breaking news
Tollywood
-
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలనే ప్రెస్మీట్కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. -
రిటైర్ అయ్యా కదా.. తెలుగు సినిమాలపైనే నా ఫోకస్!
చాలామందికి సినిమాలకే కాలక్షేపం. కాస్త సమయం దొరికితే చాలు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు. తాను కూడా అదే కోవలోకి వస్తానంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా అతడు హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ (టీపీఎల్)ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.డబ్బింగ్ మూవీస్ చూస్తా..మీరు సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. తెలుగు, తమిళ భాషలు అర్థం కానప్పటికీ ఆయా సినిమాలను హిందీ డబ్బింగ్లో చూస్తానని సెహ్వాగ్ చెప్పాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ను హిందీలో చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక నేను చాలా ఖాళీ సమయం దొరికింది. నా ఫేవరెట్ హీరోఅప్పుడు నేను టాలీవుడ్ స్టార్స్ అయిన మహేశ్బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టాను. నా ఫేవరెట్ తెలుగు హీరో మహేశ్బాబు. ప్రభాస్ బాహుబలి సినిమానైతే ఎన్నోసార్లు చూశాను అని చెప్పుకచ్చొఆడు. ఇకపోతే వీరూ ఫేవరెట్ హీరో మహేశ్బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.సినిమాఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రభాస్ అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ప్రభాస్ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
'గీతూ రాయల్' దెబ్బకు దిగొచ్చిన సంజన
బిగ్బాస్ 9 తెలుగు సీజన్ పూర్తి అయినప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్లోనే కొనసాగుతుంది. ఎపిసోడ్కు సంబంధించిన పలు వీడియోలను కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో నటి సంజన గల్రానీ తన ఇన్స్టా స్టోరీస్లో బిగ్బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. దీంతో గీతూ రాయల్ గట్టిగానే కౌంటర్గా ఇచ్చింది. సంజనకు సంబంధించిన ఒక వీడియోను తన స్టోరీస్లో పంచకుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత సంజన తన తప్పును తెలుసుకుని తన పోస్ట్ను తొలగించడంతో.. రీతూ రాయల్ కూడా తను చేసిన పోస్ట్ను రిమూవ్ చేసింది.సంజన ఏం చేసింది..?బిగ్బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది. ఆ వీడియోలో సంజన బిగ్బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై తనూజ, ఇమ్ము, డీమాన్ పవన్ల ఆట గురించి ప్రస్తావించాడు. అయితే, కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్ హైలెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దానిని కొందరు ట్రోలర్స్ వైరల్ చేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రీతూ రాయల్ కల్యాణ్ కోసం ఓట్ల బిచ్చగాళ్లు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు కలిపారు. అదే వీడియోను సంజన షేర్ చేయడంతో గీతూ రాయల్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది సంజన తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయిపోయింది.సంజనకు గీతూ రాయల్ కౌంటర్డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్ను గీతూ పోస్ట్ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సంజన గల్రానీ డ్రగ్స్ కేసు 2020లో కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇదే కేసులో సుప్రీం కోర్టు కూడా కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది.#GeetuRoyal status on #Sanjana #BiggBossTelugu9 pic.twitter.com/kLMBYZfGBe— TeluguBigg (@TeluguBigg) December 24, 2025 -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
ప్రమోషన్ పొందిన వితికా షెరు
బిగ్బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హీరోయిన్గా కెరీర్తెలుగమ్మాయి వితిక హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్బాస్ షో మూడో సీజన్కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.చెల్లి పెళ్లి చేసిన వితికాఅక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
'ఇమ్మిగ్రేషన్ టు ఎవ్రీవన్ బుక్' ఆవిష్కరణ వేడుకలో నటి అనన్య నాగళ్ల
-
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్బాస్ తెలుగు 9 సీజన్ సోషల్మీడియాలో ట్రెండింగ్గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్కు వచ్చేసరికి కల్యాణ్కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్బాస్ ఎపిసోడ్కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
మైసా నుంచి సర్ప్రైజ్.. రష్మిక రప్పారప్పా..
ఈ ఏడాది బాక్సాఫీస్ను రప్ప రప్పా ఆడించేసింది రష్మిక మందన్నా.. తను హీరోయిన్గా నటించిన ఛావా, థామా, కుబేర, ద గర్ల్ఫ్రెండ్ చిత్రాలు వందల కోట్లు రాబట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తోంది. బుధవారం (డిసెంబర్ 24న) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది.. దాని ఊపిరి మోయలేక, అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక.." అన్న సంభాషణతో వీడియో మొదలైంది. నా బిడ్డను సంపలేక సావే సచ్చిపోయింది.. నా బిడ్డ ఎవరో తెలుసా.. అంటూ రష్మికను పవరల్ఫుల్ లేడీ వారియర్గా చూపించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిలింస్ నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది. -
'దండోరా' మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ బింధుమాధవి (ఫొటోలు)
-
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్'.. క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్
'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఊపేసిన బాహుబలి ప్రాంఛైజ్ రెండు సినిమాలు పదేళ్ల తర్వాత ఒక్కటిగా 'బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే, బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.'బాహుబలి: ది ఎపిక్' నెట్ఫ్లిక్స్లోకి రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్టిక్స్ (NETFLIX) తన లిస్ట్లో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఏకంగా రూ. 55 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ చిత్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి..?బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. -
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
-
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్బాస్ సీజన్-9లో కామనర్గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శ్రుతిహాసన్ ట్రైన్ వచ్చేస్తుంది..
కోలీవుడ్లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం 'ట్రైన్'.. విజయ్ సేతుపతి, నటి శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం ఇది. యూగీసేతు, నరేన్, సంపత్ రామ్ ముఖ్యపాత్రలు పోషించారు. నటుడు నాజర్, వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్ దర్శకుడు మిష్కిన్ తెరకెక్కిస్తున్నారు. ఈయన చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ట్రైన్ చిత్రం కూడా అదేవిధంగా ఉంటుందని భావించవచ్చు. ఇది విజయ్సేతుపతి, శ్రుతిహాసన్ రేర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం. ఇందులో విజయ్సేతుపతి, శ్రుతిహాసన్ల గెటప్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. శ్రుతిహాసన్ ఇటీవల వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్, ఆ తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రాల్లో ఈమె పాత్రలు అంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ట్రైన్ చిత్రంలో కూడా శ్రుతిహాసన్ గెటప్ కొత్తగా ఉంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా అప్డేట్ను యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈచిత్ర సింగిల్సాంగ్ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో త్వరలోనే ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. మరో విషయం ఏమిటంటే తాజాగా విడుదలైన పాటను శ్రుతిహాసన్ పాడడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. -
ఇదేం చెత్త వాగుడు: శివాజీపై పలువురి ఫైర్
‘‘చాలా బాగుందమ్మా (యాంకర్ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్ యాంకర్–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్ యాంకర్ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు. ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్ బాయ్స్కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ⇒ ‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్ఎస్ 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది.మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.⇒ కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్ ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మిఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.నీ ఒంట్లో ఇంత కొవ్వేందిఏమిటా చెత్త వాగుడు శివాజీ? నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా నీ ఒంట్లో ఇంత కొవ్వేంది మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివిచెప్పులు తేవాలాచెర్నాకోలా తేవాలానిన్ను తన్ని తగలెయ్యడానికిఅడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి మా గురించి తీర్పులు చెప్పడానికి మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో మా జోలికొస్తే ఖబడ్దార్ బండకేసి ఉతికి ఆరేస్తాం. – కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రికఅలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయశివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...⇒ నా లైఫ్లో హీరోల ఫ్యాన్స్ పేరుతో చేసిన ట్రోల్స్లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్ చేశారు), రెండోది ‘అర్జున్ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్ ఫంక్షన్లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా, లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్గా టార్గెట్ చేస్తూ, మెసేజ్లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్ పేరుతో ట్రోల్స్ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.⇒ తొలి ప్రాధాన్యం కుటుంబానికే...నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్ అంటే ఇష్టం... అంతే. నా తొలి ప్రాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్కన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.⇒ రెబల్ అనుకున్నా ఫర్వాలేదుపిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్ చేస్తారు. బోల్డ్గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్ ఫెమినిజమ్’ అని, ‘అటెన్షన్ సీకింగ్’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ప్రాబ్లమ్’. నేను ఉమెన్ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.⇒ ఆ జంతువులతో జాగ్రత్తమనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను. ⇒ మా అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకున్నారుమా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్’ (ముసుగు) కల్చర్ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?వస్త్రధారణ అనేది కంపర్ట్ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్పోజింగ్’ వేరే ఏ డ్రెస్లో ఉంటుంది?⇒ అసలు ఆ పదం ఏంటి?‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.⇒ అక్కడ క్రైమ్ రేట్ తక్కువఅమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్సెక్యూర్టీ ఉండదు కాబట్టి. -
ఈషా కథ విని షాక్ అయ్యాను: అఖిల్ రాజ్
‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది. ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
శంబాలతో సక్సెస్ కొడతాను: ఆది సాయికుమార్
‘‘రాజశేఖర్, మహీధర్ రెడ్డిగార్లకు నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రమైనా ఎంతో ప్యాషన్తో నిర్మించారు. అయితే కథపై నమ్మకంతో నా మార్కెట్కి మించి ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు. కానీ ఎక్కడా వృథా ఖర్చు చేయలేదు. ఈ నెల 25న చాలా సినిమాలు వస్తున్నాయి...పోటీ బాగా ఉండంతో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ‘శంబాల’ ఔట్పుట్ పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ఆయన హీరోగా, అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే డిసెంబరు 23న ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ పంచుకున్న విశేషాలు... ⇒ ‘శంబాల’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మా మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన టీజర్, ప్రభాస్, నానీగార్లు విడుదల చేసిన ట్రైలర్స్ ఆడియన్స్లో మా మూవీ పట్ల మంచి బజ్ తీసుకొచ్చాయి. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది. మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం... అందుకే కాస్ట్యూమ్స్ని చాలా సెలెక్టివ్గా తీసుకున్నాం. మా సినిమాలో అద్భుతమైనపోరాట సన్నివేశాలున్నాయి. రాజ్కుమార్ మాస్టర్ బాగా చూపించారు.⇒ ‘శంబాల’ అనే ప్రాంతం ఉందా? లేదా అనేది ఎవరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఆ టైటిల్ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘కల్కి’ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ మూవీ కోసం యుగంధర్గారు చాలా కష్టపడ్డారు... ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. సినిమా చూసిన తర్వాత అందరూ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఆడియన్స్కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలాంటి జానర్లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘శంబాల’ లాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తారు.⇒ క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్ తో నాకు మంచి పరిచయం ఉంది. మా ‘శంబాల’తో పాటు రోషన్ నటించిన ‘చాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేను. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ‘శంబాల’తో సక్సెస్ కొడుతున్నాను. ఆ తర్వాత కూడా మంచి కథలు ఎంచుకుంటాను. నేను నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇంకా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది. -
కథ విన్నారా?
హీరో రవితేజ, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వశిష్ట వినిపించారని, ఈ కథ నచ్చి, సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట వశిష్ట. అలాగే తనకు ‘కిక్’ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితోనూ రవితేజ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ కథ కూడా విన్నారని తెలిసింది. ఇంకా ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిట్అయినట్లుగా వార్తలున్నాయి. రవితేజ కొత్త సినిమా కబురు ఏ దర్శకుడితో ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ (వర్కింగ్ టైటిల్)తో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు. Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰— Prakash Raj (@prakashraaj) December 23, 2025 -
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
మహిళలపై శివాజీ కామెంట్స్.. ఆ రెండు ఒక్కటి కాదు: యాంకర్ సుమ
నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని తెలిపింది. ఇటీవలే తాను ఎకో అనే మూవీ చూశానని వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో ఇటీవల నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చరికలాంటివని సుమ తెలిపింది. ఇలాంటివీ చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందని ఆమె ప్రశ్నించింది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని వదిలేయడం అంటే ఇంకా పెంచి పోషించడమేనని యాంకర్ రాసుకొచ్చారు. ఈ సంఘటనలను మహిళలు ప్రశ్నిస్తూనే ఉంటారని సుమ తన పోస్ట్లో స్పష్టం చేసింది. హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్..శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారు. నటీమణుల దుస్తులపై ఆయన కామెంట్స్ చేశారు. సామాన్లు కనపడేలా డ్రెస్సులు ధరించొద్దని.. చీరలోనే అందంగా ఉంటారని వెటకారంగా అన్నారు. అదే సమయంలో కొన్ని అసభ్యకర పదాలు వాడారు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్పై అనసూయ, చిన్మయితో సహా పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ.Recently watched a film called eko which says Protection and restriction are not the same. pic.twitter.com/5ozSvvYUhq— Suma Kanakala (@ItsSumaKanakala) December 23, 2025 -
దెబ్బకు దిగి వచ్చిన శివాజీ.. ఎట్టకేలకు క్షమాపణలు..!
టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు కోరారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'హలో అండి.. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడిన సందర్భంలో నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అన్పార్లమెంటరీ పదాలు వాడాను. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు.. హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు దస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్తి. ఒక అమ్మవారిలా అనుకుంటా. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నా ఉద్దేశం మంచిదే కానీ.. ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మంచి ఉద్దేశమే తప్ప.. అవమానపరచాలి.. కించపరచాలి అనే ఉద్దేశం లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు.. అలాగే మహిళలు తప్పుగా భావిస్తే మీ అందరికీ నా క్షమాపణలు' అంటూ వీడియోలో కోరాడు. I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT— Sivaji (@ActorSivaji) December 23, 2025 -
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్తో పాటు అడ్వెంచరస్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీకి బిగ్ షాక్..!
టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన కామెంట్స్పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.సామాన్లు అంటూ కామెంట్స్.. కాగా.. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శివాజీ హీరోయిన్లు డ్రెస్లను ఉద్దేశించి మాట్లాడారు. దుస్తుల విషయాన్ని చెబుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడారు. సామాన్లు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే అనసూయతో పాటు చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్స్పై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం క్షమాపణలు చెప్పారు. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.మంచు మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. Came across some deeply disappointing comments last night. A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025 -
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
-
డ్యాన్స్ తో డామినేట్ చేస్తున్న రోషన్
-
బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?
సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.ఓటీటీ కంటెంట్కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్లు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావొచ్చు. కానీ ఎలా చెబుతున్నమనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నటుడు శివాజీ.. సోమవారం జరిగిన 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా రెండు బూతు పదాల్ని స్టేజీపై బహిరంగంగా అనడం చర్చనీయాంశమైంది. స్పందించిన సింగర్ చిన్మయి.. ఆగ్రహంతో ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)శివాజి ఏమన్నాడంటే?'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు' అని శివాజీ అన్నాడు. అయితే ఇందులో ఓ బూతు పదంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకునే సామాను అనే చిల్లర పదం ఉపయోగించడం ఇక్కడ వివాదాస్పదమైంది.సింగర్ చిన్మయి రెస్పాన్స్ శివాజీ పబ్లిక్గా స్టేజీపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. 'తెలుగు నటుడు శివాజీ.. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహా ఇచ్చాడు. ఆయా పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్గా నటించాడు. తద్వారా పోకిరీలకు హీరో అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నాడు. మరి ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది' అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాస్ రౌడీ జనార్ధన
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు. -
శంబాలపై పాజిటివ్ వైబ్ ఉంది: కిరణ్ అబ్బవరం
‘‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.‘‘సాయికుమార్గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ‘‘నా టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్ ముని పేర్కొన్నారు. -
ఫుల్ వయొలెంట్గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారని టాక్. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. -
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. -
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం.. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా థియేటర్లలో రిలీజైన 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో జడ్జి పాత్రలో అలరించారు. ఇప్పుడు ఆయన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. తానే స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)రాష్ట్రపతి ముర్ము గత మూడురోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేదదీరారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన బ్రహ్మానందం.. ఈమెని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. శాలువాతో బ్రహ్మీని సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తన స్వహస్తాలతో లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ముర్ముకు బహుకరించారు.హాస్యనటుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం.. తీరిక సమయాల్లో చాలా బొమ్మలు గీస్తుంటారు. వాటిని పలువురు తెలుగు సెలబ్రిటీలకు బహుమతులుగా ఇచ్చారు. ఇప్పుడు అలానే రాష్ట్రపతికి తను గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?) -
ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)
-
ఈ ఏడాది టాలీవుడ్ కలెక్షన్స్ ఢమాల్.. సత్తా చూపని తెలుగు సినిమా
కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది. అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.బాలీవుడ్లో సత్తా చూపని తెలుగు సినిమాఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్తో టాప్లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్గా 2025 టాలీవుడ్కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)
-
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్లో భాగంగా చిట్చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
ఫాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ సామ్
-
‘పతంగ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫ్యామిలీ ఫోటోఅవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.చై వైవాహిక జీవితంహీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.రెండో పెళ్లితర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. #NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS— Milagro Movies (@MilagroMovies) December 21, 2025 -
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
బిగ్బాస్ తెలుగు 9 అసలైన విజేత ఇమ్మాన్యుయేల్ అని సోషల్మీడియాలో చాలామంది అంటుంటారు. ఈ సీజన్లో తను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థం అవుతుంది. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమ్మాన్యుయేల్నే కావడం విశేషం.. కమెడియన్గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్బాస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ దక్కలేదు. కానీ, ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. హౌస్లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్లు తప్పు చేసినా సరే.. మంచివైపే నిల్చున్నాడు. తనవారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా ఆటలో ఒక పోరాట యోధుడిని కూడా చూపించాడు. కానీ, 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్ము అసలైన విజేత అంటూ సోషల్మీడియాలో (Social Media) పోస్టులు పెడుతున్నారు.రెమ్యునరేషన్ ఎంత..?బిగ్బాస్లో ఇమ్మానుయేల్ (Immanuel) 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు. ఏడిపించాడు.. అలరించాడు. గతంలో కమెడియన్స్ చాలామంది బిగ్బాస్లోకి వచ్చారు. కానీ, ఇమ్ము మాత్రం బలమైన మార్క్ చూపాడు. అయితే, ఇమ్ము తన రెమ్యునరేషన్కు మించి కంటెంట్ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్బాస్ నుంచి వారానికి రూ. 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్బాస్ నుంచి మొత్తంగా రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో భరణి, సంజనలు రెమ్యునరేషన్లో టాప్లో ఉన్నారు. ఆ తర్వాత ఇమ్ము ఉన్నాడు. -
జూబ్లీహిల్స్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
నటి సమంతకు చేదు అనుభవం..
హైదరాబాద్లో ఓ షాపింగ్మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్లో నిధి అగర్వాల్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి. Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg— Cineholic (@Cineholic_india) December 21, 2025 -
హిట్ దర్శకుడితో ధనుష్ సినిమా.. షూటింగ్ పూర్తి
వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే చిత్రం సక్సెస్ అయ్యింది. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. తమిళ హిట్ మూవీ 'పోర్ తొళిల్'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డి.ఐసరిగణేష్ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్, మమితాబైజూ చిత్ర యూనిట్ శనివారం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు: నాని
‘‘శంబాల’ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఇలాంటి జానర్ సినిమాలనే కోరుకుంటున్నారు. ఇలాంటి చిత్రాల్ని టెక్నికల్గా, మేకింగ్ పరంగా కరెక్ట్గా తీస్తే ఎలాంటి ఇం పాక్ట్ను క్రియేట్ చేస్తాయో ఇది వరకే చూశాం. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అని హీరో నాని తెలి పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది.ఈ మూవీ ట్రైలర్ని నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఇంగ్లిష్ సాంగ్ చాలా స్టైలిష్గా ఉంది.. అదిరిపోయింది. ఆది చాలా ఏళ్ల నుంచి నాకు తెలుసు. మంచి నటుడు, డ్యాన్సర్. మంచి నటుడికి ఓ మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో చె΄్పాల్సిన పని లేదు. ‘శంబాల’ పెద్ద హిట్ అవ్వాలి.. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని చె΄్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, యుగంధర్ ముని, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. బిగ్బాస్లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్బాస్ హౌస్లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రో లీగ్కు హానరరీ చైర్మన్గా దిల్రాజు వ్యవరించనున్నారు. క్రికెట్-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. * * * -
తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?
'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్లో డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు. -
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్) -
'బిగ్బాస్' తెలుగు విన్నర్ను ప్రకటించిన వికీపీడియా
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్బాస్ విజేత తనూజ అని, రన్నర్గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్బాస్ టీమ్తో ఉండవు.బిగ్బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు''ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్ఫ్రెండ్తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది. -
వారణాసి బడ్జెట్ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!
దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్ట్రాటర్ పేరుతో ఈవెంట్ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అయితే ఈ మూవీ బడ్జెట్పై ఇప్పటికే టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025 -
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. -
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025 -
మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్
‘‘నా సినిమాల కథలను ముందు నేనే వింటాను. నాకు నచ్చిన స్క్రిప్ట్స్ గురించి నాన్నతో (నటుడు శ్రీకాంత్) చర్చిస్తాను. నాన్న పూర్తి కథ వినరు కానీ స్టోరీ లైన్ వింటారు. అయినప్పటికీ కథ, సినిమాల ఎంపికలో తుది నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ‘చాంపియన్’ సినిమా కథ కూడా ఒక లైన్లా విన్నారు’’ అని రోషన్ చెప్పారు. ఆయన హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చాంపి యన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోషన్ పంచుకున్న విశేషాలు. ⇒ నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్లోనే ఇండస్ట్రీకి వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేశాను. ‘పెళ్లి సందడి’ (2021) సినిమా తర్వాత నేను బ్రేక్ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కమ్ బ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన వయసు. ఈ విరామం తీసుకోవడం కూడా పూర్తిగా నా నిర్ణయమే. యాక్టింగ్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి... దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను... ఆ విధంగా చాలా నేర్చుకున్నాను. ⇒ 1948లో జరిగే కథ ‘చాంపియన్’. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ‘చాంపియన్’ కథని చూపించడం జరిగింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ‘చాంపియన్’. నాపాత్ర ప్రాపర్ హైదరాబాదీ... అందుకోసం ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసం ప్రదీప్గారు, స్వప్నగారు, ఆర్ట్ డైరెక్టర్ తోటగారు ప్రతిదీ పరిశోధించారు. పీటర్ హెయిన్స్గారు అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ⇒ మా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్చరణ్ అన్న నా గురించి, మా టీమ్, సినిమా గురించి అంత బాగా మాట్లాడటం హ్యాపీ అనిపించింది. అఖిల్ అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్. అలాగే తమన్ అన్న... మేమందరం కలిసి క్రికెట్ ఆడతాం. బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ‘చాంపియన్’ నిర్మించారు. నేను చాలా మొహమాటంగా ఉంటాను. ‘కొంచెం ఓపెన్గా ఉండు, మాట్లాడు’ అని నాగ్ అశ్విన్గారు చె΄్పారు. ⇒ నేను క్రికెటర్, మా చెల్లి డాక్టర్, మా తమ్ముడు ఐఏఎస్ కావాలనుకున్నారు నాన్న. నాకు కూడా క్రికెటర్ కావాలనే ఉండేది. అయితే నటుడయ్యాను. నా కొత్త సినిమాల ప్రకటన తర్వలోనే ఉంటుంది. ఇకపై రెండు సంవత్సరాలకి కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
మా వందే ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘మావందే’ టైటిల్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో మోదీగా ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. రవీనా టాండన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సీహెచ్ క్రాంతికుమార్ దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలను సహజంగా ‘మా వందే’లో చూపించనున్నాం.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీగారి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక, వీఎఫ్ఎక్స్ నిపుణులతో ఈ బయోపిక్ను రూపొం దిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: గంగాధర్, వాణిశ్రీ, లైన్ ప్రోడ్యూసర్: రాజేశ్. -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'బొమ్మ హిట్'
బాలనటుడిగా పలు సినిమాలు చేసిన అభినవ్ మణికంఠ హీరోగా చేస్తున్న కొత్త మూవీ 'బొమ్మ హిట్'. గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్. ఈ చిత్రం నేడు(డిసెంబరు 20) పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది.హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో సిచ్యుయేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ మధ్య కామెడీ చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా అని అన్నాడు. రాబోయే వేసవికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నామని దర్శకుడు రాజేష్ చెప్పుకొచ్చారు. -
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.''ఓ మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.I remember a South film where I was the only woman, they wanted to add more padding on my bum & my breast. They were like, 'Amma, more padding' 😮— #RadhikaApte Which South movie is she referring to❓Kabali, Azhagu Raja or Balayya's Lion❓👀 pic.twitter.com/wm5Ne7Na4R— VCD (@VCDtweets) December 20, 2025 -
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
-
ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ
-
స్పిరిట్ కోసం సందీప్ వంగా మాస్
-
ప్రముఖ నటుడు మృతి.. పృథ్వీరాజ్ సంతాపం
మలయాళ చిత్రసీమలో నటుడిగా, రచయితగా, చిత్రనిర్మాతగా మహోన్నత ఉనికిని చాటుకున్న శ్రీనివాసన్(69) శనివారం కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలుగా మలయాళ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఉదయం 8.30 గంటలకు ఆయన మరణించారు. శ్రీనివాసన్ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా..! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కుమారుడు వినీత్ శ్రీనివాసన్ కూడా సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ' అనే చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యాడు.శ్రీనివాసన్ మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. మలయాళ పరిశ్రమ గొప్ప రచయిత,దర్శకుడు,నటుడిని కోల్పోయింది. ఆయనకు వీడ్కోలు చెప్పడం కష్టంగా ఉంది. కానీ, వెండితెరపై మీరు పంచిన నవ్వులు ఎప్పటికీ ఉంటాయి. పరిశ్రమ కోసం మీరు చేసిన పనులకు ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు. -
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం (ఫొటోలు)
-
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
-
నా కూతురిని హీరోయిన్ చేస్తా: దేవయాని
తమిళ చిత్ర పరిశ్రమలో మరో వారసురాలు కథానాయకిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవుతున్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కోలీవుడ్ సక్సెస్ఫుల్ దంపతులుగా రాణిస్తున్న అతి కొద్ది జంటల్లో దర్శకుడు రాజకుమార్, దేవయాని. నటి దేవయాని గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ కథానాయకిగా రాణించారు. ఈమె దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. కాగా దర్శకుడు రాజకుమార్ అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆపై దర్శకుడిగా చిత్రాలు చేయకపోయినా నటిస్తున్నారు. ఈయన తన పెద్ద కూతురు ఇనియను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఆయన ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే అందులో నటుడు విజయ్ వారసుడు జెసన్ సంజయ్ను హీరోగా నటింపజేస్తానని చెప్పారు. నటుడు విజయ్తో చిత్రం చేసే అవకాశం రాలేదు అనీ, ఆయన వారసుడితోనైనా చిత్రం చేస్తానని చెప్పారు. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే చిత్రం కథను రెడీ చేసినట్లు చెప్పారు. అది నీరులా ఎన్పా చిత్రానికి సీక్వెల్ అని రాజకుమార్ చెప్పారు. జెసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి రాజకుమార్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. -
ఇది రెగ్యులర్ సినిమా కాదు: వినోద్ కుమార్
సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. వినోద్కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు బత్తల సతీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వినోద్కుమార్ మాట్లాడుతూ– ‘‘సన్ ఆఫ్’ రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. స్క్రీన్ప్లే బేస్డ్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య సాగే మంచి కథ. ఎక్కడో పర్లాకిమిడిలో చదివి, ఆ తర్వత అమెరికా వెళ్లి, తిరిగి అక్కడ్నుంచి వచ్చి, సాయి సింహాద్రి ఈ సినిమాను నిర్మించడం గ్రేట్ అచీవ్మెంట్. నటుడిగా నాకున్న అనుభవంతో చెబుతున్నాను... ఈ చిత్రదర్శకుడు మంచి ప్రతిభాశాలి.ఎంతో కమిట్మెంట్తో ఈ సినిమా చేశాడు. ప్రస్తుతం నేను గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమాలో, ‘మారెమ్మ’ చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే సుహాసినితో కలిసి ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ కథ రియల్ లైఫ్లో నాకు, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. ప్రతి కొడుకు తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. నేను చిరంజీవిగారికి అభిమానిని. ఆయనకు ఈ సినిమా చూపించాలని ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కొడుకు తన తండ్రిపై ఎందుకు కేసు వేశాడు? అన్న పాయింట్ని స్ట్రాంగ్గా చూపించాం. వినోద్కుమార్గారి కెరీర్లో ‘మామగారు’ సినిమాలా ఈ ‘సన్ ఆఫ్’ చిత్రం కూడా నిలిచిపోతుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సతీష్. ఈ కార్యక్రమంలో ‘చిత్రం’ శ్రీను, రిషి తదితరులు పాల్గొన్నారు. -
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లకు రానుంది.మూవీ రిలీజ్ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to be launching the trailer of #Dhandoraahttps://t.co/sOuUJAUZlqRooted, raw and powerful this looks very promising Wishing the entire team a huge success , looking forward to watching it .In Cinemas from 25-12-25#DhandoraaOnDec25th@Afilmby_Murali… pic.twitter.com/7zL0X3WBpG— chaitanya akkineni (@chay_akkineni) December 19, 2025 -
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గుర్రం పాపిరెడ్డిదర్శకత్వం: మురళీ మనోహర్నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులువిడుదల తేదీ: డిసెంబర్ 19, 2025హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.ఎలా ఉందంటే..డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్తో సెకండాఫ్పై ఆసక్తి పెంచేశాడు.సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.సింపుల్ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్కు కనెక్ట్ అయింది. కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే.లీడ్ రోల్లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్కుమార్.. చిలిపిగా వంశీధర్గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్: 2.75/5 -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వారణాసి ఆలయంలో అఖండ-2 టీమ్.. నీ టైమ్ బాగుంది బ్రో!
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. God of Masses #NandamuriBalakrishna garu and blockbuster director #BoyapatiSreenu garu visited the sacred city of Varanasi, took divine blessings after the Blockbuster success of #Akhanda2 🔱🔥Har Har Mahadev 🔱Book your tickets now!🎟️ https://t.co/8l5WolzzT6… pic.twitter.com/rOMNIQQ7sN— 14 Reels Plus (@14ReelsPlus) December 19, 2025 God Of Masses Nandamuri Balakrishna, Sensational Director Boyapati Sreenu Visited Varanasi Temple on the occasion of of #Akhanda2 Success pic.twitter.com/TfkCM6GqKG— idlebrain jeevi (@idlebrainjeevi) December 19, 2025 -
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీనటులు అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ ఉంటారని తెలిసిదే.. వారు "రాజులా జీవించడం" అనే పదబంధానికి నిజంగా ప్రాణం పోసుకుంటారు. వారికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు తరచుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కనీసం ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. కానీ, సినిమా నటీనటులకు సొంతంగానే కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, నయనతార వంటి వారికి లగ్జరీ జెట్లు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరందరూ ఒక్కోసారి పబ్లిక్ విమానంలోనే ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకు సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి.ప్రభాస్ వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంలో కొందరు తనని తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు. ఇటీవల, ఒక నిర్మాతను ప్రభాస్ తన టీమ్ కోసం USAకి ప్రైవేట్ జెట్ బుక్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక కారణాలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, మరికొందరు కొన్ని ప్రధాన అంశాలను తెలిపారు. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. తన వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే అందుకు కావాల్సిన డబ్బు తనే సమకూర్చుకుంటారు. సినిమాకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ఆయా నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకానీ నిర్మాతల చేత అవసరం లేని ఖర్చులు పెట్టించరు అనే మంచి పేరు తనకు ఉంది.ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, రాజాసాబ్, సలార్2, కల్కి2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, ఒక్కో చిత్రంలో ఒక్కో గెటప్లో ఆయన కనిపించనున్నారు. ఈ కారణం వల్లే తన లుక్ను బహిరంగంగా వెల్లడించకూడదని మేకర్స్ సూచిస్తారు. యాదృచ్ఛికంగా పబ్లిక్లో ఆయన కనిపిస్తే అతని లుక్ను లీక్ చేసి వైరల్ చేస్తారు. గతంలో ఆది పురుష్ విడుదలకు ముందు ప్రభాస్ బహిరంగ ప్రదేశంలో కనిపించగానే కొందరు ఫోటోలు తీసి వైరల్ చేశారు. దీంతో జాతీయ స్థాయి ట్రోలింగ్కు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి, వాణిజ్య విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఆయన ఇష్టపడరని సమాచారం. వాస్తవంగా ప్రభాస్ జీవనశైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఉదార స్వభావంతో పలు సందర్భాల్లో భారీగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే పూర్తిగా రాజీ పడకుండా జీవిస్తారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ జెట్లలో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా సెట్స్లో అందరికీ భోజనాలు తెప్పించి వారితో కలిసి సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు కూడా ఒక రాజులాగే ఉండాలని తన జీవనశైలిని ఆస్వాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పేరులోనే రాజు ఉంది.. ప్రభాస్ జీవితం కూడా రాజులాగే ఉంటుందని తన సన్నిహితులు కూడా చెబుతుంటారు. -
'జిన్' సినిమా రివ్యూ
అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్ తదితరులు నటించిన సినిమా 'జిన్'. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం. గౌడ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ తాజాగా (డిసెంబరు 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఓ కాలేజీలోని లైబ్రరీలో ఓ కుర్రాడికి వింత అనుభవం ఎదురవుతుంది. రాత్రి ఒక్కడే ఉండటంతో అతనికి వింత శబ్దాలు, వింత ఘటనలు తారసపడతాయి. ఓ నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎదురైన సంఘటనలేంటి? ఆ బిల్డింగ్లో వీళ్లు ఎలా చిక్కుకున్నారు? చివరకు బయటపడ్డారా? ఇంతకీ 'జిన్' సంగతేంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఫస్ట్ హాఫ్ అంతా కూడా నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి, కాలేజీ సీన్లతో టైమ్ పాస్ అయిపోతుంది. కాసేపటికి తమకు ఏర్పడిన ప్రమాదం గురించి తెలుస్తుంది. చిన్న ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్దంలో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కాలేజీ బిల్డింగ్లో ఉన్న ఆత్మల గురించి రివీల్ చేస్తూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ని బాగా ముగించారు.అమిత్ రావ్ ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పర్లేదనిపించారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ ఆర్ఆర్ మంచి అనుభూతి ఇచ్చింది. నవ్విస్తూనే భయపెట్టడంలో టీమ్ సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్పై 'బిగ్బాస్' ప్రశంసలు
బిగ్బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్ల బిగ్బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.బిగ్బాస్లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్తో బిగ్బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. -
పుష్ప సిరీస్ దారిలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రం?
-
నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్పై స్పందించిన నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు. -
టాప్ ఓటీటీలో AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్ట్రీమింగ్
నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయిన పదం ఏ.ఐ.ఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్).. ఇదే టైటిల్తో ఒక వెబ్ సిరీస్ను దర్శకుడు జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించాడు. ఇందులో ‘కోర్ట్’ మూవీ ఫేం హర్ష్ రోషన్, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్కు సోషల్మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం తమకు స్థోమత లేకపోయినప్పటికీ మంచి కాలేజీలో చేర్పిస్తారు. వారి చదువుల కోసం అప్పులు చేసేందుకు కూడా వెనకాడరు. పిల్లల చదువల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించేది వారి ర్యాంకుల గురించే.. ఈ కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ను తెరకెక్కించారు. -
ఐబొమ్మ రవి వెనుక 'ప్రహ్లాద్'.. వెలుగులోకి కొత్త విషయం
పైరసీ సినిమాల కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మూడోసారి సైబర్క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్లో ఉన్న మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్డీ సినిమాల్ని ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడట.తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు రవి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్ మాత్రం రవికి పదో తరగతి స్నేహితుడని చెప్పాడట. అయితే, ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. అయితే, ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సును రవి తీసుకున్నాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. కానీ, అతని గురించి మాత్రం ఎలాంటి వివరాలు రవి చెప్పడం లేదట. -
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు. -
కాపీ కొట్టను: శ్రీ చరణ్ పాకాల
‘‘శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. డైరెక్టర్ యుగంధర్కి సౌండింగ్ మీద మంచి పరిజ్ఞానం ఉంది. నేను ఎన్నో థ్రిల్లర్ సినిమాలకు పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్కు పని చేయడం కొత్తగా ఉంది’’ అని సంగీత దర్శకుడు శ్రీ చరణ్పాకాల చెప్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రీ చరణ్పాకాల మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్ స్టోరీస్ వింటూ పెరిగాను. ఆ జానర్లో రూపొందిన ‘శంబాల’కి మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కథలో భాగంగా వచ్చే నాలుగుపాటలు అద్భుతంగా ఉంటాయి. నేను ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాను. ఎంత టైమ్ అయినా తీసుకుంటాను కానీ, కాపీ మాత్రం కొట్టను. ఒకవేళ స్ఫూర్తిగా తీసుకున్నా అందులో నా శైలి ఉండేలా చూసుకుంటాను’’ అని చెప్పారు. -
ఈ సినిమా ఓ కాలేజీ: సంగీత దర్శకుడు తమన్.ఎస్
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘అఖండ 2: తాండవం’ కథ విన్నప్పుడే కథలో హై మూమెంట్స్ ఉన్నాయనుకున్నాం. కమర్షియల్ పంథాలో సనాతన ధర్మాన్ని కరెక్ట్గా ఆడియన్స్కు చూపించడం, అదీ బాలకృష్ణగారిలాంటి స్టార్తో చేయడం చిన్న విషయం కాదు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం సవాలుగా అనిపించింది.ఆడియన్స్ను ఎలా ‘అఖండ 2’ ట్రాన్స్లోకి తీసుకువెళ్లాలని ఆలోచించి, చాలా హార్డ్వర్క్ చేసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. శివుని, హనుమంతుని మంత్రాలను ఎలా చేయాలని ఆలోచిస్తూ, 20 రోజులు కసరత్తు చేశాం. కల్యాణ్ చక్రవర్తి, కాసర్ల శ్యామ్, శర్మగార్లు... ఇలా లిరిక్ రైటర్లు కూడా సంస్కృతంలో చాలా ఉన్నతమైన లిరిక్స్ రాశారు.‘అఖండ’ సినిమాకు సంగీతం ఇవ్వడం స్కూల్కి వెళ్లినట్లు ఉంటే, ‘అఖండ 2: తాండవం’ చిత్రానికి కాలేజీకి వెళ్లడం అనే ఫీలింగ్ కలిగింది. ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అఖండ, ఓజీ’... ఇలా ఈ ఏడాది గ్రాండ్గా ముగిస్తున్నాను. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ‘ది రాజాసాబ్’ ఉంది. ఇక బాలకృష్ణగారి 111వ సినిమాకూ నేనే మ్యూజిక్ అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
కథలు రాస్తున్నాను: ఫరియా అబ్దుల్లా
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను సౌధామిని అనే నర్సుపాత్ర చేశాను. డాక్టర్ కావాలనుకుంటున్న సౌదామిని జీవితంలోకి గుర్రంపాపిరెడ్డి (నరేశ్ అగస్త్య రోల్) వచ్చి, ఆమె జీవితాన్నే మార్చేస్తాడు. దీంతో ‘గుర్రంపాపిరెడ్డి’ గ్యాంగ్తో కలిసి సౌదామిని ఓ దొంగతనంలోపాల్గొనాల్సి వస్తుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందనేది? సినిమాలో చూడాలి. ఈ చిత్రంలో నేను డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాను. ఈ చిత్రం కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఈపాటకు నేనే కొరియోగ్రఫీ చేశాను. యాక్షన్ సైకో కిల్లర్, సీరియల్ కిల్లర్ తరహా రోల్స్ చేయాలని ఉంది. ‘భగవంతుడు’ సినిమాలో విలేజ్ గాళ్గా చేస్తున్నాను. ‘మత్తు వదలరా 3’ ఉంది. సందీప్ కిషన్ మూవీలో ఓ రోల్ చేస్తున్నాను. ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఉంది. కొన్ని కథలు రాస్తున్నాను’’ అన్నారు. -
'యాక్టింగ్ తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్కు గంగోత్రి, మహేశ్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్ను, రాజకుమారుడుతో మహేశ్బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్ రెండో చిత్రం ఛాంపియన్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ ఈవెంట్లో శ్రీకాంత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. -
ప్రభాస్ హీరోయిన్కు చేదు అనుభవం.. పోలీసుల యాక్షన్..!
ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఈవెంట్ వివాదానికి దారితీసింది. ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా హీరోయిన్ను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. కొందరు ఏకంగా ఆమె తాకేందుకు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో హీరోయిన్కు భద్రత కల్పించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈవెంట్కు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.అసలేం జరిగిందంటే..ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని లులూ మాల్కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
ఫ్రైడే మూవీ లవర్స్కు పండగే.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం అనగానే థియేటర్ల వైపు చూస్తాం. ఏ సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. అయితే ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు జేమ్స్ కామెరూన్ అవతార్-3 థియేటర్లకు వస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ నుంచి సకుంటుబానాం, గుర్రం పాపిరెడ్డి, జిన్ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే అవతార్-3పైనే ఆడియన్స్లో ఎక్కువగా బజ్ ఉంది.అయితే ఫ్రైడే రోజు అనగానే ఓటీటీ ప్రియులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేవారి కోసం ఓటీటీ మూవీస్ కూడా రెడీ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్లు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19 రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19 ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19 ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20అమెజాన్ ప్రైమ్ వీడియో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19 హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19 జియో హాట్స్టార్ మిసెస్ దేశ్పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19 ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19జీ5 నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19 డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19సన్ నెక్స్ట్ దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19 ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19ఆపిల్ టీవీ ప్లస్ బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19లయన్స్ గేట్ ప్లే రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19 -
మీలో డ్యాన్స్ టాలెంట్ ఉందా.. అయితే ఈ అవకాశం మీ కోసమే..!
టాలీవుడ్లో డ్యాన్స్ షోలకు ఫుల్ క్రేజ్ ఉంటోంది. అందులో భాగంగానే పలు ఛానెల్స్లో డ్యాన్స్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఆట పేరుతో జీ తెలుగులో వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షోకు అభిమానుల నుంచి అత్యంత ఆదరణ వచ్చింది. దీంతో మేకర్స్ సరికొత్త సీజన్తో మీ ముందుకు రానున్నారు.ఇందులో భాగంగానే ఆట 2.0 పేరుతో జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొగనాలనుకునే వారికోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈనెల 21 అంటే ఆదివారం హైదరాబాద్ అమీర్పేట్లోని సారథి స్టూడియోస్లో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్లో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా 70322 23913 నంబర్కు వివరాలు పంపవచ్చని తెలిపింది. అంతేకాకుండా https://aata.zee5.com వెబ్సైట్లో వీడియో అప్లోడ్ చేసి ఆడిషన్స్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. The stage is set to let your dreams take off..Don't miss this opportunity 🕺💃Aata 2.0 auditions open now Message ‘Hi’ to 7032223913 or visit https://t.co/e5EBx9syAw and upload your 2-minute dance video to start your auditions 💥🕺💃#Aata #Aata2PointO #AataAuditions… pic.twitter.com/EY7L4lT6YJ— ZEE TELUGU (@ZeeTVTelugu) November 18, 2025 -
నటి బ్లౌజుపై వెకిలి కామెంట్.. హీరోలనూ వదల్లేదు!
ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.సినిమా ఈవెంట్స్లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...ఛీ కొట్టే ప్రశ్న'తెలుసు కదా' ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!హీరో మెటీరియల్ కాదా?దీనికంటే ముందు డ్యూడ్ సినిమా ప్రమోషన్స్లో కూడా.. ప్రదీప్ రంగనాథన్ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ అంటే అది హార్డ్ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్ కుమార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.బుద్ధి చెప్పిన మంచు లక్ష్మిహీరో మెటీరియల్ కాదని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్కు లింక్ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి వెకిలి కామెంట్ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.మీ బరువెంత?గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్ ఈవెంట్లో హీరోయిన్ గౌరీ కిషన్ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్మీట్లో ఓ విలేకరి.. హీరోయిన్కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! మరి వీళ్లంతా వైరల్ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో! -
'మనశంకర వరప్రసాద్ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'మనశంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్ను అలరించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. -
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. -
‘శంబాల’ చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది
టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ మూవీ షూటింగ్లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది.శంబాల మూవీని విజువల్ వండర్గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్లతో మేకర్లు ఆడియెన్స్ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. -
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.300 సినిమాలుకొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి.కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగంసితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదన్నారు.చిగురించిన చెట్టుచెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు. అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది. ప్రస్తుతం గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. -
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!
ఆంధ్రప్రదేశ్లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ ఉంది. సోషల్మీడియాలో ట్రోల్స్కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్లైన్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్తో పాటు ఏఐ మార్ఫింగ్ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్స్ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
'కన్నెపిట్టరో..' సాంగ్తో డెకాయిట్ టీజర్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.టీజర్ రిలీజ్నాగార్జున నటించిన 'హలో బ్రదర్' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ డిఫరెంట్గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది. -
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్ ఇచ్చిన బిగ్బాస్
బిగ్బాస్ తెలుగు 9 సోషల్మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్బాస్.. గురువారం ఎపిసోడ్లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ టీమ్ వదిలింది.బిగ్బాస్లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్బాస్ హౌస్లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్బాస్ ప్రోమో ఉంది. బిగ్బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు. -
సినిమా వైఫల్యంతో నటన మానేయాలనుకున్నా: నవదీప్
టాలీవుడ్ నటుడు నవదీప్ కథానాయకుడిగా భారీ అంచనాలతో నటించిన చిత్రం లవ్ మౌళి.. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గ నిలిచింది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా నటించింది. సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఫలితం గురించి నవదీప్ రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం రిజల్ట్ తనను భావోద్వేగ స్థాయిలో తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.లవ్ మౌళి సినిమా వైఫల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. నవదీప్ ఇలా అన్నారు. 'ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో నన్ను బాగా కుంగతీసింది. చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. నాపై ఈ మూవీ ఫలితం తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది కూడా.. విడుదల తర్వాత వచ్చిన టాక్తో నిరాశ చెందాను. దానిని తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో చాలా బాధాకరమైన అనుభవంగా అది మిగిలిపోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాను. పెర్త్లోని నా సోదరి ఇంట్లో దాదాపు మూడు నెలలు ఉన్నాను. ఇక నటనను పూర్తిగా మానేయాలని కూడా భావించాను. అయితే, సమయం అన్నీ మార్చేస్తుంది. కొంత కాలం తర్వాత తిరిగి ప్రయత్నాం చేయాలనిపించింది. అలా ధండోరా మూవీతో ప్రేక్షకుల వద్దకు మళ్లీ వస్తున్నాను.' అని నవదీప్ గుర్తుచేసుకున్నారు. -
ఆస్కార్ అవార్డ్స్.. 50ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకను చూడాలని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తారు. 1976 నుండి ఆస్కార్ అవార్డుల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC నెట్వర్క్ వద్ద ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా ఇదే ఛానల్లో ఆస్కార్కు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఇప్పుడు వారి బంధానికి యూట్యూబ్ బ్రేక్ వేసింది.ఆస్కార్ అవార్డుల వేడుకును ప్రపంచవ్యాప్తంగా లైవ్లో చూసే ఛాన్స్ను యూట్యూబ్ కల్పిస్తుంది. 2029 నుండి 2033 వరకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్కి మంజూరు చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ABCతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ముగిసింది. అయితే, 2028లో 100వ ఆస్కార్ అవార్డులు జరగనున్నాయి. ఈ ఈవెంట్ వరకు ABC ప్రసారం చేస్తుంది. ఈ పెను మార్పు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా చూడొచ్చు అనే ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రెడ్ కార్పెట్ కవరేజ్ మరియు తెరవెనుక కంటెంట్ కూడా ఉంటుంది. -
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. అందుకు పలు కారణాలు ఉంటాయి. ఇది చిత్రాలకు అతీతం కాదు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నా, కొన్ని చిత్రాల విడుదలకు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు మదగజరాజానే తీసుకుంటే నిర్మాణం పూర్తి చేసుకుని పలు అవరోధాలను ఎదురొడ్డి 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకుడు అయినప్పుటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటి మ్యాజిక్ పార్టీ చిత్రానికి వర్కౌట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. వెంకట్ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం పార్టీ.. మిర్చి శివ, జయ్, రెజీనా, రమ్యకృష్ణ, నివేదాపేతురాజ్, జయరామ్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ప్రేమ్జీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 8 ఏళ్ల క్రితం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పటికీ తెరపైకి రాలేదు. మధ్యలో చిత్ర వర్గాలు చాలా ప్రయత్నాలు చేశారు. తాజాగా పార్టీ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పార్టీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వెంకట్ప్రభు చిత్రాలకు కాలంతో పనిఉండదు. ఎంటర్టెయిన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పార్టీ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని భావిద్దాం. -
ఓటీటీకి సంతాన ప్రాప్తిరస్తు.. ఓకేసారి రెండింటిలో రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఓకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ వేదికగా సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.కథేంటంటే.. చైతన్య(విక్రాంత్) హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్ గోమఠం)ని ఎంగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్ (తరుణ్ భాస్కర్) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు.కొన్నాళ్ల తర్వాత చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది? చైతన్యకు స్పెర్మ్కౌంట్ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One film.Two major OTT platforms.An interesting OTT release 📺#SanthanaPrapthirasthu streaming on both #AmazonPrime & #JioHotstar from Dec 19 🎥 pic.twitter.com/G6m0l9NL8l— Suresh PRO (@SureshPRO_) December 17, 2025 -
డేవిడ్ రెడ్డి గ్లింప్స్.. అదంతా కల్కి బుజ్జి టీమ్ వాళ్లే: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన మరియా హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన మంచు మనోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ గ్లింప్స్లో కనిపించిన వార్ డాగ్ బైక్ గురించి మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ బైక్ను కల్కి టీమ్కు పనిచేసేవారే డిజైన్ చేశారని వెల్లడించారు. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొని తయారు చేశారని తెలిపారు. కల్కిలోని బుజ్జిని తయారు చేసిన టీమ్ ఈ వార్ డాగ్ క్రియేట్ చేశారని పంచుకున్నారు. దీని బరువు దాదాపు 700 కేజీల వరకు ఉందని మంచు మనోజ్ అన్నారు. కాగా.. ఈ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్ర పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై కూడా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంది..కానీ మేము ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు మంచు మనోజ్. War Dog… Ready to Roar 🔥🔥🔥Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025 -
ఏఐ మాయ.. ఆ లిస్ట్లో మరో హీరోయిన్.. ..!
టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.తాజాగా లిస్ట్లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్లో రాసుకొచ్చింది.(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025 -
వెండి వెలుగులకై దక్షిణాది పోటాపోటీ!
దేశంలో వేల కోట్ల రూపాయల పరిశ్రమగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఎ.వి.జి.సి) విజృంభణతో విస్తృతమైన వినోద రంగంలో సినిమా ఓ చిరుభాగమైంది. ఇవాళ మారిన కాలంతో పాటు మారాల్సి వస్తున్న సినిమా ఒకపక్క భాష, ప్రాంతీయ భేదాలను చెరిపేస్తుంటే, మరోపక్క ఓటీటీ వేదికలు దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సొంతంగా నిర్మిస్తున్న ‘ఒరిజినల్స్’ కొత్త తరహా కథ, కథనాలను పరిచయం చేస్తున్నాయి. ఫిల్మ్ సిటీల నిర్మాణం మొదలు శిక్షణ, మెంటర్ షిప్ల ద్వారా ఈ సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందుగా పై చేయి సాధించాలని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీ పడుతున్నాయి.సాధారణ ఆర్థిక రంగంలోనే కాదు... సృజనాత్మక ఆర్థికవ్యవస్థ (క్రియేటివ్ ఎకానమీ)లోనూ తమదైన ముద్ర వేసేందుకు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు దూసుకు వస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క హైదరాబాద్లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట డిసెంబర్ 8 – 9 తేదీలలో గ్లోబల్ సమిట్ జరిగి, అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమను సైతం తెలంగాణకు ఆకర్షించాలన్న ప్రయత్నం జరిగింది. సరిగ్గా అదే సమయంలో డిసెంబర్ 9న చెన్నైలో ప్రముఖ ‘జియో – హాట్స్టార్’ సంస్థ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త వెబ్ సిరీస్లు, షోలను జనం ముందుకు తెస్తూ, అందుకు ముందస్తుగా ‘సౌత్ అన్బౌండ్’ అనే ఉత్సవం నిర్వహించింది. అక్కడే తమిళనాట సినీ పరిశ్రమ అభివృద్ధికి గాను ఆ సంస్థకూ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య ఓ ప్రాథమిక అవగాహన కూడా కుదరడం విశేషం.మరోపక్క తెలుగు రాష్ట్రాలు ఒకటికి రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సైతం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కొన్నేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగులకు సింగిల్ విండో అనుమతుల మొదలు పలు చర్యలు గతంలోనే పాలకులు చేపట్టారు. స్థానికంగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్లను ప్రోత్సహించి, ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో పరిశ్రమకు మరో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలనేది ప్రయత్నం. వెరసి, సినీ పరిశ్రమకు చెరగని చిరునామాగా నిలిచి, తద్వారా ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందు వరుసలో నిలవాలని దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతుండడం గమనార్హం.సినిమాకు ‘ఫ్యూచర్ సిటీ’... వినోదానికి గ్లోబల్ హబ్…తెలుగు సినీ పరిశ్రమకు ఆది నుంచి తమ కాంగ్రెస్ ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయని పదే పదే నొక్కిచెబుతున్న ప్రస్తుత తెలంగాణ సర్కార్ హైదరాబాద్ను భారతీయ సినిమా పరిశ్రమకు మరో కీలక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలాకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా రానున్న ‘ఫ్యూచర్ సిటీ’లో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్ లాంటి హిందీ తారలకు సైతం ఫిల్మ్ సిటీ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు 50 ఏళ్ళుగా హైదరాబాద్తో మమేకమైన అన్నపూర్ణ స్టూడియోస్ సైతం ‘ఫ్యూచర్ సిటీ’లో భాగమవుతుందంటూ అక్కినేని నాగార్జున లాంటి వారు ప్రకటించారు.అలాగే, సంస్కృతి, సినిమా, సృజనాత్మకతలకు గ్లోబల్ హబ్గా రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ డిసెంబర్ ప్రథమార్ధంలోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐ.ఐ.ఎఫ్.ఎ – ‘ఐఫా’)తో సైతం తెలంగాణ సర్కార్ పలు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 120కి పైగా దేశాల్లో వీక్షకులున్న “వార్షిక ‘ఐఫా’ ఉత్సవం 2026 నుంచి 2028 వరకు వరుసగా మూడేళ్ళ పాటు హైదరాబాద్లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు ‘ఐఫా’ అవార్డులు అందించే ఈ ఉత్సవాల వల్ల ఏటా కొన్ని వేల మంది సందర్శకులు మన దగ్గరకు వస్తారు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. దక్షిణాదిపై కన్నేసిన ‘జియో- హాట్స్టార్’!ఇక, తమిళనాడు ప్రభుత్వంతో తాజాగా ‘జియో-హాట్స్టార్’ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వంతో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకం చేస్తున్నట్లు డిసెంబర్ రెండోవారంలో ప్రకటించింది. ఫలితంగా, తమిళనాట సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ‘జియో-హాట్స్టార్’ కీలక పాత్ర పోషించనుంది. “ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. అందుకు తగ్గట్టే నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్లు, డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్లు, నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ల లాంటివి చేపడతాం” అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే, నెట్ఫిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటివి దక్షిణాదిలోనూ అనేక రకాల ఒరిజినల్ కంటెంట్తో ముందుకొస్తున్నాయి. తాజాగా ‘జియో – హాట్ స్టార్’ సైతం ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం... ఇలా నాలుగు దక్షిణాది భాషల్లో ఫిక్షన్, నాన్ – ఫిక్షన్ కేటగిరీలలో 25 రకాల కొత్త టైటిల్స్ను వీక్షకుల నెట్టింట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. “దక్షిణ భారతదేశం ఎప్పుడూ సృజనాత్మకశక్తికి కేంద్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రేక్షకులు వినోద రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వినోదం అందించాలన్నది మా ప్రయత్నం. అందుకే ఈ ‘సౌత్ అన్ బౌండ్’. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొత్తగా 25 వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు అందిస్తున్నాం. ఈ కృషిలో భాగంగా గత పది నెలల్లో, దాదాపు 500 మందికి క్రియేటర్లు, డైరెక్టర్లు, షో రన్నర్లు మా సంస్థ కుటుంబంలో భాగమయ్యారు” అని ‘జియో స్టార్’ ఎంటర్టైన్మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి వివరించారు.దక్షిణాది సినీ ప్రముఖులు ఎందరో... ఈ ప్రసిద్ధ స్ట్రీమింగ్ దిగ్గజం అందిస్తున్న సిరీస్లు, షోలలో సినీ ప్రముఖులు సైతం భాగం కావడం చెప్పుకోదగ్గ విశేషం. తమిళంలో విజయ్ సేతుపతి సైతం ‘కాట్టాన్’ అనే ఓ వెబ్ సినిమాను స్వయంగా నిర్మిస్తూ, నటిస్తుంటే, మలయాళంలో ‘దృశ్యం’ చిత్ర సిరీస్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శక – నిర్మాత జీతూ జోసెఫ్ సైతం మరో ఓటీటీ ప్రయత్నాన్ని సమర్పిస్తున్నారు. ఇక, ప్రసిద్ధ నటుడు నివిన్ పాలీ సైతం భారతీయ ఔషధ రంగంలోని లోటుపాట్లపై నిర్మిస్తున్న ‘ఫార్మా’ అనే వెబ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ప్రముఖ సినీ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ఐశ్వర్యా రాజేశ్, సీనియర్ నటి జయసుధ, యువ హీరో ప్రియదర్శి, యువ హీరోయిన్ శివాత్మికా రాజశేఖర్, కమెడియన్ అభినవ్ గోమఠం, సీనియర్ నటుడు సాయికుమార్... ఇలా సుపరిచితులైన పలువురు ఈ వెబ్ షోలలో అలరించనున్నారు.ఇలా రాబోయే అయిదేళ్ళలో ఆ సంస్థ దక్షిణాది భాషల్లో ఏకంగా రూ. 12 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. స్వయంగా పలు చిత్రాలు నిర్మించి, వెండితెరపై నటించిన తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం రాష్ట్రంలో మరింత ఉపాధి, ఆదాయం పెంచే ఈ ఆలోచన పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారు. “దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఓ ప్రధాన కేంద్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఇక్కడే పుట్టాయి. అన్ని భాషల కళాకారులకూ ఇది నిలయం. దక్షిణాది సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది” అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో రానున్న సరికొత్త ఫిల్మ్ సిటీలు! నిజానికి, సినీ రంగంలోకి రావాలనుకొనే ఔత్సాహికులకు శిక్షణ నిచ్చేందుకు 1970ల నాటికే చెన్నైలో సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ పక్షాన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఆరంభమైంది. ఆ తరువాత కాలంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతూ వచ్చింది. ఇప్పటికీ అది నడుస్తోంది. ఇక, 1990ల నాటికే చెన్నైలో ఒకే చోట పలు సినిమా, టీవీ సీరియళ్ళ నిర్మాణానికి అనువుగా ఉండేలా ప్రభుత్వం ‘ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ’ పేరిట ప్రత్యేకంగా నెలకొల్పింది. అది చాలాకాలం తమిళ, తెలుగు, మలయాళ సినిమాలకు నిర్మాణ కేంద్రంగా నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో సినిమా స్టూడియోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం కోసం ప్రయత్నాలు సాగుతుంటే... మరోపక్క చెన్నైలో ఇప్పటికి రెండేళ్ళుగా సమస్త సౌకర్యాలతో, అధునాతన ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.2024 జనవరిలోనే డి.ఎం.కె. అధినేత – తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. చెన్నై శివార్లలోని పూనమల్లి దగ్గర కుతంబాక్కమ్ ప్రాంతంలో 152 ఎకరాల స్థలంలో రూ. 500 కోట్లతో ఈ నవీన ఫిల్మ్ సిటీ రూపొందనుంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పాటు భారీ ఎల్ఈడీ గోడలతో కూడిన వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలు, పోస్ట్ ప్రొడక్షన్ వసతులు, పరిశ్రమ వర్గీయుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ వసతి వగైరా అంతా అందుబాటులో ఉంచాలని యోచన. “త్వరలోనే నిర్మాణం చేపట్టి, సరికొత్త ఫిల్మ్ సిటీ కల సాకారం చేస్తాం” అని ఉదయనిధి ప్రకటించారు. నేరుగా ఇంట్లోనే రిలీజ్!ఇప్పుడు ఓటీటీలు కూడా రావడంతో అవి ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్ సినిమాలు, సిరీస్లు, షోల చిత్రీకరణ కూడా హెచ్చింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అందరినీ అలరించడమూ పెరిగింది. దక్షిణాది మీద ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న ఈ ఓటీటీ వేదికల ప్రాజెక్టులకు సైతం వసతి సౌకర్యాలు పెరగాల్సి ఉంది. అందుకోసం రానున్న కొత్త ఫిల్మ్ సిటీ వసతులు, రాష్ట్రాల ప్రత్యేక పాలసీలు ఉపకరిస్తాయి. ఆ సంగతి గ్రహించబట్టే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.థియేటర్లతో సంబంధం లేకుండా నేరుగా నట్టింటికే సినిమాను తీసుకొచ్చేసిన ఓటీటీలు ఇటీవల సులభమైన డబ్బింగ్, సబ్ టైటిల్స్ సాయంతో భాష, భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేశాయి. “కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. ఇప్పుడైనా, ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి” అని అభిమానులు ఆప్యాయంగా ‘కింగ్’ అని పిలుచుకొనే హీరో నాగార్జున సైతం ఇటీవల బాహాటంగా అన్నారు. ఉదయనిధి సైతం ఆ మాటే అంటూ, “కథను ఎలా చెప్పాలి, ప్రజలకు ఎలా చేరువ చేయాలి అన్న దానికి కమలహాసన్ సార్ గొప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినీరంగంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఓటీటీలు ఏవీ రాక ముందే, పుష్కరకాలం క్రితమే 2013 లోనే ఆయన తన (‘విశ్వరూపమ్’) చిత్రాన్ని డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) రిలీజ్ చేశారు” అని గుర్తు చేశారు.కరోనా కాలంలో థియేటర్లు మూసివేతలో ఉండడంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు తమదైన ప్రత్యేకత చాటాలని ‘జియో-హాట్ స్టార్’, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలు తమ ఒరిజినల్స్ ద్వారా చేస్తున్నది అదే. అవి నేరుగా వీక్షకుడి నట్టింటిలోకే తమ కొత్త సినిమా, సిరీస్, షోలను అందిస్తున్నాయి. వినోద రంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. థియేటర్లలో రిలీజయ్యే కొత్త సినిమాకు సైతం పోటీ అవుతున్నాయి. అయితే, ఓటీటీ కొత్త ద్వారాలు తెరిచింది. ఉదయనిధి అభిప్రాయపడినట్టు, “ఇవాళ ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదికలు వచ్చి, సినిమా స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని అనుకుంటే పొరపాటు. నిజానికి, సినీ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. కొత్త తరహా కథలు, కథనరీతులు, ఇంతకాలం లోకానికి వినిపించని అనేక గొంతులకు ఓటీటీ జాగా ఇస్తోంది.”ఈ కొత్త అవకాశాన్నీ, అందుబాటులో ఉన్న స్థానాన్నీ ఓటీటీలు తమ ఒరిజినల్స్ ద్వారా ఎంతవరకు అందిపుచ్చుకుంటాయో చూడాలి. వాటికి తగిన వాతావరణాన్నీ, వసతులనూ కల్పిస్తే... సొంత గడ్డపై సరికొత్త ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల దృష్టి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ‘జియో – హాట్స్టార్’ ప్రతిపాదనకు తమిళనాడు సై అన్నా, ‘ఐఫా’తో తెలంగాణ జట్టు కట్టినా అందరూ ఈ ‘ఆరెంజ్ ఎకానమీ’ కోసమే మరి!-రెంటాల జయదేవ -
టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు.. గత పదేళ్లలో ఏ సినిమాలంటే?
మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్బస్టర్ హిట్ కొడుతున్న టాలీవుడ్.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.బాహుబలి-2 ప్రభంజనం.. గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది.బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 రికార్డ్..గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్ చూస్తే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ ఈ రికార్డ్ బ్రేక్ అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.'ఏఐ నాన్సెన్స్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
'కేడీ' దర్శకుడు కన్నుమూత
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం (డిసెంబర్ 17న) ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. కిరణ్ కుమార్ను అందరూ ఆప్యాయంగా కేకే అని పిలుచుకుంటారు. కేకే దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగ్ ఆన్సరిదే -
చికిరి చికిరి 100M వ్యూస్..
-
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడంటూ గత కొన్నినెలలుగా ప్రచారం ఊపందుకుంది. మొదట్లో నాగచైతన్య- శోభిత పేరెంట్స్ కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, అదంతా ఉట్టిదేనని శోభిత టీమ్ కొట్టిపారేసింది. కొన్నిరోజులుగా అఖిల్-జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల్ కానీ, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు.టైం వచ్చినప్పుడు చెప్తా..ఈ క్రమంలో ఓ హెల్త్ ఈవెంట్కు వచ్చిన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.. నిజమేనా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకాయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని పేర్కొన్నాడు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.15 ఏళ్లుగా సమస్యఇకపోతే ఇదే ఈవెంట్ అనంతరం నాగార్జున తన మోకాలి నొప్పి గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా మోకాలినొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవాలనుకోలేదు. కాకపోతే మోకాలు బెటర్ అయ్యేందుకు లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. వైద్యులు పీఆర్పీ (ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా) చేశారు. ఒక్కోసారి నాకు నొప్పి లేకపోయినా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేశాను. దాన్ని అసలు వదిలేయలేదు. అలా మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. -
నేను పెళ్లి చేసుకోలేదు: మెహరీన్
‘‘నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు’’ అంటూ హీరోయిన్ మెహరీన్ స్పష్టం చేశారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’(2016) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు మెహరీన్. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనుకున్నారంతా.ఆ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మెహరీన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ న్యూస్పై మోహరీన్ స్పందించి, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని ఆంగ్ల వెబ్సైట్స్లో ఆర్టికల్స్ వచ్చాయి. అందులోనూ నాకు తెలియని, ఎప్పుడూ కలవని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు.నా వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. నా వివాహం విషయంలో రెండేళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో నిజం చెప్పక తప్పలేదనిపించింది. నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు.. నన్ను నమ్మండి. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెబుతాను.. ప్రామిస్’’ అంటూ పేర్కొన్నారు మెహరీన్. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
అది చాలా గొప్ప అనుభూతి: బోయపాటి శ్రీను
‘‘అఖండ 2 తాండవం’ని పవర్ఫుల్గా అన్ని వాణిజ్య అంశాలతో తీశాం. థియేటర్స్లో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది... గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అఖండ 2’ భారత దేశం ఆత్మ లాంటిది.అందరికీ చేరాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది... డబ్బు కోసం తీయలేదు. మా సినిమా విడుదల వాయిదా పడినప్పుడు బాలకృష్ణగారి ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకుంటారా? అనిపించింది. అంతేకానీ రిలీజ్ పోస్ట్పోన్ కావడం గురించి మేం భయపడలేదు. మా సినిమా ఆడుతున్న థియేటర్స్కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు నిలబడి విజిల్స్, క్లాప్స్ కొట్టడం, చేతులెత్తి దండం పెట్టడం చూశాను. మాకిది చాలా గొప్ప అనుభూతి. ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి మా సినిమాలో చెప్పాం. ‘అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్’... ఇవన్నీ సృష్టించిన పాత్రలు.కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకంత ఘనమైన చరిత్ర ఉంది. మా సినిమా కర్ణాటక, చెన్నై, హిందీలోనూ ఉర్రూతలూగిస్తోంది. మా మూవీ రెవెన్యూ స్ట్రాంగ్గా ఉంది. అయితే హిందీలో థియేటర్ల కొరత ఉంది. మా సినిమాని సెప్టెంబరు 25న రిలీజ్ అన్నాం. అయితే అప్పుడు ‘ఓజీ’ సినిమా ఉండటంతో డిసెంబరులో రిలీజ్ చేశాం. ‘అఖండ 2’ త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు ఒక్కసారి చూపిస్తే మరోసారి వెళ్దామంటారు’’ అని చెప్పారు. -
చికిరి రికార్డ్
‘చికిరి చికిరి...’ అంటూ ‘పెద్ది’ సినిమా లో రామ్చరణ్ వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన నెలలోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని, అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఓ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నవంబరులో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.చాంపియన్కి అతిథిగా... రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నెల 18న జరగనున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని యూనిట్ ప్రకటించింది. -
బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు. -
అందరూ కలిసి ప్రేక్షకుడిని దూరం చేసుకుంటున్నారా?
గత కొన్నేళ్లలో టాలీవుడ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మార్కెట్లో మనోళ్లు పోటీపడుతున్నారు. పోటీపడితే పర్లేదు కానీ దీని మోజులో పడి అయిన కాడికి బడ్జెట్, రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఇది తప్పితే ప్రేక్షకుడి గురించి ఒక్కరూ ఆలోచించట్లేదు. చూస్తుంటే ఇది భవిష్యత్తులో టాలీవుడ్కి సంకటంలా మారనుందా అనే సందేహం కలుగుతోంది.టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏడాది మొత్తంలో సరాసరిగా 250-300 సినిమాలు రిలీజైతే వీటిలో 10-20 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఎవరు ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. కానీ అటు హీరోలకు గానీ ఇటు దర్శకనిర్మాతలకు గానీ ఈ విషయం అర్థం కావట్లేదా అనిపిస్తుంది.ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్ గానీ టికెట్ రేట్లు గానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో.. మూవీస్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. హీరోలకు పదుల కోట్లు లేదంటే వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. నిర్మాణానికీ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. ఇంతా చేసి హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పదిలో ఒకటో రెండు మాత్రమే హిట్ అవుతున్నాయి. వీటికి కూడా పెట్టిన డబ్బులు తిరిగి వస్తున్నాయి గానీ పెద్దగా లాభాలు మాత్రం రావట్లేదు. అటు సినిమాలు హిట్ కాక, ఇటు అప్పులు పెరిగిపోతుండటం కలవరపరిచే విషయం.టికెట్ రేట్లు అయితే ఎప్పటికప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు టికెట్ రేట్లు రూ.50, రూ.100, రూ.150.. ఇలా అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు అంటూ ట్రెండ్ మొదలైందో వీటికోసం రేట్లలో పెంపు అడుగుతున్నారు. ప్రీమియర్లకు అయితే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుని మరీ వందలు, వేల రూపాయలు రేట్లు పెట్టుకుంటున్నారు. అభిమానులు.. తమ హీరో మూవీ కలెక్షన్స్ ఎక్కడ తగ్గిపోతాయోనని నామోషీ వల్లనో ఏమో గానీ ఇంతింత రేట్లు పెట్టి థియేటర్లకు వెళ్తారు. మరి సామాన్య ప్రేక్షకుడు కొనుగోలు చేస్తాడా అంటే సందేహమే.ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. థియేటర్లలో టికెట్ రేట్లు, తినుబండారాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. దీనికి బదులు ఇందులో కొత్త మొత్తం పెట్టి ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు అది కూడా బాగుందనే టాక్ వస్తే వెళ్తున్నారు. చిన్న చిత్రాలకైతే బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప ఆడియెన్స్.. థియేటర్ ముఖం చూడట్లేదు. ఒకప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకేలా టికెట్ రేటు ఉండేది. ఇప్పుడు అంతరం కనిపిస్తోంది. ప్రేక్షకుడు కూడా చూడాలా వద్దా అనే విషయంలో అంతరం చూపిస్తున్నాడు. -
'నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు'.. రూమర్స్పై టాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీమామ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ సరసన కనిపించింది.అయితే సినీతారలపై రూమర్స్ రావడం సహజం. డేటింగ్, పెళ్లి అంటూ ఎప్పుడో ఒకసారి రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మెహరీన్పై కూడా అలాగే వదంతులు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో మెహరీన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలిపోయింది. అప్పటి నుంచి మెహరీన్ సినిమాలతో బిజీ అయిపోయింది.అయితే తాజాగా మరోసారి మెహరీన్ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. దీంతో మెహరీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకపోయినా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేవలం డబ్బుల కోసం పనికిమాలిన వార్తలతో జర్నలిజం పూర్తిగా దెబ్బతినిందని మెహరీన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ విషయంపై రెండు ఏళ్లుగా మౌనంగా ఉన్నానని.. నిరంతరం ఇలాంటి వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.తాను ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాశారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడు కలవని వ్యక్తితో పెళ్లయిందని రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.. నన్ను నమ్మండి అంటూ పోస్ట్ చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంటానని మెహరీన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్తో మెహరీన్ పెళ్లి రూమర్స్కు ఇక చెక్ పడినట్లే.IMPORTANT!!!Nowadays it’s bizzare how misinformation can spread without any repercussions for it. And journalism has definitely taken a hit when it comes to stupid paid articles. I’ve stayed shut about this for 2 years but because of constant harassment I choose to speak up…— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 16, 2025 -
మరోసారి పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి
సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన రవి అలియాస్ ఐబొమ్మ రవి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజులు పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకుగాను 12 రోజులు పాటు విచారించనున్నారు. ఈనెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతుంది.మరోవైపు ఇవ్వాళ కొనసాగిన విచారణలోనే రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం.. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్వర్క్ బయటపడుతుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీని ద్వారానే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇందుకోసం కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. -
డేంజర్ జోన్లో 'రామ్ పోతినేని' కెరీర్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సరైన విజయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ (2019) విజయం తర్వాత తనకు సరైన హిట్ దక్కలేదు. రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఏదీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. రీసెంట్గా విడుదలైన ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, పట్టుమని రెండు వారాలైన గట్టిగా థియేటర్స్లో రన్ కాలేకపోయింది. ప్రస్తుతం రామ్ 40ఏళ్లకు దగ్గర్లో ఉన్నాడు. కొద్దిరోజులుగా తన పెళ్లి వార్తలు కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్ కూడా పెద్దగా చెప్పుకునే విధంగా లేదు. ఇలాంటి సమయంలో ఆయన నిర్ణయం ఎటూ అనేది తేల్చుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి. స్కంద వంటి మాస్ సినిమాను కూడా జనం చూడలేదు. డబుల్ ఇస్మార్ట్ అని చెప్పినా సరే థియేటర్ వైపు ప్రేక్షకులు చూడలేదు. సరే అని ఆంధ్రా కింగ్ తాలుకా అంటూ కొత్త ప్రయత్నం చేస్తే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, ప్రేక్షకులు లేరు. దీనికి కారణం తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ మూవీ కోసం మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. చివరకు నష్టాలను చూసింది. ఇప్పుడు రామ్ ఎలాంటి సినిమా తీస్తే జనాలు చూస్తారనే క్లారిటీ కూడా లేదు. కథ పరంగా ఎలాంటి జోనర్ టచ్ చేసినా సరే.. ఫెయిల్యూర్ వెంటాడుతూనే ఉంది. ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ లేవు. వరుస పరాజయాల కారణంగా తన సినిమాలకు థియేటర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక హీరోకు కనీసం రూ. 20 కోట్లు కలెక్షన్స్ కూడా రాకుంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓటీటీ మార్కెట్ సంగతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వార్2తో ఎన్టీఆర్, గేమ్ ఛేంజర్ చిత్రంతో రామ్ చరణ్ కూడా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కానీ, వారికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో త్వరగానే బౌన్స్బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, రామ్ పోతినేనికి బలమైన కథతో పాటు సరైన దర్శకుడు దొరికితేనే నిలిదొక్కుకునే అవకాశం ఉంది. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్ట్రాక్లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్తో పాటు తనూజ-కల్యాణ్ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్మేట్స్తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్బాస్లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
లిఫ్ట్ ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు దర్శకుడు కీర్తన్ కుమారుడు సోనార్ష్ మరణించారు. పొరపాటున లిఫ్ట్లో ఇరుక్కోవడం వల్ల చిన్నారి సోనార్ష్ ప్రాణాలు కోల్పోయాడు. పలువురు సినీ ప్రముఖులు చిన్నారికి నివాళులు అర్పిస్తూ.. కీర్తన్, సమృద్ధి దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కేజీఎఫ్ వంటి హిట్ సినిమాకు ప్రశాంత్ నీల్ వద్ద సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కీర్తన్ పనిచేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హారర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు. View this post on Instagram A post shared by Samrudhi Patel Nadagouda (@samrudhikirtan) -
రూ. 100 కోట్ల క్లబ్ చేరువలో 'మమ్ముట్టి' సినిమా
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరో భారీ హిట్ అందుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన హీరోగానే కాకుండా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతోనూ మెప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘కలాంకావల్’(Kalamkaval)లో తాను విలన్ పాత్రలో నటించారు. డిసెంబర్ 5న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరనుంది.ఈ ఏడాది ప్రారంభంలో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్ సినిమాతో మెప్పించిన మమ్ముట్టి(Mammootty) ఇప్పుడు కలాంకావల్(Kalamkaval) అనే మూవీతో భారీ విజయం అందుకున్నారు. ఎప్పుడూ కూడా వైవిధ్యమైన పాత్రలతో, కథలతో మమ్ముట్టి ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. ఈ చిత్రంలో కూడా ఆయన మానసిక రోగి పాత్రను పోషించారు. దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విమర్శకులు, ప్రేక్షకుల నుండి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. రెండు వారాలకు గాను ‘కలాంకావల్’ చిత్రం కేవలం మలయాళంలోనే రూ. 75 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చాలా థియేటర్స్లో మంచి కలెక్షన్స్తో రన్ అవుతుంది. దీంతో మరో వారంలోపు రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘కలాంకావల్’లో వినాయకన్, మీరా జాస్మిన్, జిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్కు రానుంది. -
బాబీ సింహా,హెబ్బా పటేల్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా దుమ్మురేపారు.థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది. అనంతరం అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.థామా స్టోరీ ఏంటి..?'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్ పార్టీ ఫ్యాషన్ షో..మెరిసిన సెలబ్రిటీలు (ఫొటోలు)
-
విశాఖపట్నంలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
ఖైదీ– 2కి శ్రీకారం ఎప్పుడో..?
తమిళసినిమా: కొన్ని చిత్రాలు ఎప్పుడు తెరకెక్కుతాయో తెలియదు. అదే విధంగా కొన్ని చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇటీవల నటుడు కార్తీ నటించిన, నటించనున్న చిత్రాల పరిస్ధితి ఇలానే ఉంది. కార్తీ హీరోగా లోకేశ్కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి భారీ చిత్రం ఖైదీ. ఈ చిత్రంలో ముందు వేరే చిన్న నటుడు నటించాల్సి ఉంది. అయితే నిర్మాతలు అందులో నటుడు కార్తీ నటిస్తే చిత్రం పెద్దది అవుతుందని, ఆయన్ని నటింపజేశారు. ఆ చిత్రం సంచనలన విజయాన్ని సాధించింది. దీంతో అప్పుడే ఖైదీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్, నటుడు కార్తీ ఇతర చిత్రాలతో బిజీ అవడంతో ఖైదీ– 2 ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. అయితే త్వరలోనే మొదలవుతుందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిపై రకరకాల ట్రోలింగ్స్ వైరల్ అయ్యాయి. అదే విధంగా ఆయన కూడా హీరోగా అవతారమెత్తారు. ఆ చిత్రం తరుదాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఖైదీ– 2 చిత్రం గురించి నటుడు కార్తీ ఓ భేటీలో పేర్కొంటూ ఆ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఈయన నటించిన తాజా చిత్రం వా వాద్ధియార్ ఈ నెల12న విడుదల కావలసి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదల వాయిదా పడింది. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. -
యాక్టర్ని చాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది: బాబీ సింహా
బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ ఇచ్చారు. తనికెళ్ళ భరణి మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు.ఈ సందర్భంగా బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘యాక్టర్ని చాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. ఈ చిత్రంలోని తాత పాత్రలో భరణిగారు నటిస్తున్నారని తెలిసి, హ్యాపీ ఫీలయ్యాను. యువ ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్’’ అని చెప్పారు. ‘‘దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను’’ అన్నారు మోహర్. ‘‘నా స్నేహితుడు మెహర్ చెప్పిన ఈ కథ వినగానే నాకు బాబీ సింహాగారే గుర్తొచ్చారు. కథ నచ్చి, ఈ సినిమా చేస్తానని బాబీగారు చెప్పడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని తెలిపారు యువకృష్ణ. ‘‘బాబీ సింహాకి ఇది చాలెంజింగ్ స్క్రిప్ట్’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ సినిమాకు సంగీతం: సిద్ధార్థ సదాశివుని. -
గుమ్మడికాయ కొట్టారు
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య 46’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల యూరప్లో ఓ భారీ షెడ్యూల్ జరిపారు.ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన మరో కీలక షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
అడివి శేష్ డకాయిట్.. ఒకే రోజు రెండు భాషల్లో రిలీజ్..!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్'. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్ను పంచుకుంది.ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్లో హిందీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో జరిగే ఈవెంట్లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 2 LANGUAGES. 2 TEASERS.2 CITIES.Gear up for the #DacoitTeaser on December 18th ❤🔥Grand launch event at Gaiety Galaxy, Mumbai from 11 AM onwards on Dec 18th 🤩Media Meet & Greet event at AAA Cinemas, Hyderabad from 6.30 PM onwards on Dec 18th 💥#DACOIT GRAND RELEASE… pic.twitter.com/KuHsIamvIs— Annapurna Studios (@AnnapurnaStdios) December 15, 2025 -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. టైటిల్ రివీల్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అనే టైటిల్ ఖరారు చేశారు. మొత్తానికి హీరో పేరుతోనే మూవీ టైటిల్ పెట్టడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
మన సికింద్రాబాద్లో పుట్టిన డైరెక్టర్.. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు..!
డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడాయన. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో సినిమాకి ఊపిరి పోసిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ శ్యామ్ సుందర రావు. మన సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో డిసెంబరు 14, 1934న జన్మించారు. మన దేశ సినీ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనెగల్ దర్శకత్వంపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.శ్యామ్ బెనెగల్.. మొదట యాడ్ ఏటెన్సీలో కాపీ రైటర్గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా సినిమా వైపు మళ్లింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తన ఆలోచనలు ఉండేవి. జీవితాన్ని, సమాజంలోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనే ఆశయంతో శ్యామ్ బెనెగల్ సినీరంగంలో అడుగుపెట్టారు. హైదరాబాద్లో ఫిలిమ్ సొసైటీ ప్రారంభించిన ఏకైక వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని.. సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారాయన. శ్యామ్ బెనెగల్ అంకుర్ సినిమాతో తన ప్రస్థానం మొదలెట్టారు. ఆ తర్వాత మంథన్, నిశాంత్, గరమ్ హవా, భూమిక ది రోల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం..శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో శ్యామ్ బెనెగల్లో కనిపించింది. సికింద్రాబాద్లో పుట్టి పెరగడం వల్ల రైతులు, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. సినిమాలు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడాలి ఎప్పుడు అనుకునేవారు శ్యామ్ బెనెగల్. ముఖ్యంగా శ్యామ్ బెనగల్(ShyamBenegal)తన సినిమాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశాడు. అంకుర్(1974)తో మొదలెట్టి జుబేదా (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. ముస్లిమ్ మహిళల జీవితాలను స్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు తెరకెక్కింటారు. వెండితెరపై ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎప్పుడు కొత్తవారికే ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలతో గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో అనుగ్రహంలో వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా మన దేశం కోసం ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద డాక్యుమెంటరీ, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాను భారత్ ఏక్ ఖోజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మేకింగ్ ఆఫ్ మహాత్మా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు కేవలం బాక్సాఫీస్ సంఖ్యలు మాత్రే కాదు.. అంతకు మించి అని అందరూ చెప్పడం ఆయన టాలెంట్కు ఓ నిదర్శనం.ఎనిమిది జాతీయ అవార్డులు...శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి అంకుర్(1975), నిశాంత్(1976), మంథన్ (1977), భూమిక: ది రోల్(1978), జునూన్(1979), ఆరోహణ్(1982), నేతాజీ సుభాష్ చంద్రబోస్(2005), వెల్డన్ అబ్బా(2009) చిత్రాలకు దక్కాయి. ఆయనకు సినీ రంగంలో సేవలకు గానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తెలుగు సినిమా అనుగ్రహంకు నంది అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్లో అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి లాంటి గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయే చేసిన డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కావడం విశేషం. -
దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?
సినిమాల్లో బయోపిక్స్ కొత్తేం కాదు. నాలుగైదేళ్ల ముందు విపరీతంగా వచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ మారిపోవడంతో అప్పుడప్పుడు జీవితకథల్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ బయోపిక్ అంటే చాలామంది చెప్పే మాట 'మహానటి'. ఇది తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్లో మరో క్రేజీ బయోపిక్కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ్'లో సీతగా చేస్తున్న సాయిపల్లవి.. త్వరలో తెలుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తీయబోయే ఓ బయోపిక్లో నటించబోతుందని తాజాగా రూమర్స్ వస్తున్నాయి. అదే దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితకథ. సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి కనిపించనుందనే విషయం.. సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రకటన వచ్చే అవకాశముందని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది రూమర్ మాత్రమేనా లేదంటే నిజమా అనేది కొన్నిరోజులు క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ తీస్తే ఏమేం చూపిస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే సుబ్బలక్ష్మి అంటే కేవలం సింగర్ మాత్రమే కాదు. అంతకు మించిన గుర్తింపు దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈమె బయోపిక్ అంటే ఏం చూపిస్తారు? ఎలా తీస్తారనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. తమిళనాడులోని మధురైలో 1916లో పుట్టారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో 'భారతరత్న' పొందిన తొలి సంగీత విద్వాంసురాలు, రామన్ మెగసెసే అవార్డును అందుకున్న మొదటి భారతీయ సంగీత కళాకారిణి ఈమెనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా "భారతదేశపు నైటింగేల్"గా పేరుగాంచారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!
గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?)ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
లగ్జరీ ఇంటీరియర్ డిజైనర్ స్టూడియోలో నాగచైతన్య (ఫొటోలు)
-
కొత్త వారితో 'పతంగ్'.. ట్రైలర్ విడుదల
నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం పతంగ్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్లతో ముఖ్య తారలుగా ఇందులో నటించారు. డి. సురేష్బాబు సమర్పణలో విజయ్శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. -
అఖండ2 సినిమాపై 'సనాతని' సైలెన్స్.. ఎందుకు?
'అఖండ 2' సనాతన హైందవ ధర్మం కోసం తీసిన సినిమా అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇదీ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదంటూ.. ప్రపంచ సినిమా అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం మూలాలతో పాటు ధర్మం, గర్వం, తేజస్సు కలగలిపిన చిత్రమిదని బాలయ్య అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీలో అఖండ2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అఖండ2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరి ఏపీలో అవతరించిన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్కు అఖండ చూపించరా..? ఓజీ కోసం బాలయ్య త్యాగం చేశారు. అలాంటిది అఖండ గురించి ఒక్కమాటైన పవన్ మాట్లాడరా..? అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మాత్రమే రాజకీయాల్లో సనాతన ధర్మం చాంపియన్గా రేసులో ఉంటే.. ఇప్పుడు అఖండతో బాలయ్య క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఏమైనా సందేహం వస్తుందా…?ఈ దశాబ్దన్నర కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయం కోసం చే గువేరా, గద్దర్, పెరియార్ రామస్వామి వంటి విప్లవకారుల అభిమానిగా గతంలో తాను చెప్పుకుని యువతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అయితే, సందర్భం ఏదైనా సరే పవన్ నోటి నుంచి వచ్చే మొదటి మాట సనాతన ధర్మం.. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దాని విలువలు ఏమిటో కూడా తెలియదు. కేవలం తన రాజకీయ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఓపెన్గానే చెబుతుంటారు. మరి అఖండ సినిమా కూడా సనాతన హైందవ ధర్మం కోసం తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాలయ్య ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు కూడా సినిమా చూసి బాగుందని సనాతన హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చూపించారని మెచ్చుకుంటున్నారు. కొన్ని వీడియో క్లింప్స్ కూడా షేర్ చేస్తూ బాలయ్య, బోయపాటిని అభినందిస్తున్నారు. కానీ, సనాతన బోధనలు చెప్పే పవన్ కల్యాణ్ మాత్రం కనీసం ట్వీట్ కూడా వేయలేకపోయారు.అఖండపై పవన్ కల్యాణ్ మౌనం గురించి సోషల్మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అతను తరచుగా తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముద్ర వేసుకుంటారని అలాంటింది అఖండ గురించి ఎందుకు స్పందించడంలేదని నెట్టింట చర్చ జరుగుతుంది. మరోవైపు అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు. సనాతన ధర్మంతో సంబంధం ఉన్న మరికొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు. కానీ, పవన్ నుంచి నో కామెంట్.. కనీసం తన సినిమా ఓజీ కోసం అఖండను వాయిదా వేసుకున్నందుకైనా కృతజ్ఞతగా పవన్ స్పందించలేదు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగం. దీంతో అతని మౌనం మరింత చర్చనియాంశంగా మారింది. సనాతన ధర్మం కోసం తీసిన ఒక సినిమాపై అతని స్పందన లేదా ప్రమోషన్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీని వల్ల బాలకృష్ణ అభిమానులు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అఖండ గురించి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ షేర్ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తీసిన సినిమాను చూడమని ప్రేక్షకులను ఎందుకు ప్రోత్సహించడం లేదని బహిరంగంగానే వారు ప్రశ్నించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ మౌనం వెనుక ఏదైనా లెక్క ఉందా..? అనేది వారికే తెలియాలి. -
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి మిచెల్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజిల్స్లోని తమ నివాసంలో వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వారిద్దరిని చూసి అభిమానులు చలించిపోయారు. శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడింది వారి కుమారుడు నిక్ రైడర్ అని అమెరికా వార్తా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగించే వాడినని నిక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి దర్శకత్వంలో నిక్ ఒక సినిమాలో కూడా నటించి ప్రశంసలు పొందాడు. అయితే, తన తల్లిదండ్రులనే హత్య చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. రాబ్ రైనర్ గత ఐదు దశాబ్దాలకు పైగా హాలీవుడ్లో ఉన్నారు. ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు కూడా లభించాయి. వెన్ హ్యారీ మెట్ సాలీ , స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, తదితర సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు. -
బిజినెస్ మేన్గా ఏషియన్ సినిమాస్తో మహేశ్ బాబు.. నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి?
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్తో కలిసి AMB బ్రాండ్ను క్రియేట్ చేశారు. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత కొత్త థియేటర్లు ఇతర నగరాల్లో కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో AMB సినిమాస్ ఉంది.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో AMB క్లాసిక్ నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం హకీంపేట్లో కొత్త థియేటర్ నిర్మాణం జరుగుతోంది. 2027లో ప్రారంభం అవుతుందని అంచనా.. అయితే, మహేష్ బాబు తన ప్లాన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయనున్నారు. మహేష్బాబు వేసిన దారిలో అల్లు అర్జున్ (AAA సినిమాస్), విజయ్ దేవరకొండ (AVD సినిమాస్), రవితేజ (ART సినిమాస్) వంటి స్టార్స్ కూడా అడుగులు వేస్తున్నారు. అయితే, మహేష్ మాత్రం ఈ రంగంలో చాలా దూకుడుగా ఉన్నారు. మొదట మెట్రో నగరాలను టార్గెట్ చేసిన ఆయన త్వరలో విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మహేష్ ప్లాన్ చేస్తున్న మూడో ప్రాజెక్ట్ హకీంపేట్(AMB Hakimpet)లో రానుంది. అక్కడ ఐమాక్స్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా టాప్ రేంజ్ మల్టీఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్న మహేష్ బెంగళూరులో కొత్త ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేశారు. కపాలి థియేటర్ ప్రాంగణంలో AMB Cinemas Kapali త్వరలో ఓపెన్ కానుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సినిమాను బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ బ్రాండ్గా AMB నిలవనుంది.మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్తో కలిసి AMB Cinemasను లగ్జరీ బ్రాండ్గా రూపొందించారు. 7 స్టార్ లగ్జరీ, 7 3D స్క్రీన్స్, Dolby Atmos సౌండ్ సిస్టమ్తో గోవా, చెన్నై వంటి నగరాల్లో కూడా విస్తరణ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ డాల్బీ అట్మాస్, IMAX వంటి cutting-edge టెక్నాలజీని తీసుకువస్తున్నారు. -
దిల్ రాజు కూతరు మేకప్ స్టూడియో.. చీఫ్ గెస్ట్గా అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
-
‘పతంగ్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
నువ్వు నాకు నచ్చావ్ రీరిలీజ్ మాత్రమే కాదు!
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కె విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్తో ప్రపంచవ్యాప్తగా రీరిలీజ్ చేయనున్నట్లుగా స్రవంతి రవికిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీరిలీజ్ కాదు, నూతన సంవత్సరాన్ని (2026 జనవరి 1) కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని చెప్పారు. A story that made generations smile and continues to touch hearts across ages! ❤️A True Masterpiece in Telugu cinema, #NuvvuNaakuNachav returns with a theatrical re-release on Jan 1st, 2026! A #Trivikram Writings.Overseas Release by @PrathyangiraUS @VenkyMama… pic.twitter.com/RvFCMZOa0j— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 14, 2025 -
అత్యధిక రెమ్యునరేషన్తో 'బిగ్బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
బిగ్బాస్ తెలుగు సీజన్-9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్-5 ఎవరనేది తేలిపోయింది. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేసులో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే, శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే, రీఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు.ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్గా వచ్చినట్లు సమాచారం. కానీ, భరణి 8వ వారంలో హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరు వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో రూ. 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రూ. 42లక్షలు రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్గా భరణి రికార్డ్ క్రియేట్ చేశారు. -
‘అఖండ 2: తాండవం’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
రెజీనాకు మరోసారి ఛాన్స్ ఇస్తున్న స్టార్ హీరో
అజిత్ తన 64వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్ట్రేలియాలో జరుగుతున్న అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అజిత్ ఇంతకుముందు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత కార్ రేస్ పోటీల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మరోపక్క ఈయన నటించనున్న తన 64వ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీలతోపాటు మరో నాయకి కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె ఎవరో కాదు రెజీనా. ఈమె ఇంతకుముందు అజిత్తో కలిసి విడాముయర్చి చిత్రంలో నటించారన్నది గమనార్హం. అందులో ఆమె ప్రతినాయకి పాత్రలో నటించారు. అలాంటిది తాజా చిత్రంలో రెజీనా పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నది గమనార్హం. -
బాలు తొలి పాటకు అరవై ఏళ్లు
‘నా పాట పంచామృతం’ అన్న బాలు వాక్కులు నిజంగానే ‘బ్రాహ్మి’ (సరస్వతి) వాక్కులే!! నెల్లూరు జిల్లాలో కోనేటం పేటలో పుట్టిన ఈ బాలుడు పాటల కోనేటిరాయడై అఖిల భారతీయుల అభిమానాన్ని చూరగొంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలు సైతం సినీ గాయకుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఆయనను ఇంజనీర్గా చూడాలనేది తండ్రి సాంబమూర్తి కల. కానీ ఆ కలకు భిన్నంగా బాలు తన ప్రతి భతో పాటల ఇంజనీరింగ్నే మార్చి ఆరు దశాబ్దాలు అప్రతిహతంగా సినీ సంగీత ప్రపంచానికి రారాజు అయ్యారు.కలయా... నిజమా....1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో బాలు ప్రతిభను మరో సంగీతదర్శకుడు ఎస్.పి. కోదండపాణి గమనించి, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి బాలు కొన్నాళ్లు ఎదురు చూశారు. ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ప్రవేశించారు కానీ సినీరంగ ప్రవేశం మాత్రం జరగలేదు. బాలు కూడా క్రమంగా ఆ విషయం మరచిపోయారు. ఓ రోజు కోదండపాణి హడావుడిగా వచ్చి, బాలు గది తలుపు తట్టి, ‘ఏమయ్యా పంతులూ... నీ అడ్రస్ ఇవ్వకపోతివి... చాలా కాలంగా నీ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఉంటివా’ అని చీవాట్లు వేసి ‘పద్మనాభం ఓ సినిమా తీయబోతున్నారు. పాట పాడడానికి నీకు అవకాశమిస్తాను... ఎ.వి.ఎం స్టూడియోలో రికార్డింగ్ ఉంది’ అని చిరునామా వివరాలు ఇచ్చి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. బాలుకు తల గిర్రున తిరిగింది... తనేంటి? కలయా... నిజమా అనుకున్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది... తన ఫ్రెండ్ మురళితో కలిసి బాలు సైకిల్ పై ఎ.వి.ఎం. స్టూడియోకి వెళ్ళారు.గేటు దగ్గరే నిలబెట్టేశాడుగేట్మేన్ బాలును ఆపి లోనికి పోవడానికి వీల్లేదని, నీలాంటి వారు రోజూ ఇలాగే వస్తుంటారని అడ్డుకున్నాడు. గేటు దగ్గరే నిలబెట్టేశాడు. చివరికి కనీసం మురళినైనా లోపలికి పంపించి, కోదండపాణిగారికి తను వచ్చిన విషయం చెప్పండని, ఒకవేళ ఆయన రావద్దంటే తిరిగి వెళ్లిపోతామని బాలు అనగానే గేట్మేన్ అంగీకరించి, మురళిని అనుమతించగానే ఆయన వెళ్లి కోదండపాణికి విషయం చెప్పడం, ఆయన స్వయంగా గేటు వద్దకు వచ్చి గేట్ మేన్ను తిట్టి బాలును లోనికి తీసుకెళ్ళడం జరిగింది.రావే కావ్య సుమబాల...ఆ రోజు 15 డిసెంబర్ 1966... మధ్యాహ్నం 2.30 ని.లకు బాలు తొలిసారిగా తన గళం విప్పారు. నటుడు, నిర్మాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం అది. వీటూరి రాసిన ‘ఏమి ఈ వింతమోహం’ పాటను సుశీల, పీబీ శ్రీనివాస్, కె. రఘురామయ్య వంటి ఉద్దండ గాయకులతో కలిసి పాడారు. అది ఘంటసాల పాడాల్సిన వెర్షన్. ఆయన బదులు కొత్తవాడైన బాలు పాడ టం పద్మనాభానికి ఇష్టం లేదు. ఆ పాట కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్, రామకృష్ణ, రాజశ్రీ వంటి తారలపై చిత్రించే మల్టీ స్టార్ సాంగ్ కావడం వలన ఆయన ఒప్పుకోలేదు. ఘంటసాల అనారోగ్యం వలన బాలుతో పాడిస్తున్నానని, ఒకవేళ బాగా లేకుంటే మళ్ళీ ఘంటసాలతో పాడిద్దామని కోదండపాణి ఒప్పించి రికార్డింగ్ పూర్తి చేశారు. వందకు పైచిలుకు వాద్యకారులున్న ఆర్కెస్ట్రా అది. ఆరు నిమిషాల రాగమాలికైన ఆ పాటలో కల్యాణి రాగంలో కంపోజ్ చేసిన ‘రావే కావ్య సుమబాల’ అనే చరణాన్ని బాలు పాడారు. బాలు పాడిన చరణాన్ని తెరపై శోభన్బాబు అభినయించారు. మరునాడు ఘంటసాలను ఆహ్వానించి, ఆ పాటను వినిపించగానే, ఆ మహానుభావుడు ఎంతో ఆనందించారు.అబ్బాయి బాగా పాడాడు...‘అబ్బాయి బాగా పాడాడు... ఎవరినీ అనుకరించలేదు... ఎంతో సహజంగా పాడాడు... ప్రతి సంగతిని చక్కగా వేశాడు. నేను పాడక్కరలేదు... ఈ పాటను ఇలాగే ఉంచండి..’ అని చెప్పి కొత్త గొంతును పరిచయం చేసినందుకు అభినందించారు. ఘంటసాల మాటలకు పద్మనాభం ఎంతో సంతోషించి, బాలుకు అదే చిత్రంలో మరో పాటను, పద్యాన్ని పాడడానికి అవకాశం ఇవ్వడం విశేషం.ఘంటసాలకు సిసలైన వారసుడుబాలు పాడిన మొదటి పాట రికార్డుని తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు వినిపించి, అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. తొలి పాట పాడాక బాలుకు వెంటనే రెండవ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఎం.ఎస్. రెడ్డి. ఆయన ‘కాలచక్రం’ అనే తమిళ డబ్బింగ్ సినిమాలో పాడించారు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు బాలు. అందుకే అమర గాయకుడు ఘంటసాల ‘తన తరువాత బాలు మాత్రమే తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడు’ అని చెప్పిన జోస్యాన్ని బాలు నిజంగానే నిరూపించుకున్నారు. ఘంటసాల తెలుగు మినహా వేరే భాషల్లో పాడలేదు. బాలు దేశంలోని దాదాపు భాషలలో పాడి, లక్షలాది అభిమానులను సంపాదించుకొన్నారు.శంకరాభరణంతో...బాలు 1966 నుండి సినిమాలలో పాడుతున్నప్పటికీ ఆయన శాస్త్రీయ గీతాలను సైతం సశాస్త్రీయంగా పాడగలరని నిరూపించిన చిత్రం ‘శంకరాభరణం’ (1980). దానికి ముందు ఘంటసాల జీవించిన కాలంలో బాలుకు ఎక్కువ శాతం రొమాంటిక్ పాటలు పాడడానికే ఆహ్వానాలు అందేవి. అయితే కోదండపాణి తరువాత బాలులోని ప్రతిభను గుర్తించిన సంగీత దర్శకులలో సత్యం ఒకరు. హరనాథ్ హీరోగా నటించిన ‘ప్రతీకారం’ (1970) చిత్రంలో ‘నారీ రస మాధురి లహరి’ అనే పాటను సత్యం హంసానంది రాగంలో స్వరపరచి బాలుతో పాడించిన తొలి లలిత శాస్త్రీయ గీతం. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ పాట కూడా ఎవరికీ అంతగా తెలియదు.స్వర పారిజాతం‘కన్నె వయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటను బాలుతో పాడించారు సత్యం. ఆ పాట క్లాసిజానికి మురిసిన జానకి తనతో కూడా పాడించాలని పట్టు పట్టడంతో ఆమెతో కూడా పాడించారు. జానకి అంచనా నిజమైంది... ఆ పాట బాలుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, ఆయనను నిజంగా ఈ భువిలో విరిసిన స్వర పారిజాతంగా మలచింది... ఘంటసాల మరణించాక (1974) గాయకునిగా బాలు విశ్వరూపమే ప్రదర్శించారు.రోజుకి పదహారు పాటలు...‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దూజే కే లియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ‘త్యాగయ్య, అన్నమయ్య, సంగీత సామ్రాట్, భైరవ ద్వీపం’ చిత్రాలలో బాలు శాస్త్రీయ సంగీతంలో పాడిన పాటలే విమర్శకుల నోళ్ళు మూయించాయి... ఓ దశలో రోజుకు 16 పాటలు మూడు షిఫ్టులలో పాడి, బాలు తన అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు.అరుదైన రికార్డుఅలనాటి రాజేశ్వర రావు మొదలు ఆధునిక యువ సంగీత దర్శకులందరికీ బాలు ఒక ఫేవరెట్ సింగర్. బాలు తన మిమిక్రీ కళతో రాజ్ బాబు, పద్మనాభం, మాడా, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, కమల్హాసన్ తదితరుల నటుల గొంతుకలకు అతి సన్నిహితంగా పాడి భళా అనిపించుకున్నారు. 50 ఏళ్ళకు పై సినీ ప్రస్థానంలో 40 వేల పాటలకు పైగా 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. ఆయనతో కలిసి ఆయన సమక్షంలో అనేక కార్యక్రమాల్లో పాటలు పాడిన అదృష్టం ఈ వ్యాస రచయితకు కూడా ఉన్నది.ఆ స్వరాలు అజరామరంబాలు 1993 ఫిబ్రవరి 14న లలిత కళాతోరణంలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత 2003లో రవీంద్ర భారతి ప్రాంగణాన ఘంటసాల విగ్రహం స్థాపించడానికి మూల కారణమైన బాలు... ఆ మహనీయునితో కలిసి పాడుతానని కానీ మరణించిన తరువాత ఆయన విగ్రహం చెంతనే తన ప్రతిమ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు సినీ కళామ తల్లికి ఘంటసాల, బాలు రెండు కళ్ళ వంటివారు. వారు దివంగతులైనా ఆ స్వరాలు అజరామరం.– డా. వి.వి. రామారావురచయిత, గాయకుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత


