బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కనుందనే విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ మూవీ తర్వాత వీరి కాంబోలో ‘NBK111’(వర్కింగ్ టైటిల్) కొత్త ప్రాజెక్ట్కు లైన్ క్లియర్ అయింది. ఈ మూవీని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రధాన విలన్గా నటించబోతున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ‘మిరాయి’లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్కు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ కథ నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా ఛాన్స్ రావడం ఆపై స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.

ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుందని సమాచారం. మార్చిలో చిత్రీకరణ ప్రారంభకానుంది. బాలయ్య గత చిత్రాల్లా కాకుండా ఇందులో ఆయన ఒకే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే స్టైలిష్గా కనిపించే విలన్ పాత్ర కోసం మనోజ్ను ఎంపిక చేశారట. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే.


