఉందని అన్నారు. రెండెకరాల నుంచి వేల కోట్లకు ఎదిగిన చంద్రబాబు ఆ కిటుకు ఏమిటో రైతులకు చెప్పాలని జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. మరో ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన నాయకులు మేత కంపెనీలు, ఎక్స్పోర్టర్లతో కుమ్మక్కవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా రైతులకు మేలు జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యలపై మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ నెల 15న భీమవరంలో జరిగే వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పార్టీలకతీతంగా ఆక్వా రైతులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ అమలాపురం, రాజోలు, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, పాటి శివకుమార్, కె.ఆదిత్య, నాయకులు పితాని బాలకృష్ణ, కాశి బాలమునికుమారి, ఏడిద సుబ్బు తదితరులు పాల్గొన్నారు. -
ఫ నారెండుతోంది
ఐ.పోలవరం మండలంలోని ప్రధాన కాలువ అయిన మురమళ్ల నుంచి కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం ప్రాంతాలకు సైతం పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదు. కేశనకుర్రు పంచాయతీ పరిధి చాకిరేవు చెరువు సమీపాన సుమారు 40 ఎకరాల్లో వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు బకెట్లతో నీళ్లు తీసుకుని వరి చేలను, నారును తడుపుకొంటున్న దుస్థితి. శివారు ప్రాంతాలైన జి.మూలపొలం, జి.వేమవరం, టి.కొత్తపల్లి గ్రామాల్లోని పొలాలకు కూడా సాగునీరు అందడం లేదు. ఖరీఫ్లో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలకు నీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – ఐ.పోలవరం -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
తూర్పుగోదావరి జిల్లాలో.. పర్యటన: కొవ్వూరు నియోజకవర్గం (2025 జూలై 1న) హామీ: ఐదు ఎత్తిపోతల పథకాల ఆధునీకరణకు నిధులు ప్రస్తుత పరిస్థితి: చాగళ్లు, బ్రాహ్మణగూడెం ఎత్తిపోతల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు, కుమారదేవం కింద 4,950 ఎకరాలు, వేగేశ్వరపురం, పైడిమెట్ట పరిధిలో సుమారు 10 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఈ పథకాల ఆధునీకరణకు రూ.56 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇంకా నిధులు మంజూరు కాలేదు. ఆ హామీ ఇప్పటికీ కలగానే మిగిలింది. -
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జామునే స్వామివారికి మేలుకొలుపు సేవ తదితర పూజలు చేశారు. 41 మంది లఘున్యాస అభిషేకాలు, ముగ్గురు భక్తులు స్వామికి ఉండాళ్ల పూజ, 24 మంది శ్రీలక్ష్మీగణపతి హోమం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రశన, ఐదుగురికి తులాభారం, ఏడుగురికి అక్షరాభ్యాసం నిర్వహించారు. 40 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. 2,352 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి ఈ ఒక్కరోజు రూ.3,92,731 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి
అమలాపురం టౌన్: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఆటో యూనియన్ నాయకుడు వంగనూరు జాన్సన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, డ్రైవర్లను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురంలోని దుర్గా ఆంజనేయ ఆటో యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా ఆటో యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జరిమానాల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీఓ, పోలీసు ఆగడాలను అరికట్టాలని సమావేశం డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్లకు మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ సమస్యపై జాన్సన్బాబుతో జిల్లా ఆటో యూనియన్ కార్మికులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఆగస్టు 20, 21 తేదీల్లో జరుగుతాయని జాన్సన్బాబు తెలిపారు. ఆటో కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ప్రధాన చర్చకు జరగనుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, కార్యదర్శులు ఊటాల వెంకటేష్, మోకా శ్రీను, ప్రతినిధులు బొలిశెట్టి శంకర్, వాసంశెట్టి శ్రీను, బొక్కా నాని, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోరింగ అభయారణ్యంలో స్టడీ టూర్
తాళ్లరేవు: ప్రముఖ పర్యాటక ప్రాంతం కోరింగ అభయారణ్యాన్ని కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్లో శిక్షణ పొందుతున్న సుమారు 350 పోలీస్ ట్రైనీస్ ఆదివారం సందర్శించారు. స్టడీ టూర్లో భాగంగా అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు ఆధ్వర్యంలో కోరింగ ఎకో టూరిజానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మడ అడవుల ప్రయోజనాలు, ఎకో టూరిజం ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని మడ అడవులు ఏ విధంగా కాపాడుతున్నాయనే అంశాలను అటవీ సిబ్బంది తెలిపారు. సెక్షన్ అధికారి కె.సిద్ధార్థ, ఎఫ్బీఓలు గోపి నాగేంద్రకుమార్, ఽకె.మహేష్, కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు యఽథావిధిగా పీజీఆర్ఎస్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్లను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సోమవారం పిచ్చుకలంకలో సీఎం పర్యటన సందర్బంగా జిల్లా అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో దిగువ స్థాయి, ఇతర అధికారులు పీజీఆర్ఎస్కు వస్తారన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, తదితర వివరాల కోసం 1100 టోల్ నంబరుకు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి ద్వారకాతిరుమల: స్థానిక చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఏఈవో మెట్టపల్లి దుర్గారావు స్వామివారి చిత్ర పటాన్ని ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు తదితరులున్నారు. చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం నిడదవోలు: స్ధానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరగుతున్న రాష్ట్రస్థాయి మహిళల చదరంగం పోటీలు ఆదివారంతో ముగిసాయి. ప్రధమ స్థానంలో త్రిపురాంబిక (తిరుపతి) రెండో స్థానం వి.మోహిత (గుంటూరు), మూడో స్థానం సీహెచ్ వైష్ణవి (గుంటూరు), నాలుగో స్థానంలో జి.హిమ తేజస్విని (నెల్లూరు)నిలిచారు. వాసవీ జిల్లా గవర్నర్ కేదర్శెట్టి రవికుమార్, వాసవియన్ గోల్డెన్ స్టార్ నూలి వెంకటరమణమూర్తిలు గెలుపొందిన విజేతలకు బహుమతి అందజేశారు. నేటి నుంచి కౌన్సెలింగ్ రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి 14వ తేదీ వరకు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), 15వ తేదీ (జనరల్ పూల్) రాజమహేంద్రవరంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు ధ్రువపత్రాలు ఒరిజినల్, జెరాక్స్ కాపీలతో రావాలని ప్రిన్సిపాల్ సునీల్కుమార్ పేర్కొన్నారు. -
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో..
హామీ: చెయ్యేరు గ్రామంలో రూ.8 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం ప్రస్తుత పరిస్థితి: కొన్ని రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం జరిగాయి. కానీ చెప్పినట్టుగా మొత్తం గ్రామంలో రూ.8 కోట్లతో పనులు మాత్రం జరగలేదు. ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియడం లేదు. దీని పై అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. పర్యటన: ముమ్మిడివరం నియోజకవర్గం (2025 మే 31న పి–4 కార్యక్రమంలో భాగంగా) హామీ: కాట్రేనికోన మండలం చెయ్యేరులో చెరువు ఆధునీకరణ ప్రస్తుత పరిస్థితి: చెయ్యేరులో చెరువును నిల్వ ట్యాంకుగా ఆధునీకరించి తాగునీటి ప్రాజెక్టుగా నిర్మిస్తామని రూ.17 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. హామీ ఇచ్చి ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోయింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.


