breaking news
Tollywood
-
మళ్లీ ప్రేమకథ షురూ
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల వెండితెర ప్రేమకథ మళ్లీ షురూ అయింది. ఈ ఇద్దరూ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాటలకు మంచి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ‘తూ మేరీ జిందగీ హై’ టైటిల్ని అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.తాజాగా ముంబైలో మళ్లీ ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ని షురూ చేశారు. శ్రీలీల పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాని పూర్తి చేసేలా అనురాగ్ బసు ప్లాన్ చేశారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. హిందీలో శ్రీలీలకి ఇదే తొలి చిత్రం. సౌత్లో స్టార్గా ఎదిగిన శ్రీలీల ఈ చిత్రంతో హిందీలోనూ దూసుకెళతారనే అంచనాలు ఉన్నాయి. -
చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి
తెలుగులో ఒకప్పటి దర్శకులైనా ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క మూవీ అయినా చేయాలని ఆశపడుతుంటారు. సర్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి కూడా ఇప్పుడు చిరుతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)'చిరంజీవితో ఒక సినిమా అనుకున్నాం. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. మరీ ముఖ్యంగా నేను అనుకున్న సబ్జెక్టుని, చిరంజీవి లాంటి స్టార్ని హ్యాండిల్ చేయాలంటే, నేను ఇంకాస్త ఎదగాలి అనుకుంటున్నాను. చిరంజీవి లాంటి స్టార్ హీరో చేసినప్పుడు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.వెంకీ అట్లూరి గురించి చెప్పుకోవాలంటే హీరోగా టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించాడు. రెండు చేసేసరికి సీన్ అర్థమై దర్శకుడిగా మారిపోయాడు. వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ' తీసి డైరెక్టర్గా తొలి సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రంగ్ దే, మిస్టర్ మజ్ను ఫెయిలయ్యాయి. దీంతో రూట్ మార్చిన వెంకీ.. ధనుష్తో 'సర్', దుల్కర్ సల్మాన్తో 'లక్కీ భాస్కర్' లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాడు. తాజాగా సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి ఇలాంటి దర్శకుడు చిరంజీవితో థ్రిల్లర్ అంటే ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!) -
ట్రైన్లో ఆర్పీఎఫ్ సిబ్బందితో గొడవ.. నటిపై కేసు..!
టీవి నటి అంతరా బెనర్జీ రైలులో చేసిన హంగామా వివాదాస్పందంగా మారింది. అరావళి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సమయంలో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఆమె అరెక్టుకు దారితీసింది అని తెలిసింది. ఆర్పీఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా రేజర్ బ్లేడ్తో ఓ కానిస్టేబుల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షూటింగ్ నిమిత్తం సూరత్కు వెళ్తున్న అంతరా బెనర్జీ స్లీపర్ క్లాస్ టికెట్తో ఏసీ కోచ్లోకి ప్రవేశించారు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడి సీటులో కూర్చోవడంతో వివాదం ప్రారంభమైంది. సీటు ఖాళీ చేయాలని ఆర్పీఎఫ్ అధికారులు కోరినా ఆమె నిరాకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు వెళ్లిన ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యామినీకాంత్ మిశ్రాతో ఆమె వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రేజర్ బ్లేడ్తో ఓ కానిస్టేబుల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి రోజు ఆమెను బోరివలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ఎవరీ అంతరా బెనర్జీకోల్కతాలో జన్మించిన అంతరా బెనర్జీ 2012లో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘గుమ్రాహ్ ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్’, ‘సావధాన్ ఇండియా’, ‘బడో బహు’, ‘లాల్ ఇష్క్’ వంటి సీరియల్లో నటించారు. ‘కసౌటీ జిందగీ కే సీరియల్’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘రాగిణే ఎంఎంఎస్ రిటర్న్-2’ వెబ్ సిరీస్లోనూ నటించారు. -
'2కె లవర్స్' సినిమా ఘనంగా ప్రారంభం
రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న '2కె లవర్స్' సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి)దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. 'తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది' అని చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.35 లక్షలు.. కానీ మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) -
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
-
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
‘కష్టమొస్తే ఆధారపడేది ఆ స్టార్ హీరోపైనే’
అనుపమ పరమేశ్వరన్ . ఈ పేరు కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళియాలం నుంచి మొదలు తెలుగు ఇండెస్ట్రీలోనూ ఓ ప్రత్యేక ఫాన్బేస్ను సంపాదించుకుంది ఈ బామ. అయితే ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన బ్రేకప్ కోసం, ఆపదలో ఉన్న ఉన్నప్పుడు ఆదుకునే యాక్టర్స్ కోసం తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు వైరలవుతున్నాయి. ‘ కొద్ది రోజుల నుంచి చాలా మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా నేను పూర్తిగా ఆధారపడగలిగే వ్యక్తి దుల్కర్నే. బాధగా ఉన్నప్పుడు విషయం తెలుసుకున్న దుల్కర్ సల్మాన్ తరచూ మెసేజ్లు పంపేవారు. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసేదాన్ని. నా పరిస్థితి బాగోలేదని ఆయన ఎలా గుర్తించేవాడో ఇప్పటి ఆశ్చర్యంగా ఉంటుంది. హీరో రామ్ పోతినేనితో కూడా మంచి బాండింగ్ ఉంది’ అని వెల్లడించింది.ఇదే ఇంటర్వ్యులో తన రిలేషన్షిప్, బ్రేకప్ కోసం కూడా అనుపమ మాట్లాడింది. తన మాజీ ప్రియుడి వల్ల ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్’ ఎదుర్కున్నట్లు తెలిపింది. కాగా, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్ గతంలో ‘జొమొంటే సువిశేషంగళ్’ ( తెలుగులో అందమైన జీవితం) సినిమాలో నటించారు. 2017లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ లక్కీ భాస్కర్, మహానటి, సీతారామమ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదీ చదవండి: రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్పై అనుపమ సంచలన వ్యాఖ్యలు -
బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు జనని వివాహం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున సందడి చేశారు. ఈ పెళ్లి ఫంక్షన్లో హీరోలు వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హాస్యనటులు బ్రహ్మనందం, సునీల్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ సతీసమేతంగా పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీస్సులు అందించారు. బండ్లన్న కుమార్తె వివాహ వేడుకలో సునీల్ ..#sunil #Bandlaganesh #janani#Jananisuryapayanam pic.twitter.com/mZwETRvS5z— SZN (@Suzenbabu) August 16, 2026 -
శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు)
-
'నా పిల్లలు కూడా ఆ సలహా ఇస్తారు.. కానీ'
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు రవితేజ. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారాయన. తాను సోషల్ మీడియాను ఎక్కువగా వాడనని తెలిపారు. అయితే అభిమానుల్లో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఫోటోలు, కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేయాలని తన పిల్లలు సలహా ఇస్తుంటారని మాస్ మహారాజా వెల్లడించారు. అయితే తాను పిల్లల సూచనలను అరుదుగా పాటిస్తానని రవితేజ అన్నారు.ప్రస్తుతమున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ అవసరమని రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను వాటి గురించి ఆందోళన చెందకుండా.. తనకు నచ్చినవి మాత్రమే పోస్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. కాగా.. ఇరుముడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి..!
బిగ్బాస్ సీజన్-10 మరికొద్ది రోజుల్లోనే బుల్లితెర ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ బిగ్ షో మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఈ ఏడాది సీజన్పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట మొదలెట్టిన మేకర్స్ అగ్నిపరీక్ష పెట్టేశారు. ఈ పోటీలో ఫైనల్కు 15 మందిని ఎంపిక చేయగా.. వీరిలో హౌస్లో ఎవరు అడుగుపెడతారో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.ఇదిలా ఉంటే ఈ అగ్నిపరీక్ష ఫైనల్కు చేరుకున్న వారిలో రైతుబిడ్డ, సింగర్ ఝాన్సీ కూడా ఉన్నారు. తమ పొలంలో పంట, రైతుల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అలాగే తన పాటలతోనూ ఆకట్టుకున్నారు. అలా బిగ్బాస్ ఛాన్స్ కోసం అగ్నిపరీక్షలో ఫైనల్కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలోనే సింగర్ ఝాన్సీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె కేవలం ఓ సింగర్ మాత్రమే కాదు.. చదువుల సరస్వతి కూడా. ఈ అగ్నిపరీక్షలో నవదీప్ ఆమెను చదువు గురించి అడిగారు. తాను పీజీలో ఆర్గానికి కెమిస్ట్రీ పూర్తి చేసినట్లు ఝాన్సీ వెల్లడించింది. తమ పొలంలో పనులు చేస్తూనే.. ఇంటర్లో ఏకంగా 926 మార్కులు సాధించినట్లు తెలిపింది. ఝాన్సీ టాలెంట్ చూసిన నవదీప్, బిందు మాధవి, యాంకర్ శ్రీముఖి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Gundeboina jhansi (@singer_jhansi) -
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బోనాలు.. ట్రోలింగ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా..
-
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష పేరుతో జరుగుతోన్న సెలెక్షన్ ప్రాసెస్లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు పాల్గొన్నారు. వీరందరినీ వడపోసి ఫైనల్కు ఓ 15 మందిని ఎంపిక చేశారు. మొత్తం 55 మంది ఎలిమినేట్ చేయగా.. వీరిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. తనకు అన్యాయం చేశాడంటూ నవదీప్పై ఫైరవుతున్నాడు. తాజాగా ఈ షో యాంకర్ శ్రీముఖి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ చేసింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.అయితే ఇదే బిగ్బాస్ అగ్నిపరీక్షలో మరో సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ రన్నింగ్ రాజా కూడా పాల్గొన్నారు. బిగ్బాస్ ఛాన్స్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చాడు. అయితే టాస్క్లో భాగంగా అతను శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు యత్నించాడు. శ్రీముఖి మేకప్ ఇలా వేసుకుంటుందని తన హావాభావాలతో చూపించాడు. అదే సమయంలో శ్రీముఖి దగ్గరికీ రన్నింగ్ రాజా వెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.దీంతో శ్రీముఖి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మా ఊర్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖి పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనలాంటి పల్లెటూరి వాళ్లను స్టేజీల మీదకు తీసుకెళ్లి బకరాలను చేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా ఇదంతా షోలో భాగమైతే ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల టాలెంట్ను మాత్రం హేళన చేస్తే సరికాదని మరికొందరు అంటున్నారు. View this post on Instagram A post shared by Khadeer Palleturi (@palleturikurrallu2) -
బిగ్బాస్ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్గా ఉండనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్బాస్ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్బాస్ సీజన్-10 నెక్ట్స్ లెవల్, వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఆడియన్స్లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. -
అజిత్ కోసం వెంకీమామ ఎంట్రీ.. మోహన్ లాల్ కూడా..!
కొత్తదనం లేకుంటే ఎంత పెద్ద స్టార్ నటించిన ఆ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్దాక్షింగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. దీంతో ప్రముఖ స్టార్స్ కూడా తమ చిత్రాల్లో మంచి ప్యాడింగ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ నటుడు రజనీకాంత్. ఈయన జైలర్ చిత్రం నుంచి తనతో పాటూ ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలను అతిధి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో అజిత్ కూడా ఆయన బాటలోనే పయనించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత అజిత్ తన దష్టిని కార్ రేస్ పోటీలపై మరలించారు. ఆ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలుచుకున్నారు. కాగా ఆ సన్నివేశాలను విజయ్ చిత్రంగా మలిశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గ్లాడియేటర్స్ ఇన్ పర్చూట్ ఆఫ్ ఛాలెంజర్స్ పేరుతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ తన సతీమణి శాలినిని ప్రొడ్యూసర్గా పరిచయం చేస్తూ బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి డేర్ డెవిల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు.దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు వెంకటేశ్.. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడుఈ టాపిక్ కోలీవుడ్లో ఆసక్తిగా మారింది. -
వారణాసి, ఫౌజీ మేకర్స్తో కాలేదు.. రాకాతోనైనా అవుతుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటేడ్ మూవీస్లో ముందు వరుసలో ఉన్నవి ప్రభాస్ ఫౌజీ, మహేశ్ బాబు వారణాసి, అల్లు అర్జున్ రాకా. ఈ మూడు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్తో తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాల అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ బిగ్ అప్డేట్ ఆశించారు. కానీ జక్కన్న కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సరిపెట్టుకున్నారు. అలాగే ఆగస్టు 15న ప్రభాస్-హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తోన్న ఫౌజీ అప్డేట్ ఇచ్చారు. వీళ్లు కూడా కేవలం ఒక్క పోస్టర్తోనే సరిపెట్టారు. దీంతో వీడియో గ్లింప్స్ కానీ, టీజర్స్ కానీ వస్తాయని భావించినప్పటీ అలా జరగలేదు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ రిలీజ్ తేదీని ముందే ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్లే టీజర్ కానీ.. గ్లింప్స్ రాలేదని అర్థమవుతోంది.మిగిలింది రాకా ఒక్కటే..టాలీవుడ్లో మరో భారీ మూవీ రాకా. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారు. మహేశ్ బాబు, ప్రభాస్ చిత్రాల అప్డేట్స్తో నిరాశ చెందిన సినీ ప్రియులు రాకా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే రాకాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే రాకా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో గ్లింప్స్, టీజర్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో రాకాపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వారణాసి, ఫౌజీ మేకర్స్ ఇవ్వలేకపోయినా.. బిగ్ అప్డేట్ను రాకా మేకర్స్ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే. -
నీ వల్ల నా జీవితం నాశనమైంది: నవదీప్పై ఉప్పల్ బాలు ఆరోపణలు
ప్రస్తుతం బిగ్బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ల సెలెక్షన్ జరుగుతోంది. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు పరీక్ష పెట్టారు. ఈ అగ్నిపరీక్ష ఫైనల్కు 15 మందిని ఎంపిక చేశారు. ఈ సెలెక్షన్లో ఉప్పల్ బాలు కూడా పాల్గొన్నారు. అయితే అతను ఈ ఫైనల్ లిస్ట్కు అర్హత సాధించలేకపోయాడు. ఈ అగ్నిపరీక్షకు అభిజీత్, నవదీప్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.అయితే తనను బిగ్బాస్ వెళ్లనివ్వకుండా నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు. తనవి వల్గర్ వీడియోలంటూ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. స్టేజ్పైకి పిలిచి కనీసం టాస్క్ ఇవ్వకుండా.. పాట పాడనివ్వకుండా అవమానించారని ఉప్పల్ బాలు విమర్శలు చేస్తున్నారు. అభిజీత్ తనకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే.. నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు.నన్ను ఎంతగానో అవమానించావు.. నీ వల్ల నాకు వచ్చే అవకాశం కూడా పోయి నా జీవితం నాశనమైంది అంటూ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని..మాపై నీకెందుకంత కుళ్లు అంటూ ప్రశ్నించాడు. -
పబ్లిసిటీ దాటుతోంది
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ ట్రెండ్ మారుతోంది. గతంలో సినిమా ఈవెంట్లు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం అయ్యేవి. సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్స్, ఆడియో రిలీజ్లు, ప్రెస్మీట్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ప్రెస్మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్... ఇలా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ హైదరాబాద్లోనే జరిగేవి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, బ్లాక్బస్టర్ మీట్స్కి అయితే ప్రత్యేకించి ఆయా హీరోల అభిమానులు భాగ్యనగరానికి తరలి వచ్చేవారు. ఇప్పుడూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్ చేంజ్ అయింది. సినిమాల ప్రారంభోత్సవాల నుంచి షూటింగ్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ప్రెస్మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్స్... ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు తిరుపతి, గుంటూరు, విజయవాడ, వైజాగ్, భీమవరం, రాజమండ్రి, కర్నూలు, అనంతరపురం, వరంగల్... వంటి ప్రాంతాల్లోని ఓపెన్ గ్రౌండ్స్తో పాటు థియేటర్స్, కన్వెన్షన్ హాల్స్లోనూ జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఆయా సినిమాల ఈవెంట్లను నిర్వహించడం ద్వారా అక్కడి సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై బజ్ పెంచవచ్చన్నది మేకర్స్ ఆలోచన. అదే విధంగా మరికొంత మంది చిత్రయూనిట్స్ అయితే ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల సందడి మధ్య టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించడం కూడా ఈ మధ్య ట్రెండ్గా మారింది. ఆ విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం.భీమవరంలో ఇరుముడి... రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేశ్ కీలక పాత్రలు పోషించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని ఈ నెల 12న రవితేజ, సినిమా అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘హలో భీమవరం... నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. మాది భీమవరం అని ఎవరైనా సరే గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి కోడి పందేల్లో కలుద్దాం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది... సినిమా కూడా మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్యూ భీమవరం’’ అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘అందరికీ నమస్కారం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భీమవరంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మా ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు... గొప్ప ఎమోషన్’’ అని చెప్పారు. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని భీమవరంలో చేద్దామని అనుకున్నప్పుడు రవితేజగారు వెంటనే ఓకే అన్నారు. ‘ఇరుముడి’ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని నమ్ముతున్నాం. మీరందరూ థియేటర్లలో ‘ఇరుముడి’ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. తిరుపతిలో లెనిన్ అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సునీల్, శివాజీ, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 10న రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రెస్మీట్ని విశాఖపట్నంలో నిర్వహించారు. అదే విధంగా జూలై 5న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘ముందుగా కొండమీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందర్నీ చల్లగా చూడాలి. లెనిన్ శ్రీరామపురంలో జరిగే కథ అని డైరెక్టర్ నందు చెప్పారు. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరామపురం అనే ఊర్లోనే పుట్టారు. దీంతో నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ‘లెనిన్’ ఈ రాయలసీమ కథ... సీమ మట్టి కథ.. సీమలో ఉన్న మనుషుల కథ... సీమలో జరుగుతున్న మహాభారతం. అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. తెరపై అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు. లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్ను ఇంటికి తీసుకువెళ్తారు. మనందరికీ ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను.. మనవాడు (అఖిల్) ‘లెనిన్’తో హిట్ కొడుతున్నాడు’’ అని అన్నారు. అక్కినేని అఖిల్ మాట్లాడుతూ– ‘‘థ్యాంక్యూ తిరుపతి. ఏడు కొండలవాడా.. గోవిందా గోవిందా. రాయలసీమ బిడ్డ అయిన నందు ‘లెనిన్’ లాంటి అద్భుతమైన కథని నాకు చెప్పారు. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించింది. అందుకే నేను వెంటనే ఓకే చెప్పాను’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘లెనిన్’ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అఖిల్ను నేనే ఎక్కువ ఇబ్బంది పెట్టాను. అఖిల్ ఈసారి ఏ ఒక్కర్నీ కూడా నిరాశపరచడు. ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు మాత్రం ఆడియన్స్ షాక్ అయ్యేలా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్లా మాత్రం అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘హాయ్ తిరుపతి. ఎలా ఉన్నారు. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా?. ‘లెనిన్’లో నేను భారతి అనే పాత్ర చేశాను. ఇలాంటి గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. నా కెరీర్లో భారతి పాత్ర నిలిచిపోతుంది’’ అన్నారు. అనంతపురంలో కొరియన్ కనకరాజు... వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సునీల్, సత్య, తులసి, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న (శుక్రవారం) విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రాసా గుమ్మాడి...’ అంటూ సాగే సెకండ్ సాంగ్ని జూలై 19న (ఆదివారం) అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, నల్గొండ గద్దర్ పాడారు.‘రాసా గుమ్మాడి...’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపురంలోనే జరిగింది. ఇక్కడి కియా కార్ల ఫ్యాక్టరీలోనూ షూటింగ్ చేశాం. అందుకే ‘రాసా గుమ్మాడి...’ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’లోని ‘రాసా గుమ్మాడి...’ పాటను అనంతపూరంలో రిలీజ్ చేయాలని వరుణ్గారు చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్తోనే ఈ మూవీ చేశాం’’ అన్నారు.విశాఖపట్నంలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. ‘కొరియన్ కనకరాజు మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ని ఈ నెల 14న(శుక్రవారం) విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. వైజాగ్లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మెగా ఫ్యాన్స్కి, ప్రేక్షకులకు థ్యాంక్స్. మీ అందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉంటాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే ‘కొరియన్ కనకరాజు’ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు. నటుడు సత్య మాట్లాడుతూ–‘‘నేను యాక్టర్ అవ్వాలనే నిర్ణయం వైజాగ్లోనే తీసుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన గాంధీగారికి థ్యాంక్యూ’’ అన్నారు. హన్మకొండలో నేను రెడీ హవీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపా లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, సత్యనారాయణ, రోహన్ రాయ్ ఇతర పాత్రలు పోషించారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీపై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘మస్తుగుందిరో యవ్వారం...’ అంటూ సాగే మూడో పాట విడుదల వేడుకని ఈ నెల 13న (గురువారం) హన్మకొండలో నిర్వహించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, మనీషా ఎరబత్తిని పాడారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ అందించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఈ పాటని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మస్తుగుందిరో యవ్వారం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్ని హన్మకొండలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని పాటలన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హన్మకొండలో చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. హీరో హవీష్ మాట్లాడుతూ– ‘‘హలో వరంగల్. మీరు ఇచ్చిన ఆదరణ మాకు గొప్ప కిక్ ఇచ్చింది. ఈ కిక్ కోసం మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తాం. మా పాటలన్నీ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలో మీ రియాక్షన్ చూస్తుంటే సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని ముందే అర్థమవుతోంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ– ‘‘హాయ్ హన్మకొండ... ఈ సాంగ్ను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్యూ. ‘నేను రెడీ’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకి వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమాలోని పాటలన్నింటినీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సినిమాల ఈవెంట్స్ మాత్రమే కాదు... మరికొన్ని సినిమాల కార్యక్రమాలు కూడా ఇతర ప్రాంతాల్లో జరుపుకున్నాయి. పాన్ ఇండియా ఒరవడి అన్ని భాషల సినిమాలూ అన్ని ప్రాంతాలకు వెళుతున్నాయి కాబట్టి పబ్లి‘సిటీ’ దాటుతోంది’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలే కాదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న కన్నడ, తమిళ్, మలయాళ, బాలీవుడ్ చిత్రాల ప్రమోషన్స్ ఈవెంట్స్ని కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 18న న్యూఢిల్లీలో ‘రామాయణ’ మూవీ ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్ని ఘనంగా నిర్వహించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, దశరథ మహారాజుగా రామానంద్ సాగర్, కైకేయి పాత్రలో శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే... ఈ మూవీ హిందీలో తెరకెక్కినప్పటికీ తొలి ప్రమోషన్ ఈవెంట్ని ముంబైలో కాకుండా న్యూఢిల్లీలో చేపట్టడం విశేషం. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఓ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ–‘‘ రామాయణం కేవలం మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటి మాత్రమే కాదు... అది మన జీవన విధానంలో భాగం. మనం ఎలా జీవించాలి? ఎలా పండగలు జరుపుకోవాలి? మన విలువలను తదుపరి తరాలకు ఎలా అందించాలి అనే విషయాలను నేర్పుతుంది’’ అని తెలిపారు. దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో చెప్పబడిన గొప్ప కథల్లో రామాయణం ఒకటి. దాని గొప్పతనం పరిమాణంలో కాదు... అది ప్రతిబింబించే శాశ్వత విలువల్లో ఉంది. రామాయణాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో, అత్యంత గౌరవంతో తెరపై ఆవిష్కరించడం నా బాధ్యతగా భావించాను.ఈ అద్భుతమైన వారసత్వానికి తగిన గౌరవాన్ని ఇస్తూనే, అత్యున్నత సినీ నైపుణ్యంతో ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం. ఈ విజన్ను సాకారం చేయడానికి ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులు, కథకులతో కలిసి పని చేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ప్రేక్షకులు ఈ సినిమాలో కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా, రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల ఏళ్లుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. – డేరంగుల జగన్ మోహన్ -
కామ్రేడ్ కళ్యాణ్ ఫిక్స్
దసరా సీజన్లో థియేటర్స్లోకి రానున్నాడు కామ్రేడ్ కళ్యాణ్. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు.కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ సినిమాను అక్టోబరు 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘యాక్షన్, ఎమోషన్, వినోదంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
బోనాల్లో పాల్గొన్నందుకు ట్రోలింగ్.. ఏడ్చేసిన తెలుగు హీరోయిన్
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటారు. కొందరు దీన్ని చూసిచూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం మనసులోకి తీసుకుని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు అలానే 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంది. బోనాల్లో పాల్గొన్నందుకు తనని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెబుతూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన బోనాల పండుగలో ఫరియా సందడి చేసింది. వేరే మతం అయినప్పటికీ హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొంది. పోతురాజులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేసింది. అయితే ఇదంతా చూసిన కొందరు ముస్లిం నెటిజన్లు.. ఫరియాని 'కాఫిర్' అని, మతానికి మచ్చ తెస్తోందని కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఫరియా ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.'నా తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి ఇందులోకి మారారు. ఇస్లాం మతంలోని మంచి విషయాలన్నింటినీ నాకు చూపిస్తూ ఆయన నన్ను పెంచారు. నేను కూడా ఇస్లాంలో ఎప్పుడూ మంచినే చూశాను. మీరు కూడా మంచినే చూడాలని కోరుకుంటున్నాను బ్రో. నేను తప్పు చేస్తున్నానని, నేను కాఫిర్ అని అంటున్న ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను''నేను చెట్టు, రాయి, సీతాకోకచిలుక.. ఇలా ప్రతిదానిలోనూ జీవాన్ని చూస్తాను. అది మీకు అద్భుతంగా అనిపించకపోతే, దాని వల్ల దేవుడిపై మీ నమ్మకం పెరగకుండా దేవుడికి దూరమవుతున్నట్లయితే. మీరు దేవుడిని తప్పు మార్గంలో వెతుకుతున్నారని అర్థం. మీరు కలిసే ప్రతి మనిషిలో దేవుడిని చూడలేకపోతే కూడా మీరు తప్పు మార్గంలో ఉన్నట్టే. నేను ప్రేమ కోసం ప్రార్థిస్తాను. ఐక్యత కోసం ప్రార్థిస్తాను. శాంతి కోసం ప్రార్థిస్తాను. ఇకపైనా అలానే చేస్తాను. నాపై ద్వేషం చూపించే వారికి కూడా నేను మరింత ప్రేమని పంచుతాను. వారి మంచి కోసం ప్రార్థిస్తాను''నా మససు మంచిదని నాకు తెలుసు. నేను ప్రేమని అనుభవించాను. మంచితనాన్ని చూశాను. 'అల్లా' అనే పదానికి అర్థం నాకు తెలుసు. అది వెలుగు. ప్రతిచోటా, ప్రతి సమయంలో అన్నింటినీ ఏకం చేసే వెలుగు. ఇంత విశాలమైన దాన్ని మీరు ఎలా సంకుచితం చేయగలరు?' అని ఫరియా ప్రశ్నించింది. ఈమె నటించిన 'సిగ్మా' మూవీ త్వరలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
'ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్'.. శంకర్దాదా ట్రైలర్ చూశారా?
మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. 2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. -
‘పహల్గాం లవ్ స్టోరీ‘ సినిమా స్టిల్స్
-
'చాలా క్రూరమైన చర్య.. వీళ్లను జైల్లో వేయాల్సిందే': మెగా కోడలు లావణ్య
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా.. ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందిస్తూనే ఉంది. తాజాగా ఓ రైలులో మహిళను కొడుతున్న వీడియోపై స్పందించింది. చిన్నారిని ఎత్తుకుని ఉన్న మహిళను కొందరు విచక్షణారహితంగా కొడుతున్న వీడియోను చూసి రియాక్ట్ అయింది. ఇలాంటి వాళ్లను కచ్చితంగా జైలులో వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ మహిళ ఏం చేసిప్పటికీ.. చిన్న బిడ్డను పట్టుకున్నప్పుడు ఆమెను కొట్టడం చాలా క్రూరమైన చర్య అంటూ మండిపడింది. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొట్టాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. No matter what she has done, beating her while she holds the baby is absolutely cruel, these people deserve to be in jail and beaten up! https://t.co/OgrbWJpt1m— Lavanya tripathi konidela (@Itslavanya) August 15, 2026 -
ఆ రోజులు గుర్తు చేసుకుంటే భయమేస్తుంది
-
ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
ఉన్నవే 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే వారణాసి చిత్రాన్ని పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తుండడంతో ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాపంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినిమాకు ఇది కొత్త దిశను చూపించే ప్రయత్నమా? లేక భారీ రిస్క్గా మిగిలిపోతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ప్రేక్షకుల నుంచి ఆదరణ..హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్కు మంచి ఆదరణ తీసుకొచ్చింది. ప్రీమియం అనుభూతి కోసం ప్రేక్షకులు అధిక ధరలతో టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇండియాలోని ఐమ్యాక్స్ థియేటర్ల కొరత వెలుగులోకి వచ్చింది.సాధ్యంకాని పనంటూ..ప్రస్తుతం దేశవ్యాపంగా కేవలం 26 ఐమ్యాక్స్ స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్ చిత్రాలను రూపొందించడం ఎంతవరకు లాభదాయకమనే చర్చ కొనసాగుతోంది. పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక్కో ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఒక్క సినిమాని చూసి భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యకానిపని అన్నారు. ఐమాక్స్ చిత్రీకరణ ఎలా చేస్తారంటే..ఐమాక్స్ చిత్రీకరణ సాధారణ సినిమాల మాదిరిగా ఉండదట. భారీ కెమెరాలు, ప్రత్యేక పరికరాలు, అనుభవంతులైన సాంకేతిక నిపుణులు అవసరమవుతారట. అంతేకాకుండా ఫ్రేమింగ్, లైటింగ్, సౌండ్ డిజైన్ వంటి అంశాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట..ఐమ్యాక్స్ యుగానికి నాంది..బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఇప్పుడు వారణాసితో మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న విధంగా విజయం సాధిస్తే భారతీయ సినీ పరిశ్రమలో ఐమ్యాక్స్ యుగానికి నాంది పలికే అవకాశముంది. -
'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న‘సైరాబాను’ ఫస్ట్లుక్
ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సైరాబాను'. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణకాంత్ పారుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. 'ఎ ఫన్ ఫిల్డ్ జర్నీ ఆఫ్ లవ్, ఫెయిత్ అండ్ డెస్టినీ' అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా ఫస్ట్లుక్ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై కనిపించారు. నుదుటిపై విభూతి, మెడలో రుద్రాక్ష మాలలతో ఆయన హిందూ యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు బంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్లో ఆయన వెనుక కూర్చుని కనిపించడం పోస్టర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పోస్టర్ నేపథ్యంలో ఒకవైపు ఆలయం, మరోవైపు ఇస్లామిక్ నిర్మాణ శైలి కనిపించడం రెండు భిన్న సంస్కృతుల కలయికను ప్రతిబింబిస్తోంది. ప్రేమ, శాంతికి ప్రతీకగా తెల్లని పావురాలను కూడా పోస్టర్లో చూపించారు. దీంతో ఈ సినిమా హిందూ-ముస్లిం ప్రేమకథ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. -
విశ్వనాథ్ & సన్స్ హిట్టా..? ఫట్టా..?
-
మెగాస్టార్తో బుచ్చిబాబు మూవీ.. వర్కవుట్ అయ్యేనా?
ఈ ఏడాది పెద్ది మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రూరల్ స్పోర్ట్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోను మెరుగైన క్రీడాకారులను తయారు చేయవచ్చని ఈ సినిమాతో సందేశం ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో బుచ్చి నెక్ట్స్ ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబుకు సంబంధించిన ఓ టాక్ టాలీవుడ్లో వైరల్గా మారింది. బుచ్చి ఏకంగా మెగాస్టార్ కోసం ఓ కథను సిద్ధం చేశారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన త్వరలోనే చిరును కలిసి కథ చెప్పనున్నారని ఇన్సైడ్ టాక్. దీంతో కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టమవుతోంది.మరోవైపు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఫిల్మ్నగర్ టాక్. బుచ్చిబాబు మెగాస్టార్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేయలేదని సమాచారం. ఆయన కేవలం మైత్రి మూవీ మేకర్స్తో చేయబోతున్న ప్రాజెక్ట్పైనే వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరికీ కూడా బుచ్చిబాబు కథను చెప్పడం లేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దసరా డైరెక్టప్ శ్రీకాంత్ ఓదెలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. -
బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
-
విలన్ నుంచి రియల్ స్టార్గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)
-
AUG 15 SPECIAL : దేశభక్తిని రగిలించిన తెలుగు గీతాలివే.. ఎవరు పాడారంటే!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే దేశమంతా త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుంది. మరోవైపు దేశభక్తి గీతాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని పాటలు తరతరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ, దేశం పట్ల ప్రేమను పెంచుతూ వచ్చిన అలాంటి కొన్ని సినీ గీతాలను ఓసారి గుర్తు చేసుకుందాం.'తెలుగు వీర లేవరా' - అల్లూరి సీతారామరాజుసూపర్స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలోని ఈ పాట దేశభక్తి గీతాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఘంటసాల ఆలపించిన ఈ గీతం నేటికీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తప్పకుండా వినిపిస్తుంది.'పుణ్యభూమి నా దేశం' - మేజర్ చంద్రకాంత్సీనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రంగా గుర్తింపు పొందిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జాలాది రాజారావు సాహిత్యం అందించిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికీ జాతీయ పండుగల సందర్భంగా మారుమోగుతూనే ఉంటుంది.'సైనికా' - నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాఅల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలోని 'సైనికా' పాట భారత సైనికుల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల జీవితాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటను విశాల్ దడ్లానీ ఆలపించగా, విశాల్-శేఖర్ సంగీతం అందించారు. రామ్జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రాశారు.'దేశమంటే' - ఝుమ్మంది నాదంమంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలోని ఈ పాట దేశం పట్ల ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ పాటను ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, చిన్ని చరణ్, విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు.'వందేమాతరం'- మహాత్మాశ్రీకాంత్ హీరోగా నటించిన 'మహాత్మా' చిత్రంలోని 'వందేమాతరం' పాట దేశభక్తిని ఆధునిక కోణంలో ఆవిష్కరించింది. ఈ పాటను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని రాశారు.'ఓ బాపూ నువ్వే రావాలి' - శంకర్ దాదా జిందాబాద్మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంలోని ఈ పాటలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేశారు. ఈ పాటను సాగర్, దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని రాశారు.'వందే మాతరం' - లీడర్రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన 'లీడర్' చిత్రంలోని ఈ పాట యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశం అంటే కేవలం నేల మాత్రమే కాదని, ప్రజలే దేశమనే సందేశాన్ని ఈ పాట బలంగా వినిపించింది. -
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియ జంటగా నటిస్తున్న అమెరికా బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ చిత్రం 'VISA-వింటారా సరదాగా'. ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథ మొత్తం అమెరికాలోనే తెరకెక్కించారు. ముఖ్యంగా సత్య, రోహిణి కామెడీ టీజర్లో అలరిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. -
వెంకీమామకు 40 ఏళ్లు.. ఈ సారి దేశ రక్షకుడిగా..!
వెంకీ మామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. కలియుగ పాండవులు మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన వెంకటేశ్.. స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్, లవ్తో పాటు కామెడీ జోనర్లో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన వెంకీమామ.. ఈ ఏడాది మెగాస్టార్ మూవీలో మెప్పించారు.ప్రస్తుతం అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టారు వెంకటేశ్. వీరద్దరి కాంబోలో వస్తోన్న మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నేటికి వెంకీ మామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని వెంకటేశ్ రోల్ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్ వెంకీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI 😍😍😍It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film 🤗Meet our Lt colonel VENKAT REDDY🔥#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026 -
‘సినిమా అంటే వంద కుటుంబాల సమూహం’
కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాల్ని శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది. జైభార్గవ్, మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు నటించనున్నారు.హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో ఈ సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న నిర్మాత. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు’ అని అన్నారు. -
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
-
సమంత మా ఇంటి బంగారం.. మరో ఓటీటీలో స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. జూన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్ స్టార్ వేదికగా సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.తాజాగా మా ఇంటి బంగారం క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీకి వచ్చేసింది. సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్ను సోని లివ్ కొనుగోలు చేసింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. Ek parivaar. Ek raaz. Aur ek bangaaram bahu, jo sab badal degi 🔥Action Queen Samantha's Maa Inti Bangaaram (Hindi) is streaming now on SonyLIV pic.twitter.com/hyW4jWO7lm— Sony LIV (@SonyLIV) August 14, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. జగపతిబాబు 'వదలా', హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు రష్మిక 'కాక్ టెయిల్ 2', కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి పరభాషా చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటికి తోడుగా మరో తెలుగు మూవీ దాదాపు ఏడు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన సింగర్ రమణ, ప్రశాంత్ ప్రధాన పాత్రలు చేసిన రూరల్ యాక్షన్ డ్రామా 'వినరా ఓ వేమ'. ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ప్రశాంత్ కల్యాణ్-రాజు మద్దెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది ఏడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.గతేడాది నవంబరు 14న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'గోపీగాళ్ల గోవా ట్రిప్'.రోహిత్ & శశి దర్శకత్వం వహించగా అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడీ కామెడీ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ) -
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
-
ఈ హీరోలు గుర్తున్నారా? ఇంతకీ ఏమయ్యారు?
ఇండస్ట్రీలో సరైన అవకాశాలు కోసం వేలమంది కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. మరికొందరు మాత్రం వచ్చిన ఛాన్సులని సరిగా నిలుపుకోలేక ఇబ్బందిపడుతుంటారు. ఇండస్ట్రీ అంటేనే అలాంటిది మరి. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. అసలు విషయానికొస్తే.. హిట్స్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు వైష్ణవి తేజ్, కార్తికేయ గత కొన్నేళ్ల నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ వీళ్లు ఏమయ్యారు? అసలేం చేస్తున్నారు?(ఇదీ చదవండి: బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?)మొదటగా వైష్ణవ్ తేజ్ విషయానికొద్దాం. 'మెగా' హీరో అనే ట్యాగ్ వల్ల పెద్దగా కష్టం లేకుండానే హీరో అయిపోయాడు. తొలి సినిమా 'ఉప్పెన'తో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు. కానీ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ అని మూడు చిత్రాలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.2023లో 'ఆదికేశవ'తో చివరగా కనిపించిన వైష్ణవ్ తేజ్.. తర్వాత మరో సినిమా చేయలేదు. మధ్యలో మారుతి అని మరో దర్శకుడు అని పలువురు పేర్లు వినిపించాయి కానీ ఏది ఖరారైతే కాలేదు. మధ్యలో ఓ హీరోయిన్తో ప్రేమ, డేటింగ్ రూమర్స్ వచ్చాయి కానీ వీటిలో ఎంత నిజముందో తెలీదు. యాక్టింగ్ కాకుండా వేరే ఏమైనా చేస్తున్నాడనేది కూడా తెలీదు. వైష్ణవ్ సోదరుడు సాయిధరమ్ తేజ్ అయితే ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ అలా నడుస్తూనే ఉంది. ఎప్పుడొస్తుందనే అప్డేట్ లేదు.వైష్ణవ్ లానే కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరో కార్తికేయ. 2017లో 'ప్రేమతో మీ కార్తిక్' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. 2018లో రిలీజైన 'ఆర్ఎక్స్ 100' ఇతడి జీవితాన్ని మార్చేసింది. హిట్ అవ్వడంతో పాటు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఊపులో హీరో కమ్ విలన్గా గ్యాంగ్ లీడర్, వలిమై, బెదురులంక 2012, చావు కబురు చల్లగా, 90ఎమ్ఎల్ తదితర చిత్రాలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా పేరు సంపాదించాడు.2024లో 'భజే వాయువేగం'తో సక్సెస్ అందుకున్న కార్తికేయ.. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడం మానేశాడు. బిజినెస్లోకి ఎంటరయ్యాడని అందుకే యాక్టింగ్ పెట్టేశాడని కొందరు అంటుండగా.. లేదు లేదు స్వయంగా దర్శకుడిగా మారి కొత్త ప్రాజెక్టుతో త్వరలో రాబోతున్నాడని మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం హిట్ కొట్టిన ఇద్దరు యంగ్ హీరోలు ఇలా సినిమాలు చేయకుండా ఉండిపోవడం కాస్త విచిత్రంగానే ఉంది. మరి ఇండస్ట్రీకి దూరమైపోయారా? లేదంటే త్వరలో రీఎంట్రీ ఇస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్) -
'తొలిసారి మీమల్ని చూసింది మొదలు' మూవీ ఓపెనింగ్ (ఫొటోలు)
-
ఇరుముడిలో ఇన్ని చిక్కు ముడిలా.? అసలు కథ ఇదే..!
-
‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది
కొన్నిరోజుల క్రితం 'మైసా' షూటింగ్ సందర్భంగా గాయపడిన రష్మిక.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అని చెబుతూ కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే తన పేరిట అన్నదానం కూడా నిర్వహించారని చెబుతూ ఓ వీడియోని పంచుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ఎప్పుడైనా ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే గడుస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి.. భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీబిజీగా గడిపే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో?' అని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ పెట్టింది.గతేడాది నవంబరులో 'గర్ల్ ఫ్రెండ్'తో హిట్ కొట్టిన రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. రెండు నెలల క్రితం 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. భర్తతో కలిసి చేస్తున్న 'రణబాలి' షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' చేస్తోంది. దీని చిత్రీకరణలోనే తుంటి భాగానికి గాయమవగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అత్తారింట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా రష్మిక అమ్మ ఈమె దగ్గరకొచ్చి పలకరించింది.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు సినిమా 'కెరూబ్'
విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కెరూబ్' బాలు బల్లెకారి నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) తీశారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకనిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో హీరో వేణువు వాయిస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
పుష్ప డైరెక్టర్ కూతురు అరుదైన ఘనత
పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి బండ్రెడ్డి అరుదైన ఘనత సాధించింది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా అవార్డ్ సాధించిన సుకృతి.. తాజాగా మరో ఘనత దక్కించుకుంది. మెరికాలోని బోస్టన్ అంతర్జాతీయ బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సంగీత విభాగంలో ఎన్సెంబుల్ ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికైంది. దీంతో సుకృతి అవార్డ్తో పాటు స్కాలర్షిప్ అందుకోనుంది. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా గాంధీ తాత చెట్టు సినిమాకు అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా సంగీత విభాగంలో ఎన్సెంబుల్ ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ పోటీలకు 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా.. కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్షిప్ వచ్చింది. అందులో సింగర్స్ విభాగంలో ఎంపికైన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం మరో విశేషం. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారంలో పెద్దఎత్తున మూవీస్ రిలీజవుతున్నాయి. వాటిలో సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. దీంతో పాటు అగధ, పళ్లబురుసు, అనకాపల్లి, మకుటం అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో ఎక్కువగా విశ్వనాథ్ అండ్ సన్స్పైనే బజ్ క్రియేట్ అయింది.ఇక ఒటీటీల విషయానికొస్తే పలు చిత్రాలు ఈ ఫ్రైడే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటిలో కాక్టెయిల్-2, భారత్ భాగ్య విధాత లాంటి బాలీవుడ్ సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14 మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14 ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14 మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14 డోంట్ సే గుడ్ లక్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 14 టు ద మ్యాక్స్(స్పానిష్ మూవీ)- ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్..హార్టిన్(తమిళ సినిమా)- ఆగస్టు 14ఆరూపి(మలయాళ మూవీ)- ఆగస్టు 14జియో హాట్స్టార్.. 108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5 భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14 నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14లయన్స్ గేట్ ప్లే ఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14 పవర్ బుక్ -3 రైజింగ్ కనన్-సీజన్ 5(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 14 -
కిమ్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తికావడంతో ఈ రోజు (గురువారం)ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ ను డిశ్చార్జ్ చేసినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తెలిపారు.కాగా.. జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. డా. ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్రావు, డా. శ్రీనివాస్రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సికింద్రాబాద్ కిమ్స్లో బుధవారం సర్జరీ నిర్వహించారు. దాదాపు 2 నుంచి 3 నెలల్లోపే సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు తెలిపారు. -
రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్పై అనుపమ సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్రేకప్తో పాటు ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.మార్పును ముందే గమనించారు..‘ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టు వెనుక ఎంతో బాధ ఉంది. గత రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఆ సమయంలో నార్సిసిస్టిక్ అబ్యూజ్ను ( ఒక వ్యక్తి తన భాగస్వామిని మానసికంగా భావోద్వేగపరంగా వేధించడం) ఎదుర్కొన్నాను’ అని అనుపమ తెలిపారు. నాలో వచ్చిన మార్పుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గుర్తించారు. బ్రేకప్ విషయం బయటకు తెలిసి నెల రోజులే అయినప్పటికీ, తనకు దగ్గరగా ఉన్నవారికి ఈ విషయం ముందే అర్థమైంది’ అని అన్నారు.‘సోషల్మీడియాలో పసుపు రంగు డ్రస్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘అనుపమ ఆత్మహత్య చేసుకుంది’ అని రాసి ఉంటే నాకు మరింత ప్రేమ దక్కేదేమో’ అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రిలేషన్షిప్ సరైనది కాదని, తాను అందరికీ దూరమవుతున్నానని వారంతా గమనించారని చెప్పారు.నిశ్చితార్థం కోసం.. రిలేషన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తనను మాజీ ప్రియుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిపారు. మూడు నెలల్లోనే నిశ్చితార్థం గురించి చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే, తనకు మరికొంత సమయం కావాలని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం చివరకు విడాకుల వరకు వెళ్లేదేమో. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా నేనే’ అని స్పష్టం చేశారు.నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నార్సిసిస్టిక్ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిపై వారికి నమ్మకం ఉండదు. వారి జీవితంలోకి ఎవరినీ రానివ్వాలనుకోరు. ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు’ అని వివరించారు. కెరీర్పై ప్రభావం..తన వ్యక్తిగత జీవితం కెరీర్పై కూడా ప్రభావం చూపిందని అనుపమ ఆరోపించారు. ‘డ్రాగన్ సినిమా నా కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. అయినప్పటికీ ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొలేదు. చాలా సినిమాలను కూడా వదులుకున్నాను. నా జీవితంలోని ప్రతి విషయంలోనూ అతడు జోక్యం చేసుకునేవాడు’ అని చెప్పారు.క్రూరంగా ప్రవర్తించేవాడు..తన మాజీ ప్రియుడి ప్రవర్తనను విక్రమ్ నటించిన ‘అన్నియన్’ చిత్రంలోని పాత్రతో పోల్చిన అనుపమ.. ‘ఒక రోజు ఎంతో ప్రేమగా ఉండేవాడు. మరుసటి రోజు పూర్తిగా మారిపోయి క్రూరంగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు చెప్పి, ఇకపై అలా చేయనని హామీ ఇచ్చేవాడు. ఇదే పదేపదే జరిగేది’ అని వెల్లడించారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. అనుపమ చివరిగా ‘పెట్ డిటెక్టివ్’ చిత్రంలో కనిపించారు. -
లక్కీ ఛాన్స్.. ప్రభాస్ తో నటిస్తారా? అయితే ఇలా చేయండి
-
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
-
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
-
రవితేజ ‘ఇరుముడి’ మూవీ HD స్టిల్స్
-
టాలీవుడ్కు శ్రీలీల దూరమవుతోందా? అసలు కారణం ఇదేనా!
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా ఉన్న శ్రీలీల ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టుల విషయంలో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమా ఏదీ లేకపోవడంతో, టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయా అనే చర్చ మొదలైంది.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ఆ తర్వాత చాలా మంది అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. అయితే ‘రాబిన్హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆమె కెరీర్పై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే శ్రీలీల పూర్తిగా టాలీవుడ్కు దూరమవుతున్నారని చెప్పడం తొందరపాటే. ప్రస్తుతం ఆమె తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. తమిళ నటుడు ధనుష్తో ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్లోనూ కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి హీరోలతో ప్రాజెక్టులు చేస్తోంది.తెలుగులో వరుసగా సినిమాలు చేసిన తర్వాత శ్రీలీల ప్రస్తుతం ప్రాజెక్టుల సంఖ్య కంటే విభిన్నమైన కథలు, మంచి పాత్రల కోసం ఇతర భాషల్లో అవకాశాలపై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా వరుసగా కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా శ్రీలీల కనిపించింది. ఇప్పుడు ఇతర పరిశ్రమల్లో తన పరిధిని విస్తరించుకోవడం ద్వారా కొత్త ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్.. వైద్యుల ప్రకటన
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. డా. ఆర్ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్రావు, డా. శ్రీనివాస్రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సర్జరీ నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. దాదాపు 2 నుంచి 3 నెలల్లోపే సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు తెలిపారు. కాగా.. జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది. -
పతి దేవునికి స్టార్ హీరోయిన్ పూజలు.. ఎందుకంటే?
అత్తారింటికి దారేది మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ చిత్రంలో తన అందమైన కళ్లతో అభిమానులను కట్టిపడేసింది. తెలుగులో హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలోనూ మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ మెరిపింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భామ.. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.సినిమాల్లో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను అభిమానులకు తన అప్డేట్స్ ఇస్తూ టచ్లోనే ఉంటోంది. తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఇవాళ భీమన అమావాస్య కావడంతో తన భర్త కాళ్లకు ప్రత్యేక పూజలు చేసింది. పతిదేవునికి నమస్కరిస్తూ ఉన్న ఫోటోను ట్విట్ర్లో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్స్ భర్త అంటే ఎంత గౌరవమో అని కామెంట్స్ చేస్తున్నారు.భీమన అమావాస్య ఎందుకు చేస్తారంటే.. భీమన అమావాస్య అనేది కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో పాటిస్తారు. ఈ మాసం చివరి రోజైన అమావాస్య నాడు జరుపుకునే హిందూ సంప్రదాయ పండుగ. ఈ రోజు పవిత్రమైన ఉపవాసంలో ఉంటారు. ఈ రోజును శివపార్వతులకు అంకితంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలు తమ భర్తలకు, కుటుంబంలోని పురుషులకు ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సుతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. ಭೀಮನ ಅಮಾವಾಸ್ಯೆ 🙏🏻 pic.twitter.com/xcoOH7vEbe— Pranitha Subhash (@pranitasubhash) August 12, 2026 -
బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?
స్టార్ హీరో అయిన చిరంజీవి చాన్నాళ్లుగా అదే స్టార్డమ్ మెంటైన్ చేస్తున్నారు. అలాంటి ఈయన చేసిన ఓ సినిమా ఏళ్లకు ఏళ్లు రిలీజ్ కాకుండా ఆగిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. కానీ 'విశ్వంభర' విషయంలో అదే జరుగుతోంది. ఈ మూవీ గురించి ఎవరూ అడగడం లేదు. చిరు కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ప్రేక్షకులు కూడా దీనిని పట్టించుకోవడం మానేశారు!(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం)ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు డిస్కషన్ వచ్చిందంటే? మెగా హీరో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో తను చేస్తున్న మూవీ టైటిల్ 'కదిరి నరసింహుడు' అన్నట్లు లీక్ చేశారు. దీంతో అందరి అటెన్షన్ దీనిపై పడింది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం 'విశ్వంభర' గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది బాసూ అని అడుగుతున్నారు.కొన్ని నెలల ముందు వరకు 'విశ్వంభర'ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తారని రూమర్స్ వినిపించాయి. కట్ చేస్తే వేసవి అయిపోయి వర్షకాలం కూడా వచ్చేసింది. సినిమా జాడ మాత్రం లేదు. ఈ ఏడాదికి సంబంధించి డిసెంబరు వరకు రిలీజ్ డేట్స్ ఖాళీ అయితే లేవు. దసరా, దీపావళికి చాలానే మూవీస్ రెడీగా ఉన్నాయి. మరి 'విశ్వంభర'ని ఈ ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? లేదంటే ట్రోలింగ్కి భయపడి దర్శకనిర్మాత వెనక్కి తగ్గుతున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ విడుదల చేస్తే అక్టోబరు వైపు ఏమైనా చూస్తారా? లేదా సంక్రాంతికి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఏడు లోకలు అనే పీరియాడికల్ ఫాంటసీ కథతో 'విశ్వంభర' తీశారు. రెండేళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా దారుణంగా విమర్శలు వచ్చాయి. తర్వాత ఓ పాట వదిలారు గానీ జనాలకు అస్సలు నచ్చలేదు. తర్వాత నుంచి అప్డేటే ఇవ్వట్లేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో దర్శకుడు వశిష్ఠని రిలీజ్ గురించి అడిగితే త్వరలో వస్తుందని అన్నాడు తప్పితే పక్కా డేట్ చెప్పలేదు. ఇప్పుడు చిరు కూడా చేస్తున్న మూవీస్ గురించి చెబుతున్నారు గానీ ఇదొకటి ఉందనే సంగతే మర్చిపోయారా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి కామెడీ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
-
చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి
-
నేడు కిమ్స్లో జూనియర్ ఎన్టీఆర్కు సర్జరీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గాయానికి నేడు శస్త్రచికిత్స జరగనుంది. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది.తాజాగా గాయానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించడంతో కిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ చేయనున్నట్లు వెల్లడించింది. సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
-
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
ఏఐ తోడవుతుందా? సినిమా ‘ఆడు’తుందా?
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో సినిమాల పాత్ర కీలకం. అత్యాధునిక గేమ్స్ రూపకల్పనలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సినిమాలెన్నో భాగం అయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సినిమా పేరుతో గేమ్ విడుదల చేసే ట్రెండ్ భారత్లోనూ ఒక దశలో ఊపు మీద కనిపించింది. అయితే కాలక్రమంలో అరుదైపోయింది. దీనికి సదరు గేమ్స్కు లభించిన ఆదరణ స్థాయిలే కారణమనేది వేరుగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవలి కాలంలో సాంకేతికంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు... చేర్పులు మరోసారి గేమింగ్ రంగంపై సినిమాల ప్రభావంపై సానుకూల అంచనాలు రేకెత్తిస్తున్నాయి. మార్కెట్కు ఊపు... ఇటీవలి కాలంలో భారతదేశంలో గేమింగ్ మార్కెట్ బాగా పెరిగింది . ఇప్పుడు గేమ్స్ కేవలం పిల్లల వినోదం కోసం మాత్రమే కాదు... మొబైల్ గేమింగ్, ఎస్పోర్ట్స్, ఆన్లైన్ మల్టీప్లేయర్ వంటి విభిన్న మార్గాల వల్ల వినియోగ వర్గాలు బాగా విస్తృతం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ను భారతీయ గేమ్ స్టూడియోస్ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గతంలో సినిమా విడుదలకు ముందు/తర్వాత ఒక చిన్న మొబైల్ గేమ్ తయారు చేసి ప్రమోషన్ లక్ష్యంగా వినియోగించారు. ఒక్క హిందీ ‘రా.వన్’ చిత్రం కోసమే 5 ప్లాట్ఫామ్స్కు గేమ్ను తీసుకెళ్లారు. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ గేమ్ల సందడి కనుమరుగైంది. ఇక తెలుగు సినిమాల ఆధారంగా అయితే పెద్ద సంఖ్యలో గేమ్స్ రాలేదు. ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధి చెందినది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది డౌన్లోడ్లు సాధించిందీ... తెలుగు సినిమా ఆధారిత గేమ్ ‘బాహుబలి’ మాత్రమే.ఆశావహ అంచనాలు... ఇక భవిష్యత్తులో నిర్మాతలు సినిమా – వెబ్ సిరీస్ – గేమ్– యానిమేటెడ్ కంటెంట్ – మర్చండైజ్... ఇలా తమ ప్రణాళికలను అమలు చేయవచ్చునని అంచనాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్క సినిమాను మొత్తం ఎంటర్టైన్మెంట్ యూనివర్స్గా మార్చేందుకు అవకాశాలు పెరిగాయన్న మాట. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్రియల్ ఇంజీన్ వంటి టెక్నాలజీలతో ఖర్చు తగ్గే అవకాశం కూడా ఈ అంచనాలను బలపరుస్తోంది. గతంలో 3డీ గేమ్ చేయాలంటే భారీ బడ్జెట్, పెద్ద డెవలప్మెంట్ టీమ్ అవసరం అయ్యేది. అయితే ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్, మోడ్రన్ గేమ్ ఇంజీన్స్ వల్ల చిన్న చిన్న స్టూడియోస్ కూడా తక్కువ వనరులతోనే మంచి విజువల్స్ తయారు చేయగలుగుతున్నాయి. అయితే ‘సినిమా తీస్తున్నాం కాబట్టి దానికి ఒక గేమ్ కూడా ఉండాలి’ అనే మూస విధానం ఇక వర్కవుట్ కాకపోవచ్చు. సినిమా కథను నేపథ్యంగా తీసుకుని ఒక పూర్తి కాన్సెప్ట్తో గేమ్ తయారు చేయాల్సి రావచ్చునని గేమింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ‘బాహుబలి’ గేమ్ కోసం సినిమా కథను మళ్లీ అదే విధంగా ఆడించడం కంటే మాహిష్మతి సామ్రాజ్యంలో మనమే ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి రాజ్యాన్ని నిర్మించుకోవడం, యుద్ధాలు చేయడం లాంటి అనుభూతిని అందించేలా రూపొందిస్తే ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ గేమ్స్కు ఫుల్ ఛాన్స్... వైవిధ్యభరిత కథలు, అనూహ్యమైన కాన్సెప్ట్స్ను తెరకెక్కిస్తున్న టాలీవుడ్కు గేమ్స్ రూపకల్పనలో మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది. ‘బాహుబలి’ ఇప్పటికే నిరూపించుకోగా (‘బాహుబలి ది గేమ్’ రూపొందించిన మూన్ఫ్రాగ్ ల్యాబ్స్ వంటి సంస్థలకు భారీగా డౌన్లోడ్స్ లభించినట్టు ఓ నివేదిక వెల్లడించింది) ‘ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, సలార్, దేవర’... వంటి వెరైటీ కథలతో ముందుకొస్తున్న టాలీవుడ్కు గేమ్స్ రంగంలో విస్తరించే అవకాశాలు బాగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన భారతీయ సినిమా ఆడిన ఆటలు ఇవే... భారతీయ సినిమాల ఆధారంగా పలు వీడియో గేమ్స్ విడుదలయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా పర్సనల్ కంప్యూటర్, ఆండ్రాయిడ్, ఏఓఎస్ మొబైల్ ప్లాట్ఫామ్ల కోసం రూపొందాయి. వీటిని కూడా హాలీవుడ్లా భారీ స్థాయిలో కాకుండా ప్రధానంగా సినిమా ప్రచారంలో భాగంగా మాత్రమే విడుదల చేశారు. అలా ప్రసిద్ధమైన భారతీయ సినిమా ఆధారిత వీడియో గేమ్స్లో ఆమిర్ ఖాన్ నటించిన ‘గజని’ సినిమాపై ఆధారపడిన ‘గజని ది గేమ్’ (2008) మొదటిదిగా చెపొ్పచ్చు. ఆ తర్వాత షారుక్ ఖాన్ సూపర్హీరో చిత్రం ‘రా.వన్’ ఆధారంగా ‘రా.వన్ ది గేమ్’ (2011)లో ప్లే స్టేషన్, పి.సి, మొబైల్ వెర్షన్లు వచ్చాయి. అలాగే షారుక్ నటించిన ‘డాన్ 2’ ది గేమ్ (2011) ఆధారంగా మొబైల్ గేమ్ విడుదలైంది. మళ్లీ షారుక్ చిత్రమే అయిన ‘చెన్నై ఎక్స్ప్రెస్’ (2013) – రన్నర్–స్టైల్ మొబైల్ గేమ్గా రూపొందింది. ఆ తర్వాత సూపర్ హీరో క«థతో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్ 3’ (2013) సినిమా ఆధారంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్ రూపొందింది. అనంతరం బైక్ రేసింగ్/యాక్షన్ గేమ్గా ‘ధూమ్ 3 ది గేమ్’ (2013), అజయ్ దేవగణ్ పోలీస్ పాత్ర ఆధారంగా ‘సింగమ్ ది గేమ్’ (2014), రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందించిన రన్నర్ గేమ్ ‘కొచ్చాడియాన్ కింగ్డమ్ రన్’ (2014), బాక్సింగ్ యాక్షన్ గేమ్గా ‘బ్రదర్స్ ది గేమ్’ (2015), సల్మాన్ ఖాన్ రెజ్లింగ్ సినిమా ఆధారంగా ‘సుల్తాన్ ది గేమ్’ (2016), ధోనీ బయోపిక్ ప్రచారంలో భాగంగా విడుదలైన క్రికెట్ గేమ్ ‘ఎంఎస్ ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ అండ్ వరల్డ్ క్రికెట్ బాష్’ (2016) తెలుగు సినిమా ‘బాహుబలి’ ఆధారంగా ‘బాహుబలి ది గేమ్’ (2017), క్లాసిక్ ‘షో’లే సినిమా ఆధారంగా రూపొందించిన ఆర్కేడ్ గేమ్ ‘షోలే ది గేమ్’ వంటివి మార్కెట్లోకి వరుసగా వచ్చాయి. – సత్యబాబు -
జునియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. ఎక్కడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఇటీవల గాయపడ్డారు. జూలై 27న సాయంత్రం జూ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసిందితాజాగా ఎన్టీఆర్ గాయానికి సర్జరీ జరగనుందని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరనుందని తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలిసారి వస్తోన్న ఆ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఐదేళ్ల తర్వాత మరో ఓటీటీకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మంచి రోజులు వచ్చాయి'. ఈ మూవీలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించారు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.అయితే దాదాపు రిలీజైన ఐదేళ్ల తర్వాత ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ మూవీని ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటించారు. A feel-good love story that still brings all the smiles! Catch #ManchiRojulochaie streaming now on @PrimeVideoIN ❤️Watch here 👉 https://t.co/fffHKkjwb7#SantoshSobhan #MehreenPirzada #TeluguFilmNagar pic.twitter.com/Ku5akrizPf— Telugu FilmNagar (@telugufilmnagar) August 11, 2026 -
'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఆసక్తిగా టీజర్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్లో సన్నివేశాలు ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్లో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
'విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. సెట్స్లో రియల్ చిరుతపులి ఎంట్రీ'
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)
-
కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు
దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిని పెద్దగా నమ్మడు! ఇదే విషయాన్ని మ్యూజింగ్స్, పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈయన కూతురు పవిత్ర మాత్రం శివుడిపై భక్తిభావన పెంచుకుంటోంది. అందుకు తగ్గట్లే తనకు కలలో శివుడు కనిపించాడని, ఇది సాధారణంగా అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)'కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్తో మండల చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేర్చుకున్న నైపుణ్యం కాదు. సహజంగా పుట్టుకొచ్చిన ఓ అభిరుచి. కాలక్రమేణా ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ భాగమైంది. శివుడు నా జీవితంలో దేవుడు మాత్రమే కాదు. నా బలం, నా ఓదార్పు. నా మనసు ఆనందంతో నిండినప్పుడు, బాధపడినప్పుడు నేను మాట్లాడుకునేది ఆయనతోనే. గతేడాది కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది సాధారణమైన కలలా అనిపించలేదు. శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. తర్వాతి రోజే కేదార్నాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను''దాదాపు వారం రోజుల పాటు ప్రతి గీతలోనూ ఓ ప్రార్థన, ప్రతి ఆకృతిలోనూ ఓ భావాన్ని, ప్రతి రంగులోనూ నా భక్తిని నింపుతూ ఆ చిత్రాన్ని గీయడం పూర్తి చేశాను. దీనిని ఒక వారం పాటు గీసినప్పటికీ చాలా కాలంగా గీస్తున్నట్టుగా అనిపించింది. ఇది పూర్తయిన తర్వాత నాలో ఓ ప్రశాంతత నెలకొంది. దీనిని మొదట నా కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నా. కానీ ఇప్పుడు కృతజ్ఞతతో ఆ చిత్రాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. హర హర మహాదేవ్' అని పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' సినిమాకు శబరిమలతో సంబంధం లేదు) View this post on Instagram A post shared by Pavithra Puri (@pavithrapuri_) -
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
(నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
-
‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు)
-
సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు!
సాక్షి,విశాఖ: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పల్లెటూరి ప్రేమ కథా చిత్రం.. ఆసక్తిగా పోస్టర్
శ్రీరామ్, రమిక శివు జంటగా నటిస్తోన్న లేటేస్ట్ లవ్ ఎంటర్టైనర్ ప్రేమనే ఊరిలో. ఈ మూవీకి మనోజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా రూపొందిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టైటిల్కు తగ్గట్టుగానే ప్రేమను పల్లె అందాలతో ముడిపెట్టి చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సునద్ గౌతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఆయన వల్లే సాధ్యమైంది'.. కామాక్షి ఎమోషనల్
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి పరిచయం అక్కర్లేదు. పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించింది. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు డైరెక్షన్లో వస్తోన్న అగధ మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు హాజరైన కామాక్షి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. నా తొమ్మిదేళ్ల కష్టమని కామాక్షి తెలిపింది. నా ఫ్యామిలీ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చానని ఎమోషనలైంది. నా కెరీర్కి పునాది రాయి వేసింది మాత్రం ఎంఎస్ రాజుగారు మాత్రమేనని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే కష్టమని ఏడ్చేసింది. అలాంటిది నన్ను సినిమాలో లీడ్ రోల్లో తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మారుతోందని.. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది కామాక్షి.నన్ను స్క్రీన్పై చూసింది చాలా తక్కువ.. నేను చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను అలాంటివే చేస్తుందని అనుకుంటారు.. కానీ నా తొమ్మిదేళ్ల కష్టం వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడేందుకు నా ఫ్యామిలీ ఎంతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని కామాక్షి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా అన్న, అమ్మ, పిన్ని నాకోసం ఇక్కడికి వచ్చారంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. -
సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తా: డైరెక్టర్
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్స్టా పేజికి టికెట్ పంపండి.. మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. మా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో మా మూవీ రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని చెప్పగలను. ఈ సినిమా మేకింగ్లో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.' అన్నారు. కాగా.. ఈ సినిమాకు మహేశ్ నారాయణ, బి షేక్ సంగీతమందించారు. -
లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ కలెక్షన్స్ ఎన్ని కోట్లు?
దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీసిన ‘డీసీ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు చేసిన ఈ యాక్షన్ డ్రామా తొలి వీకెండ్ ముగిసే సరికి మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజైన ఆదివారం మన దేశంలో రూ.9.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందని, శనివారం రూ.7కోట్లు వచ్చాయని టాక్. దీంతో మూడు రోజులకు కలిపి ఇండియాలో రూ. 20.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. గ్రాస్ రూ.24.11 కోట్లు అని తెలుస్తోంది.ఎక్కడెక్కడ ఎంత సాధించిందంటే..డీసీ తమిళంలో ఎక్కువ వసూలు చేసింది. ఆదివారం తమిళంలో రూ.6.60 కోట్లు నెట్.. తెలుగులో రూ. 2.30 కోట్లు, హిందీలో రూ. 65 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఓవర్సీస్లో రూ.2.25 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ రూ.7.75 కోట్లకు చేరింది. ఇండియా, ఓవర్సీస్ కలిపి ‘డీసీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలక్షన్ రూ. 31.86 కోట్లుగా నమోదైంది.లోకేశ్ నటనకు ప్రశంసలు..డీసీలో దేవదాస్ పాత్రలో మెరిసిన లోకేశ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే దర్శకుడిగా మంచి స్టార్డమ్ సంపాదించిన లోకేశ్.. హీరోగానూ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. దీంతో లోకేశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వామికా గబ్బి పోషించిన చంద్రపాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరితో పాటు సంజనా కృష్ణమూర్తి.. పార్వతి పాత్రలో నటించారు. -
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం)'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార)తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఫరియా అబ్దుల్లా..,❤️🥹🙌🏻తెలంగాణ వాళ్ళు అందరినీ ఆక్సెప్ట్ చేస్తారు..అందరితో కలిసి ఉంటారు ఇది నిజంగా బెస్ట్…🙌🏻_ @fariaabdullah2 pic.twitter.com/Lt1muoc6VF— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) August 10, 2026Unmatched Energy And Full-On Bonalu Vibes! ❤️🔥🔥@FariaAbdullah Bringing Her Own Spark To The #Bonalu Festival In Hyderabad. Absolutely Love The Energy! 💃#Bonalu2026 #FariaAbdullah pic.twitter.com/SwrZYJBzR5— Hari SaaHo (@HariSaaho19) August 9, 2026 -
'గజ'మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
-
నా Next మూవీ చిరు, నానితోనే
-
లంగా ఓణీలో టాలీవుడ్ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్
ప్రస్తుతం 'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. వైజాగ్లో కనిపించాడు. తన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై అస్సలు నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)'గంగోత్రి' రోజుల్లో వైజాగ్ రోడ్డుపై ఎవరూ నన్ను గుర్తుపట్టేవారు కాదు. ఇప్పుడు అదే రోడ్డుపై నడవలేకపోతున్నాను. 'రాకా' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వైజాగ్ ప్రజల కోసం ఒక రోజు బ్రేక్ అడిగి వచ్చాను. అయితే పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పువ్వుల్లో పెట్టుకుని తీసుకొచ్చారు. వాళ్లకు థ్యాంక్స్' అని అన్నాడు. ఇక ఎదురుగా ఉన్న కొందరు అభిమానులు ఫొటో కావాలని అడగడంతో అందరూ ఇక్కడికి వచ్చేయండి అని స్టేజీపైకి ఆహ్వానించాడు. ఫ్యాన్స్కి నో అని చెప్పటం నా వల్ల కాదమ్మా అని అన్నాడు.ఎనిమిది స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్లో 'పుష్ప'లో గడ్డం కింద చేయి పెట్టే పోజు ఉన్న బన్నీ బొమ్మని ప్రదర్శన కోసం ఉంచారు. అలానే అల్లు అర్జున్కి సంబంధించిన పలు సినిమా స్టిల్స్ కూడా ఉంచారు. ఇకపోతే ప్రస్తుతం 'రాకా' చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ తన 23వ మూవీ చేయనున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ హైదరాబాద్లో జరుగుతోంది.(ఇదీ చదవండి: ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు: విశాల్)#Gangotri Movie Shooting రోజుల్లో #Vizag రోడ్లపై వెళ్తున్నప్పుడు Nannu ఎవరూ గుర్తుపట్టేవారు కాదు...#AlluArjun pic.twitter.com/6Hevu8EiXN— Milagro Movies (@MilagroMovies) August 9, 2026The ICONIC PUSHPA Pose @alluarjun 🙅🏻🔥📍 AAA Cinemas, Vizag#AlluArjun @aaacinemasoffl #Pushpa2TheRule pic.twitter.com/V0o18cVzUj— Pushpa2TheRule 𝕏🧢 (@uicaptures) August 9, 2026 -
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?
-
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు మహేశ్ బాబు బర్త్ డే కావడంతో జక్కన్న క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మహేశ్ బాబు రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా మందాకినిగా చేస్తోన్న ప్రియాంక చోప్రా పోస్టర్ కూడా పంచుకున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం త్రేతాయుగం ఎపిసోడ్లో మహేశ్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే హనుమంతుడి రోల్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఈ పాత్రలో ఎవరు చేస్తున్నారనే దానిపై ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. హనుమాన్ లాంటి పవర్ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు మాధవన్ పేరు పరిశీలించారని టాక్. కానీ తాజాగా మరో పేరు వినిపిస్తోంది. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతాడని దర్శకధీరుడు ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. -
బిగ్బాస్ హౌస్లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్బాస్ హౌస్లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్బాస్ టీమ్ రామ్ ప్రసాద్ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ప్రతి రోజు మాకు ఎంతో స్పెషల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ ఏడాది మరింత ప్రేమ, ఆరోగ్యం, సంతోషంగా గడవాలని కోరుకుంటున్నట్లు నమ్రతా రాసుకొచ్చింది. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామంటూ ఇన్స్టాలో ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది.కాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేశ్ బాబు.. నమ్రతాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు జంటగా వంశీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు.. రాజమౌళితో కలిసి వారణాసి మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
రామ్ చరణ్ పై రోజా షాకింగ్ కామెంట్స్!
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. ఆ రోల్పై మరో నటి విమర్శలు
మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్రపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని సీన్స్ కూడా తొలగించారు. జాన్వీని కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారా? అని పలువురు విమర్శించారు. తాజాగా మరో నటి జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన ఆదితి బాలన్ పెద్దిలో హీరోయిన్ పాత్రను తప్పుబట్టింది.తాను ఇటీవలే పెద్ది మూవీ చూశానని ఆదితి బాలన్ అన్నారు. అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎందుకు రాశారో అర్థం కాలేదన్నారు. ఆ పాత్ర కరెక్ట్ కాదని నాకు అనిపించిందన్నారు. ఆమె పాత్రను అలా కాకుండా కొంచెమైనా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటే బాగుండేగని ఆదితి బాలన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. #AditiBalan comments on #JanhviKapoor’s characterisation in #Peddi#Ramcharan pic.twitter.com/ajn8AjxmeF— MLReviews🎥🎬 ♥️ (@MovieLove999) August 8, 2026 -
గాడ్ వర్సెస్ ఈవిల్
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్, షిజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆదివరాహ ప్రోడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎం.ఎస్. రాజుగారు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’లో నటించాను. కానీ ఆ సినిమా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. ఆ తర్వాత అజయ్ భూపతిగారి డైరెక్షన్లోని ‘మంగళవారం’ చిత్రంలో కీలక పాత్ర చేశాను.ఇప్పుడు ‘అగధ’లో నటించాను. ఈ చిత్రంలో నేను పోషించిన క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా కథ సాగుతుంది. కథ చెప్పిన నాలుగో రోజే సెట్స్కి వెళ్లాను. దీంతో ఈ పాత్ర కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సింది అంతా సెట్స్లో అయ్యాను.ఈ సినిమా చేయడం యాక్టర్గా నాకో కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎం.ఎస్. రాజుగారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం కోసం ఆయన రాసిన కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. ‘అగధ’తో నాకు ఆ బాక్సాఫీస్ సక్సెస్ స్టాంప్ వస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకే దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రైటర్ చంద్ర తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ముగ్గురు స్నేహితుల కథ ఇది’’ అని అన్నారు. -
మరో ప్రేమకథలో..?
యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, శ్రీలీల కలసి హిందీలో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఉమేష్ బిష్ట్ ట్రయాంగిల్ లవ్స్టోరీతో కూడిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేశారట. ఏక్తా కపూర్, గునీత్ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఒకే అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమ పెంచుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బీ టౌన్ టాక్.అలాగే ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించే యాక్టర్ కోసం దర్శక–నిర్మాతలు పలువురి యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఓ హీరోను ఫైనలైజ్ చేసి, సినిమాను అధికారికంగా ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. మరి... ఇద్దరు అమ్మాయిల ప్రేమను పొందగలిగే ఆ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... హిందీలో శ్రీలీల ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ ఫిక్స్ అయితే... బాలీవుడ్లో మరో ప్రేమకథా చిత్రం శ్రీలీల డైరీలో ఉంటుంది. -
భావోద్వేగాల ఇరుముడి
ఒకవైపు నోటిలో కత్తితో, మరోవైపు అయ్యప్ప మాల ధరించి... ఇలా రెండు రకాల లుక్స్లో రవితేజ కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ నెల 21న ‘ఇరుముడి’ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ 12న భీమవరంలో ఓ భారీ ఈవెంట్ని నిర్వహించి, ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ‘‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!
సెట్స్కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్... కెమెరా... యాక్షన్ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్ కేటాయించేందుకు ప్రోడ్యూసర్ రెడీ. కానీ హీరోయిన్ మాత్రం నాట్ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ అంటూ... కొన్ని గాసిప్స్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...ముచ్చటగా మూడోసారి ‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రయూనిట్ ప్లాన్ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్ను స్టార్ట్ చేయాలని హసిత్ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్ హయతిని సంప్రదించారని తెలిసింది.మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్ల జోడీ సెట్ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.దీపిక ప్లేస్లో ఆలియా? ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్ రోల్ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 1లో దీపికా పదుకోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడంలేదని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్లేస్లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్తో పాటు లీడ్ హీరోయిన్ కూడా సెట్స్లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అవుతుందని టాక్.గాడ్ ఆఫ్ వార్లో... ‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ను అనుకుంటున్నారు మేకర్స్. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.చరణ్కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్). రామ్చరణ్ కెరీర్ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్చరణ్ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్సీ 17’ సినిమా సెట్స్కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్. కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్చరణ్ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్చరణ్.ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్చరణ్ షూట్లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్చరణ్కు జోడీగా రుక్మిణీ వసంత్నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.రాకాలో నలుగురు నాయికలు? అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఒక హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్కు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్ రోల్స్కు ఫైనలైజ్ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్.అయితే జాన్వీ, రష్మిక, మృణాల్లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్కు జోడీగా కనిపించే హీరోయిన్స్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ తరహాలో తక్కువ టైమ్ గ్యాప్లోనే ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్ కానున్నాయని సమాచారం.రోమియో ప్రేయసి... నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హైదరాబాద్లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్ షూటింగ్ మాత్రం లండన్లో ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్ను స్టార్ట్ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో... రామ్ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్ను, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్ ఖరారు అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని చెప్పాచ్చు.ఎల్లమ్మ..! ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్ బ్యాక్డ్రాప్ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత కీర్తి సురేష్ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.నో హీరోయిన్!ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రనే తొలగించాలని మేకర్స్ అనుకుంటున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.– ముసిమి శివాంజనేయులు -
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
తెలుగు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో, జులాయి, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, జల్సా, నువ్వే నువ్వే, అఆ తదితర సినిమాలతో తనదైన పేరుని సొంతం చేసుకున్నారు. అభిమానులతో ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలిపించుకుంటూ ఉంటారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)అయితే గత పదేళ్ల కాలంలో త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే.. అన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు. ఇలా ఒకే నిర్మాతతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారనే దానికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్-తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'బాబాయి(చినబాబు).. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు మొదటి మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 'జులాయి' తొలి చిత్రం. ఇది ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్తో మా అనుబంధం మరింత బలపడింది. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పేరుని ఆయనే సూచించారు. లోగో కూడా త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన బయట బ్యానర్(నిర్మాణ సంస్థ)లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఓ కుటుంబంలా అయిపోయాం' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న 'ఆదర్శ కుటుంబం', త్వరలో ఎన్టీఆర్తో తీయబోయే మూవీ కూడా ఇదే సంస్థలో నిర్మిస్తున్నారు. మరోవైపు నాగవంశీ.. సితార నిర్మాణ సంస్థ తరఫున పలు మూవీస్ తీస్తూ బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
బాబంటే.. బాబే..
సినీ రంగంలో స్టార్లకు కొదవలేదు. కానీ వెండితెరపై విజయాలకే పరిమితం కాకుండా..నిజ జీవతంలోనూ వేలాది మంది జీవితాల్లో చిరునవ్వులు పూయించేవారు మాత్రం అరుదు. ఈ జాబితాల్లో ముందువరసలో ఉంటారు సూపర్స్టార్ మహేశ్ బాబు. కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. నిజ జీవితంలో పసి హృదయాల రారాజుగా నిలిచారు. బాలనటుడిగా మొదలై.. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశీల నటుడిగా ఎదిగారు. ఆయన ప్రస్థానం.. విజయాలు, వైఫల్యాలు, రికార్డులు, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, క్రమశిక్షణాల సమ్మేళనం. ప్రతి పాత్రలో నటుడిగా ఎదుగుతూ.. ప్రతి సేవా కార్యక్రమంలో మనిషిగా ఉన్నతంగా నిలిచిన మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.తమిళనాడులో జననం..సూపర్స్టార్ కృష్ణ తనయుడిగా ఆగస్టు 09,1975లో తమిళనాడులో జన్మించారు మహేశ్ బాబు. సినీ కుటుంబంలో పుట్టడంతో వెండి తెర కొత్త కాలేదు. చిన్నప్పటి నుంచి కెమెరాలు, షూటింగ్ల మధ్య పెరిగినా..తండ్రి పేరును ఆసరగా చేసుకోకుండా ప్రతిభే లక్ష్యంగా అడుగులు వేశారు. అదే ఆలోచన ఆయన్ని కోట్లాది అభిమానుల కథానాయకుడిని చేసింది.నాలుగేళ్లలోపే గుర్తింపు..చాలామంది హీరోలు యుక్త వయసులో అడుగుపెడితే.. ఈ రారాజు మాత్రం నాలుగేళ్లలోనే సినీ ప్రపంచంలోకి రంగ ప్రవేశం చేశారు. ‘నీడ’తో ప్రారంభమైన ఆయన ప్రయాణం వరుసగా పలు చిత్రాల వరకు కొనసాగింది. చిన్న వయసులోనే తన సహజమైన నటనతో దర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు. బాలనటుడిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ చదువుకు ఇబ్బందులు ఎదరవకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లు పూర్తిగా సినిమాలకు బ్రేక్ వేశారు మహేశ్. తమిళనాడులో విద్యాభ్యాసం పూర్తి చేసి మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చారు.రాజకుమారుడుతో హీరో.. ఒక్కడుతో స్టార్1999లో వైజయంతీ పతాకంపై రాజకుమారుడు సినిమాతో హీరోగా ఆరగ్రేటం చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా సినీ ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కావడం విశేషం. తర్వాత వచ్చిన మురారి నటుడిగా గుర్తింపు తీసుకురాగా.. ఒక్కడుతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను,మహర్షి వంటి చిత్రాలు ఆయన స్థాయిని మరింత పెంచాయి.నిజ జీవితంలో శ్రీమంతుడై..శ్రీమంతుడు సినిమాతో గ్రామాన్ని దత్తత తీసుకునే సందేశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రిన్స్.. అదే ఆలోచనను నిజ జీవంతంలోనూ ఆచరించి శ్రీమంతుడిగా మారారు. గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తూ.. సమాజానికి సాయం చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి నాంది పలికారు. దీంతో బాధ్యత గల పౌరుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నారు.హృదయాల రారాజుగా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ అనే సేవా సంస్థని స్థాపించి ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించాడు. ఇప్పటి వరకు 5000లకు పైగా శాస్త్రచికిత్సలు చేసి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. అందుకే చిన్నారులతో మొదలు అభిమానుల సైతం ఆయన్ని పసి హృదయాల రారాజుగా పిలుచుకుంటారు. -
లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు నచ్చలేదని అంటున్నారు. దీనితో పాటే 'డిసి' అనే తమిళ డబ్బింగ్ బొమ్మ కూడా రిలీజైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ హీరోగా నటించగా.. అనిరుధ్ సంగీతమందించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీతో దీన్ని తీశారు. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సింది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)'తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ నా దగ్గరకు ఓ ఆసక్తికరమైన కథతో వచ్చాడు. నాకు చెప్పాడు. అదే టైంలో నేను చేస్తున్న ఓ సినిమా స్టోరీ.. దీనికి పోలినట్లు ఉండటంతో నేను అది ఓకే చేయలేకపోయాను' అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో బట్టి చూస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా చేస్తున్న టైంలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ 'డిసి' కథతో విజయ్ని కలిశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో హీరోగా లోకేశ్ కనగరాజ్ని తీసుకున్నారు. అలా రౌడీ హీరో చేయాల్సిన మూవీతో దర్శకుడు లోకేశ్ హీరోగా మారాడు. నటుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ 'డిసి' చేసుంటే ఎలా ఉండేదో?ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉండగా.. లోకేశ్ కనగరాజ్, అల్లు అర్జున్తో తాను తీయాల్సిన #AA23 ప్రాజెక్ట్తో ఫుల్ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) DC VDK pic.twitter.com/mD6vEUCMEQ— Telugu Chitraalu ² (@TC_Backup) August 8, 2026 -
డబ్బులు పెట్టి మేం చేసే ఆ పనివల్ల ఒక్క టికెట్ కొనరు
తెలుగులో ఏ సినిమా అయినా ఫలానా రోజున రిలీజ్ అవుతుందంటే.. హీరో,హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా టీమ్ అంతా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కనిపిస్తారు. ఇంటర్వ్యూలు, కాలేజీ టూర్స్ అని తెగ హడావుడి చేస్తుంటారు. వీటికి అదనంగా పేపర్ యాడ్స్, సిటీ అంతా హోర్డింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి ప్రచారంలో భాగమవుతుంటాయి. అయితే వీటి వల్ల ఒక్క టికెట్ కొనరని ప్రముఖ నిర్మాత నాగవంశీ అంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)'ఏడాదికి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతగా చెబుతున్నా. ప్రమోషన్స్ అంటూ మేం ఖర్చు చేసే ప్రతి రూపాయి వృథానే. డబ్బులు పెట్టి చేసే పబ్లిసిటీ వల్ల ఒక్క టికెట్ తెగదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఒక్క టికెట్ కొనరు. ఆర్గానిక్గా ఓ టీజర్ నచ్చి పాట నచ్చితే ప్రేక్షకులు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోతే.. ఏ ప్రమోషన్స్ చేయరా? సినిమాని వదిలేస్తారా? సినిమాకు బజ్ లేదని అంటారు. పోనీ ఇవేమైనా చేస్తే బజ్ వస్తుందా? టికెట్ తెగుతుందా? గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే తెలీదు. న్యూస్ పేపర్ యాడ్స్, హోర్టింగ్స్.. వీటివల్ల ఏమొస్తుంది? టికెట్ ఏం తెగదని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోరు. వీరభద్రుడు, బ్లాస్ట్, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ.. ఈ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్కి సెకండ్ షో కలెక్షన్కి సంబంధం లేదు. ఉదయం షోకి రాత్రి షోకి మధ్య ఉన్న 10-12 గంటల గ్యాప్లో ఏం ప్రమోషన్ చేస్తారు? ఏం చేయంగా! సినిమా బాగుందటే టాక్ వల్లే ఇలా జరిగింది' అని నాగవంశీ చెప్పుకొచ్చారు.ఈయన చెప్పిన దానిబట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా టాక్ బాగోలేదు అని వస్తే జనాలు లైట్ తీసుకుంటారు. అదే టైంలో ఎలాంటి స్టార్స్ లేని, అసలు బజ్ లేని చిన్న చిత్రం బాగుందంటే ప్రేక్షకులే నెత్తిన పెట్టుకుంటారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి.ఇకపోతే నాగవంశీ నిర్మించిన 'లెనిన్' సినిమా గత నెలలో రిలీజ్ కాగా ఇప్పుడు సూర్యతో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' రాబోతుంది. వచ్చే శుక్రవారం ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వచ్చే నెలలో ఈయన నిర్మించిన 'ఎపిక్' థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. అలానే ఆనంద్ దేవరకొండ చేసిన 'తక్షకుడు' అనే చిత్రం దీపావళి టైంలో నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా) -
వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు)
-
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
-
హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్
-
‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ప్రతి ఎపిసోడ్ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు (వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి) బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’.యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లో మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘నాకు కావాల్సిన హిట్ ‘కొరియన్ కనకరాజు’గా వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ చిత్రంతో చూడడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.‘‘మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రితికా నాయక్. ‘‘గమ్యం’ సినిమా సమయంలో థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు చూసిన ఆనందం ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మళ్లీ కనిపిస్తోంది’’ అని నిర్మాత రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వరుణ్ తేజ్ విజయంలో మేం భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత శిరీష్ తెలిపారు. -
మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ లేఖ విడుదల చేసింది. చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నిర్ణయాలను ధిక్కరిస్తూ మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ ఆరోపించింది.సస్పెండ్ చేసినా సభ్యులను కలుపుకుపోవాలని కౌన్సిల్ సమావేశంలో అందరం నిర్ణయం తీసుకోని మీకు అవకాశం ఇచ్చామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి మీకు ఫెడరేషన్ ఎటువంటి సహాయసహకారాలు అందించమని ఫిల్మ్ ఫెడరేషన్ తీర్మానించింది. మీ అసోసియేషన్ సమస్యల పరిష్కారం లో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత తీసుకోదని లేఖలో పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్తో జరిగే వేతనాల అగ్రిమెంట్ విషయంలో ఫెడరేషన్ ఎటువంటి సపోర్ట్ చేయదని తెలిపింది. ఫెడరేషన్ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డాన్సర్స్ అసోసియేషన్కు సహాయనిరాకరణ కొనసాగనుంది. -
కొరియన్ కనకరాజుతో మరో హిట్.. టాలీవుడ్ లక్కీ ఛార్మ్ రితికా!
తెలుగు సినీ ప్రియులను తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది భామ రితికా నాయక్. ఇటీవల వచ్చిన 'కొరియన్ కనకరాజు చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఓ వైపు మెస్మరైజ్ చేసే అందం, మరోవైపు పాత్రలో లీనమయ్యే నటనతో రితికా థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతుండటంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను నిర్మాతలు లక్కీ ఛార్మ్గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాదని.. ప్రాజెక్ట్కి ప్లస్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందం ఉన్నచోట అభినయం ఉండదు అంటారు, కానీ రితికా నాయక్ ఆ మాటను తప్పుగా నిరూపించింది. 'కొరియన్ కనకరాజు' మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్యూట్ లుక్స్, సహజమైన ఎక్స్ప్రెషన్స్తో తన పాత్రకు ఒదిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో మెరిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
'నన్ను కమిట్మెంట్ అడిగారు'.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్. ముఖ్యంగా నటీమణులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. ఇప్పటికే పలువురు సినీతారలు తమకెదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో బయటికి చెప్పుకొచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ నటి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై సంచలన కామెంట్స్ చేసింది.టాలీవుడ్ నటి చాందిని చౌదరి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. 2015లో ఓ బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ పేరుతో తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని గుర్తు చేసుకుంది. తాను తిరస్కరించడంతో మా అమ్మకు ఫోన్ చేసి కూడా అవమానించాడని చాందిని చౌదరి వెల్లడించింది. అంతేకాకుండా తనపై నెగెటివ్ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. చాందినికి పొగరు ఎక్కువనే ముద్ర వేశారని..అది ఇప్పటికీ తనని ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
ఎన్టీఆర్ డైలాగ్పై వివాదం.. వరుణ్ తేజ్ రియాక్షన్ ఇదే..!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ డైలాగ్ చుట్టు వివాదం మొదలైంది. దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మూవీ ప్రెస్మీట్కు హాజరైన ఆయన డైలాగ్పై క్లారిటీ ఇచ్చారు.అయితే ఇందులో తాము సీనియర్ ఎన్టీఆర్ను అగౌరపరచలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆయనపై మేము ట్రోల్ చేయలేదని.. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు. ట్రోలింగ్కు.. ఇమిటేషన్కు చాలా తేడా ఉందన్నారు. గొప్ప గొప్ప నటులను ఇమిటేట్ చేస్తారని అన్నారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇందులో ఫన్నీ మాత్రమే చూడాలని ఆడియన్స్ను వరుణ్ తేజ్ కోరారు. కాగా.. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని పుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్గా డ్రామాగా రూపొందించారని ట్రైలర్లో తెలిసిపోతోంది. 'గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచాక ఎక్కువగా మాట్లాడకూడదు' అనే డైలాగ్ ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
రామ్ చరణ్ పెద్ది.. పెద్ద మైనస్ అదొక్కటే..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీకి టాలీవుడ్ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు. పరుచూరి పాఠాలు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్తో కథను నడిపించడం అద్భుతంగా ఉందన్నారు. మూవీ చివర్లో ఇచ్చిన సందేశం తనకు నచ్చిందన్నారు.ఒక చిన్న పాయింట్ తీసుకుని మూడు గంటల సినిమా తీయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే పెద్ది రన్టైమ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని తెలిపారు. రామ్ చరణ్ కాకుండా మరెవరైనా చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నా అభిప్రాయమని వెల్లడించారు. ఈ సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాలపై మోశారని ప్రశంసించారు. అతని వల్లే పెద్దికి కలెక్షన్స్ వచ్చాయని పరుచూరి తెలిపారు.పరుచూరి మాట్లాడుచూ.. 'ఓట్లే లేని ఊర్లో రైలు ఆగాలనే పాయింట్ తీసుకుని గొప్పగా రాశారు. ఎలా అయినా ఊరికి గుర్తింపు తీసుకురావాలని హీరో క్రికెట్, కుస్తీల్లో ఓడిపోయినప్పటికీ.. చివర్లో రన్నింగ్లో సత్తా చాటి తన పోరాటంలో అనుకున్నది సాధించాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ వేషధారణలు ఏవీ తెలుగు వాళ్లకు నచ్చేలా లేకపోవడం పెద్ద మైనస్. హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ మూవీ రన్టైమ్ ఇంకా 30 నుంచి 40 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది. నిడివి తగ్గించి హీరోయిన్ పాత్ర ఎక్కువ చూపించి ఉంటే ఓటీటీలో ఇంకా ఆదరణ దక్కేదేమో' అని అన్నారు. -
'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)
-
దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు
దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్లోని ఓ ఆస్తి లీజు వివాదానికి సంబంధించి దగ్గుబాటి సురేశ్బాబు, వెంకటేశ్లపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విచారణను ఈ దశలో నిలిపేయడం సరికాదంటూ దగ్గుబాటి సోదరులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. హైదరాబాద్లోని ఓ ఆస్తిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చాక తెలెత్తిన వివాదంలో దగ్గుబాటి సోదరులపై దాఖలైన కేసును నాంపల్లి కోర్టు విచారిస్తోంది. లీజు ప్రాంగణంలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపించారు. ఈ కేసును కొట్టేయాలంటూ సురేశ్బాబు, వెంకటేశ్లు హైకోర్టును ఆశ్రయించారు. -
వారణాసి నుంచి బిగ్ అప్డేట్.. మహేష్ బర్త్ డేకి సర్ ప్రైజ్
-
బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్
తెలంగాణ నేపథ్యంతో రీసెంట్ టైంలో చాలానే సినిమాలు వస్తున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పళ్లబురుసు'. వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజయ్యే ఈ మూవీని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన.. తన కొడుకుపైనే పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్తాడు. దీని కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ 'పళ్లబురుసు' ఎంత పనిచేసింది అనే నేపథ్యంగా ఎమోషనల్ స్టోరీని చూపించబోతున్నారని తెలుస్తోంది. పల్లెటూరిలో తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ, కోర్టు నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ఉదయ్ చౌహాన్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఇది మేం ఊహించలేదు.. ఉదయనిధి అరెస్ట్పై విశాల్) -
'కొరియన్ కనకరాజు' మూవీలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో దక్షా నగార్కర్ (ఫొటోలు)
-
క్లైమాక్స్ హృదయాన్ని హత్తుకుంటుంది: నిర్మాత బెక్కెం వేణుగోపాల్
అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్పై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సమావేశంలో ‘టోంగా టోంగా’, ‘ శుక్రవారం నాడు సక్కని గడియ’ పాటలను రిలీజ్ చేశారు.అనంతరం హీరో అన్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా విషయంలో మాకు అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిని కావాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. ఈ నెల 10న మా సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత మా సినిమాపై ఉన్న అబీప్రాయాలు మారిపోతాయి’’ అని చెప్పారు. ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్కు ప్రశంసలు వచ్చాయి... విమర్శలూ వచ్చాయి. కానీ టీజర్ వైరల్ అయ్యి, హిట్ అయ్యింది. ప్రేక్షకులు మా సినిమాను చూస్తే, వారి డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారని చెప్పగలను’’ అన్నారు వెంకట్ యాదవ్.‘‘ఈ సినిమా కేవలం యూత్కే కాదు... మంచి సందేశం ఉన్న కమర్షియల్ చిత్రం. నిర్మాత సురేష్బాబుగారు చూసి, నచ్చి, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి’’ అని చెప్పారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘హిట్ సినిమా లేకపోతే ఇండస్ట్రీ గుర్తించదు. నాకు ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను’’ అని తెలిపారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్. వాసవి గణేషన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర గంటలు నవ్వుకుంటారు: వరుణ్ తేజ్
‘‘ఎప్పటి నుంచో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఉండేది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశాను. నాన్స్టాప్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా, సత్య కీలక పాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ⇒ నేను ఏ కథ విన్నా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులోని ఎంటర్టైన్మెంట్ నాకు చాలా నచ్చింది. నటుడిగా వెవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అబీప్రాయం ఉంది... అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేయడం సవాల్గా అనిపించింది. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే చాన్స్ రావడం సంతోషంగా అనిపించింది. ఈ పాత్ర నటుడిగా చాలా తృప్తినిచ్చింది. ⇒ గాంధీ పాత్ర రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఆ యాసపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. మరో పాత్ర కోసం కొరియన్ భాష నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పాత్రలో నేను కనిపించకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఈ సినిమాలో నాది, సత్య పాత్ర చాలా కీలకం. మేమిద్దరం రాయలసీమ యాస నేర్చుకుని, వర్క్ చేశాం.⇒ రాజీవ్గారు, వంశీగారు చాలా ప్యాషన్ ఉన్న ప్రోడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. ఇక పర్సనల్గా మాకు అబ్బాయి పుట్టిన తర్వాత షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాను. నేను నటించనున్న ‘బరి’ సినిమా ప్రీ- ప్రోడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్డ్రాప్తో ఈ కథ ఉంటుంది. -
వారణాసి మేకర్స్కు షాక్.. మహేశ్ బాబు వీడియో లీక్...!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ప్రస్తుతం ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు దర్శకధీరుడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈనెల 8న మహేశ్ బాబు బర్త్ డే కావడంతో ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారణాసికి సంబంధించి బర్త్ డే గ్లింప్స్ కానీ, పోస్టర్స్ కానీ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మేకర్స్ కొత్త తలనొప్పి మొదలైంది. వారణాసి షూట్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించిన వీడియోగా తెలుస్తోంది. వాటర్లో మహేశ్ బాబు ఫైట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో మళ్లీ వారణాసికి లీకుల బెడద మొదలైంది. గతంలో ఓసారి లీక్ బారిన పడిన వారణాసి మరోసారి అదే రిపీట్ అయింది. అయితే ఈ వీడియో క్లిప్పై మేకర్స్ ఇంకా స్పందించలేదు.వారణాసి మూవీ పదేపదే లీక్ల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారణాసి సెట్స్ చిత్రాలు, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, అనౌన్స్మెంట్ గ్లింప్స్లోని కొన్ని భాగాలు అధికారిక విడుదలకు ముందే ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వీడియో రావడంతో మేకర్స్ ఆందోళన చెందుకున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారతీయ చిత్రాలలో అత్యధికంగా లీకుల బారిన పడుతున్న చిత్రాలలో ఒకటిగా వారణాసి నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. JAI BABU 🔥🦁Just now seen the leaked bit of #Varanasi 😭 #MaheshBabu#SSRajamouli #SSMB29 pic.twitter.com/0ntdueE2dL— RAM DHFM (@RKiran1432) August 6, 2026 -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫ్రైడే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా మహేశ్ బాబు దూకుడు చిత్రం(ఆగస్టు 09) రీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే అక్కినేని హీరో అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఈ శుక్రవారమే ఓటీటీకి రానున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07 ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07 మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07 రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07 అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07 డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07బిగ్చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07 లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07 ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08జీ5 లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07 వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07జియో హాట్స్టార్ ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్ పొంగళ (మలయాళ మూవీ) - ఆగస్టు 07సన్ నెక్ట్స్..సత్యతిల్ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07 -
ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్ బయోగ్రఫీ
-
‘అనకాపల్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా సోనూ సూద్ (ఫొటోలు)
-
'హుషారు పిట్టలు' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పట్టు చీరలో పరవశింపజేసిన అందాల భామ.. (ఫొటోలు)
-
రీతూ చౌదరి, డిమాన్ పవన్ 'బంగారం' పాట లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.స్పందించని టాలీవుడ్..బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా మెప్పించిన ప్రదీప్ రావత్పై టాలీవుడ్ చిన్నచూపు చూసింది. ఆయన మరణం తర్వాత ఏ ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించలేదు. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ రావత్ లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు సంతాపం.. మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..'ప్రదీప్ రావత్ మరణవార్త విని చాలా బాధపడ్డా. తెరపై, ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి. నేను ఆయనను ఎల్లప్పుడూ అలాగే గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇదే నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని, ఆయన పవిత్రాత్మ శాశ్వత శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. It is deeply saddening to hear of the passing of Pradeep Rawat garu.On screen, he brought immense power to every character he portrayed. Off screen, he was the complete opposite: humble, simple, warm, and truly down to earth. That is how I will always remember him.My…— Vishnu Manchu (@iVishnuManchu) August 5, 2026 -
అరుణాచలంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్హుడ్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటమ్ సాంగ్తో ఆకట్టుకుంది. కిస్సిక్ అంటూ అభిమానులను అలరించింది. ఈ ఏడాది శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. Our girl #Sreeleela at Tiruvannamalai pic.twitter.com/naeZUbBt0u— KUMAR || Vaathi సార్ || Venky Atluri&Nelson Fan || (@RajiniDhanush5) August 5, 2026 -
రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం.. గబ్బర్ సింగ్ నటుడికి సాయం
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నటుడికి అండగా నిలిచారు. గబ్బర్ సింగ్ నటుడు రమేశ్కు ఆర్థిక సాయమందించారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యం కోసం స్వయంగా తన వంతుగా లక్ష రూపాయలు అందజేశారు. అతను కోలుకోవాలని.. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. దీంతో రాహుల్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా.. గబ్బర్ సింగ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో రమేశ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో కూడా కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ పాత్రల్లో నటించాడు. -
ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండిలోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణాన్ని 'లగాన్' సహనటుడు యశ్పాల్ శర్మ ధృవీకరించారు. ప్రదీప్ మృతి పట్ల అఖిల భారత సినీ కార్మికుల సంఘం సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.రావత్ కెరీర్..కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. -
'సినిమాల్లో ఛాన్స్.. దయచేసి అమ్మాయిలు రావొద్దు'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నామని చాలామంది నటీమణులు బయటికి చెబుతుంటారు. ఏదో ఒక సందర్భంలో తాము కూడా క్యౌస్టింగ్ కౌచ్కు గురైనట్లు పలువురు స్టార్స్ సైతం ఈ విషయంపై గతంలో మాట్లాడారు. అలా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవాళ్లకు సైతం ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి.తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయరన్సర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సీరియల్స్, ఫోక్ సాంగ్స్లో అవకాశాల కోసం తాను హైదరాబాద్కు వచ్చానని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయని.. కానీ కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తారని ఓపెన్గా చెప్పేసింది. మహిళలు సినీరంగంలో వచ్చారంటే కమిట్మెంట్ లేకుండా జరగదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఛాన్స్ కోసం మూడోసారి హైదరాబాద్కు వచ్చానని.. మళ్లీ అదే రిపీట్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా మన ఇన్ స్టా రీల్స్ కానీ.. యూట్యూబ్ ఛానల్ కానీ చూసి సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటే అస్సలు నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఇన్ఫ్ల్యూయన్సర్ వీడియోలో మాట్లాడుతూ.. 'మన ఇన్స్టా వీడియోస్ చూసి సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామంటే నమ్మి హైదరాబాద్కు రావొద్దు. ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్ తప్పనిసరి. అది లేనిదే అమ్మాయికీ అవకాశం ఇవ్వరనేది తెలిసిపోయింది. ఒక్కసారి కాదు.. నాకు అలా మూడుసార్లు జరిగింది. నాకు ఫోక్ సాంగ్లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు. తీరా వచ్చాక గంటల కొద్దీ కూర్చోబెట్టి ఆఖరికి మగ బుద్ధి చూపించాడు. దయచేసి గుడ్డిగా నమ్మి ఎవరూ హైదరాబాద్కు రావొద్దు. ఒక అమ్మాయి సినీ ఫీల్డ్లో సెటిల్ అయ్యిందంటే దాని వెనుక కమిట్మెంట్ ఇచ్చే ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేసినా ఫర్వాలేదు. నా లైఫ్లో సినీ ఫీల్డ్ జోలికి వెళ్లను. నా ఊర్లోనే ఉంటూ రీల్స్ చేసుకుంటూ బిజినెస్ చూసుకోవాలని డిసైడ్ అయ్యా.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.పడుకుంటే కానీ పని జరగదు !అమ్మాయిలు ఈ సినిమా ఇండస్ట్రీలో కి రావద్దు. #Tollywood pic.twitter.com/STHKFkdoOW— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) August 4, 2026 -
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయనతో నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు.ఆయన మరణం వేళ ఓ ఆసక్తకర విషయంపై చర్చ నడుస్తోంది. ప్రదీప్ తన కెరీర్లో ఎంత సంపాదించారని నెట్టింట వెతికేస్తున్నారు. బాలీవుడ్తో పాటు తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన ఆస్తి ఎంతనేదానిపై పలు నివేదికలు ప్రచురించాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.20 నుంచి 40 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. వీటిలో స్థిర, చరాస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి గురించి ఎలాంటి అధికారిక సమాచారమైతే లేదు. ప్రదీప్ దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించి బాగానే సంపాదించారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.ప్రదీప్ తన కెరీర్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించినప్పటికీ.. ఆమిర్ ఖాన్ సరసన పోషించిన గజినీ ధర్మాత్మ పాత్ర ఆయన కెరీర్లో అత్యంత గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం బాలీవుడ్లో రూ.100 కోట్లు సాధించి.. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా లగాన్, సర్ఫరోష్, కోయ్లా, మేజర్ సాబ్, సయే, స్టాలిన్, వీరం, జిల్లా, వాల్తేర్ వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఛావా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కాగా.. రావత్కు భార్య కళ్యాణి రావత్, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. -
ఈ సారి అలా చేస్తే సహించను: కంటెస్టెంట్లకు నాగ్ వార్నింగ్
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ షోకు అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే హిందీ బిగ్బాస్ తేదీని కూడా రివీల్ చేశారు. ఇటీవలే ప్రోమో రిలీజ్ చేసి సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుందని ప్రకటింటచారు. దీంతో టాలీవుడ్ అభిమానులు సైతం తెలుగు సీజన్-10 ఎప్పుడా అని ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.బిగ్బాస్ సీజన్-10 ప్రోమో షూటింగ్ ఇటీవలే పూర్తయిందని నాగ్ వెల్లడించారు. ఈ సారి పదో సీజన్కు హోస్ట్గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సీజన్ మరింత ఉన్నతంగా ప్లాన్ చేస్తున్నారని.. గతం కంటే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఇతరుల ప్రవర్తనను నిర్ణయించడం, సూచనలు చేయడం నాకిష్టం ఉండదన్నారు. అందుకే మొదటి రెండు సీజన్లలో కాస్తా ఇబ్బంది పడ్డానని.. ఆ తర్వాత షో ఫార్మాట్ అలవాటైందని వెల్లడించారు. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే అస్సలు సహించననని నాగ్ స్పష్టం చేశారు. -
టాలీవుడ్కు షాక్.. విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత
-
ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో ఉన్న టైంలో కొందరు నటీనటులు రాజకీయాలు గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడితే మళ్లీ తమ సినిమాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మొహమాటం లేకుండనే మాట్లాడేస్తుంటారు. అలా అక్కినేని కోడలు శోభిత.. కమ్యూనిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.(ఇదీ చదవండి: విజయ్ కాదు మహేశ్ బాబు ఆ సినిమా చేయాలి)'నాకు రాజకీయాలపై బలమైన అభిప్రాయం ఉంది. నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని సదరు వీడియోలో శోభిత చెబుతున్నట్లు ఉంది. అయితే ఇది ఎనిమిదేళ్ల క్రితం నాటి వీడియో. 'గూఢచారి' మూవీ ప్రమోషన్ల టైంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో శోభిత ఇలా చెప్పింది.శోభిత ఏ ఉద్దేశంతో అన్నాదో ఏమో గానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సదరు వీడియో వైరల్ అవుతుంది. ధైర్యంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పిందని కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ఈమెని విమర్శిస్తున్నారు. నటిగా కొనసాగుతూ లగ్జరీ లైఫ్స్టైల్ అనుభవిస్తూ శోభిత, కమ్యూనిజం గురించి మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అప్పుడెప్పుడో చేసిన కామెంట్స్ కారణంగా శోభిత మళ్లీ ట్రెండ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)Actor Sobhita Dhulipala: "I have a feeling communism is going to win someday." pic.twitter.com/Mq9OE3AZWf— Zadig (@piebyfour) August 2, 2026 -
రెండు భాగాలుగా సందీప్ కిషన్ 'కరికాల'
రీసెంట్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరో సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు'గా అలరించాడు. అలానే తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన 'సిగ్మా'లోనూ నటించాడు. ఇది త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇవలా ఉండగానే కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.కొన్నాళ్ల క్రితం 'శంబాల' మూవీతో అలరించిన దర్శకుడు యుగంధర్ ముని.. సందీప్ కిషన్తో కలిసి చేస్తున్న సినిమాకు 'కరికాల' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన ఈ చిత్ర తొలి భాగం వచ్చే ఏడాది జూలై 02న, రెండో భాగం అక్టోబరు 28న థియేటర్లలోకి రానుందని పేర్కొన్నారు. -
అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
మెగా, అక్కినేని ఫ్యాన్స్ పండగే.. చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్
-
పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
-
బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే
టాలీవుడ్ విలన్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్(74) చనిపోయారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఈయన మంగళవారం సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పలు భాషల్లో 150కి పైగా సినిమాలు చేసిన ఈయనకు ఆంధ్రాతో సంబంధముంది. అవును ఈయన తెలుగింటి అల్లుడు అనే సంగతి చాలామందికి తెలీదు. ఈ విషయాన్ని గతంలో ఈయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)ప్రదీప్ రావత్ భార్య పేరు కల్యాణి. ఈమెది కాకినాడ. 'స్టాలిన్' షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీళ్లకు విక్రమ్, సింగ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బయట ప్రదీప్ రావత్-కల్యాణి.. లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తుంటారు. తన భర్తది చాలా సున్నితమైన మనసు అని గతంలో ఓసారి కల్యాణి చెప్పారు. కల్యాణికి కూడా సినీ రంగంతో అనుబంధం ఉందమున్నట్లు తెలుస్తోంది. మోడలింగ్లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. పలు కమర్షియల్ యాడ్స్, హిందీ సీరియల్స్లో నటించారట.ప్రదీప్ రావత్ కెరీర్ విషయానికొస్తే.. 1985లో నటుడిగా పరిచయమయ్యారు. తొలుత సీరియల్స్ చేశారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రలో నటించారు. ఆమిర్ ఖాన్ లగాన్లోనూ కీలక పాత్ర చేశారు. 2004లో రాజమౌళి తీసిన 'సై'తో తెలుగులోకి వచ్చారు. ఇందులో ఇతడు చేసిన భిక్షు యాదవ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. తర్వాత భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య చేశారు. చివరగా ఈ ఏడాది మేలో వచ్చిన 'గాయపడ్డ సింహం'లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
గోల్డ్ కలర్ డ్రెస్లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)


