Movies
-
వెంకీ- అనిల్ కాంబో.. ఈ సారి డిఫరెంట్ టైటిల్..!
ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్తోనూ జతకట్టి సక్సెస్ అయ్యారు. అదే కాన్ఫిడెన్స్తో వెంకీమామతో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు టైటిల్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి తగ్గట్టుగానే తన మూవీ టైటిల్ ఉండాలని అనిల్ రావిపూడి ఫిక్సయ్యారని టాక్. ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. ఈ టైటిల్ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ ఏంటో అర్థమవుతోంది. సంక్రాంతి తగ్గట్టుగానే ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
ది రాజాసాబ్, పెద్ది రికార్డ్స్ బ్రేక్.. బన్నీ క్రేజ్ చూశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో మాత్రమే కాదు.. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప సినిమాల తర్వాత బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా బన్నీకి టాలీవుడ్ తర్వాత అత్యధిక ఫ్యాన్స్ ఉన్నది మలయాళంలోనే. కేరళలో అల్లు అర్జున్ అంటే తమ సొంతవాడిలా భావిస్తారు. ఆయనను ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. అంతలా మలయాళీల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన హ్యాపీ మూవీ రీ రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో ఈ సినిమా విడుదల చేయగా కేరళలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.1.10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇది చూస్తుంటే కేరళలో బన్నీ క్రేజ్ ఏంటో అర్థమైపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల రికార్డులను హ్యాపీ మూవీ దాటేసింది.గతేడాది రిలీజైన ది రాజాసాబ్ మూవీ కేరళ వసూళ్లను హ్యాపీ అధిగమించింది. మలయాళంలో ప్రభాస్ ది రాజాసాబ్ కేవలం రూ.23 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. రీ రిలీజ్లోనూ అల్లు అర్జున్ మూవీ రికార్డ్ సృష్టించడం విశేషం. అదే క్రమంలో రామ్ చరణ్ పెద్ది కేరళ వసూళ్లను సైతం హ్యాపీ మూవీ దాటేసింది. పెద్ది మూవీ కేరళ వ్యాప్తంగా కేవలం రూ.72 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ది రాజాసాబ్, పెద్ది మూవీస్ సాధించలేని రికార్డులను బన్నీ రీ రిలీజ్ మూవీతోనే కొట్టేశాడు. ఇది చూసిన అభిమానులు అల్లు అర్జున్ మరోసారి తన స్టామినాను నిరూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..!
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. -
కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా?
తరాలు మారినా.. టీవీ సీరియళ్ల సాగదీతలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైపెచ్చు.. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రేక్షకుల అభిరుచులను మార్చేసినా, కొన్ని సీరియళ్లలో మాత్రం అదే అతి, అదే అసహజ మలుపులు, అదే విషపూరిత సంబంధాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కన్నీళ్లు, కుట్రలు, కుటుంబ కలహాలతో నిండిపోయిన కథలు.. ఇప్పుడు హింస, అవమానాలు, మానసిక వేధింపులను కూడా "ప్రేమ"గా చూపించే స్థాయికి చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి విమర్శలకు తాజాగా మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్ కేంద్రబిందువైంది. కుటుంబ కథ పేరుతో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో భర్త చేతిలో భార్యకు జరిగే శారీరక, మానసిక హింసను రొమాంటిక్గా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ప్రేమ కాదు.. గృహహింస" అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.వివాదానికి కారణమైన సీన్కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్లో.. ఇటీవల ప్రసారమైన ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కథానాయకుడు ధీరజ్.. కథానాయిక రాజ్జీని తోసేయడం, చెంపదెబ్బ కొట్టడం, ఆమెను మంచంపై బలవంతంగా అదిమిపట్టడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్జీ చేయి వేడిగా ఉన్న ఇస్త్రీకి తగిలి కాలిపోతుంది. నొప్పితో ఆమె కేకలు వేస్తుండగా, ధీరజ్ ఆమె నోరు మూసేస్తూ తనకు ఆమెపై ప్రేమ కాదని, ద్వేషమే ఉందని చెబుతాడు.సాధారణంగా చూస్తే ఇది ఇద్దరి మధ్య ఘర్షణను చూపించే సన్నివేశంలా కనిపించవచ్చు. కానీ దాన్ని చిత్రీకరించిన తీరు, పాత్రల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.నెట్టింట రియాక్షన్లు.. సన్నివేశం ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది.ఇది ప్రేమ కాదు.. హింసఆమెను తోశాడు.. కొట్టాడు.. నీళ్ల బకెట్ పోశాడు.. ఇప్పుడు ఇస్త్రీతో కాల్చేశాడు. ఇదంతా చేసి దాన్ని ప్రేమగా చూపిస్తున్నారా? They’re romanticizing abuse 🙂- pushed her around- slapped her- dumped a bucket of water on her- now burned her with an iron and he’s covering her screams in the name of romance??? End this crap !!! #MahadevandSons pic.twitter.com/qzNy2z4sQT— anj (@cokerantx) June 16, 2026గృహహింసను రొమాన్స్గా చూపించడం అత్యంత బాధ్యతారాహిత్యం మరికొందరు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. భర్త ఎంత హింసించినా భార్య భరించాలి.. చివరకు అతడిని క్షమించాలి అనే సందేశాన్ని ఇలాంటి సీరియళ్లు ఇస్తున్నాయి అంటూ విమర్శించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా ఈ కార్యక్రమాలను చూస్తారని, ఇలాంటి సన్నివేశాలు సంబంధాలపై తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అసలు సమస్య ఇదే!ఈ వివాదం కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లలో "టాక్సిక్ రొమాన్స్" అనే ధోరణిపై విమర్శలు పెరుగుతున్నాయి. కోపం, అధికారం చెలాయించడం, మానసిక వేధింపులు, అవమానించడం, కొన్నిసార్లు శారీరక హింసను కూడా ప్రేమలో భాగంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.సామాజిక వర్గాల అభిప్రాయం ప్రకారం, హింసను హింసగానే చూపించాలి. కానీ దాన్ని ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం పేరుతో సమర్థించేలా చూపించడం ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి కథనాలు విషపూరిత సంబంధాలను కూడా సాధారణం అనే భావనను కలిగించే అవకాశం ఉంటుంది.మరోవైపు వాదనఅయితే ఈ విమర్శలతో అందరూ ఏకీభవించడం లేదు. కొందరు ప్రేక్షకులు మాత్రం సన్నివేశాన్ని సందర్భం నుంచి వేరు చేసి చూస్తున్నారని వాదిస్తున్నారు. ధీరజ్ ఉద్దేశపూర్వకంగా రాజ్జీని కాల్చలేదని, కథలోని సంక్లిష్టమైన భావోద్వేగ సంఘర్షణను చూపించడానికే ఆ సన్నివేశాన్ని ఉపయోగించారని చెబుతున్నారు.సీరియళ్లకు హద్దులుండాలా?టీఆర్పీల కోసం సంచలన సన్నివేశాలు చూపించడం కొత్త విషయం కాదు. కానీ గృహహింస, మానసిక వేధింపులు, విషపూరిత సంబంధాలను ప్రేమగా లేదా కుటుంబ బంధాల పేరుతో సమర్థించేలా చూపిస్తే అది కేవలం వినోదం పరిధిలోనే మిగిలిపోదని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత సాధారణంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం మహాదేవ్ అండ్ సన్స్పై జరుగుతున్న వివాదం ఒక సీరియల్ను దాటి పెద్ద చర్చకు దారి తీసింది. ప్రేక్షకులు నిజంగానే ఈ "టాక్సిక్ రొమాన్స్" కథలతో విసిగిపోయారా? లేక ఇది మరో సోషల్ మీడియా తుఫానుగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ యుగంలోనూ టెలివిజన్ సీరియళ్ల కథన శైలి, వాటి సామాజిక బాధ్యతపై మరోసారి ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. -
ఆ టైమ్లో నాలో అహంకారం పెరిగింది: సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక సమయంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. -
దసరా తర్వాత...
‘రంగస్థలం’ (2018) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ విషయమై రెండు మూడుసార్లు రామ్చరణ్, సుకుమార్ సమావేశమై చర్చించుకున్నారు. కాగా, రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్చరణ్ చేతికి గాయమైంది. చరణ్ చేతికి శస్త్ర చికిత్స పూర్తయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను దాదాపు పూర్తి చేస్తారట సుకుమార్. ఇదంతా జరగడానికి దసరా వరకు సమయం పడుతుందట. అందుకనే దసరా పండగ తర్వాత ఈ సినిమా షూట్ను ఆరంభించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. -
క్రేజీ ప్రాజెక్ట్.. కొడుకును హీరోగా పరిచయం చేయనున్న ధనుష్?
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్. మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ విలక్షణ డైరెక్టర్గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ధనుష్ త్వరలోనే ఓ సరికొత్త సాహసానికి తెరలేపబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ హీరో మరోసారి దర్శకుడిగా మారి తన తనయుడ్ని హీరోను చేయబోతున్నాడని సమాచారం.ధనుష్ తన కుమారుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు యాత్ర రాజాను హీరోగా పరిచయం చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆయనే దర్శకత్వం కూడా చేస్తాడట. ఒక స్టార్ హీరో తన కుమారుడిని హీరోగా లాంచ్ చేయడం కొత్త విషయం కాదు. కానీ ఒకవైపు దర్శకుడిగా మరోవైపు కొడుకును హీరోగా పరిచయం చేస్తూ, ఈ సినిమాను తానే నిర్మిస్తాడట ధనుష్. దాంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఇప్పటికే యాత్ర నటన, డ్యాన్స్లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతనితో ఓ టెస్ట్ షూట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్, హీరో ధనుష్ల పెద్ద కుమారుడు యాత్ర రాజా. ధనుష్- ఐశ్వర్య భార్యభర్తలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కానీ తల్లిదండ్రులుగా మాత్రం పిల్లల భాద్యతను కలిసే పంచుకుంటున్నారు. ఇక యాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ధనుష్ చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన కుమారుడిని హీరో చేసే భాద్యతను మరో దర్శకుడి చేతిలో పెట్టకుండా తనే ఈ దర్శకత్వం చేసే భాద్యతను తీసుకుంటున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. -
మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు కనిపిస్తున్నాయి. ఓ ముఖ్యమైన విషయం ఇంకా పెండింగ్లోనే ఉండిపోయిందని సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిన్నాపెద్దా.. ఏ సినిమాలకు అయినా ముందుగా ఓటీటీ డీల్ క్లోజ్ అయితేనే నిర్మాతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. స్టార్ హీరోలు చేసే మూవీస్కి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. కరోనా టైంలో ఇష్టమొచ్చినట్లు సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు మాత్రం ఆచితూచి కొంటున్నాయి.ఓటీటీ డీల్ జరగన కారణంగానే చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్పై ఇప్పటకీ సస్పెన్స్ తెగట్లేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ 'వారణాసి' కూడా వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైనే బడ్జెట్ పెడుతున్నారని, అందుకు తగ్గట్లే ఓటీటీ డీల్ నుంచి రూ.400-500 కోట్ల వరకు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మూవీ కొనేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించట్లేదట.(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)దీంతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరీ ఇంత మొత్తం కాకపోయినా 'వారణాసి'ని కొనే ఓటీటీ ఏదనేది చూడాలి. మార్కెట్లో ఉన్న వాటి బట్టి చూస్తే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ సంస్థలు మాత్రమే పోటీలో ఉంటాయి. మరి వీళ్లలో ఎవరు డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంటారనేది చూడాలి?గ్లోబల్ అడ్వెంచర్ కాన్సెప్ట్తో తీస్తున్న 'వారణాసి'లో త్రేతా యుగాన్ని కూడా చూపించబోతున్నారు. ఇందులో భాగంగానే మహేశ్ కాసేపు రాముడిగా కనిపిస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళి గతేడాది బయటపెట్టారు. ఇకపోతే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.(ఇదీ చదవండి: పెళ్లయిపోయింది.. రష్మిక, సమంతకు అదే పెండింగ్) -
పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే
సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్) -
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. శ్రీదేవి క్యూట్నెస్
హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్లంగా ఓణీలో ముద్దుగుమ్మలా శ్రీదేవికాక్టెయిల్ 2 కోసం కృతిసనన్ ఇలాపిల్లలు పుట్టాక కూడా ప్రణీత గ్లామర్పసుపు చీరలో సమంత సోయగాలుఅందాల బొమ్మలా యాంకర్ శ్రీముఖి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siri (@srideviactor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) -
'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
థియేటర్లలో 'పెద్ది' హవా తగ్గిపోయింది. స్కూల్స్ తెరుచుకోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక దాదాపుగా తగ్గిపోయింది. మరో వారంరోజుల్లో రన్ కూడా కొలిక్కి వచ్చేయొచ్చు. ప్రమోషన్స్ కూడా ఆగిపోయినట్లే. ఈ క్రమంలోనే మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్స్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట వీడియోని సోమవారం వదలగా.. ఇప్పుడు మరో రెండు హిట్ గీతాల్ని కూడా రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!)'పెద్ది'లో చికిరి చికిరి పాట తర్వాత రయ్ రయ్ రారా, ఐటమ్ సాంగ్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి వీడియోలని కూడా యూట్యూబ్లో రిలీజ్ చేసేశారు. ఈ క్రమంలోనే మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 'పెద్ది' చిత్రానికి ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు హైప్ బాగానే ఏర్పడింది గానీ రిలీజ్ తర్వాత టాక్ ఓ మాదిరిగా రావడంతో తెలుగులోనూ మాత్రం వసూళ్లు వచ్చాయి. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు.(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం) -
విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
సీనియర్ నటుడు, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. గతంలో తెలుగులో 'గోపాల గోపాల' చిత్రంలోనూ నటించారు. ఇప్పుడీ ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన దత్తత కూతురు విదేశీయుడితో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)ఒకప్పుడు హిందీలో వరస సినిమాలతో హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన తొలుత హెలెనా ల్యూక్ అనే నటిని పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగు నెలలకే విడిపోయారు. తర్వాత నటి యోగితా బాలిని వివాహమాడారు. వీళ్లకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. అలానే దిశానీ అనే పాపని కూడా దత్తత తీసుకున్నారు. కోల్కతా అనాథగా దొరికిన ఈ పాపని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడీ ఈమె అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే కాలిఫోర్నియాకు చెందిన మైల్స్ మంట్జరిస్ అనే కెమెరామ్యాన్తో కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడిన దిశానీ.. ఈనెల 12వ తేదీన అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో పంచుకుంది. చూస్తుంటే ఈ ఏడాదిలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఏదేమైనా మిథున్ చక్రవర్తి కూతురు దేశాంతర వివాహం చేసుకోనుండటం చర్చనీయాంశమైంది. నటుడు అర్జున్ చిన్న కూతురు కూడా ఇటలీకి చెందిన ఓ కుర్రాడితో గతంలో నిశ్చితార్థం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!) View this post on Instagram A post shared by Dishani Chakraborty (@dishanichakraborty) -
బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!
తెలుగు యాంకర్ విష్ణుప్రియ రీసెంట్గానే ఇన్స్టా సబ్స్క్రిప్షన్ వివాదంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. రూ.399 తీసుకుని యువతని పెడదోవ పట్టించేలా అర్థనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ నడిచింది. మరోవైపు పలువురు ఈమెపై కేసులు కూడా పెట్టారు. ఇదంతా కొన్నాళ్ల క్రితం జరిగింది. దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఇదే విష్ణుప్రియ మరో వివాదంలోనూ ఇరుక్కుంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ)వివాదం జరగకముందు విష్ణుప్రియకు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఫాలోవర్స్ వందల్లో ఉండగా.. దీని తర్వాత అమాంతం పెరిగిపోయారు. తాజాగా రూ.399 కట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్తో లైవ్లో పాల్గొన్న ఈమె.. చాలానే మాట్లాడింది. ఓ సబ్స్క్రైబర్ ప్రశ్నకు బదులిస్తూ.. తన బాడీ కౌంట్ ఐదు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణమైంది.విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. మరి మహిళా సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి? ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విష్ణుప్రియ మాటలపై ట్రోల్స్ గట్టిగానే నడుస్తున్నాయి. విష్ణుప్రియ కెరీర్ విషయానికొస్తే షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అలా గుర్తింపు తెచ్చుకుని యాంకర్ అయింది. చాలానే షోలు చేసింది. అలా బిగ్బాస్ తెలుగు 8వ సీజన్లోనూ పాల్గొంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు షోలు తప్పితే మరేం చేయట్లేదు.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్) -
12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్
మన జీవితంలో కుటుంబం తర్వాత స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. చాలామంది ఫ్రెండ్స్ని కూడా తమ ఫ్యామిలీలో ఒకరిగానే చూస్తుంటారు. ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా తన స్కూల్ ఫ్రెండ్ అరవింద్ని అలానే గుర్తుపెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన అరవింద్.. అనిరుధ్లోని మ్యూజిక్ టాలెంట్ని గుర్తించాడు. స్టార్ డమ్ రాకముందే అనిరుధ్ దగ్గర సౌండ్ ఇంజినీర్గానూ పనిచేశాడు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2014లో గుండెపోటుతో అరవింద్ చనిపోయాడు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఫ్రెండ్ చనిపోయిన బాధని మనసులో దాచుకున్న అనిరుధ్.. తన తొలి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ సాంగ్ని స్నేహితుడికి అంకితమిచ్చేశాడు. 'అరవింద్' పేరుతోనే రీసెంట్గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశాడు. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. వేగంగా మారుతున్న ఈ డిజిటల్ మ్యూజిక్ రంగంలో నిలదొక్కుకోవడానికి పోరాడే ఒక స్వతంత్ర కళాకారుడి సవాళ్లని ఈ అరవింద్ మ్యూజికల్ ఆల్బమ్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇదని అనిరుధ్ చెప్పాడు.2012లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రం '3' కోసం రూపొందించిన వై దిస్ కొలవెరి డి పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్.. ఇటీవల జైలర్, విక్రమ్, కూలీ, లియో, దేవర, జవాన్ తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించి రాక్స్టార్గా పేరు సంపాదించాడు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ) -
సీఎంగా విజయ్.. 12 ఏళ్ల తర్వాత త్రిషకు కలిసిరానుందా?
ఏదైనా కొత్త సినిమాలు ఏడాదికో, రెండేళ్లలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే అది కాస్తా మూడు నుంచి నాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ది భారీ బడ్జెట్ మూవీస్ సైతం అనుకున్న టైమ్లోనే విడుదలైన సందర్భాలే ఎక్కువ. కానీ షూటింగ్ పూర్తై ఐదు నుంచి పదేళ్లయినా కూడా రిలీజ్ కానీ చిత్రాలు రిలీజ్కు నోచుకోలేదంటే చాలా కారణాలే ఉండొచ్చు. ఈ జాబితాలో విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం దాదాపు 8 ఏళ్లవుతున్న విడుదల కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవలే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్కు మరో నెల రోజుల సమయం కోరాడు.మరి ఒక సినిమా విడుదలకు ఇదే చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ అంతకు మించి రిలీజ్ కాకుండా ఆగిపోయిన మూవీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నటించిన చిత్రం కావడం మరో విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇటీవల రాజకీయ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే గతంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శతురంగ వట్టై-2 ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2014లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్థిక సమస్యల వివాదంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరవింద్స్వామి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ నిర్మల్కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్ వినోద్ కథ అందించారు.అయితే తాజాగా ఈ మూవీ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట ఉన్న క్రేజ్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సీఎం అయ్యాక ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆమెకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో చిత్రీకరణ పూర్తయిన తర్వాత పుష్కర కాలానికి త్రిష మూవీ రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన నెల రోజుల్లోపే ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. మరికొన్ని సినిమాలు ఏకంగా వారాల్లోపే స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో లేటేస్ట్ తెలుగు సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.ఈ విషయాన్ని ఆహా సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై దినేష్ కుర్ర నిర్మించగా.. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీ కథేంటంటే..ట్రైన్ జర్నీలో పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే క్రైమ్ కథాంశంగా రూపొందించారు. సస్పెన్స్, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్తో ఈ మూవీ కథేంటో ముందే పరిచయం చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/JvRngv6wYhDon't miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/ODQe1g7LcD— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 15, 2026 -
మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..!
కోలీవుడ్ స్టార్స్ సినిమాలతో పాటు పాలిటిక్స్ వైపు దూసుకెళ్తున్నారు. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం అయ్యారు. అదే స్ఫూర్తితో రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. విజయ్ పార్టీలో చేరతారా? లేదా అన్నదానిపై రాబోయే రోజుల్లో తెలియనుంది.ఇదిలా ఉండగానే మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగిన జీవీ ప్రకాశ్ కుమార్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నారు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనతో భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని హింట్ ఇచ్చారు జీవీ ప్రకాశ్. తాజా ఇంటర్వ్వూలో ఈ కామెంట్స్ చేశారు.ఇటీవలే రాఘవ లారన్స్, రజినీకాంత్ అల్లుడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. లారెన్స్ ఇప్పటికే ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ సంకేతాలిచ్చారు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ.. తమిళనాట రాజకీయాలను శాసించనుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..!
మెగా అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. వరుస వాయిదాలతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ తేదీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారంలో ఉన్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు.ఆ తర్వాత ఆగస్ట్లో విశ్వంభర రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి దాకా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఏడాది విశ్వంభర వచ్చే అవకాశముందా అనే డైలామాలో అభిమానులు ఉన్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో రాకపోతే.. విశ్వంభరకు ఉన్న ఛాన్స్ దసరా. ఆ తర్వాత డిసెంబర్, సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సింది. ఆ రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందువల్లే విశ్వంభరకు దసరా మాత్రమే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక దసరా మిస్సయిందంటే డిసెంబర్లో ఏదో ఒక వారంలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా మేకర్స్ పక్కా ప్లాన్తో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్డేట్స్ ఇస్తూ మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాల్సిన అవసరముంది. కాగా.. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
ప్రియుడితో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్.. ఫోటోలు డిలీట్
ప్రస్తుత రోజుల్లో డేటింగ్, బ్రేకప్స్ చాలా సర్వసాధారణమైపోయాయి. ఇది సినీ రంగంలో కాస్తా ఎక్కువే. తాజాగా మరో నటి బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సునయన.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే ఆమె తన ప్రియుడితో విడిపోయినట్లు సమాచారం. కాగా.. యునైటెడ్ అరబ్ ఎయిరైట్స్కు చెందిన కఖలిత్ అల్ అమెరికా అనే వ్యక్తి ప్రేమలో పడిన సునయన.. వీరి ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. తాజాగా వీరిద్దరి రిలేషన్కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అర్థమవుతోంది. ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోలను ఇన్స్టా నుంచి డిలీట్ చేసింది. దీంతో బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై సునయన గానీ.. ఆమె ప్రియుడు గాని స్పందించకపోవడం గమనార్హం.కాగా.. నాగ్పూర్కు చెందిన సునయన ఎల్లా మోడల్గా తన కెరీర్ ప్రారంభించింది. 2005లో తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అదేవిధంగా కాదలిల్ విళిందేన్ అనే చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది. ధనుశ్, నాగార్జున నటించిన కుబేర మూవీలోనూ మెరిసింది. తమిళంలో మాసిలామణి ,వంశం, నీర్ పారైవ, సమర్ వంటి పలు చిత్రాల్లో నటించారు. -
'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్ ఫిదా
దాదాపు 94 ఏళ్ల వయసులో డైరెక్షన్ అంటే ఎవరికైనా అసాధ్యమే. అదేం కాదంటూ సింగీతం శ్రీనివాసరావు నిరూపించాడు. వయసులో సెంచరీ కొట్టినా కూడా దర్శకత్వం చేయొచ్చనే సంకేతాలిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో అన్నది మనకు అర్థమైపోతోంది. తాజాగా సింగ్ గీతం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త ప్రయోగంతో తన దర్శకత్వ టాలెంట్ను ఈ వయసులోనూ చూపించారు.దీంతో ఈ మూవీపై టాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కమల్ హాసన్ ఈ సినిమాను అభినందించారు. తాజాగా ఈ లిస్ట్ మన యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. సింగ్ గీతం ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్.. సింగీతం శ్రీనివాసరావును కొనియాడారు. ఈ మూవీ తన హృదయానికి హత్తుకుందన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ.. "నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి." అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇందులో శాలిని కొండేపూడి, అహల్య, అయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బంగారు గనులు ఉన్న కుబేరపురం అనే గ్రామంలో జరుగుతుంది. సంపద కోసం గనులను అమ్మి, చెట్లను నరికివేయాలన్న గ్రామస్తుల ప్రణాళికను వ్యతిరేకించే ఒక యువతి కథే సింగ్ గీతం. ఈ పోరాటంలో ఆమెకు ఒక యువకుడు మద్దతుగా నిలుస్తాడు. కానీ గ్రామ దేవత శాపం కారణంగా గ్రామస్తులు సాధారణ సంభాషణలకు బదులుగా.. కేవలం పాటల ద్వారా మాత్రమే మాట్లాడుకోవడంతో వారి పోరాటం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ కథ. #SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…— Jr NTR (@tarak9999) June 15, 2026 -
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె రోల్ అచియ్యమ్మ పాత్రపై విమర్శలొచ్చాయి. జాన్వీ కపూర్ సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్ను మూవీ నుంచి తొలగించారు.అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించిన పెద్ది మేకర్స్ మరి కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. కొత్త వర్షన్లో జాన్వీ కపూర్ పాత్రపై రెండు సన్నివేశాలు, సీనియర్ నటుడు జగపతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్ యాడ్ చేసి పెద్దిని థియేటర్లలో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశాం. ఈ బుధవారం నుంచి కొత్త సీన్స్ జోడిస్తాం. మేము మొత్తం మూడు సన్నివేశాలను చేర్చాం. హీరోయిన్కు సంబంధించిన సన్నివేశాలు.. అలాగే జగపతి బాబు కోసం ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు అచియ్యమ్మ పాత్రకు మరింత భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా" అని బుచ్చి బాబు సానా అన్నారు. -
'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. . -
కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను: సునీల్
‘‘ఇసాకపట్నం’ సిరీస్ చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. ఈ సిరీస్లో నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను’’ అని సునీల్ పేర్కొన్నారు. ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో, సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల ఇతర పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’.గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రోడక్షన్స్ పై రాహుల్ తమడా, సెదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్గా రూ పొందిన ఈ సిరీస్ జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ–‘‘పవర్, సంఘర్షణతో నిండిన ప్రపంచంలో ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసంతో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే పాత్ర నాది.ఈ పాత్రను పోషించడం ప్రత్యేకమైన అనుభవం’’ అని చెప్పా రు. ‘‘ఇసాకపట్నం’ ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయి’’ అని గ్యారీ బీహెచ్ తెలిపారు. ‘‘ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది’’ అన్నారు సముద్రఖని. నటులు నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్ మాట్లాడారు. -
బై బై చికాగో
హీరో, హీరోయిన్లు షూటింగ్స్తో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓ వైపు షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంటుంటారు. షూటింగ్స్కి ఏ మాత్రం విరామం దొరికినా చాలు సేద తీరేందుకు విదేశాల్లో వాలిపోతుంటారు. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులనో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు.తమ అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా తాజాగా చికాగో వెకేషన్ని పూర్తి చేశారు. వరుణ్ ధావన్ హీరోగా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా డేవిడ్ ధావన్ తెరకెక్కించిన చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. ఈ నెల 5న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్నారు మృణాళ్.ఈ మూవీ రిలీజ్ తర్వాత వెకేషన్ కోసం చికాగో వెళ్లారామె. అక్కడ తనదైన శైలిలో సందడి చేసిన ఈ బ్యూటీ తిరిగి ఇండియాకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ‘‘బ్యాగులు మొత్తం సర్దేశాను.. చికాగో సిటీని వదిలే సమయం వచ్చింది. నిజం చెప్పా లంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది’’ అంటూ ఓ ఎమోషనల్ ఎమోజీతో పాటు తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. -
గ్రీన్ సిగ్నల్?
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.ఇప్పటికే దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్ కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా.తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
డిసెంబరులో...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్స్టోరీ మూవీ ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమా కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.కాగా ‘ఫౌజి’ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో దసరాకు రిలీజ్ కావడం లేదని తెలిసింది. డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో దేశభక్తి అంశాలు ఉండటంతో ఆగస్టు 15కి ‘ఫౌజి’ టీజర్ను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.మరి.. ‘ఫౌజి’ డిసెంబరులోనే థియేటర్స్కు వస్తుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘కల్కి 2’ రిలీజ్ డేట్పై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. -
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్తో, గులాబీ రంగు సూట్లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్తో పాటు వింటేజ్ లుక్ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్ బెబో అని ఎందుకంటారు? తన లుక్ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. -
'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్మనీ
ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రిస్క్'. జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పుడీ చిత్రంలోని 'దేవుడు వరమందిస్తే' అంటూ సాగే మెలోడీ పాటని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఈ పాటకు సంబంధించి హుక్ స్టెప్తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: సిమ్రాన్-విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు) -
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్కి చెందిన చాలామంది విజయ్ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
క్యూట్ పూజా స్మైల్.. సమంత చీరకట్టు
నవ్వుతూ మాయ చేస్తున్న పూజా హెగ్డేపట్టుచీరలో అందంగా హీరోయిన్ సమంతదేవకన్యలా మెరిసిపోతున్న దివ్యభారతిపింక్ డ్రస్లో గ్లామరస్గా శిల్పాశెట్టిపట్టుచీరలో మెప్పించేస్తున్న శివానీచెన్నై షూటింగ్ జ్ఞాపకాలతో మాళవిక View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్
తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు.ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందని అన్నారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట) -
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. తండ్రి, తనయుల ఘనత..!
రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥Running successfully all over in its second week 💥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/bayNZVZzB3— PEDDI (@PeddiMovieOffl) June 15, 2026 -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990ల్లో ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్కి దర్శకుడు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్టవర్ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్ఫర్కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఇప్పట్లో అయ్యేలా లేదే.. ఎనిమిదేళ్లయినా లభించని మోక్షం..!
కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ధృవ నక్షత్రం. 2018లో మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. ఇటీవలే జూన్ 15 లోపు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు కూడా చెప్పింది. కానీ అలా జరగలేదు. ఈ సినిమా విడుదలకు మరింత సమయం కావాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలకు అదనంగా 30 రోజులు కావాలని అభ్యర్థించారు. దీంతో ధృవ నక్షత్రం ఇప్పుడే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లే కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి మరింత టైమ్ కావాలని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ హైకర్ట్ను కోరారు. ఈ మూవీ రిలీజ్కు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జూన్ 15, 2026 లోపు థియేటర్లలోకి తీసుకురావడం తన వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని లావాదేవీలు 'కొండడువోమ్ ఎంటర్టైన్మెంట్' పేరుతో నిర్వహించే ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే జరగాలని.. అలాగే కోర్టు నియమించిన పరిశీలకులు ప్రతి ఆర్థిక లావాదేవీని పర్యవేక్షించాలని గత ఉత్తర్వుల్లో ఆదేశించింది. నిర్ణీత గడువులోగా సినిమాను విడుదల చేయలేకపోతే, అదనపు సమయం కోరే స్వేచ్ఛను కూడా కోర్టు మీనన్కు కల్పించింది.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్తో పాటు రితూ వర్మ, వినాయకన్, ఆర్. పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 2017లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన అడ్డంకులతో 2023లో షూటింగ్ పూర్తయింది. నవంబర్ 2023లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ను నిలిపివేశారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరింత అదనపు సమయం కోరడంతో రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన
తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఛావా నటి బలవన్మరణం
ప్రముఖ బుల్లితెర నటి సంచితా ఉగలే(22) బలవన్మరణానికి పాల్పడింది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన ఆమె ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఆమె చివరిసారిగా ఓ రీల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సంచితా హిందీలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా నటించారు. 'కుంకుమ్ భాగ్య', 'సాజన్ ఘర్', 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ' లో కనిపించారు. టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కుంకుమ్ భాగ్య' సీరియల్లో దియా టాండన్ పాత్రకు ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా 'వాగ్లే కి దునియా' సీరియల్లో రుచితా.. జైట్లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ'లో సోరబ్ బేడీ సరసన సుకూన్ అనే ప్రధాన పాత్రను పోషించింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఆమె తారాబాయి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Sanchita Ugale (@sanchita_ugale) -
పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్
బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్.. అమీషా పటేల్కు బర్త్డే విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక పాత రొమాంటిక్ డ్యాన్స్ వీడియో అది. జూన్ 9న అమీషా పటేల్ బర్త్డే. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆమెకు విషెస్ తెలియజేస్తూ..గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘క్రాంతి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దిల్ మే దర్ద్ సా జగా హై’ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పుని ఇన్స్టాలో షేర్ చేశాడు. గతంలో వీరిద్దరూ ఒక ఈవెంట్ నిమిత్తం బహ్రెయిన్లో కలుసుకున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు. ‘నాకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటైన ఈ సాంగ్కు నీతో కలిసి వీడియో చేయడం మర్చిపోలేని అనుభూతి’ అంటూ ఇమ్రాన్ అబ్బాస్ ఈ వీడియోను షేర్ చేస్తూ అమీషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాకిస్తానీ నటుడితో అమీషా పటేల్ అంత క్లోజ్గా మూవ్ అవ్వడం, రొమాంటిక్ వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గతంలో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని అమీషా, ఇమ్రాన్ అబ్బాస్తో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె గతంలోనే స్పందించారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఇద్దరం ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని, వాటిని చూసి నవ్వుకున్నానని ఆమె కొట్టిపారేశారు. ఏదేమైనప్పటికీ, భారత్-పాక్ సరిహద్దులను దాటిన వీరి స్నేహం, ఈ క్యూట్ రొమాంటిక్ వీడియో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్తో పాటు ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో ట్రెండింగ్గా మారింది. View this post on Instagram A post shared by Mera FM 107.4 (@merafmofficial) -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్ -
అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్ చేశారు: సమంత
సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.ఆంధ్రప్రదేశ్ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్హార్ట్స్ (వెబ్సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు!
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో నటించినందుకు పారితోషికం ఇవ్వకుండా లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లికి చెందిన ఒక యువతి(21) సినీనటిగా రాణిస్తోంది. ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం ప్రసాద్ ఆమెను సంప్రదించాడు. అందుకు రూ.90 వేల పారితోషికం ఇస్తామని చెప్పాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత తన పారితోషికం పాటు క్యాబ్ ఖర్చులు రూ. 30 వేలు ఇవ్వాలని సదరు నటి ప్రసాద్ని కోరింది. డబ్బుల విషయంమై మాట్లాడడానికి ఫిబ్రవరి 18న సాగర్ సొసైటీకీ పిలిపించిన ప్రసాద్, ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతే మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని వేధించాడు. దీంతో బాధితురాలు తప్పించుకుంది. నటి తల్లి కూడా ప్రసాద్ను నిలదీయగా..డబ్బులు ఇచ్చేది లేదని, గతంలోనూ ఇలాగే యువతులను వాడుకొని రూ. 3 కోట్లు సంపాదించానని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం. -
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
తెరపైకి సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర.. హీరో ఇతనే!
నేతాజీగా భారత పౌరుల గుండ్లెలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మింనుంది. ఇందులో టైటిల్ పాత్రను యువ నటుడు ఆర్యన్శ్యామ్ పోషించనున్నారు. ఈ భారీ బ్రహ్మాండ కథా చిత్రానికి ఆనంద్ వి.ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ సుభాష్ చంద్రబోస్ అసాధారణ జీవిత పయనాన్ని ఆవిష్కరించే ఈ చిత్రానికి సుబాష్ అనే పేరును నిర్ణయించినట్లు తెలిపారు.స్వాతంత్య్ర సమరంలో ఆయన భాగస్వామ్యం, పోరాట లక్ష్యం వంటి విషయాలను విరివిగా పరిశోధించి బలమైన కథనంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. భారత సైనిక దళంలో ( ఐఎన్ఏ) కెప్టెన్గా బాధ్యతలను నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ విధుల సేవల గురించి, ఆయన జీవితంలో ముఖ్య అధ్యాయాల గురించి, దేశ చరిత్రలో ఆయన ఏర్పరచిన ఉద్రేగం వంటి అంశాలతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం ఇది అని చెప్పారు. ఈ చిత్రంలో చరిత్ర కారుడైన సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించనుండటం అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు నటుడు ఆర్యన్ శ్యామ్ పేర్కొన్నారు. ఈ పాత్రను పోషించడంతో తన బాధ్యత పెరిగిందన్నారు. కాగా బ్రిటీష్ పాలనలో భారతీయుల ఆర్ధిక పరిస్ధితులను పెంపొందించడానికి ఇండియన్ బ్యాంకును ప్రారంభించిన వీ.కృష్ణస్వామి అయ్యర్ మునిమనవడే ఈ ఆర్యన్శ్యామ్ కావడం గమనార్హం. చిత్ర దర్శకుడు ఆనంద్ వీ.ప్రసాద్ పేర్కొంటూ ఈ తరం యువత చాలా మంది మంచి ఆదాయం చేకూరే టెక్నాలజీని నేర్చుకుని,విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళుతున్నారన్నారు. దీంతో సైనిక రంగంలో యువత కొరత నెలకొందన్నారు. సుభాష్ చిత్రం చూసిన తరువాత కనీసం వెయ్యి మంది అయినా సైనికా రంగంలో చేరతారనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం,తెలుగు, కన్నడం,మలయాళం,హింది అంటూ పలు భాషల్లో రూపొందించబోతున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. -
లగాన్@25 : క్రికెట్ ఆటతో చరిత్ర సృష్టించిన ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘లగాన్’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఆమిర్ ఖాన్, గ్రేసీ సింగ్, రెచల్ షెల్లీ, పాల్ బ్లాక్థోర్న్ ప్రధాన తారాగణంగా అశుతోష్ గోవారీకర్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా 2001 జూన్ 15న విడుదలైంది. ఈ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రంలో విలన్గా నటించిన హాలీవుడ్ నటుడు పాల్ బ్లాక్థోర్న్ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి రావడం విశేషం.(చదవండి: ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే) ‘‘భారతీయ సినిమాపై, ఇక్కడి ప్రేక్షకులపై నాకు ఉన్న అమితమైన ప్రేమే పాతికేళ్ల తర్వాత కూడా నేను ముంబై రావడానికి కారణమయ్యాయి’’ అని పాల్ పేర్కొన్నారు. ఇంకా ఈ వేడుకలకు ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, ఆమిర్ ఖాన్కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న గౌరీ స్ప్రాట్ సైతం హాజరయ్యారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్, కుమార్తె ఐరా సందడి చేశారు. అలాగే ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్, కాజోల్, కరీనా కపూర్, జూహీ చావ్లా... ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. రూ. 25 కోట్ల బడ్జెట్తో...‘లగాన్’ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 25 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎనిమిది జాతీయ అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకున్న మూడో భారతీయ చిత్రంగా ‘లగాన్’ చరిత్ర సృష్టించింది. ‘లగాన్’ సినిమాకు ముందు ‘మదర్ ఇండియా, సలామ్ బాంబే’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బేనర్పై ఆమిర్ నిర్మించిన తొలి సినిమా ఇదే.లగాన్ కథేంటంటే.. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని చంపానేర్ అనే గ్రామం నేపథ్యంలో ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’ సాగుతుంది. 1893లో చంపానేర్లో తీవ్రమైన కరువు ఏర్పడంవల్ల ఆ గ్రామవాసులు బ్రిటిష్వారికి భూమి పన్ను చెల్లించలేకపోతారు. తమ గ్రామ రాజు పూరణ్ సింగ్ను పన్ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అయితే బ్రిటిష్ సైన్యాధికారి ఆండ్రూ రస్సెల్ ఆ గ్రామ ప్రజలకు ఓ సవాల్ విసురుతాడు. బ్రిటిష్ క్రికెట్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడి, చంపానేర్ క్రికెట్ టీమ్ గెలిస్తే పన్ను మాఫీ చేస్తానని చెబుతాడు. ఓడిపోతే మూడు రెట్లు అదనంగా పన్ను కట్టాల్సి ఉంటుందని కూడా షరతు విధిస్తాడు. ఆండ్రూ చేసిన ఈ సవాల్ను చంపానేర్ గ్రామవాసి యువకుడు భువన్ స్వీకరిస్తాడు. క్రికెట్ అంటేనే తెలియని భువన్ అండ్ టీమ్ బ్రిటిష్ జట్టుపై ఎలా విజయం సాధించింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. -
ఒక్క చూపుతో...
శివ చౌదరి, జశ్విక హీరో హీరోయిన్లుగా నూతలపాటి చెంచయ్య దర్శకత్వంలో బిందు సారధి నిర్మిస్తున్న సినిమా ‘ఒక్క చూపుతో మొదలైన...’ ఈ సినిమా ట్రైలర్ని నటులు శ్రీకాంత్, శివాజీ రాజా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇప్పుడొస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంది’’ అన్నారు. ‘‘చక్కని కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని చెప్పారు చెంచయ్య, బిందు సారధి. -
అది సింగీతంగారి గొప్పతనం: నాగ్ అశ్విన్
‘‘సింగ్ గీతం’కి పని చేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్ను ప్లాన్ చేసి చేయలేం. ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతంగారి గొప్పతనం’’ అన్నారు నాగ్ అశ్విన్ . అయాన్ , అహల్యా బుమ్రూ, షాలిని కొండెపూడి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన గోల్డెన్ బ్లాక్బస్టర్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతంగారిని కలిశాను. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అయిన ఆయన్ను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండి΄ోయే మెమరీ. కానీ ఆ జర్నీ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు. ఆయన కలకు తెర రూపం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్.94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి అందమైన మ్యాజిక్ను సష్టించారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా బాగుంది. సింగీతంగారు ఏడేళ్ల క్రితమే నాకీ కథ చె΄్పారు. చాలామంది నిర్మాతలను కలిసినా కుదర్లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ రూపంలో అది సాధ్యమైంది’’ అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పటినుంచో మంచి మ్యూజికల్ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘సింగ్ గీతం’తో నెరవేరింది. సింగీతంగారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఈ కలలో మేం భాగం కావడం హ్యాపీగా ఉంది.ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్గారు. ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ అవుతాయి, డబ్బులు, పేరు తెస్తాయి. కానీ ఒక క్రియేటర్కు నిజమైన సంతృప్తినిచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. నాకలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ‘సింగ్ గీతం’’ అని చె΄్పారు. ‘‘సింగీతంగారిలాంటి లెజెండరీ దర్శకుడి సినిమాకి పని చేయడం మా అదృష్టం’’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్, నటీనటులు నివేదా పేతురాజ్, అహల్య, శాలిని, అయాన్, రాహుల్ రవీంద్రన్, బెనర్జీ, శివన్నారాయణ తదితరులు పేర్కొన్నారు. -
కృతీ... నువ్వు సూపర్
అభిమాన తారలను చూడగానే ఫ్యాన్స్కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ అభిమానమే స్టార్స్ని ఇబ్బందులపాలు చేస్తుంది. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా అలానే ఇబ్బందిపడ్డారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ముగ్గురూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పుణెలోని ఓ మాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లా జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. వేదికపై ముగ్గురూ డ్యాన్స్ చేశారు.అలాగే అక్కడి లోకల్ స్నాక్ అయిన ‘వడ పావ్’ తిన్నారు. అంతా బాగానే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరైన వీక్షకుల్లో కొందరు కనబర్చిన అత్యుత్సాహంతో అనుకున్న సమయానికన్నా నిర్వాహకులు కాస్త ముందుగానే వేడుకను ముగించాల్సి వచ్చింది. షాహిద్, కృతి, రష్మికలను అక్కణ్ణుంచి పంపించే క్రమంలో అభిమానులు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకు రావడంతో కంట్రోల్ చేయడానికి సెక్యూర్టీ చాలా ఇబ్బందిపడ్డారు.ఎలాగైతేనేం ముగ్గుర్నీ క్షేమంగా అక్కణ్ణుంచి పంపించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే... రష్మిక చుట్టూ తన చేతులు వేసి, కృతి ఆమెకు హెల్ప్ చేయడం. నిజానికి కృతీకి కూడా బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వ్యక్తి ఆమెను తాకడానికి కూడా ట్రై చేశాడట.అయితే రష్మిక భయపడినట్లు కనిపించడంతో ఆమెకు రక్షణగా కృతి తన చేతులను ఆమె చుట్టూ వేశారని వీడియో స్పష్టం చేస్తోంది. ఇలా సహ నటికి సహాయం చేయడం పట్ల ‘కృతీ... నువ్వు సూపర్’ అంటూ కృతీ సనన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే... దూసుకొచ్చినవారిని షాహిద్ నెట్టేయడం వీడి యోలో కనిపించింది. ఆయన దుస్తులు కూడా చిరిగాయని సమాచారం. -
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్మ్యాన్తో ప్రేమలో ఉన్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన) -
పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా.. ఉపాసన ఓవైపు తన పనులు, మరోవైపు ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన నుంచి చిన్నపాటి సర్ప్రైజ్ వచ్చింది.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. ఆ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పాప, బాబు ఉన్నారు. బాబుకి శివరామ్, పాపకు అన్వీరా దేవి అని పేరు పెట్టారు. పుట్టిన తర్వాత ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన.. తన పిల్లలు చేతులున్న ఫొటోని పోస్ట్ చేసి మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో తన ప్రేమని చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
తెలుగమ్మాయిల గ్లామర్.. కొంటెచూపులతో అలా
కొంటెగా చూస్తూ అనన్య నాగళ్ల గ్లామర్చీరలో కనువిందు చేస్తున్న కోమలి ప్రసాద్ఒంపుసొంపులు వయ్యారాలతో దిశా పటానీమెరుపు తీగలా మెరిసిపోతున్న మానసషూటింగ్ వీడియో పోస్ట్ చేసిన దివికలర్ఫుల్ డ్రస్లో సలార్ ఫేమ్ శ్రియారెడ్డి View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?
రామ్ చరణ్ 'పెద్ది' ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. దీంతో సందడి మరికొన్నిరోజులే ఉంటుంది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటనేది చూడాలి. మరోవైపు చరణ్ తర్వాత మూవీ గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. సుకుమార్తో చేయబోయే చిత్రం ఎప్పుడు మొదలవ్వొచ్చు? అనేది మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)రామ్ చరణ్, సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీళ్ల కాంబోలోని రెండో మూవీ గురించి చాన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు 'పెద్ది' రిలీజైపోవడంతో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులకు కుతుహలం కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు.'పెద్ది' షూటింగ్ చివరిదశలో చరణ్ చేతికి గాయమైంది. కట్టుతోనే ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు సదరు గాయానికి సర్జరీ చేయనున్నారు. అలా దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమా కోసం స్టోరీ ఇంకేం సిద్ధం చేయలేదు. దసరా లోపు స్టోరీ, స్క్రీన్ ప్లే ఓ కొలిక్కి రావొచ్చని అంటున్నారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం ఆరాటపడే సుక్కు.. దసరా కల్లా పూర్తి చేస్తాడా అనేది చూడాలి?'పుష్ప' సినిమాల తర్వాత చరణ్ ప్రాజెక్ట్పైనే సుకుమార్ పనిచేస్తున్నప్పటికీ.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాదిలో పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముంటుంది. లేదంటే మాత్రం మరో ఏడాది పట్టేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే రామ్ చరణ్కి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి సుకుమార్కి తప్పితే మరో దర్శకుడికి చరణ్ కమిట్మెంట్ ఇవ్వలేదు. అలానే పాన్ ఇండియా దర్శకులు కూడా ఎవరూ ఖాళీ లేనట్లే ఉన్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటం సాంగ్ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు) -
‘పెద్ది’లో జాన్వీ కపూర్ కొత్త సీన్స్.. వివాదం ఇంతటితో ఆగేనా!
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 378 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో ఆమెను చూపించిన తీరు, డైలాగ్స్ పై సామాన్యులే కాదు సినీ తారలు కూడా అభ్యంతరం చెప్పారు. చివరకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించారు కూడా. అయినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్స్టాఫ్ పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబే చెప్పారు.‘పెద్దిలో కొత్తగా మూడు సీన్లను యాడ్ చేయబోతున్నాం. అందులో జాన్వీ కపూర్కి సంబంధించి రెండు సీన్లు ఉన్నాయి. మరొకటి జగపతి బాబు సన్నివేశం. ఈ మూడు సీన్లను బుధవారం నుంచి యాడ్ చేయబోతున్నాం’ అని బుచ్చిబాబు చెప్పాడు. మరి కొత్త సన్నివేశాలు యాడ్ చేసిన తర్వాత అయినా జాన్వీ కపూర్ పాత్రపై పాజిటివ్ టాక్ వస్తుందో లేదో చూడాలి. -
'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే డైలాగ్స్, చేసే పనులపై కూడా విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఐటం సాంగ్ లిరిక్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయనే ట్రోల్స్ కనిపించాయి. ఇప్పుడీ విషయంపై సదరు లిరిక్ అనంత శ్రీరామ్ స్పందించాడు. ఆదివారం 'పెద్ది' సక్సెస్ మీట్లో విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)'పీహెచ్డీలు, పట్టభద్రులు.. వాళ్ల ఆలోచన విధానమే సరైనది అనేది ఎక్కువైపోవడం వల్ల, సోషల్ మీడియాలో కొందరు తన అభిప్రాయాన్ని రుద్దేశారు. అలా ప్రభావితం అవ్వడం తప్ప.. దర్శకుడికి ఓ పాత్ర ఇలా ప్రవర్తిస్తాది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకు ఏం చేసినట్లు? ముట్టేస్తానని హీరో పాత్రధారి తన ట్రైబ్ భాషలో మట్లాడితేనేమో వల్గారిటీ అంటారు. ఇలా చేస్తే సృజనాత్మకతకని తొక్కినట్లే. ఎవరినీ బాధపెట్టకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు సారీ చెప్పి ఉండొచ్చు. ఇలా జరుగుతూపోతే రాబోయే రోజుల్లో డాక్యుమెంటరీలో తప్పితే కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం' అని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పారు.అలానే ఐటమ్ సాంగ్లోని వారానికి వెయ్యి, నాకోసం దాయి లాంటి లిరిక్స్పై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఐటమ్ సాంగ్ ఆస్వాదించలేని వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు అని అనంత్ శ్రీరామ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)Lyricist Anantha Sriram counters social media warriors & so called progressive audience. pic.twitter.com/3mxy02S6fE— Aakashavaani (@TheAakashavaani) June 14, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!) -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ఆహానా రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది.కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొన్నారు. -
బలమైన సందేశంతో ‘అభయ’.. 4 భాషల్లో రిలీజ్!
యోగిత భోసాలె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న మహిళా సాధికారిక చిత్రం ‘అభయ’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్కు చెందిన ప్రముఖ నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు యూసఫ్ ముజామ్మిల్ సుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే మహిళా సాధికారితపై రూపొందుతోన్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇదని అర్థమవుతోంది.ఈ సందర్భంగా గ్రాండియెంటె ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ అధినేత, నిర్మాత డా.విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ ‘‘‘అభయ’ కేవలం సినిమా మాత్రమే కాదు..సమాజానికి బలమైన సందేశం. ఈ మూవీ ద్వారా తరతరాలుగా ఎందరికో ప్రేరణగా నిలుస్తోన్న మహిళల శక్తి, పట్టుదలను సెబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్టర్ను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.RDG ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ‘‘‘అభయ’ టైటిల్ పోస్టర్ను విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా, బలమైన కథనం, అద్భుతమైన నటీనటులతో రూపొందింది. ఈ ప్రేరణాత్మక సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.ఈ చిత్రంలో యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె, డా.సంజీవ్ కుమార్ పాటిల్, హర్ష్ నికమ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్ అని యాడ్ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు. కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు. అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్, సెండర్ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి. -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
‘29’ మూవీ రివ్యూ : సాదా సీదా కథే.. చూస్తుంటే కన్నార్పనీయదు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో తమిళ చిత్రం ‘29’ ఒకటి. నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. అప్పుడెప్పుడో ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని అంటారు. తన ఐడెంటీటీ గురించి చెప్పే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు ఉంటుంది. నిజానికి కొంతమంది స్వతహాగా ఆ గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు సంపాదించే పోరాటంలో ఉంటారు. ఆ దరిమిలా తీసిన కథే ఈ ‘29’ సినిమా. తాను రాసుకున్న కథను తానే వెండితెర మీదకు తీసుకువచ్చిన రత్నకుమార్ నిజంగా అభినందనీయుడే. ఇదో సాదా సీదా కథ. కానీ చూసే ప్రేక్షకుడిని మాత్రం కన్నార్పనీయదు. అంతలా ఏముందో ఈ కథలో ఓసారి చూద్దాం. సత్య 29 ఏళ్ళ కాలేజ్ యువకుడు. ఏ లక్ష్యమూ లేక నిరంతరం తన గుర్తింపు కోసం ఆరాటపడే పోరాట వీరుడు. ఆ ప్రయత్నంలోనే సత్యకు కథానాయిక విజ్జి పరిచయమవుతుంది. సత్యలా కాదు విజ్జి... ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అసలే తనకు గుర్తింపు లేదనే బాధలో ఉన్న సత్యకు ఉన్నట్టుండి బాయ్ ఫ్రెండ్ అనే గుర్తింపు వచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవదు. ఓ దశలో విజ్జి తన ప్రేమ తన లక్ష్యానికి అడ్డుగా ఉందని భావించి సత్యను ఇక కలవొద్దని చెబుతుంది. అనుకోకుండా తన జీవితంలో అడుగుపెట్టిన విజ్జి తనే ఇప్పుడు కలవొద్దని చెప్పడంతో సత్య కుమిలిపోతాడు. మరి... సత్యను కలవొద్దన్న విజ్జి ఐఏఎస్ పాసవుతుందా? సత్యకు తనకు కావలసిన గుర్తింపుతోపాటు విజ్జి దక్కుతుందా? అన్న విషయం మాత్రం ‘29’ సినిమాలోనే చూడాలి. పేరుకు ఇది తమిళ మాతృక అయినా నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓ మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. పుట్టిన గడ్డ కోసం..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నెరవేర్చారు. తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో విద్యార్థులకు సాయం అందించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. తన స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్పేట పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించారుతాజాగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ పేరిట ఎంపికైన జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్లో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. ఈ ఉపకార వేతనాలతో దాదాపు 180 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. ఈ ఏడాది తన సొంతూరిలో పర్యటించిన విజయ్ దేవరకొండ విద్యార్థులకు మాటిచ్చారు. ఇవాళ అఫీషియల్గా తన మాటను నెరవేర్చారు. హీరో విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామానికి చేస్తున్న సేవపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతూరిపై తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాయల సీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. We are on our way to Thummanpet. The little village where my Father was born. In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours. To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana. Here is a… pic.twitter.com/wLNSr4ZZHe— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026 -
'రాముడి పాత్రకు సుశాంత్ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.శ్వేత తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్పుత్..నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్ కనిపించాయని అన్నారు. ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. View this post on Instagram A post shared by ♾️Shweta Singh Kirti (@shwetasinghkirti) -
'పెద్ది కథ వెనక నా అసలు ఉద్దేశం అదే'.. డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు. -
సీఎంగా తొలి బర్త్ డే.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ప్రియులను ఎక్కువగా భయపెట్టిన చిత్రాల్లో ఈ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. రాఘవ లారెన్స్ తన నటన, గాంభీర్యంతో ఆడియన్స్ను భయపెట్టిన తీరు ఆకట్టుకుంది. కాంచన సిరీస్లో వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ సిరీస్లో కాంచన-4 కూడా వచ్చేస్తోంది. ఈ మూవీతో రాఘవ లారెన్స్ బిజీగా ఉన్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్కు ఆమెను ఎంపిక చేశారని టాక్. ఈ హారర్ కామెడీ చిత్రంలో నయన్ పాత్ర హైలెట్గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్లో చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'నాకు కెపాసిటీ ఉంది.. అలాంటి కథలు వస్తే చేస్తా'
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, కథల ఎంపికపై తన అభిప్రాయం పంచుకున్నారు. పెద్ది టీమ్తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం తనతో చాలాసార్లు నా సినిమాల కథల గురించి మాట్లాడారని అన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేశావని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావని అన్నారని మెగాస్టార్ తెలిపారు.నీలో ఒక కమల్ హాసన్, రజినీకాంత్, బాలచందర్ లాంటి ఉన్నారని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని అనిపించిందని చెప్పానని వెల్లడించారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అని అన్నానని చెప్పారు. దంగల్ తరహాలోనే పెద్ది సినిమా కూడా ఉందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రంలో ఆడపిల్లలతో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందన్నారు. -
నాకు కథే ముఖ్యం: తిరువీర్
‘‘నాకు ఎప్పుడూ కథే ముఖ్యం. కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది. ‘ఓ..! సుకుమారి’ చిత్రంలో కూడా కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భు తంగా ఉంటాయి. నేను నటించిన ‘మసూద’ సినిమాని పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలాంటి విజయమే ‘ఓ..! సుకుమారి’ చిత్రానికి కూడా దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని తిరువీర్ తెలిపారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జోడీగా నటించారు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ అయిన తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ‘ఓ..! సుకుమారి’. హీరోయిన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ‘‘చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయి’’ అని భరత్ దర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ కుషేందర్, నటులు జీవన్, గవి రెడ్డి మాట్లాడారు. -
మాస్ పోలీస్
వెండితెరపై తమ అభిమాన హీరో మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే థియేటర్స్లో ఆ హీరో ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి. అన్యాయం చేస్తున్న విలన్స్ను పోలీస్ ఆఫీసర్ గెటప్లో హీరో రఫ్ఫాడిస్తుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్ల సౌండ్స్తో మారుమోగి పోతాయి. మరి... థియేటర్స్లో ఈ మాస్ వైబ్రేషన్ను క్రియేట్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు ఖాకీ చొక్కా వేసుకుని, లాఠీ పట్టిన వెండితెర మాస్ పోలీస్లపై ఓ లుక్ వేయండి.మళ్లీ వస్తున్నాడు ముత్తువేల్ పాండియన్ పోలీస్ స్టోరీస్ అంటే రజనీకాంత్కు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు (దర్బార్, జైలర్, వేట్టయాన్) రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా వెండితెరపై కనిపించారు. ఆయన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ పోలీస్ ఆఫీసర్గానే నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు.ఫ్లాష్బ్యాక్ సీన్స్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. ఈ ‘జైలర్ 2’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ‘జైలర్’ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మోహన్లాల్ ‘జైలర్ 2’ చిత్రంలోనూ నటించారు.కొత్తగా ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ రోషన్ నార్త్కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. తొలుత ఈ పాత్రకు షారుక్ ఖాన్ను అనుకున్నారు. కానీ ఫైనల్గా హృతిక్ రోషన్ ఓకే అయ్యారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్–హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.సంక్రాంతికి వస్తారా! సిల్వర్ స్క్రీన్పై సింగమ్ అంటే సూర్య అని ఇట్టే చెప్పేస్తారు యాక్షన్ సినిమా లవర్స్. పోలీస్ ఆఫీసర్గా ‘సింగమ్’ సిరీస్ సినిమాల్లో సూర్య తన యాక్టింగ్తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. నిజానికి ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకంటే ముందే, ‘కాక్క కాక్క’ అనే ఓ తమిళ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సినిమానే వెంకటేశ్ హీరోగా తెలుగులో ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. ఇలా... సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అయి పోతుంది. కాగా సూర్య ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో సూర్యది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం. నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ యువ నటుడు, ‘ప్రేమలు, లోక: చాప్టర్ 1’ చిత్రాల ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య కెరీర్లోని ఈ 47వ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక కొంత కాలంగా వరుస సినిమాల వైఫల్యాలతో ఇబ్బందిపడిన సూర్య ఇటీవల ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘కరుప్పు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాపై ఆయన ఫ్యాన్స్లో, తమిళ ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.తొలిసారి పోలీస్ ఆఫీసర్గా... సిల్వర్ స్క్రీన్పై ప్రభాస్ కటౌట్ పోలీస్ ఆఫీసర్గా సూపర్బ్గా సూట్ అవుతుంది. ఆరడుగుల ప్రభాస్ పోలీస్ గెటప్లో స్క్రీన్పై కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. థియేటర్స్లో విజిల్స్ మోత మోగి పోతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘స్పిరిట్’లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవల ప్రభాస్ పోలీస్ గెటప్ ఉండగా, ఓ థియేటర్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్ను హైదరాబాద్లో చిత్రీకరించారు. భూషణ్కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా కాంచన, ప్రకాష్రాజ్, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటించారు ప్రభాస్, నదియా. ‘స్పిరిట్’ సినిమా కోసం మళ్లీ నదియా, ప్రభాస్ కలిసి నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమా చారం. అలాగే ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్స్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ప్రోఫెసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.10 సంవత్సరాలు... 55 ట్రాన్స్ఫర్స్ ‘పెళ్లి, చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కాగా, యాక్టర్గా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే పాత్రలో వడ్డే నవీన్ నటించారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.కమల్తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. పది సంవత్సరాల్లో 55 సార్లు ట్రాన్స్ఫర్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి కేసును సాల్వ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ కేసుకు, త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా కథనం అని తెలిసింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా మారారు వడ్డే నవీన్.పవర్ఫుల్ పోలీస్ ‘కూలీ నెంబరు 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల... వైకుంఠపురములో..’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ సంయుక్త, దునియా విజయ్కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటీవల ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో డీసీపీ (డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్)గా టబు కనిపించారు. ఈ చిత్రంలో బెగ్గింగ్ మాఫియాను అరికట్టే మిషన్ను టేకప్ చేస్తారట ఆమె. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఫుల్ మాస్వెండితెరపై ఇప్పటివరకు ఎక్కువగా బ్యూటిఫుల్ హీరోయిన్గానే కనిపించారు సాయి పల్లవి. ధనుష్ ‘మారి 2’, నాని ‘ఎమ్సీఏ’ సినిమాల్లో మాత్రం సాయి పల్లవి క్యారెక్టర్లో చిన్నపాటి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఫుల్ మాస్ అవతార్లో కనిపించేందుకు ఆమె సిద్ధమయ్యారని తెలిసింది. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కాగా, ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ వపర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్లో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. వెండితెరపై పోలీస్ ఆఫీసర్గా కనిపించేందుకు ఆమె శిక్షణ కూడా తీసుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. అలాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా పోలీస్ అధికారి పాత్రలోనే కనిపిస్తారట. అంతేకాదు... మమ్ముట్టి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. హిట్ 4 తెలుగు సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్ సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్గానే కనిపిస్తారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడివి శేషు, ‘హిట్ 3’లో నాని పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇక ‘హిట్ 3’ ఎండింగ్లో ‘హిట్ 4’ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తారని స్పష్టం చేసింది యూనిట్. అయితే ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. మరోవైపు ‘హిట్’ సిరీస్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఓ లవ్స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇలా దర్శకుడు కల్యాణ్తో కార్తీ, హీరో రోషన్తో శైలేష్ వారి వారి సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ‘హిట్ 4’ సినిమా సెట్స్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.బొగ్గు గనుల నేపథ్యంలో...! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన దోషులను పట్టుకునే పోలీస్ ఆఫీసర్గా సంయుక్త నటించారని తెలిసింది.అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాలో హైలైట్గా ఉంటాయని తెలిసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాలో ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ చిత్రయూనిట్ పేర్కొంది. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.వీరే కాదు... మరికొంతమంది హీరో, హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారని తెలిసింది. మరికొందరు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే కథలను వింటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
మాస్ ఎంట్రీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్బాబు (హీరో మహేశ్బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు.చలసాని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూలై 9న విడుదల కానుంది. ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరోగా జయకృష్ణ నిలుస్తున్నారు. కృష్ణ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో, ప్రోడక్షన్ విభాగంలో శిక్షణ పొందారు జయకృష్ణ. అదే విధంగా అమెరికా వెళ్లి నటనతో పాటు హీరోకి అవసరమైన అన్నిటిలో పక్కా ట్రైనింగ్ తీసుకున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సిల్వర్ స్క్రీన్పై జయకృష్ణ మంచి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని స్పష్టం చేసింది. అలాగే టీజర్ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన జయకృష్ణ లుక్స్, టీజర్లోని డైలాగులు, నటన చూస్తుంటే ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్బాబులా కనబడుతున్నాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. తప్పనిసరిగా కృష్ణ, మహేశ్బాబుల వారసత్వాన్ని నిలబెట్టే హీరో అవుతాడని, ‘శ్రీనివాస మంగాపురం’తో గ్యారెంటీగా సక్సెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. -
నేపాలీ గ్యాంగ్స్పై ఆర్జీవీ కన్ను?
హైదరాబాద్తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది. గతేడాది తన సూపర్ హిట్ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్మార్క్గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు. -
రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన ఆయన ఇండియన్ రైల్వేస్ అభివృద్ధిని ప్రశంసించారు. ఇంత నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గతంలో తాను టికెట్ బుక్ చేసుకోవడానికే ఇబ్బందులు పడేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. నాగ్పూర్ నుంచి ముంబయి వెళ్లేటప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాను న్యూస్ పేపర్ కింద పరచుకుని రైళ్లలో ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయని సోనూసూద్ అన్నారు. భారతీయుల ప్రయాణంలో క్వాలిటీ చూసి గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ మాటలతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. अभिनेता Sonu Sood ने Vande Bharat Express में यात्रा का अपना अनुभव साझा करते हुए ट्रेन की आधुनिक सुविधाओं, स्वच्छता और आरामदायक सफर की सराहना की। 🚆A heartfelt thanks to @SonuSood for sharing this experience and highlighting the positive changes #SonuSood #IndianRailways pic.twitter.com/x24QbaFki6— BHARAT SAMVAD (@Bhaaratsamvad) June 13, 2026 -
మనం డైెరెక్టర్తో విజయ్ దేవరకొండ.. వర్కవుట్ అవుతుందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. Rumour Mill: Vijay Deverakonda x Vikram Kumar? 👀Reports suggest that #VijayDeverakonda may team up with Vikram Kumar for a new pan-India project, reportedly backed by Maddock Films. While there's no official confirmation yet, the prospect of the 24 director collaborating with… pic.twitter.com/kqAR9sfPoS— Movie_Reviews (@MovieReview_Hub) June 13, 2026 -
అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది. మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. Team #Lenin came to me with a request.They asked for a little more time to give their absolute 100% and create something very special.Their passion and spirit made me say yes.మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!Get ready for the #Lenin…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2026 -
హైదరాబాద్లో భారీ వర్షం.. తమన్ లైవ్ కన్సర్ట్ రద్దు
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. It’s Heartbreaking for Me & My 56 Member Team To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner . Sometimes It has…— thaman S (@MusicThaman) June 13, 2026 #OGTourIndia show which was supposed to happen today was cancelled due to heavy rains and a storm!! #Thaman pic.twitter.com/C642kt20Wo— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) June 13, 2026 -
హీరోయిన్ పేరుతో ఫేక్ అకౌంట్.. ఫ్యాన్స్కు అలర్ట్
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్ నంబర్తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్
సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం ‘హిట్ అండ్ రన్’. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో హీరోయిన్ నటాషా సింగ్ రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్పై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్ ఇదేనని మౌనీ రాయ్ వెల్లడించింది.విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు.కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు. -
‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
టైటిల్ : దృఢంనటీనటులు: షేన్ నిగమ్, శోభి తిలకన్, కొట్టాయం రమేశ్, నందన్ ఉన్ని తదితరులుదర్శకత్వం : మార్టిన్ జోసెఫ్ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్స్టార్తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుజినీలం పోలీస్స్టేషన్ పరిధిలో పెద్దగా క్రైమ్ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్కి ఎస్సైగా వస్తాడు విజయ్(షేన్ నిగమ్). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూశామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్స్టేషన్కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్ కేసులు వస్తే సాల్వ్ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్ జరగడంతో ఎస్సై విజయ్ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్లో ఉండగానే మరో ట్విస్ట్ రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్కు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, రొటీన్గా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..షేన్ నిగమ్ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
రామ్ చరణ్ పెద్ది.. తొమ్మిది రోజుల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా, రన్నర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ను మేకర్స్ తొలగించారు. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. #Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026 -
ఐశ్వర్య రాజేశ్ కొత్త సినిమా.. ఓ సుకుమారి టీజర్ చూశారా?
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క నిజం దాచి పెట్టి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న పాయింట్తో ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే... ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దానర్ధం" అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీగా ఉండనుందని తెలిసిపోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
డ్రైవర్గా మారిన సీఎం విజయ్.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్!
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చాడు స్టార్ హీరో విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలీలో పరిపాలన సాగిస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడే ఆయన చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవాడు. స్టార్ అనే గర్వం ఎక్కడ చూపించేవాడు కాదు. ఇక సీఎం అయిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అధికార గర్వం కనిపించడం లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆయన ప్రణాళికలు ఉంటున్నాయి. తాజాగా ఆయన కర్ణాటక కొల్లూరులోని శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్లో తాను ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు.సీఎం విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. He Himself drives His own convoy for more than 130+KM's From Kollur to Mangaluru Airport🥶🙌🫡🔥🦁@CMOTamilnadu Na Loves Driving❤️#Jananayagan @TVKVijayHQ pic.twitter.com/PkyyYU2OIW— MR.BK👺 (@_kishore__vj) June 12, 2026Most Valuable Driver 🔥🔥🔥#CMJosephVijay #TVKVijay pic.twitter.com/eAPer8fCvQ— Swara TVK ❤️💛 (@SwaraVijay_) June 12, 2026 -
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
మూడున్నర గంటల నిడివి.. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఓ ఊరి కథ. యాక్షన్ మాస్ మసాలా ఐటెం సాంగుల్లాంటి హంగులేమీ లేవు. పైగా సస్పెన్స్ థ్రిల్లరో, హారర్ జానరో కూడా కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామంది “అబ్బో” అంటూ ఆ సినిమాను పక్కన పెట్టేయడం సహజమే. కానీ ఒక్కసారి చూడడం మొదలుపెట్టాక ప్రతి సన్నివేశం మనల్ని లోపలికి లాగేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది. మధ్యలో ఆపేయాలన్న ఆలోచనే రానీయకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది. 1893లోని చంపానేర్ గ్రామం, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, బ్రిటిష్ అధికారుల అహంకారం.. ఇవన్నీ మొదటి నుంచే కథలోకి లాగేస్తాయి. ఘనన్ ఘనన్ పాట వినిపించిన క్షణం నుంచి ప్రేక్షకుడు కూడా ఆ గ్రామస్థులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తాడు. రాధా కైసే నా జలే, ఓ పాలన్ హారే వంటి పాటలు కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా చేస్తాయి.క్రికెట్ చుట్టూ తిరిగే స్క్రీన్ప్లే.. లగాన్ సినిమా గొప్పతనం కేవలం క్రికెట్లో లేదు. కులవివక్ష, మత సామరస్యం, ఐక్యత, ఆత్మగౌరవం వంటి అంశాలను ఎంతో సహజంగా కథలో కలిపేసింది. ముఖ్యంగా దళితుడైన కచ్రాను జట్టులో చేర్చే సన్నివేశం ఇప్పటికీ గుండెను తాకుతుంది. కాలం మారినా.. సమాజంలోని కొన్ని వాస్తవాలు మాత్రం మారలేదనే ఆలోచన కలిగిస్తుంది.క్రికెట్ మ్యాచ్కు ముందు గ్రామస్తులు ప్రాక్టీస్ చేసే సన్నివేశాలు నవ్విస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మొదట ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉన్న వాళ్లు.. చివరకు ఒక లక్ష్యం కోసం ఒక్కటిగా నిలబడటం ప్రేక్షకుడిలోనూ ఓ అనుబంధాన్ని కలిగిస్తుంది. మ్యాచ్ మొదలయ్యాక ప్రతి బంతి ఉత్కంఠను పెంచుతుంది. ప్రతి వికెట్తో గుండె వేగం పెరుగుతుంది. చివరి ఓవర్లలో ప్రేక్షకుడు కూడా చంపానేర్ జట్టులో భాగమైనట్టే ఫీలవుతాడు.వర్షం కురిసే క్లైమాక్స్ కేవలం ఒక విజయానికి గుర్తు కాదు. అవమానాన్ని, ఆకలిని, అన్యాయాన్ని ఎదుర్కొన్న ప్రజల ఆశలకు దక్కిన ప్రతిఫలం. అందుకే లగాన్ దేశభక్తి సినిమా కంటే చాలా పెద్దది. అది మనుషుల గురించి, వారి కలల గురించి, కలిసి పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమేనని చెప్పే కథ.ఓ కల నుంచి ఆస్కార్ దాకా!దర్శకుడు అశుతోష్ గోవారికర్ Ashutosh Gowariker మనసులో పుట్టిన ఓ విభిన్న ఆలోచనే ఈ చిత్రానికి బీజం. బ్రిటిష్ పాలనలో ఉన్న ఓ గ్రామం.. కరువు, పన్నుల భారం, ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా క్రికెట్ మ్యాచ్ ద్వారా పోరాడే రైతులు.. ఈ కథను మొదట వినగానే చాలామంది నిర్మాతలు రిస్క్గా భావించారు. పీరియడ్ డ్రామా, గ్రామీణ నేపథ్యం, క్రికెట్, మూడున్నర గంటల నిడివి.. ఇవన్నీ కలిసి కమర్షియల్గా పనిచేయవని అనుకున్నారు.అలాంటి సమయంలో హీరో అమీర్ ఖాన్ Aamir Khan కథపై నమ్మకం ఉంచారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ముందుకొచ్చి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాను నిర్మించారు. భువన్ పాత్రను అమీర్ పోషించగా, గౌరి పాత్రకు గ్రేసీ సింగ్ను తీసుకున్నారు. చంపానేర్కు సాయం చేసే బ్రిటిష్ యువతి ఎలిజబెత్ పాత్రలో రాచెల్ షెల్లీ నటించారు. గ్రామస్థుల పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించి నటులను ఎంపిక చేశారు.రఘుబీర్ యాదవ్ (భూరా), ఆదిత్య లఖియా (కచ్రా), యశ్పాల్ శర్మ (లఖా), అఖిలేంద్ర మిశ్రా (అర్జున్), దయాశంకర్ పాండే (గోలి), రాజ్ జుత్షి (ఇస్మాయిల్), ప్రదీప్ రావత్ (దేవా సింగ్ సోధి), అమీన్ హాజీ (బఘా), రాజేష్ వివేక్ (గురన్) గా వీరు అందరూ కలిసి చంపానేర్ గ్రామ జట్టుకు ప్రాణం పోశారు. లగాన్ సమయంలో మాత్రం వీరిలో చాలామంది మధ్యస్థాయి లేదా కొత్త నటులే. అందుకే ఆ ఊరు నిజంగా మన కళ్ల ముందున్నట్టుగా అనిపించింది. ఇదే సినిమా సహజత్వానికి పెద్ద కారణంగా చెప్పొచ్చు.చిత్రీకరణ ప్రధానంగా గుజరాత్లోని భుజ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మండే ఎండల్లో నెలల తరబడి షూటింగ్ సాగింది. గ్రామం మొత్తం ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాలో కనిపించే క్రికెట్ మ్యాచ్ కోసం నటులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.. ఇప్పటికీ అవి చిరస్మరణీయంగా నిలిచాయి.2001 జూన్ 15న విడుదలైంది లగాన్. మొదట్లో ఒక ప్రయోగాత్మక చిత్రంలా కనిపించినా.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. బ్రిటిష్ పాలన, కుల వివక్ష, మత సామరస్యం, గ్రామీణ ఐక్యత వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో లగాన్ అంతర్జాతీయ వేదికల దృష్టిని ఆకర్షించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డ్స్లో (ఆస్కార్) ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ పొందింది. ఆస్కార్కు నామినేట్ అయిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చివరకు అవార్డు దక్కకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్ వేదికపై లగాన్ పేరు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.లగాన్.. కేవలం క్రికెట్ కథ కాదు.. ఆత్మగౌరవం కోసం మట్టిమనుషులు చేసిన పోరాటం. సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ సినిమాలోని మేజిక్ తగ్గలేదు. మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా.. నేటి రీల్ జనరేషన్ను కూడా స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తోందా కథాకథనం. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉండటానికి అదే కారణం కూడా. అందుకే లగాన్ ఒక సినిమా కాదు.. తరాలు మారినా నిలిచే క్లాసిక్. (భాషతో అక్కర్లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది):::ఓ సినీ ప్రేమికుడు -
మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్లో మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.బాక్సాఫీస్ను శాసిస్తున్న యూత్!ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా టోబర్ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువతఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్లనో లేదా రీబూట్లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్2, టైర్3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్లను విస్తరించడం.కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం దృశ్యం 3, మే 21న థియేటర్స్లో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 236 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయినప్పటికీ నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 18 నుంచి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది.దృశ్యం 3 కథేంటంటే..?దృశ్యం 2 ముగింపు సీన్తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్కుట్టి(మోహన్లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వడ్డే నవీన్ ఎంత పవర్ఫుల్ అంటే.. వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
వడ్డే నవీన్.. 90వ దశకంలో ఆయన స్టార్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరేట్ హీరో ఇతనే. 2000వ సంవత్సరం వరకు వరుస సినిమాలతో అలరించాడు. ఆ తర్వాత యంగ్ హీరోలు రావడంతో ఈ ఫ్యామిలీ హీరో వెనక్కి తగ్గాడు. చివరగా ఆర్జీవీ ఎటాక్ (2016) సినిమాలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ఈవెంట్కి స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకుంటూ..ఆయన ఎంత పవర్ఫుల్లో వివరించాడు.నవీన్ హీరోగా చేసిన ఒక సినిమాకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడట. ఆయన ప్రోత్సాహంతోనే డైరెక్టర్ని ఆయ్యానని..ఆది సినిమాకు నాంది నవీనే అంటున్నాడు. ‘నవీన్తో కలిసి ఒకే ఒక్క సినిమాకు అసిస్టెంట్గా పని చేశా కానీ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చేసిన సినిమాల్లో 90శాతం కంటే ఎక్కువగా ఇష్టం లేకుండానే చేసేశాడు. ఓ సారి నేను ఓ సీన్ రాశా..అది చూసి ఇది ఎవరు రాశారని అడిగారు. నేను డైరెక్షన్ టీమ్ అని చెప్తా.. కానీ నేనే రాశానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి భోజనానికి పిలిచాడు. అప్పుడే ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం ఆపేసి..డైరెక్షన్ చేయమని చెప్పాడు. నీకు నేను తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆయన సినిమాకు అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ను స్విట్జర్లాండ్లో కలిశా. అలా ఆది సినిమాకు నవీన్ సినిమా నాందిగా నిలిచింది’ అని వినాయక్ చెప్పాడు.ఇక నవీన్ ఎంతపవర్ఫుల్లో వివరిస్తూ.. ‘ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విమానంలో స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు వస్తుంటే ఒక కాస్ట్యూమర్ సిగరేట్ కాల్చారు. అది భద్రతా సిబ్బందికి తెలిసి..చెన్నైలో అడుగుపెట్టగానే ఏకే 47 గన్లతో వచ్చి ఆ కాస్ట్యూమర్ను అరెస్ట్ చేశారు. ఈ విషయం నవీన్ దగ్గరకు వెళ్లగానే.. ఒక ఫోన్ కాల్ చేసి నిమిషాల్లో విడిపించాడు. అప్పుడు ఈయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత పవర్ ఫుల్లా అని ఆశ్చర్యపోయాను’ అని వినాయక్ అన్నాడు. -
‘ధమాల్ 4’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు
బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో ‘ధమాల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా సినిమా ‘ధమాల్ 4’. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్కి ఇంద్రకుమార్ దర్శకుడు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ మూవీ జూలై 10న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘హెల్ప్ చేయండి’..., ‘సైతాన్ సింగ్ నిధికి చెందిన చిరునామాను కాస్త గట్టిగా చెప్పండి’, ‘అరె.., నిధికి సంబంధించిన మ్యాప్ దొరికింది’ అని తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్ ‘ధమాల్ 4’ ట్రైలర్లో ఉన్నాయి. ‘ధమాల్ 4’లో నాలుగింతల వినోదం ఉంటుందని ఇటీవల అజయ్ దేవగన్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్లో కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి. -
తగ్గేదేలే అంటున్న త్రిష.. ఏకంగా రూ.12 కోట్లు!
ఇటీవల ట్రెండింగ్లో ఉన్న పేరు త్రిష అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ రంగంలోనూ సంచలనం సృష్టించిన నటి ఈ బ్యూటీ. వయసును అస్సలు పట్టించుకోని అతి కొద్ది మంది కథానాయికల్లో ఈ భామ ఒకరు. పాన్ ఇండియా కథానాయకిగా పేరు గాంచిన గత త్రిష రెండు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈమెకు అపజయాలు పలకరించిన వెంటనే విజయాలు పులకరింప చేస్తాయి. అయితే ఫ్లాపులు ఎదురైనప్పుడు సైలెంట్గా ఉండే ఈ భామ విజయాలు వరించినప్పుడు మాత్రం చాలా మంది నటీమణుల మాదిరిగానే పారితోషికం పెంచేస్తుంటారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన త్రిషకు ఆ తరువాత సరైన హిట్ రాలేదు సరికదా అజిత్ సరసన నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్లైఫ్ చిత్రాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ముందే చెప్పినట్టు ఒకటి రెండు ఫ్లాపులు తరువాత ఈ సంచలన నటికి హిట్స్ వెతుక్కుంటూ వస్తాయి. అలా కరుప్పు చిత్రం రూపంలో తాజాగా సూపర్ హిట్ వచ్చింది. అంతే ఇప్పుడు త్రిష తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఒక తమిళ చిత్రంలో త్రిషను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ చిత్రానికి ఆమె రూ.12 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కరుప్పు చిత్రానికి ఎక్కువ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పుడు దాని కంటే ఇంకా అధికంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిష పారితోషికం తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతో తెలియ దు కానీ త్రిష పారి తోషికం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారనేది వైరల్ అవుతోంది. -
గంగ యాక్షన్
విలన్స్ను రఫ్ఫాడిస్తున్నాడు గంగ. ఏ రేంజ్లో, ఏ స్టైల్లో అనేది ‘భోగి’ సినిమాలో చూడాలి. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ చిత్రంలో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్, మందారంగా డింపుల్ హయాతి నటిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామంలో ఈ సినిమా కథనం సాగుతుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె నిర్మించిన భారీ సెట్లో ఈ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. శర్వా రిస్కీ స్టంట్లతో తన నటనలోని సరికొత్త కోణాన్ని చూపించనున్నారు.దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేశారు. క్లైమాక్స్ చిత్రీకరణ షెడ్యూల్ దాదాపు 20 రోజులపాటు సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది. -
వైజాగ్లో వారణాసి
వైజాగ్లో తన టీమ్తో సహా ల్యాండ్ అయ్యారు రాజమౌళి. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ వైజాగ్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే రాజమౌళి వైజాగ్ చేరుకున్నారు. మహేశ్బాబు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్లో చిత్రీకరిస్తారట. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
కొత్త సినిమా షురూ
సరికొత్త సినిమాలతో నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో ప్రియదర్శి కొత్త సినిమా కబురు చెప్పారు. ప్రియదర్శి హీరోగా బన్నీ వాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాసు, బి. సుకుమార్ ఓ సినిమా నిర్మించనున్నారు.ఈ చిత్రం దర్శకుడి పేరు, నటీనటులు–సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా బన్నీ వాసు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు. ఇక ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రామ్చరణ్తో మరో సినిమా చేసేందుకు సుకుమార్ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. -
గ్రామీణ కథతో డైరెక్షన్
హీరో కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవిక భట్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో శరత్కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తుండగా సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రీ లుక్ తరహాలో శుక్రవారం ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘ఏక్ దమ్ బిందాస్ పకానే వాలే’ అన్నది ఈ సినిమా ట్యాగ్లైన్. ‘‘దర్శకుడిగా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్థం చేశారు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి కిరణ్ కథారచయితగా, హీరోగా, స్క్రీన్ ప్లే రైటర్గా, దర్శకుడిగా చేస్తున్నారు. యూత్ను, కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్ డేనియల్. -
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
సామాన్యులకు వెల్కమ్.. బిగ్బాస్ అగ్నిపరీక్షకు రెడీనా?
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్లో ఆసక్తి పెంచేశారు.అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్బాస్ ఛాన్స్ కొట్టేయండి. -
సునీత తనయుడి కొత్త మలుపు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కొత్త మలుపు కథేంటంటే..జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.ఎలా ఉందంటే..ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించాయి.రెండో అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.ఎవరెలా చేశారంటే.. కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్తో గోదావరి యాసలో అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. -
పెద్ది టీమ్కు మెగా ప్రశంసలు
రామ్ చరణ్ పెద్ది టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్లో పంచుకుంది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. A MEGA APPRECIATION 💥Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/0aN2EgDNtD— PEDDI (@PeddiMovieOffl) June 12, 2026 -
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్లో జీవీ ప్రకాశ్ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026 -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్కు వచ్చి తెరకెక్కించడం సవాల్తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ సినిమా కథేంటంటే..గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్కు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్లో ఎక్కువగా ట్విస్ట్లు ఆడియన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి.ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్తో పాటు థ్రిల్లింగ్ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్కుమార్ మరోసారి తన టాలెంట్ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్ను విజువల్గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
స్లమ్డాగ్ టీజర్.. పూరి జగన్నాధ్ డెడికేషన్ చూశారా?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి- పూరి జగన్నాధ్ అరుదైన కాంబోలో వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్లో యాక్షన్ సీన్స్ చూస్తే పూరి డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.తాజాగా ఈ టీజర్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూరి జగన్నాధ్ ఎనర్జీ, డెడికేషన్ అద్భుతంగా ఉంది. యాక్షన్స్ సీన్స్ హీరోకు వివరిస్తున్న తీరు పూరి ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది మానియా.. చికిరి సాంగ్కు చిందులేసిన వరుడు
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మానియా నడుస్తోంది. ఈనెల 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అయితే ఈ మూవీలోని సాంగ్స్ అభిమానులను ఓ ఊపు ఊపేశాయి. రైరై రారా అంటూ సాగే పాటతో పాటు చికిరి చికిరి సాంగ్కు ఫ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇటీవల జరిగిన పెద్ది ఈవెంట్లో ప్రదర్శించారు. పెద్ది సాంగ్స్ అంతలా ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.తాజాగా చికిరి చికిరి సాంగ్కు ఓ వరుడు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన కాబోయే సతీమణి ముందే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Cringe 😬😬 anipinchadam ledhaa #Peddi pic.twitter.com/MiHFAwWZu2— AVM (@AvmNews7) June 11, 2026 -
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సింగ్ గీతంనటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమానిర్మాత: నాగ్ అశ్విన్దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్విడుదల తేది: జూన్ 12, 2026ట్రెండ్కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మదన కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కుబేర పురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్ సాగిస్తుంటారు. ఆ మైనింగ్ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని ప్రతాప్ (అయాన్) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గనులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్ కుబేరపురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్ మాఫియా నేపథ్యం అంతా రొటీన్గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సింగీతం మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక చివరిలో విజయ్ దేవరొకండ ఎంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది. పార్ట్ 2 ఉంటుందన్నట్లుగా విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ఉంది. మరి సీక్వెల్ ఉంటుందా లేదా? అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే..సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రతాప్ పాత్రలో అయాన్, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్, విజయ్ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్.. ఆర్టిఫియల్గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ధనుష్-శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్?
సినీ రంగంలో క్రేజీ కాంబినేషన్పై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొత్త కాంబోకు శ్రీకారం పడనుందా అంటే కోలీవుడ్లో అవుననే సమాధానమే వస్తోంది. కథానాయకుడిగా, దర్శకుడు, నిర్మాతగా బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తనను వెతుక్కుంటూ వస్తున్న మంచి కథలను వదులు కోవడం లేదు. తాజాగా దర్శకుడు శివ చెప్పిన కథ నచ్చడంతో అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య కథానాయకుడిగా శివ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన కంగువ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న శివ నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేక పోవడంతో ధనుష్ తో చిత్రం చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇటీవల కోలీవుడ్లో చిత్రాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని చెప్పవచ్చు. ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు శివ దర్శకత్వంలో రూపొందించబోతున్నది యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈచిత్రం కోసం నటుడు ధనుష్ 2027 జనవరి నుంచి కాల్ షీట్స్ కేటాయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం. -
రాజకీయాల్లోకి లారెన్స్.. కీలక ప్రకటన
ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం.. Do your duty sincerely, without expecting anything in return.After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు లారెన్స్కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. -
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి కమర్షియల్ అంశాలతో చాలా చిత్రాలు వస్తుంటాయి. అయితే సహజత్వం కూడిన మనసును హత్తుకునే చిత్రాలు చాలా తక్కువగానే వస్తుంటాయి.తాజాగా రూపొందిన అలాంటి చిత్రం హబిబి. ఒక మధ్య తరగతికి చెందిన ఇస్లామిక్ కుటుంబం నేపధ్యంలో రూపొందిన చిత్రం ఇది. మూడు తరాలుగా చేనేత వృత్తి నమ్ముకుని అత్యంత సాధారణ జీవితాన్ని అనుభవించే ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి, సంతోషంగా జీవించాలని భావించి, కొత్తగా పెళ్లి చేసుకుని భార్యను కూడా వదిలి దుబాయ్కి వెళ్తాడు. అక్కడ పలు ఏళ్లు పని చేసే సంపాదించిన డబ్బుతో సొంత ఊరికి తిరిగి వస్తాడు. అదే విధంగా తన అన్నయ్య కొడుకును కూడా దుబాయ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే చదువుకునే రోజుల్లోనే సహా విద్యార్థినిపై మనసు పడ్డ అతను ఆమెకు దూరం కావడం ఇష్టం లేక దుబాయ్ కి వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయసికి దూరం కావలిసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో అతను కూడా దుబాయ్ కి వెళ్తాడు. తిరిగి వచ్చిన తరువాత మరో యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఆ పెళ్లి జరిగిందా ? మొదట ప్రేమించిన యువతి ఏమైయ్యింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో అత్యంత సహజత్వంగా రూపొందిన చిత్రం హబిబి. ఇస్లామీయ సమాజంలోని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలను యధార్థంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి మీరా కదిరవన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి మాళవిక మనోజ్ మరో ముఖ్య పాత్రను పోషించారు. శ్యామ్ సి ఎస్.సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నేశం ఎంటర్ టైన్మెంట్ ,జీకేఎస్ బ్రోస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్ణయించాయి.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ అధినేత రాహుల్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రం గత 110 ఏళ్ల సినీ చరిత్రలో రాలేదని ప్రధాన పాత్రను పోషించిన దర్శకుడు కస్తూరి రాజా పేర్కొన్నారు. -
OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పార్ట్ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్లోనే చెప్పాడు సుజీత్. ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్. ‘ఓజీ 2’అప్డేట్ ఇచ్చాడు.‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సుజిత్.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్ భావిస్తున్నాడట. As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026 -
ఓటీటీ అయినా ఓకే.. అదే నా లక్ష్యం : భైరవి
‘‘కొత్త మలుపు’లో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ వంటి అన్ని వాణిజ్య అంశాలున్నాయి. యువతరానికే కాదు... కుటుంబ ప్రేక్షకులకూ మా చిత్రం నచ్చుతుంది’’ అని భైరవి ఆర్థ్యా అన్నారు. గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నేడు(జూన్12) విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరోయిన్ భైరవి ఆర్థ్యా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొత్త మలుపు’లో నా పాత్ర పేరు వరలక్ష్మి. కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి తను. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. ఈ సినిమా కోసం నాకు భాషే పెద్ద సవాలుగా మారింది. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు. అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.ఇక మంచి కథ, పాత్ర బాగుంటే సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నటించేందుకు నేను సిద్ధమే,నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్య’అని పేర్కొన్నారు. -
సింగ్ గీతంలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: నిర్మాత నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’’ అని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా నేను, దేవిశ్రీ ప్రసాద్గారు, మా టీమ్ అందరం సింగీతంగారితో ప్రయాణం చేసి, ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగీతంగారి స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం ఇది. నేను 10 ఏళ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి, స్ఫూర్తి పొందాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా స్ఫూర్తి పొందాలన్నది మా ఆశ’’ అని పేర్కొన్నారు. -
స్పెషల్ గెస్ట్..?
ముత్తువేల్ పాండియన్తో చేతులు కలపనున్నారట హృతిక్ రోషన్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్ల కాంబినేషన్లోనే ‘జైలర్’కు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.ఈ సినిమాలోని ఓ స్పెషల్ గెస్ట్ రోల్ను హృతిక్ రోషన్ చేయనున్నారని తెలిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ సినిమా చిత్రీకరణ కోసం హృతిక్ రోషన్ చెన్నై చేరుకుంటారని, రజనీ–హృతిక్ కాంబినేషన్లోని కీలక సన్నివేశాలను నెల్సన్ చిత్రీకరిస్తారని సమాచారం. -
సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు. -
ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇసాకపట్నం. టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ సిరీస్లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్టైటిల్స్తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. -
ముగిసిన భారతీ రాజా అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి
దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్హౌస్కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్హౌస్కు తరలివచ్చారు.అంతకుముందు సీనియర్ హీరోయిన్ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.VIDEO | Tamil Nadu: Actor Suhasini Maniratnam pays tributes to Bharathiraja in Theni, says “He changed the colour and character of Tamil cinema”.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/VkhkLxtFst— Press Trust of India (@PTI_News) June 11, 2026 -
విశాల్ త్రిపాత్రాభినయం.. మకుటం యాక్షన్ టీజర్ రిలీజ్
విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టీజర్లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12అవుట్ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ది రెస్ట్ ఈజ్ ఫుట్బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12అమెజాన్ ప్రైమ్ రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12 కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12 విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 డాగ్51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12 ఓవర్ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 ఎవరీ ఇయర్ ఆఫ్టర్(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12జియో హాట్స్టార్ ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12 అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12 బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ఆహా ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లే షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12 విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12సన్ నెక్ట్స్రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12హెబీవో మ్యాక్స్దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 -
ఆ రోజుల్లో రొమాన్స్ కామన్.. ఇప్పుడేమో వేధింపులు: పెద్ది వివాదంపై మధుబాల
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్తో పాటు.. వివాదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్ గ్లామర్ సీన్స్ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్ మూవీ నుంచి తీసేశారు. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్లో మరో నటి కూడా చేరిపోయింది. సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అభ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్ రొమాంటిక్గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు. ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు. -
తీరు మారని బాలయ్య.. బర్త్ డే రోజు కూడా అదే పని
సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కోపంతో ఊగిపోయిన బాలయ్యనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో జరిగిన ఫొటో సెషన్లో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. "వెనక్కి వెళ్లండి" అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.… pic.twitter.com/BlBT0gWpSQ— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెప్పించింది.ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/5p6FrjrmUv— PEDDI (@PeddiMovieOffl) June 11, 2026 -
పాన్ ఇండియా మూవీ.. భయపడిపోతున్న హీరోయిన్లు!
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు సౌత్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ మంత్రం జపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్తో ఈ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ పాన్ ఇండియా జోరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మాత్రం ఒక కొత్త భయాన్ని పుట్టిస్తోంది. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, అందులో తమ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉండడం, ప్రాధాన్యత లోపించడం, పైగా ఆ చిన్న పాత్రల వల్ల అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో... ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ వస్తేనే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకురాగా, అందులో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెరపై ఆమెను చూపించిన తీరుపై సినీ తారలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగించాడు. అయినా కూడా ఈ వివాదం సాగుతూనే ఉంది.జాన్వీ పాత్రపై ఇలా విమర్శలు రావడం రెండోసారి. అంతకు ముందు ఎన్టీఆర్తో కలిసి నటించిన ‘దేవర’లోనూ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంది. అంతేకాదు నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి.ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో అలియా భట్ పాత్రపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలియా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కావడంతో అలియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ఈ పాత్ర నిడివి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది.రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాటలు రిచ్గా ఉంటాయి కానీ, కథ పరంగా చూస్తే హీరో డామినేషన్ ఎక్కువ. ఈ సినిమాలోనూ కియారా పాత్రకు కథను మలుపు తిప్పేంత ప్రాధాన్యత లేకపోవడం, కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కావడంతో బాలీవుడ్ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది. 'కల్కి'లో దీపికా పాత్ర కథకు కీలకమే అయినప్పటికీ, యాక్షన్ అంతా హీరోల చుట్టూనే తిరిగింది.ఇక భారీ అంచనాలతో వచ్చిన డిజాస్టర్గా నిలిచిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’లోనూ హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు. చివరకు ‘గ్లామర్ షో’కే పరిమితం అయ్యారంటూ విమర్శల పాలయ్యారు.పాన్ ఇండియా సినిమాలు భారీ విజయం సాధించినా హీరోయిన్లకు క్రెడిట్ రావడం లేదు, ఒకవేళ క్యారెక్టర్ బాలేకపోతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ భామలు కేవలం 'పాన్ ఇండియా' ట్యాగ్ చూసి మోసపోకుండా, క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. -
'కార్నర్ సీట్.. ఓయో రూమ్.. ఈ రోజుల్లో అంతే'..అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీవాన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్లకు వెళ్లి.. కార్నర్ సీట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రెండుసార్లు షాపింగ్ చేశాక.. నేరుగా ఓయో రూమ్లోనే ఎండ్ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి.ఇది విన్న హీరో విశ్వక్ సేన్.. అంటే ఏంటి సార్ నాకు తెల్వదు అంటూ ఫన్నీగా మాట్లాడారు. మీకు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను చూశారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు.. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారంటూ సరదాగా మాట్లాడారు.కాగా.. హర్షిత్, స్మేహ ప్రధానపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం దీవాన. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఏఏ సినిమాస్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. #VishwanSen: ఈరోజు మీ Oneside Love Story చెప్పాలి...#AlluArvind: ఒక్కటా... రెండా... 😂ఈ మధ్య LOVE:జనం లేని సినిమాలకి వెళ్ళి...2 Shopping లు చేసుకొని..OYO లో End అవుతుంది.. pic.twitter.com/Kv4KvS17sQ— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2026 -
‘సింగ్ గీతం’పై చిరు ట్వీట్
లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన కొత్త మూవీ ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశాడు.‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు..తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీన సింగ్ గీతం సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్..వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ అశ్విన్ కి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్కి,అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు. "శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ… pic.twitter.com/tA6rvr14Il— Chiranjeevi Konidela (@KChiruTweets) June 11, 2026 -
భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ రావట్లేదు.. ఆరోపణలపై వరలక్ష్మీ స్పందన
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్పై దర్శకుడు సంజీవ్ మేగోటి సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ . ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వరలక్ష్మి తమకు సహకరించడం లేదని, లక్షలకు లక్షల డబ్బులు తీసుకొని కూడా ప్రమోషన్స్కి రావడం లేదని ఆయన ఫైర్ అయ్యాడు. దీనిపై తాజాగా వరలక్ష్మీ స్పందించింది. అవసరమైన సమయాల్లో తాను టీమ్ కి అందుబాటులో ఉన్నానని, దర్శకుడి ఆరోపణలపై స్పందించి ఈ వివాదం పెద్దది చేయడానికి తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో ఓ నోట్ పెట్టింది.‘నన్ను దేనికైతే పిలిచారో, వాటన్నింటికీ నేను హాజరయ్యాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు, కాబట్టి వాటిపై పూర్తి అవగాహన లేకుండా స్పందించడం సరికాదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చిత్రబృందం చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదు’ అని వరలక్ష్మీ అన్నారు. అంతేకాదు మరో పోస్ట్లో ‘కొన్ని కుక్కలు అరుస్తాయి. కానీ కరవవు. నేను అరవను.. కానీ కరుస్తా’ అంటూ పరోక్షంగా సంజీవ్కి కౌంటర్ ఇచ్చింది. -
నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా.. రాధిక ఎమోషనల్ పోస్ట్
దర్శక శిఖరం భారతీరాజా మరణవార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధికా శరత్కుమార్. ఆమెను హీరోయిన్గా పరిచయం చేసింది భారతీరాజానే. అందుకే అతన్ని గురువుగా భావించి, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. బుధవారం భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.‘నేను ఇలా ఉన్నానంటే కారణం ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు నా తల్లి, మరొకరు నా గురువుగారు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే నాకు ఇష్టమైన ఇద్దరినీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. హృదయం బరువెక్కింది. వారి జ్ఞాపకాలు, నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి’ అంటూ భారతీరాజాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ‘భారతీరాజా సర్.. మీరే నా సర్వసం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, భారతీరాజాకు కూడా రాధికపై అపారమైన గౌరవం ఉండేది. తన విజయాల్లో రాధిక కూడా భాగమని చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. View this post on Instagram A post shared by 𝑹𝒂𝒅𝒊𝒌𝒂𝒂𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓_𝑭𝑪 (@radikaasarathkumar_fc) -
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంటే..మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా పెద్దిలో జాన్వీ కపూర్ని చూపించిన తీరును తప్పుపడుతున్నారు. (చదవండి: 'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి పెద్ది రిప్లై)ఇప్పటికే జయాబచ్చన్, నిత్యామీనన్, అదా శర్మ లాంటి వాళ్లు దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పెద్ది వివాదంపై స్పందించింది. తన కొత్త సినిమా ‘భారత్ భాగ్య విధాత’సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘సెట్లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది' అని ఆమె అభిప్రాయపడింది. ‘నేను చూసినంతవరకు సినిమాల్లో హీరోయిన్లను ఒక వస్తువుగా చూపించాలని ఏ డైరెక్టర్ అనుకోడు. కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. కొంతమంది మగాళ్లు నాలుగు గోడల మధ్యే కూర్చొని కథను రాసుకుంటారు. వాళ్లకు ఆడవాళ్ల కోణం అర్థం కాదు. రాసిన సీన్ అసభ్యకరంగా ఉంటుందని వాళ్లు గ్రహించలేరు. కాబట్టి, ఒక మహిళగా మీరు మీ దృక్కోణాన్ని పంచుకుంటూ, 'అవును, మాకు ఇలాగే అనిపిస్తోంది,' లేదా 'ఇది చూడటానికి బాగోలేదు' అని చెప్పవచ్చు. చాలా వరకు, వారు మీతో ఏకీభవిస్తారు. అంతేకానీ దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోతే.. మనం కూడా దానికి అంగీకరించినట్లే అవుతుంది’ అని హీరోయిన్లకు కంగనా సలహా ఇచ్చింది. -
భారతీరాజా నెరవేరని కోరిక ఇదే
తన బంధువులందరినీ ఒకే చోటికి పిలిచి, పెద్ద విందు ఏర్పాటు చేసి అందరితో కలిసి సంతోషంగా గడపాలని భారతీరాజా ఆశపడ్డారని, అయితే, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారంటూ బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తేని జిల్లాలోని అల్లి నగరం (కీరైకల్ స్ట్రీట్)లో భారతీ రాజ తల్లిదండ్రులు పెరియమాయ దేవార్, కరుత్తమ్మ నివసించే వారు. భారతీరాజా తోబుట్టువులైన చెల్లెలు భారతి తన అన్నయ్యను గుర్తుచేసుకుంటూ రోదిస్తున్నారు. ‘అన్నయ్యకు తాను అంటే చాలా ఇష్టమని, అందుకే తన అసలు పేరైన చిన్నస్వామిని మార్చుకుని.. తన పేరులోని మొదటి ముక్కను (భారతి), అన్నయ్య జయరాజ్ పేరులోని రెండో ముక్కను (రాజా) కలిపి ’భారతీరాజా’ అని పేరు మార్చుకున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, నాటకాలు వేయడం ఆయనకు అలవాటు‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.కుమారుడి మరణం.. గుండెకోతఆయన బంధువులు సుబ్బురాజ్, రవి మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సొంత ఊరికి, తను చిన్నప్పుడు పెరిగిన ఇంటికి తరచూ వచ్చేవారన్నారు. గతంలో కంబమ్ ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబ వేడుకకు వచ్చినప్పుడు బంధువులందరినీ చూసి ఎంతో సంబరపడ్డారని పేర్కొన్నారు. సొంత వాళ్లందర్నీ పిలిచి ఒక పెద్ద విందు ఇవ్వాలని ఎప్పుడూ అనేవారని, కుమారుడు మనోజ్ మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారన్నారు. దాంతో ఆ విందు కోరిక నెరవేరకుండానే నిష్క్రమించారు అని పేర్కొన్నారు.తోటలోనే అంత్యక్రియలు..తాను మరణిస్తే తేని జిల్లాలోని దేవదానపట్టి కాట్రోడ్ పరిసరాల్లో ఉన్న తన సొంత తోటలోనే(ఫామ్ హౌస్) అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన తరచూ చెప్తుండేవారని, ఆయన చివరి కోరిక మేరకే భౌతికకాయాన్ని తేని జిల్లాకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు. తాజాగా భారతీ రాజాతీ అల్లి నగరం లాంటి చిన్న పల్లెటూరులో విషాదం నెలకొంది. బంధువులు, తేని జిల్లా ప్రజలను, ఆయన అభిమానులను తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. ఈరోజు సాయంత్రం తేని బంగళామేడు ప్రాంతంలో జిల్లా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. -
దర్శక శిఖరానికి ప్రముఖుల నివాళి
ప్రముఖ దర్శకుడు భారతీ రాజా బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవి వారి మాటల్లోనే...భారతీరాజా గారి ప్రతిభ, ఆయన సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి, వారి ఎదుగుదలకు, సినీ పరిశ్రమ మనుగడకు కారణమైన మహోన్నత వ్యక్తి. ఆయన సృష్టించిన అద్భుత దృశ్యకావ్యాలను ఎప్పటికీ మరువలేం. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చూడాలనుకున్నాను... కోలుకుంటారని భావించాను. ఆయన జీవించి ఉన్నప్పుడు చూడలేక పోవడం బా«ధగా మిగిలింది. – రజనీకాంత్భారతీయ సినిమా గొప్ప కథకుల్లో ఒకరైన భారతీరాజాగారిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన శాశ్వతంగా నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. భారతీరాజాగారి సినిమాలు తరాలుగా సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలోని ‘ఆరాధన’ చిత్రంలో పులిరాజు పాత్రలో నటించే అదృష్టం నాకు కలిగింది. – చిరంజీవిభారతీరాజాగారి మరణం బాధగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో నా స్నేహం, ఆయన కళ ఎప్పటికీ జీవించే ఉంటాయి. – కమల్హాసన్ప్రజలకు నాతో ఎలాంటి అనుబంధం ఉందో, భారతీరాజాగారితోనూ అలాంటి అనుబంధమే ఉంది. ఈ రెండూ వేర్వేరు కాదు. దేశాన్ని, దేశ ప్రజలను, కళాకారులను ప్రేమించడమే నా జన్మ హక్కు... అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. – ఇళయరాజాతన సహజమైన, రాజీపడని కథనంతో సినిమా రంగంలో విప్లవం సృష్టించిన నిజమైన మార్గదర్శకులు భారతీ రాజాగారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన వెండితెరపైకి తీసుకు వచ్చిన వాస్తవికత ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం, అలాగే వాటిని వేడుక గా జరుపుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. – రాజమౌళిగ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలు, టీనేజర్స్ మధ్య ఉండే ఆకర్షణలు... వంటి అంశాలను చూపించడంలో భారతీ రాజాగారి శైలి ప్రత్యేకమైనది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్తోనూ ప్రేక్షకులను మెప్పించారు. – పవన్ కల్యాణ్భారతీ రాజాగారు తన దూరదృష్టి, అద్భుతమైన కథాంశాలు, భారతీయ సినిమాకు అందించిన విశేష సేవలతో ఎప్పటికీ నిలిచిపోయే ఒక నిజమైన లెజెండ్. – అల్లు అర్జున్ భారతదేశానికి అతి పెద్ద మహిళా సూపర్ స్టార్ శ్రీదేవిని అందించడమే కాకుండా, సత్యజిత్ రేగారి వాస్తవికతను, ముఖర్జీగారి పాత్రలను, చటర్జీగారి సందర్భోచిత హాస్య శైలిని అద్భుతంగా మిళితం చేశారు భారతీ రాజాగారు. అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని రకాల జానర్స్లో ఎంతో సహజత్వంతో కూడిన సినిమాలను రూపొందించిన నిజమైన అద్భుత దర్శకుడు ఆయన. – రామ్గోపాల్ వర్మతమిళ గ్రామాల్లోని ప్రేమను, జీవకళను మీలాగా మరెవ్వరూ తెరపై ఆవిష్కరించలేరు. నా సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామాలకు చేర్చినందుకు, అక్కడి ప్రజల జీవన గాథలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. – ఏఆర్ రెహమాన్నన్ను సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మా అమ్మ అయితే, మరొకరు నా గురువు భారతీ రాజాగారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ ఇద్దర్నీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. నా హృదయం బాధతో భారంగా అనిపిస్తోంది. భారతీ రాజాగారి, మా అమ్మగారి జ్ఞాపకాలు, వారు నేర్పిన జీవితపాఠాలు నా జీవితాంతం నాతోనే ప్రయాణిస్తాయి. – రాధికా శరత్కుమార్భారతీరాజాగారు చనిపోయారని తెలిసినా ఓ షూటింగ్లో ఉండటం వల్ల నేను, అలీగారు చెన్నైకి వెళ్లలేకపోయాం. నా తొలి చిత్రం ‘సీతాకోక చిలుక’లో నేను, అలీగారు కలిసి పని చేశాం. ఇన్నేళ్లకు భారతీరాజాగారు మనల్ని వదిలి వెళ్లే సమయంలో మేమిద్దరం కలిసి నటిస్తుండటం మాటల్లో చెప్పలేను. ఈ రోజు ముచ్చర్ల అరుణ అనే నేను నటిగా జనాలకు తెలుసు అంటే అందుకు కారణం భారతీ రాజాగారే. – అరుణఈ రోజు నేను ఒక నటిగా ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం భారతీ రాజాగారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల హృదయాలపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు. – రేవతినన్ను సినీ రంగానికి పరిచయం చేసిన భారతీ రాజాగారిని కోల్పోవడం ఎంతో ఆవేదనగా ఉంది. – సుకన్య -
ఆత్మబంధూ.. సెలవ్
స్టూడియో గోడల మధ్య మగ్గుతున్న తమిళ సినిమాకు నాలుగు దిక్కులా కిటికీ తెరిచిన ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) భారతీ రాజా కన్నుమూశారు.‘సీతాకోకచిలుక’, ‘తూర్పు వెళ్లే రైలు’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఎర్ర గులాబీలు’... తన కథలతో వెండితెరపై కవిత్వం చేశారు. పెద్ద పెద్ద స్టార్లు ఆయన చేతిలో పాత్రలయ్యారు. విగ్గుల వేషాలు అసలు సిసలు పల్లెటూరి మనుషులయ్యాయి. నేడు భారతీరాజా లేరు. కానీ ఆయన సినిమాల్లోని పల్లెటూరి గాలి ప్రేక్షకులను తాకుతూనే ఉంటుంది. వరి చేల మీది సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన మనిషి మనతో మాట కలుపుతూనే ఉంటాడు.‘ఎన్ ఇనియ తమిళ్ మక్కళే...’ ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అని తన ప్రతి సినిమా మొదట్లో పలకరించే భారతీ రాజా ఇక పై అలా పలకరించరు. దర్శకులకే దర్శకుడిగా, వెండితెరకు మట్టి పరిమళం అద్దినవాడిగా, భావుకునిగా, కెమెరాతో కవిత్వం రాసే పిపాసిగా కోట్లమంది ప్రేక్షకుల అభిమానం పొందిన భారతీ రాజా స్వర్గలోకంలో విలేజ్ కాటేజీ బయట నులక మంచం పై విశ్రమించడానికి వెళ్లిపోయారు. గొంగళిపురుగు వంటి సమాజాన్ని తన కథల స్పర్శతో సీతాకోక చిలుకగా మలిచేందుకు తపించిన భారతీ రాజా మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ధ్రువతార లేని ఆకాశమైంది. భారతీ రాజా కథ ఎప్పుడూ పల్లెకే పరుగులు తీసింది, కానీ ఆ పల్లె అమాయకత్వానికి పూసిన పూత కాదు... ఆ పల్లెలో దుమ్ము ఉంది, దగా ఉంది, దాహం ఉంది.చిన్నసామి పెరియమాయ దేవర్ (85) 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. చిన్నసామికి చిన్నప్పుడే కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పి. పుల్లయ్య, ఎం. కృష్ణన్ నాయర్ తదితర దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. ‘16 వయదినిలే’ (1977) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పోస్టర్లో చిన్నసామి పేరు ‘భారతీ రాజా’ అని ఉంటుంది. తమిళ ప్రముఖ కవి సుబ్రమణ్య భారతియార్ అంటే ఉన్న ఇష్టంతో తన స్క్రీన్ నేమ్ని ‘భారతీ రాజా’గా పెట్టుకున్నారు.పదహారేళ్ల వయసు ప్రేమఒక అందగత్తె, ఓ అమాయకుడికి ముడిపెట్టిన కథ ‘16 వయదినిలే’. ఈ పల్లెటూరి కథలో అందగత్తెని పొందాలని పోకిరీలు ఎదురు చూస్తుంటారు. అమాయకుడైన పశువుల కాపరికి ఆమె అంటే ఇష్టం ఉన్నా చెప్పడు. దుర్మార్గుడి చేతిలో ఆమె జీవితం బలి కాకుండా హత్య చేసి, జైలుకి వెళతాడు కాపరి. ‘తిరిగొస్తా’ అని ఆమెకు మాటిస్తాడు. ఈడూ జోడూ బాగాలేకపోయినా ఈ ఇద్దరూ ఒకటైతే బాగుండు అని ప్రేక్షకులు ఆ ప్రేమను ఫీలవుతారు. అందుకే ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు తెచ్చింది. మరి... ‘సెంధూర పూవే’ (సిరిమల్లె పువ్వా...) అంటూ ఆమె పాడిన పాటను అంత సులువుగా మరచిపోగలమా! కమల్హాసన్ (అమాయకుడు), రజనీకాంత్ (విలన్ షేడ్ ఉన్న పాత్ర), శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తెలుగులో చంద్రమోహన్, మోహన్బాబు, శ్రీదేవి కాంబినేషన్లో ‘పదహారేళ్ల వయసు’గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొంది, హిట్ అయింది. హిందీలో ‘సోల్వా సావన్’గా భారతీ రాజా దర్శకత్వంలోనే తెరకెక్కి, విజయం సాధించింది.ప్రేమ ప్రయాణంఒక రైలు ఇద్దరి ప్రేమికులకు రాయబారిగా మారుతుంది. పరిస్థితులు అనుకూలించక పట్టణం వెళ్లే యువకుడు, పల్లెటూరిలో మిగిలిపోయిన అతని ప్రేయసి... ఈ ఇద్దరూ వచ్చే పోయే రైలు వెనక ప్రేమ సందేశాలు పంపించుకుంటారు. అయితే ఆ యువతి మీద బావ కన్నేస్తాడు. ఆచారం పేరు చెప్పి, ఆ యువతి నగ్నంగా గ్రామంలో తిరగాలని నిబంధన పెడతారు. అలా ఆ యువతి తిరుగుతున్న సమయంలో ఆ యువకుడు యువతితో సహా రైలు ఎక్కుతాడు. ఈ రైలు ప్రయాణంతో ప్రేక్షకుల మనసు కూడా ప్రయాణించింది. అందుకే ఈ సినిమా ఏడాది ఆడింది. కథానాయికగా పరిచయమైన రాధికకి మంచి పేరొచ్చింది. తెలుగు హీరో సుధాకర్ కూడా తమిళ ప్రేక్షకుల ప్రేమను పొందారు. ఈ చిత్రం తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ పేరుతో బాపు దర్శకత్వంలో జ్యోతి, మోహన్ కాంబినేషన్లో రీమేక్ అయి, ఘనవిజయం అందుకుంది. ‘పల్లె ప్రేమకథా చిత్రాలే తీయగలడు’ అని భారతీ రాజా మీద ముద్ర వేశారు. కానీ తనలో ఇంకో కోణం ఉందన్నారు భారతీ రాజా.థ్రిల్ జర్నీకమల్హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘సిగప్పు రోజాక్కళ్’ మొదలుపెట్టారు భారతీ రాజా. స్త్రీలను ద్వేషించే ఒక సైకో కిల్లర్ వాళ్లని ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుని క్రూరంగా చంపేస్తుంటాడు. అలా ఒక అమ్మాయిని వలలో వేసుకుని, పెళ్లాడతాడు, సహజంగానే ధైర్యవంతురాలు, తెలివిగల అమ్మాయి కావడంతో తన భర్త ఒక సీరియల్ కిల్లర్ అని కనిపెడుతుంది. చివరికి తన ప్రాణాలను కాపాడుకుని, ఆ సైకో బారి నుంచి ఎలా బయటపడింది? అనేది కథ. భారతీ రాజా ‘అర్బన్ మూవీ’స్ కూడా తీయగలడని ఈ సినిమాతో అనిపించుకున్నారు. ఈ సినిమాలోని పాటల్లో ‘నినైవో ఒరు పరవై’ ఒకటి. అంటే... ‘జ్ఞాపకం ఒక పక్షిలాంటిది’ అని అర్థం. పక్షిలా ఈ సినిమా నలు దిక్కులకూ వెళ్లి, ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది. తెలుగులో ‘ఎర్ర గులాబీలు’, హిందీలో ‘రెడ్ రోజ్’గా రీమేక్ అయింది. ‘సిగప్పు రోజాక్కళ్’ తర్వాత నూతన తారలతో ‘నిళల్గళ్’ సినిమా తెరకెక్కించారు భారతీ రాజా. ముగ్గురు నిరుద్యోగ యువకుల కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలోని పాటల్లో ‘ఇదు ఒరు పొన్ మాలైæపొళుదు’ ఒకటి. అంటే... ‘ఇదొక బంగారంలాంటి సాయంత్రం’ అని అర్థం. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించే యువకుడు ఆశాభావంతో పాడుకునే ఈ పాటకు ఇళయరాజా ఇచ్చిన బీట్ కుర్రకారు హార్ట్ బీట్కి దగ్గరైంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్తో...కమల్హాసన్, మాధవిలతో ‘టిక్ టిక్ టిక్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశారు భారతీ రాజా. అయితే ఇది హాలీవుడ్ బి గ్రేడ్ ఫిల్మ్లా ఉందనే విమర్శలు ఎదురయ్యాయి. కానీ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ తరహాలో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ చిత్రంలో మాధవి ‘స్విమ్ సూట్’ ధరించడం అప్పట్లో ఓ సంచలనం.సాగర సంగమమే...సాగరంలో ఎన్నో నదులు కలుస్తాయి. విడదీయలేని కలయిక అది. కట్టుబాట్లను తెంచుకుని, విడదీయలేనంతగా తమ ప్రేమను పండించుకోవాలనుకుంటుంది ఓ జంట. అదే ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ (సీతాకోక చిలుక). ఈ సినిమాలో ‘సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే’ పాట ప్రేక్షకులతో మమేకమైపోయింది. తమిళంలో కార్తీక్, రాధ జంటగా నటించిన ఈ సినిమాలో సిల్క్ స్మితను సంప్రదాయ గృహిణిగా చూపించారు భారతీ రాజా. అలాగే బాల నటు డిగా అలీకి మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. తెలుగు ‘సీతాకోక చిలుక’తో అరుణ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు వెర్షన్లో జంధ్యాల సంభాషణలు ఆకట్టుకున్నాయి.మన్ వాసనైతో మరో హిట్భారతీ రాజా నుంచి వచ్చిన మరో హిట్ ప్రేమకథ ‘మన్ వాసనై’. మేనమామ, మేనకోడలి ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. గాజులు అమ్ముకుంటున్న పాండియన్ని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. రేవతి కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ, సుహాసిని జంటగా ‘మంగమ్మగారి మనవడు’ పేరుతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించింది.ఆత్మతో ముడిపడిన ప్రేమఅప్పటివరకూ భారతీ రాజా సినిమాల్లోని ప్రేమికులు ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. కానీ, మనసు నిండా ప్రేమ నింపుకుని, మాటల్లో చెప్పుకోని ఓ ప్రేమ జంటని చూపించారు భారతీ రాజా. అదే ‘ముదల్ మరియాదై’. 60 ఏళ్ల వ్యక్తి, అందులో సగం వయసు కూడా లేని ఓ యువతి మధ్య ప్రేమ ఉంటుంది. ఇక్కడ భౌతికపరమైన ప్రేమ వెనక్కి వెళ్లిపోతుంది. ఆత్మతో పెనవేసుకున్న ప్రేమతో శివాజీ గణేశన్, రాధ కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘ముదల్ మరియాదై’ సూపర్ డూపర్ హిట్. ‘ఆత్మ బంధువు’గా తెలుగులో విడుదలై, ఘనవిజయం సాధించింది. మరణం అంచుల్లో ఉన్న ఆ మూగ ప్రేమికుడు... ప్రేయసి కనపడ్డాకే కన్ను మూస్తాడు... ఎంత గొప్ప ప్రేమ. తర్వాతి తరంతోనూ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత కుల వివక్ష నేపథ్యంలో దగ్గుబాటి రాజా, అమల కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘వేదమ్ పుదిదు’ ఓ సంచలనం. దగ్గుబాటి రాజా, మహేశ్వరితో ‘కరుత్తమ్మ’ తీశారు.తెలుగులో ‘కొత్త జీవితాలు’తో...తెలుగులో హరిప్రసాద్, సుహాసిని కాంబినేషన్లో ‘కొత్త జీవితాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీ రాజా. తమిళంలో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పుదియ వార్పుగళ్’కి ఇది రీమేక్. అలాగే తమిళంలో సత్యరాజ్, రేఖ జంటగా తాను తెరకెక్కించిన ‘కడలోర కవిదైగళ్’ని తెలుగులో మాస్ హీరో చిరంజీవితో ‘ఆరాధన’గా తెరకెక్కించారు. ఒక టీచర్కి, నిరక్షరాస్యుడికి మధ్య సాగే ప్రేమతో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇంకా సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్, తెలుగు, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాలు తెరకెక్కించారు భారతీ రాజా. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘మీండుమ్ ఒరు మరియాదై’ (2020). ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. భారత చలన చిత్ర సీమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. భారతీ రాజాకు రీప్లేస్మెంట్ లేదు... మట్టి కథలకు ప్రాధాన్యం ఇచ్చి, మట్టి పరిమళాన్ని వెండితెరపై వెదజల్లి, భౌతికంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిన భారతీ రాజా ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉంటారు. ‘ఆర్’ అక్షరంతో నామకరణంవిజయశాంతి, రాధిక, రాధ, రేవతి, రేఖ, రంజిత, రతి అగ్నిహోత్రి, ముచ్చెర్ల అరుణ, ప్రియమణి... ఇలా పలువురు కథానాయికలను పరిచయం చేశారు భారతీ రాజా. ఆయన తెరకెక్కించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’తో విజయశాంతి నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగులో లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు. అలాగే తాను పరిచయం చేసిన కథానాయికల పేరు మార్చాల్సి వస్తే... ‘ఆర్’ అక్షరం ఉండేలా చూసేవారు భారతీ రాజా.నటుడిగా...నటుడిగానూ భారతీ రాజా రాణించారు. తాను దర్శకత్వం వహించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’లో దర్శకుడి పాత్ర చేశారు. మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. శింబు ‘ఈశ్వరన్’ లో, ధనుష్ ‘తిరు’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో భారతీ రాజా నటించిన చివరి చిత్రం ‘పులవర్’ విడుదల కావాల్సి ఉంది. చివరిగా ఆయన మలయాళంలో ‘తుడరుమ్’లో కనిపించారు. అలాగే విజయన్, త్యాగరాజన్, మణివణ్ణన్ వంటి వారికి ఒక్కో సినిమాకి డబ్బింగ్ కూడా చె΄్పారు. ‘కరుత్తమ్మ’లో ‘కాడు పొట్టకాడు...’ అనే పాట పాడారు. బుల్లితెరకు ‘తేకత్తి పొన్నుమ్, అప్పనుమ్ నానుమ్’ వంటి సీరియల్స్కి, ‘మోడర్న్ లవ్ చెన్నై’ అనే వెబ్ సిరీస్లోని ఓ ఎపిసోడ్కి దర్శకత్వం వహించారు.తనయుడి మరణంతో మనోవేదన1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు భారతీ రాజా. కుమారుడు మనోజ్కుమార్, కుమార్తె జననీ వీరి సంతానం. తండ్రి దర్శకత్వం వహించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో మనోజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ‘విజిల్, పవిత్ర, మార్గళి తింగళ్’ చిత్రాలను రూపొందించారు. 2006లో తన స్నేహితురాలు, నటి నందనని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, 2025లో గుండెపోటుతో మనోజ్ కన్ను మూశారు. కుమారుడి మరణంతో భారతీ రాజా మనోవేదనకు గురయ్యారు. మనోజ్ మరణం ఆయన్ను బాగా కుంగదీసింది.దర్శక శిఖరానికి ఆరు జాతీయ అవార్డులుభారతీయ చిత్ర సీమకు చేసిన ఎనలేని సేవలకు గాను భారతీ రాజాను ఎన్నో అవార్డులు వరించాయి. ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదు ఆయన సొంతం. 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారాయన. ‘సీతాకోకచిలుక’, ‘ముదల్ మరియాదై’, ‘వేదమ్ పుదిదు’, ‘కరుత్తమ్మ’, ‘అంది మందారై’, ‘కడల్ పూక్కళ్’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఇంకా తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, ఇతర అవార్డులు అందుకున్నారు. ‘సీతాకోక చిలుక’కి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది.– డి.జి. భవాని -
ప్రభాస్తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం. -
'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి రామ్ చరణ్ రిప్లై
అల్లు అర్జున్ పెద్ది రివ్యూకు రామ్ చరణ్ స్పందించారు. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం మాకు టీమ్కు చాలా ప్రత్యేకమన్నారు. మీ సినిమా రాకా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇటీవల పెద్ది వీక్షించిన అల్లు అర్జున్ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులతో అలరించాడని అన్నారు. నా బ్రదర్ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడని ప్రశంసించారు. జాన్వీ కపూర్, జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. చరణ్ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు.ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Thank you, Bunny @alluarjun ❤️Your wishes mean a lot to me and the entire #Peddi team.Lots of love. Looking forward to #Raaka ❤️ https://t.co/I3cq8lmhf5— Ram Charan (@AlwaysRamCharan) June 10, 2026 -
రాజకీయాల్లోకి సూపర్ స్టార్ అల్లుడు.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని రుజువైంది. ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్కు మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎంజీఆర్ కూడా సినీ రంగ నుంచే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈనెల 12న పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారు. అయితే తాజాగా సూపర్స్టార్, తలైవా అల్లుడు వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో కలిసి అడుగులు వేయనున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కె. అన్నామలై కొత్తగా ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమంలో వైశాగన్ పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ తమిళనాడుతో ఆసక్తికరంగా మారింది. ఇది రజినీకాంత్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం అన్నామలై ద్రవిడ నాట సరికొత్త రాజకీయశక్తిగా అవతరించనున్నారు. రజినీకాంత్ అల్లుడు వైశాగన్ అన్నామలే ఉద్యమంతో చేరడంపై తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. సూపర్స్టార్ రజనీకాంత్తో ఆయనకున్న సంబంధం.. తమిళనాడులో వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల ఆయన రాజకీయ ఎంట్రీపై ప్రజల్లో చర్చ మొదలైంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలకు వైశాగన్ చేరిక బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గతంలో రజనీకాంత్ స్వయంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాగన్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
రామ్ చరణే వచ్చాడు.. మీరెందుకు రారు మేడం?.. వరలక్ష్మిపై డైరెక్టర్ ఫైర్
సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని సినిమా ప్రమోషన్స్కు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిర్మాతల బాధలు తనకు తెలుసని అన్నారు. ఈ బాధ ఆమెకు కూడా తెలుసన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్కు రాకుండా ఆపేశారని ఆరోపించారు.డబ్బులు తీసుకుని ప్రెస్మీట్కు రాకపోవడమేంటని సంజీవ్ ప్రశ్నించారు. ప్రెస్మీట్కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నానని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూవీ షూటింగ్కు ఆమె సహకరించారు.. కానీ ప్రమోషన్స్ ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. ఆమెకు షూటింగ్లో చేతికి గాయం అయితే కూడా మేమే కాంప్రమైజ్ అయ్యామని తెలిపారు.రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పెద్ది మూవీ కోసం ప్రమోషన్స్లో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. మీడియా ముందుకొచ్చి రామ్ చరణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు చాలా గ్రేట్.. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని అన్నారు. మీరెందుకు రారు వరలక్ష్మి శరత్కుమార్ గారు అని ఆమెను డైరెక్టర్ ప్రశ్నించారు. డబ్బుల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు కాల్ చేస్తాడని.. ఆమె మాత్రం ప్రమోషన్స్కు రాదన్నారు. కాగా.. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో పోలీస్ కంప్లైంట్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది వివాదం.. జాన్వీ కపూర్ రోల్పై ఆదా శర్మ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్ రోల్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్ మరింత ఓవర్గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. -
మా సినిమాలో ‘ట్రాన్స్ జెండర్స్’ కష్టాలను చూపించాం: సునీల్ కుమార్ రెడ్డి
‘సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అవి పోలీస్ స్టేషన్స్ లో కేసులుగా నమోదు కావడం లేదు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్ జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఫస్ట్ టైమ్ ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ సినిమాలోనే ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నాం’ అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత పి.సునీల్ కుమార్ రెడ్డి. రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒక కొత్త తరహా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకులు మా సినిమాకు రావొచ్చు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కింది. ఫిలిం ఫెస్టివల్స్ కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దు. జనాల మధ్యలో డిస్కషన్ కు రావాలి అనేది మా ఉద్దేశం. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిది. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం’ అన్నారుతెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ - మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. మేము నటులము కాము. కానీ మా జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేము ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేము సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అన్నారు.గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్ ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్ గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను. ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్ తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాము. అన్నారు.ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ..మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు. మేము ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు. -
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇవాళ బాలయ్య బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎన్బీకే111 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్లో నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్పై ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ ఫైట్ సీన్ చూస్తుంటే మరో యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీతో ఫైట్ సీన్ మరి ఓవర్గా అనిపిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
'అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్య.. అయినా భారతీ రాజా వినలేదు'
దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.అనారోగ్యంతోనే షూటింగ్..తుడరుమ్ మూవీ సెట్స్పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.భారతిరాజా కెరీర్..దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది. ఆయన 1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు. -
దర్శక దిగ్గజానికి దర్శకధీరుడు నివాళి
దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు. Bharathiraja garu was a true pioneer who revolutionized cinema with his raw and uncompromising storytelling. Those unforgettable rural narratives, that fearless vision and the authenticity he brought to the screen will live on forever.It was an honour to witness and celebrate…— rajamouli ss (@ssrajamouli) June 10, 2026 -
ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్గా వస్తోన్న ఈ మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్గా ఉండనుంది. స్పై యూనివర్స్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ కీలక పాత్ర పోషించారు. -
'దృశ్యం-3 తెలుగు రీమేక్.. ఆ ఒక్క కారణంతో ఆపేశాం'
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన థ్రిల్లర్ మూవీ దృశ్యం-3. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మే 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో రిలీజైన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.అయితే దృశ్యం-3 మాత్రం తెలుగులో డబ్బింగ్ చేసి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ రీమేక్ చేయకపోవడంపై సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. దృశ్యం-3 మూవీని తెలుగులో రీమేక్ చేయడం లేదని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇతర భాషల్లోని హీరోల ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం రీమేక్ జరుగుతోందని తెలిపారు. ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారని.. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ మార్చుకుంటామని మర్యాదపూర్వకంగా అడిగారని వెల్లడించారు. అందుకే తాను రీమేక్ చేసేందుకు అంగీకరించినట్లు జీతూ వెల్లడించారు. దీంతో తెలుగు రీమేక్పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
భారతీరాజా, రజనీకాంత్ మధ్య వివాదం ఏంటి? అసలేం జరిగింది?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్స్టార్ రజనీకాంత్తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.కావేరీ జలవివాదంతో మొదలు.. రజనీకాంత్, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్ స్టార్గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా.. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు. చివరిదశలో ఇలా.. భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు. -
చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!
భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్నెస్, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్డమ్ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్ను మరోసారి చాటుకున్నాడు.భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.క్రికెటర్ల ఆధిపత్యంఈ ర్యాంకింగ్స్లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్నెస్ ఐకాన్గా ఆయనకున్న ఇమేజ్, ఇన్స్టాగ్రామ్లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచడంలో కీలక పాత్ర పోషించడం, ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.చదవండి: సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు! -
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


