breaking news
Tollywood
-
ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్ నిర్మాత
తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్పై కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసిన ఈ మూవీ మున్ముందు మరిన్ని రికార్డులు తిరగరాయనుంది. ఈ సినిమాతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. గతేడాది కోట్లాది రూపాయలు నష్టపోయిన ఆయన మిరాయ్పై పెట్టుకున్న ఆశలు నిజమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీ వల్ల మా సినిమాల బిజినెస్ దెబ్బతింది.ఒక్క ఏడాదే రూ.140 కోట్ల నష్టంఒక్క ఏడాదిలోనే మేము ఐదారు సినిమాలు చేశాం. అవి వడక్కుపట్టి రామస్వామి, ఈగల్, మనమే, విశ్వం, స్వాగ్, మిస్టర్ బచ్చన్.. ఇవి కొన్ని థియేటర్లో బాగా ఆడినా నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా చేయలేకపోయాయి. ఈ సినిమాలను ఓటీటీలకు సరైన సమయంలో అమ్మకపోవడం వల్ల భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. కేవలం ఓటీటీల వల్లే 2024లోనే రూ. 120 -140 కోట్లు నష్టపోయాను. ఇంకా రికవరీ అవలేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ మరోసారి వైరల్గా మారాయి.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని కొట్టాడు -
ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి
మగరాయుడి గెటప్తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. ఆ కారణం వల్లే ముఖంపై..పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది. గుండు గీయించుకున్నా..నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్మ్యాన్ లేజర్తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో -
ఓటీటీకి రూ.340 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
థియేటర్లలో దక్ష, బ్యూటీ.. మరి ఓటీటీలో ఏయే సినిమాలో తెలుసా?
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్లో వస్తోన్న దక్ష, అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి, కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. కాజోల్ వెబ్ సిరీస్ ద ట్రయల్ సీజన్- 2, వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. రేపటి నుంచి సడన్ స్ట్రీమింగ్కు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.నెట్ఫ్లిక్స్సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1928 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20జియో హాట్స్టార్పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19మనోరమ మ్యాక్స్రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు.ఓజీ ట్రైలర్ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా 1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.భారీగా టికెట్ ధరల పెంపు.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.#OGTrailer on Sept 21st.. pic.twitter.com/2RMr9r1dm5— Sujeeth (@Sujeethsign) September 18, 2025 -
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
అక్కినేని నాగేశ్వరరావు హిట్ సినిమాలు రీరిలీజ్.. ఉచితంగానే టికెట్స్
అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) 101వ జయంతి సందర్భంగా పలు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు మరోసారి వెండితెరపైకి రానున్నాయి. చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం హిట్ సినిమాలు మరోసారి రానున్నాయి. ఉచితంగానే టికెట్లు ఇవ్వనున్నారు.డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు సెప్టెంబర్ 20 నుంచి రీ-రిలీజ్ అవుతున్నాయి. బుక్ మై షో లో సెప్టెంబర్ 18 నుంచి ఉచితంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా థియేటర్స్ వద్దకు వెళ్లి డైరెక్ట్గానే పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ( కృష్ణ టాకీస్), విశాఖపట్నం (క్రాంతి), ఒంగోలు( స్వర్ణ ప్యాలెస్) వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శనలు జరగనున్నాయి. పలు చోట్ల ఇంకా థియేటర్స్ ప్రకటించలేదు. నేడు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఏఎన్నార్ అభిమానులకు ఫ్రీ టికెట్స్ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)
-
ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..!
బిగ్బాస్ రెండో వారం మరింత హాట్హాట్గా కొనసాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. తీరా చూస్తే ఈ వారంలో భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి నామినేట్ అయ్యారు. తాజాగా ఇవాళ బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కెప్టెన్సీ కోసం కంటెెస్టెంట్స్ ఎలా పోటీ పడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు)ప్రస్తుతం నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్లో కెప్టెన్సీ గోల మొదలైంది. ఇందులో భాగంగా ఓనర్స్, టెనెంట్స్ మధ్య బజర్ నొక్కే టాస్క్ పెట్టాడు బిగ్బాస్. టాస్క్లో భాగంగా ఈ రెండు గ్రూపుల మధ్య ఫోన్ కాల్స్.. మేమంటే మేము అంటూ బజర్ నొక్కలేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి చివరికీ కెప్టెన్సీ ఏ గ్రూప్కు దక్కిందన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. తాజాగా ఇవాళ రిలీజైన ప్రోమో చూస్తే కెప్టెన్సీ కోసం రెండు గ్రూపుల మధ్య పోటీ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. The captaincy battlefield is blazing!housemates unleash full power, who will rise as the winner of this challenge? 👁️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/SUMP0IYtuY— JioHotstar Telugu (@JioHotstarTel_) September 18, 2025 -
నాకు సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు : విజయ్ ఆంటోని
తమిళ నటుడు విజయ్ ఆంటోని ‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్గా మార్గాన్ సినిమాతో మెప్పించిన ఆయన మరోసారి సత్తా చాటేందుకు బలమైన కథతో రానున్నారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. తెలుగులో సురేశ్బాబు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పలు విషయాలను విజయ్ ఆంటోని పంచుకున్నారు.25వ సినిమాగా భ్రదకాళి రానుంది. నంబర్ మాత్రమే మారింది. కానీ, నేను ప్రతి సినిమాకు ఒకే విధంగా పనిచేశాను. అయితే, ఈ సినిమాకు నిర్మాతకు నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించాను. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఒక నిర్మాతగా ఈ మూవీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. నా వెనకాల ఎవ్వరూ లేరు. ప్రతి రూపాయి నేను మాత్రమే ఖర్చు పెట్టాలి. సుమారు 15 నెలల పాటు ఎంతగానో శ్రమించాను. సినిమా విడుదలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, వడ్డీలు వంటి విషయాలను చూసుకునే క్రమంలో కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించి సినిమా కోసం పనిచేశాను. అయితే నిర్మాత సురేశ్బాబుతో మంచి స్నేహం ఉంది. మార్గన్ మూవీని తెలుగులో ఆయనే విడుదల చేశారు. మరోసారి వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాను. సుమారు 300కు పైగా థియేటర్స్లో భద్రకాళి విడుదల చేస్తున్నారు. అని ఆయన అన్నారు. -
‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)
-
ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల
వరుస చిత్రాలతో ఆడియెన్స్ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు.దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు. -
ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
నా భర్త మరణం.. మోహన్లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్లాల్తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్లాల్కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు. -
దర్శకుడు రాంగోపాల్ వర్మపై క్రిమినల్ కేసు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘దహనం’.. 2022లో ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే, ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించినట్లు ఆర్జీవీ చెప్పారని, ఇది అవాస్తవమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే చిత్రంలో ఆమె పేరును ఉపయోగించుకోవడం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనంటూ ఆమె పేర్కొన్నారు. -
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. అర్థమైతే మంచింది: సమంత
సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్కు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్ టైమ్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల్ సపోర్ట్గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఏపీలో భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్వైడ్గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳 pic.twitter.com/hBKEnKGtVx— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025 Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May you be blessed with good health, energy and happiness always. pic.twitter.com/fMftlzOeka— rajamouli ss (@ssrajamouli) September 17, 2025 -
'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'
అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిన కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్ కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి ఓ సైట్ కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్ అంటూ నా కాళ్లను టచ్ చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్ చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్ కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు. -
ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'
హను-మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. టికెట్ రేట్లు పెంచకుండానే మిరాయ్ ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు. 100 Crores⚔️🔥Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025 చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్ -
దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.సెలబ్రిటీల ప్రశంసలు సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. దయచేసి ఎక్కడికీ వెళ్లకు'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు. NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025 చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు -
Sai Pallavi: బాలీవుడ్లో బుజ్జి తల్లి బిజీ టాలీవుడ్ లో మాత్రం..
-
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)
-
పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు!
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు. తెలుగువారిని తీసుకోరెందుకో?కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిపైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.చెప్పుడుమాటలు విని బతికాకానీ, నాకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్ చీరలను నార్త్కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.చదవండి: రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్ -
రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీలో..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!అంతకంటే ఎక్కువ పెట్టనుదీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.చదవండి: కథ నచ్చి ఓజీ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్ -
విజయవాడలో ‘మిరాయ్’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)
-
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
-
'పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్'.. ఫుల్ ఎంటర్టైనింగ్గా టీజర్
మసూద ఫేమ్ తిరువీర్ నటించిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో(The Great Pre Wedding Show). ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్.ఈ సినిమా టీజర్ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్కు ఫోటోలు, వీడియోలు తీస్తూ నవ్వులు పూయించారు. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్పై ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.ఈ చిత్రంలో టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని 70ఎం ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బసాని నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబిల్లి సంగీతమందించారు. ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.I have known @iamThiruveeR from before the world knew me :) and I am so happy to see him live his dreams!Here is the teaser of #TheGreatPreWeddingShowA very interesting and relatable premise which Looks like a breezy ride! Best wishes to Thiruveer and the entire team 🤗 pic.twitter.com/oJQiPj8wbe— Vijay Deverakonda (@TheDeverakonda) September 16, 2025 -
'నిజమైన ప్రేమికులు అయితే ఆ తెలుగు సినిమా చూడండి'.. గరికపాటి కామెంట్స్
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టాలీవుడ్ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే తెలుగు సినిమాను చూడాలని గరికపాటి సూచించారు. ఇటీవల విడుదలైన 8 వసంతాలు చూస్తే చాలు.. నిజమైన ప్రేమ అంటే మీకు తెలుస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని తాను చూశానని వెల్లడించారు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది.. కలిసి ఉన్నా, విడిపోయినా వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది.తెలుగులో ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 8 వసంతాలు. అందమైన ప్రేమకథగా ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో మలయాళ అమ్మాయి అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)8 వసంతాలు కథేంటంటే?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. Thank you Padma Shri #GarikipatiNarasimhaRao Garu for your great words about #8Vasantalu ✨An eminent personality like you talking about our film is an honour.Movie streaming on Netflix ❤🔥▶️ https://t.co/EmPxSwgx8mDirected by #PhanindraNarsettiProduced by… pic.twitter.com/F0P3pykwvV— Mythri Movie Makers (@MythriOfficial) September 16, 2025 -
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్బాస్ సీజన్-9లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాము రాథోడ్ బిగ్బాస్కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.లాక్ డౌన్లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్ సొమ్మసిల్లి అనే సాంగ్ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు. కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు. -
నేను గుండంకుల్ అంటే.. మీరన్నది ఏంటి?.. మాస్క్ మ్యాన్కు స్ట్రాంగ్ కౌంటర్
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్గా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్గా ఉన్న కంటెస్టెంట్స్లో హౌస్లో మాస్క్ మ్యాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ను మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్ మ్యాన్ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్హాట్గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.High voltage nominations! 🔥Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025 -
అనసూయ ‘పవర్ డ్రెస్సింగ్’..చీర ఇలా కూడా కడతారా? (ఫోటోలు)
-
విజయ్ ఎన్నికల బస్సుకు అదే నంబర్.. గుండెను కదిలించే స్టోరీ తెలుసా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్ను సూచిస్తుంది.విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Nithin Barath SR (@theactorvijayteamoff) -
చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్ వీడియో
సోషల్ మీడియా నుంచి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బిగ్బాస్, పలు వెబ్ సిరీస్లతో యూత్కు దగ్గరైన షణ్ముఖ్ ఇప్పుడు ప్రేమకు నమస్కారం (Premaku Namaskaram) అంటూ థియేటర్స్లోకి రానున్నాడు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను పంచుకున్నారు. ప్రేమలో విఫలమైన వారందరూ బార్లోనే కలుస్తారని ఈ ట్రెండ్ను ఇంతటితో ఆపేయాలని చెబుతూ షణ్ముఖ్ తెరపైకి వస్తాడు. సోషల్మీడియాలో వైరల్ అయిన కొందరు ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తదనంతో కూడిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ క్రమంలోనే సోషల్మీడియాలో సన్సేషన్ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్హార్ట్స్ చిత్రంతో యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ప్రేమకు నమస్కారం అనే చిత్రంతో రానున్నారు. ఇందులో ఉల్క గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటుడు శివాజీ, నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది.ఈ గ్లింప్స్ వీడియోను గమనిస్తే.. ఇదొక యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్ల్ఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే బాధలు ఫన్నీగా ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి.టోటల్గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. -
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Manchu) తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రెజెంటర్గా పేరు పొందారు. చాలారోజుల తర్వాత ఆమె 'దక్ష' అనే యాక్షన్ సినిమాలో నటించారు. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తనకు అప్పులు ఉన్నాయనే రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు.ఆ ఇంటితో నాకు సంబంధం లేదుమంచు లక్ష్మీ సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయిపోయారని తెలిసిందే. అయితే, హైదరాబాద్లోని తన ఇల్లు అమ్మకానికి పెట్టారని, చాలా అప్పులు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'హైదరాబాద్లో నాకు ఇల్లు లేదు. అసలు నేను విక్రయించేందుకు ఇక్కడ ఇల్లు ఉండాలి కదా.. ఫిలిం నగర్లో ఉన్న నివాసం నాది కాదు. అక్కడ కేవలం ఉండేదానిని మాత్రమే.. ఆ ఇంటి గురించి వివరాలు కావాలంటే మా నాన్నను అడగండి చెప్తారు. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ ఇంట్లో ఉండేందుకు నాన్న ఇచ్చారు. ఆ ఆస్థి నాది కాదు, నాన్నకు సొంతం. నా ఇష్ట ప్రకారమే ముంబై వెళ్లిపోయాను. అక్కడ ఇంటి అద్దె చెల్లించడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నాను. డబ్బు సాయం చేయమని నాన్నను అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బుతో ముందుకు వెళ్తున్నాను.' అని లక్ష్మీ ప్రసన్న చెప్పారు.మొదటి నుంచి మంచు లక్ష్మీ తన కష్టంతో వచ్చిన డబ్బుతోనే ముందుకు వెళ్లాలి అనుకునే సంకల్పంతో ఉంటారు. అమెరికాలో ఆమె చదువుతున్నరోజుల్లో కూడా పార్ట్టైమ్ ఉద్యోగం చేసేవారని తెలిసిందే. తన తండ్రి వారసత్వం కంటే తనలోని టాలెంట్తోనే ఆమె గుర్తింపు పొందారు. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా, భారతీయ సినిమాతో పాటు అమెరికన్ టెలివిజన్లో కూడా తన ప్రతిభను చాటారు. మంచు లక్ష్మీ తన వ్యక్తిత్వం, ధైర్యం, బలమైన అభిప్రాయాలతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారనిది వాస్తవం అని చెప్పొచ్చు. -
తేజ సజ్జ దెబ్బకు ఇండస్ట్రీ షేక్
-
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.పెద్దిలో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. -
చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్సైట్: దిల్ రాజు
సినీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా ఒక సినిమాకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేలా ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఒక వెబ్సైట్ రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినిమా షూటింగ్ అనుమతులకు, థియేటర్స్ నిర్వహణలకు పొందాల్సిన అనుమతల్ని ఈ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈమేరకు హైదరబాద్లో ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజుతో పటాఉ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి పాల్గొన్నారు.తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు చెప్పారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్తో వచ్చినా సరే వారి సినిమాకు కావాల్సిన షూటింగ్ లొకేషన్లతో పాటు అందుకు కావాల్సిన అనుమతులు సింగిల్ విండో ద్వారా లభిస్తాయన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ను చాలా సులువుగా ఆన్లైన్ ద్వారా పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన అన్నారు. థియేటర్ల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్సైట్ను రూపొందించేందుకు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి పలు సలహాలతో పాటు సూచనలు తీసుకుంటామన్నారు. వెబ్సైట్ను పూర్తి స్థాయిలో రూపొందించాక సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు. -
'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్విజయ్, రాజ్కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు. -
పవన్ కల్యాణ్ ఓజీ.. సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
రవితేజ వారసుడి కొత్త సినిమా.. మాస్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్.తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు. -
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్తో వైరలైన రాము రాథోడ్ బిగ్బాస్లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రాము రాథోడ్ను బిగ్బాస్ హౌస్లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్నగర్లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
ఆరోజు సౌందర్యతో పాటు నేనూ చనిపోయేదాన్నే..: మీనా
అందం, అమాయకత్వం కలబోసినట్లు ఉంటుంది హీరోయిన్ మీనా (Actress Meena). బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్గా దక్షిణాది భాషల్లో అనేక సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.క్యాంపెయిన్కు నన్నూ పిలిచారుసౌందర్య, నేను చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. ప్రచారానికి వెళ్లి చనిపోవడం బాధాకరం. నిజానికి ఆ క్యాంపెయిన్కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు. అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్లలేదు. లేకపోయుంటే తనతోపాటు నేనూ వెళ్లాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.భర్తను కోల్పోయిన బాధలో..మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో తనపై వచ్చిన రూమర్స్ చూసి మరింత బాధేసిందని పేర్కొంది. నా భర్తను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డా.. రెండేళ్లపాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయా.. నా ఫ్రెండ్స్ ఆ విషాదం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ. మళ్లీ పెళ్లంటూ రూమర్స్అయితే నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు రాశారు. వీళ్లకసలు మనసుండదా? ఫ్యామిలీ ఉండదా? అనిపించింది. తర్వాత కూడా ఈ రూమర్స్ కొనసాగించారు. ఎవరికి విడాకులైనా వారితో నా పెళ్లి జరగబోతోందని రాశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధపెట్టారు అని తెలిపింది. కాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో జీ5లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్ -
అందం.. అభినయం.. రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా
అందం అపురూపం. అభినయం స్ఫూర్తి దీపం.. దక్షిణాది ఎవర్గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్య కృష్ణన్... మన రమ్యకృష్ణ... భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక. ఎంత మందికి తెలుసో గానీ... ఇప్పటికీ అంటే దాదాపు 55 ఏళ్ల వయసులో కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి రూ. 3-4 కోట్లు వరకూ వసూలు చేస్తుందని సమాచారం. గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు. సినిమా సినిమాకీ గ్లామర్తో పాటు స్టార్ డమ్ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. 13ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం...రమ్య సెప్టెంబర్ 15, 1970న మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణ నటనా ప్రయాణం 13 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళ చిత్రం నేరం పూలరంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర (1993)చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది. సుభాష్ ఘై 'ఖల్ నాయక్'(1993), మహేష్ భట్ 'చాహత్'(1996) , డేవిడ్ ధావన్ 'బనారసి బాబు' (1997), అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్ (1998)లో గోవిందాతో కలిసి శపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది.నాలుగు దశాబ్ధాల నటనా ప్రస్థానం..ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగానూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే. దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్ లోనే రాణిస్తున్నారామె. ఐదు భాషలలో 200 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కంటె కూతుర్నే కను, స్వీటీ నాన్న జోడి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పడయప్ప(నరసింహ), సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే. నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం.. నభూతో అంటారు సినీ విమర్శకులు. అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, బిహైండ్వుడ్స్ గోల్డ్ మెడల్.. ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది. కాలక్రమంలో తన కెరీర్ను చిన్నితెరకూ విస్తరించి సన్ టీవీ కోసం కలసం, తంగం వంటి టీవీ సీరియల్లలో కనిపించింది. థంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్ లో జడ్జిగా కనిపించింది. వివాదాలూ...ఎక్కువే...ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడు కె.ఎస్. రవికుమార్తో వివాహేతర సంబంధం. 1999లో రమ్య కె.ఎస్.రవికుమార్తో పడయప్ప, పాటాలి (1999), పంచతంతిరం (2002) చిత్రాలలో కలిసి పనిచేసింది. తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ, కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రమ్య కెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం రూ. 75 లక్షలు తీసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి, అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కుని తిరిగి కెరీర్ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య. ఆ తర్వాత, ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని 2003 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగే సమయానికి, రమ్య వయసు 33, కృష్ణ వంశీ వయసు 41. 2005 ఫిబ్రవరి 13నఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పిల్లాడి పేరు రిత్విక్ వంశీ.అందానికి తెరరూపంగా...–అల్లుడుగారు–అల్లరిమొగుడు–అల్లరి ప్రియుడు–హలో బ్రదర్–మేజర్ చంద్రకాంత్అభినయానికి ప్రతిరూపంగా..–సూత్రధారులు–అమ్మోరు–నరసింహ–బాహుబలి ది బిగినింగ్–అన్నమయ్య–కంటే కూతుర్నే కనుచలనచిత్ర రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం... చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం. -
అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు: కేంద్రమంత్రి సురేశ్ గోపీ
మలయాళ ప్రముఖ నటులు, త్రిశ్శూర్ ఎంపీ, కేంద్రమంత్రి సురేష్ గోపీని సాయం చేయాలని కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధుడు కోరాడు. అయితే, దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆపై అక్కడి రాజకీయ ప్రత్యర్దులు కూడా ఆయనపై విరుచుకపడ్డారు. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి సురేష్ గోపీ రియాక్ట్ అయ్యారు.ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు ఇచ్చిన దరఖాస్తును ఆయన స్వీకరించలేదు. అందుకు సంబంధించి సురేష్ గోపీ ఇలా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ఎజెండాగా ఉపయోగిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.'ఒక ప్రజా సేవకుడిగా, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చేయలేను. గృహ నిర్మాణం అనేది రాష్ట్ర సమస్య. కాబట్టి, అలాంటి అభ్యర్థనలను నేను ఒక్కడినే మంజూరుచేయలేను. రాష్ట్ర ప్రభుత్వమే దాని గురించి ఆలోచించాలి. ఈ సంఘటన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇంటిని మంజూరు చేసింది.ఈ విషయం తెలిసిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఇది రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, నా వల్ల అతనికి మంచి జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు దీనిని గమనిస్తున్నారు.నా వల్ల ఇల్లు అందించడానికి వారు ముందుకు వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రయత్నాలు ఎల్లప్పుడూ వ్యవస్థలో పనిచేయడం, ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడంపైనే ఉంటాయి.' అని ఆయన అన్నారు. -
రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ రితికా నాయక్ (ఫొటోలు)
-
'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గ్రాండ్గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.చివరిసారి ఎప్పుడు చూశానో..ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్ను ఈ సినిమాలో విలన్గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. నా అంచనా తప్పుఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. లాభాలొక్కటే కాదు..కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.మనోజ్ రిప్లైచివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025 చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఇల్లు అమ్మేసి రూ. 3 కోట్లతో కారు కొనేసిన నటి
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అయితే, రీసెంట్గా ముంబైలోని తన ఫ్లాట్ అమ్మేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కారు కొనడంతో వార్తలో నిలిచింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలోనే ఆమె విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది. ఇప్పుడు అలా వచ్చిన లాభంతో ఒక లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేశారని బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.మలైకా అరోరా తాజాగా రేంజ్ రోవర్ SUV సెగ్మెంట్లో ఐకానిక్ మోడల్తో ఉన్న కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అత్యుత్తమ కార్లలో ఒకటిగా సెలబ్రిటీలు ఈ మోడల్ను చూస్తారు. ఈ కారును సెలబ్రిటీలలో విపరీతంగా ఇష్టపడటానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన ఫీచర్లతో కూడిన క్యాబిన్తో పాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరింత లగ్జరీని తీసుకురావడమేనని చెబుతారు. ఆటోమేటిక్ గేర్బాక్స్తో ఈ కారు పనిచేస్తుంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ/గం వరకు పరుగెత్తగలదు.మలైకా కారు కొనడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది మలైకా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, మరికొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. బాలీవుడ్లో ఎక్కువ మంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు. వారు తరుచుగా ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేయడం సరైన రేటు వచ్చాక తిరిగి అమ్మేయడం చేస్తుంటారు. ఈ రకంగా వారు అదనపు లాభాలను పొందుతుంటారు. అలా తను అమ్మేసిన ఇంటి మీది వచ్చిన లాభంతోనే మలైకా కొత్త కారు కొనుగోలు చేసిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.మలైకా అరోరా చయ్య చయ్య (Dil Se)పాటతో బాలీవుడ్లో మొదట సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఈ బ్యూటీ తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia) -
విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘బ్యూటీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అలాంటి మగవాడ్ని చీరలో ఊహించుకుంటాను: తమన్నా
ఇప్పుడు దేశంలో ఉన్న అగ్రగామి నటీమణుల్లో ఒకరుగా ఉంది తమన్నా భాటియా.. అటు సినిమాలు, ఇటు ఐటమ్ సాంగ్స్ మరోవైపు వెబ్ సిరీస్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం డయానా పెంటీతో కలిసి చేసిన ’డూ యు వాన్నా పార్టనర్’ వెబ్ సిరీస్ సక్సెస్ను ఆమె ఎంజాయ్ చేస్తోంది, ఒక మహిళ స్వంతంగా వ్యాపార రంగంలో అది కూడా పురుషులు మాత్రమే చేయగలరు అని అందరూ నమ్మే మద్యం తయారీ రంగంలోకి మహిళలు ప్రవేశించడం... తదనంతర పరిస్థితుల చుట్టూ అల్లుకున్న అంశాలతో ’డూ యు వాన్నా పార్టనర్’ రూపొందింది. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె . ఒక పురుషుడు తనను ‘ఇక తనేమీ చేయడానికి లేదు‘ లేదా ‘అతనే తుది నిర్ణయం తీసుకున్నాడు అని భావించేలా చేసిన ప్రతిసారీ (అంటే ఆమెను చులకనగా తీసి పారేసిన సమయంలో) ఆమె ఎలా స్పందిస్తుందనే విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా పురుషాధిక్య చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్లేస్ను సొంతం చేసుకోవడం అనేది ఎలా సాధ్యమైందనే విషయంపైన కూడా తమన్నా ఈ సందర్భంగా మాట్లాడింది. అంతేకాక ఇటీవల తన నటన పట్ల విమర్శలు, ఎక్స్పోజింగ్పై వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి కూడా ఆమె చెప్పాలనుకున్నట్టు ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.‘‘ఒక పురుషుడు నాకు సంబంధించిన విషయాలలో తుది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అందులో నేనేం చేయడానికి ఉండదు. అయితే, నాకు అనిపించేలా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు’’ అంటూ చెప్పిందామె. అంటే ఒక సినిమాలో తాను చేసేదేముంది జస్ట్ ఏదో పాటల్లో అలా గ్లామరస్గా కనిపించడమే కదా అంటూ మాట్లాడి తన ప్రాధాన్యత తగ్గించాలని కొందరు మగవాళ్లు భావిస్తారనే అర్ధం వచ్చేలా మాట్లాడింది. అలా వారు ప్రయత్నించినప్పుడల్లా, తాను అలాంటి మగవాళ్లను చీరలో లేదా కొన్ని గ్లామరస్ దుస్తుల్లో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు ఊహించుకునే దానిని అంటూ చెప్పింది. ఆ ఆ ఊహల్లో అతను చాలా అసహ్యంగా కనిపించేవాడనీ అప్పుడే తనకు తానేం చేయగలదో అతనేం చేయలేడో అనేది తనకు అర్ధమయ్యేదని అంటూ అమ్మాయిలు మాత్రమే గ్లామర్ కు కేరాఫ్ అని వారికి మాత్రమే ఎక్స్పోజింగ్ బాగుంటుందని చెప్పకనే చెప్పింది. కాబట్టి వారికి ఎప్పుడూ తన అవసరం ఉంటుందనే గ్రహింపు తెచ్చుకోవడమే తాను చేసే పనిని ధైర్యంగా చేసేలా చేసిందని అంది, ‘‘ఎందుకంటే ఒక మహిళ చేయగలది, ఒక మహిళ మాత్రమే చేయగలదని నేను విశ్వసిస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి చెడుల గురించి కూడా ఆమె మాట్లాడింది.‘‘నువ్వు మంచి వ్యక్తివి అయినంత మాత్రానే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు ఏదో ఒకటి చేయగలవని నీ దగ్గర ఏదో ఉందని అనుకుంటేనే ఎవరైనా నీకు పని ఇస్తారు.’’ అంటూ తనకు ఎవరూ ఊరికే పని ఇవ్వడం లేదని గుర్తు చేసింది. ఏదేమైనా మన మనసులో ఉన్నదాన్ని బయట పెట్టడమే మంచిదని అంటోంది తమన్నా. ప్రజలు ఎలా భావిస్తారో అని ఎక్కువగా ఆందోళన చెందడం అంతిమంగా మనకు ప్రతికూలంగానే మారుతుంది‘’ అంటూ చెప్పుకొచ్చింది -
ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు
బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిపై కొద్దిరోజులుగా ఈడీ దూకుడు చూపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్లోని స్టార్స్ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. -
ఫారిన్ పోదాం చలో... చలో
సూట్కేసులు సర్దుకుని మరికొన్ని రోజుల్లో ఫారిన్కు మకాం మార్చనున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. వెకేషన్ కోసం అయితే కానే కాదు... సినిమాల చిత్రీకరణ కోసమే. ఈ స్టార్ హీరోల ఫారిన్ షూటింగ్ వివరాలు ఈ విధంగా...కెన్యా టు హైదరాబాద్ కెన్యా టు హైదరాబాద్ చక్కర్లు కొట్టనుందట ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్డూడియోలో షూటింగ్ జరుగుతోంది. అయితే కెన్యా షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదట. ఈ సినిమాకి కీలకమైన ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ అంతా కెన్యా అడవుల్లో జరిపేలా ప్లాన్ చేశారట రాజమౌళి. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ టీమ్ మళ్లీ కెన్యాకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ 2027లో రిలీజ్ కానుంది.ఆటా పాటా... ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. పాటలను అతి త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే దర్శకుడు మారుతి గ్రీస్ వెళ్లి, అక్కడి లొకేషన్స్ను చూసొచ్చారట. త్వరలోనే ఈ టీమ్ అక్కడికి వెళ్లి రెండు పాటలను, కొంత టాకీ పార్టును షూట్ చేయనుంది. అయితే ఫారిన్ షూటింగ్ షెడ్యూల్కు ముందు ‘ది రాజా సాబ్’ టీమ్ కేరళకు వెళుతుందని, అక్కడ ప్రభాస్ పరిచయ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. పది దేశాల్లో డ్రాగన్ డ్రాగన్ విదేశీయానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్ణాటకలో వేసిన ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కథలో ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందట. దీంతో తర్వాతి షూటింగ్ షెడ్యూల్ కోసం ‘డ్రాగన్’ టీమ్ విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. అంతేకాదు... పదికి పైగా దేశాల్లోని లొకేషన్స్లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. ఏడారిలో... హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ‘ఏఏ22 ఏ6’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగనుందని, అతి త్వరలో అక్కడ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొనగా కీలక యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట అట్లీ. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ఇలా షూటింగ్ కోసం త్వరలో విదేశాలు ప్రయాణం కానున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
'మైండ్తో ఆలోచించండి.. ఇలాంటి ట్రాప్లో పడొద్దు': టాలీవుడ్ నటి
సోషల్ మీడియా వచ్చాక వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను తీసుకొచ్చి సోషల్ మీడియా ఖాతాలో నింపేస్తున్నారు. ఇంకేముంది ఇదే అదునుగా చేసుకున్న కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సెలబ్రిటీల పేర్లను వినియోగిస్తూ పెద్ద స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి పేరుతో కొందరు కేటుగాళ్లు స్కామ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కొందరు తన పేరును వాడి డొనేషన్స్ స్వీకరిస్తున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే నార్సింగ్ పీఎస్ ఫిర్యాదు చేశానని ప్రగతి వెల్లడించింది. నా అభిమానులు దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ కూడా చదువుకున్న వాళ్లే ఉన్నారు.. కొంచే మైండ్ పెట్టి ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పలువురు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్స్ను షేర్ చేసింది ప్రగతి. ఇప్పటికే చాలామంది డబ్బులు కూడా పంపారని.. చిన్న మొత్తాలు కావడంతో పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఐదు రోజుల క్రితమే చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే యూత్ఫుల్ సినిమాలే గుర్తొస్తాయి. తను తీసిన మూవీస్తో చాలామంది కొత్తవాళ్లని నటీనటులుగా పరిచయం చేశాడు. అయితే వారిలో నిలబడి స్టార్స్ అయినవాళ్లు కొందరైతే.. క్రేజ్ వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వాళ్లు మరికొందరు. ఈ బ్యూటీ కూడా రెండో టైప్. ఈమె ఎవరు? తెలుగులో ఏ మూవీస్లో నటించింది? ఇప్పుడేం చేస్తోంది?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జరా షా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్ చేసింది. మంచి పేరు తెచ్చుకుంది. అలా దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడటంతో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. నాగరాజు పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ లక్ష్మిగా నటించింది. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. అలా ఈమెకు నాగార్జున 'భాయ్', అనుష్క 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించే అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)అలానే పైరేట్స్ 1.0, ఐతే 2.0 అనే తెలుగు సినిమాల్లోనూ జరా షా నటించింది. కానీ తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత తగ్గిపోయింది. చేసిన మూవీస్ ఫెయిల్ కావడంతో ఈమె పూర్తిగా నటనని పక్కనబెట్టేసింది. అలానే మోడలింగ్ కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అడపాదడపా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. సినిమాలో పాత్రకు ప్రస్తుతం ఈమెని చూస్తే కచ్చితంగా పోల్చలేరు. అంతలా డిఫరెన్స్ కనిపిస్తుంది. తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాకు 13 ఏళ్లు పూర్తయిందని పోస్టర్ షేర్ చేయడంతో ఈమె మరోసారి టాపిక్ అయింది.ఇకపోతే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో లీడ్ రోల్స్ చేసిన అభిజిత్, సుధాకర్, జరా షా తదితరులు తర్వాత కాలంలో కనుమరుగైపోయారు కానీ ఇదే మూవీలో విలన్ గ్యాంగ్ వైపు కనిపించిన నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, శ్రీముఖి తదితరులు పెద్ద స్టార్స్ అయిపోయారు. ఇదే మూవీలో ఈషా రెబ్బా, శ్రీ విష్ణు కూడా నటించారు. ఇప్పుడు వీళ్లు హీరోహీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
చిరంజీవితో 'మిరాయ్' దర్శకుడు సినిమా
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్... దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందాడు. సుమారు పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఆయన మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, దర్శకుడిగా కాదు.వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. త్వరలోనే సెట్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ వెళ్లనుంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ ఘట్టమనేని చేయబోతున్నారు. మెగాస్టార్తో తొలిసారి ఆయనకు ఛాన్స్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, ఎక్స్ప్రెస్ రాజా,ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తాజాగా విడుదలైన మిరాయ్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా కార్తిక్ కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్గా కార్తీక్కు మంచి గుర్తింపు ఉంది. దర్శకుడిగా పనిచేస్తూనే ఆయన తన కెమెరాకు కూడా పని చెప్తారు. డైరెక్టర్గా తొలిచిత్రం సూర్య వర్సెస్ సూర్య తర్వాత మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. -
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ప్రముఖ దర్శకుడికి డాక్టరేట్ ప్రదానం
ప్రముఖ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ గౌరవ డాక్టరేటు పొందారు. చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ వేల్స్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్కు గౌరవ డాక్టరేట్లను వారు ప్రదానం చేశారు. వడచెన్నై, అసురన్, విడుదలై, ఆడుకాలమ్,కాక్క ముట్టై వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం క్రికెట్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్కు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేశ్, రిజిస్ట్రారర్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గతంలొ ఇదే యూనివర్సిటీ నుంచి మెగా హీరో రామ్ చరణ్ కూడా గౌరవ డాక్టరేట్ పొందారు. -
కాపీరైట్.. ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఇళయరాజా : రజనీకాంత్
సినీ జీవితంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజా పేరును భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. అనంతరం ఆయన్ను జ్ఞాపికతో సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి వంటి స్టార్స్ పాల్గొన్నారు.ఇళయరాజా తన 50ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు చూశారని సీఎం స్టాలిన్ అన్నారు. కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా జీవితం చెబుతుందన్నారు. ఆయన సంగీతం విజయ ప్రస్థానానికి ప్రేరణ అందించడమే కాకుండా బాధలను కూడా ఓదార్చుతోందని సీఎం తెలిపారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరుతో ఒక పురస్కారం అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు.SP బాలు, ఇళయరాజా వివాదంపై రజనీ వ్యాఖ్యలు'ఇళయరాజా పాటలు నేడు చాలా సినిమాల్లో ఉపయోగిస్తున్నారని రజనీకాంత్ అన్నారు. దీంతో పలు సినిమా మేకర్స్పై కాపీరైట్ చట్టం ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా తను స్వరపరచిన పాటలపై కాపీరైట్ హక్కులు తనకే ఉన్నాయని.. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ పాటలు మళ్లీ పాడకూడదని కోరారు. దీంతో బాలు కూడా మళ్లీ ఎక్కడా ఆ పాటలు పాడలేదు. కానీ, కోవిడ్ సమయంలో SPB మరణించినప్పుడు, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే విలవిల ఏడ్చారు. గతంలో తన సోదరుడు, కూతురు, భార్య మరణించిన సమయంలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టలేదు. కానీ బాలు కోసం ఏడ్చేశారు. వారి మధ్య స్నేహం ఎంత బలమైనదో ఇదొక్కటి చాలు.' అని రజనీకాంత్ అన్నారు. -
ఆండ్రీతో ఫస్ట్ మీట్.. రాంగ్ ఫ్లైట్ బుక్ చేశా: శ్రియా శరణ్
టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించిన బ్యూటీ శ్రియా శరణ్. ఆ తర్వాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న శ్రియా శరణ్ తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆండ్రీ కోస్చీవ్తో తన ప్రేమకథ గురించి శ్రియ శరణ్ ఓపెన్ అయింది. ఆండ్రీని మొదటిసారి కలిసేందుకు మాల్దీవులకు వెళ్లానని శ్రియా పంచుకుంది. అయితే ఫస్ట్ మీట్ కావడంతో టెన్షన్లో రాంగ్ ఫ్లైట్ బుక్ చేశానని తెలిపింది.శ్రియా మాట్లాడుతూ.. "నా డైవింగ్ ట్రిప్ ఏప్రిల్లో ఉంది. కానీ మార్చిలో నేను మాల్దీవులకు వెళ్లాను. అక్కడ దిగినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించా. అక్కడ నేను ఒంటరిగా ఉన్నా. ఆ సాయంత్రం ఒక పడవ మాల్దీవులకు దక్షిణంగా వెళుతోందని నాకు తెలిసి అందులో వెళ్లా. అదొక అందమైన సూర్యాస్తమయం. అక్కడ నాకు ఎవరు తెలిసినవారు లేకపోవడంతో ఒంటరిగా ఉన్నా. భయపడి డెక్ మీద నిలబడి ఉన్నా. అదే సమయంలో తిరిగి చూడగానే ఆండ్రీ నా వెనకే ఉన్నాడు. అలా మేము మొదటిసారి కలుసుకున్నాం" అని గుర్తు చేసుకుంది.అయితే తన సినిమా దృశ్యం చూసిన తర్వాత ఆండీ కోస్చీవ్ నన్ను చూసి భయపడ్డాడని వెల్లడించింది. ఆండ్రీకి, తనకు మొదట్లో ఒకరి గురించి ఒకరు ఏమీ తెలియదని.. అయినా మా రిలేషన్ చాలా అందంగా అనిపించిందని శ్రియ తెలిపింది. అలా డైవింగ్కు వెళ్లామని.. మాట్లాడుకుంటూనే మా ఇద్దరి మధ్య డేటింగ్ ప్రారంభమైందని పంచుకుంది. తాను మొదట రష్యన్ భాషలో చెడు పదాలు నేర్చుకున్నానని శ్రియ శరణ్ చెప్పింది. కానీ ఇప్పుడు తన కుమార్తె రాధా శరణ్ కోస్చీవ్తో కలిసి భాషను సరిగ్గా నేర్చుకుంటున్నానని నవ్వుతూ మాట్లాడింది. అంతేకాకుడా ఆండ్రీకి హిందీ బాగా అర్థమవుతుంది.. అదృష్టవశాత్తూ ఆండ్రీ భారతదేశానికి వచ్చాడని పేర్కొంది. కాగా.. శ్రియా శరణ్ 2018లో ఆండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్తోనే బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
రూ. 200 కోట్లు నష్టం.. రెమ్యునరేషన్ కూడా రిటర్న్: ఆమిర్ఖాన్
లాల్ సింగ్ చడ్డా చిత్రంతో రూ. 200 కోట్టు నష్టాలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆమిర్ఖాన్ చెప్పారు . 2022లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీకి ఆమిర్, అతడి మాజీ భార్య కిరణ్రావ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ముందు ఆమీర్ నటించిన ప్రతి సినిమా మినిమమ్ రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. అయితే, లాల్ సింగ్ చడ్డా మూవీకి వచ్చిన నష్టాల గురించి తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.'ఒక నిర్మాతగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏదైనా సినిమా ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలు రాకుంటే చాలు అనే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. కానీ, లాల్ సింగ్ చడ్డా మూవీ బడ్జెట్ విషయంలో పొరపాటు చేశాను. వరుస విజయాలు నాకు దక్కడం వల్ల ఈ మూవీ విషయంలో కాస్త అతి నమ్మకం ఏర్పడింది. దీంతో బడ్జెట్పై ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. అందుకే నష్టపోయాను. దంగల్ సినిమాకు రూ. 390 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. దీంతో లాల్ సింగ్ చడ్డాకు రూ. 200 కోట్లు వస్తాయని అంచనా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు.ఒక సినిమా రూ. 120 కోట్లు చేస్తుందని అనుకుంటే అప్పుడు మీ బడ్జెట్ రూ. 80 కోట్లు దాటకూడదు. ఇలా ప్లాన్ ఉంటే సేఫ్గా ఉంటాం. ఇలాంటి ప్రణాళిక లాల్ సింగ్ చడ్డా సమయంలో చేయలేదు. దీంతో రూ. 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువగా ట్రావెలింగ్కు ఖర్చు అయింది. చైనాలో తెరకెక్కించిన ఒక భారీ సీన్ ... ఎడిటింగ్లో తొలగించాం. ఆ ఖర్చు అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.' అని అన్నారు.ఈ సినిమాకుగానూ ఆమిర్ రెమ్యూనరేషన్ రూ.50కోట్లు తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తం సొమ్ముని వదులుకుని తన సహ నిర్మాతలకు తిరిగిచ్చేశారు. వారికి నష్టాన్ని తగ్గించాలనుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమిర్ భారీగానే నష్టపోయారు. ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్గా నటించగా ప్రముఖ తెలుగు నటుడు నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. -
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)కు 38 ఏళ్లు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా దానికింకా టైముంది అని ఆ ప్రశ్నను దాటవేస్తూ ఉంటాడు. తాజాగా హైదరాబాద్లో ఓ సదస్సుకు హాజరైన సాయి దుర్గ తేజ్కు మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. అందుకు సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ.. నాది చాలా విషాదకరమైన స్టోరీ.. 2023లో నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పటివరకు అయినవాటిలో ఇదే చాలా బాధాకరమైన బ్రేకప్. మీడియా వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది. నా పెళ్లి నేనే ప్రకటిస్తాసినిమా హిట్టయింది, నెక్స్ పెళ్లే.. ఆ అమ్మాయితో వెడ్డింగ్, ఈ అమ్మాయితో వెడ్డింగ్ అంటూ నానా రకాల పుకార్లు సృష్టించారు. దానివల్లే మా ప్రేమ విఫలమైంది. ఆమె నా కాలేజీ గర్ల్ఫ్రెండ్.. తను ఆ పుకార్లు చూసి తట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఆందోళన చెందింది. దాంతో బ్రేకప్ జరిగిపోయింది. కాస్త మీ అందరూ కాస్త సైలెంట్గా ఉంటే నా పెళ్లి వార్త నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు.పిల్లలకు సమయం కేటాయించాలిఇంకా మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలతో పేరెంట్స్ ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు. నాకు మాత్రం మా అమ్మే నా ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు.. ఇలా వీళ్లతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. నేను నా సెకండ్ క్లాస్ లవ్స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని ఆమె ఇచ్చారు. ఇకపోతే తెలంగాణలో కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వారి చదువు, పోషణ అన్నీ చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.అప్పట్లోనూ ఓ బ్రేకప్ స్టోరీకాగా 2023లో విరూపాక్ష సినిమా రిలీజ్ సమయంలోనూ తన పర్సనల్ లైఫ్ గరించి మాట్లాడాడు తేజ్. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటినుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందన్నాడు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తన తల్లి పేరు వచ్చేలా తప నేమ్ను సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
మలయాళం థ్రిల్లర్ సినిమా 'సూత్రవాక్యం' రివ్యూ
మలయాళంలో బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఉండేలా సినిమాలను నిర్మిస్తుంటారు. ఈ మధ్య మలయాళం నుంచి వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి మూవీస్ ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకెల్తున్నాయి. దీంతో తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం" (Soothravakyam) మలయాళంలో మంచి విజయం అందుకుంది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో కూడా విడుదలైంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా అద్భుతంగా నటించాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.కథేంటి..?పోలీస్ స్టేషన్కు నేరాలు చేసినవాళ్లతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి..? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు..? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో "సూత్రవాక్యం" తెరకెక్కించారు. క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్. నిమిషా (విన్సీ లోషియస్) మ్యాథ్స్ టీచర్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు. ఈ సినిమా కథ అంతా వీరి చుట్టే ఎక్కువగా ఉంటుంది. క్రిస్టో జేవియర్ తన విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. అయితే, అక్కడి పిల్లలు స్కూల్కు వెళ్లకుండా క్రిస్టో చెబుతున్న పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ విషయం నిమిషా టీచర్కు నచ్చదు. దీంతో తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తుంది. అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య (అనఘా) కూడా ట్యూషన్కు వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ (దీపక్ పరంబోర్) ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్కు క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు. ఇంతకు తన చెల్లి మీద వివేక్కు ఎందుకు కోపం..? ఆమెపై దాడి చేసి ఎక్కడికి వెళ్లిపోయాడు..? ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ ఎలా చనిపోతాడు..? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరో యువతి మర్డర్ కేసు ఎలా బయట పడింది..? రెండు హత్యల వెనుక ఉన్నదెవరు..? ఎంతో ఉత్కంఠతో సాగిన విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్గా హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మలయాళం సినిమా కథలు మొదట చాలా నెమ్మదిగా మొదలవుతాయి. సూత్రవాక్యం మూవీ కూడా అంతే.., అయితే, కాస్త ఒపికతో ఫస్ట్ 20 నిమిషాలు చూస్తే ఆ తర్వాత చాలా ఉత్కంఠతో ఈ చిత్రాన్ని చూస్తారు. సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు కాన్సెప్ట్ మొదలౌతుంది. దానికి ఒక టీజర్ బాధ పడటం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఒక బావి స్టోరీ ఆసక్తిగా చెప్పడం వంటి సంఘటనలు పర్వాలేదనిపిస్తాయి. కథలో వివేక్ మరణంతో సినిమా పరుగులు పెడుతుంది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ను పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. వివేక్ హత్య కేసు విచారణలో ఉండగానే మరో యువతి మర్డర్ కేసు బయటకు వస్తుంది. ఇలాంటి ట్విస్ట్లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయి. అమెజాన్ ప్రైమ్లో ఉన్న సూత్రవ్యాక్యం కేవలం 1 గంటా 52 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉంది. కుటుంబంతో పాటుగా చూడొచ్చు. -
ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్బాబుల 'దక్ష' సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్కు రెడీ అయిన దక్షపుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్కు మిరాయ్తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్ను బయటపెట్టేసింది. అలా అనుకుంటే జీవితం నరకం'మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. లీక్ చేసిన మంచు లక్ష్మి(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.చాలాకాలం తర్వాత విలన్గాకానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్బాబు విలన్గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్తో ఇప్పుడది నిజమని రుజువైంది.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
సక్సెస్ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్ ఎమోషనల్
విజువల్ వండర్గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. రుణపడి ఉంటా..ఇలాంటి సక్సెస్ మీట్లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కమ్బ్యాక్ ఎప్పుడని అడిగేవారుఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. నా కుటుంబాన్ని నిలబెట్టారుఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్లాంటి దర్శకుడు, టెక్నీషియన్ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'మహావతార్ నరసింహ' 50 రోజులు పూర్తి
'మహావతార్ నరసింహ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ నిండిపోయాయి. ఈ మూవీ ఆఫ్ సెంచరీ కొట్టడంతో డిలీటెడ్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికీ ఎన్ని థియేటర్స్లలో రన్ అవుతుందో కూడా పేర్కొంది.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 200 థియేటర్స్ పైగానే 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆపై ఇప్పటి వరకు ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా బుక్మైషోలో రోజుకు సుమారు 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ 50రోజుల్లో బుక్మైషో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు. -
వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్
-
చాలా బాధపడ్డాను.. సోషల్మీడియాకు గుడ్బై చెప్పిన ఐశ్వర్య
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. ఈ క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. ఈ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది. ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
ఆ తెలుగు మూవీలో హీరోయిన్గా చేస్తానన్నా.. కాజల్కు ఇచ్చారు!
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది. హీరోయిన్ ఛాన్స్ అడిగాఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.జాట్లో ఆ పాత్ర కోసం అడిగారుజాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్ -
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
ఎస్తర్ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా?
సినీ నటి ఎస్తర్ నోరోన్హ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక ఫోటోను షేర్ చేసి త్వరలో శుభవార్త చెబుతానంటూ పంచుకుంది. దీంతో అభిమానులు కూడా పెళ్లి గురించే ఉంటుంది అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో తెలిపింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లేనని తెలుస్తోంది.కొత్త ప్రకటన అంటూ ఒక ఫోటోతో ఎస్తర్ ఇలా పంచుకుంది. 'జీవితంలో నాకు మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పుట్టినరోజున నాపై మీ అందరూ ప్రేమతో ఆశీర్వాదాలను కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీతో ఒక "ప్రత్యేక ప్రకటన" పంచుకోబుతున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. దయచేసి వేచి ఉండండి.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి చెబుతుందని ఆందరూ ఆశిస్తున్నారు.రెండో పెళ్లి గురించి గతంలో ఎస్తర్ ఏం చెప్పిందంటే..టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్తో కుర్రకారును అదరగొట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
సాయిపల్లవి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్
కోలీవుడ్లో నటుడు శింబుది ప్రత్యేక స్థానం. విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నా, అపజయాలను ఎదుర్కొన్నా, ఆయన క్రేజే వేరు. 50 చిత్రాలకు చేరుకున్న ఈయన తాజాగా కొన్ని క్రేజీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ కథా చిత్రం అని చిత్ర వర్గాల సమాచారం. వెట్రిమారన్కు దర్శకుడిగా ఒక ప్రత్యేక బాణి ఉంది. ఆయన కథలన్నీ సమాజంలోంచి, ముఖ్యంగా అట్టడుగు జనాల జీవితాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి. కాగా ఇంతకుముందు ధనుష్ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా మరోసారి అదే నేపథ్యంలో మరో కోణంలో శింబు హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇది శింబు కథానాయకుడుగా నటిస్తున్న 49వ చిత్రం అవుతుంది. ఇందులో ఈయనకు జంటగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్ చిత్రాన్ని పూర్తి చేసి, రామాయణ 1, 2 చిత్రాలను చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె మళ్లీ తమిళంలో నటించనున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
కథ విని షాకయ్యా: రాజేంద్రప్రసాద్
‘‘దర్శకుడు చిరంజీవి ‘నేనెవరు?’ చిత్ర కథ చెప్పినప్పుడు షాకయ్యా. ఇంత గొప్ప కథను కరెక్ట్గా తెరకెక్కించగలడా? అని సందేహపడ్డాను. కానీ, షూటింగ్కి వెళ్లాక అతను ఎంత జీనియస్ అన్నది అర్థం అయింది. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఈ సినిమాతో వారికి మంచి విజయం సొంతం కావాలి. నేను నటించిన మంచి సినిమాల్లో ‘నేనెవరు?’ ఒకటిగా నిలిచిపోతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలిపారు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లికార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు–సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ‘నేనెవరు?’ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్కి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకుడు వి.సముద్ర అతిథులుగా హాజరై, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప ఆర్టిస్టుతో ‘నేనెవరు?’ చిత్రం రూపొందించే చాన్స్ లభించడం మా అదృష్టం. దసరాకి మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.చదవండి: దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు -
'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్
'మిరాయ్' సినిమా మంచు మనోజ్ టాలెంట్ను బయటకు తెచ్చింది. తన సత్తా ఏంటో ఈ చిత్రంలో చూపించాడు. గతంలో ఆయన నటించిన చాల సినిమాలు ప్రత్యేక గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. వేదం, నేను మీకు తెలుసా, ఒక్కడు మిగిలాడు, ప్రయాణం వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు తెలిపాడు. అయితే, కుటుంబంలో వివాదాలు, తన వ్యక్తిగత కారణాల వల్ల సరైన సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మిరాయ్లో మహావీర్ లామా పాత్రలో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే తన అమ్మగారు నిర్మలా దేవి ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మనోజ్ పోస్ట్ చేశారు.'మిరాయ్ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కు గర్వంగా ఫీల్ అయింది. దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. మిరాయ్లో మంచు మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మనోజ్ మాత్రమే చేయగలిగే పాత్ర అనేలా ఉంటుంది. ఈ సినిమా అతనికి మరిన్ని ఛాన్స్లు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.మంచు కుటుంబంలో వివాదాల తర్వాత వారందరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు కూడా మిరాయ్ యూనిట్ టీమ్ కోసం ఒక ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబం ఒక్కటి కాబోతుందని వారి అభిమానులు సంతోషిస్తున్నారు.My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025 -
‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. -
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో నటించానని వెల్లడించారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్గా కూడా మార్చారని' అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ, ఇంగ్లీష్లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు. Pleased to launch the autobiography of renowned film comedian & Padmashri awardee, Shri Brahmanandam Me and मैं in English & Hindi at the Foreign Correspondents Club of South Asia in New Delhi this evening. Shri Brahmanandam’s long career in movies spanning more than 3 decades… pic.twitter.com/xrf1y7mqpn— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 12, 2025 -
'పరదా' పవర్ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
మిరాయ్ పై అంచనాలు పెంచేసిన ప్రభాస్..!
-
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్.. స్పందించిన రష్మిక!
టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
మిరాయ్ సినిమా.. ప్రేక్షకుల రియాక్షన్స్ ఇదే!
-
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
కిష్కింధపురి మూవీ హిట్టా.. ఫట్టా..!
-
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
-
మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)
-
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
ఐసీయూలో ఉన్నాడు.. సాయానికి ముందుకు రండి: మంచు మనోజ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.Urgent 🚨 Namasthe All🙏🏻 Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.Details: Kalaga NarayanaGPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025 -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
'సిద్ధు జొన్నలగడ్డ' కొత్త సినిమా.. రొమాంటిక్ టీజర్ చూశారా?
'తెలుసు కదా' సినిమా నుంచి క్లాసిక్ టీజర్ విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటించిన మూవీ జాక్ నిరుత్సాహపరిచింది. దీంతో ‘తెలుసు కదా’ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు. -
'కిష్కింధపురి' ట్విస్ట్.. సినిమా చూసిన వారి టాక్ ఇదే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.'కిష్కింధపురి' ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్గా నటించి మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
మల్లెపూల ఎఫెక్ట్.. అస్ట్రేలియా అధికారులకు నటి లేఖ
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఆమె మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్పోర్ట్లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు. -
అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. నాకు ఇష్టమైన జానర్👻 టీనేజ్లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ని సెట్గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.చదవండి: బిగ్బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
ఫిల్టర్ లేకుండా డింపుల్ హయాతి.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
బయ్యర్లకు రూ. 4 కోట్లు రిటర్న్ చేసిన నిర్మాత?
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించారు. రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్ను నిర్మాత రాజేశ్ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మజాకా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్ వచ్చింది. కానీ, కమర్షియల్గా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాత రాజేశ్ దండ మరో సినిమాతో రానున్నారు. కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్ క్లియర్ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్. -
‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.కథేంటి..?వైజాగ్ పోర్ట్లో కింగ్పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ. -
అమ్మ అడుగుపెట్టగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మన శంకర వరప్రసాద్గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా.. మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
వీడు మంచి స్టూడెంట్.. ఎగ్జామ్ పాసవుతాడు: కిష్కింధపురి డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు. -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బిగ్బాస్ హౌస్లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్బాస్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్తో హౌస్ను హీటెక్కించారు బిగ్బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్మేట్స్ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ స్టార్ దంపతులు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వరుణ్ జంటకు విషెస్ చెప్తున్నారు.లవ్ మ్యారేజ్వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Our little man 🩵🩵🩵10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025 View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
పుష్ప 3 స్టోరీ లీక్ అయ్యిందా..? అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి ?
-
'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహా' అనే యానిమేషన్ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఇప్పుడు దీన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ తెలుగులోనూ ఓ మూవీ తీసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తన కొత్త మూవీని ప్రకటించింది. హనుమంతుడి జీవితం ఆధారంగా 'వాయుపుత్ర' పేరుతో ఈ త్రీడీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. 'కార్తికేయ', 'కార్తికేయ 2', 'తండేల్' లాంటి హిట్ చిత్రాలు తీసిన చందు మొండేటి.. ఈ యానిమేషన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.నరసింహా అవతారం ఆధారంగా 'మహావతార్' మూవీ తీశారు. జనాల్ని భక్తి పారవశ్యం చెందేలా చేశారు. ఇప్పుడు 'వాయుపుత్ర' పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని యానిమేషన్ రూపంలో చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో నటీనటుల్ని పక్కనబెట్టి ఇలా పురాణాల్లోని క్యారెక్టర్స్ ఆధారంగా యానిమేషన్ మూవీస్ మరిన్ని వస్తాయేమో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడిది ప్రత్యేక స్థానం. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం.. భారీస్థాయిలో త్రీడీ యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. -
హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)ఇటీవల మలయాళంలో మోహన్ లాల్కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
సస్పెన్స్... థ్రిల్
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు. -
ఏటిగట్టుపై యాక్షన్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది.పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్తో ఈ షెడ్యూల్లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది. -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
తెలుగు సినిమా టైటిల్ చెప్పండి చాలు.. లక్ష రూపాయలు మీకే!
సినిమా పేరు చెప్పండి.. లక్ష రూపాయలు మీకే. ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా?అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే.. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్తో రూపొందిస్తున్నారు.ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ను మేకర్స్ ప్రారంభించారు. ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా టాప్-10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ.5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్కు వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి.కాగా.. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్లో కె శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by K Shankar (@sanjeevaniproductionss) -
ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.15 సినిమాలుతన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బర్త్డే ఎంతో స్పెషల్ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు. -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా 'ఏ మాస్టర్ పీస్': మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు. -
వీడియోలు తొలగించండి.. ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్య రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.ఐశ్వర్య రాయ్ పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్సైట్ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే ఒక వెబ్సైట్ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు. ఒక పెద్దమనిషి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్సైట్లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్
బిగ్బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
దోశ 'కింగ్' బయోపిక్లో మోహన్లాల్!
పీ రాజగోపాల్.. ఈ పేరు దేశవ్యాప్తంగా పరిచయమే.. తమిళనాడులో శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కోట్ల రూపాయలు సంపాధించాడు. అయితే, తన జాతకాల పిచ్చి వల్ల ఒక మహిళ జీవితం నాశనం కావడం ఆపై అతని జీవితం కూడా అగ్గిలో కాలిపోయింది. ఇప్పుడు అతని బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించినట్లు తెలుస్తుంది.జై భీమ్, వేట్టాయాన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. తాజాగా ఈ దర్శకుడు తన మూడవ చిత్రానికి సిద్ధమయ్యాడు. సరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత ఇతివత్తంతో చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాజగోపాల్, జీవజ్యోతి అనే మహిళ మధ్య జరిగిన ప్రేమ పోరాటం, రాజగోపాల్ జైలు పాలైన సంఘటనలు ప్రధానాంశంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. దీనికి దోసెకింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ను నటింపజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జంగ్లి పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం మోహన్లాల్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దోసెకింగ్ చిత్రంలో నటించడానికి మోహన్ లాల్ ఓకే చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.జ్యోతిష్యం పిచ్చి.. దహించేసిన 'కామాగ్ని'‘శరవణ భవన్’ పి.రాజగోపాల్ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.జీవజ్యోతితో పెళ్లి కోసం..జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. అతనికి 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.ట్యూషన్ మాస్టర్తో ప్రేమజీవజ్యోతి పి.రాజగోపాల్ను తన గార్డియన్గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి,శాంతకుమార్ ఒప్పుకోలేదు.జీవజ్యోతి భర్త హత్యజీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్తో శాంతకుమార్ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.ఒంటరి పోరాటంరాజగోపాల్కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయింది.'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్' అంటూ ఆమె పోస్ట్ చేసింది.కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. 😄By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well ❤️I kindly request…— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 8, 2025 -
సంక్రాంతి 2026కి సినిమాల జాతర.. మూవీస్ లిస్ట్ ఇదే
-
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
-
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు
-
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
ఆ రోజే మాస్ జాతర?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారని టాక్. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి... వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే. -
తెలుసు కదా.. బై బై!
‘తెలుసు కదా’ యూనిట్కు బై బై చెప్పారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర షూట్ను పూర్తి చేశారు రాశీ ఖన్నా.ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ సినిమా ప్రయాణం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ –‘‘కెమెరాలు ఆగి పోయిన తర్వాత కూడా మర్చి పోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలు కలగలిసిన ప్రయాణం ఇది. ఇందులో నాతో పాటు నడిచిన చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్లా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
వచ్చిన కాసేపటికే ఎలిమినేషన్.. బిగ్బాస్లో 'బాక్స్' డ్రామా
కోపపు నీడలో పెరిగిన తన ఆవేశమే అస్తిత్వంగా మారిపోయింది. సినిమా సామ్రాజ్యంలో చోటు దక్కింది. అందరూ ద్వేషించడానికి ఇష్టపడే పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయాడు. అందరూ ద్వేషించే దారిలో నడుస్తుండగా ఓ ప్రశ్న ఎదురైంది. దానికిచ్చిన సమాధానంతో అతడి జీవితమే మారిపోయింది. కన్నతల్లి చేయూతనిచ్చింది. దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడేవాళ్లు.ఆవేశంతో రాజ్యమేలిన వ్యక్తి మనసు ఏలేందుకు ముందుకొస్తున్నాడు. ఓ గిఫ్ట్ బాక్స్తో హౌస్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ బాక్స్ తీసుకెళ్లేందుకు వీల్లేదన్నారు. అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ బాక్స్ కూడా నా శరీరంలో ఒక భాగం అని, దాన్ని వదిలేసి వెళ్లలేనన్నాడు. అలాగైతే బాక్స్ తీసుకోమని ఇంటికెళ్లిపోమంటే అందుకు క్షణం ఆలోచించకుండా సరేనని తలూపాడు.పోనీ, ఆ బాక్స్ వెనక సీక్రెట్ ఏంటో చెప్పి, ఆ చైన్ మెడలో వేసుకుని వెళ్లమంటే కూడా అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ స్టేజీపై ఆ రహస్యాన్ని బయటపెట్టలేనన్నాడు. దాంతో అతడిని స్టేజీపై నుంచి బయటకు పంపించారు. కానీ మరికాసేపటికే భరణిని లోనికి పంపించారు. అయితే ఇక్కడ ఇంకాస్త డ్రామా పండించే ఛాన్స్ ఉన్నాసరే బిగ్బాస్ ఎందుకో త్వరగానే భరణిని త్వరగా లోపలికి పంపించేయడం మాత్రం కాస్త అసంతృప్తిగా అనిపించింది.అప్పట్లో 'చిలసౌ స్రవంతి' సీరియల్తో విలన్గా చేసి అందరినీ భయపెట్టిన భరణి.. తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సరే 'స్రవంతి' విలన్గానే గుర్తుండిపోయాడు. ఇప్పడు బిగ్బాస్ షోలోకి వచ్చి తనని తాను మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఎన్ని వారాల పాటు ఉంటాడో చూడాలి?The house is ready for him!💥 Bharani enters the Bigg Boss 9 house, bringing high voltage drama & fun-filled chaos ❤️🔥The house doors are open! 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/J6EmKjrds1— JioHotstar Telugu (@JioHotstarTel_) September 7, 2025 -
పెళ్లిరోజు స్పెషల్.. భర్తతో సాయిపల్లవి చెల్లెలు ఇలా (ఫొటోలు)
-
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్
-
సారీ అమ్మ.. నిహారిక పోస్ట్ వైరల్..!
-
బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్? మూవీపై ప్రశాంత్ వర్మ క్లారిటీ