breaking news
Movies
-
ఫంకీ ట్రైలర్: పంచులే పంచులు!
గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్సేన్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ నిండా పంచులేట్రైలర్ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు డాక్టర్ అన్న డైలాగ్తో వీడియో మొదలైంది. ఓనర్కు రెంట్ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తయ్ అంటాడు హీరో. ట్రైలర్ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్ చేశారు. మొత్తానికి ట్రైలర్తోనే మంచి హైప్ ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. -
ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్ ప్రేయసి
సెట్లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఫోటో అడిగితే..అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.చితకబాదా..ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.పెళ్లిఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!చదవండి: నా సినిమా ఎఫెక్ట్ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్ -
చాలాసార్లు ఏడ్చా.. అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తా: సుప్రిత
తల్లికి మళ్లీ పెళ్లి చేస్తానంటోంది టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత. ఈమె 'చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ దానికంటే ముందు అమరావతికి ఆహ్వానం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ హారర్ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది.కుంకుమ పెట్టుకోవద్దా?తాజాగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుప్రిత మాట్లాడుతూ.. అమ్మ కుంకుమ పెట్టుకున్నందుకు సురేఖావాణికి మళ్లీ పెళ్లంట అని ఏవేవో రాశారు. నా బలవంతం వల్లే అమ్మ కుంకుమ పెట్టుకుంది. నాన్న (టీవీ షోల డైరెక్టర్ సురేశ్ తేజ) చనిపోయే సమయానికి అమ్మకు 35 ఏళ్లుంటాయి. అప్పుడే అంత వైరాగ్యం చూడాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్అందుకే కుంకుమ పెట్టుకోమన్నాను. అందరూ ఏమనుకుంటారని మొదట ఒప్పుకోలేదు. నా బలవంతం వల్ల తనకు కుంకుమ ధరించడం అలవాటైపోయింది. అమ్మ, నేను కలిసి విహారయాత్రలకు వెళ్తుంటే కూడా ట్రోల్ చేస్తున్నారు. మా డబ్బుతో మేము బయటకు వెళ్లడం కూడా తప్పేనా? ఈ నెగెటివిటీ చూసి మొదట్లో ఏడ్చేసేదాన్ని.కాలు కింద పెట్టనివ్వకూడదుకానీ, వాళ్ల మాటలు పట్టించుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు కదలదని అర్థమైంది. అలా వాటిని లైట్ తీసుకుంటున్నాను. అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తనకంటూ ఓ తోడుండాలి. నేను పెళ్లి చేసుకునే సమయానికి అమ్మకు వివాహం చేయాలన్నది నా కోరిక. అమ్మకు తగిన వ్యక్తి దొరకాలి. అతడు నా తల్లిని చాలా బాగా చూసుకోవాలి. కాలు కింద పెట్టనివ్వకూడదు.బిగ్బాస్ షో ఇష్టంనాకు బిగ్బాస్ రియాలిటీ షో అంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఒక్క ఎపిసోడ్ మిస్ అవకుండా అన్ని సీజన్లు చూశాను. ఏడో సీజన్లో ఫోన్ కాల్ వస్తే వెళ్లిపోదామనుకున్నాను. కానీ దగ్గరివాళ్లు వద్దనడంతో ఆగిపోయాను. ఓ సీజన్లో అమ్మను, నన్ను జంటగా రమ్మని పిలిచారు. కానీ, వెళ్లలేదు. ఇక మీదట కూడా వెళ్లనేమో! అని సుప్రిత చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్ -
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
నేపాల్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం గుండెపోటుకి గురికావడంతో వెంటనే ఖాట్మండ్లోని థాపాతలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉదయం 7.44 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.నేపాల్లోని డాంగ్లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. నేపాలీ, బాలీవుడ్, భోజ్పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది. -
నా మూవీ చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాకు మాటలు రావడం లేదు. రెండు, మూడు నెలల కిందట మ్యూజిక్ లేకుండా సినిమా చూశాను. ఏడుపాగలేదుఫైనల్ కాపీ చూడలేదు. ఇప్పుడిలా థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్లో సినిమా చూస్తున్న అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే (పాట) వివాదం వల్ల నా సినిమా చూసేందుకు జనం రారేమో అని భయపడ్డాను. నా మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చాలా భయమేసింది' అంటూ చంద్రహాస్ ఏడ్చేశాడు. ఏంటా వివాదం?బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. అందులో బూతు పదాలు దొర్లడంతో అతడిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. హీరో అయుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా? ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా? అని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్ వల్ల సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని చిత్రయూనిట్ భయపడ్డారు. సినిమా విషయానికి వస్తే.. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. అర్జున్ మహి విలన్గా యాక్ట్ చేశాడు. సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని నిర్మించారు.చదవండి: ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన ముమైత్ ఖాన్ -
లుక్స్పై ట్రోలింగ్.. నేనూ హర్ట్ అవుతా: హీరోయిన్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. తన ఫేస్ కట్ సరిగా లేదని, దవడకు సర్జరీ చేయించుకోవాలని.. ఇలా చాలామంది నానామాటలు అన్నారు. కొన్నిసార్లు ఈ విమర్శల వల్ల బాధపడ్డప్పటికీ వీలైనన్ని సార్లు ఈ కామెంట్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడానికే ప్రయత్నిస్తున్నానంటోంది షనయా.పాజిటివ్గా తీసుకుంటా..జూమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షనయా కపూర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలారకాల కామెంట్లు వస్తుంటాయి. నా పని గురించి కావొచ్చు, లేదంటే నా డ్యాన్స్, యాక్టింగ్ ఎలా ఉందని చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు కాస్త కఠినంగా చెప్పినప్పటికీ దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ల అభిప్రాయాలు వింటాను. వాళ్ల విమర్శలు కొంత బాధపెట్టవచ్చేమో కానీ చాలా విషయాలు తెలియజేస్తాయి.వాటిని లెక్కచేయనువాళ్లు ఏది కోరుకుంటున్నారో తెలుసుకునే కదా ముందడుగు వేయాలి. వాటిని పట్టించుకోకపోతే ఎలా? కానీ, నా లుక్స్ గురించి, ఫేస్ గురించి, శరీర సౌష్ఠవం గురించి కామెంట్స్ చేస్తే మాత్రం లెక్కచేయను. వాటిని లైట్ తీసుకుంటాను. ఈ ట్రోలింగ్ వల్ల కొన్నిసార్లు బాధనిపిస్తుంది. అప్పుడు అమ్మ(నటి మహీప్ కపూర్)తో నా బాధ చెప్పుకుంటాను. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.సినిమాషనయా.. 'ఆంఖోన్ కీ గుస్తాఖియన్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ప్రస్తుతం షనయా 'తు యా మే' మూవీ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: చాలామంది మోసం చేశారు: యాక్షన్ కింగ్ అర్జున్ -
రేణూదేశాయ్ మాత్రమే కాదు... రామ్ చరణ్ కూడా!
ఇటీవల శునకాలను తుదముట్టించడాన్ని నిరసిస్తూ నటి రేణూ దేశాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తారల్లో అత్యధికులు శునకాభిమానులే. వీరు పెట్స్ను పెంచుకోవడం మాత్రమే కాదు వాటికి ఎంత విలువు ఇస్తారంటే తమ ఇంటిపేరు తగిలించి మరీ వాటికి నామకరణం చేసి తమ ఫ్యామిలీ మెంబర్లా కలిపేసుకుంటారు. అయితే వారి ఈ రేంజ్ శునకాభిమానానికి నోచుకునేవి స్ట్రీట్ డాగ్స్ కాదు...మంచి పేరున్న బ్రీడ్స్. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో స్వయంగా తామే పంచుకున్న తారల పెట్ ప్రేమ గురించిన విశేషాలివి...– ఫ్రెంచ్ బుల్ డాగ్స్ తో తాను ప్రేమలో పడ్డానని తరచు చెబుతుంది సమంత. ఆమెకు హాష్ సాషా అనే రెండు పెట్స్ ఉన్నాయి. తన ప్రియమైన పెంపుడు జంతువులతో సరదాగా గడిపే క్షణాలను ఆమె తరచుగా తన అభిమానులకు అందిస్తుంది. ఇటీవల హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది– అలాగే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కు సైబీరియన్ బ్రీడ్ హస్కీ పెట్ ఫ్రెండ్. ఆయన దానికి స్ట్రోమ్ దేవరకొండ అంటూ తన ఇంటిపేరు కలిసొచ్చేలా పేరు పెట్టాడు. ఆయన ప్రియురాలు, నేషనల్ క్రష్ రష్మికకు విజయ్ దేవరకొండ తో పాటు ’ఆరా’ అనే తన పెంపుడు శునకం మీద కూడా క్రష్ ఉంది–ఇక మెగాస్టార్ వారసుడు రామ్చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఇద్దరూ పెట్ లవర్సే. మొదట్లో రామ్ చరణ్ కు బ్రాట్ అనే పిలుచుకునే బ్లాక్ల్ లాబ్రడార్ ఉండేది అయితే కొన్ని సంవత్సరాల క్రితం దానిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉపాసన ఆయనకు ఒక పెట్ను బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ జంటకు రైమ్ అనే ముద్దుల పెట్ ఉంది. జాతి ప్రకారం ఫ్రెంచ్ బార్బెట్ లాగా ఈ రైమ్, కనిపిస్తుంది, ఈ జంట తమ పెట్స్తో గడిపే చిత్రాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది వీలున్నంత వరకూ వీరి పెట్ కూడా వీరితో కలిసి ప్రయాణాలు చేస్తుంది. తద్వారా విమానాశ్రయాల్లో ఫొటోలకు చిక్కి స్టార్స్ సరసన మీడియాలో పబ్లిసిటీ కూడా దక్కించుకుంటుంది. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను చేసే మొదటి పని తన పెట్ ఎలా ఉందో చూడటమే అంటాడు రామ్ చరణ్. తన పెంపుడు జంతువును చూసినప్పుడల్లా ఓదార్పు ఓ పాజిటివ్ వైబ్ తక్షణమే లభిస్తుందని దానితో ఉన్నప్పుడు తన నిజమైన భావోద్వేగాలు బయటకొస్తాయంటున్న పెద్ది... తనపెట్తో కలిసి ఈత కొట్టడం తనకెంతో ఇష్టమంటున్నాడు. – దక్షిణాది సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ దగ్గర పలు పెట్స్ ఉన్నాయి. ఆమె తన పెట్స్తో పాటు వీధి కుక్కల పట్ల కూడా ప్రేమను పంచుతుంది. శునకాలను ప్రేమించడం మాత్రమే కాదు, వాటిని రక్షించేందుకూ అనుష్క శెట్టి పనచేస్తుంటుంది. ఆమె పెంపుడు కుక్కలతో పాటు, బ్లూ క్రాస్ పెట్ కార్నివాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. తన నిజమైన ఓదార్పు తన పెంపుడు జంతువులతో సమయం గడపడంలోనే లభిస్తుందని అనుష్క చెప్పింది. అదే విధంగా కాజల్ అగర్వాల్ ఎంతో ప్రేమించే పెట్ పేరు సీజర్. ఆమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇక దానితోనే గడుపుతుంది. టాలీవుడ్ నటుడు మంచు మనోజ్కు జ్యూస్ అనే పెంపుడు శునకం ఉంది దానిని తరచుగా తనతో బయటకు తీసుకు వెళుతుంటాడు. బహిరంగంగా దానిపై తన ప్రేమను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. హైదరాబాద్లోని దుర్గం చెరువు దగ్గర మనోజ్ షికార్లు చేస్తూన్న ఫొటోను కూడా అతను ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఆయన సోదరి నటి లక్ష్మీ మంచు కూడా ’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా తన పెంపుడు కుక్క జ్యూస్ ఆనంద్ మంచును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.సిద్ధార్థకు మురికివాడలో దొరికిన కొడుకు...హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు.. ’నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతనికి నాలుగు కాళ్లు వంకర తోక ఉన్నాయి. అతని పేరు మౌగ్లీ. ప్రస్తుతం అతనికి 10 సంవత్సరాలు, నేను అతన్ని ఒక మురికివాడలో కష్టాల నుంచి ఒకసారి రక్షించాను తను తన నిస్సారమైన ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడూ నన్ను రక్షిస్తున్నాడు. అతను ఒక మంచి శునకం. ప్రపంచంలోనే అత్యంత పిరికివాడు కూడా, అయితే ఆ పిరికితనాన్ని బిగ్గరగా మొరగడం ద్వారా దాస్తుంటాడు’’ అంటూ తన పెట్ గురించిన కబుర్లు పంచుకున్నాడు. -
ఏడేళ్లుగా మంచానికే పరిమితం.. హైదరాబాద్లో ముమైత్ ఖాన్
మహేష్ బాబు పోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' అంటూ ముమైత్ ఖాన్ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్తో తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. బిగ్బాస్లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ, హైదరాబాద్లో విలైక్ అనే అకాడమీని స్థాపించి మేకప్కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. అయితే, తనకు జరిగిన ప్రమాదం గురించి ఆమె మరోసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ముమైత్ ఖాన్ తన జీవితం గురించి పేర్కొంది. 2016లో ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది. అయితే, డాక్టర్లు సలహా మేరకే తాను ఇండస్ట్రీకి దూరం కావలసి వచ్చిందని ముమైత్ ఖాన్ తెలిపింది.తన మెదడులో కూడా కొన్ని నరాలు దెబ్బ తినడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని వైద్యులు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకుంది. వైద్యులు సూచించిన మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన బరువు కూడా పెరిగిందని పేర్కొంది. సుమారు 7ఏళ్ల పాటు మంచానికే పరిమతం అయ్యానని ఆమె తెలిపింది. అయితే, తాను గతేడాదిలోనే పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నానని తెలిపింది. View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
ఓటీటీలోకి ‘వరప్రసాద్గారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సంక్రాంతికి టాలీవుడ్లో దాదాపు ఐదు సినిమాలు రిలీజ్ అయితే..వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్స్లో రిలీజ్ అయింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే దాదాపు రూ. 300 కోట్ల వరకు కలెక్షన్స్ని రాబట్టింది. మొత్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్లో రికార్డు బద్దలు కొట్టిన ఈ చిత్రం..త్వరలోనే డిజిటల్ స్క్రీన్పై సందడి చేయనుంది. రిలీజ్కి ముందే ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ని ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రాన్ని, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 అధికారికంగా వెల్లడించింది. మరి డిజిటల్ స్క్రీన్పై ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
బాహుబలి బాటలో RRR.. రాజమౌళి ప్రకటన
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’.. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్తో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాకి రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చివరి చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అవార్డ్ దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. RRR అనిమేషన్ చిత్రంగా రూపొందించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను అనేక జపనీస్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు. అధికారికంగా ఇంకా ఏమీ ప్రారంభం కానప్పటికీ, ప్రస్తుతం ఆయన చేసిన ఈ ప్రకటనపై అనిమేషన్ ప్రేమికులు అభినందిస్తున్నారు. బాహుబలి రెండు భాగాలను యానిమేషన్ సిరీస్గా ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం 2027 లో విడుదల కానుంది. ఇప్పుడు తెరపైకి ఆర్ఆర్ఆర్ కూడా చేరడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. -
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్'దే ISPL టైటిల్
తమిళ నటుడు సూర్య కో-ఓనర్గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్కతా టైగర్స్పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్రెడ్డి స్టూడెంట్లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్లో కట్స్, ఎడిటింగ్, సంగీతం సూపర్ అంటూనే హీరోయిన్ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్ అంటున్నారు.సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ అల్లాడ, గిరిధర్రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రేయాసి సేన్కు మంచి గుర్తింపు వస్తుంది. -
గద్దర్ అవార్డ్స్ రేసులో 90 సినిమాలు.. పరిశ్రమపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
తెలంగాణ సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని అందుకోసం కార్యాచరణని కూడా సిద్ధం చేశామన్నారు. చిత్ర పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వం సాయంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన తెలంగాణ గద్దర్ సినీ పురస్కారాలు - 2025 స్క్రీనింగ్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.ప్రజల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు గద్దర్ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ఆయన పేరుపైనే సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో రెండో ఏడాది పురస్కారాల్ని కూడా అందించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈసారి ఉగాది రోజున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తమ ప్రభుత్వ తలుపు తట్టొవచ్చని ఆయన భోరస కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాను కూడా అందుబాటులో ఉంటామన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను చూసకుంటున్నారని చెప్పారు. గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ మణిశర్మ కమిటీ ఎలాంటి బేధాలు లేకుండా అవార్డుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి గద్దర్ అవార్డ్స్ కోసం 90 సినిమాలు పోటీలో ఉన్నాయని టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ప్రకటించారు. మార్చి 5లోపు జ్యూరీ సభ్యులు ఈ సినిమాలన్ని చూసి అవార్డుల్ని ఎంపిక చేస్తారని తెలిపారు. -
రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాలకు గుడ్బై చెబుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే, తాజాగా ఇదే అంశం గురించి ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మరోసారి వెల్లడించారు. ‘12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత కూడా వరసుగా పలు ప్రాజెక్ట్స్లలో పనిచేశారు.ఎక్కువ పని ఒత్తిడి కారణంగా తాను సినిమాలకు గుడ్బై చెబుతున్నట్లు పేర్కొన్నానని ఆయన అన్నారు. కానీ, తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని తక్కువ పదాలలో చెప్పేసరికి చాలామంది మరోలా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కొంత కాలం విరామం తీసుకుందామనుకున్నానని విక్రాంత్ మాస్సే చెప్పారు. శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని గుర్తుచేశారు. రోజులో సుమారు 16 గంటలు పని చేయడం చాలా కష్టంగా అనిపించడం వల్ల జీవితంలో చాలా అలసిపోయానన్నారు. దీంతో కాస్త బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ, తాను సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని అందులో నిజం లేదని విక్రాంత్ పేర్కొన్నారు.బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. -
'జన నాయగన్' రిలీజ్కు గ్రీన్ సిగ్నల్..?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదల కానుంది. ఈమేరకు కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పేర్కొంది.జన నాయగన్ సెన్సార్ విషయంలో నెలల తరబడి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కోలీవుడ్లో వచ్చిన కథనాల ప్రకారం. సెన్సార్ బోర్డు అభ్యంతరం సూచించిన సుమారు 20 నిమిషాల నిడివి గల సీన్స్ను తొలగించడంతో పాటు కొన్ని డైలాగ్స్ను కూడా మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్కి కొత్త వర్షెన్ సమర్పించి కోర్టు కేసులని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కేలు నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, రేవతి తదితరులు నటించారు. -
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
యాక్షన్ కింగ్, నటుడు, దర్శకుడు అర్జున్ సర్జాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు వారికి పరిచయం అయిన అర్జున్.. తన కెరీర్లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, తన 46 ఏళ్ల సినీ జీవితంలో చాలామంది తనను మోసం చేశారని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని అర్జున్ ఇలా చెప్పారు. 'నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే వాళ్లే.. నాకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది.. కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అప్పుడు తెలియలేదు. నా వాళ్లే నన్ను మిస్- యూజ్ చేశారు. ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడుల ఎక్కడ పెట్టాలో శోభన్ బాబు గారు చాలాసార్లు నాకు చెప్పారు. నాతో ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్ గుర్తు చేసుకున్నారు.తెలుగులో కూతురు ఎంట్రీకర్ణాటకలోని మైసూర్ సమీపంలోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన యాక్షన్ స్టైల్తో ప్రత్యేక గుర్తింపు పొందారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘సీతా పయనం’ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ‘సేవగన్’తో 1992లోనే డైరెక్టర్గా మారిన ఆర్జున్.. తెలుగులో ‘సీతాపయనం’తో తొలిసారి దర్శకత్వం వహించారు. టాలీవుడ్లోనే తన కూతురు రాణించాలని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. -
నేను ఏదీ అర్థం చేసుకోలేకున్నా: తమన్నా
అందం ఏ ఒక్కరికీ సొంతం కాదు. అయినా ఎవరి అందం వారికి ముద్దే. అదేవిధంగా అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందంటారు. అలాంటి అందాల్లో తమన్నా అందమే వేరయా అని పేర్కొనవచ్చు. ఈమె ఒక్కో చిత్రంలో ఒక్కో విధంగా తన అందాలను మార్చుకుంటారు. అలా ఏ కోణంలో చూసిన తమన్నా అందంగానే కనిపిస్తారు. అలా తన అందచందాలతో, హావభావాలతో రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కాగా ఈ 36 ఏళ్ల భామ ఇప్పటికీ కథానాయకిగా నాటౌట్గా నిలబడడం మరో విశేషం. అదేవిధంగా ఐటం సాంగ్స్లోనూ యువతను గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అలా ఒక్క ఐటమ్ సాంగ్కు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి తమన్నా. కాగా చిన్న గ్యాప్ తర్వాత ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్లో విశాల్కు జంటగా సుందర్.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. విజయ్వర్మ అనే బాలీవుడ్ నటుడితో కొద్దిరోజులు చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అదీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. కొంతకాలానికే వీరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇటీవల ఇకపై ఐటెం సాంగ్స్లో నటించనని పేర్కొన్న తమన్నా మళ్లీ ఇప్పుడు ప్రముఖ హీరోల చిత్రాల్లో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమన్నా లైఫ్లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రశ్నే ఇటీవల ఒక కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు తమన్నా ఆసక్తికరమైన బదులు చెప్పారు. తనను తానే అర్థం చేసుకోలేకపోతున్నానని, ఇతరులు ఎలా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. -
ఒకే తేదీన అమ్మ, అత్తమ్మ.. బాధలో మెహర్ రమేశ్
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి అత్తమ్మ పద్మావతి చనిపోయారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ డైరెక్టర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారని బాధపడుతూ ఈ సంగతి పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోలు కూడా పంచుకున్నాడు.'ఇన్నాళ్లు మా అమ్మ ని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ 'పద్మావతి' శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు.. 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్.. తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేశ్.. 'కంత్రి' మూవీతో టాలీవుడ్లో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ అంటూ పలు చిత్రాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గత కొన్నాళ్లుగా అయితే బయట కూడా మెహర్ రమేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు విషాద వార్తని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Meher Raamesh (@meherramesh) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్లకి ఓ ప్రొఫెసర్కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ. -
బ్యాక్ టు బాలీవుడ్?
బ్యాక్ టు బాలీవుడ్ అంటున్నారట హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ‘వైట్ టైగర్, లవ్ ఎగైన్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్మెంట్ డే ’వంటి వరుస ఇంగ్లిష్ చిత్రాల తర్వాత ఇటీవల తెలుగు మూవీ ‘వారణాసి’ ఒప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. అయితే హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ చిత్రం రానుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని భోగట్టా. ‘క్రిష్ 3, క్రిష్ 4’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా నటించారు. దీంతో ‘క్రిష్ 4’లో కూడా ఆమె నటిస్తే బాగుంటుందని హృతిక్ రోషన్ భావిస్తున్నారట. ‘క్రిష్ 4’ చిత్రానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం తర్వాత ప్రియాంకా చోప్రా హిందీలో అంగీకరించే చిత్రం ఇదే అవుతుంది. మరి... ‘క్రిష్ 4’తో ప్రియాంక బ్యాక్ టు బాలీవుడ్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పవర్ఫుల్ అబ్దాలి
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్’ మూవీ ఫేమ్ రిషబ్ సాహ్నీ చేస్తున్న లుక్ని రిలీజ్ చేశారు. ‘‘ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి అనే పవర్ఫుల్ పాత్రను చేస్తున్నారు రిషబ్ సాహ్నీ. 1750 బ్యాక్డ్రాప్లోని ఈ చిత్రంలో భారత్లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఇది సీరియస్ మేటర్
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ ఖరారైంది. ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది ఈ సినిమా క్యాప్షన్. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసి, టీజర్ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం స్వీకర్ అగస్తీ. -
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. -
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్లాండ్లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.ఎలా ఉందంటే..ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్తో ఈ సినిమా బ్లడ్ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్కు అంతగా నచ్చదు.డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్ ఆడియన్స్ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే రోటీన్ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.ఎవరెలా చేశారంటే..ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. -
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన.. ఆ దెబ్బకు మారిపోయా'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రూరల్ బ్యాక్డ్రాప్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. -
జపాన్లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/3 -
యశ్ టాక్సిక్.. భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్..!
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ను భారీ డీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్గా రికార్డ్ సృష్టించనుంది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్లో చర్చ మొదలైంది.ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్ఫుల్ స్టార్గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అందించడానికి థ్రిల్గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. The chaos is beginning to unfold. Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCReleaseIntoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg— KVN Productions (@KvnProductions) February 6, 2026 -
హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ రివ్యూ
టైటిల్: హనీనటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రినిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డిరచన, దర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: అజయ్ అరసాడసినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025కథేంటంటే..ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్ థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 3/5 -
డ్యాన్స్తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..!
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్లోని ఓ మాల్ ఓపెనింగ్కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్లోని దేక్లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.Actress #SreeLeela performs to #DekhLengeSaala from #UstaadBagathSingh at a shop opening! pic.twitter.com/Ilm1dpRLWL— idlebrain jeevi (@idlebrainjeevi) February 6, 2026 -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
ప్రేమకు వయసుతో పని లేదన్న నటి! భర్త చనిపోయాక..
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.రెండేళ్ల ప్రేమఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు. సీరియల్స్, సినిమాసుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది. View this post on Instagram A post shared by Suzanne Bernert (@suzannebernert) చదవండి: హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన పుష్ప నటుడు -
ఓటీటీలో స్వలింగ సంపర్కుల స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. Between rituals of loss and moments of connection, a new sense of belonging emergesWatch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026 -
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..!
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది.చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.కాగా.. కేరళలోని త్రిసూర్కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది. -
హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన 'పుష్ప' నటుడు
'పుష్ప' సినిమా ఫేమ్ డాలి ధనంజయ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అతడికి డాలి పిక్చర్స్ అని ఓ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద తెరకెక్కిన తాజా చిత్రం జేసీ. ద యూనివర్సిటీ అన్నది ఉపశీర్షిక. సూర్య ప్రఖ్యాత్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కన్నడ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్స్లో వాచీ గిఫ్ట్అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా అందరినోటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డాలి ధనంజయ సంతోషపడిపోయాడు. దీంతో థియేటర్లోనే సూర్య ప్రఖ్యాత్ను హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు, వెంటనే తన చేతికున్న వాచీని అతడికి బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమాడాలి ధనంజయ (Daali Dhananjaya) విషయానికి వస్తే.. ఈయన చివరగా తమిళంలో పరాశక్తి సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కథనాలు కూడా రాస్తుంటాడు. View this post on Instagram A post shared by 𝐊𝐚𝐧𝐧𝐚𝐝𝐚 𝐍𝐞𝐰𝐬 𝐀𝐧𝐝 𝐊𝐅𝐈 𝐈𝐧𝐬𝐢𝐝𝐞𝐫 | 𝐆𝐮𝐛𝐛𝐢 (@kannadanews_kfiinsider) చదవండి: ఒక్కమాటతో తారక్పై గౌరవం మరింత పెరిగింది: పూజా బేడీ -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ రివ్యూ
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజమండ్రి సమీప గ్రామంలో ఉండే సోలమన్(వంశీ తుమ్మల)కి మెల్లకన్ను ఉంటుంది.దీంతో ఊర్లోవాళ్లంతా అతనికి చిదంబరం అని పేరు పెట్టి హేళన చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్కి వెళ్లడమే మానేస్తాడు. అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రీ పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా(సంధ్య వశిష్ట)కి చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ, తనకున్న లోపం కారణంగా లీలా తనను ఇష్టపడదనే భయంతో చిందబరం..ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలమన్.. ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చిదంబరం తనను అపార్థం చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్లజోడు వెనుకాల బతికే పోలమన్.. చివరకు ఆ కళ్లజోడుని తీసి..ధైర్యంగా ఆ ప్రపంచాన్ని ఎలా చూశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే.. ధైర్యంగా జీవించొచ్చు అని సాటిచెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకొన్ని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరకలోపం ఉన్నవాళ్లని సమాజం ఎలా అవమానిస్తుంది? వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.మెల్లకన్ను కారణంగా సోలమన్కి స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ.. చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. సోలమన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా-సోలోమన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా-సోలోమన్ల లవ్స్టోరీని నడిపిస్తూనే..మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి ప్రజల జీవనశైలీని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సోలమన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చూట్టూనే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే హీరోలో వచ్చే మార్పుకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్గా నటించిన వంశీ తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్య వశిష్ట తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. చందు-రవి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా సహజంగా ఉంటుంది. ఎం.ఎం.కీరవాణి ఆలపించిన ‘వెళ్లే దారిలోన’ పాట ఆకట్టుకునేలా ఉంటుంది. అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి పచ్చదనాన్ని తెరపై మరింత అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఒక్కమాటతో తారక్పై గౌరవం రెట్టింపు: పూజా బేడీ
ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ చాలా తక్కువ సినిమాలే చేసింది. వాటిలో చిట్టెమ్మ మొగుడు (1993), శక్తి (2011) అని రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించింది పూజా బేడీ. నెగెటివ్ పాత్రఆమె మాట్లాడుతూ.. శక్తి సినిమా నేను సోనూసూద్కు భార్యగా నటించాను. నాది ప్రతికూల ఛాయలున్న పాత్ర. ఓ సీన్లో హీరో నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆడవారితో ఫైట్ చేయలేనని నిరాకరించారు. అప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఇప్పుడున్న సినీప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించేవాళ్లు చాలా అరుదు అని తెలిపింది.తారక్ సినిమాజూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చివరగా వార్ 2లో కనిపించాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా లైన్లో ఉంది.చదవండి: అడ్జస్ట్ అవ్వాల్సిందే.. అమ్మతో అనేసరికి: నటి -
ఈ ఐటం సాంగ్ బ్యూటీ నటిగా సక్సెస్ అయ్యేనా?
నోరా ఫతేహి ఐటం సాంగ్ స్పెషలిస్ట్. దిల్బర్ సాంగ్తో సెన్సేషన్ సృష్టించింది. శరీరాన్ని రబ్బర్లా సాగదీస్తూ, విల్లులా వంచుతూ స్టెప్పులేయడంలో ఆమె దిట్ట. తన ఎనర్జీకి, అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 6న) ఆమె 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..కెరీర్నోరా ఫతేహి కెనడా నటి. కెనడాలోని టోర్నటోలో పుట్టిపెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. రోర్ (2014) సినిమాతో నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా.. అనే ప్రత్యేక పాటలో అదరగొట్టింది. అక్కడినుంచే తన ఐటం సాంగ్స్ జర్నీ మొదలైంది. బాహుబలి మూవీలో 'మనోహరి..' అంటూ ప్రభాస్ను చుట్టుముట్టేసే సాంగ్తో మరింత ఆదరణ పొందింది.నటిగా కలిసిరాని అదృష్టంతెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది. అయితే తనకు నటిగా కనిపించాలన్న కోరిక ఎక్కువ. అలా రెండేళ్లుగా ఐటం సాంగ్స్పై ఫోకస్ తగ్గించేసి యాక్ట్రెస్గా సినిమాలు చేస్తోంది. తెలుగులో మట్కా సినిమా చేయగా ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడే కాదు హిందీలోనూ తను నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో నటిగా బ్రేక్ రావడం లేదు. దీంతో మళ్లీ గతేడాది చివర్లో థామా మూవీలో స్పెషల్ సాంగ్లో కాలు కదిపింది. బిగ్బాస్ షోలోనూ..నోరా డ్యాన్సర్, నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రస్తుతం నోరా ఫతేహి.. కన్నడలో కేడీ: ద డెవిల్, తమిళంలో కాంచన 4 సినిమాలు చేస్తోంది. మరి వీటితోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి! నోరా ఫతేహి.. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. డ్యాన్స్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జలక్ దిక్లాజా 9వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇదే షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
హీరోయిన్గా అర్జున్ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు. -
అడ్జస్ట్మెంట్ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్ నటి
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్ శెట్టి -
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్ శెట్టియే కారణమంటూ రూమర్స్ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ను సునీల్ శెట్టి ఖండించాడు. బిల్లు చూపించండిఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటి నుంచే భోజనంనేను సెట్కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్ స్టాఫ్ (మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్ శెట్టి 2021లో వచ్చిన తడప్ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్ చివరగా బోర్డర్ 2 సినిమాలో నటించాడు. -
కాలినడకన తిరుమలకు నటి మీనాక్షి చౌదరి (వీడియో)
కలియుగదైవం తిరుమల శ్రీవారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. రీసెంట్గా తాను నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం విజయం అందుకోవడంతో ఆమె స్వామివారి ఆశీస్సులను తీసుకునేందుకు అలిపిరి కాలినడకన కొండకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదల సమయంలో కూడా శ్రీవారిని ఆమె దర్శించుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మీనాక్షి పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు. -
చెక్బౌన్స్ కేసులో తీహార్ జైలుకు కిక్-2 నటుడు
కిక్-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్బౌన్స్ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. -
నా ఫస్ట్ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు
తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్ నటుడు నకుల్ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్ మొదలైంది. హైదరాబాద్ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో తన సినిమాలు చూసేవాడిని. నా సినిమా ముందుకు కదల్లేదుతన కెరీర్ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్ఫుల్గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్టైన్ చేయడం అంటే ఇష్టం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదే సక్సెస్శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్ను చూసింది, స్టార్డమ్ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్.. ఇష్క్బాజ్ సీరియల్తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్ చేశాడు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్ జెన్: చంద్రయాన్ అనే సిరీస్లో యాక్ట్ చేశాడు.చదవండి: ధురంధర్ 2లో దర్శకుడి సతీమణి -
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ తమిళ్లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా కనీసం ట్రైలర్ కూడా ఆ సమయంలో రిలీజ్ చేయలేదు. అయితే, కోలీవుడ్లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డైరెక్ట్గా తెలుగు వర్షన్ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు. -
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
టైటిల్: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్గా న్యూస్లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్రోల్లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు. -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
అభిమానానికి ధన్యవాదాలు: శివకార్తికేయన్
ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కమర్షియల్గా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలకు తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తూ చేయూతనిస్తున్నారు. శివ కార్తికేయన్ తాజాగా కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. చేతిలో ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు కమలహాసన్ నిర్మించనున్న మరో ప్రాజెక్ట్ ఉంది. వాటిలో ఏది ముందు సెట్స్పైకి వెళుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చిలోని కుమారస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. 14 ఏళ్ల సినిమా జీవితం తనకు చాలా అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలతో పాటు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు వాటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా కుటుంబంపై అలాంటి అభిమానాన్ని కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తిరుచ్చిలో కుమారస్వామి ఆలయంలో దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఆర్తి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు: ఆనంద్ దేవరకొండ
‘‘నటీనటులకు తొలి సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అలాగే యూనిట్ కష్టం కూడా తెలుసు. అందుకే ‘శ్రీ చిదంబరంగారు’ ఈవెంట్కి వచ్చాను. ఈ మూవీ టీజర్ ఎంతో నచ్చింది. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్ అదే. ఈ మూవీలో హీరో పాత్ర చేయడం చాలా కష్టం. కానీ, వంశీని చూశాక ఎంతో కన్విన్సింగ్గా అనిపించింది.ఇలాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నంది పాటి నేడు విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఆనంద్ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల అతిథులుగా హాజరై, ‘శ్రీ చిదంబరం గారు’ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. వంశీ నంది పాటి మాట్లాడుతూ– ‘‘ఇన్సెక్యూరిటీని దాటి జీవితంలో ఎలా ఎదగాలి అనేది ఈ చిత్రకథ. అన్నీ కోల్పోయాం అనుకునేవాళ్లకు స్ఫూర్తి, ధైర్యం నింపే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘హీరో కావాలనే నా కల ‘శ్రీ చిదంబరంగారు’తో నెరవేరింది’’ అన్నారు వంశీ తుమ్మల. -
ప్రేక్షకుల డబ్బుకి విలువ ఇస్తాను: గుణశేఖర్
‘‘లాఠీ’ (1992) చిత్రంతో చిత్ర పరిశ్రమకి వచ్చాను. ‘యుఫోరియా’ నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్తో ఉన్నాను. నేను ప్రేక్షక దేవుళ్లని నమ్ముతాను. వారి సమయం, డబ్బు, విజ్ఞతకు విలువ ఇస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘యుఫోరియా’ తీశాను. ఈ మూవీ వల్ల వారి టైమ్, మనీ... ఏదీ వృథా కాదు’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలి పారు. భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ నటించిన చిత్రం ‘యుఫోరియా’.గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఈ మూవీ నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి భూమిక బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో తను జీవించింది’’ అన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ సినిమా చూశాను. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి నా పాత్ర గురించే ఆలోచించాను (భావోద్వోగంతో)’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమా అందరి మనసుల్ని తాకుతుందని భావిస్తున్నాను’’ అని నీలిమ గుణ చెప్పారు. -
తెలుగు సినిమా నాటి నుంచి నేటి దాకా...
తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికి 94 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. దానినే కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’ (తెలుగు సినిమా డే)గా సినీ పరిశ్రమ, సంస్థలు చేస్తున్నారు. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం ఆరంభమైంది. అంతకు ముందు మాటలు, పాటలు ఏమీ లేకుండా బొమ్మలు మాత్రం కదిలే మూగ సినిమాలు వచ్చేవి. భాషతో ప్రమేయం లేని సినిమాలు గనక అవి భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి, అందరినీ ఆకర్షించేవి. 1931 మార్చి 14న హిందీ, ఉర్దూల సమ్మిశ్రమ భాషలో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలైంది. అక్కడ నుంచి క్రమంగా వివిధ భారతీయ భాషల్లో మాటలున్న సినిమాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే తీశారు! నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది. ఆ వెనువెంటనే మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఈసారి ఏకంగా 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ‘‘100% సంపూర్ణ తెలుగు టాకీ’’గా ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగాయి. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకు వచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 94 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ‘భక్త ప్రహ్లాద’ రూ. 18 వేలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ప్రసిద్ధ సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఆ సినిమా తీశారు. అప్పటికే తెలుగునాట నాటక రచయితగా ప్రసిద్ధుడైన చందాల కేశవదాసు ఆ సినిమాలో పాటలు అందించారు. తొలి తెలుగు సినీ గేయరచయితగా కీర్తి గడించారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలా బాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోని కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అటుపైన విజయవాడ (శ్రీమా రుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న రిలీజైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఎందరో మహామహుల జీవితకృషి కారణంగా ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటింది. ఇటీవలి ‘ఆర్.ఆర్.ఆర్’తో అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా ఎదిగింది. అలనాటి ‘మల్లీశ్వరి’, ఆ మధ్య ‘శంకరాభరణం’ నుంచి నిన్నటి ‘బాహుబలి’ మీదుగా రానున్న రాజమౌళి – మహేశ్బాబుల ‘వారణాసి’ దాకా మన తెలుగు సినిమా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. -
ఉదయ్పూర్లో పెళ్లి
గత ఏడాది అక్టోబరులో విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి వీరి వివాహ తేదీ ఎప్పుడు? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నెల 26న ఈ ప్రేమికులు... భార్యాభర్తలు కానున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇంకా 20 రోజులే ఉన్నందున ఇటు విజయ్ అటు రష్మిక కుటుంబ సభ్యులు జోరుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.ఇరువైపు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అలాగే హైదరాబాద్లో మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్–రష్మిక జంటగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. -
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.అభిషేక్ బచ్చన్కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్కు వీరిద్దరూ మరోసారి చెక్ పెట్టారు.మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. -
కలర్ఫుల్ శారీలో బిగ్బాస్ దివి అందాలు.. జిమ్లో వరలక్ష్మీ శరత్కుమార్..!
జిమ్లో చిల్ అవుతోన్న వరలక్ష్మీ శరత్కుమార్..స్విమింగ్ పూల్లో నటాషా స్టాంకోవిచ్ చిల్...పింక్ శారీలో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్..బ్లూ డ్రెస్లో బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ హోయలు..ట్రేడిషనల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత అందాలు.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragyaa Kapoor (@pragyakapoor_) -
'మూడేళ్లుగా వేధింపులు.. తట్టుకోలేకపోతున్నా': నటి ఆవేదన
'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్ ఇచ్చింది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.కాగా...రవీనా రవి జవాన్ సినిమాలో దీపికా పదుకోన్కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
సందీప్రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.భయపడ్డా..ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్లో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది. అది బాగా నచ్చిందికాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఎప్పుడో ఫిక్సయ్యా..సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్బీర్కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్బీర్ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్కు సీక్వెల్గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మళ్లీ యాక్ట్ చేస్తాననుకోలేదు: రియా ఎమోషనల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్ మృతి, డ్రగ్స్ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. రీఎంట్రీకానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్ క్లోజ్ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్ఫ్లిక్స్ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్ టీజర్ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.కెరీర్ ముగిసిందనుకున్నా అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.నా జీవితంలో రెండో చాప్టర్ ఈ వీడియోకు సెట్కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్. నా ప్లాన్స్లో నేనుంటే జీవితం నన్నిలా సర్ప్రైజ్ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.సినిమారియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక -
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06 -
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026 -
ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!
ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Visuals of Mega Power Star @AlwaysRamCharan and #UpasanaKonidela as they take the #MegaTwins home!📸🫶#RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/bkTROvEsgC— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2026 -
అర్ధరాత్రి అదే ఆలోచన.. స్టేజీపై ఏడ్చేసిన భూమిక
హీరోయిన్ భూమిక చావ్లా చాలాకాలం తర్వాత యుఫోరియా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈక్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో భూమిక భావోద్వేగానికి లోనైంది. ఏడుపు ఆపుకోలేకపోయిన భూమికయుఫోరియాలాంటి సినిమాను తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిన్ననే సినిమా మొత్తం చూశాను. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి ఆ పాత్ర గురించే ఆలోచించా.. అంటూ ఏడ్చేసింది. దాంతో అక్కడే ఉన్న గుణశేఖర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే దుఃఖంతో గొంతు కూరుకుపోవడంతో ఆమె ఇక మాట్లాడలేకపోయింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశా..తర్వాత గుణశేఖర్ మాట్లాడుతూ.. 1992లో వచ్చిన లాఠీ నా మొదటి సినిమా. యుఫోరియా నా పద్నాలుగో సినిమా. కొత్త కథ చెప్పాలని సాయశక్తులా ప్రయత్నించాను. ప్రేక్షక దేవుళ్ల సమయం, డబ్బు, విజ్ఞతకు విలువిస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. మీ సమయం, డబ్బు.. ఏదీ వృథా చేయను. తొలిసారి చూస్తున్నా..మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ కథకు వెన్నెముక భూమిక. తను చాలా స్ట్రాంగ్ లేడీ. తనలా ఎమోషనల్ అవడం తొలిసారి చూస్తున్నాను. సినిమా చూసిన కొందరు భయపడ్డామన్నారు. యుఫోరియా అనే టైటిల్ ఎందుకు పెట్టామో రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ప్రేమ వర్షం -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్బాస్ అమర్దీప్
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
'ఆ స్ట్రెస్ ఏంటో నాకు కూడా తెలుసు'.. నిహారిక ఆసక్తికర కామెంట్స్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్ను ఉద్దేశించి మాట్లాడారు. కమిటీ కుర్రాళ్లు నా వీపు మీద వేసుకున్నందుకు.. నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది#VamsiTummala #SandhyaVasishta #Gopinath #VinayRatnam pic.twitter.com/86RQYx2iTc— Filmy Focus (@FilmyFocus) February 4, 2026 -
కాబోయే భార్యపై ముద్దుల వర్షం.. అల్లు శిరీష్ వీడియో
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!బ్యాచిలర్ పార్టీపెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉండకపోతే ఎలా? సింగిల్ లైఫ్కు చెక్ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయన్నాడు శిరీష్.అలా మొదలైంది.2023 అక్టోబర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు -
హీరో బూతు పాట.. అక్కడున్నవారికి తెలీదు: నిర్మాత
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్ వల్ల జనాలు దండోరాను లైట్ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.బూతు పాటవిషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ తనలో సింగింగ్ టాలెంట్ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్పై పోలీస్ కేసు కూడా నమోదైంది.పొరపాటుకు చింతిస్తున్నాంఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా టీమ్ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.సినిమాలో అలాంటి పాటల్లేవ్దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్ -
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్ -
'మన శంకర వరప్రసాద్గారు' 25 రోజుల కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్
మన శంకర వరప్రసాద్ గారు ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 25రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు.మొదటివారంలోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు వసూలు చేసింది. కేవలం ఫస్ట్ వీక్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల్లో రూ. 375 కోట్లు రాబట్టి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇప్పటి వరకు రూ. 300 కోట్ల కలెక్షన్స్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహార్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే.ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు రాబట్టింది. చిరు (Chiranjeevi) కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు నెలకొల్పింది. ఆపై బుక్మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రతి అంశంలో మన శంకర వరప్రసాద్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. -
6సార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలోనే!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయంటారు. కానీ, బాలీవుడ్లో మాత్రం పెళ్లయ్యాకే కాదు, తల్లయ్యాక కూడా హీరోయిన్లు ఓ వెలుగు వెలుగుతున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి పలువురు హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మకాం మార్చిన ప్రియాంక చోప్రా కూడా అంతే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.నా కూతురే ఒక అద్భుతంహీరోయిన్ ప్రియాంక చోప్రా- సింగర్ నిక్ జోనస్ దంపతులకు 2022లో కూతురు మాల్తీ మేరీ చోప్రా జన్మించింది. అయితే మాల్తీ మూడు నెలలు ముందుగా పుట్టిందని, అప్పుడు చాలా బాధ అనుభవించామంటున్నాడు నిక్ జోనస్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిక్ జోనస్ మాట్లాడుతూ.. 'నా కూతురు ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటీవలే తనకు నాలుగేళ్లు నిండాయి. కిలో కంటే తక్కువ బరువుభవిష్యత్తులో తను గొప్ప స్థాయికి ఎదుగుతుంది. తను చేసే పనులన్నీ నేను కళ్లారా చూస్తూ ఆస్వాదించాలి. తన జననం అంత ఈజీగా జరగలేదు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాం. ఆ తల్లికి 2022 ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. తీరా డెలివరీ ముందే అవొచ్చన్నారు. కిలో కంటే తక్కువ బరువుతో పాప పుట్టింది. అప్పుడంతా కరోనా కాలం. పుట్టిన మూడు నెలలకే మాల్తీ అనారోగ్యంపాలైంది. హాస్పిటల్కు తీసుకెళ్లాం. ఫలించిన నిరీక్షణమూడున్నర నెలల్లో ఆరుసార్లు రక్తమార్పిడి చేశారు. నేను, నా భార్య రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ప్రియాంక సానుకూల దృక్పథంతో చాలా ధైర్యంగా నిలబడింది. ఈ విషయంలో తనే నాకు ఇన్స్పిరేషన్.. అలా మేమిద్దరం కుంగిపోకుండా, ఓపికగా తనకు బాగవుతుందని ఎదురుచూశాం. మా నిరీక్షణ ఫలించింది. నా బిడ్డ అనారోగ్యాన్ని జయించింది. బరువు పెరిగి ఆరోగ్యంగా మా చేతుల్లోకి వచ్చింది' అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకున్నాడు నిక్.చదవండి: చంద్రహాస్పై కేసు నమోదు -
ఓటీటీలో 'ది రాజాసాబ్'.. ఫ్యాన్స్కు జియో హాట్స్టార్ గుడ్న్యూస్
ప్రభాస్, మారుతి కాంబినేషన్ సినిమా ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా జియో హాట్స్టార్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే, ఎక్స్టెండెడ్ కట్ను OTTలో విడుదల చేయనున్నట్లు జియో హాట్స్టార్ ప్రకటించింది. ప్రభాస్ ఓల్డ్ గెటప్లో ఉన్న పలు సీన్స్ను కలుపుతున్నట్లు తెలిపింది. ట్రైలర్లలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ను చూపించ మేకర్స్ సినిమాలో అది కనిపించకపోవడంతో చాలా మంది సినిమాని ఆస్వాదించలేకపోయారు. ఆ తర్వాత తక్కువ నిడివితో ఉన్న కొన్ని సీన్స్ను థియేటర్ రన్లో కలిపారు. ఇప్పుడు ఓటీటీ కోసం మరికొన్ని సన్నివేశాలు కలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్లోని రాజ మహల్కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్పై కేసు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ అశోక్కుమార్ తప్పబడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. పాటలో చంద్రహాస్ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన చంద్రహాస్ కౌంటర్గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో అశోక్కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. -
ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్పే, గూగుల్పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.ఎవరీ వాహిని?విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు. -
'యానిమల్' సీక్వెల్పై ఆప్డేట్ ఇచ్చిన సందీప్రెడ్డి
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా మూవీ ‘యానిమల్’ భారీ విజయం అందుకుంది. దీంతో సీక్వెల్గా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ‘యానిమల్’ వచ్చి సుమారు 3ఏళ్లు కావస్తుంది. కానీ, సీక్వెల్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు సందీప్రెడ్డి పార్ట్-2 గురించి పలు విషయాలు పంచుకున్నారు.ఫిబ్రవరి 13న యానిమల్ సినిమా జపాన్లో విడుదల కానుంది. ఈ క్రమంలో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి ప్రమోషన్స్లో పాల్గొన్నారు. జపాన్ అభిమానులతో సందీప్ మాట్లాడుతూ ‘యానిమల్ పార్క్’ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028లో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో రణ్బీర్ హీరోగా, విలన్గా నటించనున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్ స్పిరిట్ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని సందీప్ వెల్లడించారు. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత దూకుడుగా ఉంటుందని పేర్కొన్నారు. 2023లో విడుదలైన యానిమల్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలుంటాయని గతంలో రణ్బీర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి. -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. టాలీవుడ్లో శివకార్తికేయన్కు భారీ క్రేజ్ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే.1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు. -
శింబు కొత్త చిత్రం షురూ!
లిటిల్ స్టార్ నుంచి లిటిల్ సూపర్స్టార్ వరకు ఎదిగిన నటుడు శింబు. ఈయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాబోతోందంటేనే అభిమానులకు పండగ. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా బాధ పడరు. శింబు కొత్త చిత్రంలో నటించడమే చాలు అభిమానులకు. కాగా ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కమలహాసన్తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్స్ లైఫ్ చిత్రం డిజాస్టర్గా మారింది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా శింబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం షురూ అయ్యింది. దీన్ని డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు తెరకెక్కించనున్నారు. వరుస విజయాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం శింబు పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శింబు నటిస్తున్న అరసన్ చిత్రం పూర్తి అయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకనటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కొద్ది రోజులు ఆగండి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని దర్శకుడు అశ్వద్ మారిముత్తు ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న శింబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే పుల్ ఖుషీ అవుతున్నారు. -
మా సినిమా హాయిగా ఉంటుంది
శ్రీ చిదంబరంగారు’ని క్రౌడ్ ఫండెడ్ మూవీగా ఈ టీమ్ ఆరంభించింది. నాలుగేళ్లుగా వీళ్లు పడుతున్న కష్టం చూసి మా అమ్మాయి వినీషా రెడ్డి... ఈ సినిమా మనం చేద్దామని చెప్పింది. ఈ కథ వినగానే మాకూ బాగా నచ్చింది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘శ్రీ చిదంబరంగారు’ చిత్రాన్ని నిర్మించాం’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కథతో తీసిన ఈ మూవీలో ఫైట్స్, యాక్షన్ గోల ఉండదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా సేద తీరేలా మా సినిమా ఉంటుంది. వంశీ, సంధ్య పాత్రలు చాలా బాగుంటాయి. వినయ్ రత్నం చక్కగా తెరకెక్కించాడు. మా సినిమా ‘పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాలకంటే ఇంకా బాగుంటుందని చెప్పగలను. చందు రవి సంగీతం, కీరవాణిగారు పాట పాడటం మాకు ప్లస్. మా మూవీని వంశీ నందిపాటి పంపిణీ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ వారం మా సినిమాతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందాలి. మా సినిమా టిక్కెట్ ధర కేవలం 99 రూపాయలుగా నిర్ణయించాం. భవిష్యత్లో కె. విశ్వనాథ్గారి తీసిన తరహా సినిమాలు తీయాలని ఉంది. మా సంస్థలో ప్రస్తుతం ‘రావు బహదూర్’ అనే సినిమాతో పాటు కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాం. అదే విధంగా 2027లో ‘క’ మూవీ సీక్వెల్ను రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘ఎర్ర చీర’ మూవీ ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. కచ్చితంగా టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూస్తాను. చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాలు తీస్తున్నారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్ రెడ్డిగారు అందుకు కృషి చేస్తున్నారు. ‘ఎర్ర చీర’ విజయం సాధించాలి’’ అని మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సుమన్ బాబు దర్శకత్వం వహించి, లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఎర్ర చీర’. కారుణ్య చౌదరి హీరోయిన్గా, బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించారు. బేబీ డమరి సమర్పణలో ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘300 థియేటర్స్లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు. -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన వితికా శేరు..పొట్టి డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ హోయలు..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ కాజోల్..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ శ్రీలీల..టాలీవుడ్ నటి సాహితి దాసరి లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
జెనీలియా వేగన్గా ఎందుకు మారిపోయిందో తెలుసా?
జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్ మూవీతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్, పిల్లలు రియాన్, రాహుల్తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?కొడుకు అమాయక ప్రశ్నజెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్ స్కూల్ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. భార్యాభర్తలిద్దరూ..అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్వెజ్కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్ దేశ్ముఖ్ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్ కాదనిపించడంతో 2016లో నాన్వెజ్ తినడం మానేశాడు.వేగనిజం2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్కు జై కొట్టారు. వేగన్ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.చదవండి: బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా? -
మెగా ఫ్యాన్స్కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026 -
బుల్లెట్ సునీల్గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా?
'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో శర్వానంద్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్. ఇందులో శర్వానంద్ బైకర్గా నటించాడు. పర్ఫెక్ట్ బైకర్గా కనిపించేందుకు ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. బాగా బరువు తగ్గాడు కూడా! ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానున్నట్లు ప్రకటించారు.బుల్లెట్ సునీల్బుధవారం (ఫిబ్రవరి 4న) నాడు బైకర్ నుంచి బుల్లెట్ సునీల్ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ వదిలారు. ఈ స్పోర్ట్ క్రికెట్ కాదు సునీల్, ఎవరూ పట్టించుకోరు. టైం వేస్ట్ చేసుకోకు అన్న వాయిస్తో టీజర్ మొదలైంది. 'సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్, అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు.కీలక పాత్రలో రాజశేఖర్18 ఇండియన్ ఛాంపియన్షిప్స్.. 57 సౌత్ జోన్ టైటిల్స్.. 100కి పైగా రేసుల్లో పాల్గొన్నాడు' అంటూ రాజశేఖర్ను రేసర్గా పరిచయం చేశారు. గ్లింప్స్లో రాజశేఖర్ లుక్స్ చూస్తుంటే గట్టి కమ్బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సింహరాశి, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్. 2017లో పీఎస్ గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.సినిమాబైకర్ విషయానికి వస్తే మూడు తరాల నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు. చదవండి: 2 నెలలుగా నరకం చూస్తున్నా: వడాపావ్ గర్ల్ -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్ను అలరించాయి.అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.love met chaos and chose to arrive on your screens 👀#NaariNaariNadumaMurariOnPrime, Watch Now https://t.co/JCx7tvOlqr@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali… pic.twitter.com/KxGZsv5EGZ— prime video IN (@PrimeVideoIN) February 3, 2026 -
పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్
జూబ్లీహిల్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్ఫుల్గా కనిపించాడు.కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. Director #PuriJagannadh & #CharmyKaur Spotted At Shri Peddamma Talli Temple pic.twitter.com/ofas8ZxFfC— idlebrain.com (@idlebraindotcom) February 4, 2026 -
'ఆట' డ్యాన్స్ షో కొత్త సీజన్.. ఎప్పటినుంచంటే?
డ్యాన్స్ రియాలిటీ షోలలో ఒక ప్రభంజనం ఆట. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ‘ఆట’మరోసారి వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఎందరో ప్రతిభావంతులైన డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకురాబోతోంది. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతోంది. జీ తెలుగులో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కంటే రెండు రోజుల ముందుగా ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఎపిసోడ్స్ రిలీజ్ కానున్నాయి.16 మంది మధ్య పోటీఈసారి ఆట షోకి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆట షో ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడేందుకు సిద్ధమయ్యారు. హిట్ సాంగ్స్తో మొదలుఇటీవల బ్లాక్బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి..’, ‘చుట్టమల్లే..’, ‘గిర గిర గిర గింగిరానివే..’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డ్యాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ షోను ఈ వీకెండ్ నుంచి చూసేయండి.. -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్మేన్గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
అసభ్య కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్స్టాగ్రామ్లో ఈషా రెబ్బ పెట్టిన పోస్ట్కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ పెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఈషా.. అతడి ఐడీతో పాటు కామెంట్ను చూపించింది.కేసు నమోదుఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా చెండాలంగా కామెంట్స్ పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు. కాగా ఈషా రెబ్బ.. ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాలో నటించింది.చదవండి: చిన్నతనంలో నేను పడ్డ బాధ.. అందుకే పిల్లలు వద్దు: నటి -
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది చంద్రికా దీక్షిత్. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? నావల్ల కావట్లే..అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్లో చాటింగ్ స్క్రీన్షాట్, భర్తతో క్లోజ్గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తుపెట్టుకో..దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. View this post on Instagram A post shared by Chandrika Gera (@chandrika.dixit) చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
ఓ వయసుకు రాగానే పెళ్లి చేసుకోవం, పిల్లల్ని కనడం అనేది ఒక రూల్లా అయిపోయింది. కానీ, పెళ్లయ్యాక తప్పకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదంటోంది మలయాళ నటి లీనా. బాధ్యతగా ఉంటామనుకుంటే తప్ప పిల్లల జోలికి వెళ్లకూడదని చెప్తోంది. లీనా మాట్లాడుతూ.. సంతానం వద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్లను ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అన్న ప్లానింగ్ ఉండాలి. బాధ్యత అవసరంతల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. పెళ్లవగానే పిల్లల్ని కనాలంటారు. దానికి నేను వ్యతిరేకం. చిన్న వయసులోనే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిడ్న్ను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ కూడా ఆ వయసులో ఉండదు. నా చిన్నప్పుడు పేరెంట్స్ నన్ను సరిగా పెంచలేదని అనుకుంటూ ఉండేదాన్ని. నాపై ఇంకాస్త ఫోకస్ చేయాల్సిందని ఫీలయ్యేదాన్ని. కొన్నిసార్లు స్వేచ్ఛ కోసం పోరాడేదాన్ని. సంతానం వద్దనుకున్నా..మరికొన్నిసార్లు నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారని కోప్పడేదాన్ని. ఒక్కోసారేమో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేడం లేదు, ప్రతిసారి ఒంటరిగా వదిలేస్తున్నారని బాధపడేదాన్ని. ఇలా ఎప్పుడూ ఏదో ఒకరకమైన విచారంలో బతికేదాన్ని. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. పైగా నేను ఎంచుకుంది యాక్టింగ్ కెరీర్. కెరీర్ఇక్కడ కుటుంబం, కెరీర్.. రెండూ చూసుకోవడం అంటే కష్టం. తల్లిదండ్రులిద్దరూ కెరీర్ అని పరుగులు పెడితే పిల్లల్నెవరు చూసుకుంటారు. అందుకే పిల్లల్ని ప్లాన్ చేయలేదు అని చెప్తోంది. మలయాళంలో అనేక సినిమాలు చేసిన లీనా తెలుగులో డాక్టర్ చక్రవర్తి మూవీలో కనిపించింది. షైతాన్ అనే తెలుగు వెబ్ సిరీస్లోనూ అలరించింది. కాగా లీనా 2004లో అభిలాష్ కుమార్ను పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గగన్యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్ను వివాహం చేసుకుంది.చదవండి: అందువల్లే 4 ఏళ్లు సినిమాలకు బ్రేక్: మాధవన్ -
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్) -
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూతు సాహిత్యం ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని.. రచయితల ట్రెండింగ్ పేరిట యదేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ అనబడే హీరో చంద్రహాస్.. అందరూ చూస్తుండగా ఏకంగా స్టేజీపైనే బూతు పాట పాడాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పాట విని జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టాడని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయమై జేడీ స్పందించాడు. చంద్రహాస్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు షాక్లో ఉన్నా. ఏం పాడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తన పాటని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు నేనా పని చేయలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈవెంట్లలో గెస్టులు.. స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే అతడి పాటని సరిగా పట్టించుకోలేదు. నా పక్కనున్న అమ్మాయికి తెలుగు అర్థంకాక పాప చప్పట్లు కొట్టింది. అది చూసిన చాలామంది నేను కూడా చప్పట్లు కొట్టాననుకున్నారు. నేను బూతులు మాట్లాడను. నా ముందు ఎవరు మాట్లాడినా సహించను'(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత)'ఓసారి సెట్లో బూతులు మాట్లాడాడని ఓ దర్శకుడిని కొట్టా. నా పక్కన అమ్మాయికి అతడు బూతులు పాడుతున్నాడని చెబితే చప్పట్లు కొట్టడం ఆపేసి షాకైంది. పాట టైంలో జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అప్పుడే లేచి వెళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ.. అలా చేయొద్దని నన్ను వారించింది. అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. చంద్రహాస్ అలా చేయడాన్ని సమర్థించను. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే' అని జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చాడు.టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన 'రామ్నగర్ బన్నీ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే యాటిట్యూడ్ చూపించడం, చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందు తగిలించుకున్నాడు. తొలి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రంతో వస్తున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్) -
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్
ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్. సాలా ఖడూస్ (2016) సినిమాకు ముందు బ్రేక్ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్ చివరగా ధురంధర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్డమ్ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్బాబు -
ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత
యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో, 'జబర్దస్త్' కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మినారాయణ.. రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే 'జబర్దస్త్' కమెడియన్స్ నవీన్, బాబీ తదితరులు ఇతడి మృతిపై మిస్ యూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ సుమ కూడా బాబీ ఇంటికి వెళ్లి, అతడి మృతదేహానికి నివాళులు అర్పించింది. ఇంతకీ అసలేమైంది? ఎప్పుడీ ప్రమాదం జరిగింది?(ఇదీ చదవండి: కొడుకు చనిపోయిన నెలకే టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్.. ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఐ విశ్వం చెప్పిన ప్రకారం.. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చేసరికి రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఆనపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంతలోనే విషాదం జరిగిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
నాకు స్టార్డమ్ తెచ్చిన సినిమా అదే! రాముడి పాత్రకోసం..
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. మహేశ్బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. 2025 చివర్లో వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేయగా మూవీకి భారీ హైప్ వచ్చింది. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా చిత్రయూనిట్ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది.స్టార్గా మారిందే ఆ సినిమాతోఅందులో మహేశ్బాబు తనకు స్టార్డమ్ తెచ్చిన సినిమా ఏదో వెల్లడించాడు. అలాగే వారణాసిలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. 'పోకిరి సినిమా నన్ను స్టార్గా నిలబెట్టింది. ఆ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి నాకు ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయాను. తర్వాత ఓసారి.. మీ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. మీరు హీరోలను చాలా బాగా చూపిస్తారు, మీకు హీరోలంటే చాలా ప్రేమ అని రాజమౌళికి మెసేజ్ పెట్టాను. అందుకాయన థాంక్యూ, కానీ నా సినిమాల్లో నాకు విలన్లంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు.మొదట్లో భయపడ్డా..రాజమౌళి అభిమానిగా నేను కూడా వారణాసి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో హీరోగా చేయడానికి నేను మొదట్లో భయపడ్డాను. కానీ ఆయన కథను వివరించి చెప్పాక ఆ భయం పోయింది. ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం. నిలబడే దగ్గరనుంచి పాత్రలో నటించేవరకు ఎన్నో రిహార్సల్స్ చేశాం అని చెప్పాడు. తనకు ఇష్టమైన వంటకం ఏంటని అడగ్గా హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇష్టమని మహేశ్బాబు తెలిపాడు.చదవండి: చిరంజీవిపై ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు -
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్
మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ)రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
2026 మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చిన చిరంజీవి.. చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హిట్ కొట్టారు. జనవరి చివరి రోజున చిరు మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు(మగబిడ్డ, ఆడబిడ్డ) పుట్టారు. రెండు మూడు రోజుల క్రితం ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. అదే టైంలో చిరు గతంలో 'మెగా వారసుడి' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. వీటిపై మెగాకోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన చిరు.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్న కొందరు.. ఆడపిల్లలు, మహిళలని చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని ఒక యూజర్కి గట్టిగా ఇచ్చిపడేసింది.'సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళలని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో.. ఈ విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని లావణ్య ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ చేసిన కాసేపటికే.. సదరు యూజర్ తన ట్వీట్ డిలీట్ చేశాడు.(ఇదీ చదవండి: 2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?) -
2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్లు.. నెట్ఫ్లిక్స్లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్పైనా క్లారిటీ ఇచ్చేశారు.15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్) -
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్తో రామ్చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్డ్రాప్లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్డ్రాప్లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఇంటెన్స్ లవ్స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
‘2018’ మూవీ ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కాగా మంగళవారం కయాదు లోహర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘1950, 1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్ కనిపించనున్నారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత కయాదు లోహర్కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ మా సినిమాకి ప్లస్ కానుంది.ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్ పోస్టర్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, అసోసియేట్ ప్రోడ్యూసర్స్: మేఘ శ్యామ్, తంజీర్. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీస్ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్హిట్గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్గా నిలిచింది. ప్రత్యేకించి శరత్కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్లక్ష్మి తనదైన గ్లామర్తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్పై కనిపించనుంది. ఈ లవ్స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కంటెంట్ బాగా నచ్చింది: రవితేజ
‘‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇందులోని కంటెంట్ బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలి. అమర్దీప్ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటు న్నాను’’ అని హీరో రవితేజ తెలిపారు. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ని చూసిన రవితేజ... ‘సుమతీ శతకం’ యూనిట్కి అభినందనలు తెలిపారు. -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్పీ వెంకటేశ్ ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు. -
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్స్..!
మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10) -
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ప్యాలెస్లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్క్లాస్ మెలొడీస్ సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
పడుకుని పోజులిచ్చిన మీనాక్షి.. బ్లాక్ డ్రస్లో మాళవిక
కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరిబ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్క్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో అనన్య నాగళ్లముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్
శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్ఫ్లిక్స్లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.మరోవైపు సుబ్బుకి టీచర్గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. ఈ సిరీస్లో సందీప్ కిషన్కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!) -
ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!
టాలీవుడ్లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్ని నమ్ముకోకుండా రైటింగ్పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.అడివి శేష్నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్కి ముందు, తర్వాత కూడా శేష్కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్కే వచ్చింది.సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?) -
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్పై స్టాలిన్ నటి ప్రశంసలు
మెగాస్టార్ మూవీపై నటి ఖుష్బు సుందర్ ప్రశంసలు కురిపించారు. లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమేనంటూ కొనియాడారు. మనశంకర వరప్రసాద్గారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. మరింతకాలం మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్ అంటూ ఖుష్బు ట్వీట్ చేశారు. ఈ మూవీలో నటించిన వెంకటేశ్ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు పోస్ట్ చేసింది.కాగా.. కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ త్రిష హీరోయిన్గా కనిపించింది. కాగా.. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. What an entertainment. #ManaShankaraVaraPrasadGaru . I loved it. No logic, only magic. My heartiest congratulations to the director, @AnilRavipudi who has proved to be a super duper entertainment king. Proud to see @KChiruTweets gaaru giving his best to the people who love… pic.twitter.com/7sZfZySpDP— KhushbuSundar (@khushsundar) February 2, 2026 -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా?
ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్.అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Attitude Star Chandrahas Singing Performance 🤯pic.twitter.com/C24OQSnpEG— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026 -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా అవతరించాడు? భారత్పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
ఓటీటీలో 'మన శంకరవరప్రసాద్ గారు'.. వీడియో విడుదల
చిరంజీవి- అనిల్ రావిపూడి హిట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ఒక వీడియోతో ప్రముఖ ఓటీటీ సంస్థ పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటన వచ్చేసింది.మన శంకరవరప్రసాద్ గారు చిత్రం త్వరలో జీ5లో విడుదల కానున్నట్లు ఒక వీడియోను పంచుకున్నారు. అయితే ఓటీటీ వర్షన్లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, మరాఠిలో విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో చిరుకు ఫ్యాన్స్ ఉండటం వల్లే పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరి 11న ఓటీటీలోకి మన శంకరవరప్రసాద్ గారు రావచ్చని టాక్ ఉంది.‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
బ్లాక్బస్టర్ సిరీస్.. ఇప్పుడు మళ్లీ యానిమేషన్లోనూ
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. 2016 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. ఐదు సీజన్లుగా వచ్చింది. నాలుగు సీజన్లకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండు నెలల క్రితం రిలీజైన చివరిదైన ఐదో సీజన్కి మిశ్రమ స్పందన వచ్చింది. ఏదైతేనేం సిరీస్ని ముగించేశారు. అయితే ఇదే సిరీస్లోని పాత్రలని తీసుకుని యానిమేషన్ సిరీస్ రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ ఎప్పుడో కూడా ప్రకటించేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)1984-89 మధ్య కాలంలో హాకిన్స్ అనే ఊరిలో జరిగిన వింత సంఘటనలు, వింత ప్రాణులని ఐదారుగురు పిల్లలు, మరికొందరు కుర్రాళ్లు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వాటిని ఎలా అంతం చేశారు? అనే స్టోరీతో 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ తీశారు. ఇప్పుడు యానిమేషన్ సిరీస్ విషయానికొచ్చేసరికి దాదాపు అదే కాన్సెప్ట్ తీసుకున్నారు. పాత్రలు పాతవే ఉన్నప్పటికీ.. వాటికి డబ్బింగ్ చెప్పిన యాక్టర్స్ మారిపోయారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. చూస్తుంటే.. మేకర్స్ ఈ సిరీస్ని ఇప్పట్లో వదిలేలా లేరుగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది) -
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'శృతి హాసన్ వల్లనే మా పాప ప్రాణాలతో ఉంది'
సినీ నటి శృతి హాసన్ పలు సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధానంగా పిల్లల ఆరోగ్యం, HIV/AIDS బాధితుల సంక్షేమంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకుంటుంది. "Charity Closet" ద్వారా నిధులు సేకరించి, అవసరమైన వారికి అందజేస్తుంది. శృతి హాసన్ ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయిస్తుంది. ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తుంది. తాజాగా అరుదైన జబ్బుతో బాధపడుతున్న మూడేళ్ల ఆజ్వి అనే చిన్నారి ప్రాణాలను రక్షించింది. ఇదే విషయాన్ని చెబుతు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక పోస్ట్ చేశారు.'ఆజ్వి' అరుదైన 'ఎంఎస్ఎమ్డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో 2023లో జన్మించింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోతే పాప బతకడం కష్టమని వ్యైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె బరువెక్కింది. చారటీ సాయం కోసం వెతుకుతున్న సమయంలో వారి జీవితంలో వెలుగులు నింపేందుకు శృతి హాసన్ వచ్చింది. తనకు తెలిసిన ప్రముఖ వైద్యులు ధరణి, దివ్యలను ఆ కుటుంబానికి పరిచయం చేసింది. ఆపై దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసింది. గతేడాదిలో జరిగిన ఆపరేషన్ తర్వాత ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. తాజాగా శృతి హాసన్తో అజ్వి గడిపిన క్షణాలను తల్లిదండ్రులు పంచుకున్నారు. శృతి హాసన్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప వ్యక్తి అంటూ వారు ప్రశంసించారు. ఈరోజు తమ పాప అజ్వి బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే అని కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by 𝑺𝒓𝒊𝒓𝒂𝒎 (@sriramshruti) -
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజు'గా పిలుచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సూపర్స్టార్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. కానీ, జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే, మైకేల్ జాక్సన్ బయోపిక్ను ప్రపంచానికి చూపించాలని ఆయన మేనల్లుడు జాఫర్ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు.మైకేల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మైకేల్ జాక్సన్గా ఆయన మేనల్లుడు జాఫర్ కనిపించనున్నారు. ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ రానుంది. మైకేల్ బాల్య నుంచి సూపర్స్టార్గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ మూవీలో చూపించనున్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం వరల్డ్వైడ్ రూ. 10 వేల కోట్లు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 400 కోట్లకు పైగానే ఫ్యాన్స్ ఉన్నారని అంచనా ఉంది. -
'ధురంధర్-2' టీజర్ ప్రకటన వచ్చేసింది
బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్ వర్షన్ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్-2పై దర్శకుడు ఆదిత్యధర్ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్ను విడుదల చేయనున్నారు. ధురంధర్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధురంధర్ 2 మూవీ మ్యూజిక్ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్ను తెచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్ భారీ ఆఫర్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు. మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
'నాని'తో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే
టాలీవుడ్లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇదే మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక మార్కెట్ ఉంటుంది. దానిని బట్టే వారికి రెమ్యునరేషన్ ఉంటుందని తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాల మార్కెట్ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఓటీటీ, టెలివిజన్ మార్కెట్లో నానికి మంచి డిమాండ్ ఉండటంతో ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రూ. 75 కోట్ల వరకు ఢీల్ సెట్ అయినట్లు టాక్ ఉంది. ఎటుచూసినా సరే నాని సినిమాలకు ఫైనల్ మార్కెట్ విలువ రూ. 200 కోట్ల మేరకు ఉంటుంది. అది కూడా సినిమా భారీ హిట్ అందుకుంటేనే.. ఒకవేళ సినిమాపై ఏమాత్రం టాక్ మారిందా ఈ నంబర్స్ అన్నీ తారుమారు అయిపోతాయి.టైర్- 2 హీరోల్లో చాలా ఎక్కువది ప్యారడైజ్ సినిమాకు మొదట బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. టైర్- 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీ సూచిస్తుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమా దసరా భారీ హిట్ కావడంతో ది ప్యారడైజ్పై నిర్మాత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారట. ఆపై సినిమా కూడా చాలా బలంగా ఉండటంతో ఖర్చ ఎంతైనా సరే అనేంత రేంజ్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ గురించి వచ్చిన పుకార్లు నిజమైతే.., ఈ సినిమా సురక్షితమైన స్థానంలో ఉండాలంటే అనూహ్యమైన భారీ విజయాన్ని అందుకోవాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవని ముందే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, నాని తన కెరీర్లోనే అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ జాప్యాల కారణంగా వాయిదా పడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో జడల్ అనే పవర్ఫుల్ రా రస్టిక్ పాత్రలో నాని కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించిచెరుకూరి సుధాకర్ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ను స్థాపించి 2016లో రన్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాట పర్వం, వంటి సినిమాలను నిర్మించారు. 2023లో విడుదలైన దసరా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఆయన రీసెంట్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అయితే, నిర్మాతగా రంగబలి, రామారావు ఆన్డ్యూటీ వంటి డిజాస్టర్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీ తరవఆ మెగాస్టార్ 157వ సినిమాను ఆయన నిర్మించనున్నారు. అయితే, ది ప్యారడైజ్ మూవీ విషయంలో నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ రిస్క్ చేస్తున్నారని -
ఆరేళ్ల తర్వాత బిగ్ ప్రాజెక్ట్ లోడింగ్.. కర్ణుడిగా సూర్య
నటుడు సూర్య ఒక్కసారి కథను నమ్మితే, ఆ చిత్రం కోసం ప్రాణం పెడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలా ఆయన ప్రతి చిత్రానికి తన వంతు కృషి చేస్తారు. ఇక జయాపజయాలు అన్నది ఎవరి చేతిలోనూ ఉండవు. కంగువా చిత్రం విషయంలో కూడా జరిగింది ఇదే. భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం అది. ఆ చిత్రంలో నటుడు సూర్య నటనను ఎవరూ విమర్శించలేదు సరికదా విమర్శకులు సైతం ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల కంగువా చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే ఆ తరువాత సూర్య నటించిన రెట్రో చిత్రం కమర్శియల్గా మంచి విజయాన్నే అందుకుంది. కాగా సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు చిత్రాన్ని పూర్తి చేశారు. ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మాలీవుడ్ దర్శకుడు జీతు మాదవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన మరోసారి తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడిగా సూర్యహిందీ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మహాభారతం ఇతిహాసంలోని కర్ణుడి ఇతి వృత్తంతో పాన్ ఇండియా స్థాయిలో కర్ణ పేరుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు,అందులో కర్ణుడి పాత్రలో నటుడు సూర్య, నటి జాన్వీకపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు 2024లో ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.దీంతో కర్ణ చిత్రం అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది ఇటీవల దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ ఒక భేటీలో పేర్కొంటూ కర్ణ చిత్రం డ్రాప్ కాలేదనీ, దీని కోసం ఆరేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి స్క్రీన్ప్లేను పూర్తిగా రాసినట్లు ఇక షూటింగ్ను ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడింది కానీ, డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు.ఈ చిత్రం కోసం ఏఆర్.రెహామాన్ ఆరు పాటలను రెడీ చేశారని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ తెలిపారు. మొత్తం మీద సూర్యను ఆయన అభిమానులు కర్ణుడిగా చూడబోతున్నారన్నమాట. -
ముంబైకి ముత్తువేల్ పాండ్యన్
ముంబై వెళ్లానున్నారట ముత్తువేల్ పాండ్యన్ . హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ మూవీ సూపర్హిట్గా నిలిచింది. వీరి కాంబినేషన్ లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్జే సూర్య, విజయ్సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ అతి త్వరలోనే ముంబైలో ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం.రజనీకాంత్–షారుక్ఖాన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు పాత్రలో షారుక్ఖాన్ నటిస్తున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్ 2’ ఈ జూన్లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ 173వ సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఆయన 174వ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్, 175వ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రా లపై అధికారిక ప్రకటన రావాలి. -
జోడీ రిపీట్
ధనుష్, సాయిపల్లవి జోడీ రిపీట్ అవుతోంది. ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. వండర్బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో ఓ హీరోయిన్ గా శ్రీలీల నటించనున్న విషయం తెలిసిందే.మరో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనున్నట్లుగా సోమవారం ప్రకటించారు మేకర్స్. గతంలో ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ...’ సాంగ్ కూడా అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.అలాగే ‘అమరన్ ’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు రాజ్కుమార్ పెరియ సామితో సాయిపల్లవి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట ధనుష్ అండ్ టీమ్. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
ది ఇండియా హౌస్తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్దేవ్ ‘ది ఇండియా హౌస్’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370’ చిత్రాలతో పాపులర్ అయిన శాశ్వత్ సచ్దేవ్ మా సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్ కుమార్. -
"ది ప్యారడైజ్" రిలీజ్పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
వ్యోమగామిగా వితికా శేరు.. ఆసక్తికరంగా గ్లింప్స్
వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డియర్ ఆస్ట్రోనాట్. ఈ మూవీకి కార్తిక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వితికా శేరు భర్త వరుణ్ సందేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ వితికా శేరు బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో ఆస్ట్రోనాట్గా వితికా షేరు కనిపించనున్నారు. అంజలి అనే వ్యోమగామి పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన గ్లింప్ల్ విజువల్స్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత్ర పెద్ది, గీతా భాస్కర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తున్నారు. -
దేవగుడి సక్సెస్.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు. -
తన అనుభవం అంతవరకే.. అది మారదు: తమన్పై కోటి కామెంట్స్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) పేరు పరిచయం అక్కర్లేదు. తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఏఆర్ రెహమాన్తో పాటు ఎస్ఎస్ తమన్ గురించి వ్యాఖ్యానించారు.టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తిస్తుందని కోటి అన్నారు. తమన్ కూడా మంచి మ్యూజిక్ అందించారని.. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడని.. వరల్డ్ మ్యూజిక్కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. బీజీఎం పరంగా తమన్ స్టైల్ చాలా బాగుంటుందని అన్నారు. తమన్ రిపీటెడ్గా చేయడంపై చేస్తారన్న ప్రశ్నకు కోటి స్పందించారు.ఇక్కడ అతనికి ఒక ప్రొగ్రెషన్ అనేది రిపీట్ అవుతుందని కోటి అన్నారు. తన అనుభవం అంతవరకే.. అది మారదని తెలిపారు. ఎవరికైనా ఒక టైమ్ ఉంటుందని.. అంతవరకే చేయగలరని వెల్లడించారు. కొత్త నీరు వస్తూనే ఉంటోంది.. దాన్ని మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరి స్టాండర్స్ వాళ్లవని సంగీత దర్శకుడు కోటి అన్నారు. మార్కెట్ ప్రకారమే మనం ముందుకు వెళ్లాలని సూచించారు. మ్యూజిక్లో ప్రజంటేషన్ అనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఇప్పుడున్న జనరేషన్లో నాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని అన్నారు. -
ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్బీర్కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్కు మళ్లీ బ్లాక్బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
అక్కా.. నిన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా: చెల్లి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ 3వ సీజన్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా 2025 నవంబర్లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది. అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది. నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.క్రితిక శేరు తన ఇన్స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
మృణాల్ కాస్త డిఫరెంట్గా.. జాన్వీ వెనక్కి తిరిగి!
వెనక్కి తిరిగి పోజులిచ్చేస్తున్న జాన్వీ కపూర్ఆరెంజ్ డ్రస్లో మృణాల్ డిఫరెంట్ లుక్క్యూట్ అండ్ స్వీట్గా కాజల్ అగర్వాల్వీకెండ్ ఎంజాయ్ వీడియోతో అనసూయహాట్ చాక్లెట్లా ముద్దుగుమ్మ సన్నీ లియోన్దుబాయి ట్రిప్లో హీరోయిన్ దివ్య భారతి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani)


