breaking news
Movies
-
అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ఈమె కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా.. రష్మిక మందన్న సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలలో రూ.4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.కొడగు జిల్లాలోని విరాజ్పేటకు చెందిన రష్మిక.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈమె తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు.విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లిహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ.. వారు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26న విజయ్ - రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?) -
ఆహా ఓహో..అస్సలు సినిమా ముందుంది అంటున్న ఐశ్వర్య!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు చెదిరే టికెట్ ధరల పెంపు కోసం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ముందురోజు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వేసే స్పెషల్ షో కోసం ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలానే జనవరి 9 నుంచి తర్వాత పదిరోజుల పాటు కూడా భారీగా పెంపు ఇచ్చింది.రిలీజ్ రోజు (జనవరి 09) నుంచి తర్వాత 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్ల్లో రూ.200 వరకు ఒక్కో టికెట్పై పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ చిత్ర నిర్మాతలు.. హైకోర్టు నుంచి టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు.దాదాపు రెండు మూడేళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. -
'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం
చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి థియేటర్లలోకి రానుంది. అయితే ఈయన గత చిత్రం 'భోళా శంకర్'.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం రిలీజైంది. ఇది చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)'భోళా శంకర్ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యింది ఏంటంటే.. సోషల్ మీడియాలో కొందరు డెకాయిట్లు ఉంటారు కొందరు. వీళ్లు ఏంటంటే టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. చేసినోడే నాకు ఇదంతా చెప్పాడు. చివరకు ఏమైంది ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తున్నారు' అని అనిల్ సుంకర అన్నారు.ఫ్లాప్ అవ్వడానికి ఇతర కారణాలు కూడా చెబుతూ.. 'మొదటగా అది రీమేక్. కొవిడ్ కంటే ముందే మొదలుపెట్టాం. కానీ కొవిడ్ టైంలో ఒరిజినల్ సినిమాని అందరూ చూసేశారు. ఏదైతే బిగ్గెస్ట్ పాయింట్ అనుకున్నామో అది రిలీజ్ టైంకి వచ్చేసరికి మైనస్ అయింది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చిరంజీవి ఒకేసారి మూడు మూవీస్ మొదలుపెట్టారు. వాటిలో మాది చివరగా రిలీజైంది. లాస్ట్ అయ్యేసరికి ఈలోపు ఒరిజినల్ అందరూ చూసేశారు. ఆ ప్రభావం కూడా ఫలితంపై పడింది. అలానే విడుదలకు ముందే ఫ్లాప్ అనేది ముందే క్రియేట్ చేశారు' అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్)'భోళా శంకర్' విషయానికొస్తే.. తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' రీమేక్గా దీన్ని తీశారు. చిరంజీవి హీరోగా, చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. అయితే తొలిరోజు తొలి ఆటకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు.ఇకపోతే అనిల్ సుంకర్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా నటించగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జనవరి 14న ప్రీమియర్లతో ఇది థియేటర్లలోకి వస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే 'భోళా శంకర్' ఫ్లాప్ గురించి అనిల్ సుంకర స్పందించారు. (ఇదీ చదవండి: హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట) -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో కాస్త హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రం జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలోకి రానుంది.రవితేజ కెరీర్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. ధమాకా, క్రాక్.. కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయాడు. మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కాస్త కుదురుకోవాలంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పక్కా హిట్ కొట్టాల్సిందే. మరి ఈసారి రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? -
‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?
జనవరి 9... ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న డేట్ ఇది. ఆ రోజే ‘ది రాజాసాబ్’ థియేటర్స్లోకి రాబోతున్నాడు. రిలీజ్కి ఒక్క రోజు ముందే అంటే జనవరి 8న ప్రీమియర్స్తో ప్రభాస్ అబిమానుల సందడి ప్రారంభం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ ఫాంటసీ మూవీ కావడంతో రాజాసాబ్(The Raja Saab)పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.పట్టుమని పది కూడా లేవు.. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. కానీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మాత్రం పట్టుమని పది కూడా లేవు. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటివకు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ, దురంధర్ చిత్రాలు మాత్రమే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే ఇవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. పాన్ ఇండియా ప్రేక్షుకులు మెచ్చే కంటెంట్తో విజువల్ వండర్స్గా వాటిని తెరకెక్కించారు. కానీ ది రాజాసాబ్ హారర్ కామెడి ఫాంటసీ. ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ రాజాసాబ్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి హారర్-రొమాంటిక్ ఎంటర్టైనర్గా చరిత్రకెక్కుతుంది.ఆశలన్నీ ప్రభాస్పైనే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా రూ. వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే..బాక్సాఫీస్ షేక్ అవ్వాలిసందే. ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు(బాహుబలి 2: రూ.1800 కోట్లు, కల్కి: రూ.1100 కోట్ల) రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. యావరేజ్ టాక్ వచ్చిన సలార్, సాహో వంటి సినిమాలు కూడా ₹400-700 కోట్ల రేంజ్ లో నిలిచాయి. రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్ల వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు, మూడు వందల కోట్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ ఆయన కెరీర్లో మరో రూ.1000 కోట్ల శిఖరాన్ని చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.రూ. 100 కోట్లు అంత ఈజీకాదు..అయితే రాజాసాబ్ రూ. 1000 కోట్ల క్లబ్ చేరడం మాత్రం అంత ఈజీకాదు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు తెలుగులో మరో ఆరు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడాస్టార్ల పోటీని తట్టుకొని రాజాసాబ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాడనేదానిపై సినిమా ఫలితం ఆదారపడి ఉంటుంది. ప్రభాస్(Prabhas)కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే.. పండగ సీజన్, మిగతా హీరోలతో పోలిస్తే.. పాన్ ఇండియాలో ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. అయితే రాజాసాబ్కి హిట్ టాక్ వచ్చినా.. పుష్ప 2 లాగా కేవలం వారం రోజుల్లో రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమే. ‘ధురంధర్’ లాగా లాంగ్ రన్ సాధిస్తే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల మార్కుని అందుకుంటుంది. (ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలను GrabOn టీమ్ పరిశీలించి, క్రాస్-వెరిఫై చేసి, ధృవీకరించింది) -
ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ వారం కూడా అఖండ 2, అయలాన్, దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్, ప్రీడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా సడన్గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు 'ట్రాన్' ఫ్రాంచైజీ గురించి తెలిసే ఉంటుంది. 1982లో మొదటగా 'ట్రాన్' మూవీ వచ్చింది. 2010లో 'ట్రాన్: లెగసీ' పేరుతో మరో సినిమా రిలీజైంది. గతేడాది అక్టోబరులో 'ట్రాన్: ఏరిస్' పేరుతో మూడోది ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో స్టోరీ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ విజువల్ వండర్ అనేలా సీన్స్ ఉంటాయి. మూడో పార్ట్.. గత నెలలోనే అమెజాన్ ప్రైమ్లోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉచితంగానే చూడొచ్చు. ఈ సినిమాలో ఏఐ అనేది మంచిదా కాదా అనే అంశాన్ని చర్చించడం విశేషం.'ట్రాన్: ఏరిస్' విషయానికొస్తే.. ఎన్కామ్, డీలింగర్ అనే రెండు కంపెనీలు ఉంటాయి. వీళ్లు ఏఐ(కృత్రిమ మేధ) టెక్నాలజీ ఉపయోగించి ఒకరు ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. మరొకరు ఆర్మీ, సైనికులని తయారు చేయాలనుకుంటారు. అయితే ఏఐ ఉపయోగించి ఓ సైనికుడిని తయారు చేస్తారు. అతడే ఏరిస్. మంచి కోసం ప్రాణాలకు తెగించే సైనికుడు. ఇతడి నాశనమైపోయినా సరే మరోదాన్ని సృష్టించుకోవచ్చు. అయితే ఏరిస్కి మనిషిలా బతకాలనే కోరిక పుడుతుంది. ఎమోషన్స్ వస్తాయి. అలాంటి టైంలో ఓ దాని గురించి వెతుకుతుంటాడు. అలానే ఈ రెండు కంపెనీలకు ఓ ప్రోగ్రామ్, ఆల్గారిథమ్ కూడా కావాల్సి వస్తుంది. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. స్టోరీతో పనిలేదు విజువల్స్ బాగుంటే చాలానుకుంటే దీన్ని చూడొచ్చు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన 'అయలాన్' తెలుగు వెర్షన్) -
చాలాకాలంగా సీక్రెట్గా ఉంచా.. మాటలు రావట్లేదు!
తక్కువకాలంలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. క్యూట్ ఫేస్తో, అమాయకపు చిరునవ్వుతో అందరినీ బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటించిన 'పరాశక్తి' మూవీ సంక్రాంతి పండక్కి (జనవరి 10న) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.మాటలు రావుతను ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న విషయం గురించి తొలిసారి స్పందించింది. శ్రీలీల మాట్లాడుతూ.. పిల్లల ప్రస్తావన వస్తే నాకు మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. కిస్ (2019) అనే కన్నడ మూవీ సమయంలో దర్శకుడు నన్ను ఓ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడే ఈ పిల్లలు ఉండేవారు. రహస్యంగానే..మేము ఫోన్లో మాట్లాడేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేదాన్ని. కానీ, ఈ విషయాన్ని నేను చాలాకాలం రహస్యంగా ఉంచాను. అయితే ఆ ఆశ్రమం వాళ్లు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. నిజమే కదా అనిపించింది. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.అమ్మ ప్రేమ పంచుతున్నా..అయితే ఈ జనరేషన్కు నాలాంటివాళ్లు నచ్చకపోవచ్చు. నేను మంచి గర్ల్ఫ్రెండ్ కాకపోవచ్చేమో! అయినా సరే.. నా తల్లి నన్నెంతగా ప్రేమిస్తుందో.. అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రీలీల 2022లో గురు, శోభిత అని ఇద్దరు దివ్యాంగులను దత్తత తీసుకుంది. 2025లో తన బర్త్డేకు ముందు ఓ పసిపాపను దత్తత తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చిన్నారి తన మేనకోడలు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది.చదవండి: చావు తప్ప మరో దారి లేదు: బాలీవుడ్ నటి -
ఆ డైరెక్టర్ భార్యను కొడితే కోమాలోకి వెళ్లింది: పూనమ్ కౌర్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్గా మాట్లాడడం.. పాలిటిక్స్తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి. పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి.(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)తాజాగా పూనమ్(Poonam Kaur ) ఓ యూట్యూబ్ చానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ గతంలో పూనమ్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.‘నేను ఊరికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్కు టచ్ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది. -
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా -
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. -
రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!
హీరో ఫ్రెండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మధునందన్. నిన్నే ఇష్టపడ్డాను, సై, ఇష్క్, గీతాంజలి, గుండెజారి గల్లంతయ్యిందే, రభస, లై, వినయ విధేయ రామ.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తాజాగా 'శంబాల' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరవగా అనేక విషయాలు పంచుకున్నాడు.మధునందన్ మాట్లాడుతూ.. గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. అయితే రెండు సినిమాల షూటింగ్ కోసం వరుసగా ఆరునెలలు అమెరికాలోనే ఉండిపోయాను. దాంతో చాలామంది ఏమనుకున్నారంటే.. ఇంకా ఉద్యోగం చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాననుకున్నారు. ఉద్యోగం వల్ల సరైన టైం ఇవ్వలేననుకున్నారు. దానివల్ల 10-15 సినిమా అవకాశాలు పోయాయి. కానీ అప్పటికే నేను జాబ్ మానేసి చాలాకాలమైంది.మోసపోయా..నా పక్కనే ఉంటూ నా క్యారెక్టర్లు కొట్టేసిన వ్యక్తితో ఇప్పటికీ స్నేహం చేస్తున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్లలా ఒకరిని తొక్కి ఎదగడం నాకు చేతకాదు. అలాంటివాళ్లను పెద్దగా పట్టించుకోను. నా వరకు వస్తే ఓకే, కానీ నన్ను దాటి కుటుంబం జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను.కెరీర్ మొదట్లో ఉద్యోగం, సినిమాలు రెండూ చేశాను. ఓపక్క ఉద్యోగం, మరో పక్క సినిమాలు చేస్తూ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అలా నాలుగేళ్లపాటు కష్టపడి సంపాదించిన రూ.25 లక్షలు బిజినెస్లో పెట్టాను. అప్పుడు ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు. ఉన్న డబ్బంతా పోయింది అని మధునందన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే? -
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్ -
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్థిరపడింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇక్కడివారికి దగ్గరైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది.సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే..జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ 'జననాయకుడు' విడుదలవుతున్నాయి. జనవరి 10న శివకార్తికేయన్ 'పరాశక్తి', జనవరి 12న చిరంజీవి 'మన శంకర్ వరప్రసాద్ గారు', జనవరి 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగ ఓరాజు', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' రిలీజవుతున్నాయి.చదవండి: వయసు గురించి ఆలోచించేదే లేదంటున్న చందమామ -
శివకార్తికేయన్కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్సింగ్లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్ -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ
అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది. -
దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ.. వీడియో రిలీజ్
ప్రముఖ కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. హనుమాన్ మూవీతో తెలుగులో మరింత క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో మెప్పించిన ఈ కోలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది.వరలక్ష్మి శరత్కుమార్ దర్శకత్వ అరంగేట్రం చేస్తోన్న తాజా చిత్రం 'సరస్వతి'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ను అధికారికంగా పూర్తి చేశారు. తాజాగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీతోనే వరలక్ష్మి శరత్కుమార్ దర్శకురాలిగా మారనుంది. ఇది కేవలం ఆమెకు అరంగేట్ర సినిమా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోంది. తన చెల్లెలు పూజా శరత్కుమార్తో కలిసి ప్రారంభించిన 'డోసా డైరీస్' బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా.. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్ నటించడంతో పాటు దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రకాశ్రాజ్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి తమన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
తానున్న చోటే వేడుక...
‘‘అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి... సౌభాగ్య లక్ష్మిపోలిక.., అబ్బాయి మాటకారి... మోహనాంగుడే మరి... తానున్న చోటే వేడుక’’ అంటూ సాగుతుంది ‘భల్లే భల్లే’ పాట. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలోని పాట ఇది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘భల్లే భల్లే’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక... మాయే చేసిందిలే... మంత్రం వేసిందిలే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన పాట ఇది. ఈ పాటలో శర్వా, సాక్షిల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్య, సునీల్, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
ఆదికి శంబాల మంచి బ్రేక్ ఇచ్చింది: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పు తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ల నాన్న సాయి కుమార్లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్గారు తన కొడుకుతో పాటు ‘శంబాల’ టీమ్ మొత్తానికి బ్యాక్బోన్లా నిలిచి, ఈ సినిమా విజయంలో భాగమయ్యారు. ‘శంబాల’ ప్రోమో చూసినప్పుడే ఈ చిత్రం సక్సెస్ అవుతుందని చెప్పాను. అది నిజమైంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శంబాల’.యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. తమ సినిమా మంచి విజయం సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శంబాల’ సినిమాకు పబ్లిక్లో మంచి టాక్ వచ్చి, సక్సెస్ కావడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, క్రిస్మస్ విన్నర్గా నిలిచింది. ఆది కెరీర్లో ‘శంబాల’ 25వ చిత్రం. ఈ మూవీతో తనకి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే మొత్తం యూనిట్కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.‘‘మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ చిత్రం నిరూపించింది. సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జనవరి 9న ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను’’ అని చెప్పారు సాయి కుమార్. ‘‘ఇకపై కెరీర్ను బాగా ప్లాన్ చేసుకుని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘ఆదిగారు లేకుండా ఈ సినిమా లేదు. కొన్ని థియేటర్స్లో మా ‘శంబాల’ సినిమా కంటిన్యూస్గా 11 రోజులు హౌస్ఫుల్తో ప్రదర్శితమైంది’’ అని అన్నారు యుగంధర్ ముని. ‘‘మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పారు మహిధర్ రెడ్డి, రాజశేఖర్. అనంతరం ‘శంబాల’ సినిమా సక్సెస్లో భాగమైన ప్రతి ఒక్కరికీ మెమొంటోలను అందజేశారు ‘దిల్’ రాజు. -
శ్రీరామ నవమికి వారణాసి?
శ్రీరామ నవమి పండగ సందర్భంగా ‘వారణాసి’ సినిమా థియేటర్స్లోకి రానుందట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ యాక్షన్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని 2027 వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు సంగీతదర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇటీవల జరిగిన ‘వారణాసి గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్లో పేర్కొన్నారు. కానీ విడుదల తేదీపై మాత్రం సరైన స్పష్టత రాలేదు.అయితే ఉగాది, శ్రీరామ నవమి పండగల సందర్భంగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ‘వారణాసి’ మూవీలో మహేశ్బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపించనున్నారు. దీంతో శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘వారణాసి’ టైటిల్ టీజర్ను ప్యారిస్లోని ప్రముఖ రే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ థియేటర్లో రజనీ కాంత్ ‘కబాలి’, ప్రభాస్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’, ‘సాహో’ వంటి చిత్రాలను ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే ఓ సినిమా గ్లింప్స్ తరహా టీజర్ను ఈ థియేటర్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ రికార్డ్ను ‘వారణాసి’ దక్కించుకుంది. -
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తీసేశారా?.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ..!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సాక్షిని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించింది. తనను తీసివేశారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు కీలక పాత్ర పోషించే అవకాశముందని సాక్షి వైద్య తెలిపింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి వల్ల నేను వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి మరుసటి రోజే షూటింగ్ ప్రారంభ కానుందని నాతో చెప్పారు. కానీ ఆ పరిస్థితుల్లో నేను డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చింది. సాక్షి వైద్య మాట్లాడుతూ..' తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి తీసేశారని వార్తలొచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక ఆ ఛాన్స్ వదులుకున్నా. కానీ నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పట్టించుకోను' అని తెలిపింది.కాగా.. సాక్షి వైద్య ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఆమె శర్వానంద్ సరసన నటించిన నారీ నారీ నడుమ మురారి జనవరి 14న విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త కూడా హీరోయిన్గా కనిపించనుంది. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ని నేడు గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్బస్టర్గా నిలిచాయి. శర్వానంద్కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ప్రమోషన్స్లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
విజయ్ చివరి సినిమా జననాయగన్ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?
తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్గా వస్తున్న జననాయగన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మంచి డైరెక్షన్ టీమ్ ఉండి ఉంటే తను రాజకీయాల్లోకే వచ్చే వాన్ని కాదని ప్రకటించారు. ఇలా పవన్ ఎలాగైనా తన నాలుకను మడతేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కినా కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజయ్కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది. విజయ్ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండస్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా పదవి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి. -
హనీమూన్ ట్రిప్లో రాహుల్ సిప్లిగంజ్.. నీకసలు సభ్యత సంస్కారం ఉందా?
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్ 27న) గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్.. మ్యారేజ్ తర్వాత ఫుల్గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింట రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈ రోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వొచ్చు కానీ.. రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగంజ్కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి.. ఇలాంటి పనులు కోసం కాదని రాహుల్కు సూచిస్తున్నారు.రాహుల్ సిప్లిగంజ్ నేపథ్యం..రాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
హైకోర్టుని ఆశ్రయించిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ) -
ఎర్ర స్కర్ట్లో జాన్వీ.. డిజైనర్ చీరలో మీనాక్షి
ఎర్ర స్కర్ట్లో అందంగా జాన్వీ కపూర్డిజైనర్ చీరలో మీనాక్షి చౌదరి గ్లామర్చిన్నప్పటి కల నెరవేర్చుకున్న కేతికగులాబీ చీరలో మెరిసిపోతున్న మమితడకాయిట్ షూటింగ్ జ్ఞాపకాలతో మృణాల్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Anand (@priyawajanand) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
గ్యాంగ్స్టర్ నేపథ్యంతో 'రిమ్జిమ్' మూవీ
1990ల్లో ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా 'రిమ్ జిమ్'. అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటించారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు. హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మించారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని చెప్పారు. సాంకేతిక విభాగం విషయానికొస్తే కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతమందించగా.. వాసు పెండం సినిమాటోగ్రఫీ, పెనుమత్స రోహిత్ ఎడిటింగ్ చూసుకున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'గ్యాంగ్స్టర్' ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. -
టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది
టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్ కల్చర్ వరకు మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80స్, 90స్, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్ ది రేడియో స్టార్" అనే పాటనే.. 2025 డిసెంబర్ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ప్లాట్ఫార్మ్లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.ఎంటీవీ ఛానెల్కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు1981లో అప్పటి వరకు మ్యూజిక్ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.1983లో థ్రిల్లర్ ఆల్బమ్లోని బిల్లీ జీన్, బీట్ ఇట్ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్స్టార్గా మారాడు.1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.1985లో ఎంటీవీని వయాకామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.2000లో రియాల్టీ షోస్ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్, లాగునా బీచ్, ది హిల్స్ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్మెంట్ ఛానెల్గా మార్చాయి.2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. -
తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి!
కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫార్మాట్కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ఒకరో ఇద్దరో దర్శకులు మూవీస్ తీస్తుంటారు. వీటికి ఎంత ఆదరణ దక్కుతుందనేది పక్కనబెడితే డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంటూ ఉంటాయి. అలా 2024లో తమిళంలో 'హాట్ స్పాట్' అనే బోల్డ్ మూవీ రిలీజైంది. తర్వాత దాని తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))రెండేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్లో పెళ్లి తర్వాత ఆడపిల్లలే ఎందుకు మరో ఇంటికి వెళ్లాలి? ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి, పిల్లల్ని టీవీ షోలు ఎలా చెడగొడుతున్నాయి అనే స్టోరీలు చూపించారు. నాలుగు కథల ఆంథాలజీ టైపులో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కాస్త డోస్ పెంచి మరో నాలుగు కథలతో మూవీ తీసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.లివ్ ఇన్ రిలేషన్షిప్లో డింక్ (DINK-డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్) కల్చర్... సినిమా హీరోల ఫ్యాన్స్ చేసే అతి తదితర స్టోరీల ఉండనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఇదే ట్రైలర్లో తమిళనాడు ముఖ్యమంత్రి శివకార్తికేయన్, ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి లాంటి డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. ఈ నాయకులిద్దరూ కలిసి విజయ్ కాంత్ విగ్రహావిష్కరణ చేస్తారని ఓ పాత్ర అనడం ఆసక్తికరంగా అనిపించింది. ధోనీ రిటైర్మెంట్, 2026 ఎన్నికల్లో దళపతి గెలుస్తాడా లేదా? లాంటి విచిత్రమైన నిజ-కల్పిత సంఘటనలతో ఈసారి సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ భవానీ శంకర్ కీలక పాత్ర చేసింది. మిగతా వాళ్లెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే) -
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే
ప్రతిసారి సంక్రాంతి బరిలో రెండో మూడో సినిమాలు వస్తుండేవి. ఈసారి మాత్రం డబ్బింగ్లతో కలిపి ఏకంగా ఏడు మూవీస్ బరిలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందోనని హీరోల కంటే అభిమానులకే చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వీళ్లే కాదు దాదాపు 12 మంది హీరోయిన్లు కూడా ఈ పండక్కే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లందరికీ హిట్ చాలా కీలకం.(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్'.. ఈ శుక్రవారం(జనవరి 09) థియేటర్లలోకి రానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. నిధి విషయానికొస్తే తెలుగులో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తోంది గానీ 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ అన్నీ అడియాశలయ్యాయి. చేతిలో ఇది తప్పితే మరొక ప్రాజెక్ట్ అయితే లేదు. హిట్ అయితేనే కెరీర్ పరంగా కాస్త ఫుష్ ఉంటుంది లేదంటే కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి. మాళవిక విషయానికొస్తే.. తమిళ, మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇందులో అందచందాలు చూపించేందుకు అస్సలు మొహమాట పడలేదు. ఇది హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడుతోంది. రిద్ధి కుమార్ విషయానికొస్తే.. గతంలో ప్రభాస్ చేసిన 'రాధేశ్యామ్'లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకుబోతోంది. తెలుగులో ఈమెకు మరో ఛాన్స్ రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే.రాబోయే సోమవారం(జనవరి 12) చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈమె అడపాదడపా తెలుగులో మూవీస్ చేస్తోంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో సరైన హిట్ లేదు. బాలకృష్ణ కొత్త మూవీ కోసం ఈమెని తీసుకున్నారని ప్రకటించారు గానీ ఇప్పుడు బడ్జెట్, కథ మార్పు వల్ల బదులుగా మరో హీరోయిన్ని పెట్టే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయన్ టాలీవుడ్ కెరీర్కి ప్లస్ అవ్వాలంటే చిరు మూవీ హిట్ కావాలి.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)13వ తేదీన రానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్. ఆషిక విషయానికొస్తే కన్నడ అమ్మాయి. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఫ్లాప్. కానీ నాగార్జున 'నా సామి రంగ'లో అవకాశమొచ్చింది. హిట్ అందుకుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో ఇప్పుడీ మూవీతో వస్తోంది. ఈమె నటించిన మరో తెలుగు చిత్రం 'విశ్వంభర' కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ రెండు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డింపుల్ విషయానికొస్తే.. గత ఎనిమిదేళ్లలో తెలుగులో ఆరు మూవీస్ చేసింది. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది హిట్ అయితే మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే అంతే సంగతి!14న రానున్న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి హీరోయిన్. తెలుగులోనే ఈమె హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇదే రోజున శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రిలీజ్ కానుంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంయుక్త కూడా తెలుగులో సర్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హిట్ అందుకుంది. కానీ డెవిల్, అఖండ 2తో ఫెయిల్యూర్స్ చవిచూసింది. ఈ మూవీ హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సాక్షి వైద్యకు కూడా ఈ చిత్రం సక్సెస్ కావడం ముఖ్యమే.డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే.. 9వ తేదీన వచ్చే 'జన నాయకుడు'లో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె తెలుగు తెరకి దూరమై చాలా రోజులైంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో అవకాశాలు రావొచ్చు. అలానే తెలుగు దర్శకుల దృష్టిలోనూ పడొచ్చు. ఇదే మూవీలో మమిత బైజు కీలక పాత్ర చేసింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంటే ఈమెకు దక్షిణాదిలో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. 10వ తేదీన రానున్న 'పరాశక్తి'లో శ్రీలీల హీరోయిన్. ఈమె కూడా తెలుగులో వరస సినిమాలు చేసింది గానీ ఒకటో రెండో మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కాస్త కష్టమవ్వొచ్చు!(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్) -
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక సినిమా 'అయలాన్'. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఓటీటీలోనూ కేవలం తమిళమే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. మరి తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తీసుకొచ్చేస్తున్నారు.శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా 'అయలాన్'. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైంది. అప్పుడే తెలుగు కూడా ప్లాన్ చేశారు. తర్వాత అప్పుడే జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ పలు కారణాలతో విడుదల కాలేదు. తర్వాత తమిళ వెర్షన్ని సన్ నెక్స్ట్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ గురించి ఏ సమాచారం లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)కానీ గత నెల అంటే డిసెంబరులో తెలుగు వెర్షన్ని జీ తెలుగులో ప్రసారం చేశారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అప్డేట్ వచ్చేసింది. ఆహా లో రేపటి(జనవరి 07) నుంచి తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు.'అయలాన్' విషయానికొస్తే.. ఓ మిషన్లో భాగంగా ఏలియన్ భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో(శివ కార్తికేయన్)ని కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్-హీరోకు స్నేహం ఏర్పడుతుంది. సదరు ఏలియన్కి టాటూ అని పేరు కూడా పెడతారు. కొన్ని సంఘటనల వల్ల టాటూ కొందరు వ్యక్తుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? టాటూ, భూమ్మీదకు రావడానికి కారణమేంటి? అనేది మిగతా స్టోరీ. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఏలియన్ కామెడీ చూద్దామనుకుంటే దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్గా ఎలా మారాడు?
తెలుగులో గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ టైంలో 'చికిరి' పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మద్రాసులో పుట్టి పెరిగిన ఇతడు.. దక్షిణాదితో పాటు హిందీలోనూ గత మూడు దశాబ్దాలుగా సంగీతమందిస్తూనే ఉన్నాడు. అయితే రెహమాన్ అసలు పేరు ఇది కాదని మీలో ఎంతమందికి తెలుసు? అవును స్వతహాగా హిందూ అయిన ఇతడు ఇస్లాం మతంలోకి మారాడు. పేరు మార్చుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?)చెన్నైలో 1967 జనవరి 6న ఆర్కే శేఖర్, కస్తూరి దంపతులకు దిలీప్ పుట్టాడు. ఇతడికి ఓ అక్క, ఇద్దరు చెల్లెళ్లు. శేఖర్ సంగీత దర్శకుడు. దిలీప్కి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి శేఖర్ చనిపోయారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పరికరాలని అద్దెకిస్తూ వీళ్లు జీవనం సాగించారు. రెండేళ్లు గడిచేసరికల్లా అంటే 11వ యేటా దిలీప్.. కుటుంబ భారాన్ని మోసేందుకు సిద్దమయ్యాడు. పలువురు సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్, పియానో లాంటివి వాయించడం మొదలుపెట్టాడు. దిలీప్ తల్లికి ఆధ్యాత్మికత ఎక్కువ. ఇంట్లో హిందూ దేవతలతో పాటు ఇస్లాం, క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు కూడా ఉండేవి. తల్లి కస్తూరితో కలిసి నెల్లూరి తడ దగ్గరలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలు వినేందుకు దిలీప్ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఖాద్రీ బోధనలకు వీరు కుటుంబం ఆకర్షితులయ్యారు.తమ కుటుంబానికి అంతా మంచి జరగాలని, కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ దిలీప్ కుటుంబమంతా 1989లో ఇస్లాం మతాన్ని సీక్వరించారు. ఇది జరగడానికి కొన్నాళ్ల ముందు దిలీప్ చెల్లి పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఓ జ్యోతిష్కుడిని కలిసిన ఇతడు.. తనకు దిలీప్ అనే పేరు నచ్చలేదని, ఏదైనా ముస్లిం పేరు సూచించాలని అడగ్గా.. అబ్దుల్ రహీమ్, అబ్దుల్ రెహమాన్ అనే పేర్లు సూచించారు. వీటి వల్ల అంతా మంచి జరుగుతుందని సదరు జ్యోతిష్కుడు సూచించారు. వీటిలో రెహమాన్ అనే పేరు నచ్చేసరికి దిలీప్ కాస్త రెహమాన్ అయ్యాడు. తల్లి కస్తూరి.. కొడుకు మార్చుకున్న పేరుకి ముందు 'అల్లా రఖా' అని జోడించింది. దీంతో దిలీప్ కాస్త ఏఆర్ రెహమాన్ అయ్యాడు.తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఆర్ రెహమాన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే తల్లి కస్తూరి కూడా తన పేరుని కరీమాగా మార్చుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కడప పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు దర్గాని రెహమాన్ సందర్శిస్తుంటారు. తెలుగులో ఈయన.. నిప్పురవ్వ, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేశావె, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత 'పెద్ది'తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
‘మన శంకరవరప్రసాద్’ కి సీక్వెల్ ఉందా?
ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే..అప్పడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే.. సీక్వెల్ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్ వరప్రసాద్’కి సీక్వెల్ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్లో పార్ట్ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.(ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్ఫ్లిక్స్')రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ
సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాల సందడి ఉంది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే ప్రశ్నలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆ చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు ఇలా అన్నారు. 'ఈ చిత్ర టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్ షోల గురించి రెండు ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం రాగానే ప్లాన్ చేస్తాం. దాదాపు తెలంగాణలో కూడా ప్రీమియర్స్ ఉంటాయి.' అని పేర్కొన్నారు. -
'అఖండ-2' ఫ్యాన్స్కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్ఫ్లిక్స్'
బాలకృష్ణ- బోయపాటి శ్రీను సినిమా 'అఖండ2: తాండవం'.. డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. సంక్రాంతి కానుకగా నెట్ఫ్లిక్స్లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు యాప్లో పేర్కొంది. అప్కమింగ్ చిత్రాల జాబితాలో కూడా పోస్టర్తో పేర్కొంది. దీంతో ఈ పండుగనాడు సినిమాను మరోసారి చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే, తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విస్ట్ ఇచ్చింది.'అఖండ2: తాండవం' నెట్ఫ్లిక్స్లో జనవరి 9న స్ట్రీమింగ్కు వస్తుందని యాప్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పోస్టర్ను కూడా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ (యాప్) అప్కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించింది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. మూవీ లింక్ను కూడా తప్పించారు. అయితే, సోషల్మీడియాలో మాత్రం ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్ వివరాలను నెట్ఫ్లిక్స్ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని వివరాలు తెలిపే ఛాన్స్ ఉంది.'అఖండ 2' నిర్మాతలకు భారీనష్టాలే తెచ్చిపెట్టిందని బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది. -
టాలీవుడ్ హీరోతో పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమన్నారంటే..
సినీ తారల ప్రేమ, పెళ్లి విషయాలపై పుకార్లు కామన్. వాళ్లు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే.. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది తారలు వాటిని లైట్గా తీసుకొని స్పందించకుండా ఉంటారు. మరికొంతమంది అయితే క్లారిటీ ఇస్తుంటారు. ఈ రెండో కోవాకు చెందిన హీరోయిన్నే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీపై ఇటీవల ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్తో మీనాక్షి(Meenakshi Chaudhary ) ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.‘ఇలాంటి పుకార్లు విని నవ్వుకుంటాను. సుశాంత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరం కలిసి నటించాం(మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సుశాంత్ హీరో). అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. రోజుకో గాసిప్ వస్తుంది. అవన్నీ నిజం కాదనీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని మైండ్కి తీసుకోను. అలా విని..ఇలా వదిలేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పుకొచ్చింది. మీనాక్షి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పెళ్లి పుకార్లపై స్పష్టత ఇచ్చింది. -
సంక్రాంతికి రిలీజ్ అంటే చాలా మంది నమ్మలేదు : అనిల్ సుంకర
‘‘స్క్రిప్ట్ విని, ఈ కథతో సినిమా చేయగలమా? లేదా అనే ఓ జడ్జ్మెంట్కు రాగలగాలి. సినిమా రిజల్ట్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే సినిమా స్క్రిప్ట్ లెవల్లోనే అన్నీ జాగ్రత్తగా చూసుకోగలగాలి. అఖిల్తో మేం చేసిన ‘ఏజెంట్’ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. దాంతో ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అందుకే మంచి స్క్రిప్ట్తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఆ సినిమా బాగున్నట్లే’’ అని చె΄్పారు నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘నారీ నారీ నడుమ మురారి’ పండగ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి మాజీ ప్రేమికురాలు, ఆ అబ్బాయి ప్రస్తుత లవర్ ఉంటే... ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. మా సినిమాను మేం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటే చాలా మంది నమ్మలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ మేం ముందుగా చెప్పినట్లే సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘దిల్’ రాజుగారు, వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్లో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక సంక్రాంతి సీజన్లో నాలుగైదు సినిమాలు రావడం అనేది కామన్. ఈ సీజన్లో విడుదలైన సినిమాలన్నీ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మన తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాలూ విడుదలవుతున్నాయి. అయితే కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకాదరణ లభిస్తుంది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ఓటీటీ డీల్ పూర్తయింది. నూతన నటీనటులతో ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీ చేయబోతున్నాం. అడివి శేష్తో ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయిదుర్గాతేజ్, తేజ సజ్జాలతో సినిమాలున్నాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘ఏజెంట్’ సినిమా విఫలమైంది. అఖిల్కు ఓ హిట్ ఇస్తే ఆ బాధ పోతుంది. ‘భోళా శంకర్’ సినిమాకూ సరైన ఫలితం రాలేదు. ఇదే సినిమా నాలుగేళ్ల క్రితం విడులై ఉంటే, బాక్సాఫీస్ ఫలితం మరోలా ఉండేది’’ అని పేర్కొన్నారు. -
యశ్ 'టాక్సిక్'లో 5వ హీరోయిన్ ఎంట్రీ
కన్నడ నటుడు యశ్ జోరు పెంచాడు.. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారి పోస్టర్స్ను విడుదల చేశారు. అయితే, తాజాగా ఇందులో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నట్లు ఒక పోస్టర్ను షేర్ చేశారు.టాక్సిక్ నుంచి ఇప్పటికే నలుగురు హీరోయన్ల ఫస్ట్లుక్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నదియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలతో పాటు తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు. అయితే, తాజాగా మెలిసా పాత్ర కోసం రుక్మిణి వసంత్ను తీసుకున్నారు.గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in - A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu— Yash (@TheNameIsYash) January 6, 2026 -
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
ప్రముఖ నిర్మాత దిల్రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. తన మొదటి భార్య అనిత మరణం తర్వాత దిల్రాజు 2020లో తేజస్వినితో కలిసి ఏడడుగులు వేశారు. అయితే, వారి పెళ్లి తర్వాత సోషల్మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే దిల్రాజును ఆమె పెళ్లి చేసుకుందని కామెంట్లు చేశారు. ఆపై వారిద్దరి వయసు గురించి కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయం గురించి ఈ దంపతులు ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేదు. అయితే, తాజాగా తేజస్విని తమ్ముడు డాక్టర్ తరుణ్ ఉండవల్లి పలు విషయాలు పంచుకున్నారు.మేము బ్రాహ్మిణ్'మా బావగారు రెడ్డి సామాజిక వర్గం అని అందరికీ తెలిసిందే.. కానీ, మేము బ్రాహ్మిణ్. మా అక్క ఒక ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్ధలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేది.. అందరూ అనుకున్నట్లు ఆమె ఎయిర్హోస్ట్ కాదు. ఆమె చదువుకున్నది అంతా మెడికల్ విభాగం. కానీ, అనుకోకుండా కొద్దిరోజులు ఎయిర్లైన్స్లో పనిచేసింది. బావ (దిల్రాజు)తో అక్కడే పరిచయం ఏర్పడింది. తను తరుచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా పెళ్లి వరకు వెళ్లారు. అయితే, మొదట మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా అమ్మమ్మను ఒప్పించడం చాలా కష్టమైంది. ఆమె పాతకాలం మనిషి కాబట్టి ఒప్పించేందుకు కొంచెం టైమ్ పట్టింది. మా అక్క కోసమే ముందుకు అడుగువేశాం. అయితే, మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. అక్కను ఒక మహారాణిలా మా బావగారు చూసుకుంటారు. ఆయన నోటి నుంచి ఒక తప్పడు మాట రాదు. చివరకు తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా తిట్టరు. మా బావ బంగారమని చెబుతాం. అయితే, కొందరు తన ఆస్తి కోసమే మా అక్క పెళ్లి చేసుకుంది అంటారు. అందులో నిజం లేదు. మా కుటుంబంలో అందరం బాగా చదువుకున్నవాళ్లమే.. నేను డాక్టర్, మా అమ్మ, తమ్ముడు ఇద్దరూ హైకోర్టులో వర్క్ చేస్తారు. మా నాన్నకు వ్యాపారాలు ఉన్నాయి. డబ్బు పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఇలాంటి మాటలు మేము పట్టించుకోము. వారిద్దరినీ ఒక డెస్టినీనే కలిపింది అనుకుంటాను. మా అక్కతో నాకు చాలా అనుబంధం ఎక్కువ. ఆమె సంతోషంగా ఉండటమే మాకు కావాలి. మేము అనుకున్నదానికంటే తనను మా బావాగారు చాలా ఎక్కువగానే చూసుకుంటున్నారు.' అంటూ తరుణ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by shiva studios (@shiva_studios9) -
'ఏజెంట్' సినిమాతో వాళ్ల కెరీర్ పోయింది: నిర్మాత
అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ నష్టాల గురించి నిర్మాత అనిల్ సుంకర మరోసారి రియాక్ట్ అయ్యారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా అనిల్ సుంకర నిర్మించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఆరోజు సాయింత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మూవీకి సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్లో భాగంగా అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాతో పాటు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడారు.'ఏజెంట్ సినిమా వల్ల మేము అందరం నష్టపోయాం. ముఖ్యంగా అఖిల్, దర్శకుడు సురేంద్ర రెడ్డి కెరీర్ పరంగా బాగా నష్టపోయారు. మూడేళ్లుగా వారికి సినిమాలు లేవు. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. అయితే, అఖిల్కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. నేను డబ్బులు మాత్రమే కోల్పోయాను. కానీ, అఖిల్ కెరీర్ ఏజెంట్ సినిమాతో దెబ్బతినింది. అదొక్కటే బాధ నాలో ఉంది. నాతో ఇప్పటికీ అఖిల్ టచ్లోనే ఉన్నాడు. తనతో ఒక సినిమా తీయాలని నేను చాలా కథలను పంపుతూనే ఉన్నాను. అయితే, భారీ బడ్జెట్తో వద్దని ఏదైనా తక్కువ బడ్జెట్తో ప్లాన్ చేయమని తను సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరోసారి సాహసం వద్దని సూచిస్తున్నాడు. తను చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాం.' అని ఆయన అన్నారు. 'ఏజెంట్' మూవీ ఫ్లాప్ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ తీసుకున్న అఖిల్.. చాలా సైలెంట్గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్కు మంచి ఆదరణ దక్కింది. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తుంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది. -
ఆస్కార్కు రెండు అడుగుల దూరంలో జాన్వీ కపూర్ సినిమా..
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సత్తా చాటిన చిత్రం ‘హోమ్బౌండ్’... ఇప్పుడు అస్కార్-2026లో కూడా దూసుకుపోతుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఆస్కార్ విడుదల చేసిన తాజా షార్ట్ లిస్ట్లో ఈ మూవీకి చోటు దక్కింది. కేవలం రెండు అడుగుల దూరంలో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకునేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది.ఆస్కార్ ఎంపికలో ఎంతో కీలకమైన ఘట్టం షార్ట్లిస్ట్ జాబితానే అని చెప్పాలి. ఇందులో మన సినిమా హోమ్బౌండ్ చోటు దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినీ రంగంలో మరో మైలురాయిగా సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో 15 చిత్రాలను ఎంపిక చేసి ఒక షార్ట్లిస్ట్ను విడుదల చేశారు. అందులో బాలీవుడ్ చిత్రం ‘హోమ్బౌండ్’ కూడా ఉంది. అయితే, తుది జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అప్పుడు కూడా టాప్-5 మాత్రమే ఎంపిక చేస్తారు. మార్చి 15న జరిగే ఆస్కార్ వేడుకలో ఈ ఐదు చిత్రాలలో ఏదైన ఒక చిత్రానికి అవార్డ్ ఇస్తారు. మరో రెండుగుల దూరంలో ఆస్కార్ సొంతం చేసుకునేందుకు హోమ్బౌండ్ ఉంది.నిజ సంఘటన ఆధారంగా...ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్బౌండ్’ను తీశాడు. View this post on Instagram A post shared by The Academy (@theacademy) -
ఓటీటీలో కొత్త సినిమా స్ట్రీమింగ్.. సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్ సినిమా ట్రైలర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. దీంతో మూవీకి బజ్ వచ్చింది.'జిగ్రీస్' సినిమా సన్నెక్ట్స్(Sun Nxt)లో జనవరి 6నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో పెద్దగా మెప్పించని ఈ మూవీలో చాలామంది కొత్తవారు నటించడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు హాజరు కావడంతో ప్రేక్షకులకు రీచ్ అయింది.కథేంటి..జిగ్రీస్ అనే టైటిల్కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే. -
గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..: త్రిష
పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు విజయవంతం కావాలనే కోరుకుంటారు. అందుకోసమే శ్రమిస్తుంటారు. అయితే జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఒక్కోసారి బాగున్న కథా చిత్రాలు కూడా ప్రజాదరణకు నోచుకోవడంలో విఫలం అవుతుంటాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. నటి త్రిష విషయానికే వస్తే కథానాయకిగా స్వర్ణోత్సవానికి చేరువవుతున్నారు. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం,హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మధ్యలో నటిగా కాస్త స్ట్రగుల్ పడి అవకాశాలకు దూరం అయ్యారు. అలాంటి తరుణంలో మణిరత్నం రూపంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం వరించి సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ తరువాత విజయ్, అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు. అదే విధంగా మలమాళంలో మోహన్లాల్, తెలుగులో చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే గత ఏడాది త్రిష నటించిన చిత్రాల్లో అజిత్తో జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మినహా ఇతర చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా అజిత్కు జంటగా నటించిన మరో చిత్రం విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. కాగా ప్రస్తుతం త్రిష మార్కెట్ డల్గా ఉందని చెప్పక తప్పదు. కాగా ఈమె సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవి సరసన నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం కూడా మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. దీంతో త్రిష కొత్తగా ఒప్పుకున్న చిత్రాలు లేవు. అయితే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. నాలుగు పదుల వయసు దాటిన ఈ పెళ్లి కాని నటికి తాజాగా మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట అందుకే త్రిష కూడా గతేడాది తనకు ఏమంతగా ఆశాజనకంగా లేదని చెప్పుకొస్తుందట. అయితే, 2026లో తను నటించిన భారీ సినిమాలు రెండు విడుదల కానున్నాయి. -
క్లోజ్ ఫ్రెండ్తో సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత హీరోయిన్ సమంత ఫుల్గా చిల్ అవుతోంది. గతేడాది క్రిస్మస్ వేడుకలు చేసుకున్న సామ్.. ఇటీవల భర్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.అయితే తాజాగా సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సామ్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడనేది మాత్రం సామ్ రివీల్ చేయలేదు.కాగా.. సామ్ - తమన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించిన అల్లుడు శీనులో తమన్నా స్పెషల్ సాంగ్లో మెరిసింది. మరోవైపు సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో కేవలం స్పెషల్ సాంగ్స్లో మాత్రమే కనిపిస్తోంది. -
మెగా హీరో స్పెషల్ బిర్యానీ పార్టీ.. అట్రాక్షన్గా ఉపాసన..!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరికింది. దీంతో మన మెగా హీరో చెర్రీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు.తాజాగా హైదరాబాద్లోని తన నివాసంలో మెగా హీరో రామ్ చరణ్ స్పెషల్గా పార్టీ చేసుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా తయారు చేసిన బిర్యానీ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ పార్టీలో కనిపించారు. ఇంట్లోనే జపాన్ చెఫ్ వండిన బిర్యానీ తింటూ కనిపించారు. ఈ పార్టీలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించిన ఉపాసన.. బేబీ బంప్తో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.@ #RamCharan 🏦 pic.twitter.com/0AsYvJiJwm— Trends RamCharan ™ (@TweetRamCharan) January 5, 2026 -
కాంబినేషన్ ఫిక్స్?
హీరో అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్కు రావడం, అల్లు అర్జున్ను కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని ఫిల్మ్నగర్ సమాచారం. మైత్రీ మూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేశ్తో చేయనున్న సినిమా షూట్లో అల్లు అర్జున్ పాల్గొంటారని ఊహించవచ్చు. అలాగే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఆధ్మాత్మిక టచ్తో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
హైదరాబాద్లో భోగి
హైదరాబాద్లో భోగి ఆరంభమైంది. అదేంటీ... భోగి పండగ ఈ నెల 14న కదా.. అప్పుడే ఆరంభం కావడం ఏంటి? అని ఆశ్చర్యం కలగడం సహజం. అయితే హైదరాబాద్లో ఆరంభమైనది భోగి పండగ కాదు... ‘భోగి’ సినిమా. శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లు.లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా ‘భోగి’. హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ను సోమవారం ప్రారంభించాం.ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్ని చిత్రీకరించనున్నాం. ఈ మూవీలో శర్వా సరికొత్తగా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్. -
ముగ్గురు భామలతో నాచే.. నాచే...
‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్’ వంటి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్గారితో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్. ‘‘రాజా సాబ్’లో వీఎఫ్ఎక్స్ సహజంగా ఉంటాయి. స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరానీ మాట్లాడారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను పంచుకునా్నరు మేకర్స్.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రేపు(బుధవారం) గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి) మధ్య నలిగిపోయే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. భీమ్స్ సంగీతం మా సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో...’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను హిట్గా మార్చేశాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
టాలీవుడ్లో ఒకేరోజు ఈవెంట్ల జాతర
పండగ సీజన్కి టాలీవుడ్లో సినిమాల వరద కురుస్తోంది. ఒకేసారి అయిదు సినిమాలు రిలీజ్కి సిద్ధమవుతుండగా, వాటి ప్రమోషన్లలోనూ పోటీ వాతావరణం నెలకొంది. జనవరి 7న ప్రత్యేక హంగామా జరగనుంది. అదే రోజు రెండు ట్రయిలర్లు, రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజాసాబ్, శంకర ప్రసాద్ ట్రయిలర్లు విడుదలయ్యాయి. ఇక నవీన్ పోలిశెట్టి రాజుగారు, రవితేజ భక్త మహాశయులు ట్రయిలర్లు జనవరి 7న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఒక ట్రయిలర్, సాయంత్రం 6 గంటలకు మరో చిత్రం ట్రయిలర్ రానున్నాయి. అదే రోజు మెగాస్టార్ శంకర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్’ కోసం ప్రత్యేక ఈవెంట్ సెట్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ ట్రయిలర్ మాత్రం 7న వస్తుందా లేక 8న వస్తుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక జనవరి 9 నుంచి సినిమాల హడావుడి మొదలవుతుంది. అందుకే మొత్తం కంటెంట్ను ఆ లోపే విడుదల చేయాలని మూవీ టీమ్లు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఒకేరోజు టాలీవుడ్లో ఒకవైపు ట్రయిలర్లు, మరోవైపు ఈవెంట్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ డోస్ అందనుంది. -
ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు
ఎప్పుడో ఏదో వివాదంతో చర్చనీయాంశమయ్యే సెలబ్రిటీ అనగానే చిన్మయి గుర్తొస్తుంది. స్వతహాగా సింగర్ అయినప్పటికీ ఫెమినిజం విషయమై నెటిజన్లకు ఈమెకు మధ్య మాటల పంచాయతీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యే శివాజీ వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. అంతకు ముందు ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పడంతోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ సమస్యపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.తమిళంలో ఆరేళ్ల క్రితం 'ద్రౌపది' అనే మూవీ వచ్చింది. దర్శకుడు మోహన్ జీ తీసిన ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా, మహిళలని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లలో సింగర్ చిన్మయి కూడా ఉంది. అప్పట్లో మోహన్ vs చిన్మయి కౌంటర్స్ వేసుకున్నారు. అక్కడితో అది అయిపోయింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీశారు.(ఇదీ చదవండి: 'ఖైదీ' పాప ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?)'ద్రౌపది 2' పేరుతో తీసిన ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులోనే చిన్మయి తనకు తెలియకుండానే ఓ పాట పాడింది. దీని గురించి నెల క్రితం చిన్నపాటి వివాదం నడిచింది. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుడు జిబ్రాన్ అడగడంతో 'ఏమొకే' అనే పాట పాడానని.. అయితే ఏ సినిమా కోసమని అడగలేదని, ఒకవేళ ఈ మూవీ కోసమే అయితే అస్సలు పాడేదాన్ని కాదని అంటూ క్షమాపణ చెప్పింది. దర్శకుడు మోహన్ భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తి వ్యతిరేకం అని ఏకంగా ట్వీట్ చేసింది.దీంతో ఆగ్రహం తెచ్చుకున్న దర్శకుడు మోహన్ జీ.. చిన్మయి, తన సినిమాకు కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుందని అప్పట్లో ఆరోపించారు. థియేటర్లలోకి సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతున్న క్రమంలో సదరు పాటపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్మయి బదులు మరో గాయనితో పాడించిన వెర్షన్ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఈ సమస్య పరిష్కారమైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
కలర్ఫుల్ తమన్నా.. హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్
అందంతో ధగధగా మెరిసిపోతున్న తమన్నాబీచ్ ఒడ్డున రాశీ సింగ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్బ్లాక్ డ్రస్లో మాయ చేసేస్తున్న రుక్మిణి వసంత్బొమ్మల స్టోర్లో అదితీ శంకర్ ఫన్నీ పోజులుశ్రీలంక ట్రిప్ వేసిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ View this post on Instagram A post shared by NIHARIKA 🤎🕊 (@niharikavaggarwal) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Pooja (@poojakaranam) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) -
ఒక్క సినిమాతో ఫేమస్.. సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోద్దేమో?
గత కొన్నాళ్ల నుంచి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ బాగా కనిపించింది. ఇందులో భాగంగా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ పాపనే తీసుకుంటే అలా ఓ మూవీలో చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోతుందేమోనని సందేహం వస్తోంది. మరి ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనిక. తమిళనాడుకు చెందిన ఈమె.. విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అయితే 'ఖైదీ'లో హీరో కార్తీ కూతురిగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీసిన ఈ మూవీ 2019లో రిలీజైంది. అప్పటికి ఈమె వయసు 11 ఏళ్లు. తర్వాత లోకేశ్ కనగరాజ్ యూనివర్స్లో భాగంగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్లోనూ కాసేపు అలా కనిపించింది.'ఖైదీ 2'లోనూ ఈ పాప పాత్ర కచ్చితంగా ఉండే అవకాశముంది. చూస్తుంటే పాప పెరిగి పెద్దయిపోయింది. మరి ఖైదీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో రాదో ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. ఒకవేళ తీస్తే మాత్రం ఈ పాపని కాకుండా వెరే వాళ్లని పెట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ ఈ సీక్వెల్ తీసేలోపు ఈ బాలనటి.. హీరోయిన్గానూ సినిమాలు చేసేస్తుందేమోనని అనే కౌంటర్స్ పడుతున్నాయి.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ) -
ఇన్నావా బంగారం.. 'లెనిన్' తొలిసాంగ్ రిలీజ్
'ఏజెంట్' మూవీ ఫ్లాప్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయిన అఖిల్.. చాలా సైలెంట్గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తొలుత హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు. ఆ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఈమె ప్లేసులోకి భాగ్యశ్రీ వచ్చింది. ఈ మధ్య వదిలిన పోస్టర్తో ఈ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా నుంచి తొలి గీతాన్ని వదిలారు. అలానే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ)తమన్ సంగీతమందించిన 'వారెవ్వా' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ వినడానికి బాగుంది. అఖిల్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.ఇప్పటివరకు అఖిల్ ఐదు సినిమాలు చేస్తే.. వాటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓకే అనిపించుకుంది. మిగిలినవన్నీ బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొట్టాలి. మరి 'లెనిన్'తో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?) -
నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ
యాంకర్ అనసూయ.. ఒకప్పటి హీరోయిన్ రాశికి క్షమాపణ చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడిన నటుడు శివాజీ.. హీరోయిన్ల వస్త్రధారణపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తర్వాత అనసూయ ఈ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పింది. రీసెంట్గా ఈ వివాదంలోకి నటి రాశి ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశి.. కొన్నాళ్ల క్రితం ఓ కామెడీ షోలో అనసూయ తనని కించపరిచిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అనసూయ.. సారీ చెప్పడంతో పాటు అప్పుడు అసలేం జరిగిందనేది కూడా చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటి వల్లే సదరు షో నుంచి కూడా బయటకు వచ్చేశానని చెప్పింది.సదరు ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. 'మూడు నాలుగేళ్ల క్రితం నా భర్త ఓ వీడియో చూపించారు. ఆ షో గురించి, జడ్జిల గురించి మీ అందరికీ తెలుసు. ఆ షో నిర్వాహకులు అప్పట్లో నాకు ఫోన్ చేశారు. మీరు 'ప్రేయసి రావే' మూవీ స్కిట్ చేయాలి అని అడిగారు. కొన్ని ఎపిక్స్ మనం ముట్టుకోకూడదు. దానికి కామెడీ స్కిట్ నేను చేయను. జడ్జిగా రమ్మంటే వస్తాను అని చెప్పా. అయినా సరే స్కిట్ చేశారు. దాంట్లోనే రాశి ఫలాలు అనే పదం ఉపయోగించారు. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? అని ఆ లేడీ యాంకర్ అడిగింది. ఆమె అలా ఎలా అడుగుతుంది? అది నేను మనసులోకి తీసుకోలేదు''రాశి ఫలాలు అనడం మామూలే. కానీ రాశిగారి ఫలాలు అనడంలో నేను ఉన్నాను. ఆ యాంకర్ నా గురించి మాట్లాడింది. అక్కడ జడ్జిల్లో ఓ లేడీ కూడా హాహాహా అని నవ్వింది. నేను ఆ స్థానంలో ఉండుంటే.. షో ఆపేసి రాశి గారి ఫలాలు అని ఎందుకు అంటున్నారు? అని అడిగేదాన్ని. కామెడీ చెయ్యొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లిదండ్రులకే హక్కులేదు. దీన్ని లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నాను గానీ అమ్మ వారించడంతో ఆగిపోయాను' అని చెప్పిన రాశి.. యాంకర్ పేరెత్తకుండానే మండిపడింది. తర్వాత సదరు యాంకర్ అనసూయ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్ ద్వారా తేలింది.ఇప్పుడు రాశి వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ.. 'డియర్ రాశిగారు. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. మూడేళ్ల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. నా క్షమాపణ అంగీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారుతుంటారు. ఆ షోలో డబుల్ మీనింగ్ మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని మార్పు మీరు గమనించొచ్చు''ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నాను. మహిళల శరీరాల గురించి కామెంట్ చేసేవారిని ప్రశ్నించే విషయంలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా బలంగా నిలబడ్డాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా' అని అనసూయ తన క్షమాపణ పోస్టులో రాసుకొచ్చింది.@RaasiActress ma’am 🙏🏻 pic.twitter.com/DZLfUNp6rr— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026 -
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన ఈ కొత్త పాట యూట్యూబ్లో ఇప్పటికీ టాప్-3లో కొనసాగుతుంది. అయితే, సోషల్మీడియాలో మంగ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరాఠీ నుంచి ఈ సాంగ్ను కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు విషయం మరోలా ఉంది. మరాఠీకి చెందిన సింగర్స్ యతిన్ వధన్, కాజల్ రావత్యనే మంగ్లీ సాంగ్ను కాపీ కొట్టారు. ఇదే విషయాన్ని వారు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆపై వారు విడుదల చేసిన యూట్యూబ్ ఛానల్లో కూడా మంగ్లీ అనుమతితో ఈ సాంగ్ను తీసుకున్నట్లు క్రెడిట్ కూడా ఇచ్చారు. అయితే, అసలు విషయం తెలియని కొందరు సింగర్ మంగ్లీపై విమర్శలు చేయడం విశేషం.‘బాయిలోనే బల్లిపలికే’ పాటను రాసింది జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్.. ఆయన సొంత గ్రామం మల్లాపూర్ మండలం వీవీరావుపేట.. 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కమల్ ఇస్లావత్.. పోలీస్ కళాబృందంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు వెయ్యికిపైగా కళా ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 పాటలకుపైగానే లిరిక్స్ అందించారు. -
అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?
మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ వారి శరీర భాగాలను సామాన్లతో పోల్చిన బూతు నటుడు శివాజీ… ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. ఆ తరువాత చిన్మయి, అనసూయల ఎంట్రీతో మరింత చర్చకు ఛాన్స్ ఇచ్చారు. చివరకు యూట్యూబర్ అన్వేష్ తన దరిద్రపు మాటలతో చిచ్చు పెట్టాడు. కోట్లాదిమంది పూజించే దేవుళ్ల మీద నీచమైన భాషలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎవరూ క్షమించరు. ఆపై సుప్రసిద్ధ ప్రవచనకర్త డా. గరికిపాటి నరసింహారావుని ప్రస్తావించలేని భాషలో బూతులు తిట్టడం తన పతనానికి తనే పునాదులు వేసుకున్నాడు. అంతటితో ఆగని ఈ నీచుడు వేరే దేశంలో తాను 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించినట్టు ఒక ఆడియోలో ఓపెన్ అయ్యాడు. ఇదీ చాలా తీవ్రమైన అలిగేషన్. ఆ ఆడియో నిజమైతే తనని ఉరితీసిన తప్పులేదని చెప్పవచ్చు. అయితే, ఇక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొందరు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ తమ సొంత ప్రయోజనాల కోసం అన్వేష్ ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తమకు వ్యూస్తో పాటు సబ్స్రైబర్స్ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనను తిడుతూ వీడియోలు పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. దాంతో డబ్బు చేసుకునే పనిలో యూట్యూబర్స్ ఉన్నారు. గతంలో ఇదే ఇన్ఫ్లూయెన్సర్స్ తమ పేజీలో బూతు కంటెంట్తో పాటు హీరోయిన్ల అర్ధనగ్న ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అన్వేష్ చుట్టూ మీడియాశివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకు తను క్షమాపణ చెప్పాడు.. అందరూ ఒప్పుకున్నారు కూడా.. కానీ అన్వేష్ క్షమాపణలు ఒప్పుకోలేదు. ఈ ట్రాక్ను సోషల్మీడియాలో పదేపదే నాన్చుతూ ఉన్నారు. కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ విచక్షణ మరచి ఉదయం నుంచి రాత్రి వరకు అన్వేష్ గురించే జపం చేస్తున్నాయి.. ఏకంగా ప్రధాన పత్రికలో ఎడిటోరియల్ కాలమ్లో మీడియా అధినేతలు కూడా అన్వేష్ గురించి రాసుకొచ్చారు. ఇదంతా అన్వేష్ మీద కోపమూ కాదు.. అలాగని మహిళల మీద ప్రేమా కాదు. కేవలం వారి స్వప్రయోజనాల కోసం వారు తెరలేపిన బిగ్ గేమ్.. జనాలు చూస్తున్నారు.. వారు వీడియోలు క్రియేట్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కసారిగా అన్వేష్ చుట్టూ సోషల్మీడియా తిరుగుతుంది. వీరందరికీ మహిళల మీద ప్రేమ ఉంటే.. హీరోయన్ల నాభిపై ఆపిల్, ద్రాక్ష పళ్లు విసిరినప్పుడు ఎందుకు రాయలేదు. పైగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మహిళలను ఉద్దరిస్తున్నామని చెబుతున్న ఈ సో కాల్డ్ సోషల్మీడియా పేజీలు, ప్రధాన కొన్ని మీడియా ఛానల్స్ కూడా హీరోయన్లను క్లోజ్ అప్ కెమెరాలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలే ఉన్నాయి.అన్వేష్ ట్రాప్లో నెటిజన్లుఅన్వేష్ మొదట బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేశాడు. అప్పుడు కూడా బూతులతోనే రెచ్చిపోయాడు. కానీ, ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే, ఆ ఎపిసోడ్ తర్వాత మహాభారతం మీద సిరీస్ వీడియోలు చేశాడు.. పెద్దగా ఫలితం లేదు. ఇలాంటి సమయంలో శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యలు తనకు వరంగా మారాయి. శివాజీ మాటలను కొందరు తప్పుబట్టారు.. మరికొందరు సమర్థించారు. అది వేరే సంగతి.. కానీ, అన్వేష్ మాత్రమే చాలా ఎక్స్ట్రీమ్గా అభ్యంతరకరమైన భాషలో శివాజీపై విరుచుకుపడ్డాడు. రాయలేని బూతులు కూడా వాడాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్మీడియాలో వైరల్ అయ్యాడు.ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్తోనే అన్వేష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అన్వేష్పై చాలామంది యూట్యూబర్స్ విరుచుకపడుతున్నా సరే తనుమాత్రం ఎవరినీ టార్గెట్ చేస్తూ వీడియో చేయలేదు. కానీ, తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ (Aye Jude)పై ఒక వార్నింగ్ వీడియోతో అన్వేష్ రెచ్చిపోయాడు. ఇక్కడ Aye Judeకు భారీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి కంటెంట్తోనే వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటాడు. మిలియన్ల కొద్ది వ్యూస్ వున్నాయి. కాబట్టే అన్వేష్ అతన్ని మాత్రమే టార్గెట్ చేశాడు. అదే సమయంలో ఆ యూట్యుబర్కు కూడా అన్వేష్ లాంటి తిమింగళమే కావాలి. గతంలో యూట్యూబర్ Aye Jude చేస్తున్న వీడియోలపై అభ్యంతరం చెబుతూ చాలామంది యూట్యుబర్స్ వీడియోలు చేశారు. కానీ, తను మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. కేవలం అన్వేష్ మీద మాత్రమే కౌంటర్గా వీడియో చేశాడు. ఈ క్రమంలో వారిద్దరికీ కావాల్సింది ఒక్కటే.. బాగా అమ్ముడుపోయే కంటెంట్.. అందుకే ఇలాంటి టాపిక్ను ఎత్తుకుని పదేపదే సోషల్మీడియాలో వారితో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్స్ వీడియోలు చేస్తున్నారు. వారు మాత్రం తమ వీడియోలతో డబ్బు చేసుకుంటున్నారు. యువత మాత్రం ఆ ట్రాప్లో చిక్కుకుని కామెంట్లు పెడుతున్నారు. షిర్డీ సాయి బాబాను చాలామంది ఇష్టంగా పూజిస్తారు. నటి మాధవీలత పిచ్చికూతలు కూసినా సరే పెద్దగా అభ్యంతరం ఎవరూ చెప్పడం లేదు. దేవుళ్ల మీద పిచ్చికూతలు కూసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలు మారుస్తే అన్వేష్ లాంటి వారందరూ సరైన దారిలోకి వస్తారు.బెట్టింగ్ యాప్స్ వెనుక అన్వేష్బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడానికి వెనుక అన్వేష్ పాత్ర ఎక్కువ ఉందని ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. ఈ అంశంలో తను సుదీర్ఘమైన పోరాటం చేశాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని బ్యాన్ చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల 2025లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 మందికి పైగా యువకులు చనిపోయారని లెక్కలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి వంటి స్టార్ యూట్యుబర్స్తో పాటు సినీ నటులు కూడా కోర్టు మెట్లు ఎక్కారు. ఈ ప్రక్రియలో అన్వేష్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ప్రస్తుత సీపీ సజ్జనార్ కూడా గతంలో అతనితో ఒక లైవ్ వీడియోలో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తున్న పోరాటాన్ని ఆయన మెచ్చుకున్నారు. కానీ,తాజాగా అన్వేష్ చేసిన చిల్లర వ్యాఖ్యలు తన వినాశనానికి దారితీసేలా ఉన్నాయి.(అన్వేష్ ఉదంతంపై సోషల్మీడియాలో ఏం జరుగుతుందో ఒక ఫన్నీ వీడియోతో కొందరు ఇలాంటి వీడియో కూడా రెడీ చెశారు) View this post on Instagram A post shared by arshadahmed (@arshadahmed.m) -
'పురుషః' నుంచి హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్ రిలీజ్
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపిస్తూ తీసిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా 'పురుష:' బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.తొలుత హీరోయిన్ వైష్ణవి పాత్రని 'కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా' అని పరిచయం చేశారు. 'పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ' అనే క్యాప్షన్తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇప్పుడు విషిక పోస్టర్ రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. .ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావుడి మొదలు కానుంది. ముందుగా ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి రానుండగా.. దీంతో పాటే దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయకుడు' రిలీజ్ కానుంది. తర్వాత రోజు తమిళ హీరో శివకార్తికేయన్ 'పరాశక్తి' థియేటర్లలో విడుదల కానుంది. ఇదే వారం ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్లోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!: గిరిజ ఓక్)ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే అఖండ 2, దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్ తదితర సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా సైలెంట్ క్రైమ్స్, హనీమూన్ సే హత్య లాంటి వెబ్ సిరీస్లు ఉన్నప్పటికీ రిలీజైతే గానీ వీటి సంగతి ఏంటనేది బయటపడదు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్లోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జనవరి 05 నుంచి 11వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ సిరీస్) - జనవరి 05గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 07ది రూకీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 08హిజ్ అండ్ హర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 08అఖండ 2 (తెలుగు సినిమా) - జనవరి 09దే దే ప్యార్ దే 2 (హిందీ మూవీ) - జనవరి 09ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 09పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09కాట్ స్టీలింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 10హాట్స్టార్వెపన్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 08ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 09జీ5మాస్క్ (తమిళ మూవీ) - జనవరి 09జోతో కండో కోల్కత్తాయి (బెంగాలీ సినిమా) - జనవరి 09హనీమూన్ సే హత్య (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 09సన్ నెక్స్ట్సైలెంట్ క్రైమ్స్ (తెలుగు డాక్యుమెంటరీ) - జనవరి 08సోనీ లివ్ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 09(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ) -
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
రాత్రికి రాత్రే ఫేమస్ అయినవారిలో మరాఠి నటి గిరిజ ఓక్ ఒకరు. ఈమె నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ చిన్న ఇంటర్వ్యూ క్లిప్ వల్ల సడన్గా ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. అందులో ఆమె నీలిరంగు చీర కట్టుకుని సింపుల్గా కనిపించింది. ఈ వైరల్ ఫేమ్ వల్ల తన సినిమాలు ఎక్కువమంది చూస్తే చాలని ఆశపడుతోంది.అమ్మ గురించి ఎప్పుడూ..తాజాగా తొలిసారి ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. నేను మా అమ్మ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇన్ని గంటలు మాత్రమే పనిచేయాలనే నిబంధన అంటూ ఏమీ ఉండదు. దానివల్ల నేను కొన్నిసార్లు 10-12 గంటలపాటు షూటింగ్లో ఉండేదాన్ని. కొన్నిసార్లు 16 గంటలపాటు ప్రయాణించి సెట్కు వెళ్లేదాన్ని.ఒంటరిగానే..పెళ్లికి ముందు, తర్వాత కూడా ఒంటరిగానే వెళ్లేదాన్ని. కానీ రోజంతా పనిచేసి ఇంటికొస్తే.. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో ఎందుకు లేదు? అనిపించేది. ఆమె నాతో లేకపోవడానికి ఓ కారణం ఉంది. నా పెళ్లవడానికి ముందే తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోవడం అస్సలు తట్టుకోలేకపోయాను. సైకియాట్రిస్ట్ను కలిశా.. 17 ఏళ్ల వయసులోనే తొలిసారి థెరపీ తీసుకున్నాను. కొన్నేళ్లపాటు ఆ థెరపీలు కొనసాగించాను. సాక్షి సంతకంసినిమా షూటింగ్స్కు వెళ్లొచ్చాక ఇంట్లో అంతా నిశ్శబ్ధంగా ఉండేది. అమ్మ నాతో ఉంటే.. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భోజనం సిద్ధం చేసేది, నాతో కబుర్లు చెప్పేదని ఫీలయ్యేదాన్ని.. తనను బాగా మిస్ అయ్యేదాన్ని! ఏదేమైనా అమ్మ తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అమ్మ ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. తన రెండో పెళ్లికి నేను సాక్షి సంతకం పెట్టాను అని చెప్పుకొచ్చింది. గిరిజ ఓక్.. హిందీలో తారే జమీన్పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో నటించింది. మరాఠిలో అనేక చిత్రాలు చేసింది.చదవండి: చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా ఇవ్వలేదు: హీరో -
దీపికా పదుకోణె బర్త్డే.. ఛాన్సులు పోయినా సరే వెనక్కు తగ్గని జీవితం
బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.ఛాన్స్లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపికపని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.8గంటల పనిపై దీపికా వివరణ‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
డబ్బు, హోదా ఎంతున్నా అనాథలా అనిపిస్తోంది!
ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్ గతేడాది చివర్లో ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డ ఆయన డిసెంబర్ 4న ఉదయం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఎంతోమంది సినీప్రముఖులు ఆయన్ను చివరిసారిగా చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఏవీఎం స్కూల్లో శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆయన నాకు చాలా క్లోజ్ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. శరవణన్తో నేను 11 సినిమాలు చేశాను. ఆయన తన ఆఫీసులో కూర్చునే.. చాలామందికి అనేక హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. కేవలం సినిమాపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు చాలా క్లోజ్. శివాజీ సినిమా తర్వాత ఆయన నాకో సలహా ఇచ్చాడు.అనాథగా మిగిలా..ఏజ్ పెరిగేకొద్దీ మరింత బిజీగా ఉండాలన్నాడు. కనీసం ఏడాదికో సినిమా అయినా చేయమని సూచించాడు. ఇప్పటికీ నేను ఆ సలహా పాటిస్తున్నాను. మనకు నచ్చినవారిని కాలం తనకు నచ్చినప్పుడు తీసుకెళ్లిపోతుంది. ఎంత డబ్బు, హోదా ఉన్నా సరే నచ్చినవాళ్లు దూరమైనప్పుడు అనాథగా మిగిలాం అన్న భావన కలగకమానదు. శరవణన్ సర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.గర్వంగా ఫీలవుతున్నా.కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఏవీఎమ్ కుటుంబానితో కలిసి పని చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఏవీఎమ్ స్కూల్ లేదు. ఒకవేళ ఉండుంటేనా.. నేను కూడా అదే పాఠశాలకు వెళ్లేవాడిని. నేను ఏదైనా తప్పులు చేస్తే శరవణన్ నాపై అరిచేవాడు కాదు.ఏవీఎమ్ బ్యానర్ ద్వారా పరిచయంకానీ, నేనేదైనా మంచి చేస్తే మాత్రం అందరిముందు పొగిడేవాడు, సంతోషపడేవాడు అని పేర్కొన్నాడు. కమల్ హాసన్.. ఏవీఎమ్ బ్యానర్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు. 1960లో వచ్చిన కలతుర్ కన్నమ్మ సినిమాకుగానూ కమల్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: సంధ్య థియేటర్లో దారుణం.. లేడీస్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా -
'అఖండ-2' ఫైనల్ కలెక్షన్స్.. బిగ్ లాస్
'అఖండ 2' సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ లెక్కలను ఎప్పటికప్పుడు ప్రకటించే పలు ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. బాలకృష్ణ - బోయపాటి శీనుది హిట్ కాంబినేషన్.. వీరిద్దరూ కలిసి గతంలో తెరకెక్కించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అఖండ-2పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. అయితే, సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో ఊహించని రేంజ్లో నష్టాలు తప్పలేదు.రూ. 100 కోట్ల నష్టం'అఖండ 2'కు సినిమా టికెట్ల పెంపునకు ఇరు రాష్ట్రాల్లో ఛాన్స్ దక్కింది. కానీ, లాభాలు రాలేదు. నష్టాలే తెచ్చిపెట్టింది. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 'అఖండ 2' వికీపీడియా ప్రొఫైల్లో కూడా ఇదే ఉంది. అయితే, ప్రస్తుతం అఖండ-2 కలెక్షన్స్ దాదాపు క్లోజింగ్కు వచ్చేసింది. చాలాచోట్ల ఇప్పటికే సినిమాను తొలగించేశారు కూడా... మరో మూడురోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి వుంది కాబట్టి పూర్తిగా అఖండ-2ను తప్పించడం సహజం. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ రావడంతోనే కలెక్షన్స్పై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, అభిమానులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ జనాలకు అంతగా కనెక్ట్ అవలేదు.ఆశగా ఎదురుచూస్తున్న బయ్యర్లుఅఖండ 2 సినిమాను బిజినెస్ పరంగా చూడకూడదని దర్శకుడు బోయపాటి కొద్దిరోజుల క్రితం కామెంట్ చేశారు. ఈ మూవీకి డబ్బుల సమస్య లేదంటూనే.. కావాల్సినంత కలెక్షన్స్ ఎప్పుడో వచ్చేసాయని అన్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ష్ కూడా మా డైరక్టర్ చెప్పారు.. అఖండ -2 డబ్బులు ఎప్పుడో వచ్చేశాయి.. నష్టాలు ఏమీ లేవంటూ సంబరపడుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ, బయ్యర్ల పరిస్థితిని తెలుసుకుంటే చాలా దారుణంగా వుంది. అఖండ-2కు సంబంధించి జిఎస్టీలు ఇస్తే కాస్తయినా నష్టాలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదంతులను నమ్మొద్దు.. భారతి రాజా కూతురి ప్రకటన
సీనియర్ సినీ దర్శకుడు భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా అంజీకరైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా గురించి గత మూడు రోజులుగా రకరకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో భారతి రాజా గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు జనని స్పందించారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన తండ్రి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పారు. కాగా దర్శకుడు భారతీరాజా ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి రావాలని, గీత రచయిత వైరముత్తు, తదితర సినీ ప్రముఖులతో పాటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
సంధ్య థియేటర్లో దారుణం.. వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా!
కర్ణాటక బెంగళూరులోని సంధ్య థియేటర్లో దారుణం చోటు చేసుకుంది. మహిళల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విక్టరీ వెంకటేశ్ సూపర్ హిట్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్' రీరిలీజ్ అయింది. ఆదివారం రోజు బెంగళూరులోని తెలుగువారు ఈ సినిమా చూసేందుకు దగ్గర్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు.సీక్రెట్ కెమెరాఅయితే ఓ మహిళ లేడీస్ వాష్రూమ్కు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డు చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక అనుమానిత బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. View this post on Instagram A post shared by Namma Bengaluru (@nammabengaluroo) చదవండి: చెల్లి పెళ్లిలో హీరో డ్యాన్స్.. ఒక్క పైసా తీసుకోలే! -
ఆస్కార్ బరిలో మొట్టమొదటి మరాఠి సినిమా!
మరాఠి సినిమా దశావతార్ (2025) అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచిన తొలి మరాఠి చిత్రంగా నిలిచింది. దిలీప్ ప్రభావాల్కర్, మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ మీనన్, ప్రియదర్శిని ఇందాల్కర్, భరత్ జాదవ్ లీడ్ రోల్స్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దశావతార్. కలెక్షన్స్సుబోద్ ఖనోల్కర్ దర్శకత్వంలో ఓషన్ ఫిలిం కంపెనీ, ఓషన్ ఆర్ట్ హౌస్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో విడుదలైంది. థియేటర్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తాజాగా దశావతార్ 98వ ఆస్కార్ అవార్డ్స్లోని మెయిన్ ఓపెన్ ఫిలిం విభాగంలో పోటీలో నిలిచింది.మరికొద్ది రోజుల్లో తుది జాబితాఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుబోద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో హిందీ నామినేషన్లో పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే! ఇకపోతే జనవరి 22న ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న చిత్రాల జాబితా ఫైనల్ లిస్ట్ను అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15న అమెరికాలో ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. Today, we received an email informing us that Dashavatar has been selected for the Oscars, contention list. It brings immense satisfaction that the years of hard work put in by all of us have been acknowledged. pic.twitter.com/FtGjvgdtjc— Subodh Khanolkar (@subodhkhanolkar) January 3, 2026 -
చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా తీసుకోలే: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా యాక్ట్ చేసింది. పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.సినిమాకార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా? -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్చరణ్తో అనిల్ రావిపూడి సినిమా -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
యాక్షన్ కు వేళాయె
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని ఫిల్మ్నగర్ సమాచారం. ఎన్టీఆర్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్.ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ΄్లాన్ చేశారట దర్శకుడు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్నారని, ఈ దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘డ్రాగన్ ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. -
దేశభక్తితో...
మమ్ముట్టి, మోహన్లాల్ లీడ్ రోల్స్లో నటించిన మలయాళ చిత్రం ‘పేట్రియాట్’. నయనతార, ఫాహద్ఫాజిల్, కుంచకో బోబన్, రేవతి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంటో జోసెఫ్, కేజీ అనిల్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణ జరిగిందని సమాచారం.హైదరాబాద్, విశాఖపట్నం, లండన్, శ్రీలంక, అజర్బైజాన్ వంటి లొకేషన్స్లో షూటింగ్ చేశారు. దేశభక్తి నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్గా మోహన్లాల్ నటించగా, ఓ సీక్రెట్ మిషన్ను టేకప్ చేస్తున్న వ్యక్తి పాత్రలో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక 2008లో వచ్చిన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి లీడ్ రోల్స్లో నటించిన ‘పేట్రియాట్’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. -
చరణ్తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్ను మొదటగా రామ్ చరణ్కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్కు నాంది పలికినట్టే. -
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.అట్లీ తర్వాత త్రివిక్రమ్తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్నే ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది) -
కొడుకుతో లావణ్య బీచ్ ట్రిప్.. చీరలో అనసూయ
పట్టుచీరలో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ2025లో నా బెస్ట్ గిఫ్ట్.. కొడుకు గురించి లావణ్య పోస్ట్బ్లాక్ గౌనులో కాజల్ అగర్వాల్ గ్లామర్ మెరుపులుమాల్దీవులు వెళ్లిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్డిసెంబరు జ్ఞాపకాలతో ముద్దుగుమ్మ మృణాల్దుబాయిలో చిల్ అయిపోతున్న సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) -
నా హృదయం ముక్కలు.. హద్దులు మీరుతున్నారు: దర్శన్ భార్య
వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్లో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నాకే ఇలా జరుగుతుందంటే..కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్లైన్లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.నిశ్శబ్ధాన్ని వీడండితప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.జైలు జీవితంఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు.చదవండి: సినిమా ఫ్లాప్.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్ నటి -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్
ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్లో భాగంగా ఓ మాల్కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది)అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC— Everest News (@Everest_News7) January 4, 2026 -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' టీజర్ విడుదల
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్తో పాటు హైలీ ఎంటర్టైన్ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు. -
శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్రైలర్ రిలీజ్
పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి? -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ చిత్రంలో చూడబోతున్నారంటూ అనిల్ రావిపూడి చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. తనదైన మార్క్తో ఈ ట్రైలర్ను అనిల్ కట్ చేశారు. కామెడీ పంచ్లతో పాటు చిరంజీవి మెరుపులు కూడా చూడొచ్చు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చిరును ఫుల్ యాక్షన్ మోడ్లో కూడా చూపించినట్లు తెలుస్తోంది. -
ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా
తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అడపాదడపా మూవీస్ చేసింది. కాకపోతే హిట్స్ దక్కలేదు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఓ హిట్ మూవీ సీక్వెల్తో గతేడాది చివరలో వచ్చింది. అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీ సినిమా 'దే దే ప్యార్ దే'. 2019లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్గా నిలిచింది. మళ్లీ గతేడాది నవంబరు 21న దీని సీక్వెల్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడీ మూవీని నెట్ఫ్లిక్స్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారం (జనవరి 09) నుంచే హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో' తెలుగు రివ్యూ)'దే దే ప్యార్ దే 2' విషయానికొస్తే.. తొలి పార్ట్లో తనకంటే వయసులో చిన్నదైన ఆయేషాని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్న ఆశిష్(అజయ్ దేవగణ్).. తన మాజీ భార్య(టబు) అనుమతితో పాటు ఆమె కుటుంబ అంగీకారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రెండో పార్ట్లో రకుల్ తల్లిదండ్రులైన రాజీ ఖురానా(మాధవన్), అంజు ఖురానా(గౌతమి కపూర్).. ఆశిష్తో ఈమె పెళ్లికి అడ్డంకిగా నిలుస్తారు. తనకంటే ఏడాది పెద్దవాడైన ఆశిష్తో తన కూతురికి రాజ్ పెళ్లి చేశాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఎకో, 120 బహదూర్, డ్రైవ్, బ్యూటీ, హక్ లాంటి తెలుగ్ స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే ఎపిసోడ్, ఎల్బీడబ్ల్యూ సిరీస్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
'బిగ్బాస్' చరిత్రలో కంటెస్టెంట్స్ నీచమైన పని.. ఇద్దరిపై రెడ్ కార్డ్
బిగ్బాస్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకేసారి రెడ్ కార్డ్ జారీ చేశారు. దీంతో తక్షణమే వారు హౌస్ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. తమిళ బిగ్బాస్-9లో జరిగిన ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. హౌస్ట్ విజయ్ సేతుపతి వారిద్దరిపై విరుచుకుపడ్డారు. రెడ్ కార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇతర కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకున్నారు. బిగ్బాస్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బిగ్బాస్ తమిళ్ ఇప్పటికే 90రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలో ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే ఏపిసోడ్ జరిగింది. కార్ టాస్క్లో భాగంగా నటి సాండ్రాను బలవంతంగా బయటకు నెట్టినందుకు పార్వతి, కమ్రుదిన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సాండ్రాను కాలితో తన్నారు. దీంతో ఆమె కారు నుంచి దూరంగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సాండ్రా కాలు కారు డోర్ మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు కూడా వారు కనికరం చూపలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ దాడి తర్వాత సాండ్ర చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఆందోళన తనలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు కూడా పార్వతి, కమ్రుదిన్ల తీరుపై విరుచుకుపడ్డారు. ఇక ఇతర హౌస్మెట్స్ అయితే, ఏకంగా వారి మొఖంపై ఉమ్మేసినంత పనిచేశారు. టైటిల్ రేసులో ఉన్న వినోథ్, దివ్యలు కలిసి వారిని కడిగిపారేశారు. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ట్ విజయ్ సేతుపతి వారికి రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఏకంగా సంబరాలు జరుపుకున్నారు. కోందరైతే ఏకంగా కేకులు కట్ చేశారు. బిగ్బాస్ షో చాలా భాషలలో టెలికాస్ట్ అవుతుంది. కానీ, ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్ ఎవరూ కూడా రెడ్ కార్డ్ అందుకోలేదు. తొలిసారి పార్వతిపై బిగ్బాస్ జారీ చేశాడు.ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ వారిద్దరికీ సెండాఫ్ ఇవ్వలేదు. హౌస్ట్ విజయ్ సేతుపతి కూడా వారిని స్టేజీపైకి పిలిచి కనీసం ఒక్కమాట కూడా మాట్లడలేదు. హౌస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. బిగ్బాస్ చరిత్రలో ఇంతటి అవమానకరమైన రీతిలో ఎవరూ కూడా ఎదుర్కోలేదు. గేమ్ కోసం ఒక స్త్రీని ఇలా బయటకు లాగి, కాళ్ళతో తన్నడం ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బిగ్బాస్ ప్రేక్షకులు మాత్రం వారికి తగినశాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.VIJAY SETHUPATHI GAVE RED CARD 🔥🔥- see the audience reaction 😍😍😍ONE OF THE BEST GOOSEBUMPS SCENE IN BB HISTORY#BiggBossTamil9 #VijaySethupathi pic.twitter.com/JRScBbZidh— RMVA (@LovelyRmva) January 3, 2026Sandra's acting level TOP notch 🙄😳She is still continuing same actingIt was not at all a Big accident ,...How she got these much panic because of What ? that push from the Car ?? Not Possible#biggboss9tamil #biggbosstamil9 #biggbosstamil pic.twitter.com/WE5zROcih8— Crick_info (@Stock_indianse) January 3, 2026Vikram didn’t flinch for more than 20 seconds !! I said this that day itself, everyone utilised this situation. #Scamdra #VJParvathy pic.twitter.com/HYu23K3YQz— Trithi 🕉️ (@scribblynotes_2) January 4, 2026 -
సుమన్ చేతుల మీదుగా ‘రాయుడు గారి తాలుకా’ పోస్టర్ రిలీజ్!
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈమూవీ నుంచి టైటిల్ పోస్టర్ని ప్రముఖ నటుడు సుమన్ గారు విడుదల చేస్తూ.. చిత్రబృంధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్ పోస్టర్ని సుమన్ గారు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓ డిఫరెంట్ కంటెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటీనటులు అంతా కొత్తవారే అయినప్పటికీ.. చాలా బాగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మంచి కంటెంట్లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లేని శ్రీనివాస్ ఉలిశెట్టి అందించగా.. నగేశ్ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా పని చేస్తున్నాడు. -
సంక్రాంతి కానుకగా శంబాల.. ట్రైలర్ రిలీజ్
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడింది.తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.కాగా.. ఈ చిత్రంలో అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.After a grand successful Telugu release. #Shambala releasing in Hindi on 9th Jan’26Unveiling the Hindi trailer - https://t.co/S1IUlDRVJzAll the best to @iamaadisaikumar and the entire team😊@tweets_archana @ugandharmuni #RajasekharAnnabhimoju @ShiningPictures… pic.twitter.com/itnt68GNa2— Rishab Shetty (@shetty_rishab) January 4, 2026 -
'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో సినిమాలుసంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జననాయగణ్' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి. A special addition, a special announcement! 📢The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥Get ready for laughter overload! 😂🔥Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026 చదవండి: జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ -
ఆ పాట పాడుతూ నేను, వింటూ నా భార్య ఏడ్చేశాం : చంద్రబోస్
తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. ఆయన రాసిన ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే తీసుకొచ్చిపెట్టింది. చిన్న చిన్న పదాల్లో లోతైన అర్ధాన్ని చెప్పడం ఆయన స్టైల్. ఇప్పటికి వరకు ఆయన 3800 పాటలు రాశాడు. వాటిల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ పాట మాత్రం 20 ఏళ్ల తర్వాత బాగా వైరల్ అయింది.రాసిన 20 ఏళ్ల తర్వాత ఆ పాటతో చంద్రబోస్కి మంచి గుర్తింపు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబోసే చెప్పారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాట గురించి చెప్పుకొచ్చాడు.సాధన చేస్తే ఫలితం ఉంటుంది..సాధన చేస్తే గుర్తింపు, ఫలితం సాధన చేస్తే ఫలితం, గుర్తింపు వస్తూనే ఉంటుంది. మన కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది. నేను రాసిన ఒక పాటకు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఆ పాట ఇదే. ‘ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి’. ఇది 20 ఏళ్ల క్రితం ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమా కోసం రాశాను. ఆ సినిమా రిలీజ్ అయినా ఈ పాటకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ అదే పాటను ఒక స్టేజ్ మీద పాడిన తర్వాత అది బాగా వైరల్ అయి.. నాకు గుర్తింపు వచ్చింది. లైఫ్ ఇన్స్రెన్స్ ఏజెంట్ల మీటింగ్లో ఆ పాటను పాడాను. వాళ్లంతా ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని వారి బిజినెస్ని పెంచుకున్నారు.నా భార్య ఏడ్చిందిఇదే ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాలోని ‘ఓరయ్యో..’ అనే ఎమోషన్ సాంగ్ గురించి మాట్లాడారు. ఏదైనా పాట రాయాలంటే.. ఆ సన్నివేశాలలో మనల్ని మనం ఊహించుకోవాలి. రంగస్థలంలోని ‘ఓరయ్యో..’ పాటను నేను అలానే రాశాను. మన ఆప్తులు చనిపోతే ఎలా రోధిస్తాం.. ఎలా బాధపడతారు.. దాన్నే ఈ పాటలో చూపించాను. ‘ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడె మొయ్యాలా... ఈ సేతితోనే కొరివి పెట్టాలా... ఓరయ్యో నా అయ్యా.. ’ అనే పల్లవిని ఇంట్లోనే రాశాను. వంట చేస్తున్న నా భార్య దగ్గరకు వెళ్లి పాట సందర్భం చెబతూ... ‘అన్న చనిపోతాడు..తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు.. ఆ సందర్భంలో పాట వస్తుంది’ అంటూ ఈ పాటను వినిపిస్తే.. తను ఏడ్చేసింది. పాడుతూ నేను ఏడిస్తే.. వింటూ తాను కూడా ఏడ్చేసింది. రచయిత అనేవాడు ప్రతి సందర్భాన్ని తనదిగా భావిస్తేనే.. తనదైన స్పందన అందిస్తాడు. రచయితకు కావాల్సింది పాండిత్యం.. భాష మీద విపరీతమైన సాధికారతో కాదు.. మనకున్న జ్ఞానం.. మనదైన అనుభవం.. మనలోని స్పందన.. ఈ మూడే రచయితను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి’ అని చంద్రబోస్ చెప్పుకొచ్చాడు. -
సంక్రాంతికి సినిమాల సందడి.. ప్రతి ఏటా అదే సమస్య..!
సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్తో పాటు నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సంక్రాంతికి థియేటర్ల కొరత..ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు?సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్ కాంపీటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతిష్టాత్మక వేదికపై 'వారణాసి' టీజర్.. అధికారికంగా ప్రకటన
మహేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి.. యాక్షన్ అడ్వెంచరస్గా రానున్న ఈ మూవీపై ఇండియన్ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో #GlobeTrotterevent టైటిల్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జనవరి 5న పారిస్లో టీజర్వారణాసి నుంచి వచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే.., అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఈ మూవీ టీజర్ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఇప్పుడు చరిత్ర సృష్టించనుంది. పారిస్(Paris)లోని 'లే గ్రాండ్ రెక్స్'(Grand Rex)లో ఈ టీజర్ను విడుదల చేయనున్నారు. 2,702 సీట్లు కలిగిన ఈ థియేటర్.. యూరప్లోనే అతిపెద్దదిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్ బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది. జనవరి 5 రాత్రి 9 గంటలకు టీజర్ విడుదల కానుంది. భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ వార్తను ధృవీకరించింది. టీజర్ను పెద్ద స్క్రీన్పై గొప్ప ఫార్మాట్లో ప్రదర్శించడంతుందని ఇది ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు. వారణాసిని ప్రపంచ వార్తల్లో ఉంచడానికి రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్కు చెందిన ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. కథ స్క్రీన్ప్లేను విజయేంద్ర ప్రసాద్ రాశారు.RAJAMOULI et son équipe sont dans une autre planète. Le teaser d'un film indien à être projeté pour la première fois en Grand Large au Grand Rex sera celui de VARANASI. Et ceci à plus d'un an avant la sortie ! Ne ratez pas cette occasion unique.#varanasifrance pic.twitter.com/HTrdiPjSvW— Aanna Films France (@AannaFilms) January 2, 2026 -
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం అఖండ-2. మైథలాజికల్ టచ్తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే అఖండ మూవీ థియేట్రికల్ రన్టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ ఓటీటీ విషయానికొస్తే రన్ టైమ్ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఓటీటీలో కేవలం రెండు గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల సీన్స్ కోత పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఏయే సీన్స్ కట్ చేశారనేది ఓటీటీలో చూశాకే క్లారిటీ రానుంది. దీనిపై వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.📢 Streaming Date 🔒#Akhanda2 🔱 (Telugu) streaming from January 9 on Netflix in Telugu , Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/UQ6Ldm3DA8— OTT Trackers (@OTT_Trackers) January 4, 2026 -
ప్రేమమ్ హీరో సినిమా.. పది రోజుల్లోనే వంద కోట్లు..!
మలయాళ సినిమా 'ప్రేమమ్' హీరో నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు.తాజాగా ఈ చిత్రం వసూళ్ల పరంగా వందకోట్ల మార్క్ చేరుకుంది. రిలీజైన పది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా.. మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త లోకా టాప్ ప్లేస్లో ఉంది. సర్వం మాయ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశముంది. BIGGEST EVER COMEBACK IN MOLLYWOOD 🏆🏆🏆🏆#SarvamMaya 100 Crores + Worldwide Gross Done & Dusted in 10 Days 🔥🔥 First #NivinPauly Movie to Gross 100 Cr 👏👏 Just a Feel Good Family Movie 💥 When He is in his safe zone then no one can even touch him once again Proved 🔥🔥🔥🔥 pic.twitter.com/1T0i530cs3— Kerala Box Office (@KeralaBxOffce) January 3, 2026 100 CRORES CLUB :#SarvamMaya enters 100 Crores Club Worldwide in 10 days . Truly , A Dream Comeback For #NivinPauly 🔥 pic.twitter.com/BUsNtMwfJO— Friday Matinee (@VRFridayMatinee) January 3, 2026 -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ద్రౌపది 2 మూవీలో తుగ్లక్ పాత్ర
దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.ద్రౌపది 2 విశేషాలుఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. Terror Wears A Crown 👑Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026 -
ప్రియురాలితో స్టార్ హీరో మేనల్లుడి ఎంగేజ్మెంట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు టీనా రిజ్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. ఇవీ కాస్తా వైరల్ కావడంతో అయాన్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ మేనల్లుడు సంగీతకారుడు అయాన్ అగ్నిహోత్రి సింగర్, మ్యూజిషియన్గా రాణిస్తున్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు. View this post on Instagram A post shared by Agni (@ayaanagnihotri) -
పెళ్లాడితే కారు, బంగళా, రూ.10 లక్షలపైగా జీతం
కోట్లు ఉంటే చాలు కొండ మీది కోతిని కూడా కిందకు దిగొస్తుంది అని సంపన్నులతో పాటు చాలా మంది నమ్మకం. అయితే కోతి అయినా వస్తుందేమో గానీ, ఆత్మవిశ్వాసం ఉన్న అందమైన అమ్మాయి మాత్రం రాదని ఓ యువతి నిరూపించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆస్తి, భూమి ఐదు అంకెల నెలవారీ భత్యంతో పాటు మరెన్నో అద్భుతమైన విలాసాలను ఆశ చూపించినప్పటికీ... ఆమె ఒప్పుకోలేదు.ఆమె పేరు అమీ నూర్ టినీ( Amy Nur Tinie). ఈ 29 ఏళ్ల మలేషియా నటి మాజీ అందాల రాణి కూడా. ఆమె ఇటీవల మలేషియా కంటెంట్ క్రియేటర్ సఫ్వాన్ నజ్రీ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ప్రతిపాదన తమ దేశానికే చెందిన ఓ పెద్ద వివిఐపి నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. మలేషియాలో సాధారణంగా చాలా ఉన్నత సామాజిక ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులను వివిఐపీలుగా అభివర్ణిస్తారు.కార్పొరేట్ ఈవెంట్లను నిర్వహిస్తున్నప్పుడు తాను తరచుగా అలాంటి వివిఐపిలను కలుస్తుండడం జరుగుతుందని, ఆ సమయంలో వారిలో చాలామంది తన ఫోన్ నంబర్ అడగడం సర్వసాధారణం అని తెలిపింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా ఆహ్వానిస్తారని అమీ వివరించింది. అదే విధంగా ఒక వ్యక్తి తనను కలిశాడని, నేరుగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రపోజల్ను అంగీకరిస్తే ఆమెకు ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల (40,000 చదరపు మీటర్లు) భూమి, 50,000 రింగిట్స్ (సుమారు రూ.11 లక్షలు) నెలవారీ భత్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది.ప్రస్తుతం మలేషియాలో ఈ పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నవారు గతంలో ఇదే నటి ఇచ్చిన మరో ఇంటర్వ్యూను వెలుగులోకి తెచ్చారు. అందులో మరింత వివరంగా ఆమె తాను అందుకున్న ప్రతిపాదనకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. దాని ప్రకారం... ఈ ప్రతిపాదన 2019లో జరిగిందని, ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆఫర్ అందుకుందని తేలింది. ఆసమయంలో ఆమె అందాల పోటీలలో చురుకుగా పోటీ పడుతోందని వెల్లడైంది. ఆ వ్యక్తి ని డాతుక్ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. అందాల పోటీలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడానికి కార్పొరేట్ స్పాన్సర్షిప్ల అవసరం ఏర్పడడంతో...ఆ విషయంలో దాతుక్ తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడని అయితే అతని ఆఫర్ను తాను వెంటనే తిరస్కరించినట్టు చెప్పింది. సదరు వ్యక్తికి దాదాపు తన తండ్రి వయస్సు ఉంటుందని అంతే కాకుండా అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఆయ్యాయని కూడా వివరించింది. అయితే తన తల్లి తనను అమ్మేయాలని అనుకోలేదని ఆమె చెప్పింది. ఇంకా అవివాహిత గానే ఉన్న అమీ...పాడ్కాస్ట్లో, తన జీవిత భాగస్వామిగా కాబోయేవాడు బాధ్యతాయుతంగా ఆర్థికంగా స్థిరపడి ఉంటే చాలని మరీ విపరీతమైన సంపద అవసరం లేదని చెప్పారు. ఆ ఆఫర్ ని అంగీకరించి ఉంటే తన జీవితం మరింత సుఖంగా ఉండి ఉండేదని ఆమె అంగీకరించింది, కానీ అది తాను కోరుకున్న జీవన మార్గం కాదని చెప్పింది. -
ప్రభాస్ ది రాజా సాబ్.. ఫుల్ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. Gear up for the MOST GROOVING MADNESS in theatres this Sankranthi 💥💥💥#NacheNache song promo is out now ❤️🔥❤️🔥❤️🔥Full song from Jan 5th 😎🙌🏼A @MusicThaman Musical Vibe 🎧 #TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/WgwCLbXaF9— People Media Factory (@peoplemediafcy) January 3, 2026 -
బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించే యువకుడి కథ.. బ్రాట్ మూవీ రివ్యూ
టైటిల్: బ్రాట్నటీనటులు: డార్లింగ్ కృష్ణ, మనీషా కంద్కూర్డైరెక్టర్: శశాంక్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ బ్రాట్. గతేడాది అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..క్రిస్టీ(డార్లింగ్ కృష్ణ) తన జీవితాన్ని డెలివరీ బాయ్గా ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడినా డబ్బులు సరిపోకపోవడంతో తనలో తానే బాధపడుతుంటాడు. అలా ఓ రోజు కారులో కుక్కను చూసిన క్రిస్టీ ఊహించని విధంగా రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత డబ్బు కోసం క్రికెట్ బెట్టింగ్ వైపు అడుగులు వేస్తాడు. ఫుల్గా డబ్బు సంపాదిస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో తన ఫ్రెండ్కు జరిగిన సంఘటన చూసి ఓ నిర్ణయం తీసుకుంటాడు. అసలు డబ్బు కోసం క్రిస్టీ క్రికెట్ బెట్టింగ్నే ఎందుకు ఎంచుకున్నాడు? తన ఫ్రెండ్కు అసలేం జరిగింది? క్రిస్టీ తండ్రి మహదేవయ్యకు తన కుమారుడితో ఉన్న ఇబ్బందులు ఏంటి? చివరికీ బెట్టింగ్నే కెరీర్గా మార్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే బ్రాట్ చూడాల్సిందే.బ్రాట్ ఎలా ఉందంటే..ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఈ పదం కేవలం నగరాల్లోనే కాదు.. పల్లెలకు కూడా పాకిపోయింది. అలాంటి ఈ బెట్టింగ్ కాన్సెప్ట్గా వచ్చిన చిత్రమే బ్రాట్. అలా ఈ కాన్సెప్ట్తో డైరెక్టర్ శశాంక్ కథను తెరకెక్కించాడు. ఓ యువకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు. క్రిస్టీ బెట్టింగ్.. అతని తండ్రి పోలీస్ కావడంతో ఈ స్టోరీపై ఆసక్తిని పెంచేశాడు. పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన క్రిస్టీ బెట్టింగ్ వైపు ఎందుకు వెళ్లాడనేది ప్రేక్షకుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయం క్లైమాక్స్ వరకు ఎక్కడా ప్రేక్షకుడికి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్ బెట్టింగ్లో డబ్బు సంపాదించడం.. పోలీసులకు దొరక్కుండా మేనేజ్ చేయడం.. మనీషాతో క్రిస్టీకి పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారడం ఇలాంటి సంఘటనలతో కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండానే సాగుతుంది.ఒకసారి బెట్టింగ్ కేసులో క్రిస్టీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. పోలీస్స్టేషన్లో ఎస్సైతో క్రిస్టీ చెప్పిన మాటలతో దర్జాగా బయటికొచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ బెట్టింగ్ సామ్రాజ్యం ఊహించని మలుపులు తిరుగుతుంది. బెట్టింగ్లో డాన్గా ఉన్న డాలర్ మనీకి(విలన్).. క్రిస్టీకి మధ్య జరిగే సీన్స్ కామెడీగా అనిపించినా.. సీరియస్నెస్ కనిపిస్తుంది. ఈ కథలో కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. దర్శకుడు విలన్తోనే ప్రేక్షకుడిని నవ్వించిన తీరు ఆకట్టుకుంటుంది. తన కుమారుడు బెట్టింగ్లో పడి ఏమైపోతాడోనని బాధపడుతున్న తండ్రికి క్లైమాక్స్లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా కథ నడిపించిన శశాంక్.. చివర్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకుడిని ఫూల్ చేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ.. నిడివి ఎక్కువ కావడంతో సెకండాఫ్ కాస్తా బోరింగ్గా అనిపిస్తుంది. బెట్టింగ్తో పాటు ఓ మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. వీకెండ్లో సీరియస్నెస్తో పాటు కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే బ్రాట్ చూసేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఓ లుక్ వేయొచ్చు.ఎవరెలా చేశారంటే..డార్లింగ్ కృష్ణ నటనే ఈ సినిమాకు బలం. హీరోగా తన హవాభావాలతో మెప్పించాడు. క్రిస్టీ ప్రియురాలిగా మనీషా కంద్కూర్ అదరగొట్టేసింది. గ్లామర్ అంతగా లేకపోయినా ఈ కథకు బాగానే సెట్ అయింది. అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు తమ పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ అనవసర సీన్స్ ఇంకా కట్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నతంగా ఉన్నాయి. -
అది నా అదృష్టం!
‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ).. ఈ రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్. 17 సీజన్లుగా ఈ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేబీసీ’ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో ఆరంభంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ–‘‘25 ఏళ్లుగా ‘కేబీసీ’ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాను.నా జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే వెచ్చించాను. సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు వీక్షకులు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీరు ఇలా తోడుగా ఉన్నంత వరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అమితాబ్. -
గడియారం వెనక్కి...
కాలం ముందుకు వెళ్తుంది. 2026కి కూడా వెల్కమ్ చెప్పాం. కానీ తెలుగుతెరపై సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. వెండితెరపై గడియారాన్ని వెనక్కి తిప్పి, కొన్ని కథలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు హీరోలు. ఇలా ఆడియన్స్ ను ఎంటర్టైన్స్ చేసేందుకు గడియారాన్ని వెనక్కి మళ్లించిన కొంతమంది హీరోల గురించి ఓ లుక్ వేయండి.టైమ్ ట్రోటర్హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో మహేశ్బాబు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు. ప్రధానంగా రుద్ర పాత్రలో మహేశ్బాబు కనిపిస్తే, కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపిస్తారు. మరికొన్ని సన్నివేశాల్లో శివుడుగా కూడా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కథ రీత్యా ఈ సినిమా కథనం విభిన్న మైన కాలమానాల్లో సాగుతుంది.భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి టైమ్ ట్రోటర్, గ్లోబ్ ట్రోటర్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్స్ , ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ వారణాసి చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.పుట్టకతోనే యోధుడు‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతనో యోధుడు..’’.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ గురించే ఇదంతా. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. 1940 బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం.. వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.జయప్రద, అనుపమ్ఖేర్, మిథున్స్ చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘ఫౌజి’ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ సందర్భంగా పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లోని ‘సలార్’ ఫ్రాంచైజీ సినిమా సెమీ పీరియాడికల్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా నాగ్ అశ్విన్స్ డైరెక్షన్స్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ్రపారంభం కానుందని తెలిసింది.డ్రాగన్స్ రాక ఈ ఏడాదేనా..ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ. 1960 సమయంలో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా, సరిహద్దుల్లో అక్రమ రవాణా వంటి అంశాల నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో కథ రీత్యా ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు. తాజాగా చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు.ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ గా నటి స్తున్నారు. మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కాజోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్స్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్స్ ’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ ఏడాది జూన్స్ 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ విడుదల తేదీలో కూడా మార్చు ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ‘ఎన్టీఆర్నీల్’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి..‘ఎన్టీఆర్నీల్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.పెద్ది ఆటరామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీకపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.కథ రీత్యా ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. 1980 టైమ్లైన్స్ తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ ‘పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీలో రామ్చరణ్ పాల్గొనగా, ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది.బ్రిటీషర్లపైపోరాటంమంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘డేవిడ్రెడ్డి’. ఈ హిస్టారికల్ యాక్షన్స్ డ్రామా కథనం 1897–1922 నేపథ్యంతో సాగుతుంది. బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన రెబల్ డేవిడ్రెడ్డి పాత్రలో మంచు మనోజ్ కనిపిస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన డేవిడ్రెడ్డి బ్రిటీషర్లకు ఎలా ఎదురు నిలిచాడు? అనేది సినిమాలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలోని డేవిడ్ పాత్ర ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఈ చిత్ర దర్శకుడు హనుమరెడ్డి పేర్కొన్నారు. భరత్, నల్లగంగుళ వెంకట్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణలో భోగిశర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామాకు సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్స్ , డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్ను క్రియేట్ చేశారు మేకర్స్. కేకే రాధామోహన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మరో సినిమా ‘బైకర్’. మూడు తరాల నేపథ్యంతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కథనం 1990, 2000 టైమ్ పీరియడ్లో సాగుతుంది.ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్లో శర్వానంద్ రేసర్ విక్రమ్ పాత్రలో నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, ఆడియన్స్ కు మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు. త్వరలోనే ఈ ‘బైకర్’ సినిమా కొత్త విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.జడల్ జమానా‘దసరా’ పీరియాడికల్ రూరల్ యాక్షన్స్ డ్రామా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్స్ లో వస్తున్న తాజా సినిమా ‘ది ΄్యారడైజ్’. 1980 నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా ఇది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. మోహన్స్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ వర్గం కోసం ఓ నాయకుడు చేసే వీరోచితపోరాటం నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.రౌడీ జనార్ధన‘కలింగపట్నంలో ఇంటొకకడు రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటి పేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ గంభీరంగా చెబుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి.. ఈ రౌడీ జనార్ధన స్టోరీని ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘రౌడీ జనార్ధన’. కీర్తీసురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నేపథ్యంతో 1980 కాలమానంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమాలో విజయ్దేవరకొండ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ రూరల్ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేయగా, ఈ ‘రౌడీ జనార్ధన’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా విజయ్ దేవరకొండ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు ‘టాక్సీ వాలా’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్స్ కాంబినేషన్స్ లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది.ఈ సినిమా ప్రధాన కథాంశం 1854–1878 నేపథ్యంతో సాగుతుంది. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తారని, రష్మికా మందన్నా హీరోయిన్స్ గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ్రపారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారు.ఆకాశంలో ఒకతార‘మహానటి, సీతారామం, కాంత’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్సల్మాన్స్ . ఎంతలా అంటే ఆయన ఏ భాషలో సినిమా చేసినా, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేంతలా. తాజాగా దుల్కర్సల్మాన్స్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒకతార’. పవన్స్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమాస్ల సమర్పణలో లైట్బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా కథనం ప్రధానంగా ఓ పల్లెటూరి నేపథ్యంతో సాగుతుందని, ఇందులో దుల్కర్ సల్మాన్స్ ఓ రైతు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.స్వాతంత్య్రానికి పూర్వం..నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1905 టైమ్లో జరుగుతుందని తెలిసింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్స్ ఉన్న కొందరు భారతీయులు ఎలాంటి వ్యూహరచన చేశారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నిఖిల్, మరో కీలక పాత్రలో అనుపమ్ఖేర్ నటిస్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సవార్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తారట మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ మధ్య సెట్స్లో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అప్పట్లో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అధికా రికంగా మరో అప్డేట్ రావాల్సి ఉంది. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ కోవలో పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. -
భలే చాన్స్
ప్రముఖ నటుడు రజనీకాంత్ని డైరెక్ట్ చేసే భలే చాన్స్ అందుకున్నారు యువ దర్శకుడు శిబి చక్రవర్తి. రజనీకాంత్ నటించనున్న 173వ చిత్రం గురించి ఇటీవల పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. నటుడు కమల్హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మూవీకి సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లు తొలుత ప్రకటన వెలువడింది. కమల్హాసన్, రజనీకాంత్తో సుందర్.సి కలిసి ఉన్న ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సందర్ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.ఆ తర్వాత ఈ మూవీకి ‘డ్రాగన్ ’ ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు శిబి చక్రవర్తి తెరపైకి వచ్చారు. శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్, డాన్ ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. నిజానికి ఇంతకుముందే రజనీ కోసం ఓ మంచి కథను సిద్ధం చేశారు దర్శకుడు. కాగా రజనీకాంత్ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు కమల్హాసన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని 2027 పొంగల్కి విడుదల చేస్తామని కమల్ పేర్కొన్నారు. – సాక్షి సినిమా, చెన్నై -
రెబెకా వచ్చేశారు
‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యష్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలకు సంబంధించిన లుక్స్ని విడుదల చేశారు. తాజాగా తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ–‘‘తారా సుతారియా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఆమె కెరీర్లో ఇదొక కొత్త అధ్యాయం. తను ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. రెబెకా పాత్రలో తను జీవించింది. తన నటన నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులనూ ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’’ అని చెప్పారు. -
బర్త్ డే స్పెషల్
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు (జనవరి 3) సందర్భంగా ఆయన నటిస్తున్న ‘హైందవ, రామమ్, టైసన్ నాయుడు’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘హైందవ’ ఒకటì . లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్ షైన్ పిక్చర్స్పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. జనవరి 3న సాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.అదేవిధంగా లోకమాన్య దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామమ్’. ‘ది రైజ్ ఆఫ్ అకీరా’ అన్నాది ట్యాగ్ లైన్. దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్పై ప్రోడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లుక్ని రిలీజ్ చేసింది యూనిట్. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమా ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. -
'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. -
2026నే టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎవరికి కలిసొస్తుందో?
గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ)వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.ఏప్రిల్లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా) -
బ్లాక్ డ్రస్లో నిధి.. ఫ్రాక్లో రిద్ధి.. ఫరియా ఇలా
బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న నిధి అగర్వాల్ఫ్రాక్లో మైమరిపించేస్తున్న రిద్ధి కుమార్కొంటె చూపులతో మాయ చేస్తున్న ఫరియాఅందానికే అసూయపుట్టేలా శ్రద్ధా కపూర్తమ్ముడితో కలిసి మంచు కొండల్లో సారా View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
సినిమా నచ్చకపోతే మందుబాటిల్ ఇప్పిస్తా: దర్శకుడు
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సక్సెస్ మీట్పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. మందు తాగి లొల్లి పెడదాంకానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. రీమేక్పై క్లారిటీ
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది.అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది. -
జనరల్ కంపార్ట్మెంట్ హీరో.. 'జెట్లీ' టీజర్ రిలీజ్
'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా పెట్టి ఓ మూవీ తీస్తున్నాడు. అదే 'జెట్లీ'. ఇప్పుడు న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జనరల్ కంపార్ట్మెంట్ హీరో అని సత్య చివరలో చెప్పిన డైలాగ్ ఫన్నీగా ఉంది.సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని పూర్తిగా ఫ్లైట్లోనే తీసినట్లు గ్లింప్స్ చూస్తే అనిపించింది. హైజాక్ లాంటిది జరిగితే విమానంలోని ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించారు, తద్వారా ఎలాంటి కామెడీ వచ్చిందనే పాయింట్తో మూవీ తీశారనిపిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర.. నువ్వు హీరోవా? టైర్ 1? టైర్ 2? అని సత్య పాత్రని అడిగితే.. జనరల్ కంపార్ట్మెంట్ అని బాగుంది. బహుశా వేసవిలో దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో? -
బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ
గత కొన్నేళ్ల కాలంలో భర్తల్ని భార్యలు రకరకాలుగా చంపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ మహిళ.. తన భర్త శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్లో దాచిపెడితే, మరో భార్య హనీమూన్కి తీసుకెళ్లి భర్తని చంపించింది. ఈ వార్తలని మీరు చూడటమో చదవడమో చేసే ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటనలపై ఏకంగా వెబ్ సిరీస్ తీశారు. దాన్ని స్ట్రీమింగ్కి సిద్ధం చేశారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఏ ఓటీటీలోకి రానుంది?భర్తల్ని భార్యలు హ*త్య చేయించడం లాంటి సంఘటనలు గతేడాది ఎక్కువగా విన్నాం, చూశాం. అలాంటి ఓ ఐదింటిని తీసుకుని ఇప్పుడు 'హనీమూన్ సే హత్య' పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్గా తీశారు. జీ5 ఓటీటీలో ఈనెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఇందులో నీలం రంగు డ్రమ్ కేసు, హనీమూన్ కేసుతో పాటు పాటు మరో మూడు కేసుల్ని కూడా చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లూ డ్రమ్ కేసు విషయానికొస్తే.. మర్చంటే నేవీ ఆఫీసర్ సౌరభ్, ముస్కాన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు భర్తని కాదనుకున్న ముస్కాన్.. ప్రియుడి సాహిల్తో కలిసి సౌరభ్ని కిరాతకంగా చంపేసింది. ఆపై శరీర భాగాల్ని నీలం రంగు డ్రమ్లో పెట్టి సీల్ చేసింది. తన తండ్రి డ్రమ్లో ఉన్నాడని సౌరభ్ కుమార్తె.. ఇరుగు పొరుగువాళ్లకు చెప్పడం వల్లే ఈ ఉదంతం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్, సాహిల్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు.హనీమూన్ హత్య విషయానికొస్తే మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ.. సోనమ్ని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. తర్వాత వీళ్లిద్దరూ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో హత్య అని అనుమానించారు. భార్య సోనమ్ కోసం గాలించగా.. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపుర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించినట్లు ఒప్పుకొంది. (ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)It looked like a happily ever after until… it wasn’t.#HoneymoonSeHatya premiering on 9th January, on #ZEE5#HoneymoonSeHatyaOnZEE5 #GreytIndianWedding pic.twitter.com/7UoWCeU1MT— ZEE5Official (@ZEE5India) January 2, 2026 -
శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్ గిఫ్ట్!
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.శత్రువుల్లేరుట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగుపర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లుబాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: సింగర్తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)సల్మాన్ ఖాన్కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
హీరోగా అకీరా నందన్.. రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు. కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు. -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు, రచయితలు డిఫరెంట్ కథలతో మూసధోరణికి భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ టైంలో అలా దక్షిణాదిలో హాట్ టాపిక్ అయిపోయిన మలయాళ చిత్రం 'ఎకో'(Eko Movie). థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)కథేంటి?కేరళలోని కాట్టుకున్న అటవీ ప్రాంతంలో ఎత్తయిన ఓ కొండపై మిలాతీ(బియానా మోమిన్) అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్ పీయూస్(సందీప్ ప్రదీప్). ఈ కుర్రాడిని మిలాతీ కొడుకులు నియమిస్తారు. అలానే మలేసియా జాతికి చెందిన పదుల కుక్కలు.. ఈమెని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాయి. అయితే ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్దేవ్) కోసం ఓ నేవీ అధికారి(నరైన్), కురియాచన్ స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) తదితరులు వెతుకుతూ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్రేంటి? మలేసియాకు చెందిన మిలాతీ.. కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది? అనేది అసలు కథ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫార్మాట్ అంటూ ఏం ఉండదు. చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా సాదాసీదా స్టోరీలా అనిపించాలి. ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే ఆశ్చర్యపోవాలి. 'ఎకో' కూడా అలాంటి ఓ మూవీనే. గతంలో 'కిష్కిందకాండం' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు దింజిత్ అయ్యతన్- రచయిత బహుల్ రమేశ్ కాంబో.. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చారు. మరోసారి హిట్ కొట్టారు. ఆ మూవీలో కోతులు కీలక పాత్ర పోషించగా.. ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి.సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి, చివరకు దొరికాడా లేదా? అనేదే మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి, కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించారు. ప్రారంభంలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపిస్తుంది కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికీ ఏదో అర్థం కాలేదే అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలసిస్ చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు అరె భలే తీశార్రా అనిపిస్తుంది.సైకో కిల్లర్స్ని చూసి మనం భయపడతాం. కానీ చాలా సాదాసీదా బతుకుతూ తమ పనికి అడ్డం వచ్చేవారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్తో తీసిన సినిమా. చాలా మలయాళ చిత్రాల్లానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే అడవుల విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. మెయిన్ స్టోరీకి మలేసియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీలో ఉన్న ట్విస్టులు చాలా చిన్నవే కానీ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వల్ల అవి డిఫరెంట్గా అనిపిస్తాయి.సినిమాల్లో టెక్నికల్ విషయాలు బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతోనూ చూడొచ్చు. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్దేవ్, బియానా మోమిన్, వినీత్, నరైన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లందరి సంగతి పక్కనబెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలీదు గానీ మూవీ అంతా చాలా సహజంగా.. మనం కూడా కొండపై, అడవుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ నెమ్మదిగా ఉన్నాసరే పర్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం 'ఎకో' బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) -
ప్రియుడికి ఫైమా సర్ప్రైజ్.. 8 ఏళ్లలో తొలిసారి అంటూ!
ఫైమా.. లేడీ కమెడియన్గా చాలా పాపులర్. పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్.. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. బిగ్బాస్ హౌస్లో ఉండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న తల్లికి ఓ ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యం అని చెప్పింది.ప్రియుడిని పరిచయం చేసిన కమెడియన్అనుకున్నట్లుగానే బిగ్బాస్ నుంచి బయటకు రాగానే తల్లి కోసం ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. కమెడియన్ ప్రవీణ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫైమా.. ఒకానొక సమయంలో తమది స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. 2024లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడి పేరు కూడా ప్రవీణ్ కావడం గమనార్హం. తాజాగా ప్రవీణ్ నాయక్ బర్త్డే సందర్భంగా అతడికో సర్ప్రైజ్ ఇచ్చింది. బర్త్డే సర్ప్రైజ్షాపింగ్ పేరుతో మాల్కు తీసుకెళ్లి అక్కడ అతడిపై బెలూన్ల వర్షం కురిపించింది. ప్రియుడితో కేక్ కట్ చేయించింది. తర్వాత ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చి అతడితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో నేను చేసిన ఫస్ట్ సెలబ్రేషన్.. హ్యాపీ బర్త్డే ప్రవీనూ..' అని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) చదవండి: నాతోపాటు నవ్వారు, ఏడ్చారు: బిగ్బీ ఎమోషనల్ -
సింగర్తో యంగ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
క్వీన్ ఆఫ్ ‘మార్క్’గా దీప్శిఖ చంద్రన్.. ఫ్యాన్స్ ఫిదా
కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మార్క్’.డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దీప్శిఖ చంద్రన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీప్శిఖ చంద్రన్.. ఈ చిత్రంలో బలమైన పాత్రలో కనిపించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఆమె యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె ధీరవనిత పాత్రకు మహిళా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు దీప్శిఖను "మార్క్ క్వీన్", "క్వీన్ ఆఫ్ మార్క్" అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పరిమితంగా ఉంటాయి కానీ, ‘మార్క్’లో దీప్శిఖ పాత్ర బలంగా నిలిచి సినిమాకు మరింత బలం చేకూర్చింది. పాజిటివ్ మౌత్ టాక్, థియేటర్ స్పందనతో ‘మార్క్’ కన్నడ మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ విజయం దీప్శిఖ చంద్రన్ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడ ప్రేక్షకులకు కొత్త క్రష్గా మారిన దీప్శిఖకు గుర్తింపు, ఆదరణ పెరుగుతున్నాయి. -
విజయ్ సేతుపతి హీరోగా మూకీ సినిమా.. టీజర్ రిలీజ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఏస్, తలైవన్ తలైవి లాంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు సడన్గా ఓ మూకీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.'గాంధీ టాక్స్' పేరుతో తీస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానని విజయ్ సేతుపతి.. అప్పుడెప్పుడో 2021లో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. 2023 నవంబరులో గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత మళ్లీ సైలెంట్. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజరో ట్రైలరో తెలీదు గానీ 80 సెకన్ల వీడియోని రిలీజ్ చేసి థియేటర్లలోకి ఎప్పుడొస్తుందనే విషయాన్ని ప్రకటించారు. మూకీ సినిమాని ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనేది చూడాలి? -
నాతోపాటు నవ్వారు, ఏడ్చారు.. బిగ్బీ భావోద్వేగం
సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్బీ భావోద్వేగానికి లోనయ్యాడు.అంతా నిన్ననే..కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.థాంక్యూ సో మచ్నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @sonytvofficial చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ రివ్యూ
తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’ . సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీ జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కృష్ణా జిల్లాలోని చౌటపల్లికి చెందిన ఘంటసాల(అతులిత్/కృష్ణ చైతన్య) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. ఎప్పకైనా గొప్ప సంగీత విద్వాసుడు అవుతానంటూ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు విజయనగరం వెళ్తాడు. అక్కడ ఓ సంగీత పాఠశాలలో చేరాలనుకుంటాడు.కానీ అతని ప్రయత్నం ఫలించదు. చివరకు పట్రాయని సీతారామశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరతాడు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే..పొట్టకూటి కోసం రోడ్డు మీద భిక్షాటన చేస్తాడు. తన శిక్షణ పూర్తయ్యాక తిరిగి సొంతూరుకు వెళ్తాడు.తనకు వరసైన పార్వతమ్మ (మృదుల)ని పెళ్లి చేసుకుంటాడు. ఆపై సముద్రాల రాఘవాచారి (జె.కె. భారవి) ప్రోద్బలంతో మద్రాసుకి వెళ్తాడు. ఇక మద్రాసుకి వెళ్లిన తరువాత ఘంటసాలకు ఎదురైన అనుభవాలు ఏంటి? రోడ్డు మీద భిక్షాటన చేసే స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వేదికలపై కచేరీలో చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? చివరి దశలో ఆయనకు వచ్చిన కష్టాలేంటి? ఆయన చివరి కోరిక ఏంటి? అది నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఘంటసాల గొప్ప గాన గంధర్వుడు అని అందరికి తెలిసిందే. ఎన్నో వేల పాటల్ని పాడి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన..జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నేటి తరానికి పెద్దగా తెలియని ఘంటసాల వ్యక్తిగత జీవితాన్ని తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల వ్యక్తిగత కష్టాలు, గొప్ప మనసును ప్రేక్షకులకు తెలియజేయడం లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఘంటాల బాల్యం, ఆర్థిక ఇబ్బందులు, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎదురైన అవమానాలను చూపించారు. ఘంటసాలను వేధించే పీడకల ప్రవేశంతో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ను డిజైన్ చేశారు. ఇక సెకండాఫ్లో ఘంటసాల వైభవం, ప్రఖ్యాతిని చూపించారు. ఆయన ఇండస్ట్రీలోకి రావడం.. తన సంగీతంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం.. ఘంటసాల సూపర్ హిట్ పాటలతో కాస్త ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి దిగ్గజాల ప్రశంసల సీన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. బడే గులాం అలీ ఖాన్తో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చక్కగా వివరించారు. ఘంటసాల పర్సనల్ లైఫ్ని నేటి తరానికి తెలియజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ.. ఓ పూర్తి స్థాయి సినిమాగా, కమర్షియల్గా చూసుకుంటే మాత్రం ఘంటసాల అందరినీ అంతగా మెప్పించకపోవచ్చు.ఎవరెలా చేశారంటే..చిన్నప్పటి ఘంటసాల పాత్రలో బాల నటుడు అతులిత్ బాగా నటించాడు. ఇక పెద్ద ఘంటసాల పాత్రలో కృష్ణ చైతన్య జీవించేశాడు. ఆయన నడక, హావభావాలు అన్ని తెరపై నిజమైన ఘంటసాను చూసినట్లుగానే అనిపిస్తాయి. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఓ కీలక పాత్రలో బడే గులాం అలీ ఖాన్గా సుమన్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఘంటసాల వారి గురువు పట్రాయని సితారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి, ఇంద్రుడి పాత్రలో సాయి కిరణ్, ఘంటసాల తల్లిగా జయ వాణి తో మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. చాలా వరకు ఘంటసాల వారు పాడిన పాటల్నే వాడారు. ఇక ఘంటసాల థీమ్ మ్యూజిక్, బడే గులాం అలీ ఖాన్ పాడిన పాటలు, నేపథ్య సంగీతం అన్నీ కూడా ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ మాత్రం తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.రేటింగ్: 2.5/5 -
'మగాడిలా తయారవుతున్నావ్'.. నటి కూతురి కౌంటర్
మలయాళ నటి, యాంకర్ మంజు పిళ్లై- దర్శకుడు, కొరియోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ల కూతురు దయ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. కాస్త బొద్దుగా ఉన్నందుకు కొందరు తనపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది. ఇటీవలే ఆమె జిమ్కు వెళ్లడం మొదలుపెట్టగా.. రానురానూ మగాడిలా తయారవుతున్నావని ఓ వ్యక్తి విమర్శించాడు.నీకు మగతనం లేదుదీనిపై దయ సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది. నాలో మగతనం ఉందని, జిమ్కు వెళ్తే పూర్తిగా మగాడినైపోతానని ఓ వ్యక్తి అన్నాడు. నాలో ఈ మగతనం నీకు అసౌకర్యాన్ని కలిగిస్తే సారీ.. నాలోని ఈ మగతనాన్ని అంగీకరించేంత పౌరుషం మీకు లేకపోవడం బాధగా ఉంది. మీరు నాకంటే పెద్ద మగాడినని ఒప్పుకునేంత మగతనం లేకపోవడం విచారకరం అని పేర్కొంది. View this post on Instagram A post shared by jaaannuuuu (@daya.sujith) చదవండి: హిందీలో డియర్ కామ్రేడ్? స్పందించిన బాలీవుడ్ హీరో -
రాజాసాబ్, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ ట్రైలర్ రావడంతో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు. అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు. -
సోఫాపై నగ్నంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా?
పలు చిత్రాల్లోనూ... వెబ్ సిరీస్ల్లోనూ కథానాయకుడిగానూ, కీలక పాత్రల్లోనూ నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్యరావు. ఒకవైపు హీరోగా నటిస్తూనే..మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన అనుష్క ‘ఘాటీ’ సినిమాలో విలన్గానూ నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ విలక్షణ నటుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు) విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ను గమనిస్తే..దుస్తులు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావును చూడొచ్చు. తను రగ్డ్ లుక్తో స్క్రీన్ను సీరియస్గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్నెస్ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుందిఈ సందర్భంగా... చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించటానికి సిద్ధమవుతున్నారు. చైతన్యరావు మదాడిని న్యూ అవతార్లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్ను సినిమాటిక్ లాంగ్వేజ్లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥 WISHING YOU ALL THE LUCK 🤗CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026 -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
రూ.70 కోట్ల సినిమా.. 2.19 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ!
గతంలో స్టార్ హీరో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్ వైపే వెళ్లడం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్గా నిలిచింది.దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
రజనీకాంత్ కొత్త సినిమా ప్రకటన.. యంగ్ దర్శకుడికి ఛాన్స్
తమిళ నటుడు రజనీకాంత్ కొత్త సినిమాను ప్రకటించారు. తలైవర్ 173 పేరుతో ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ హీరో కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా తెలిపారు. రీసెంట్గా కూలీ సినిమాతో వచ్చిన రజనీ.. త్వరలో జైలర్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత రజనీ నుంచి వచ్చే సినిమా ఇదే కావడం విశేషం.రజనీకాంత్ 173వ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ యంగ్ దర్శకుడు శిబి చక్రవర్తికి దక్కింది. అయితే, ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటన వెలువడింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి అవకాశం వరించింది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన డాన్ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్ కోసం అదిరిపోయే కథతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్ యాక్షన్ సినిమాను రూపొందింస్తున్నట్లు టాక్. ఈ మూవీకి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటన చేశారు.Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026 -
బాలకృష్ణ, గోపీచంద్ల కథ కంచికి.. మేకర్స్ కీలక నిర్ణయం
బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ కథను సైడ్ చేశారు. అయితే, మరో కథతో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఈ మూవీ రానుంది. మొదట హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా మేకర్స్ అనుకున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్ అయినా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్ కిలారు పూనుకున్నారు. అందుకోసం నయనతారను హీరోయిన్గా రంగంలోకి దింపారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి.ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్నట్లు మేకర్స్ గతంలోనే చెప్పారు. ఆపై విజువల్ వండర్గా గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. కానీ, సడెన్గా నిర్మాత, హీరో, దర్శకుడు అంతా కలిసి మనసు మార్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ను సైడ్ చేసి మరో కథతో షూటింగ్ ప్రారంభించాలని వారు డిసైడ్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది.ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా నిర్మించాలంటే భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. కనీసం రూ. 150 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని టాక్.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి అంత మెరుగ్గాలేదు. పైగా అఖండ-2ను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసినా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆపై ఓటీటీ ఆదాయం కూడా పెద్దగా లేదు. బాలయ్య మార్కెట్ ప్రకారం అంత బడ్జెట్ వర్కౌట్ కాదని తెలిసి మరో కథతో సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. -
'బోర్డర్-2' .. సైనికులకు సెల్యూట్ చేసేలా సాంగ్
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న చిత్రం బోర్డర్-2.. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 1997లో వచ్చిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని నిర్మించారు. తొలి పార్ట్ను జె.పి. దత్తా తెరకెక్కించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ రూపొందించారు. ‘విజయ్ దివస్’ని పురస్కరించుకుని విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 1997 నాటి బోర్డర్ మూవీలోని ఐకానిక్ సాంగ్ 'సందేశే ఆతే హై'ని రీమేక్ చేశారు. ఆధునిక హంగులతో చాలా చక్కగా రీమేక్ చేశారంటూ ఈ పాటను నెటిజన్లు ప్రశంసించారు. కానీ, వరుణ్ ధావన్ పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. -
ప్రదీప్ రంగనాథన్ సరసన టాప్ హీరోయిన్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్టుడే సినిమా చేశాడు. యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాడు.ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్.. ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్ దంపతులు
నటుడు సాయి కుమార్ ఇంట వారసుడు జన్మించాడు. ఆది సాయికుమార్, అరుణ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. సోషల్మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. దీంతో తన సన్నిహితులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారికి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. అయితే, పాప పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో వారసుడు జన్మించాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. శంబాల సినిమా సక్సెస్తో పాటు కొత్త ఏడాదిలో వారసుడి రాకతో సాయికుమార్ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారట.2014లో అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ని ఆది పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి అయ్యాడు. జనవరి 2న పండంటి బాబుకు అరుణ జన్మనిచ్చారు. దీంతో ఆదికి ఈ కొత్త ఏడాది శుభవార్తతో ప్రారంభమైంది. శంబాల కలెక్షన్స్..చాలా ఏళ్ల తర్వాత శంబాల మూవీతో ఆది సాయికుమారు భారీ విజయాన్ని అందుకున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆది కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా శంబాల రికార్డ్ క్రియేట్ చేసింది. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
నర్సు నుంచి హీరోయిన్ రేంజ్కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ
మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. బిగ్బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ బిగ్బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
విలేజ్ క్రైమ్ డ్రామా
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్పై సాయి శ్రీమంత్, శబరీష్ బోయెళ్ల నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ని తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కిషోర్ శ్రీకృష్ణ తెరకెక్కించిన‘అసుర సంహారం’ సినిమా బాగా వచ్చింది. ఇందులో పల్లెటూరి డిటెక్టివ్ పాత్ర పోషించాను’’ అని చె΄్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో సినిమాని రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కిషోర్ శ్రీకృష్ణ తెలిపారు. ‘‘విలేజ్ క్రైమ్ డ్రామాగా రూ΄÷ందిన మా సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి’’ అని ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా అన్నారు. -
ఓ మై గాడ్
బాలీవుడ్ సూపర్హిట్ ఫ్రాంచైజీ ‘ఓ మై గాడ్’ నుంచి ‘ఓ మై గాడ్ 3’ సినిమా షూటింగ్కు సన్నాహాలు మొదలయ్యాయి. ‘ఓ మై గాడ్ (2012), ఓ మై గాడ్ 2 (2023)’ చిత్రాల్లో లీడ్ రోల్లో నటించిన అక్షయ్కుమార్ ‘ఓ మై గాడ్ 3’లోనూ నటించనున్నారు. ఈ చిత్రంలోని మరో లీడ్ రోల్లో రాణీ ముఖర్జీ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక సామాజిక అంశాన్ని చర్చించేలా ఈ సినిమా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారట అమిత్. ఈ ఏడాది జూన్లో చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలిసింది . ఇక ప్రస్తుతం దర్శకుడు అనీస్ బాజ్మీతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి రెడీ అవుతున్నారు అక్షయ్కుమార్. తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కి హిందీ రీమేక్గా ఇది తెరకెక్కనుందట. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడోవారంలో ప్రారంభం కానుందని తెలిసింది. -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. ఆడియన్స్ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్లో వైరస్ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్ జోన్లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/3kWJddv1qd— The RajaSaab (@rajasaabmovie) January 2, 2026 -
భర్తతో సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. ఆ పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరిపై రూమర్స్ వస్తున్నా పట్టించుకోలేదు. చివరికీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ రూమర్స్ను నిజం చేశారు.తాజాగా ఈ నూతన జంట న్యూ ఇయర్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా..సమంత- రాజ్ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026 -
ఇనయ సుల్తానా ‘మదం’ మూవీ రివ్యూ
టైటిల్: మదంనటీనటులు: హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి తదితరులునిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్నబాబు), రమేష్ బాబు కోయదర్శకత్వం: వంశీ కృష్ణ మళ్లసంగీతం: డేవ్ జాండ్ఎడిటింగ్: నందమూరి తారక రామారావుసినిమాటోగ్రఫీ: రవి. వివిడుదల తేది: జనవరి 2, 2026బిగ్బాస్ షో కంటే ముందు ఇనయా సుల్తానా పేరు ఎవరికీ తెలియదు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మదం. రాఅండ్ రస్టిక్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఓ అవినీతి పోలీసు అధికారి, అతని భార్య స్వార్థం వల్ల సర్వస్వం కోల్పోయిన ఒక నిరుపేద కుటుంబం యొక్క విషాద గాథ ఇది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో(హర్ష గంగవరపు) ఎలాంటి పోరాటం చేశాడు?, తన అందచందాలతో మగవాళ్లను పావుగా వాడుకునే బోల్డ్ లేడీ(ఇనయ సుల్తానా)కి,ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హీరో ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..'మదం' అనే టైటిల్ వినగానే ఇది కేవలం అడల్ట్ మూవీ అని అనుకుంటే పొరపాటే. ఇది ఒక మహిళా మనస్తత్వాన్ని, సమాజంలోని అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టే సామాజిక చిత్రం. దర్శకుడు ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, కథకు అవసరమైన మేరకే బోల్డ్ సీన్లను ఉపయోగించుకున్నారు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా హీరో ఫ్యామిలీ నేపథ్యం, పోలీసు అధికారి వల్ల వారి కుటుంబానికి వచ్చే కష్టాలను చూపించారు. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఇనయ సుల్తానా పాత్ర ఎంట్రీతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆమెను బోల్డ్గా చూపిస్తూనే.. ఫ్లాష్బ్యాక్ ఏదో ఉంటుందన్న క్యూరియాసిటీని పెంచేశాడు. ఫస్టాఫ్లో సిల్లీగా అనిపించే కొన్ని సీన్లకు.. సెకండాఫ్లో ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని బోల్డ్ సీన్లు..ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తాయి. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం ఇనయ సుల్తానా. గటివ్ షేడ్స్ ఉన్న, బోల్డ్ అండ్ అగ్రెసివ్ పాత్రలో ఆమె జీవించేసింది. తెలుగు తెరపై హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు కాకుండా, ఒక ఇంటెన్స్ పవర్ఫుల్ పాత్రలో ఆమె కనిపించడం విశేషం. హీరోహర్ష గంగవరపు తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. అనురూప్, లతా రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈగల్ ఫేమ్ డేవ్జాండ్ సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు యావరేజ్గానే ఉన్నా..బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడు. రవి వి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
బిగ్బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!
తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. గతేడాది డిసెంబర్లో ముగిసిన ఈ సీజన్లో కామనర్గా హౌస్లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్ప్రైజ్ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ రన్నరప్గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్స్టార్లో 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్ మా టీవీ రేటింగ్స్లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.UNBEATABLE!! UNREACHABLE!! 🔥🔥🔥🔥🔥19.6 TVR on StarMaa, 285 million minutes on Jiostar 💥🔥The #BiggBossTelugu9 Grand Finale stands tall as the BIGGEST in the last 5 years.A season filled with emotions, passion, conflicts, and unforgettable moments. 🔥My heartfelt thanks to… pic.twitter.com/HlR4B56XTy— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 2, 2026 -
'ఫౌజీ' బ్యూటీ కొంటెచూపు.. అనుపమ అందంగా!
ఎర్రచీరలో కొంటెచూపులతో 'ఫౌజీ' ఇమాన్విఅందాల చందమామలా అనుపమ పరమేశ్వరన్సెల్ఫీలతో మాయ చేసేస్తున్న కాయదు లోహర్బీచ్ ఒడ్డున గ్లామర్తో అలరిస్తున్న విష్ణుప్రియగ్లామర్ డోస్ పెంచిన హీరోయిన్ కేతిక శర్మ View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
శంబాల.. వారం రోజుల్లో ఎంతొచ్చిందంటే?
హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్ రావడం మరింత విశేషం! వారం రోజుల్లోనే అన్ని కోట్లా?శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్తో ఆదికి మంచి బూస్ట్ దొరికినట్లయింది! #Shambhala pic.twitter.com/Bmc71qEtbb— Aadi Saikumar (@iamaadisaikumar) January 2, 2026 చదవండి: భార్యకు విడాకులు! మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ కథేంటో అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు.


