breaking news
Movies
-
యూరప్లో ఫ్యామిలీ డ్రామా
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల యూరప్లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్.ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం: నీరజ కోన
‘‘స్కూల్ డేస్ నుంచే నాకు రైటింగ్ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ కోన. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్ సిట్టింగ్లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. ⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ .⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్లోనే ఎన్టీఆర్, రామ్చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్ స్కూల్, ఎక్స్పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను. -
శింబు @ అరసన్
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్ని ఖరారు చేశారు. కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని టాక్. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.శింబు కెరీర్లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తార ని కోలీవుడ్ టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025 -
తెలుగు సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్లా రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనలోని కళామతల్లిని బయట పెడుతుంటారు. ఏదైనా ఈవెంట్స్కు వెళ్లినప్పుడు డ్యాన్స్తోనూ అలరిస్తూ సందడి చేస్తుంటారు. మల్లా రెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్ జరిగితే తనలో టాలెంట్ను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు..కళాకారుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.అయితే ఇటీవల దసరా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశాడని చెప్పారు. ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని వెల్లడించారు. అయినా కూడా నేను ఆ పాత్రను ఒప్పుకోలేదని మల్లారెడ్డి వివరించారు. విలన్గా చేస్తే ఇంటర్వెల్దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ హాస్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. -
రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. వామ్మో అంత రన్ టైమ్?
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా రన్ టైమ్ గురించి తెగ చర్చ నడుస్తోంది. రెండు పార్ట్స్ ఓకేసారి కావడంతో నిడివిపై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత శోభు యార్లగడ్డ రన్ టైమ్ గురించి మాట్లాడారు.బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్..ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిరపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. -
జాతి రత్నాలు-2 చేస్తే నటిస్తారా?.. ప్రియదర్శి సమాధానం ఇదే!
ప్రియదర్శి పులికొండ, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అప్పట్లో ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ డాలర్ల మార్క్ను దాటిన చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ప్రియదర్శి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిత్రమండలి సినిమాతో మరోసారి జాతిరత్నాల్లాంటి ఎంటర్టైన్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా నవ్వులు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి జాతిరత్నాలు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆ టైమ్లో వచ్చిన జాతి రత్నాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యిందని ప్రియదర్శి అన్నారు. జాతిరత్నాలు సినిమాకు, మిత్రమండలికి చాలా వేరియషన్ ఉంటుందన్నారు. ఒకవేళ ఇప్పుడు కనుగ జాతిరత్నాలు-2 తీస్తే నేను మాత్రం అస్సలు చేయనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ.. నేను మాత్రం నటించనని స్పష్టం చేశారు.కాగా.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. -
80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్
1980ల్లో దక్షిణాది భాషల్లో హీరోహీరోయిన్లుగా నటించిన స్టార్స్.. ప్రతి ఏడాది ఒక్కచోటకు చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చెన్నైలో రీయూనియన్ జరిగింది. రెండు రోజుల క్రితం ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు వీడియో బయటకొచ్చింది. అందరూ దీన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇది 12వ రీ యూనియన్ అని నటుడు నరేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది వీరంతా చిరుత థీమ్ని ఎంచుకున్నారు. చిరుత థీమ్లో దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఆడిపాడుతూ కనిపించారు.All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025 -
బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. ఆ హీరో కోసమే.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ ఘనతను సాధించింది. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పార్ట్లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్ను కాదని.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు. ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్ను సంప్రదించినట్లు ఆన్లైన్లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు.అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. ఈ సినిమాను కేవలం ప్రభాస్ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు. ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు. ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు. ఆ పాత్రకు హృతిక్ రోషన్ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టారు నిర్మాత యార్లగడ్డ.హృతిక్పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్..కాగా.. బాహుబలి దర్శకుడు రాజమౌళి హృతిక్ రోషన్ పట్ల 2009లో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ధూమ్ -2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశా.. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు. ఈ కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని.. హృతిక్ రోషన్ను చాలా గౌరవిస్తానని అన్నారు. -
గాయంతోనూ షూటింగ్.. రవితేజ సహజ నటుడు : శ్రీలీల
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేఫథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెచ్చింది చిత్రబృందం. తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఫన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజపై హీరోయిన్ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు.రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు. -
పెళ్లి కూతురిలా అపర్ణ.. చేతులకు పారాణితో మౌనీ
చేతులకు పారాణితో లెహంగాలో మౌనీ రాయ్పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ అపర్ణ దాస్ఒంటరిగా దాండియా ఆడేస్తూ ప్రియా వారియర్క్యారవాన్ ఫన్ మూమెంట్స్తో మృణాల్ ఠాకుర్పారిస్ దేశంలో విహారయాత్రలో అనన్య పాండేసముద్రం, ఆకాశాన్ని గుర్తుచేస్తున్న అనుపమ డ్రస్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్ సందేశ్
‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు. -
ఇన్స్టాలో చాటింగ్.. లవ్స్టోరీ బయటపెట్టిన నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎక్కువ సమయంలో సతీమణి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)కే కేటాయిస్తున్నాడు. ఖాలీ సమయం దొరికితే భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రేమ కథను చెబుతూ.. శోభితను పొగడ్తలతో ముంచేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితతో ఎలా ప్రేమలో పడ్డాడో వివరించాడు.(చదవండి: ‘బుజ్జితల్లి’ పాట వల్ల శోభిత నాతో గొడవపడింది : నాగ చైతన్య)ఓ టీవీ చానల్లో జగపతి బాబు నిర్వహిస్తున్న టాక్ షోకి వెళ్లిన నాగ చైతన్య.. తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సోషల్ మీడియా వల్లే వీరిద్దరికి పరిచయం ఏర్పడి..అది కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిందట. ‘ఓ సారి నేను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నా క్లౌడ్ కిచెన్ 'షోయు' గురించి పోస్ట్ పెట్టాను. దానికి శోభిత ఎమోజీతో కామెంట్ చేసింది. వెంటనే నేను రిప్లై ఇచ్చాను. అలా చాటింగ్ ద్వారా మేమిద్దరం క్లోజ్ అయ్యాం. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. నా జీవిత భాగస్వామిని ఇన్స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించుకోలేదు’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అదే షోలో ‘మీరు ఏది లేకుండా జీవించలేరు’ అని జగపతి బాబు అడగ్గా.. చైతన్య వెంటనే ‘నా భార్య శోభిత’ అని సమాధానమిచ్చాడు. తన జీవితంలో శోభితకు అధిక ప్రాధాన్యత ఉందని చైతూ చెప్పారు.కాగా, నాగచైతన్య-శోభితల పెళ్లి గతేడాది డిసెంబర్లో జరిగింది. అంతకు ముందు 2017లో సమంతను ప్రేమ వివాహం చేసుకున్న చైతూ.. 2021లో విడాకులు ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండి.. 2024లో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. -
ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
తమిళంలో ఇచ్చేది అంతే.. తెలుగులో ఎందుకింత డిమాండ్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. -
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
శ్రీలీల-భాగ్యశ్రీ.. ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
రీసెంట్ టైంలో కంటెంట్ లేదా భారీతనం ఉంటేనే ఆయా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగానే ఉన్నారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. ఇప్పుడు అలా అనుకున్న ప్రాజెక్ట్ కోసం రేసులో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయట.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)'మహానటి', 'సీతారామం', 'కల్కి' చిత్రాలతో మళ్లీ పుంజుకున్న వైజయంతీ మూవీస్.. తాజాగా 'చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదో ఫిమేల్ సబ్జెక్ట్ అని, అయితే లీడ్ రోల్ కోసం శ్రీలీల లేదా భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. తండ్రి కూతురు బ్యాక్ డ్రాప్ ఎమోషన్లతో ఈ మూవీ తీయబోతున్నారనే తెలుస్తోంది.ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల, భాగ్యశ్రీ ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లని మెయిన్ లీడ్గా పెట్టి ఓ మూవీ అంటే ఏదో డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనతో పాటు హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఎంటర్టైనింగ్గా 'మిత్రమండలి' ట్రైలర్) -
కాంతారపై టీమిండియా స్టార్ ప్రశంసల వర్షం.. రిషబ్ యాక్షన్కు ఫిదా
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్-1(Kantara: Chapter 1) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేరాడు.రిషబ్ శెట్టి మ్యాజిక్కు రాహుల్ ఫిదా అయిపోయాడు. "ఇప్పుడే కాంతార సినిమా చూశాను. రిషబ్ శెట్టి మరోసారి అద్బుతం సృష్టించాడు. ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని" రాహుల్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.2022లో విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్-2025లో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత తరపున ఆడుతున్నాడు. తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కేఎల్ సన్నద్దం కానున్నాడు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్లో పాల్గోనుంది. రాహుల్ టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గత పది ఇన్నింగ్స్లలో 532 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ను భారత్ 2-2తో డ్రా చేసుకోవడంలో రాహుల్ ది కీలక పాత్ర. ఇప్పుడు అదే జోరును విండీస్పై కూడా కొనసాగిస్తున్నాడు.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి’ -
ఎంటర్టైనింగ్గా 'మిత్రమండలి' ట్రైలర్
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిత్రమండలి'. అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ట్రైలర్ చూస్తుంటే ఫన్నీగా ఉంది. 'జాతిరత్నాలు' తరహాలో నవ్వించడమే మూవీ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. వెన్నెల కిశోర్, సత్య తదితరులు కూడా కామెడీతో నవ్వించేలా కనిపిస్తున్నారు. దీపావళి బరిలో 'మిత్రమండలి'తో పాటు కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?) -
సాయి పల్లవితో ఆ పాట.. శోభిత నాతో మాట్లాడలేదు : నాగ చైతన్య
నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్లో అత్యధిక వసూళ్ల(రూ. 100 కోట్లు)ను సాధించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బుజ్జితల్లి పాట రిలీజ్కి ముందే సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మొన్నటి వరకు ఏ ఈవెంట్లో చూసినా ఈ పాట వినిపించేంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ పాట గురించే ఎక్కువగా చర్చించారు. అంత సూపర్ హిట్గా నిలిచిన ఈ పాట.. నాగ చైతన్యకు మాత్రం కాస్త ఇబ్బందినే కలిగించిందట. ఈ పాట కారణంగా తన సతీమణి శోభిత(sobhita dhulipala) కొన్నాళ్లపాటు మాట కూడా మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్యనే చెప్పారు. తాజాగా ఆయన జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘బుజ్జితల్లి’ పాట వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నాడు.‘శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తాను. అయితే ఈ పేరునే తండేల్లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం.. బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత అప్సెట్ అయింది. కోపంతో కొన్నాళ్ల పాటు నాతో మాట్లాడలేదు. ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది. కానీ నేనెందుకు అలా చేస్తా? అని నవ్వుతూ చెప్పాడు చైతన్య. ఇక భార్యభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండవు. ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే..వారి రిలేషన్షిప్ నిజమైనది కాదని అర్థం’ అని చెప్పుకొచ్చాడు.నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'జయం మనదేరా'కు 25 ఏళ్లు.. 'థమ్స్ అప్'తో ఉన్న లింక్ ఏంటో తెలుసా?
కులం కోసం కాదు... మనుషుల కోసం పోరాటం...! అనే మెసేజ్ ఇచ్చిన 'జయం మనదేరా' చిత్రానికి 25 ఏళ్లు. ఈ మూవీతో కులాల మధ్య అంతరాన్ని తగ్గించే మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వెంకటేష్ మెప్పించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయింది. ఇందులో వెంకటేశ్ ద్విపాత్రాభినయంలో కనిపించగా భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.2000లో విడుదలై సూపర్ డూపర్ హిట్గా 'జయం మనదేరా' నిలిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందింది. వెంకటేష్ కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవడమే కాకుండా.. ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్.. మహదేవ నాయుడు, అభిరాం అనే రెండు పాత్రలు పోషించారు. అప్పట్లో ఇదో మాస్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించారు.'జయం మనదేరా' మూవీ రూ. 16 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి 2000 సంవత్సరంలో రెండోవ అతిపెద్ద గ్రాసర్గా నిలిచింది. నైజాం ప్రాంతంలో ఆల్-టైమ్ మొదటి వారం రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా.. చిరంజీవి నటించిన అన్నయ్య కలెక్షన్స్ను కూడా అధిగమించింది. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన (కలిసుందం రా) 18 కోట్ల షేర్తో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జయం మనదేరా చిత్రం 149 కేంద్రాలలో 114 ప్రింట్లతో విడుదల కాగా... 120 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ప్రదర్శించారు. అలా 2000 సంవత్సరం వెంకటేష్కు ఇది గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు.అయితే, ఈ సినిమాకు బ్రాండ్ ప్రమోషన్గా థమ్స్ అప్ కంపెనీ కొనసాగింది. సినిమా కోసం బ్రాండ్ ప్రమోషన్గా ఒక కంపెనీ నిలవడం అనేది ఇక్కడి నుంచే మొదలైంది. అందుకోసం ఆ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించింది. ఆ డబ్బుతోనే ఈ సినిమా నిర్మించేందుకు కాస్త ఉపయోగపడిందని చెబుతారు. ఇది అప్పట్లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ యూరప్లో 25 రోజులు కొనసాగింది. ఆపై రెండు పాటలను యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరించారు. ఇలా ఇతర దేశాల్లో షూటింగ్ జరగడం ఆరోజుల్లో కాస్త అరుదుగానే జరిగేది. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనిపిస్తోంది. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైపోయాయా అనే సందేహం కలుగుతోంది. తాజాగా రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?)హరిణ్య కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. బిగ్బాస్ షోలో రాహుల్ పార్టిసిపేట్ చేసిన టైంలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. రీసెంట్గా ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పడు హరిణ్య ఫ్రెండ్ ఇంటిలో చిన్నపాటి పార్టీ జరిగింది. అయితే ఇది బ్యాచిలర్ పార్టీనా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోని హరిణ్య.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీడియో చూస్తుంటే ఈనెలలోనే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరగనుందేమో అనిపిస్తుంది.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇతడు మాస్ సాంగ్స్ పాడటంలో స్పెషలిస్ట్. ఇప్పటికే 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి నజరానా కూడా అందుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?
బిగ్బాస్ షో హడావుడి ప్రస్తుతం నడుస్తోంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతోంది. హిందీలోనూ కొన్ని వారాల క్రితమే 19వ సీజన్ మొదలైంది. అయితే లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వస్తున్నట్లు చూపించారు. దీంతో చాలామంది షాకయ్యారు. తీరా చూస్తే ఇతడి సోదరి మాలతి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ మాలతి సంగతేంటి?ఉత్తరప్రదేశ్కి చెందిన దీపక్ చాహర్.. ఐపీఎల్లో చెన్నై జట్టుకి ఆడినప్పుడు చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై టీమ్కి ఆడుతున్నాడు. అయితే లేటెస్ట్గా ప్రసారమైన హిందీ బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్లో తొలుత ఇతడు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన సోదరిని సపోర్ట్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా మాలతి చాహర్.. బిగ్బాస్ 19లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు దీపక్ చాహర్ అక్కగా తనకు గుర్తింపు ఉందని, ఈ షోలో ఆడి సొంత గుర్తింపు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని చెప్పుకొచ్చింది. మాలతి విషయానికొస్తే.. ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్ వైపు వచ్చింది. పలు ఫ్యాషన్ పోటీల్లోనూ పాల్గొంది. 2014లో ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ రెండో రన్నరప్గా నిలిచింది. అయితే 2019లో ఐపీఎల్ సందర్భంగా చెన్నై జట్టుకు చీర్స్ చెబుతూ కెమెరా కంటపడి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది.2018లో 'జీనియస్' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సదా వియా హోజీ, మా ఓ మేరీ మా తదితర చిత్రాల్లోనూ నటించింది. ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం, నిర్మాణ రంగల్లోనూ ప్రవేశించింది. 'ఓ మారీ' అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. ఇన్ స్టాలోనూ ఈమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మరి బిగ్బాస్ షోతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?) View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) -
గాంధీజీపై నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు
మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అంటూ రాయడానికి వీల్లేని బూతుపదాలతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియోని స్వయంగా ఆయనే ఎక్స్లో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. వీడియోలో ఏముంది?గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 శ్రీకాంత్ భరత్.. గాంధీజీని దూషిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా శ్రీకాంత్ భరత్ మరో వీడియోని షేర్ చేశాడు. అందులో గాంధీజీ స్త్రీలోలుడని, ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. ‘నమస్కారం. నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2న ఓ పోస్టు పెడితే.. చాలా బూతులు తిట్టారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? అంటూ శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారు. గాంధీజీ జాతిపిత అయితే తాను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటూ’ ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి.. ఇది నిజం’ అని ఎక్స్లో రాసుకొచ్చాడు. శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై గాంధీయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు వీడు ఇంత వాగుతున్నా కూడా పోలీస్ లు ఏం చేస్తున్నారు?? ఫాదర్ ఆఫ్ నేషన్ నీ ఇలా ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడొచ్చా సార్ ’ అంటూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘నువ్వు మానసిక సన్యాసి లా ఉన్నావ్. చరిత్ర అసలు తెలియదు. విగడ్ ఆస్పత్రిలో చూపించుకో’ అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. మరికొంత మంది శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.గతంలోనూ..నటుడు శ్రీకాంత్ భరత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సినీ క్రిటిక్స్ని బూతులు తిడుతూ విడియో పెట్టి.. తర్వాత క్షమాపణలు చెప్పాడు. కొన్నాళ్లకు మరోసారి రివ్యూవర్స్పై రాయడానికి వీల్లేని పదాలతో రెచ్చిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నటనతో కంటే ఇలాంటి వివాదస్పద పోస్టులతోనే శ్రీకాంత్ భరత్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. Dare to WATCH?!?!?!THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025 -
'బిగ్బాస్' షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్లో బిగ్బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. -
గుడ్న్యూస్ చెప్పిన 'కోయిలమ్మ' జంట
టాలీవుడ్ నటుడు సాయికిరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ సోషల్మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర సీరియల్స్తో బుల్లితెరపై మరింత గుర్తింపు పొందాడు. అయితే, గతేడాది డిసెంబర్లో తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.సాయికిరణ్, స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి కూడా సింగర్గా గుర్తింపు పొందాడు. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. కానీ, కొన్ని మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. కొంతకాలం పాటు ఒంటరిగానే ఉన్న సాయికిరణ్. తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వారిద్దరూ శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
బాహుబలి-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి మరోసారి అద్భుతాలను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ విడుదలై పదేళ్ల సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఒకే భాగంలో తీసుకొచ్చారు. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలో బాహాబలి-3 గురించి వార్తలు వచ్చాయి. ఈ అంశం గురించి తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) స్పందించారు. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) సినిమా చివరిలో ‘బాహుబలి 3’ ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో నిర్మాత శోభు యార్లగడ్డ ఇలా అన్నారు. అదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని చెప్పారు. పార్ట్-3 కోసం చాలా వర్క్ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, బాహుబలి 3 ఖచ్చితంగా జరుగుతోందని ప్రకటించారు. అనుకున్నంత సమయంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చునని శోభు స్పష్టం చేశారు. ఫైనల్గా బాహుబలి 3 గురించి అప్డేట్ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం రన్టైమ్ ఎంత ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే, కొన్ని పాటలతో పాటు చలావరకు సీన్లు కూడా తొలగిస్తారని ప్రచారం ఉంది. ఏ సన్నివేశాలను కట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. -
నా భర్త మరో అమ్మాయితో హోటల్కి వెళ్లాడు: హీరో పవన్ సింగ్ సతీమణి
భోజ్పురి సూపర్స్టార్, నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్పై ఆయన రెండో సతీమణి జ్యోతి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ను అసభ్యకరంగా తాకి వార్తల్లో నిలిచాడు. దీంతో ఆమె ఏకంగా భోజ్పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు తప్పుడు ఉద్దేశం లేదని క్షమాపణలు చెప్పాడు. అయితే, తాజాగా ఆయనపై జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.పవన్ సింగ్, జ్యోతి సింగ్ ఇద్దరూ పలు విభేదాలతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జ్యోతి సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను తన భర్త పవన్ సింగ్ ఇంటికి వెళ్తే తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని పోలీసులపై భగ్గుమంది. ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆమె మాట్లాడుతూ.. “ భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న ఈ పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా..? ఎన్నికలు జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు ఉపయోగించాడు. అవి అయిపోయిన తర్వాత అతను మరొక అమ్మాయితో హోటల్కు వెళ్తాడు. కానీ, నన్ను మాత్రం భర్త ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అతని తప్పులను ఎవరూ అడగరు. ఆయన మాత్రం మా ముందే ఒక అమ్మాయిని తీసుకుని హోటల్కు వెళ్తాడు. దీనిని ఎవరూ అడగరు. భార్యగా, నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అని ఆమె చెప్పింది.పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి మధ్య కూడా గొడవలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సింగ్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Jyoti P Singh (@jyotipsingh999) -
విలన్గా భరణి.. తనూజ కోసం శ్రీజ బలి
బిగ్బాస్ తెలుగు సీజన్ 5వ వారం నామినేషన్స్ కార్యక్రమం పూర్తి అయింది. అయితే, కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్లోకి బిగ్బాస్ తీసుకెళ్లాడు. కానీ, మళ్లీ వారికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడంతో అందరూ గందరగోళంలో పడ్డారు. ఫైనల్గా ఇమ్మాన్యుయేల్ (Emmanuel) టాస్క్లో గెలిచి ఇమ్యూనిటీని సాధించుకున్నాడు.బిగ్బాస్ రణరంగంలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు. ఇమ్యూనిటీ కోసం మీరు చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ బెడ్పై ఎక్కువ సమయం ఉంటారో వారు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారని చెప్తారు. ఈ గేమ్లో బలమైన కంటెస్టెంట్స్ డీమాన్, కళ్యాణ్, ఇమ్మూ, భరణి ఒక టీమ్గా అయిపోయి.. వారి ప్రయారటీ ప్రకారం వరుసుగా బెడ్పై నుంచి కిందకు తోసేస్తారు. మొదటి రౌండ్లో సంజన, తర్వాతి రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత దివ్య,డీమాన్, శ్రీజ ఆట నుంచి విరమిస్తారు.శ్రీజను బలంగా నెట్టేసిన భరణిచివరి రౌండ్లో భరణి, శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరిని మాత్రమే కిందకు తోసేయాలి. అయితే, గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చిందని తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. ఆ మాటలకు కళ్యాణ్తో పాటు ఇమ్మూ కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, భరణి, తనూజకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. ఇలా వారందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. ఈ క్రమంలో శ్రీజకి గాయం కూడా అయింది. దీంతో శ్రీజను ఓదార్చేందుకు భరణి వెళ్తాడు. ఇలా మంచితనంగా నటించకండి అన్నా అంటూ భరణిపై శ్రీజ పైర్ అవుతుంది. చర్చలు జరుపుతున్న సమయంలో ఇలా తోసేయడం ఏంటి అంటూ సీరియస్ అయింది. మంచోడిలా నటించకండి. నీలా మంచిదానిలా నటించడం నాకు రాదన్నా.. అంటూ బాధ పడుతుంది. రేలంగి మావయ్యలా నటిస్తున్నావంటూ భరణిని శ్రీజ దుమ్ములేపింది. ఇక్కడ గెలిచిన భరణి, తనూజ, కళ్యాణ్, ఇమ్మూలకు గాలి- నిప్పు- నీరు టాస్క్ను బిగ్బాస ఇస్తాడు. ఇందులో విజేతగా ఇమ్మాన్యుయేల్ నిలుస్తాడు.కన్నీళ్లు పెట్టుకున్న దివ్యఈ టాస్క్లో అమ్మాయిల నుంచి ఎక్కువగా పోరాడింది దివ్య మాత్రమే... నమ్మిన భరణి కూడా తనకు సాయం చేయకపోవడంతో ఆమె బాధ పడింది. భరిణి ఎక్కువగా తనూజకు మాత్రమే అండగా నిలబడటం దివ్య సహించలేకపోయింది. బెడ్ మీద నుంచి తనను తోసేస్తున్నా కూడా భరణి అడ్డు పడలేదు. ఆపై అమ్మాయిలు ఎవరూ కూడా ఆమె కోసం నిలబడలేదు. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.విలన్గా భరణి..బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో చివర రౌండ్ జరుగుతున్న సమయంలో మాటల్లో పెట్టి శ్రీజను భరణి తోసేశారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. గతంలో తనూజకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమె కిందకు పంపితే బాగుంటుందని శ్రీజ చెబుతుంది. అందరూ శ్రీజ కరెక్ట్ అంటున్న సమయంలో తనూజ కోసం భరణి చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఈ టాస్క్లో దివ్య తర్వాత ఎక్కువగా గేమ్ ఆడింది కూడా శ్రీజానే.. కానీ, తనూజ మాత్రం కనీసం ఆటలో భాగం కాకుండా అలా ఉండిపోయింది. ఆమెను సేవ్ చేసి శ్రీజను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. గతంలో సుమన్కు ఇమ్యూనిటీ వచ్చిందనే కదా కిందకు తోసేశారు.. మరి తనూజాను ఎందుకు తోయలేదంటూ భరణిని ప్రశ్నిస్తుంది. ఇలా బుల్లెట్ లాంటి ప్రశ్నలతో శ్రీజ దుమ్ములేపుతుంది. రేలంగి మామయ్య రూపంలో ఉన్న విలన్ భరణి అంటూ విమర్శలు వస్తున్నాయి. -
కాంతారలో ఇలా కనిపించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
కాంతార ఛాప్టర్–1 చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్రామ్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్, కన్నప్ప, డాకు మహరాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్లో కనిపిస్తాననీ, ఆ గెటప్ కోసం గంటన్నర పాటు మేకప్కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్రామ్ పేర్కొన్నారు. -
డిసెంబరులో చాంపియన్
క్రిస్మస్ పండక్కి థియేటర్స్లోకి వస్తున్నాడు చాంపియన్. నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.మరోవైపుపోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాగా, ‘చాంపియన్’ని డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, రోషన్ కొత్తపోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు రోషన్. ఈ పాత్ర కోసం ఫిజికల్గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: ఆర్. మధి. -
నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే!
‘హుడియో హుడియో...’ అంటూ శ్రీలీలతో ఆడి పాడుతున్నారు రవితేజ. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్లైన్. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ– హీరోయిన్ శ్రీలీల కలిసి ‘మాస్ జాతర’ లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘హుడియో హుడియో...’ అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే... నీ సుట్టు పక్కల తిరిగేలా గిరి గీశావే... నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావే... నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే...’ అంటూ ఈ పాట సాగుతుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడిన ఈ పూర్తి పాట బుధవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె.వర్మ. -
ది ఇండియా స్టోరీ పూర్తి
‘ది ఇండియా స్టోరీ’ సినిమాను పూర్తి చేశారు కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్సాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో ఎమ్ఐజీ ప్రోడక్షన్స్ అండ్ స్టూడియోస్ పతాకంపై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో లాయర్గా నటించారు కాజల్.రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యా పారాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. మురళీ శర్మ, మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా కీలక పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. -
లాటరీ కింగ్?
నాగార్జున కెరీర్లోని వందో సినిమా చిత్రీకరణ కోసం కొన్ని రోజులుగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది. తొలి షెడ్యూల్లో నాగార్జున పాల్గొంటున్నారని సమాచారం.ఈ సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే తాజాగా ‘లాటరీ కింగ్’ అనే మరో టైటిల్ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారట. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం బల్టీ . ఇప్పటికే తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజ్ అవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని అన్నారు.దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ..'తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా బల్టీ సినిమా ఉండనుంది' అని అన్నారు. -
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ట్రాన్ ఏరిస్... రిలీజ్ ఎప్పుడంటే?
ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా ట్రాన్: ఏరిస్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏఐ టెక్నాలజీ ప్రధానంగా రూపొందించారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా లండన్ ప్రీమియర్లో జారెడ్ మాట్లాడుతూ... "ఒక విధంగా చూస్తే ఏఐ ఒక పెద్ద సంభాషణగా మారిన సరైన సమయంలో వస్తుంది. మేము ఈ సినిమా పై 9-10 సంవత్సరాల క్రితం పని చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏఐ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. వారు తెలిసినా లేదా తెలియకపోయినా, అది మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో భాగమైపోయింది. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుండటం ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను." అని అన్నారు. కాగా. ఈ చిత్రంలో జారెడ్ లెటో, జెఫ్ బ్రిడ్జెస్, గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, జోడి టర్నర్ స్మిత్, కామెరాన్ మోనాఘన్, హాసన్ మిన్హాజ్, గిలియన్ ఆండర్సన్ నటించారు. -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
అడివి శేష్ ఎక్కడ.. కొత్త సినిమాల సంగతేంటి?
అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం 'డకాయిట్' మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక 'డకాయిట్' వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. లేటేస్ట్గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.రష్మిక తన పోస్ట్లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
బిగ్బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?
బిగ్బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్గా జరిగింది.కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్లో ఉన్న పిక్ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
'రాజాసాబ్' మాళవిక స్మైల్.. నిధి అగర్వాల్ గ్లామర్
ఎర్రటి డ్రస్సులో వావ్ అనిపించేలా నిధి అగర్వాల్గ్యాలరీలో మిగిలిన ఫొటోలన్నీ పోస్ట్ చేసిన నభా నటేశ్ఎర్రని లిప్స్టిక్తో గట్టిగా నవ్వేస్తున్న మాళవిక మోహనన్అందమే అసూయపడేలా నందితా శ్వేత పోజులుసింపుల్ డ్రస్సులో క్యూట్గా రితికా నాయక్ఇంట్లో స్పెషల్ హోమం చేసిన హీరోయిన్ ప్రణీత'ఇడ్లీ కొట్టు' షూటింగ్ జ్ఞాపకాలతో శాలినీ పాండే View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Sanya Malhotra (@sanyamalhotra_) -
ఓటీటీలో 'ఓజీ'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
కాంతార సినిమాకు క్రేజ్ దక్కడంతో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బ పడింది. ఓజీ కేవలం మొదటిరోజు మాత్రమే భారీ కలెక్షన్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత థియేటర్ల పరిస్థితి ధారుణంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కాంతార జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఓటీటీ బాటలోకి ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం నెలరోజుల్లోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ వర్షన్లో కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ఓజీ విడుదలైంది. అయితే, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్ షోలు (336) వేసి ఒక్కో టికెట్ ధర రూ. 1000 నిర్ణయించడంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల మొదటిరోజు కలెక్షన్ల రికార్డ్స్ను ఎంత మాత్రం టచ్ చేయలేకపోయింది. ఓజీ రెండోరోజు నుంచే ఒక్కసారిగా 80 శాతం పైగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ఓజీ రూ. 183 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు నటించారు. -
రామాయణలో సీత రోల్.. నేను ఆ పని చేయలేదు: కేజీఎఫ్ హీరోయిన్
'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యశ్ సరసన నటించిన ముద్దుగుమ్మ తన గ్లామర్తోనూ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత నాని హీరోగా వచ్చిన హిట్ -3 మూవీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్లో 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందించింది. ఆడిషన్కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది.సీత పాత్రకు ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది.శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. -
క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
2015లో మిస్క్యారేజ్.. ఇన్నాళ్లకు గుడ్న్యూస్ చెప్పిన పింకీ
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ గుర్తుందిగా.. ఇప్పుడా పింకీ తల్లి కాబోతోంది. పింకీ అలియాస్ సుదీప (Sudeepa Pinky) గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్త శ్రీరంగనాథ్తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకోగా.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతోంది అని రాసుకొచ్చింది. అయితే తనకు ఈ మధ్యే డెలివరీ అయిందని, మెటర్నటీ షూట్ ఫోటోలను ఆలస్యంగా పోస్ట్ చేసిందంటున్నారు. మరి తన డెలివరీ గురించి సుదీప క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.2015లో మిస్క్యారేజ్సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో తొలిసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. 2015లో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ, అప్పుడు రెడీగా లేను. అయినా సరే, చూద్దామని ప్రెగ్నెన్సీని అలాగే ఉంచుకున్నాను. కొంతకాలానికి పొట్టలో బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాను. బేబీ హార్ట్బీట్ కూడా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ సమస్య ఉండేది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, థైరాయిడ్ ఎక్కువవడంతో బిడ్డను కోల్పోయాను అని చెప్తూ ఏడ్చేసింది.సినిమా1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో వచ్చిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పింకీ. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ మధ్య తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ అందుకుంది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత మళ్లీ స్క్రీన్పై కనిపించనేలేదు. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య -
నాలుగేళ్ల తర్వాత ఫీల్డ్లోకి దిగుతున్న రోషన్
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఛాంపియన్’ (Champion). సుమారు నాలుగేళ్ల తర్వాత రోషన్ మళ్లీ వెండితెరపైకి రానున్నాడు. ఈ క్రమంలో ఛాంపియన్ విడుదల పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాపై రోషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 50కి పైగా కథలను రిజెక్ట్ చేసి ఫైనల్గా ఈ స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆపై ఈ చిత్రాన్ని స్వప్న దత్ నిర్మిస్తుండంతో అంచనాలు బాగానే ఉన్నాయి.పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమాను క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ నెటిజన్లను కూడా మెప్పించింది. ఇందులో రోషన్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం రోషన్ మేకోవర్ చాలా కొత్తగా ఉండటంతో ఈసారి భారీ హిట్ కొడతాడని నెటిజన్లు కూడా అభిప్రాయం చెందుతున్నారు. View this post on Instagram A post shared by Swapna Cinema (@swapnacinema) -
'కానిస్టేబుల్' సెన్సార్ పూర్తి.. స్పెషల్ సాంగ్ రిలీజ్
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించారు. అక్టోబరు 10న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రం తన కెరీర్కు మరో మలుపు అవుతుందని హీరో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి కావడం, ట్రైలర్ కి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇందులోని ఓ మంచి ఐటమ్ సాంగ్ని దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది అని అన్నారు. -
కేజీఎఫ్ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్గా జరుపుకుంటా!: శివజ్యోతి -
'కాంతార' దెబ్బతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించిన బిగ్ సినిమా
దసరా సందర్భంగా విడుదలైన కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ హిందీ సినిమా ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ (Sunny Sanskari Ki Tulsi Kumari) సరికొత్త ప్లాన్ వేసింది. కాంతారను తట్టుకునేందుకు మేకర్స్కు మరోదారి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.కాంతారతో పోటీ తట్టుకోవడం కష్టమని భావించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్ర యూనిట్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో నిర్మాతలు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. ప్రేమికులకు ఈ సీజన్లోన గొప్ప ఆఫర్ అంటూ తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారులు ఆఫర్ను పొందడానికి SSKTK కోడ్ను ఉపయోగించాలని సూచించారు.సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 నెట్ కలెక్షన్లు సాధించింది. కాంతార చిత్రానికి క్రేజ్ పెరగడంతో ఈ మూవీ కలెక్షన్స్పై ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తుంది. -
ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్గా జరుపుకుంటా!: శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శివజ్యోతి (Shiva Jyothi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. వచ్చే ఏడాది తన పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ రానుందని ఈ మధ్యే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు తల్లి కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా శివజ్యోతి సీమంతం జరిగింది. మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండెచప్పుడి కోసం ఎదురుచూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది.మీరు లేకుండా ఎలా?ఇది చూసిన చాలామంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్కా? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శివజ్యోతి.. ఇది ఊర్లో జరిగిన వేడుక అని.. 7 లేదా 9వ నెలలో మళ్లీ ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది. మీరు నాకు చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ కోసం మీరంతా ఎదురుచూశారు. మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది? అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్గా జరుపుకోనుందన్నమాట!ఎవరీ శివజ్యోతి?శివజ్యోతి.. తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కడినుంచి బిగ్బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టి పాపులారిటీ దక్కించుకుంది. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచింది. ఈ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది. తన ఊరికి చెందిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి -
చాన్నాళ్లకు నాగశౌర్య నుంచి సినిమా.. టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. 2023లో చివరగా 'రంగబలి' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అయితే రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటి గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే చిత్రాన్ని సిద్ధం చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు)రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విధి హీరోయిన్. యూత్ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తీసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పూర్ణ సీరియస్ లుక్లో కనిపించగా, సాయి కుమార్ పోలీస్ పాత్ర పోషించారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుందని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ 'కాంతార 1', 'ఇడ్లీ కొట్టు' లాంటి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఈసారి మాత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎర్రచీర, కానిస్టేబుల్, శశివదనే, అందెల రవమిది, అరి, మటన్ సూప్, ప్రేమతో దెయ్యం లాంటి సినిమాలతో పాటు 'బల్టీ' అనే డబ్బింగ్ బొమ్మ ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త మూవీస్, వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్, లీగల్లీ వీర్ అనే తెలుగు చిత్రాలతో పాటు కురుక్షేత్ర అనే యానిమేటెడ్ డబ్బింగ్ సిరీస్ ఈ వారంలోనే రానుంది. అలానే ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2' కూడా ఈ వారాంతంలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 06 నుంచి 12వ తేదీ వరకు)హాట్స్టార్మిరాయ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 10సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) - అక్టోబరు 10నెట్ఫ్లిక్స్హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 07ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 07కారమెలో (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 08ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08నెరో (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబరు 08బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09 (రూమర్ డేట్)ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) - అక్టోబరు 09ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 09విక్టోరియా బెక్హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 09కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబరు 10స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 10 అమెజాన్ ప్రైమ్మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 08జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 10సన్ నెక్స్ట్త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10రాంబో (తమిళ సినిమా) - అక్టోబరు 10జీ5ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) - అక్టోబరు 10వెదువన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 10లయన్స్ గేట్ ప్లేలీగల్లీ వీర్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10ఆపిల్ ప్లస్ టీవీద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 10(ఇదీ చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి) -
'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో సంతాపం తెలిపింది.ఈ ఏడాది మే 13న రాకేశ్ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పారు.కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_cheee) -
రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి
ప్రముఖ సినీరచయిత కోన వెంకట్ (Kona Venkat) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రచయిత రెండో కూతురు శ్రావ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, రామ్ పోతినేని, అంజలి, రామ్గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, బాబీ, కోర్ట్ జంట శ్రీదేవి- హర్ష్ రోషన్ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. పూరీ జగన్నాథ్- చార్మి ఒకే కారులో వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.కోన వెంకట్ జర్నీకోన వెంకట్ సినిమా ఇండస్ట్రీలో కథా, సంభాషణల రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఢీ, రెడీ, దూకుడు, అదుర్స్, గీతాంజలి, అల్లుడు శీను, నిన్ను కోరి వంటి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించాడు. చివరగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. సత్య, దిల్సే, కౌన్, జంగల్, కంపెనీ వంటి కొన్ని హిందీ సినిమాలకు తెలుగు డబ్బింగ్ రైటర్గానూ పని చేశాడు. MEGASTAR #Chiranjeevi garu at Kona Venkat daughter’s wedding@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/XvYz3tk3t0— Chiruholic (@chiruholicc) October 6, 2025 చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ -
'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ
వెండితెరపైకి బాహుబలి మళ్లీ తిరిగొస్తున్నాడు.. కానీ, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మాత్రం తమ ప్లాట్ఫామ్ నుంచి తొలగించేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి. అయితే, బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఈ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.బాహుబలి రెండు భాగాలు నెట్ఫ్లిక్స్లో హిందీ, ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు చెందిన వారు ఈ చిత్రాన్ని చేసే ఛాన్స్ దక్కింది. కానీ, సెప్టెంబర్ 30న నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించేసింది. అయితే, ఈ మూవీని ఎందుకు తొలగించారు..? అనే కన్ఫ్యూజన్ ప్రభాస్ ఫ్యాన్స్లో కలిగింది. కానీ, కొన్న కథనాల ప్రకారం నెట్ఫ్లిక్స్తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం కాలపరిమితి ముగిసిందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే బాహుబలిని ఓటీటీ నుంచి తొలగించారని చెబుతున్నారు. సోషల్మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు కనిపిస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఇదొక స్ట్రాటజీలో భాగమని అంటున్నారు.బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు బాహుబలి ది ఎపిక్ అని టైటిల్తో రీరిలీజ్ కానున్నాయి. ఈ సినిమా ఐమ్యాక్స్ , 4DX, EpiQ వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ రెండు భాగాల రన్ టైమ్ 5గంటల 27నిమిషాలు ఉంది.కానీ, రీరిలీజ్ కోసం దానిని తగ్గించి మూడున్నర గంటల లోపు ఉండవచ్చని తెలుస్తోంది. -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్తో ఇద్దరు షాక్లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్మేట్స్తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?
హరిత హరీశ్, మాస్క్ మ్యాన్, హృదయ మానవ్.. ఇవన్నీ ఒక్కరి పేర్లే! అయినా హరీశ్.. మాస్క్ మ్యాన్గానే ఎక్కువ ఫేమస్. అగ్నిపరీక్షలో అతడి ముక్కుసూటితనం మెచ్చిన జడ్జిలు బిగ్బాస్ 9కి పంపారు. ఈ సీజన్లో తిరుగులేని కంటెస్టెంట్ అనుకున్నారు. అతడికి ఎవరూ ఎదురునిలబడలేరనుకున్నారు. కానీ బిగ్బాస్ హౌస్లో అంతా తలకిందులైంది. హౌస్లో అగ్గిరాజేస్తాడనుకుంటే తనే అగ్గిలో దూకి బూడిదలా మిగిలాడు (Mask Man Haritha Harish).అలక బూనిన హరీశ్ఇతడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతాడు. షోలో గొడవలు కామన్.. అప్పుడే పోట్లాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. కానీ ఇతడు మాత్రం గొడవ దగ్గరే ఆగిపోయాడు. అవతలివారు కలుపుకుపోవాలన్నా కూడా దూరం పెట్టాడు. జనాలు అతడిని ఇంకొన్నివారాలు ఉంచాలనుకున్నా సరే నేను రానంటూ ఒక మూలన సైలెంట్గా కూర్చుండిపోయాడు. అన్నం మీద అలక చూపించాడు.ఆ ఒక్క సంఘటనతో సైలెంట్'ఇన్నాళ్లూ ఇమ్మాన్యుయేల్, భరణి మగాళ్లనుకున్నా.. కానీ ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నానని ఇప్పుడర్థమైంది' అని ఆవేశంలో ఓ కామెంట్ పాస్ చేశాడు. దీంతో ఆడవాళ్లంటే అంత చులకనా? అని అతడికి పెద్ద క్లాస్ పడింది. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని హర్టయ్యాడు. అప్పటినుంచి డౌన్ అవుతూ వచ్చాడు. నాగార్జున అన్నట్లుగానే ఇంట్లో వస్తువులకు, హరీశ్కు మధ్య పెద్ద తేడా లేనట్లుగానే కనిపించింది.ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే!తనకు ఆడాలని, హౌస్లో ఉండాలని కాస్తయినా ఆసక్తి లేకపోతే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు? అందుకే బయటకు పంపించేశారు. అయితే ఓ విషయంలో మాత్రం హరీశ్ను మెచ్చుకుని తీరాల్సిందే! ఓ గేమ్లో హరీశ్.. దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె చూసి పట్టుకోండి.. అంటూ అనవసర కామెంట్లు చేయడంతో అతడు ఆమె కాళ్లు మొక్కాడు. అక్కడ హరీశ్ అందరికీ నచ్చేశాడు. గుండెలో ఎంత బాధుంటే అలా చేస్తాడు! అని హరీశ్పై జాలిపడ్డారు.రెమ్యునరేషన్తను ఎలిమినేట్ అయినప్పుడు కూడా అతడి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను అని చాలాసార్లు అన్న హరీశ్.. ఎట్టకేలకు వారి మధ్య నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు లోలోన సంతోషించాడేమో! ఇకపోతే హరీశ్ వారానికి రూ.60-70 వేల మేరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ లెక్కన నాలుగు వారాలకు గానూ రూ.2.50 లక్షల పైచిలుకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది! -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
హై హై ప్రతి నాయికా
డ్యూయెట్స్ పాడుతూ, కాసిన్ని జోక్స్ వేస్తూ, ఎమోషనల్ సీన్స్లో కన్నీళ్లు పెట్టుకుంటూ... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే విభిన్న తరహా పాత్రలు దక్కితే ‘సై’ అనేస్తారు. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే... నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా వంటివారు విలన్ రోల్స్ చేసి, సక్సెస్ అయ్యారు.శ్రద్ధా శ్రీనాథ్, అనన్యా నాగళ్ల, సంయుక్త, రచితా రామ్, రుక్మిణీ వసంత్... ఇలా యువ తారలు సైతం విలన్ రోల్స్ చేసేందుకు ఆలోచించడం లేదు. ప్రతి నాయిక పాత్రల్లో నటనపరంగా విజృంభించి, ‘హై హై ప్రతినాయికా’ అని ప్రేక్షకులు అనేలా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేడీ విలన్గా చేస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.స్లమ్ డాగ్లో... వెంకటేశ్ ‘కూలీ నెం.1’, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘స్లమ్ డాగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు టబు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు విలన్గా కనిపిస్తారని సమాచారం. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో ‘మక్బూల్’, ‘అంధా ధూన్’ వంటి హిందీ చిత్రాల్లో టబు నెగటివ్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.ధన పిశాచి... టాలీవుడ్కి విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘జటాధర’లో సోనాక్షీ సిన్హా విలన్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపించనున్నారు. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిల్పా శిరోద్కర్ పాత్రలోనూ నెగటివ్ షేడ్స్ ఉంటాయట. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్లు ‘జటాధర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. దెయ్యంగా పూజ? దర్శక–నిర్మాత–నటుడు–కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ‘కాంచన’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘కాంచన 4’. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహీ మెయిన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారట. పూజ లేదా నోరా ఫతేహీ... ఇలా ఎవరో ఒకరి పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కాంచన 4’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కావొచ్చు. వారియర్ విలన్...కాలేజీ అమ్మాయి, ప్రేయసి, భార్య... ఇలా హీరోయిన్గా విభిన్న రకాల పాత్రల్లో నటించి, మెప్పించారు రష్మికా మందన్నా. ఇప్పుడు తనలోని నెగటివ్ యాంగిల్ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారట రష్మిక. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ ఖరారయ్యారు.ఇంకా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఆలియా. ఎఫ్... వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న వారియర్ విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే రష్మిక విలన్గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే కావొచ్చు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇంకా మరికొందరు కథానాయికలు ‘ప్రతి నాయిక’లుగా కనిపించనున్నారు. -
ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్.. బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ!
సెప్టెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్..డిఫరెంట్ శారీ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..టాలీవుడ్ నటి అనసూయ స్టన్నింగ్ లుక్..బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..బ్లాక్ బ్యూటీలా ఓజీ భామ శ్రియా రెడ్డి.. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘ఏమి మాయ ప్రేమలోన' పాట
అనిల్ ఇనుమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.కేరళలో టూరిస్ట్ గైడ్గా పని చేసే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపధ్యంలో తెరకెక్కిన ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్ ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్. ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా మలిచాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్ ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. -
కాంతార ఛాప్టర్-1.. పంజర్లి లుక్లో సందడి చేసిన అభిమాని!
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్గా హిట్గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.Goosebumps Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025 -
‘కాంతార’ కథ వెనుక పెద్ద కథే ఉందిగా!
రిషబ్ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి, నటించిన ‘కాంతార చాప్టర్ 1’(Kantara: Chapter 1)ఇప్పుడు బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విడుదలైన తొలి రోజే(అక్టోబర్ 2) ఈ చిత్రం రూ. 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది. వీకెండ్లోగా రూ. 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంతార మాదిరే ప్రీక్వెల్గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ కావడం పట్ల రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు. ‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘కాంతార’ కథకు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది. అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను. ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘కాంతార’ కథను రాశాను’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. కాంతార, కాంతార చాప్టర్ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. -
'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును'.. అనసూయ లేటేస్ట్ మూవీ ట్రైలర్
అనసూయ ( Anasuya Bharadwaj), సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనే ఉపశీర్షిక. ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిలోని ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాకు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇచ్చట అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా ఓ లైబ్రరీ చుట్టే తిరుగనుందని అనిపిస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కామం అనే పదం చుట్టే హైలెట్ కావడంతో ఆ కోణంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన నటుడు
అన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు.ఏడాదిన్నర తిరిగేలోపు..ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే! -
రాయలసీమ బిడ్డగా ఎంతోమందికి స్ఫూర్తి: సతీమణిపై మంచు మనోజ్ ప్రశంసలు
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. Dear @BhumaMounika thalli, You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025 -
ఆయన రూ. 50 ఇస్తేనే తినేవాడిని.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు: మహేశ్ విట్టా
మహేశ్ విట్టా.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి... షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్గానూ ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్బాస్ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. మంచి ఫేం అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా మాత్రం ఇంకా స్థిరపడలేదంటున్నాడు మహేశ్. ఇప్పటికీ ఆయనకంటూ సొంత ఇల్లు లేదట. తనకే కాదు తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఆస్తులేమి లేవని అంటున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహేశ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమాలంటే పిచ్చి..నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఇంటర్ అయిపోగానే నేను సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పా. మా వాళ్లు..చదువు అంతా పూర్తయిన తర్వాత పంపిస్తా అన్నారు. దీంతో కడప ప్రొద్దుటూరులోనే డిగ్రీ పూర్తి, హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశా. ఒక ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి చెప్పి ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ కావాలని నా ఆశ. వచ్చిన మూడు నెలల్లోనే నాకు ఫన్ బకెట్ సిరీస్ చాన్స్ వచ్చింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. కానీ అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు యాక్టింగ్ చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. దీంతో ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే యాక్టింగ్ చేశా. తినడానికి డబ్బులు లేకుంటే.. ఊరికనే ఆఫీస్కి వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్దం చెప్పేవాడిని. ఆయన అడిగితే మేడం పిలిచిందని చెప్పేవాడి. ఆయనే అర్థం చేసుకొని రూ. 50 జేబులో పెట్టి తిని రమ్మని చెప్పేవాడు. అలా నన్ను ఆరు నెలల పాటు చంటి పిల్లాడిలా కాపాడాడు. ఇక్కడ లేదు.. ఊర్లో లేదు..ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి ఫేం అయితే సంపాదించా కానీ డబ్బులు మాత్ర జమ చేయలేదు. ఇప్పటి వరకు నాకంటూ సొంత ఇల్లు లేదు. సిటీలోనే కాదు ఊర్లో కూడా నాకు ఇల్లు లేదు. మా ఫ్యామిలీ పేరున ప్రాపర్టీస్ కూడా లేవు. ఉన్నంతలో సంతోషంగా అయితే ఉన్నాం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కోటి రూపాయలు సంపాదిస్తే చాలు హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ కోటీ రూపాయలు జమ చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? పైగా ఇక్కడ చాలా వరకు డబ్బులు రావు. చాలామంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. డబ్బులు ఇవ్వమని ముఖంపైనే చెప్పేవాళ్లు. కొంతమంది అకౌంట్లో వేస్తామని చెప్పి.. వేయరు. గట్టిగా అడుగుదామంటే.. మిగతావాళ్లకు ఎక్కడ తప్పుగా చెప్పి అవకాశాలు రాకుండా చేస్తారోననే భయం. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులది ఇదే పరిస్థితి’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. -
హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్ (Jailer Movie) బ్లాక్బస్టర్ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.హిమాలయాల్లో ప్రత్యక్షందీంతో జైలర్ 2 విషయంలో చిత్రయూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా జైలర్ 2కి షూటింగ్కు బ్రేక్ ఇస్తూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.జైలర్ 2రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్ రిలీజ్కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ పార్ట్కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి -
రహస్యంగానే విజయ్ దేవరకొండ, రష్మిక.. కారణం ఏంటి?
సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. రీసెంట్గా అక్కినేని నాగార్జున కుటంబంతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా శుభవార్తలు విన్నాం. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna)లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. సోషల్మీడియాలో అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ జోడీ మాత్రం తమకు ఏమ్ తెలియనట్లు సైలెంట్గా ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణెలతో పాటు చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానులతో పంచుకున్నారు. నేటి ప్రపంచంలో ఎవరూ కూడా తమ ప్రేమ,పెళ్లి విషయాల్ని దాచుకోవడం లేదు. సమయం వచ్చినప్పడు చెప్పేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇలాంటి సమయంలో చాలా గుంభనంగా ఉంది. కనీసం ఇవన్ని రూమర్స్ మాత్రమే అని కూడా వారు తమ అభిమానులకు చెప్పలేదు. నిజమే అయితే, కనీసం తమ ఫ్యాన్స్కు కూడా చెప్పకుండా ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒక లోకేషన్లో కనిపించడం చూశాం. విజయ్ ఇంట్లో రష్మిక ఫోటోలు దిగడం, పుట్టినరోజు సమయంలో ఒకే ప్రదేశానికి వెకేషన్ ప్లాన్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పలు ఫోటోలతో అభిమానులే డీకోడ్ చేశారు. ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారంటే తప్పులేదు. కానీ, నిశ్చితార్థం విషయాన్ని కూడా అంత సీక్రెట్గా ఉంచడం ఎందుకు అనే సందేహం అందరిలో వస్తుంది. రష్మిక రీసెంట్గా తన కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది కానీ నిశ్చితార్థం గురించి మాత్రం చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో ఇంత రహస్యం అవసరమా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. -
నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి
అగ్నిపరీక్షలో దుమ్ము లేపింది శ్రీజ దమ్ము (Srija Dammu). ఏ టాస్క్ ఇచ్చినా చకచకా ఆడేసేది. బ్రేకుల్లేని బైకులా మాట్లాడటం మొదలుపెడితే ఆపేదే కాదు. ఫుల్ ఎనర్జీతో తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో అడుగుపెట్టింది. కానీ, ఇక్కడకు వచ్చాక సీన్ రివర్స్ అయింది. తనకు ఉన్న క్రేజ్, వచ్చిన పాజిటివిటీ అంతా కూడా నెగెటివ్గా మారింది.గంజి తాగి స్కూలుకి..ప్రతివిషయానికి నోరేసుకుని పడిపోవడంతో శ్రీజపై నెట్టింట ట్రోల్ జరిగింది. అయితే తనపై వ్యతిరేకత వస్తున్న విషయం గ్రహించి శ్రీజ తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. కాస్త సైలెంట్ అయిపోయింది. ఆటలో మాత్రం శివంగిలా ఆడుతోంది. తాజాగా శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీజ చిన్నప్పుడు గంజి తాగి స్కూలుకు వెళ్లేది. సన్మానించారుతనకు ఒక్క మార్కు తక్కువ వేసినా ఊరుకునేది కాదు. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. అగ్నిపరీక్షకు వెళ్లే ఒకరోజు ముందు తను సెలక్ట్ అయినట్లు చెప్పింది. తనకు మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. బిగ్బాస్కు వెళ్తానంటే సరేనన్నాం. ఎంతోమందిని దాటుకుని షో దాకా వెళ్లడమే గొప్ప విషయం. వైజాగ్ అమ్మాయి శ్రీజ.. బిగ్బాస్కు వెళ్లిందంటూ నన్ను పిలిచి మా ఊర్లో సన్మానం చేశారు.కించపరిచేలా ట్రోలింగ్నేను పారిశుద్ధ్య కార్మికుడిని. నా వృత్తిని కించపరిచేలా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చేతులతో చెత్త పట్టుకోవడం అంత ఈజీ కాదు. నా కూతురు చెత్త బ్యాగ్ పట్టుకున్న వీడియోను.. చెత్తబండివచ్చిందమ్మా చెత్తబండి అన్న వాయిస్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. నా పనిని కించపరుస్తూ నా కూతురిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీజ.. రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ను పక్కన పెట్టి మరీ బిగ్బాస్కు వెళ్లడం విశేషం.చదవండి: సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. రీతూది మోసం కాదట! -
హాలీవుడ్లో తెలుగోడి ‘కింగ్ బుద్ధ’
టాలీవుడ్ దర్శక,నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో 'కింగ్ బుద్ధ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్గా జరిగింది.ఈ ఈవెంట్కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్గా హాజరై, 'కింగ్ బుద్ధ' పోస్టర్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ‘గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్లో తీసి హాలీవుడ్లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్గా హాలీవుడ్లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్తో హాలీవుడ్లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. గతంలో సత్యారెడ్డి దర్శకత్వం వహించిన 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ నటించారు. షూటింగ్ సమయంలో గద్దర్ బుద్దుడి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది అన్నారునటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’ అని సత్యారెడ్డి అన్నారు. -
సుహాస్-సూరి సినిమా షూటింగ్లో ప్రమాదం.. వీడియో వైరల్
సుహాస్, సూరి కలిసి నటిస్తున్న ‘మండాడి’ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది.మండాడి విషయానికొస్తే.. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విలన్గా కనిపించనున్నాడు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. Video - A boat capsized during the shooting of #Soori's film #Mandaadi, causing damage to the cameras on board....🫣- This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram....🥹pic.twitter.com/yDjTrLOHT1— Movie Tamil (@_MovieTamil) October 4, 2025 -
డ్యూడ్ 'సింగారి చిన్నదాని' గురించి విన్నావా?
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. -
'రుక్మిణీ వసంత్' తండ్రి వీరమరణం పొందారని తెలుసా?
కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కూతురు అని కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రదేశాల్లో ఆయన సేవలు అందించారు. అయితే, రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రుక్మిణీ జీవితంలో ఒక మలుపు. అందుకే ఆమె తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండేలా రుక్మిణీ వసంత్గా మార్చుకుంది.రుక్మిణీ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో మరణించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉరి ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకుంటూ ఆయన వీరమరణం పొందారు. భారీ ఆయుధాలతో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక ట్రక్ సాయంతో భారత్లోకి ప్రవేశించారు. దానిని గమనించిన వసంత్ టీమ్ వారిని అడ్డుకుంది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఎదుర్కొన్నారు. చొరబడిన ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చే వరకు ఆయన పోరాడారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా తూటాలు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ధైర్యసాహాసాలను మెచ్చి అశోక చక్ర పతకంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రుక్మిణీ తండ్రి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్లో కఠణమైన శిక్షణ పొందారు. అందుకే 9 మరాఠా లైట్ త్రిదళంలో సెకండ్ లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. ఇలా ఆయన ఇండియన్ ఆర్మీలో చాలా కీలకంగా పనిచేశారు. వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ "వీర్ రత్న ఫౌండేషన్" అనే సంస్థను స్థాపించి యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను ఆదుకుంటున్నారు. తన వంతుగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు. -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. శ్రీజను ఇరికించి, రీతూది మోసం కాదని..
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్లో మీరూ చూసేయండి..సంజనాను శిక్షించిన నాగ్సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్గా మార్చాడు. హౌస్లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.తనూజను హెచ్చరించిన నాగ్హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్లో.. కల్యాణ్ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కల్యాణ్పై ప్రశంసలుఅటు కల్యాణ్తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే! -
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
ఓటీటీలో 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా స్ట్రీమింగ్
త్రిబాణధారి బార్బరిక్( Tribanadhari Barbarik) సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి రానున్నండంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.‘త్రిబాణధారి బార్బరిక్’.. సన్ నెక్స్ట్(Sun NXT)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు.కథేంటంటే..ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.దేవ్కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. -
ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సినిమాలు హిట్గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
జాను లిరితో బ్రేకప్? క్లారిటీ ఇచ్చిన సింగర్!
యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్తో దుమ్ము లేపింది జాను లిరి (Janu Lyri). పద్ధతిగా చీర కట్టి, పల్లెటూరి అమ్మాయిగా స్టెప్పులేసే జాను ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాపులారిటీతో ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని విజేతగా నిలిచింది. జానూకి గతంలో నటుడు టోనీ కిక్తో పెళ్లవగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. విభేదాల కారణంగా టోనీతో విడిపోయిన జాను కుమారుడితో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది.రెండో పెళ్లి చేసుకుంటా..ఆ మధ్య ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోవాలనుంది అంటూ బోరుమని ఏడ్చింది. ఆ మరుసటి రోజే.. నేనెవరికీ భయపడను.. బాధతో డిప్రెషన్కు వెళ్లిపోయాను, ట్రోల్స్ను పట్టించుకోను అని ధైర్యం కూడదీసుకుంది. అంతేకాదు, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గణ్ (Dilip Devgan)తో దిగిన ఫోటో షేర్ చేస్తూ అతడే తనకు కాబోయే భర్త అని పరిచయం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది.హ్యాపీగా ఉన్నాంమే నెలలో తమ ప్రేమను బయటపెట్టిన వీరిద్దరూ ఈ మధ్యే విడిపోయారంటూ తాజాగా ప్రచారం ఊపందుకుంది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ రూమర్స్పై దిలీప్ స్పందించాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని ఒక్కముక్కలో తేల్చేశాడు. కానీ, ఈ విషయంపై అంతకుమించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.చదవండి: 'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్ -
చిరంజీవి-అనిల్ రావిపూడి విలన్గా సరైన నటుడు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ ఇచ్చాక ఆరు సినిమాలు చేశారు. కానీ, ఆయన రేంజ్కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్గారు'(Mana ShankaraVaraPrasadGaru)లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్గా కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్.ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) పేరును సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది పవర్ఫుల్ విలన్గా మాత్రమే కాదు మంచి కామెడీ టైమింగ్తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్..సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోనర్ చిత్రాలే కాదు పవర్ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే, 'మన శంకర వరప్రసాద్గారు' మూవీ మాత్రం కామెడీ, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో రానుంది. నయనతారతో పాటు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్వుడ్లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.నేషనల్ క్రష్ గురించినేషనల్ క్రష్ ట్యాగ్లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు. -
సినీ హీరోలను తలపై పెట్టుకొని ఊరేగకండి: సత్యరాజ్
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది. ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్ను విమర్శించే విధంగా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్పై ఫైర్ అయ్యారు. -
అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్ రోషన్
‘‘హీరో.. డైరెక్టర్.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ తాజాగా స్పందించారు. ‘‘వార్ 2’ కోసం అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్ రోషన్పోస్ట్ చేశారు. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని అంటున్నారట హీరో రవితేజ. ఈ విజ్ఞప్తి వివరాల కోసం ప్రేక్షకులను వచ్చే సంక్రాంతికి థియేటర్స్కి రమ్మంటున్నారు. రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘అనార్కలి’ అనే టైటిల్ను అనుకున్నారు.కానీ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కోసమే రవితేజ స్పెయిన్ వెళ్లారు. కొంత టాకీ పార్టు, రెండు పాటల చిత్రీకరణ స్పెయిన్ లొకేషన్స్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అక్టోబర్లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
గ్రామంలో హైలెస్సో..
సుధీర్ ఆనంద్ (‘సుడిగాలి’ సుధీర్) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ను విడుదల చేశారు. శివాజీ, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్. -
థ్రిల్లింగ్ మారియో
అనిరుధ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘మారియో’. ‘నాటకం, తీస్ మార్ ఖాన్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ జి. గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ప్రోడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, రాకేందు మౌళి, కెమెరా: ఎంఎన్ రెడ్డి. -
డబుల్ సెలబ్రేషన్స్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్కి చెన్నై వేదికైంది.ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.‘‘చిరంజీవి, వెంకటేశ్గార్లను కలిసి సెట్స్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. -
నేను నీకు కరెక్టేనా?
‘విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా... నేను నీ టైపేనా’, ‘అంటే... ఒకరికొకరు కరెక్టా? అని ఎలా తెలుస్తుంది... అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది’, ‘కొంపతీసి నేను నీకు కరెక్టేనా అని ఆలోచిస్తున్నావా ఏంటి?’, ‘నేను నీకు కరెక్టేనా? అని కూడా ఆలోచిస్తున్నా?’... ఈ సంభాషణలు‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రోమోలోనివి.రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా పేర్కొని, రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. -
ఐదేళ్ల తర్వాత చేతికి పాస్పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగం
ఐదేళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్)ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్తో హరీశ్ ఎలిమినేషన్పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) -
పైరసీ వెబ్సైట్లు ఎక్కువ చూసేది వాళ్లే!
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదేమొదటి స్థానం మనదే మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లుఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
సింగర్గా మారిన వెన్నెల కిశోర్.. పాటతోనూ నవ్వించేశాడు!
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్..ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో 'అనుకుందొకటిలే..'అనే పాటను ఆయన ఆలపించాడు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. -
రాశీఖన్నా ఫ్యామిలీ మూమెంట్.. అనుపమ గోల్డెన్ డ్రస్!
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాశీఖన్నాబంగారు వర్ణం డ్రస్సులో అనుపమ పరమేశ్వరన్పచ్చని డ్రస్సులో గ్లామరస్గా ప్రియా వారియర్సిరిసిల్లలో షాప్ ఓపెనింగ్లో నటి దివి వద్త్యపారిస్ ట్రిప్లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేఫ్రెండ్ పెళ్లిల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) -
అశ్లీలతకు తావు లేకుండా ఓ మంచి సినిమాను చేశాం : హీరో రక్షిత్ అట్లూరి
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “మూడేళ్ల క్రితం నిర్మాత తేజ గారు ఈ కథ చెప్పారు. మొదట్లో కథ అర్థం కాలేదు, కానీ సీన్స్ నచ్చాయి. ఫాదర్-సన్ ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇంతవరకు రాని విధంగా ఉన్నాయి. శ్రీమాన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల విజువల్స్ అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ సాయి కుమార్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అశ్లీలత లేకుండా నిజాయితీగా మంచి సినిమా చేశాం. థియేటర్ నుంచి ఆనందంతో బయటకు వస్తారు’ అన్నారుదర్శకుడు సాయి మోహన్: ‘ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల. నన్ను నమ్మిన తేజకి, గౌరీకి థాంక్స్. సాయి కుమార్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కోమలి నా రచనకు మించి నటించారు. శ్రీమాన్ సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అక్టోబర్ 10న అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలి’ అన్నారు.‘శశివదనే’ నాకు ప్రత్యేకమైన చిత్రం. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అందరూ థియేటర్లో చూడాలి’ అని హీరోయిన్ కోమలి అన్నారు. -
'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాకు ప్రారంభ వారంలో జనాలు వెళ్లారు గానీ తర్వాత చాలావరకు తగ్గిపోయారు. అయితే రెండో వారం నేహాశెట్టి చేసిన ఓ ఐటమ్ సాంగ్ని సినిమాలో జీడించారు. అయితే మూవీలోని మిగతా పాటలతో పోలిస్తే ఇది అంతంత మాత్రంగానే ఉండటం, దానికి తోడు సినిమాలో రాంగ్ ప్లేస్మెంట్లో వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాటని ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అయితే ఈ గీతంలో నేహాశెట్టి మాత్రమే ఉంది. అటు హీరో పవన్ కల్యాణ్ గానీ విలన్ ఇమ్రాన్ హష్మీ గానీ లేకపోవడంతో ఈ పాట జనాలకు కూడా పెద్దగా రీచ్ కాలేదు. (ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్) -
రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా?
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న.. ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పరిసరాల్లో రూ. కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ కథనంలో విజయ్ దేవరకొండ లగ్జరీ కార్లు, నెట్వర్త్ వంటి ఆసక్తికరమైన విషయాలు చూసేద్దాం..విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం (Vijay Deverakonda Car Collection)ఫోర్డ్ మస్టాంగ్: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 75 లక్షలు ఉంటుందని సమాచారంమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. కంపెనీకి చెందిన జీఎల్సీ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. ఇతర కార్లకంటే కూడా విజయ్ ఈ కారునే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.వోల్వో ఎక్స్సీ 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు.. వోల్వో ఎక్స్సీ 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి.నెట్వర్త్ (Net Worth) విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కేవలం ఒక నటుడుగా మాత్రమే కాకుండా.. కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవరిస్తున్నారు. దీంతో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈయన నెట్వర్త్ మొత్తం రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థంహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత? -
నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి
'కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది. ఈ ఏడాది నాని 'హిట్ 3'తో వచ్చింది. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది.'నేను ప్రభాస్లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది.త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా కోసం ఈమెను హీరోయిన్గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది. దీని గురించే 'తెలుసు కదా' ప్రమోషన్లలో అడగ్గా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!) -
‘కల్కి’2 కి బ్రేక్.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్పైనే నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్ ఫ్యాన్స్కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్?కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెండ్ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో నాగ్ అశ్విన్కి నో చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.కల్కి 2 ఎప్పుడు?వాస్తవానికి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట. ప్రస్తుతం ఆయన రాజాసాబ్(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్(Prabhas) డేట్స్ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్ అశ్విన్- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు. -
ఓపక్క రష్మిక ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడి పోస్ట్ వైరల్
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో పడి చాలాకాలమే అయింది. విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్న ఈ బ్యూటీ ఈ విషయాన్ని చాలాసార్లు పరోక్షంగా బయటపెట్టింది. దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని అప్పుడే సగం పెళ్లి అయిపోయిందనిపించారు. కానీ, ఇది రష్మికకు రెండో ఎంగేజ్మెంట్ కావడం గమనార్హం!ఫస్ట్ సినిమాకే లవ్రష్మిక కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' (2016)తో సినీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఫస్ట్ సినిమాకే హీరోతో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. 2017 జూలై 3న వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఊహించని షాకిచ్చారు. పెళ్లిపీటలు ఎక్కకముందే తమ బంధం ముక్కలైందని ప్రకటించారు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అలా అని వీరి మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్ చేసుకుంటామని, సినిమాలు విడుదలైనప్పుడు ఒకరికొకరం విషెస్ తెలియజేసుకుంటామని రక్షిత్ శెట్టి 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.రష్మిక- రక్షిత్ ఎంగేజ్మెంట్ ఫోటోవిజయ్తో లవ్..రక్షిత్తో విడిపోయాక రష్మిక సినిమాలతో బిజీ అయింది. 2018లో గీత గోవిందం సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో జత కట్టింది. ఈ మూవీ సమయంలోనే విజయ్- రష్మిక ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. కానీ తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రష్మిక కలలు చాలా పెద్దవి అని రక్షిత్ చెప్పినట్లుగా... ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ ట్యాగ్ అందుకుంది. పుష్పతో పాన్ ఇండియా సెన్సేషన్ అయింది.ఉత్తమ నటుడిగా అవార్డుఅటు రక్షిత్ కూడా.. 777 చార్లీ (777 Charlie Movie), సప్తసాగరాలు దాటి సైడ్ A, సప్తసాగరాలు దాటి సైడ్ B సినిమాలతో ఘన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఘనత అందుకున్నాడు. 2021లో సెన్సార్ అయిన సినిమాలకుగానూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. అందులో 777 చార్లి సినిమాకు నాలుగు పురస్కారాలు వరించాయి. ఉత్తమ రెండో చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ ఎడిటర్గా ప్రతీక్ శెట్టి, ఉత్తమ గేయరచయితగా నాగార్జున శర్మకు అవార్డులు ప్రకటించారు. హీరో ట్వీట్దీంతో రక్షిత్ సంతోషంలో తేలియాడుతున్నాడు. '777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్.. ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్గా మారింది. Feeling grateful and humbled! 777 Charlie wins 4 State Awards.. 2nd Best Film, Best Actor, Best Editing & Best Lyricist. Heartfelt thanks to the jury, our amazing audience, and this incredible team.. @Kiranraj61 for his vision, Pratheek for the flawless editing, and…— Rakshit Shetty (@rakshitshetty) October 4, 2025 చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా -
ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్
పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న రష్మిక.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో ఇది జరిగింది. అధికారికంగా బయటకు చెప్పలేదు. అయితే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే త్వరలో రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. అంతకు ముందు ఈమె నటించిన ఓ రెండు మూవీస్... రెండు వారాల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ నెల 21న 'థామా' అనే హారర్ మూవీతో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన 'గర్ల్ ఫ్రెండ్' చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 07న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు.గీతా ఆర్ట్స్ నిర్మించిన 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా.. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటలు రిలీజ్ కాగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. నవంబరు 07న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ఆ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే ఏం లేవు.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్) -
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!
ఒకప్పుడు అంటే తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అంటే వామ్మో అన్నట్లు చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం ఈ విషయం చాలా సాధారణమైపోయింది. ప్రేక్షకులు కూడా ముద్దు సన్నివేశాల్ని సాధారణంగానే తీసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్లని ఈ సీన్స్ గురించి అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనే మాట అంటారు. అయితే అది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది అని హీరోయిన్ కోమలి ప్రసాద్ అంటోంది.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోమలి.. స్వతహాగా తెలుగమ్మాయి. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్గా 'శశివదనే' అనే మూవీ చేసింది. అక్టోబరు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా ట్రైలర్ చూపించిన లిప్ కిస్ గురించి కోమలి మాట్లాడింది.'ఈ రోజుల్లో ముద్దు సన్నివేశంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నటించానని అనడం పెద్ద జోక్ అయిపోయింది. కానీ మా సినిమాలో ఈ సన్నివేశానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చేసిన శశి అనే అమ్మాయి పాత్ర.. అసలు ఏడుస్తూ రాఘవని ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేదో కావాలని ఇరికిందింది అయితే కాదు' అని కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్: నటి హేమ) -
‘ఐ బొమ్మ’పై ఫైర్ అయిన నిర్మాత
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు. -
పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదుకెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. అందుకే బిగ్బాస్కు వెళ్లా..లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్బాస్ హౌస్లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని. నాగార్జున వస్తే..త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ -
‘అరి’ కోసం ఏడేళ్లు.. కారణం ఇదేనట!
'పేపర్ బాయ్' తర్వాత దర్శకుడు జయశంకర్ నుంచి ఎలాంటి చిత్రం రాలేదు. వరుస అవకాశాలు వచ్చినా.. సరైన కాన్సెప్ట్తో ఎదురుచూసి మళ్లీ ఇప్పుడు ‘అరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం కోసం జయశంకర్ ఏడేళ్ల కష్టపడ్డారు. ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ని ఇందులో చూపించారట. కాన్సెప్ట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారట.'పేపర్ బాయ్' అందించిన గొప్ప విజయం తర్వాత, జయశంకర్ తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని బలంగా కోరుకున్నారు. అందుకే, ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని పాయింట్తో రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే, మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల కాన్సెప్ట్ను ఎంచుకున్నారు.'అరి' అనే పదానికి 'శత్రువు' అనే అర్థంతో పాటు, అరిషడ్వర్గాల్లోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని ఈ చిత్రానికి పేరు పెట్టారు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన విస్తృతమైన పరిశోధన చేశారట. మైథలాజికల్ టచ్ ఇచ్చేందుకు పురాణేతిహాసాలను, గ్రంథాలను అధ్యయనం చేశానని జయశంకర్ చెప్పారు. రమణ మహర్షి ఆశ్రమం సహా పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి గురూజీలను కలిసి, వారి కోసం వేచి చూసి ఎన్నో విలువైన విషయాలను సేకరించారట. కొంతకాలం ఆశ్రమంలో గడిపి, ఆధ్యాత్మిక కోణంలో ఈ అంశంపై లోతైన పరిశోధన చేశానని జయశంకర్ అన్నారు.విడుదలకు ముందే, 'అరి' చిత్రం పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, ఏకంగా 25 అవార్డులను గెలుచుకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రత్యేకంగా అభినందించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. -
బిగ్బాస్లోకి 'ప్రభాస్' ఫ్రెండ్తో పాటు మరో నలుగురికి ఎంట్రీ!
బిగ్బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్బాస్లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్లైన్గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్తో ఉన్న నిఖిల్ సిరీయల్స్తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్తో గుర్తింపు పొందాడు.అలేఖ్య చిట్టి పికిల్స్తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.లఘు చిత్రాలు, వెబ్ సీరిస్లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్బాస్తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్బాస్లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. -
ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ
కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!సెల్ఫీ ఫోటోలుఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్క్రీమ్ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్ను ఈ పోస్ట్లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.సినిమాహిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే? -
కూలీ ఫేమ్ రచిత రామ్ 'కల్ట్' పోస్టర్ విడుదల
కన్నడ హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా కూలీ సినిమాలో లేడీ విలన్గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్ యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్ పోస్టర్లో ఆమె లేడీ డాన్ లుక్లో కనిపించారు. బాత్రూమ్లో టాయిలెట్ సీటింగ్పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) -
ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్కు నాలుగేళ్ల జైలు శిక్ష
అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54)కి జైలు శిక్ష పడింది. అమ్మాయిల ట్రాఫికింగ్కు పాల్పడుతున్నాడని ఈ ఏడాది జులైలో న్యూయార్క్లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కానీ, అతని మాజీ ప్రియురాళ్ళు కాసాండ్రా వెంచురా, జేన్లతో వ్యభిచారం కోసం రవాణా చేసినందుకు అతని ప్రమేయం ఉందని తేలింది. తమను డిడ్డీ విక్రయించాడని వారు కోర్టుకు ఆధారాలు అందించారు. దీంతో అతనికి 4ఏళ్లు జైలు శిక్ష పడింది.2016లో డిడ్డీ తన ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేకప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా సహా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను విక్రయించాడని కూడా పేర్కొంది.ర్యాపర్ డిడ్డీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి పేర్కొన్నాడు. దీంతో అతనికి 4 ఏళ్లు జైలు శిక్ష విదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షను అధిగిమించి తిరిగొస్తావని ఆశిస్తున్నట్లు డిడ్డీతో ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మహిళలకు హాని కలిగించడానికి నువ్వు చూపిన చొరవ.. వారికి సహాయం చేయడానికి చూపించాల్సింది అంటూ చేసిన పాపాల విముక్తి కోసం ఈ శిక్ష తప్పదని పేర్కొన్నారు.తన ప్రతిభతో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘల్ గా డిడ్డీ కీర్తిని అందుకున్నాడు. కోర్టు తీర్పు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన భయానకంగా, అవమానకరంగా ఉందని తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు. నేను చేసిన తప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించుకోను. నేను శిక్ష అనుభవించాల్సిందే. డిడ్డీ 2029లో విడుదల కావచ్చు.BREAKING: Sean 'Diddy' Combs sentenced to over 4 years in federal prison.Back in July, Combs was found guilty of two counts of transporting individuals for prostitution."A substantial sentence must be given to send a message to abusers and victims alike that abuse against… pic.twitter.com/atFjasAmiv— Collin Rugg (@CollinRugg) October 3, 2025 -
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఓటీటీలో మిరాయ్ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్స్టోరీ చెప్పాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్బాస్ పెట్టిన టాస్క్లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్బాస్కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్బాస్కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
దిగొచ్చిన యూట్యూబ్.. ఐశ్వర్యరాయ్ వీడియోలు తొలగింపు
బాలీవుడ్ కపుల్స్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల దెబ్బతో యూట్యూబ్ దిగొచ్చింది. యూట్యూబ్లో తమ అనుమతి లేకుండా ఫోటోలు ఉపయోగిస్తున్నారని వాటిని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును వారు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలు ఉండటంతో ఐశ్వర్య దంపతులు ఆగ్రహించారు. మరోసారి కోర్టుకు వెళ్లారు. యూట్యూబ్పై రూ. 4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో ఆ సంస్థ దిగొచ్చింది.ఐశ్వర్య దంపతులు రూ.4కోట్ల దావా వేయడంతో ఆ వీడియోలను యూట్యూబ్ తొలగించింది. సుమారు 250కి పైగా వీడియో లింక్లను తొలగించడంతో పాటు ఆ ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఇప్పటికే ఆ వీడియోలకు సుమారు 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు ఇలాంటి చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా అక్కినేని నాగార్జున కూడా తన ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు తమ వ్యాపారా ప్రకటనలకు ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆమె పేరు, గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు ఏంటి అంటూ కోర్టు పేర్కొంది. ఐశ్వర్యను దెబ్బతీసేలా ఉన్న యూఆర్ఎల్లను తొలగించి బ్లాక్ చేయాలని గూగుల్, యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫార్మ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోపు ఎలాంటి వీడియోలు కనిపించకూడదని హెచ్చిరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్, గూగుల్ చర్యలు చేపట్టింది. -
అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది. నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్లో ఉన్న నయనతార పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Vels Film International (@velsfilmintl) చదవండి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్ -
వార్2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్2.. ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, టాలీవుడ్లో దారుణమైన నెగటివ్ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఒక పోస్ట్ చేశారు.వార్2 గురించి హృతిక్ ఇలా చెప్పారు. 'వార్2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్డ్గా పూర్తి చేశాను. నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువు అయింది. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. సెట్స్లో నా పని పూర్తి అయిన తర్వాత ఇంటికి రావడం.. మరుసటి రోజు షెడ్యూల్ ఏంటో చూసుకోవడం జరిగేది. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సెట్లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. నా పని నేను పూర్తి చేస్తే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం.. కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదేపదే ఆపుతున్న ఒక శబ్ధం వినిపించేది. ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ రిలాక్స్" అని హృతిక్ పోస్ట్ చేశాడు.వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన వార్ 2 రూ. 236.55 కోట్లు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 318.01 కోట్లు వసూలు చేసింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్
మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్మీడియాలో ప్రకటించింది. చాలా కాలంగా అభిషేక్తో ప్రేమలో ఉన్నానంటూ చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్ను చూపుతూ తన భర్తతో పాటు ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఆర్య దయాళ్ పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాటను ఆమె పాడారు. తెలుగులో ఆమెకు ఇదే తొలి కావడం విశేషం. ఈ పాటకు టాలీవుడ్లో అభిమానులు భారీగానే ఉన్నారు. స్టార్ సింగర్గా మలయాళంలో భారీ క్రేజ్ ఉన్న ఆర్య దయాళ్ ఇలా సింపుల్గా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఈ దంపతులను అభినందిస్తున్నారు. అభిషేక్ కూడా సంగీత ప్రపంచంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MazhavilManoramaTV (@mazhavilmanoramatv) -
విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం
సాక్షి, సినిమా : హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. వీరు తొలిసారి జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ మూవీతోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ ఎప్పుడూ స్పందించ లేదు. కానీ, వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్లో ఫొటోగ్రాఫర్ల కంట పడేవారు. వీరి నిశ్చితార్థంపై గతంలోనూ పలు వార్తలొచ్చినప్పటికీ అవి వదంతులుగా మిగిలిపోయాయి. అయితే శుక్రవారం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా విజయ్, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్లాప్... క్లాప్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దసరా సందడి ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించింది. ఈ పండగ సందర్భంగా పలు సినిమాలు ఘనంగా ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. ఆ చిత్రాల వివరాలేంటే చూద్దాం. వెంకటేశ్ క్లాప్తో... నాని హీరోగా ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం జరిగింది. ‘నాని 34’ అనే వర్కింగ్ టైటిల్తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్చాన్ చేయగా, నాని, వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్ను సుజిత్కి అందించారు. ఫస్ట్ షాట్కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ, నానీని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు సుజిత్’’ అని వెంకట్ బోయనపల్లి తెలిపారు.కాంబినేషన్ రిపీట్... హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) మంచి విజయం సాధించింది. ఈ కాంబినేషన్లో మరో సినిమా ఆరంభమైంది. ‘శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు 2’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిదుర్గా తేజ్ క్లాప్ కొట్టగా, హీరో నారా రోహిత్ స్క్రిప్ట్ని నిర్మాతలకు అందజేశారు. ‘‘హై ఓల్టేజ్ హ్యూమర్ ఎక్కువగా ఉండే కథనంతో ఈ చిత్రం నాన్స్టాప్ వినోదాన్ని అందించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త ప్రేమ కథ ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. చైతన్యా రావు హీరోగా, ఐరా, సాఖీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ నాయుడు, శ్రీకాంత్ .వి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ దేవా కట్టా క్లాప్ కొట్టారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్లు స్క్రిప్ట్ని డైరెక్టర్కి అందజేశారు. వర ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సరికొత్త ప్రేమకథతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: జ్ఞాన శేఖర్. ముగ్గురు యువకుల స్నేహం: ప్రేమ్, వాసంతిక జంటగా ‘మావా’ టైటిల్తో సినిమా ఆరంభమైంది. ఏ.ఆర్. ప్రభావ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వెంకటేశ్ బాలసాని క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిల మధ్య ఉండే స్నేహాన్ని అద్భుతంగా చూపించబోతున్నాం’’ అని యూనిట్ తెలిపింది. థ్రిల్లర్ నేపథ్యంలో... అభిరామ్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ రెడ్డి దాసరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి భగీరథ కెమెరా స్విచ్చాన్ చేయగా, స్క్రిప్టును ఎన్.ఆర్. అనురాధా దేవికి అందించారు అభిరామ్. లవ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు మేకర్స్. -
డిసెంబరులో...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. తాజాగా డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 24న ప్రారంభం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘వీరసింహా రెడ్డి’ (2023). వీరి కాంబినేషన్లో రానున్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రారంభం కానుంది. -
అంత సులభం కాదు.. ట్రంప్ టారిఫ్స్పై నిర్మాత విశ్వప్రసాద్
కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సినిమా రంగంపై ఊహించని పిడుగు వేశాడు. విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది అమల్లోకి వస్తే ఓవర్సీస్లో టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బంది ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. దీని వల్ల ఇప్పట్లో తెలుగు మూవీస్కి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు. 'సాక్షి'తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)ట్రంప్.. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?ఇక్కడ లాస్ట్ అంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి 'మాగా' అన్నది ఒక క్యాంపెయిన్. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీలైనంత వరకు అంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు.. వాళ్ల ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికాలోనే జరగాలన్నది ఆయన ఆశయం. దాని ప్రకారం సినిమాల్లో కూడా ఈ హాలీవుడ్ వర్క్ అంతా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళకుండగా అమెరికాలో జరగాలన్నది ఆయన ఉద్దేశం. దాన్ని నియంత్రించడానికే 100% టారిఫ్ అన్నారు. కానీ అది ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి అనేదానికి ఒక ప్రొసీజర్ లేదు. కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు.ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ ఏమైనా సంతకం చేశారా?అంటే నేను విన్నది ఏంటంటే.. ఇది ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని అంటే ఆ గైడ్ లైన్స్ డెవలప్ కావాలి. దీన్ని స్టడీ చేయడానికి చాలా అంశాలున్నాయి. అంటే దేని మీద టాక్స్ వేయాలా దేని మీద టారిఫ్ వేయాలా అన్నది. ఇదంతా డెవలప్ చేయడం కూడా ఎంత టైం అన్నా పట్టొచ్చు. మూడు నెలలైనా కావొచ్చు ఏడాదైనా పట్టొచ్చు. అప్పటివరకు మనం ఏం చెప్పలేం. జనరల్గా టారిఫ్ ఉన్నా లేకున్నా మనం కాస్ట్ కంట్రోల్ చేసుకొని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసే అంటే మన దరిదాపుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.(ఇదీ చదవండి: సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం) -
నందు, అవికా గోర్ 'అగ్లీ స్టోరీ' టీజర్ విడుదల
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజైంది. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు.నందు పర్వర్ట్ క్యారెక్టర్ చేశాడు. అవికా గోర్ నందుని కాకుండా మరో అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ నందుకి ఇది ఇష్టముండదు. దీంతో అవికా గోర్ని ఇబ్బంది పెడతాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. శివాజీ రాజా, రవితేజ మహదాస్యం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో చిత్ర విడుదల గురించి వెల్లడించనున్నారు. -
కళ్యాణ్ జీ గోగణ 'మారియో' ఫస్ట్ లుక్ రిలీజ్
'నాటకం', 'తీస్ మార్ ఖాన్' సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆ చిత్రం అప్డేట్ ఇచ్చారు. 'మారియో' అనే టైటిల్ నిర్ణయిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.హీరోహీరోయిన్లుగా అనిరుధ్, హెబ్బా పటేల్ నటించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. -
చైతన్య రావు-క్రాంతి మాధవ్ కొత్త సినిమా లాంచ్
'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో సిద్ధమైపోయారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా చేయబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కెఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తర్వాత పూర్ణగారితో ఓ మూవీ చేయాలి. హిట్స్లో ఉన్నప్పుడు చేయను, బాధల్లో ఉన్నప్పుడు చేస్తానని ఆయనతో చెప్పాను. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పుకొచ్చారు. -
అమ్మ బంగారంతో శ్రీముఖి.. రకుల్ ఆస్ట్రేలియా ట్రిప్
సింపుల్ లుక్.. ముద్దుచ్చేంత అందంగా మృణాల్రెడ్ డ్రస్సులో అదరగొట్టేస్తున్న మాళవిక మోహనన్ఈజిప్ట్ టూర్లో మలయాళ హీరోయిన్ పార్వతిఅమ్మని బంగారం అంటూ ముద్దు చేస్తున్న శ్రీముఖిమెల్బోర్న్ టూర్ ఫొటోలని పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్నవ్వడం మర్చిపోవద్దనని గుర్తుచేస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం.. తన భార్య, కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న డేనియల్ విశ్వాస్.. మాధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లిలోని ఓ చర్చిలో ఈ శుభకార్యం జరిగింది. దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ గతేడాది రిలీజైన 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'కె ర్యాంప్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే తన చిత్రాలు 'వినరో భాగ్యము విష్ణుకథ', 'క' సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన డేనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్.. తన భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి మరీ వేడుకకు హాజరయ్యాడు.(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం) -
'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
సినిమా పైరసీ రాకెట్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్కార్డులు, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025 -
'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.'కాంతార' విషయానికొస్తే.. మొదటి పార్ట్లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ. -
నా కుమార్తె నగ్న చిత్రాలు అడిగారు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని గుర్తు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక కలతపెట్టే సంఘటనను పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.సైబర్ నేరగాళ్లు తన కుమార్తెతో ఎలా ప్రవర్తించారో ఇలా పంచుకున్నారు. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, వెళ్లి నా భార్యతో చెప్పింది. ఇలాంటివి సైబర్ నేరంలో ఒక భాగం.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి తెలియాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని ఒక గంట సమయం కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి నేరాళ గురించి పిల్లలకు వివరించాలి. నేటి ప్రపంచంలో సైబర్ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారుతోందని మీ అందరికీ తెలుసు. ఈ నేరాన్ని ఆపడం చాలా ముఖ్యం..." అని అక్షయ్ వెల్లడించారు. ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు కూడా ఆవతల మరో వ్యక్తితో ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన కుమార్తె ఘటనను అక్షయ్ గుర్తుచేశారు.ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహారాష్ట్ర), రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
లగ్జరీ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. ఎన్ని లక్షలంటే?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్లో సెన్సేషన్గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరనుంది. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా నిమిష్ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు.చేతి గడియారంతాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్ వర్క్కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nimish Ravi (@nimishravi) చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో -
స్టార్ క్రికెటర్ సోదరి.. 'బిగ్బాస్'లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) హోస్ట్గా ‘బిగ్బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి.ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్గా కూడా రాణిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. View this post on Instagram A post shared by Malti Chahar (@maltichahar) -
ఇలా సత్కారం చేయడం కొత్తగా అనిపించింది: నాగార్జున
హైదరాబాద్లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దసరా మరుసటిరోజున ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, బ్రహ్మానందం పలు వ్యాఖ్యలు చేశారు.కులమతాలకు అతీతంగా, పార్టీలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగలా ఈ వేడుక జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం సుమారు 20 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు రెడీ చేశారు.సపోర్ట్గా నిలబడతారనే నమ్మకం కలిగింది: నాగార్జునఅలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ దత్తాత్రేయ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని సత్కారం చేయడం కొత్తగా అనిపించిందని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకే వేదికపై రావడం అందరిలో కాన్ఫిడెన్స్ పెంచిందని తెలిపారు. ఏదైనా ఇష్యూ వస్తే సపోర్ట్గా నిలబడతారని నమ్మకం కుదిరిందని నాగార్జున్ చెప్పుకొచ్చారు. ఇదే కార్యక్రమంలో పాల్గగొన్న బ్రహ్మానందం ఇలా అన్నారు. 'అలయ్ బలయ్ ఆలింగనం చేసుకునే కార్యక్రమం. శ్రీరామ చంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి అలయ్ బలయ్ ఉంది. శాంతి నశిస్తున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.' అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మందకృష్ణ మాదిగ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో
జానపద ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు గడ్డం రాజు (Gaddam Raju) సెప్టెంబర్ 29న ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య టార్చర్ వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు వదిలాడు. తన స్వస్థలమైన పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రాజుది ప్రేమపెళ్లి కాగా, వీరి వివాహమై ఆరు నెలలే అవుతోంది. పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. 'అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో ఊకె (నిత్యం) గొడవలు అవుతున్నాయి. టార్చర్ అనిపిస్తోంది. మిమ్మల్ని ఊకె తిడ్తది. ఇల్లరికం వచ్చినట్లయిపోయింది నా పరిస్థితి. భార్య టార్చర్అన్నా, వదిన.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య.. మంచిగ బతుకు. నీలాంటిదానికి మొగోళ్లు సెట్ కారు. నువ్వన్నమాటలకు మెంటల్ టార్చర్ అయితుంది. పెళ్లయినప్పటి నుంచి టార్చరే! ఈ బతుకు బతకబుద్ధయితలేదు. పండక్కి నా భార్యకు చీర కొన్నా.. డబ్బుల్లేవని నేను డ్రెస్ కూడా కొనుక్కోలే.. అమ్మా, బాపు బై' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాము.. కాటి కట్టెల పాలాయనే బ్రతుకు, సీత, నా ప్రాణమే నిన్ను కోరితే.. వంటి పలు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో నటించాడు. View this post on Instagram A post shared by Sdpt Chinnodu (@mr_sdpt_chinnodu)ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ.. -
కాంతార నిజమైన మాస్టర్ పీస్.. ప్రభాస్, సందీప్రెడ్డి ఏమన్నారంటే?
కాంతార ఛాప్టర్ 1(Kantra chapter 1)తో రిషబ్ శెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్లో పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. కాంతార చిత్ర యూనిట్పై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ప్రభాస్(Prabhas ), సందీప్రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పందించారు. వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. బుక్మైషోలో కాంతార టికెట్ల సేల్ భారీగానే ఉంది. పీక్ టైమ్లో ప్రతి గంటకు సుమారు 60వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. 24గంటలకు ఏకంగా 5లక్షలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.దర్శకుడు సందీప్రెడ్డి వంగా కాంతార చాప్టర్1పై ఇలా చెప్పారు. 'కాంతార చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. దీనిని ఎవరూ దాటలేరు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నిజమైన వన్-మ్యాన్ షో ప్రదర్శించారు. ఈ మూవీని ఒంటి చేత్తో రూపొందించడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. కాంతార బీజీఎమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అజనీష్ లోక్నాథ్ సంగీతం చాలా బాగుంది.' అని ఆయన మెచ్చుకున్నారు.కాంతార ఛాప్టర్ 1 మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారు. 'కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ఇందులో నటించిన వారందరి ప్రతిభ చాలా బాగుంది. ఈ ఏడాది అతిపెద్ద విజయంగా కాంతార1 నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలయం రిషబ్ శెట్టి నటన. ఆపై హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విజయం సాధించిన చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు.' అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు. -
వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ ఎమోషనల్
దసరా వచ్చిందంటే ఆయుధపూజ చేయాల్సిందే! ఇంట్లో ఉన్న బండిని తళతళా మెరిసేట్టు శుభ్రంగా కడిగి పూజ చేసి దిష్టి తీయాల్సిందే! కమెడియన్ వైవా హర్ష (Harsha Chemudu) కూడా అదే చేశాడు. తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.ఫ్యామిలీ త్యాగాలుఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల.నా ఇంటినిండా అవే..చిన్నప్పుడు కార్లు, బైకులంటూ వాటి ఫోటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్దిరోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్ కోసం ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి.మీ వల్లే ఇదంతా..మీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. మీవల్లే నేనిక్కడ ఉన్నాను. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను అని రాసుకొచ్చాడు. వైవా హర్ష.. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిశాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి