breaking news
Tollywood
-
కారులో కూర్చుని ఏడ్చేశా..: అనుపమ పరమేశ్వరన్
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన సినిమా ఇది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. అనుపమ సంగతులుఅనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, సంగీత, దర్శన, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సపోర్ట్తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన సంగతులు. కనెక్ట్ అయ్యా..‘పరదా’లాంటి కథలు తెలుగులోనే కాదు... భారతీయ సినిమాలోనూ చాలా అరుదు. ఈ తరహా ఫ్రెష్ కాన్సెప్ట్తో కూడిన కథ నా దగ్గరకు రాలేదు. అందుకే దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్గా భావిస్తాను. సవాల్గా తీసుకున్నా..ఈ చిత్రంలో చాలావరకు నేను పరదా ధరించిన సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కొన్ని సీన్స్లో సైలెంట్గానే ఉంటాను. అయితే నా పరదా వెనక నా క్యారెక్టర్ తాలూకు భావోద్వేగం కనిపిస్తుంది. నా కళ్లతో, నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్తో నేను నటించగలిగానని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను. ‘పరదా’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కారులో కూర్చుని ఏడ్చేశా..నిజానికి నేను స్విచ్చాన్, స్విచ్చాఫ్ యాక్టర్ని. అయితే ‘పరదా’ మాత్రం వెంటాడింది. నా పాత్రకు ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేశాయి. కారులో కూర్చుని ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ‘పరదా’ సినిమా పురుషులకు కాస్త వ్యతిరేకంగా ఉందన్నట్లుగా ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. విద్యాబాలన్పై ముద్రఓ హీరోయిన్ నటించిన ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. గతంలో మోహన్లాల్గారితో విద్యాబాలన్గారు చేయాల్సిన సినిమా ఒకటి ఇలాంటి కారణం (ఐరన్ లెగ్) వల్లే క్యాన్సిల్ అయ్యిందట. ఆ తర్వాత విద్యాబాలన్ చేయాల్సిన తొమ్మిది సినిమాల నుంచి ఆమెను తప్పించారట. ఇది ఎంతవరకు కరెక్ట్?అదెందుకు పట్టించుకోరు?‘పరదా’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ‘డీజే టిల్లు 2’ సినిమాలో మరో విభిన్నమైన పాత్ర చేశాను. ‘డీజే టిల్లు 2’లో నేను గ్లామరస్గా కనిపించిన విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ, అందులో నేను గన్ పట్టుకుని, యాక్షన్ చేశాను. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ అంశాలు హైలైట్ కావడం లేదు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్కు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్డే అని ట్వీట్ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్.. ఇలా తదితరులు మెగాస్టార్కు సామాజిక మాధ్యమాల్లో బర్త్డే విషెస్ చెప్పారు. Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X— Allu Arjun (@alluarjun) August 22, 2025 Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025 View this post on Instagram A post shared by Teja Sajja (@tejasajja123) Happiest b’day to the one & only Megastar @KChiruTweets garu ❤️🎊 A true crowd-puller & legend who inspires on & off screen 😊 Best wishes for #Vishwambhara, #Mega157 & all upcoming projects 🔥 #HBDMegastarChiranjeevi pic.twitter.com/qj7XBFHSz7— Vijaya Durga Productions (@VijayaDurgaProd) August 22, 2025 చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన -
మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో మంచు విష్ణు మరో అడుగు ముందుకువేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కన్నప్ప విజయం తర్వాత నటుడు, నిర్మాత విష్ణు మంచు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. అతను మైక్రోడ్రామాలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గలు చెబుతున్నాయి. విష్ణు తన సొంత డబ్బుతో పాటు కొందరి భాగస్వామ్యంతో వినోద రంగంలో సంచలనానికి తెరలేపనున్నారు. ఈ వార్త టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.మైక్రోడ్రామాలు అంటే ఏమిటి?మైక్రోడ్రామాలు అంటే చిన్న పరిమాణంలో, తక్కువ వ్యవధిలో, పరిమిత పాత్రలతో, గాఢమైన భావోద్వేగాలను వ్యక్తపరచే నాటకాలు. ఇవి సాధారణంగా 1 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఉంటాయి. ఒకే సంఘటన లేదా భావన చుట్టూ తిరుగుతాయి. సాధారణ సోషల్ మీడియా రీల్స్ మాదిరిగా కాకుండా.. ఈ కథలు ప్రొఫెషనల్ దర్శకత్వంతో పాటు అధిక-నాణ్యత నిర్మాణం ఆపై బలమైన కథ చెప్పడం వంటి అంశాలతో ఉంటాయి. విష్ణు కొత్త ప్రాజెక్ట్ భారతీయ వినోదంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయనున్నాడని కొందరు అంటున్నారు. విష్ణు నిర్ణయం వల్ల నటన, రచన, దర్శకత్వం వంటి అంశాల్లో కొత్త వారికి భారీగా ఛాన్సులు దొరుకుతాయి. ఆపై కంటెంట్ కూడా ఎక్కువగా సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉటుందని కొందరు చెబుతున్నారు. ఇది భారతీయ వినోద రంగంలో గేమ్-చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. -
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు.గురుగ్రామ్లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. -
Megastar Chiranjeevi: స్ట్రగుల్స్ నుంచి స్టార్డమ్ వరకు..!
-
#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
సంచలన దర్శకుడు, నటుడితో 'కీర్తి సురేష్' సినిమా
నటి కీర్తి సురేష్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు పలు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ, తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తెరి చిత్ర హిందీ రీమేక్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్గా విడుదలైన ఆ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే హిందీలో మరో అవకాశం మాత్రం రాలేదు. అదే సమయంలో తన చిరకాల మిత్రుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏ భాషలోనూ మరో చిత్రంలో నటించలేదు. ఇది ఆమె కావాలని తీసుకున్న బ్రేకా లేక అవకాశాలు రాక అన్నది తెలియదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని మరి అందమైన ఫోటోలను తీయించుకొని వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనంద పరుస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే సంచలన దర్శకుడు, నటుడు మిష్కిన్తో కలిసి ఈ కొత్త చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి ఆయన కథ మాత్రమే అందించడమే కాకుండా కీర్తి సురుష్తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్, పిశాచి వంటి హిట్ సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమాలో ప్రోఫెసర్గా మిస్కిన్ నటన తెలుగువారికి కూడా నచ్చింది.ఆపై చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. కాగా వారిద్దరి కలిసి నటించనున్న క్రేజీ చిత్రానికి దర్శకుడు ఎవరు ? కథ ఎలా ఉంటుంది? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఎవరు ? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ భామ ఇంతకుముందే నటించడానికి అంగీకరించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు ఉమెన్ సెంట్రిక్ కథాచిత్రాలు అన్నది గమనార్హం. -
హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)
-
Chiranjeevi Birthday: విశ్వంభర గ్లింప్స్ రిలీజ్
-
టాలీవుడ్ వివాదానికి ఎండ్ కార్డ్.. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభం!
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ వర్కర్క్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి పుల్స్టాప్ పడింది. ఇవాళ జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజుల తర్వాత టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.కాగా.. కొన్ని రోజులుగా తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్స్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. -
చిరంజీవి బర్త్డే ట్రీట్.. విశ్వంభర గ్లింప్స్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్ వదిలారు. ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్ బాగున్నాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు.వచ్చే ఏడాది రిలీజ్సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
'బంగారుకోడిపెట్ట వచ్చెనండి..' వంటి పలు స్పెషల్ సాంగ్స్లో డ్యాన్స్తో అలరించింది డిస్కో శాంతి (Disco Shanti). మొదట్లో సహాయనటిగా యాక్ట్ చేసినా ఐటం సాంగ్స్తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 1996లో టాలీవుడ్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది. బుల్లెట్ మూవీలో..2013లో శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూయగా.. ఆ తర్వాత డిస్కో శాంతి ఎన్నో ఇబ్బందులు పడింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తోంది. రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న బుల్లెట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మద్యానికి బానిసఅందులో డిస్కో శాంతి మాట్లాడుతూ.. బావ(శ్రీహరి) చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలాను. సరిగా తినకపోయేదాన్ని. తాగుడుకు బానిసయ్యాను. నువ్వు కూడా వదిలేసి వెళ్లిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు అడిగారు. ఆ మాట నన్ను కదిలించింది, అప్పటినుంచి తాగుడు మానేశాను. ఐదేళ్లుగా దాని జోలికి పోలేదు. నా కొడుకు ఓ సినిమా చేశాడు. యాక్టింగ్ బాగా చేశాడు. కానీ మూవీ అస్సలు బాగోలేదు.డైరెక్టర్ పారిపోయాడుఆ సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ఎక్కడ? అని అడిగాను. అప్పటికే అతడు పారిపోయాడు, నా ముందుకు రాలేదు. అదొక సినిమానా? థూ.. నాకు వారం ముందు చెప్పినా ఏవైనా మార్పులుచేర్పులు చేసేదాన్ని. బావ సినిమాలకు కూడా చాలా కరెక్షన్స్ చేశాను అంటూ కుమారుడి సినిమాపై డిస్కో శాంతి అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీహరి- శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ రాజ్ధూత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. 2019లో రిలీజైన ఈ సినిమా పరాజయం పాలైంది.చదవండి: తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా -
ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కబడ్డీ నేపథ్య నిజజీవిత కథతో తెరకెక్కించారు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తర్వాత కాలంలో తాగుబోతుగా ఎందుకు మారాల్సి వచ్చింది. దీనికి దారితీసిన పరిస్థితులేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఈ నెల 29న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ) -
తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా
బుల్లితెర నటి, కార్తీకదీపం సీరియల్ విలన్ భావనా రెడ్డి ఇంట శుభకార్యం జరిగింది. భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది. తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు-సిద్ధు, జ్యోతిరెడ్డి, ప్రియతమ్ చరణ్, ప్రీతమ్, ప్రభాకర్.. ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సైలెంట్గా పెళ్లి చేసిన నటిసోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకునే భావన.. కూతురి పెళ్లిని మాత్రం గోప్యంగా ఉంచింది. కూతురి వెడ్డింగ్కు సంబంధించి ఒక్క ఫోటో, వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయలేదు. సైలెంట్గా పెళ్లి చేయాలనుకుందో లేక సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకుందో తనకే తెలియాలి. భావనా రెడ్డి.. బుల్లితెరపై ముద్ద మందారం, త్రినయని, మావారు మాస్టారు.. ఇలా పలు సీరియల్స్లో నటించింది. కార్తీకదీపం ఫస్ట్ పార్ట్లో రుద్రాణిగా విలనిజం పండించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది.చదవండి: Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా! -
కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్
టాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఎంత గుర్తింపు తెచ్చుకున్నా సరే కొందరు చిన్న నటుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవకాశాలు రాకపోతే రోజు కూడా గడవదు. అలాంటిది ఏదైనా రోగమొచ్చి మంచం పడితే అంతే సంగతులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పక్షవాతానికి గురయ్యాడు. ఇంతకీ అసలేమైంది?కమెడియన్ రామచంద్ర అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో ఇతడు నటుడిగా మారాడు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)తను పక్షవాతానికి గురైనట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో మాట్లాడిన రామచంద్ర.. '15 రోజుల క్రితం ఓ డెమో షూట్ కోసం వెళ్లాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్లు లాగేసినట్లు అనిపించాయి. దీంతో డాక్టర్ దగ్గరకెళ్లి పరీక్షలు చేయించుకుంటే బ్రెయిన్లో రెండు క్లాట్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో నా ఎడమ చేయి, కాలు పడిపోయాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా గురించి మొత్తం నా సోదరుడే చూసుకుంటున్నాడు. రెండు నెలల పాటు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టేశాడు' అని తన పరిస్థితి గురించి వివరించాడు.తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర చెప్పాడు. తోటి ఆర్టిస్టులకు తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాలని, వాళ్ల ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ విషయం చేరుతుందనే ఆశతో ఉన్నాడని అన్నాడు. ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ఎవరూ తనకు ఫోన్ చేసి ఎలా ఉందని అడగలేదని తెలిపాడు. అయితే రామచంద్ర పరిస్థితి చూసిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైద్య పరంగా ఎవరైనా సినీ ప్రముఖులు సాయం చేయాలని కోరుతున్నారు.(ఇదీ చదవండి: సినీ కార్మికులు రోడ్డున పడ్డారు) -
పెళ్లిపీటలు ఎక్కబోతున్న విజయ్ దేవరకొండ-రష్మిక
-
‘కన్యాకుమారి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పదిహేను కోట్ల ఇంట్లో...
‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.ఇప్పటికే మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... ఇలా అన్నీ హైలెట్గా మారాయి. తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారనే వార్తలు వస్తున్నాయి. ఈ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్తో కొత్త షెడ్యూల్ని ప్రారంభిస్తారట.సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందట. కళా ఖండాలు, వాల్ హ్యాంగింగ్... ఇలా ఈ సెట్కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట మేకర్స్. అందుకే సెట్కే దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని టాక్. ఈ కొత్త షెడ్యూల్ నెల పాటు జరగనుందని తెలి సింది. ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. -
చాయ్వాలా ప్రేమకథ
‘‘చాయ్వాలా’ సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా తమ తండ్రితో కాసేపు మాట్లాడతారు. ఈ చిత్రం చూశాక థియేటర్ నుంచి ఓ మంచి భావోద్వేగంతో బయటికొస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని శివ కందుకూరి తెలి పారు. ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చాయ్వాలా’. శివ కందుకూరి, తేజు అశ్విని జోడీగా నటించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణంలో నాకు ప్రమోద్ మంచి స్నేహితుడిగా మారిపోయారు.నిర్మాత వెంకట్గారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. మా చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ‘‘చాయ్వాలా’ ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. ప్రమోద్ హర్ష మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న పాత్రలు, కథ నుంచే ‘చాయ్వాలా’ టైటిల్ను తీసుకున్నాను. ప్రతి మనిషి జీవితంలో జరిగే ఘటనలే మా చిత్రంలో ఉంటాయి’’ అని చెప్పారు.‘‘మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇదొక సున్నితమైన ప్రేమకథ’’ అని వెంకట్ ఆర్. పాపుడిప్పు పేర్కొన్నారు. ‘‘తెలుగులో ‘చాయ్వాలా’ నా మొదటి చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు తేజు అశ్విని. ‘‘ఈ కథ వినోదాత్మకంగా, అలాగే భావోద్వేగంగా ఉంటుంది. మా ‘చాయ్వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నటుడు రాజీవ్ కనకాల తెలి పారు. నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి మాట్లాడారు. -
ప్రభాస్ వింటేజ్ లుక్ లీక్.. ‘ఫౌజి’ టీమ్ హెచ్చరిక!
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ లీక్ అయింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు షేర్ చేశారు. ప్రభాస్ లుక్ ట్రెండింగ్లోకి రావడంతో మూవీ టీమ్ సీరియస్గా స్పందించింది.‘‘మా సినిమా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీకు అద్భుతమైన విజువల్స్ అందించేందుకు యూనిట్ ఎంతో కష్టపడుతోంది. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ అయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి లీక్లు మా విశ్వసనీయత, నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైనా ప్రభాస్ లుక్ లీక్ చేసినా, షేర్ చేసినా వాళ్ల ఐడీలు బ్లాక్ చేయడంతో పాటు సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
రాసుకుపూసుకుని తిరగను, అందుకే నో సక్సెస్..
చాలా సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయంటోంది నటి దీక్షా పంత్ (Diksha Panth). ఇటీవల వచ్చిన ఓ పెద్ద మూవీలో కూడా తాను నటించాల్సిందని, కానీ చెప్పాపెట్టకుండా సైడ్ చేశారని వాపోయింది. ఇలా తన కెరీర్ జర్నీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. దీక్షా పంత్ మాట్లాడుతూ.. మాది ఉత్తరాఖండ్. నాన్న రైల్వే ఉద్యోగి కావడంతో ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. అలా నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కాకినాడలో!మొదట నో చెప్పా..ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓ ఈవెంట్లో కొరియోగ్రాఫర్ నన్ను చూసి మోడలింగ్ ట్రై చేయొచ్చుగా అని చెప్పారు. మా ఇంట్లో చంపేస్తారంటూ నో చెప్పాను. రెండేళ్ల తర్వాత అతడే మళ్లీ కాల్ చేసి అడిగాడు. ఇంతలా అడుగుతున్నాడని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇంట్లో ఒప్పించి ఫోటోషూట్, ర్యాంప్ షోస్ చేశాను. అలా మోడలింగ్లో బిజీ అయ్యాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. పెద్ద మూవీలో ఆఫర్మొదట్లో అవకాశాలిస్తాం కానీ మాకు మరేదో కావాలని అడిగేవారు. నేను ముఖం మీదే నో చెప్పేదాన్ని. నన్ను రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం మరీ అందరితో రాసుకుపూసుకు తిరగను. అందుకే సక్సెస్ఫుల్ కాలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్ ఈ మధ్య ఓ పీరియడ్ డ్రామా సినిమా రిలీజ్ చేశారు. 2017లోనే ఈ మూవీ చేయమని ఆఫర్ చేశారు. అలా ఎన్నో ఆఫర్స్ మిస్అంతా బానే ఉందనుకున్న సమయంలో సడన్గా నన్ను వద్దనుకున్నారు. ఆ విషయం నాకు చెప్పనేలేదు. అంత మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లే వచ్చి చేజారడం కాస్త బాధేసింది. అలా చాలా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేతికందకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది. రచ్చ, వరుడు, ఒక లైలా కోసం, గోపాల గోపాల చిత్రాల్లో అలరించింది నటి దీక్షా పంత్. మంగమ్మ అనే ప్రైవేట్ సాంగ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చదవండి: ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.క్షమాపణలు చెప్పాలిఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఏం జరిగింది?వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే యువతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రాహుల్ జంట డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత..కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వేదికపై రాహుల్.. కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్బ్యాగ్ను బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా రాహుల్ కన్యాకుమారి వెళ్లాడు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.సింగర్గా..1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తిని తండ్రి గమనించాడు. గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూ, మరోపక్క తండ్రికి బార్బర్ షాప్లో సాయం చేసేవాడు. రానురానూ కోరస్ పాడే అవకాశాలొచ్చాయి. జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా పాట పాడే అవకాశం వచ్చింది. వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్ సాంగ్, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సాంగ్స్ పాడాడు. యూట్యూబ్లో మంగమ్మ, పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా అనేక ప్రైవేట్ సాంగ్స్తో తెగ వైరల్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్లో పాడిన నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Flashoot (@weareflashoot) చదవండి: కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు -
ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్, అనుష్క
ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ చిత్రాన్ని అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిని ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తుంది.'బాహుబలి: ది ఎపిక్' విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనుష్క కూడా ఆ టీమ్లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క్ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఆమె నటించిన 'ఘాటి' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్తో పాటు 'బాహుబలి: ది ఎపిక్'ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్లో ఆమె ఉన్నట్లు సమాచారం. తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లతో పలు ఈవెంట్లు నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.తెలుగు సినిమా 'గ్లోబల్ రేంజ్'కి ఎదిగింది 'బాహుబలి'తోనే. ఒక రకంగా 'పాన్ ఇండియా' ట్రెండ్ ఆరంభమైనదే 'బాహుబలి'తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్పై వరల్డ్ సినిమా దృష్టి పడింది. ఇలా 'బాహుబలి' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో చిత్ర యూనిట్ మనకు అందించనుంది. -
‘చాయ్ వాలా’ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
సినీకార్మికుల సమ్మె.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.సమ్మె ఎఫెక్ట్హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్ -
'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. హిందీ బెల్ట్లో ‘వార్ 2’ హవా కనిపించగా.. దక్షిణాదిలో రజనీ ‘కూలీ’ జోరు కనిపించింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2" తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, హిందీ బెల్ట్లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు దగ్గరగా వార్2 కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, వార్ 2 తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సుమారు రూ. 80 కోట్ల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్లో అనుకున్నంతగా వార్2 కలెక్షన్స్ రాకపోవడంతో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొంత రిటర్న్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్లో 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్పై 'వార్ 2' చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. సుమారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా రూ. రూ. 100 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పై ప్రభావం పడింది.బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్గానే ఢీల్ సెట్ చేసుకుంటుంది. ఈ సినిమాను కొనుగొలు చేసిన నాగవంశీకి కొంత ఉపశమనం అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. నాగ వంశీతో పాటు అతని భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్ రాజ్ సంస్థ అంగీకరించినట్లు బాలీవుడ్ సమాచారం. నైజాంకు రూ. 10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్కు రూ. 5 కోట్ల వరకు ఇచ్చేందుకు గ్రీన్ లభించిందట. అయితే, హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి నష్టం లేదని తెలుస్తోంది. -
కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొడుతున్న హీరోయిన్ శివాని నాగరం (ఫొటోలు)
-
ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్లు, యాక్షన్ సీన్స్కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్షా’ సినిమాకే జపాన్లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar) -
స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్ చెప్పిన 'మోహన్ లాల్'
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అయితే, ఆందోళన చెందాల్సినంత అనారోగ్య సమస్యలు కాదని చెప్పారు. తాజాగా మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మమ్ముట్టి ప్రాణ స్నేహితుడు మోహన్ లాల్ కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి లవ్ సింబల్ను ఇచ్చి షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు.ఇప్పటికే మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటారంటూ మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మోహన్ లాల్ ఫోటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అక్కడి నిర్మాతలతో పాటు నటి మంజు వారియర్ కూడా తన ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టైగర్ అంటూ ఆమె ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన మేకప్ మ్యాన్ జార్జ్ కూడా మమ్ముట్టి కోలుకున్నట్లు తెలిపారు. అందరి ప్రార్థనలు ఫలించాయని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే ఎవరికైనా మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లే గుర్తొస్తాయి. మమ్ముట్టి పూర్తిగా కోలుకోవాలని ఈ ఏడాది మార్చిలో శబరిమలలో మోహన్ లాల్ పూజలు జరిపించారు. ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని చెప్పడంతో కొంతమంది తప్పుపట్టారు. అలా ఎలా చేస్తారని మోహన్ లాల్ను ప్రశ్నించారు. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పారు. 'అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి..? ఆయన స్వల్ప అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే చేపించాను' అంటూ తెలిపారు. తర్వాత వారి స్నేహం పట్ల ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అందరికీ దేవుడు ఒక్కడే అంటూ నాడు కామెంట్లు చేశారు. ఇప్పుడు మమ్ముట్టి కోలుకోవడంతో అంతా అయ్యప్ప ఆశీస్సులు అంటూ చెబుతున్నారు. -
నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా.. ప్లీజ్ సపోర్ట్.. అనుపమ కన్నీళ్లు (ఫోటోలు)
-
సుకుమార్ కుమార్తెను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి, అభినందించారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకృతి సత్తా చాటింది. ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' సినిమాకు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో సుకుమార్ దంపతులతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు సీఎంను కలిశారు.పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్తో 'గాంధీ తాత చెట్టు' సినిమాను పద్మావతి మల్లాది తెరకెక్కించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం అందుకుంది. ఇందులో సుకృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఆమె ఏకంగా గుండు కొట్టించుకుని నటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. -
సరికొత్త పెద్ది
‘పెద్ది’ సినిమా కోసం రామ్చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్చరణ్ను సరికొత్త లుక్లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్లో రామ్చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
నారాయణ మూర్తి అందమైన హీరో: బ్రహ్మానందం
‘‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, అలాగే తండ్రి కోసం కొడుకు చేసిన త్యాగం... ఇలాంటి భావోద్వేగాలను ఒక చోటకు తీసుకొచ్చి, మానవ భావోద్వేగాలతో ఈ సమాజం ఎలా ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ఈ నెల 22న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘మీ దృష్టిలో అందమైన హీరో ఎవరు?’ అని ఎవరైనా నన్ను అడిగితే నారాయణ మూర్తి పేరు చెబుతాను. అందం అంటే... గ్లామర్, 6 ఫీట్స్ హైట్, కర్లింగ్ హెయిర్... వంటి అందం కాదు. మదర్ థెరిస్సాని ‘మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా?’ అని అడిగితే.. ఎవరి మనస్సులో సేవాభావం, ఎవరి కళ్లల్లో దయా గుణం ఉంటాయో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా ఉంటుంది’ అని చెప్పారు.నలభై ఏళ్లుగా నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, పేదవాళ్ల పక్షాన ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇవాళ మన దేశం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి, ‘యూనివర్సిటీ’ తీశారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం నిజాయతీగా తీసిన ‘యూనివర్సిటీ’ సినిమాని చూసి, ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు’’ అన్నారు. ‘‘బ్రహ్మానందంగారు మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించి మాస్టరు. అందుకే నా ‘యూనివర్సిటీ’ లోగోని ఆయనతో ఆవిష్కరింపజేశాను. మా చిత్రాన్ని చూడండి... ఏమాత్రం బాగున్నా ఆదరించి, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’’ అని కోరారు ఆర్. నారాయణ మూర్తి. -
నలభై ఏళ్లకు...
హీరోలు రజనీకాంత్, కమల్హాసన్ కలిసి ఇరవై సినిమాలకు పైగా నటించారు. కానీ ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) సినిమా తర్వాత రజనీ–కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా వీరిద్దరినీ కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే లోకేశ్ నెక్ట్స్ సినిమాగా కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కాల్సి ఉంది.ఈ నేపథ్యంలో రజనీ–కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతోంది. మరి... నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ–కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ ‘కూలీ’, కమల్హాసన్ ‘విక్రమ్’ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియోపై క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరున్న జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్, ఫెస్టివల్స్లో సందడి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ.తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్గా మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే ఈ పరేడ్కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు. పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.These two giving off some serious newlywed energy. 😍 The chemistry is unreal ❤️☺️They are giving major newly husband-wife vibes. Just saying.😉❤️#RashmikaMandanna ❤️#VijayDeverakonda ❤️ pic.twitter.com/0WsTeobHDZ— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 18, 2025 -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
ఎన్టీఆర్కు మద్ధతుగా నిలిచిన ప్రముఖ సింగర్
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే, చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్కు మద్ధతుగా ఎవరూ నిలబడలేదు. కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేశ్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అయ్యారు. తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్థతు ఇచ్చాడు.తారక్కు సపోర్ట్గా రండి.. రేపొద్దున మీకూ ఇదే జరగొచ్చుఎన్టీఆర్కు మద్ధతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు. 'తారక్ సార్తో సంఘీభావంగా నిలబడుతున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్కు ఎదురుకావచ్చు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను' అంటూ #StandWithNTR అనే హ్యాష్ట్యాగ్ను జోడించారు.'హనుమాన్' సినిమాతో పాపులర్ ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూలుకు చెందిన అనుదీప్ 2011లో 'అహ నా పెళ్ళంటా' సినిమాతో సింగర్గా పరిచయమయ్యారు. అనుదీప్ ఇప్పటికే 70 చలన చిత్రాలలో సుమారుగా 100 పాటలకు పైగా పాడారు. 'హను మాన్' వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, యువన్ శంకర్ రాజా,మిక్కీ జె. మేయర్,అనూప్ రూబెన్స్, థమన్, సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు.Standing in solidarity with @tarak9999 sir .Cinema unites us, politics divides us. Let’s keep both separate. Today it’s NTR garu and tomorrow it could be any other star.Requesting the entire TFI to stand together and support our beloved NTR garu.#StandWithNTR #TFIUnited— Anudeep Dev (@anudeepdev) August 19, 2025 -
కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం
-
ఒక తల్లిగా ఆందోళనగా ఉంది.. ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యలపై ప్రశంసలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.సోషల్మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్మీడియా ట్రాప్లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్కు కావాల్సిన మెసేజ్ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు. -
నందమూరి కుటుంబంలో విషాదం
నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు ఆపై హీరో నందమూరి చైతన్య కృష్ణకు తల్లి అని తెలిసిందే.సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. -
భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్
టాలీవుడ్ సినీ కార్మికులు 16వ రోజు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తమ వేతనాలు పెంచాలంటూ ఇందిరానగర్లో పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన కార్మికులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ వేతనాల పెంపు అంశాన్ని ఫెడరేషన్ నాయకులు చిరంజీవికి వివరించారు. ఈరోజు సాయింత్రం జరిగే ఫిలిం ఛాంబర్, కార్మికుల ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ ఇప్పటికే స్తంభించింది. షూటింగ్స్ లేక సగటు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమావేశం అనంతరం నేడు మరోసారి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలు కూడా చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్లలో రెండు కండిషన్స్ దగ్గర మాత్రమే పేచీ ఏర్పడింది. కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్.. ఆపై రెండో ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే డబుల్ పేమెంట్ వంటి అంశాలను కార్మిక సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి. -
బిగ్బాస్లోకి అనసూయ.. దెబ్బలు పడతాయి రాజా అంటూ కామెంట్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్ సందడి ఇప్పటికే షోషల్మీడియాలో మొదలైంది. ఇప్పటికే పలు కొత్త పేజీలు పుట్టుకొచ్చాయి. షో గురించి వీడియోలు షేర్ చేస్తున్నారు కూడా.. షోలో పాల్గొనబోతున్న కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్బాస్లోకి స్టార్ యాంకర్, నటి అనసూయ వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఈ అంశం గురించి ఆమె వివరణ ఇచ్చారు.బిగ్బాస్లోకి అనసూయ అంటూ వారం రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించారు. బిగ్బాస్ హౌస్లోకి తాను వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అందుకు కారణాలు కూడా ఆమె చెప్పారు. గతంలో తాను ఒకట్రెండు సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇక అందులో ఎంట్రీ ఇస్తే అంతే సంగతులు అంటూనే నో చెప్పేశారు. కుటుంబాన్ని వదిలేసి అన్నిరోజుల పాటు తాను ఉండలేనని ఆమె తెలిపారు.బిగ్బాస్: సీజన్9 గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఉండబోతుంది. ఎక్కువగా సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నెటిజన్లు ఈ షో పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్కు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్ స్టార్మా ప్రసారం చేయనుంది. -
భార్యతో ఉంటూనే మరో మహిళతో బిడ్డను కన్నాడు.. నటుడిపై సంచలన ఆరోపణ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) -
మిస్ యూనివర్స్ ఇండియాగా రాజస్థాన్ బ్యూటీ
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం అలంకరించారు. తాజాగా జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీలో ఆమె గెలుపొందారు. ఈ ఏడాదిలో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక విశ్వకర్మ బరిలొకి దిగనున్నారు. భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె NCC క్యాడెట్ కూడా.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. మణిక విశ్వకర్మ అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు గర్వకారణంగా నిలవనున్నారు. -
స్టార్ హీరో సినిమా.. ఆసుపత్రి పాలైన 100 మంది
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్'.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.లడఖ్లోని లేహ్ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సెట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సెట్లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
న్యూ బిగినింగ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు (ఫోటోలు)
-
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్కుమార్
‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు. -
దీపావళికి థామా
‘థామా’లో తడ్కాపాత్రలో తన తడాఖా చూపిస్తానంటున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్, మిస్టరీ అండ్ లవ్స్టోరీ మూవీ ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ‘థామా’ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.కాగా అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలోని ప్రధానపాత్రధారుల ఫస్ట్లుక్స్తోపాటుగా, ఈ సినిమాలోని వారిపాత్రల పేర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా, యాక్షసాన్ గా నవాజుద్దీన్ , రామ్ బజాజ్ గోయెల్గా పరేశ్ రావల్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా ‘థామా’కి చెందిన తాజా వీడియో ‘థామా వరల్డ్’ పేరుతో నేడు విడుదలవుతోంది. -
తెలుగు యంగ్ హీరోపై కేసు పెట్టిన భార్య
తెలుగులో రెండు సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్పై పోలీస్ కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతడి భార్యనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్.. 2019లో గౌతమి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. గతంలో ఓసారి ఇతడిపై వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యని ఇదే విషయమై వేధింపులకు గురిచేస్తుండటంతో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.సినిమా ఛాన్సులు పెరగడంతో తన భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఇతడి భార్య.. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకటి రెండు చిత్రాలతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో ఇలా పోలీసు కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
మహేశ్బాబు అన్న మూవీలో సెకండ్ హీరోగా.. ఆ సినిమా వల్లే..
ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం యూనివర్సిటీ. పేపర్ లీక్ అనేది ట్యాగ్లైన్. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా నారాయణ మూర్తి (R Narayana Murthy) ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? ఏంటనే విషయాలను పంచుకున్నారు.రూ.70తో చెన్నై..ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాది కాకినాడలో మల్లంపేట అనే కుగ్రామం. టూరింగ్ టాకీస్కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. సినిమా యాక్టర్ అయిపోవాలని రూ.70తో చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాలా లక్షలాది మంది ఉన్నారని చూశాను. జూనియర్ వేషాలు వేశాను. అప్పుడు మహానటులను చూశాను. నాకు బొమ్మలు వేసే అలవాటుండేది. నేను వేసిన ఏఎన్నార్ బొమ్మ చూసి డైరెక్టర్, నా గురువు దాసరి నారాయణరావుగారు మెచ్చుకున్నారు. పొంగిపోయాను. డిగ్రీ పూర్తి చూసి వస్తే వేషం ఇస్తానన్నారు. సెకండ్ హీరోగా..డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి దాసరిగారిని కలిశా.. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్బాబు అన్న రమేశ్బాబు నీడ సినిమాలో వేషం ఇచ్చారు. సెకండ్ హీరోగా చేశాను. తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి మూవీ తీశారు. ఆ తర్వాత నాకు వేషాలొచ్చాయి. కానీ, నటుడిగా బిజీ కాలేకపోయాను. హీరో వేషాలు రాలేదు. చిన్న వేషాలే వస్తున్నాయి. చాలా స్ట్రగుల్ అయ్యా.. నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నావాళ్లందరికీ ఎలా చూపించుకోగలను? అని మానసిక వేదన చెందాను. ఆ పాటతోనే ధైర్యంఅన్ని రకాల బాధలు పడుతున్న సమయంలో ఘంటసాల పాడిన 'కల కానిది.. విలువైనిది..' పాట నాలో ధైర్యం నింపింది. నాకెవరూ హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడు నా స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించాను. నా బ్యానర్లో తీసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యం. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్ప్లే, యాక్షన్.. అన్నీ నేనే చేసుకున్నాను. జనం దగ్గర సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.చదవండి: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం -
తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం
మరో తెలుగు హీరో తండ్రి కాబోతున్నాడు. అయితే అతడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. 'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్.. ఈ శుభకార్యానికి వెళ్లింది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అలా ఈ గుడ్ న్యూస్ అందరికీ తెలిసింది. దీంతో సదరు హీరోకి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. పర్లేదనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు తిరువీర్ భార్య కల్పన ప్రెగ్నెన్సీతో ఉంది. సోమవారం నాడు సీమంతం వేడుక చేశారు. ఈ ఫొటోలని కావ్య కల్యాణ్ రామ్ షేర్ చేసింది. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) -
చిరంజీవికి మా సమస్యలు చెప్పాం: ఫిలిం ఫెడరేషన్
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె (Tollywood Film Worker Strikes) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్తో భేటీఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్లోని కొందరు నిర్మాతలు చిరంజీవి (Chiranjeevi Konidela)ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు. త్వరలోనే పరిష్కారంఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. భేటీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపై నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలూ బాగుండాలి.చిరంజీవికి అన్నీ చెప్పాంనిర్మాతలు పెట్టిన 2 కండీషన్స్కు ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పాం. మాకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రమ్మని చిరంజీవి గారు చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్తో కూడా సమావేశం కానున్నాం. చర్చలకు పిలిచారు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం అడిగినట్లుగా మాకు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అన్నారు.నిర్మాతల మీటింగ్మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్కే అప్పగించారు. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి (Kota Rukmini) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం (ఆగస్టు 18న) తుదిశ్వాస విడిచారు. కాగా కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమపదించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం! కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.విలక్షణ నటుడుతెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. విలన్గా, తండ్రిగా, కామెడీ విలన్గా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట.. అన్నిరకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్రౌండర్గా నిలిచారు.చదవండి: అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే? -
నాన్న చివరి కోరిక నెరవేర్చిన నాగార్జున.. అదేంటంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.151 కోట్లు రాబట్టిన కూలీ.. కోలీవుడ్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అయితే తాజాగా ఓ టాక్ షోకు హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. మనం సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుంచే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ మనం సినిమా గురించి రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే.. చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు.నాగార్జున మాట్లాడుతూ..'మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్లోనే తెలిసిపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలుసు. నాకు లైఫ్లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క సినిమానే. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిస్తే ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అప్పటికే నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారని' గుర్తు చేసుకున్నారు. -
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్
చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.గృహప్రవేశంతాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.సినిమానరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి -
రజినీకాంత్ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.ఇండియాలో నెట్ కలెక్షన్స్..1వ రోజు: రూ.65 కోట్లు2వ రోజు: రూ.54.75 కోట్లు3వ రోజు: రూ.39.5 కోట్లు4వ రోజు: రూ.35 కోట్లుమొత్తం: రూ.194.25 కోట్లు #Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs.. This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025 -
'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు ముజీబ్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్మీట్లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పోలీస్స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్స్టేషన్కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేఒక ఫోన్ కాల్లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
సుహాస్ 'హే భగవాన్' కొత్త సినిమా గ్లింప్స్ విడుదల (ఫొటోలు)
-
మహేశ్బాబు బ్యానర్ సినిమా.. 'రావు బహదూర్' టీజర్
మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ చిత్ర టీజర్ను అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుంది. రావు బహదూర్ పాత్ర మేకప్ కోసమే అయిదుగంటల సమయం పట్టేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు. -
ప్రపంచంలో అతిపెద్ద భారతీయ పరేడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక (ఫోటోలు)
-
సడెన్గా సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఘనంగా ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది. రాహుల్కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆగష్టు 17న తన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిగింది. అయితే, అధికారికంగా వారు ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదు. కానీ, షోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ క్రమంలో 2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. కాంగ్రెస్ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. తెలంగాణ నేపథ్యంతో పాటు పలు ర్యాప్ సాంగ్స్ పాడి ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. -
నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదే: అనుపమ ఎమోషనల్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా నిర్వహించిన పరదా ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా ఇదేనని అన్నారు.అనుమప పరమేశ్వరన్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా ఈవెంట్లో ఫస్ట్ ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా పరదానే. ఆగస్టు 22న మీరు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకముంది. అందరూ చెప్పినట్లు మీరు సినిమా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కు కూడా చెప్పండి. రివ్యూస్ చూసే పరదా మూవీకి వెళ్లండి' అని మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
'హే భగవాన్' అంటూ నవ్విస్తున్న సుహాస్
ఉప్పు కప్పురంబు, ఓ భామ అయ్యో రామ వంటి చిత్రాల తర్వాత సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు. 'హే భగవాన్' అంటూ తను నటిస్తున్న కొత్త సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్గా శివానీ నగరం నటిస్తుండగా నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ బ్యానర్పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
తమిళ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. 'కూలీ' ఇంటర్వెల్లో నాగార్జున హిట్ సాంగ్
రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాలో అక్కినేని నాగార్జున విలన్గా నటించారు. అయితే, నాగ్కు తమిళ్లో కూడా అభిమానులు ఉన్నారు. కూలీలో ఆయన పాత్రకు అక్కడి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, మూవీ ఇంటర్వెల్లో నాగార్జున నటించిన సినిమా నుంచి ఒక హిట్ సాంగ్ను ప్రదర్శించాలని కోరారు. దీంతో థియేటర్ యజమానులు కూడా ఆ పాటను ప్రదర్శించి నాగ్ అభిమానులను ఆనందపరిచారు.కూలీ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, కన్యాకుమారి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీ ప్రదర్శించబడుతున్న థియేటర్స్లలో నాగార్జున నటించిన రక్షకుడు (రత్చగాన్) సినిమా పాటను బిగ్ స్క్రీన్పై టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 1997లో విడుదలైన రక్షకుడు నుంచి 'సోనియా సోనియా' సాంగ్ను ఫ్యాన్స్ కోరారు. దీంతో ఇంటర్వెల్ సమయంలో ఆ పాటను యాజమాన్యం ప్రదర్శించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కు నాగార్జున, సుష్మితా షేన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ కూడా దుమ్మురేపారు.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ తమిళనాడులో సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఇదే టాప్.. ఇందులో రజనీకాంత్తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.As Audience wish, we Screened #Nagarjuna's sir Iconic #SoniyaSoniya song on the Interval of #Coolir and the Audience was totally enjoyed☺️, it added a new vibe ❤️.Book now and enjoy this kinda exclusive btw the Show.#coolieinsribalajicinemas@iamnagarjuna @chay_akkineni pic.twitter.com/7x1EARrCG0— Sri Balaji Cinemas (@BalajiCinemas) August 17, 2025 -
విజయ్ దేవరకొండ, రష్మికకు దక్కిన అరుదైన గౌరవం
టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకున్నారు. న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్కు వారిద్దరూ ' గ్రాండ్ మార్షల్'గా వ్యవహరించారు. FIA అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. ఇది 1970లో ప్రారంభమై, ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మాసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్షైర్, వెర్మాంట్ మరియు మైన్ రాష్ట్రాల్లో భారతీయ సముదాయాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం 43వ గ్రాండ్ మార్షల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ' గ్రాండ్ మార్షల్'గా పాల్గొన్నవారికి ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది.ప్రపంచంలో అతిపెద్ద భారతీయ పరేడ్ ప్రతి సంవత్సరం న్యూయార్క్లో నిర్వహించబడుతుంది. ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఘనమైన వేడుక. 2025 సంవత్సరానికి గాను, సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న “గ్రాండ్ మార్షల్స్”గా పాల్గొన్నారు. వీరి హాజరు పరేడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడం ఆపై ప్రవాస భారతీయుల ఐక్యతను బలపరచడం వంటి అంశాల్లో గత 42 ఏళ్లుగా FIA పనిచేస్తుంది. 2022లో ఇదే గౌరవాన్ని టాలీవుడ్ నుంచి మొదటిసారి అల్లు అర్జున్ అందుకున్నారు. #VijayDeverakonda and #RashmikaMandanna, lead the 43rd India Day Parade in New York City as Grand Marshals.@TheDeverakonda @iamRashmika pic.twitter.com/ecxsKwV0NY— Suresh PRO (@SureshPRO_) August 18, 2025 -
అన్నా.. అంటూ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్.. గొడవలకు ఫుల్స్టాప్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) కొద్దిరోజుల క్రితం విడుదలై మెప్పించింది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు కుమారుడు అవ్రామ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, కన్నప్పలో అవ్రామ్ నటనకు గాను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లో తాజాగా అవార్డు దక్కింది. దీంతో మోహన్బాబుతో పాటు విష్ణు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అవ్రామ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.. మరోసారి మీ ముందుకు తప్పకుండా వస్తానని తెలిపాడు. మంచు ఫ్యామిలీ సంతోషాన్ని మనోజ్ ఒక పోస్ట్ చేసి రెట్టింపు చేశాడు.ప్రత్యేకంగా తన అన్న మంచు విష్ణును ట్యాగ్ చేసి మనోజ్ ఇలా చెప్పాడు.. 'అభినందనలు అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి నాన్నా. ప్రత్యేకంగా నువ్వు విష్ణు అన్నతో పాటుగా నాన్నగారు మోహన్బాబుతో అవార్డు అందుకోవడం చాలా స్పెషల్..' అంటూ పోస్ట్ చేశాడు. కన్నప్ప విడుదల సమయంలో కూడా సినిమా చూసిన మనోజ్ తన అన్న గురించి ఒక పోస్ట్ చేశాడు. సినిమా చాలా బాగుందని తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని చెప్పాడు. కన్నప్పలో తన అన్న ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని తెలిపాడు.కొంతకాలంగా మంచు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఏకంగా పోలీస్టేషన్కు చేరాయి. ఇలాంటి సమయంలో మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. రక్తసంబంధం అంటే ఇలాగే ఉంటుందని ఎన్ని గొడవలు పడినా ఎదోరోజు కలుసుకుంటారని చెబుతున్నారు.Congratulations Avram ❤️❤️❤️…..so so proud of you my boy…. Keep shining nannaaaa 😘😘😘This is so special with @IvishnuManchu anna and Nanna @themohanbabu garu also receiving this award …Lots of love ❤️❤️#SantoshamFilmAwards https://t.co/2IPOHHDRmN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 17, 2025 -
తమిళ దర్శకులు ఎడ్యుకేటర్స్: మురుగదాస్
తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది. అయితే ఆ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్లో చేరకపోవడం గురించి సీనియర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒక వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల వరుసగా అపజయాలను చవిచూస్తూ వచ్చారు.. కాగా తాజాగా ఈయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం మదరాసీ. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెపె్టంబర్ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విచిత్ర ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక వ్యక్తి రోడ్లో వేగంగా వెళ్తున్నారంటే అది ఇంతకుముందే చేయబడిన బాట అని, అదే ప్రత్యేక బాటలో వెళ్లాలంటే అంత సులభం కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ ,మణిరత్నం వంటి వారు ప్రత్యేక బాటను వేస్తే అందులో ఎత్తు పల్లాలే ఎదురవుతాయన్నారు. ఇతర భాషా చిత్రాలు రూ.1000 కోట్ల పైగా వసూలు చేస్తున్నాయని చెబుతున్నారని, ఇతర దర్శకులు ఎంటర్టైనింగ్ మాత్రమే చేస్తున్నారని, తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తమిళ దర్శకులు ఎడ్యుకేషన్ చేస్తున్నారని అన్నారు. అందువల్లే ఇతర చిత్ర పరిశ్రమలకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. -
ఓ ఆటగాడి కథ
విజయ రామరాజు టైటిల్ రోల్లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యాంథమ్ని విడుదల చేశారు. చిత్ర సంగీతదర్శకుడు విఘ్నేష్ భాస్కరన్ స్వరపరచిన ఈపాటకు విక్రాంత్ రుద్ర సాహిత్యం అందించారు.దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్పాయ్ ఆలపించారు. విజయ రామరాజు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విజువల్స్ ఈపాటలో కనిపిస్తాయి. ఓ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘‘ఎమోషనల్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
హలగలి... ఓ చిరస్మరణీయపోరాటం
‘‘హలగలి (కర్ణాటకలోని ఓ గ్రామం) అనేది కర్ణాటకలో ఓ గొప్ప ఎమోషన్. ఈ కథ వినగానే ఈ సినిమాలో నటించాలనిపించింది. ఈ సినిమా చేయడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని డాలీ ధనంజయ అన్నారు. డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధానపాత్రధారులుగా సుకేష్ నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘హలగలి’. 1857లో జరిగిన ఓ వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ – ‘‘ఇది ఒక్క భాగంలో చెప్పే కథ కాదు. ఈ కథ వెనకాల గొప్ప చరిత్ర ఉంది. అందుకే రెండు భాగాలుగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘చరిత్రలో హలగలి అనేది ఒక అధ్యాయం. బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన చిరస్మరణీయపోరాటం. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ చక్రవర్తి. ‘‘హలగలి’ మన నేల కథ’’ అని తెలిపారు సప్తమి గౌడ. -
డబుల్ బొనాంజ
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ఇతర హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 17) నిధీ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజాసాబ్’లోని ఆమె కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.దసరాకి టైటిల్: నిధీ అగర్వాల్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈ దసరా పండగకి రానుంది. ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో పుప్పల అప్పలరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ ఎవరూ ఊహించని కొత్తపాత్రలో కనిపిస్తారు. ఈపాత్రలో ఆమె కనబరిచే నటన ఆమె కెరీర్లో మైల్స్టోన్లా నిలిచిపోతుంది’’ అని పుప్పల అప్పలరాజు పేర్కొన్నారు. ఇలా రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్కు డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చారు నిధీ అగర్వాల్. -
థ్రిల్లర్ జానర్కి సై?
‘నిన్ను కోరి’ (2017), ‘మజిలీ’ (2019), ‘ఖుషి’ (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఈ స్టోరీని హీరో రవితేజకు వినిపించగా ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ఈ థ్రిల్లర్ జానర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని ఫిల్మ్నగర్ సమాచారం.అయితే ప్రస్తుతం రవితేజ చేతిలో కిశోర్ తిరుమల దర్శకత్వంలోని ‘అనార్కలి’ (వర్కింగ్ టైటిల్), భాను భోగవరపు డైరెక్షన్లోని ‘మాస్ జాతర’ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత శివ నిర్వాణతో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ కూడా ఓ సూపర్ హీరో జానర్లో రవితేజకు కథ వినిపించారు. మరి... రవితేజ ఏ దర్శకుడితో ముందుగా తన సినిమాను సెట్స్కు తీసుకువెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
చిరంజీవికి మా సమస్యలు తెలుసు: ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్
టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. తమ షరతులకు ఒప్పుకొంటేనే వేతనాల పెంపు ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సమస్య ఎటు తేలకుండా అలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆదివారం పలువురు చిన్న నిర్మాతలు కలిశారు. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఈ క్రమంలోనే ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ తమ సాధకబాధలు చెప్పుకొచ్చారు.'రోజూ ఉదయం 5 గంటలకు వస్తేనే మా బతుకు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన అప్పటి నిర్మాతలు మా కష్టాన్ని పట్టించుకునేవారు. కానీ ఇప్పటి నిర్మాతలకు మా గోడు పట్టడం లేదు. మాకు వచ్చే డబ్బులు.. మాకొస్తున్న జబ్బులకు సరిపోతుంది. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. కార్మిక చట్టాల బట్టి అంటున్నారు మరి మీరు 8 గంటల వర్క్ చేయించుకుంటున్నారా ?? 12-14 గంటలు మేము పనిచేస్తున్నాం. 9 నుంచి 9 గంటల వరకు అని కొందరు నిర్మాతలు అంటున్నారు కానీ అది అయ్యే పనికాదు. షూటింగ్స్కి రావాలి అంటే మేము 9 గంటలకు కాకుండా మా వర్కర్స్ని 7 గంటలకే రమ్మనాలి. రాత్రి 9 గంటలకే షూట్ ముగిస్తారా అంటే అది చేయరు. మేము షూటింగ్ ముగించుకుని వచ్చేపాటికి రాత్రి ఒంటి గంట అయిపోతుంది'(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)'12 గంటలు అంటారు కానీ మేము 15-16 గంటలు వర్క్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు ప్రకారం వెళ్దామని కొందరు నిర్మాతలు అంటున్నారు మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారమే మాకు 8 గంటలు పని గంటలు ఉంటాయి. డొనేషన్ తీసుకుంటున్న డబ్బులతో ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం. యూనియన్ ఎప్పడు కార్మికుడికి అండగా ఉంటుంది నిర్మాతలు ఉండటం లేదు. మా గురువు గారు దాసరి.. అప్పుడు చెప్పిన పద్ధతి లోనే మేము వెళ్తున్నాం. నిర్మాతలు మా పై చేస్తున్న దుష్ప్రచారాలను మానండి. చిరంజీవి గారికి మా సమస్యలు తెలుసు. మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం' అని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ చెప్పారు.సినీ కార్మికుల మహిళా యూనియన్ ప్రెసిడెంట్ లలిత మాట్లాడుతూ.. మేము షూటింగ్లో ఎంతో కష్ట పడతాం. మాకు టాయిలెట్స్ కూడా ఉండవు. వాటర్ కేన్స్ కూడా భుజాన మోసుకొని వెళ్ళాలి. మా బాధలు నిర్మాతలు అర్థం చేసుకొవాలి. సండే కట్ చేస్తాం అంటున్నారు అలా చేస్తే మా పొట్ట కొట్టినట్టే. ప్రభుత్వం తరఫున మీటింగ్ పెడితే మా కష్టాలు తెలియ చేస్తాం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
59 ఏళ్ల వయసులో జిమ్లో వర్కవుట్స్.. ఎవరో గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న నటి వయసు 59. ఈ ఏజ్లో కూడా ఆమె జిమ్లో చెమటలు చిందిస్తోంది. చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తుతూ కష్టమైన వర్కవుట్స్ కూడా అవలీలగా చేస్తోంది. ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీకి బాగా పరిచయమున్న పేరు. ఆవిడే నదియా (Nadiya Moidu).. ఇప్పటికీ అందంగా, ఫిట్గా కనిపించే ఆమె వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమా1984లో వచ్చిన నూకెత్త దూరతు కన్నుం నట్టు అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్లో అమ్మ, అత్త పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగులో.. అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం 2, నా పేరు సూర్య, అఆ, అంటే సుందరానికి వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) చదవండి: 11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు! -
ఫౌజీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే..!
-
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..
బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన అసలు పేరు మధు నెక్కంటి (Madhoo Singer Nekkanti). ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. గలగలా మాట్లాడే ఈమె తొలివారమే ఎలిమినేట్ అయింది.కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్కతాజాగా బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి అంటూ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్ సహా తదితరులు అతిథులుగా విచ్చేశారు.పిల్లి కోసం ప్రత్యేకంగా..'నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే.. అపార్ట్మెంట్లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఓ గోడను డిఫరెంట్గా డిజైన్ చేయించింది. పూజగదిని నీట్గా, అందంగా కట్టించుకుంది. View this post on Instagram A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka) చదవండి: -
దర్శకుడిగా షారుక్ ఖాన్ కుమారుడు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా తెరకెక్కిస్తున్న 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే, సినిమా కాకుండా వెబ్సిరీస్ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రాన్ని ‘నెట్ఫ్లిక్స్’ (Netflix), ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ (Red Chillies Entertainment) సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 20న ప్రివ్యూ ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, ఈ మూవీకి కథ కూడా ఆర్యన్ రాయడం విశేషం. బాలీవుడ్లో ఇప్పటివరకూ చూడని సరికొత్త వెబ్సిరీస్ను అందించబోతున్నామని గతంలోనే ఆర్యన్ యూనిట్ ప్రకటించింది.ఈ వీడియోలో ఆర్యన్ వాయిస్ ఓవర్తో కథనం ప్రారంభమౌతుంది. కానీ, అతని తండ్రి షారుఖ్ ఖాన్ శైలిలో వీడియో ఉంది. తేడా ఏమిటంటే ఖాన్ ప్యార్ (ప్రేమ) గురించి మాట్లాడగా, కుమారుడు వార్ (దాడి) గురించి మాట్లాడుతాడు. ఇందులో బాబీ డియోల్, లక్ష్య (Kill ఫేమ్), మనోజ్ పహ్వా, మోనా సింగ్, మనీష్ చౌదరి, రాఘవ్ జుయల్, అన్య సింగ్ వంటి స్టార్స్ నటించనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అలియాభట్ వంటి స్టార్స్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.ఆగష్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్లో మారీశన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది. -
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.కుక్క కోసం కన్నీళ్లా?సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా!🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి.🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి. HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS 1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS 1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025చదవండి: అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున -
'సికందర్' ప్లాప్తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మురుగదాస్
మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన "సికందర్" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. అభిమానులు కూడా ఈ చిత్రంపై విమర్శలు చేశారు. సికందర్ స్క్రిప్ట్ విషయంలో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా వైఫల్యానికి కారణం తాను కాదంటూ మురుగదాస్ తాజాగా చెప్పుకొచ్చారు. సుమారు సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో రూపొందించబడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు బాలీవుడ్ పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. సాజిద్ నదియాద్వాలా ఈ మూవీని నిర్మించారు.సికందర్ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ అనే అర్థం వచ్చేలా మురుగదాస్ చెప్పుకొచ్చాడు. 'ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నేను బాగా తెరకెక్కించలేకపోయాను. కానీ, దానికి నేను మాత్రమే బాధ్యత వహించను. గజిని రీమేక్ అయినప్పటికీ బాగా ఆడింది. సికందర్ స్ట్రెయిట్ సినిమా.. అక్కడ నాకు కమాండింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేశారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాను. కాబట్టి సికందర్ వైఫల్యానికి నేను బాధ్యత వహించను.' అని ఆయన పేర్కొన్నారు.టాలీవుడ్పై పరోక్ష వ్యాఖ్యలుఇదే ఇంటర్వ్యూలో మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలామంది దర్శకులు రూ. 1000 కోట్ల సినిమాలు తీస్తున్నారు. వాళ్లు తీసే సినిమాలు కేవలం జనాలకు కనువిందు చేసేలా ఉంటాయి. కానీ, తమిళ దర్శకులు తీసే సినిమాలు ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటాయి. మేము సామాజిక కోణంలో సినిమాలు చేస్తాం. ప్రజలను ఆలోచింపచేసే సినిమాలు చేస్తాం.' అంటూ ఆయన కామెంట్లు చేశారు. #ARMurugadoss about #Sikandar Failure. So #SalmanKhan was the reason behind failure👀pic.twitter.com/oIywwHRrX6"Sikandar Base story was very close to my heart. But i couldn't able to execute well. But I'm not the only one who is responsible for it. Ghajini is remake but it's…— AmuthaBharathi (@CinemaWithAB) August 16, 2025 -
మహేష్ మూవీపై కీలక ప్రకటన
-
చిరంజీవి వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ పంచాయితీ
-
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.2024లో నోయిడా పోలీసులు ఎల్విష్ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్పై కేసు నమోదైంది. జైపూర్లోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. -
బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్
తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్పై స్పందించిన కీర్తిసురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
అల్లు అర్జున్ సినిమా.. పవర్ఫుల్ పాత్రలో శివగామి
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే... మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమ్యకృష్ణ కూడా తన అంగీకారం తెలి పారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. అలాగే మొత్తం ఐదుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇంకా మృణాల్ రాకూర్, రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
కథ విన్నారా?
హీరో నాగచైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి, నాగచైతన్యకు వినిపించారట. ఈ కథ నాగచైతన్యకు నచ్చిందని, దీంతో ఈ కథకు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అలాగే దర్శకులు బోయ పాటి శ్రీను, శివ నిర్వాణ కూడా నాగచైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్కు తీసుకువెళ్తారనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ప్రస్తుతం ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలోని ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్కి థియేటర్స్లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్డూపర్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. ఇలాంటి టైంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్పందించారు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు..(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్)'సినీ కార్మికులు.. నిర్మాతలు కలసి చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కార్మికులు అడుగుతున్న వేతనాలు నిర్మాతలు పెంచాలి. కార్మికులను గౌరవిస్తూ వాళ్ల హక్కులను కాపాడాలి. మూడు యూనియన్లకు వేతనాలు పెంచకుండా మిగతా యూనియన్లకు పెంచడం ఏమిటి? అందరితోపాటు వాళ్లకు పెంచాలి. నిర్మాతలు కోరుతున్న ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ 9 నుంచి 9 గంటల విషయమై కార్మికులు కూడా ఆలోచించాలి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో 6 నుంచి 6 గంటల వరకు నిర్మాతలకు ఇబ్బంది అవుతోంది అందుకే ఫెడరేషన్ కూడా ఆలోచించాలి''త్వరగా ఇరువురు సమ్మె విరమించి మళ్లీ షూటింగ్స్తో కళకళ లాడాలి. కార్మికులు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహారదీక్ష చేస్తాం అని ఫెడరేషన్ సంఘాలు అంటున్నాయి. అక్కడివరకు పరిస్థితి రాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి' అని నారాయణమూర్తి చెప్పారు. మరి ఇండస్ట్రీలోని ఈ సమస్యకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్కి వింత అనుభవం) -
పెళ్లయి 8 ఏళ్లు.. బుల్లితెర జంటకు పేరెంట్స్గా ప్రమోషన్
బుల్లితెర నటి, బిగ్బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం సాహ్ని (Marina Abraham Sahni) గుడ్న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మెరీనా- రోహిత్ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నటికి డెలివరీ అయి చాలారోజులే అవుతున్నప్పటికీ కొంతకాలంగా గోప్యంగా ఉంచింది. నేడు (ఆగస్టు 16న) శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కూతురు పుట్టిందని చెప్తూ తన ఫోటోను షోర్ చేసింది. పాపకు 'తెయారా సాహ్ని' అని నామకరణం చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. మెరీనా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రెగ్నెన్సీ జర్నీమెరీనా 2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయింది. కానీ ఫస్ట్ స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్బీట్ వస్తుందేమోనని మూడునెలలవరకు కడుపులో శిశువును అలాగే మోసింది. డాక్టర్లు హెచ్చరించడంతో చివరకు దాన్ని తీసేయించుకుంది. 2022లో మరోసారి గర్భం దాల్చింది. అది కూడా మిస్క్యారేజ్ అయింది. ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ప్రేమ పెళ్లిమెరీనా పుట్టిపెరిగిందంతా గోవాలోనే! మెరీనా పదో తరగతిలో ఉన్నప్పుడు ఆమె తల్లికి హైదరాబాద్లో స్కూల్ ప్రిన్సిపల్గా ఛాన్స్ వచ్చింది. అలా తను ఇక్కడే సెటిలైంది. మోడలింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్లో, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అమెరికా అమ్మాయి సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెరీనా అబ్రహం. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి ధారావాహికల్లోనూ నటించింది. ఓ సినిమా టైంలో పరిచయమైన రోహిత్ (Rohit Sahni)తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్నారు. మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్.. టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) చదవండి: గర్భంతో ఉండగా ప్రతిరోజు భగవద్గీత చదివా..: హీరోయిన్ -
గర్భంతో ఉండగా ప్రతిరోజు భగవద్గీత చదివా..: హీరోయిన్
ఈ కృష్ణాష్టమి ఎంతో స్పెషల్ అంటోంది హీరోయిన్ హర్షిక పూనాచ (Harshika Poonacha). తన జీవితంలోకి చిన్న పాపాయి వచ్చిందని తననే కన్నయ్యగా ముస్తాబు చేశానని చెప్తోంది. తాజా ఇంటర్వ్యూలో హర్షిక మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు అమ్మ నన్ను బాగా రెడీ చేసేది. స్కూల్లో రాధ వేషం వేసేదాన్ని.. మరికొన్నిసార్లు కృష్ణుడి వేషం వేసేదాన్ని. ఆ జ్ఞాపకాలన్నీ నాతో పదిలంగా ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని నా కూతురి ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను.భగవద్గీత చదివా..చాలా ప్రశ్నలకు, సమస్యలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. దానివల్ల మానసికంగా ఎంతో ధృడంగా తయారయ్యాను. ఆస్పత్రిలోని లేబర్ రూమ్లో పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పేందుకు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలు చదివాడు. ఇప్పుడు నాకు తొమ్మిది నెలల కూతురు. తనకు ధోతి కట్టి, ముత్యాల దండ వేసి కృష్ణుడిగా రెడీ చేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఈ రోజు అది నెరవేరింది. అలాగే ఈ రోజు పక్కింటి పిల్లల్ని పిలిచి వారికి స్వీట్లు పంచుతాను అని చెప్పుకొచ్చింది.సినిమాకర్ణాటకకు చెందిన హర్షిక పునాచ 2008లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా కన్నడ రీమేక్లోనూ నటించింది. తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, కొంకణి, భోజ్పురి, కొడవ భాషా చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2023లో నటుడు భువన్ పొన్నానను పెళ్లి చేసుకుంది. గతేడాది చివర్లో పాపకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) చదవండి: విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా -
వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా అప్ డేట్
-
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్.. అభిమానులకు పండగే
-
మారణహోమం తలపించేలా 'బెంగాల్ ఫైల్స్' ట్రైలర్
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'బెంగాల్ ఫైల్స్'.. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు అందరినీ ఆకర్షించాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను దేశ ప్రజలకు చూపించేలా ఈ చిత్ర కథనం ఉంటుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. -
కృష్ణాష్టమి సెలబ్రేషన్స్: గోపికలుగా మారిపోయిన తారలు
కృష్ణాష్టమి (Krishna Janmashtami) వచ్చిందంటే చాలామంది సెలబ్రిటీల ఇంట పండగ వాతావరణం ఉంటుంది. తమ పిల్లల్ని అల్లరి కన్నయ్యగా రెడీ చూసి ముచ్చటపడుతుంటారు. పిల్లల్ని వెన్నదొంగలా మార్చేయడంతో పాటు తల్లులు గోపికలుగా ముస్తాబవుతారు. చిలిపి కృష్ణుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు.మా కృష్ణుడిని ఫోటో తీద్దామంటే అస్సలు కూర్చోవడం లేదని హీరోయిన్ ప్రణీత.. మావాడికి కృష్ణుడిగా రెడీ చేసేందుకు ఒప్పించడానికే మూడు గంటలు పట్టిందని నటి నవీన.. ఇలా తారలందరూ ఓ పక్క తంటాలు పడుతూనే మరోపక్క సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెలా ముస్తాబయ్యారో మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) View this post on Instagram A post shared by Naveena Yata (@naveenayataofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Gali Maheshwari (@mahishivan9_official) View this post on Instagram A post shared by K Sreevani (@kambhammettu_sreevani) -
'వైట్లో లుక్.. హార్ట్లో హుక్' అంటున్న అనన్య నాగళ్ళ (ఫోటోలు)
-
అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్
కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతుంటాయంటుంటారు. కానీ బిగ్బాస్ బ్యూటీ, కన్నడ నటి కీర్తి భట్ (Keerthi Bhat) జీవితంలో మాత్రం అవి ఫ్యామిలీ మెంబర్స్లా తిష్ట వేశాయి. యాక్సిడెంట్లో కన్నవాళ్లను పోగొట్టుకుంది. అదే ప్రమాదంలో చావు చివరి అంచుల వరకు వెళ్లొచ్చింది. జీవితంలో తల్లయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తనొక అనాధ అని ప్రియుడు వదిలేయడంతో కుంగిపోయింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. నన్ను పిలవలేదుతెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. బిగ్బాస్ 6 అయిపోయాక BB అవార్డ్స్ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము. కానీ, టాప్ 10లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు.కలర్ చూస్తున్నారువాళ్లు పిలిస్తే వెళ్తాం కానీ, అడిగి మరీ వెళ్లలేం కదా! తర్వాత నాకర్థమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మూడు రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి. ఒకటి.. నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. రెండు.. మోడ్రన్గా ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. మూడు.. కలర్ బాగుండాలి. ఈ మూడు క్వాలిటీస్ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్ -
భీమవరం టాకీస్ పై ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభం (ఫొటోలు)
-
అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సినిమా ఆశల పల్లకి, గ్లామర్ వలయం. అంతకు మించి ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఈ అన్నింటిని అందిపుచ్చుకున్న బ్యూటీ తమన్నా. ఈ ఉత్తరాది భామ కథానాయకిగా దక్షిణాదిలోనే సాధించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ తనకు తానే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ.. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా రాణించారు. అయితే, తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇందుకు వ్యక్తిగత విషయాలు కూడా ఒక కారణం కావచ్చు. మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అందు కోసం కసరత్తు చేస్తూ స్లిమ్గా తయారవుతున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా మాట్లాడుతూ తాను కసరత్తు చేయడం ప్రారంభించి చాలా కాలం అయ్యిందన్నారు. అయితే ఆహారం, పని, లేక వ్యక్తిగత ఇష్టాలు ఏవైనా తన ఏం చెబుతుందో అదే చేస్తానని చెప్పారు. ఏదీ బలవంతంగా చేయనని అన్నారు. తనకు అలసటగా ఉన్నా.. సరిగ్గా నిద్ర లేకపోయినా, కసరత్తులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తానని, అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్తానని చెప్పారు. అదే విధంగా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతానన్నారు. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతోపాటు మంచి అనుభవాన్నిస్తుందన్నారు. సమీప కాలంలో కాశీ పయనాన్ని మరచిపోలేనన్నారు. కాశీ గొప్ప ఆధ్యాత్మిక నగరం అని పేర్కొన్నారు. అది తన మనసును ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కుటుంబంతో కలిసే వెళ్లతానన్నారు. దేవాలయాలకు మెట్ల దారి ద్వారా పయనించడంతో చరిత్రను తెలుచుకోగలుగుతామన్నారు. కాశీలో వివరించలేని ప్రశాంతత ఉంటుందన్నారు. తనకు గ్లామరస్ నటిగా ముద్ర వేశారని, అయితే ఆరంభంలో నటిగా కొన్ని కట్టుబాట్టు విధించుకోవడంతో ఛాలెంజ్తో కూడిన, శక్తివంతమైన కథా చిత్రాలను కోల్పోయాననే భావన కలిగిందన్నారు. అందువల్ల తనకు తానే విధించుకున్న నో కిస్ నిభంధనలను పక్కన పెట్టేశానన్నారు. ఆ తరువాతనే గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలెట్టానని నటి తమన్నా చెప్పారు. -
సైమా అవార్డ్స్ ప్రెస్మీట్లో మెరిసిన హీరోయిన్ 'వేదిక' (ఫొటోలు)
-
చిరంజీవి బర్త్డే గిఫ్ట్స్.. అభిమానులకు పండగే
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్ విడుదల కానుంది. ఈమేరకు షోషల్మీడియాలో వైరల్ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్ గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు.విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు అనిల్ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. -
ఇద్దరు దేవదాసులు!
కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.‘‘పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడు ‘ఒక పార్వతి... ఇద్దరు దేవదాసులు’ టైటిల్తో ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ముఖ్యంగా యువతీ యువకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రఘుబాబు, కశి రెడ్డి రాజ్కుమార్, వీరశంకర్, గౌతం రాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రహమానియాక్, కెమెరా: శ్రీనివాసరాజు. -
'డియర్ స్టూడెంట్స్' అంటూ క్లాస్ తీసుకుంటున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న కొత్త సినిమా 'డియర్ స్టూడెంట్స్' నుంచి టీజర్ విడుదలైంది. మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ నటిస్తున్న ఈ చిత్రాన్ని జార్జ్ ఫిలిప్ రాయ్, సందీప్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నివిన్, నయన్ కాంబినేషన్లో వచ్చిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆసక్తిగానే ఉంది.నయనతార, శింబు లీడ్ రోల్స్లో నటించిన ‘వల్లభ’ (2006) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్ వల్లభ (శింబు),ప్రోఫెసర్ స్వప్న (నయనతార) ప్రేమించుకుంటారు. ఇప్పుడు ‘వల్లభ’ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథలా డియర్ స్టూడెంట్ ఉంది. -
అమ్మవారి ఆలయంలో పాపులర్ నటి.. ఎవరో తెలుసా?
తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ ( Komalee Prasad) తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.డాక్టర్ నుంచి యాక్టర్గా మారిని ఈ బ్యూటీ తాజాగా హిట్ 3 సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతుంది. వైజాగ్కు చెందిన కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి.ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) -
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం.. 'అమ్మ' ప్రెసిడెంట్గా శ్వేతా మీనన్
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ప్రెసిడెంట్గా తొలిసారి ఒక మహిళ ఎన్నికయ్యారు. నటుడు, బీజేపీ నాయకుడు దేవన్తో గట్టి పోటీ ఎదుర్కొని ఆమె గెలుపొందారు. దీంతో మలయాళ చిత్రపరిశ్రమలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్ను రికార్డ్ క్రియేట్ చేశారు. శ్వేతతో పాటు, నటి కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు, నటి అన్సిబా హసన్ జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి తిరిగి వచ్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కీలక నాయకత్వ పాత్రల్లో ఉన్నారు. అదనంగా, జయన్ చెర్తాల, లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక విడుదలైన తర్వాత ‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎంపిక కావడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ (Hema Committee report) తేల్చింది. దీంతో దీంతో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ సంఘానికి అధ్యక్షుడిగా మోహన్లాల్ (Mohanlal) గతేడాదిలోనే రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి కూడా పదవుల నుంచి వైదొలిగింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరిగాయి. తన విజయం తర్వాత శ్వేతా మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్స్ మద్ధతు తనకు చాలా అవసరమని ఆమె ఆశించారు.అశ్లీల సినిమాలో నటించారని ఎన్నికల ముందు కేసు నమోదుశ్వేతా మీనన్ ఎన్నికలకు ముందే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. అశ్లీల కంటెంట్లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె దాదాపు ఓడిపోతారని అందరూ అనుకున్నారు. అయితే, గెలిచి సత్తా చాటారు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. View this post on Instagram A post shared by NEWS9 (@news9live) -
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి
తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్జెండర్ కార్యకర్త, నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా పార్టీలో చేరారు. వారిద్దరిని తమిళనాడు బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. కస్తూరి, నమితా మారిముత్తు నేటి నుంచి అధికారికంగా బీజేపీతో రాజకీయ ప్రయాణంలో చేరడం స్వాగతించదగిన పరిణామం అంటూ నైనార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. సినీ నటి కస్తూరికి ఫైర్ బ్రాండ్గా పేరుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో ఆమెకు గుర్తింపు ఉంది. -
'మహావతార్ నరసింహ' సినిమాపై చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ యానిమేషన్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి 'మహావతార్ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్ షోషల్మీడియాలో షేర్ చేసింది.జులై 25న విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience. Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw— Geetha Arts (@GeethaArts) August 15, 2025 -
ఆ మూవీ షూటింగ్లో నేను చచ్చిపోయేవాడినే.. : జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ప్రస్తుతం రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై హోస్ట్గానూ కనిపించనున్నాడు. జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో ఆగస్టు 17 నుంచి టీవీలో ప్రసారం కానుంది. ఇకపోతే జగ్గూ భాయ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు.నా అసలు పేరుతాజాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, ప్రశ్నలపై స్పందిస్తూ యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో జగపతిబాబు మాట్లాడుతూ.. నా పేరు జగపతి రావు. ఇండస్ట్రీలో రావులెక్కువైపోయారని నా పేరును జగపతిబాబుగా మార్చేశారు. అలాగే అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గూభాయ్గా మారిపోయాను.చచ్చిపోయాననుకున్నా..అంతఃపురం సినిమా చివరి సీన్లో నేను దాదాపు చచ్చిపోయాననుకున్నాను. డైరెక్టర్ కృష్ణవంశీ సీన్లో లీనమైపోయి కట్ చెప్పలేకపోయాడు. నిజంగానే పోయాననుకున్నాను. నా కెరీర్ మొత్తంలో అంతఃపురం క్లైమాక్సే ఫేవరెట్ షాట్. నా జుట్టుకు రంగెందుకు వేసుకోనని అడుగుతుంటారు. నాకు ఇంకా జుట్టుండమే అదృష్టం. అది సహజంగానే తెల్లబడింది. కాబట్టి దాన్నలాగే వదిలేస్తాను. సహజంగా ఉంటేనే నేను బాగుంటాను. నన్నిలాగే వదిలేయండి. నాకు పెద్దగా కోరికలేం లేవు. చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నిత్యం ప్రాణాయామం చేస్తుంటాను అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.చదవండి: భార్యాభర్తల కొట్లాటే 'సార్ మేడమ్'.. వచ్చేవారమే ఓటీటీలో.. -
బెల్లంకొండ, అనుపమ హర్రర్ సినిమా టీజర్ ఎలా ఉంది..?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ‘కిష్కింధపురి’ టీజర్ను విడుదల చేశారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీగా ‘కిష్కింధపురి’ రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజైన టీజర్ కూడా అంతే స్థాయిలో అలరించేలా ఉంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ రెండు సినిమాలు కూడా ఫారెస్ట్ ఎపిసోడ్స్ నేపథ్యంలోనే కొనసాగనున్నాయని తెలుస్తోంది. -
'కూలీ' కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్.. తమిళ్లో ఇదే టాప్
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన 'కూలీ' (Coolie) సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ్ సినిమాగా కూలీ నిలిచిందంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ప్రీమియర్ షోలు లేకుండా ఆపై తమిళనాడులో టికెట్ ధరలు పెంచకుండానే బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.151+ కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ది రికార్డ్ మేకర్, రికార్డ్ బ్రేకర్ అంటూ షోషల్మీడియాలో ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాలు వరుసుగా ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో 'కూలీ' సినిమా ఉండగా రెండో స్థానంలో విజయ్ నటించిన లియో (రూ. 148 కోట్లు ) ఉంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (రూ. 110 కోట్లు), రోబో 2.O (రూ. 100 కోట్లు), కబాలి (రూ. 87.5) కోట్లు, జైలర్ (రూ. 87 కోట్లు), పొన్నియన్ సెల్వన్1 (78. 30 కోట్లు), సర్కార్ ( రూ. 75 కోట్లు), బీస్ట్ (రూ. 72.67 కోట్లు), విక్రమ్ (రూ. 66 కోట్లు) టాప్ టెన్ లిస్ట్లో ఉన్నాయి. ఈ కలెక్షన్స్ అన్ని కూడా గ్రాస్ రూపంలో చెప్పబడింది.Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crore #Coolie in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn— Sun Pictures (@sunpictures) August 15, 2025 -
త్రివిక్రమ్ - వెంకీ సినిమాలో డబుల్ గ్లామర్!
-
హిట్ కాంబినేషన్లో వెంకటేష్ సినిమా ప్రారంభం
ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేష్ కొత్త (Venky 77) సినిమాను ప్రారంభించారు. నేడు దర్శకుడు త్రివిక్రమ్తో వెంకీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మరికొద్దిరోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ రైటర్గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వెంకీ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్గా త్రిష, రుక్ష్మిణీ వసంత్, నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఇద్దరు నటించనున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.వెంకటేష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మీనాతో కలిసి ఓ సినిమా (దృశ్యం 3) చేయనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. 𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 - #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/NvxQ3pnMPC— Haarika & Hassine Creations (@haarikahassine) August 15, 2025 -
ఈసారైనా రవితేజ హిట్ కొడతాడా..?
-
పెళ్లిపందిట్లో టాలీవుడ్ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..!
'కేరింత' సినిమాతో వెండితెరపై తళుక్కుమని మెరిశాడు విశ్వంత్ దుద్దుంపూడి (Viswant Duddumpudi). ఓ పిట్ట కథ, క్రేజీ క్రేజీ ఫీలింగ్, తోలు బొమ్మలాట, బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనుక కథ, నమో, హైండ్ అండ్ సీక్ చిత్రాల్లో హీరోగా నటించాడు. జెర్సీ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.ఆరు నెలల కిందట పెళ్లితాజాగా అతడు తన పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. గతేడాది ఆగస్టులో భావన అనే అమ్మాయితో విశ్వంత్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజునే భావనను పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేశాడు. తన పెళ్లయి ఆరునెలలు అవుతుండటంతో తాజాగా మరోసారి తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.పెళ్లి ఫోటోలు షేర్ చేసిన హీరోభావన & విశ్వంత్.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే చూపులోనే ఓ రకమైన ప్రశాంతత.. నువ్వు నాకెప్పటినుంచో తెలుసన్న భావన.. ఇద్దరి చిరునవ్వులు సహజంగానే కలిసిపోయాయి! అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by One Fine Day (@onefinedaypictures) చదవండి: రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తారలు -
రాహుల్ సిప్లిగంజ్కు రూ.1 కోటి చెక్ ఇచ్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్కు చెక్ బహుకరించారు. కాగా పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే!ఆయన పాడిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ఈ క్రమంలో 2023లో మే 12l టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. కాంగ్రెస్ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని ప్రకటించారు. ఇటీవల గద్దర్ అవార్డుల ఫంక్షన్లోనూ రాహుల్ను గుర్తు చేస్తూ త్వరలోనే బహుమతి ఉంటుందన్నారు. పాతబస్తీ బోనాల పండగలోనూ మరోసారి ఆ విషయాన్ని నొక్కి చెప్పారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కోటి రూపాయల నగదును చెక్ రూపంలో రాహుల్కు బహుకరించారు.చదవండి: బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. -
రంగస్థలం -2 ప్లాన్ స్టార్ట్?
-
చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో పంద్రాగస్టు వేడుకలు (ఫోటోలు)
-
సైమా అవార్డ్స్ ప్రెస్మీట్లో మెరిసిన సెలబ్రిటీస్ (ఫొటోలు)
-
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్పై షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్గా, ఆ తర్వాత లెజెండ్గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
బేబీ బంప్తో మాళవికా రాజ్.. స్విమ్ షూట్లో మన్మధుడు బ్యూటీ!
బేబీ బంప్ ఫోటోలతో మాళవికా రాజ్ బగ్గా..బ్లాక్ డ్రెస్లో సుప్రీత స్టన్నింగ్ లుక్..మాతృత్వం ఆస్వాదిస్తోన్న మహాతల్లి..స్విమ్ షూట్లో మన్మధుడు హీరోయిన్ అన్షు..గుర్రంపై బిగ్బాస్ ఇనయా సవారీ..బ్లూ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..గ్రీన్ డ్రెస్లో మోనాల్ గజ్జర్ స్టైలిష్ లుక్.. View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
కూలీ థియేటర్లో బ్లాక్బస్టర్ ట్రైలర్.. దద్దరిల్లిపోయేలా అరుపులు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్సెట్ చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల క్రిత రిలీజైన మరోసారి మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. అయితే సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీ హంగులతో బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.అంతేకాకుండా ఇవాళ కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా శివ 4కే ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రజినీకాంత్ కూలీ సినిమాకు ముందు శివ ట్రైలర్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. థియేటర్ దద్దరిల్లిపోయేలా శివ పేరుతో మార్మోగిపోయేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్జీవీ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్తో, 4కే విజువల్స్తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నామని నాగార్జున తెలిపారు. నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లిందని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చిందన్నారు. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్ను డాల్బీ అట్మాస్కి మార్చాం.. శివని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ అని రామ్గోపాల్ వర్మ తెలిపారు..pic.twitter.com/tozHy5t1jC— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2025 -
హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?.. చేయి కోసుకుని మరి..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం: అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనంటూ బాంబు పేల్చారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని మాట్లాడారు. సైమా అవార్డుల ప్రెస్మీట్కు హజరైన అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందని తెలిపారు.జాతీయ అవార్డులపై సైమా స్పందించి విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. మనకు ఎన్నీ జాతీయ అవార్డులు వచ్చినా టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రం స్పందించలేదన్నారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సిన గొప్ప వేడుక అని అల్లు అరవింద్ వెల్లడించారు.కాగా.. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, బేబీ మూవీ ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత అవార్డుకు ఎంపికైన డైరెక్టర్ సాయి రాజేశ్, బేబీ సినిమా పాటకు ఉత్తమ సింగర్గా పీవీఎన్ఎస్ రోహిత్ను సైమా టీమ్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. -
కూలీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే!
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఓటీటీ వివరాలుఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
అర్ధరాత్రి బస్టాండ్లో నిద్ర.. ఆ హీరో నా నెంబర్ తీసుకుని..: సౌమ్యరావు
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్యరావు (Sowmya Rao) జబర్దస్త్ షోతో యాంకర్గా మారింది. కన్నడ నటి అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకోవడమేకాకుండా తెలుగులో ఓ పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌమ్య జీవితంలో ఏదైనా వెలితి ఉందంటే అది తల్లిని కోల్పోవడమే! బ్రెయిన్ క్యాన్సర్తో సౌమ్య తల్లి మరణించింది. అర్ధరాత్రి బస్టాండ్లో నిద్రతాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య రావు తన జర్నీ గురించి మాట్లాడింది. 'నేను చాలా పేదరికం అనుభవించాను. ఓ రోజు అర్ధరాత్రి అమ్మ, నేను, సోదరుడు.. ముగ్గురం బస్టాప్లో పడుకున్నాం. రెండురోజులదాకా నేను అన్నం తినలేదు. తిరుపతి వెళ్లినప్పుడు దైవదర్శనం కంటే కూడా నాకు తిండి ఎప్పుడు పెడతారా? అని ఎదురుచూసేదాన్ని. అంతటి దీనస్థితిలో బతికా.. సిండికేట్ఈ బుల్లితెర ఇండస్ట్రీలో నెగ్గాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ ఉండాలి. కొందరికి అదృష్టం కలిసొచ్చి, మరికొందరు ఏవో జిమ్మిక్కులు చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇంకా అలా వస్తూనే ఉంటారు. ఉదయభాను అన్నట్లు ఇక్కడ పెద్ద సిండికేటు ఉంది. దానివల్ల నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. నేను ఓ సీరియల్ చేశాను. అందులోని హీరోహీరోయిన్లకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది. షూటింగ్ ప్యాకప్ చెప్పాక హీరో వచ్చి నాతో ఏదో చెప్తూ ఉంటే.. ఆ హీరోయిన్ కారును రివర్స్ గేర్లో తీసుకొచ్చి నన్ను ఢీ కొట్టింది. అదొక భయంకరమైన అనుభవం. ఇండస్ట్రీ నాకు ఇచ్చినదానికన్నా నేను పోగొట్టుకుందే ఎక్కువ. యాక్సిడెంట్ఒకసారి ఓ పెద్ద హీరోను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. త్వరగా వెళ్లాలని కారును స్పీడ్గా పోనిచ్చాను. అప్పుడు యాక్సిడెంట్ జరిగి కాలుకు దెబ్బ బలంగా తగిలి చాలా రక్తం పోయింది. ఇలా చాలా కష్టాలు చూశాను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ పెద్ద హీరో కలిసి.. తనతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడంది. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. తనకున్న ఏకైక వెలితి అమ్మ అని.. ఇంకొన్నాళ్లు తనుంటే బాగుండేదని అభిప్రాయపడింది. తనకు బ్రెయిన్ క్యాన్సర్ రాకపోయుంటే బాగుండని చెప్తూ సౌమ్య ఎమోషనలైంది.చదవండి: కన్నడ సినిమాలు ఆడుతున్నాయా? చులకన చేసిన స్టార్ హీరో -
'సితారే జమీన్ పర్' మూవీ ఆఫర్.. రెండు రోజులు మాత్రమే
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్లో రన్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటూ రూ. 100 చెల్లించాల్సి ఉంది. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రెంట్ తాజాగా తగ్గించారు. థియేటర్లో ప్రదర్శన అనంతరం నేరుగా యూట్యూబ్లోనే ఈ మూవీని ఆయన విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.ఇండిపెండెన్స్ డే కానుకగా సితారే జమీన్ పర్ సినిమాను కేవలం రూ. 50లకే చూడొచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్లో కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఆగష్టు 15 నుంచి 17 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్ ఖాన్ ఒక వీడియో విడుదల చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి మహేశ్బాబు ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులు దోచుకుంటోందని ఆయన అన్నారు. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన అన్నారు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
అలాంటి ఫ్రెండ్ అందరికీ దొరకడు.. ఇప్పటికీ నాన్న చిన్నపిల్లాడైపోతాడు
రజనీకాంత్ (Rajinikanth) నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే వస్తాయి. బస్ కండక్టర్ నుంచి సూపర్స్టార్గా ఎదిగిన రజనీ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. ఆగస్టు 15 నాటికి రజనీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా రజనీ ఆప్త మిత్రుడు మోహన్బాబు (Mohanbabu) కూతురు మంచు లక్ష్మి అనేక విషయాలను పంచుకుంది.నాన్న చిన్నపిల్లాడిగా..మంచు లక్ష్మి మాట్లాడుతూ.. రజనీ అంకుల్ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. మాక్కూడా ఆయనంటే చాలా ఇష్టం. అంకుల్ వచ్చాడంటే మా నాన్న చిన్నపిల్లాడయిపోతాడు. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న అందమైన స్నేహం వారిది. నటులవ్వడానికి ముందు నుంచే ఇద్దరూ మంచి మిత్రులు.కష్టసుఖాల్లోనూ..మా నాన్న ఎప్పుడైనా బాధలో ఉంటే అంకుల్ సపోర్ట్గా నిలబడతాడు. అలాగే అంకుల్కు ఏదైనా కష్టమొచ్చిందంటే నాన్న తోడుగా ఉంటాడు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇద్దరూ కలిసే ఉంటారు. అలాంటి ఫ్రెండ్ దొరకాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని కోరుకోవాల్సిందే! పెదరాయుడు సినిమాలో అంకుల్ గెస్ట్ రోల్ చేశాడు. పెదరాయుడు మూవీలో..నిజానికి ఆయనకు ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే ఆ మూవీలో యాక్ట్ చేశాడు. నాన్న కోసం ఆయన స్వయంగా రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథ రాసిచ్చాడు. అదీ వారి ఫ్రెండ్షిప్ గొప్పదనం. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్లోనూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన మృణాల్ -
శారీలో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
బిగ్బాస్లోకి 'లక్స్ పాప'.. 'ఉల్లు' ఓటీటీతో మరింత పాపులర్
తెలుగు వారికి ఆశా సైనీ (Asha Saini)గా బాగా దగ్గరైన బ్యూటీ ఇప్పుడు బిగ్బాస్-9లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అసుల పేరు ఫోరా సైనీ.. 1990లో ‘ప్రేమకోసం’ సినిమాతో టాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'నరసింహ నాయుడు, 'నువ్వు నాకు నచ్చావ్', 'ప్రేమతో రా,143 వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణతో 'లక్స్ పాప.. లక్స్ పాప' అంటూ స్టెప్పులేసింది. అయితే, 2011 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ, బాలీవుడ్ పరిశ్రమలో బిజీగానే ఉంది. హిందీ వెబ్ సిరీస్లతో పాటు పలు సినిమాల్లొ గ్లామరస్ పాత్రలే ఎక్కువ చేస్తుంది. రానా నాయుడు, ఆర్య, X.X.X వంటి సీరిస్లో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏకంగా ఉల్లు ఓటీటీ కోసం ఒక రొమాంటిక్ ఫిలింలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుగు బిగ్బాస్-9లో తన గ్లామర్ టాలెంట్ను చూపించేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.వివాదాలు 2008లో నకిలీ వీసా కేసులో అరెస్టు కావడం వల్ల తమిళ పరిశ్రమలో ఆమె కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓ నిర్మాతతో తన గత సంబంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను చిత్రహింసలకు గురి చేశాడని, 14 నెలల పాటు ఒంటరిగా ఉంచాడని వెల్లడించింది. ఆ నిర్మాతతో ప్రేమల పడి నరకం చూశానని చెప్పింది. తన ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై రోజూ కొట్టేవాడని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన తల్లి వద్దే ఉంటున్నానని ఆమె చెప్పింది. అయితే, తాను తిరిగి వెండితెరపై కనిపించాలని ప్లాన్ చేస్తుంది. తనకు మొదట లైఫ్ ఇచ్చింది తెలుగు పరిశ్రమనే కాబట్టి మరోసారి ఇక్కడ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఆమె ఉన్నట్లు సమాచారం.తాజాగా బిగ్బాస్-9 నుంచి ఒక ప్రోమో విడుదలైంది. అందులో బిగ్బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! -
'కూలీ' సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. సంతోషంగా 'రజనీ' సతీమణి (ఫోటోలు)
-
ఉపాసన కోసం 200 నంబర్స్ మార్చిన చెర్రీ..!
-
మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన కారు ఫోటోలను కూడా పంచుకుంది. మహేశ్బాబు మరదలు, నమత్రా శిరోద్కర్కు ఆమె సోదరి అవుతారనే విషయం తెలిసిందే. 'బ్రహ్మ' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె పలు హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. ఆపై ‘బిగ్బాస్ 18’ (హిందీ) కంటెస్టెంట్గా కూడా మెప్పించింది.ముంబైలో తాను ప్రయాణిస్తున్న కారును ఒక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిందని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. కానీ, తన కారుకు మాత్రమే డ్యామేజ్ అయిందని ఆమె ఇలా చెప్పింది. ఆ బస్సు ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తుందో ఆ యాజమాన్యంపై శిల్పా ఫిర్యాదు చేసింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు కదా అంటూ.. ఈ సంఘటనకు తమ కంపెనీ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదని సదరు కంపెనీ చెప్పినట్లు ఆమె పేర్కొంది. ముంబైలోని ఆ ఆఫీసుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు యోగేష్ కదమ్, విలాస్ ఇది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్ బాధ్యత అని వెళ్లిపోయారని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. ఈ వ్యక్తులు ఎంత క్రూరంగా ఉన్నారు..? డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడు..? అని సోషల్మీడియాలో ఆమె రాసింది. ఈ విషయంలో ముంబై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారని వారు సరైనా న్యాయం చేశారని ఆమె తెలిపింది. -
బ్లాక్ బ్యూటీలా చాహల్ గర్ల్ ఫ్రెండ్.. బాలిలో బిగ్బాస్ దివి ఐస్ బాత్!
బ్లాక్ బ్యూటీలా చాహల్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్..జిమ్లో చెమడ్చోడుస్తున్న బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..అరుణాచల్ ప్రదేశ్ పర్వతాల్లో వితికా శేరు చిల్..బాలిలో బిగ్బాస్ దివి ఐస్ బాత్ పిక్స్..సింహాచలం ఆలయంలో హీరోయిన్ లయ పూజలు..శ్రీదేవితో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హీరోయిన్ మహేశ్వరి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
ఆ కండీషన్స్ ఒప్పుకుంటేనే వేతనాల పెంపు: నిర్మాత దిల్ రాజు
ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు, ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో సినీ వర్కర్స్ సమ్మె యథావిధిగా కొనసాగనుంది. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలపై సయోధ్యం కుదరలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భేటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరై మాట్లాడారు.ఈ చర్చలపై దిల్ రాజు మాట్లాడుతూ... ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ , నిర్మాతల మధ్య మీటింగ్ జరిగింది. వేతనాల పెంపు, నిర్మాతల వైపు నుంచి రెండు వర్కింగ్ కండీషన్స్పై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలను పెంచుదామని నిర్మాతలు చెప్పారు. మరోసారి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రూ.2 వేల కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకుని వస్తే సమస్య పరిష్కరిస్తాం' అని అన్నారు.రేపటి నుంచి చర్చలు కూడా కొనసాగుతాయని నిర్మాత సి కల్యాణ్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్లకు పర్సంటేజ్ పెంచలేమని అన్నారు. సమ్మె కొనసాగించెందుకు నిర్మాతలు సైతం సిద్దమేనని ఆయన ప్రకటించారు. -
అవ్వ - బువ్వ.. ఏదీ తేల్చుకోలేకపోతున్నా: మంచు మనోజ్
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం. 20 మందిని తీసుకెళ్తా..రెండు చిత్రాలు బ్లాక్బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్కు, కూలీ మూవీ యూనిట్కు ఆల్ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. “Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025 చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు! -
పరదా కోసం రోడ్డెక్కిన స్టార్ హీరోయిన్!
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.తాజాగా తన మూవీ పరదా ప్రమోషన్స్ను రోటీన్కు భిన్నంగా నిర్వహించింది. వైజాగ్లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది. పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగుల పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి అంటూ కారులో నిలబడి తన మూవీని ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.Vizag ♥️ #paradha on August 22nd pic.twitter.com/mOY1Q5bIF6— Anupama Parameswaran (@anupamahere) August 12, 2025Actress Anupama Parameswaran markets her 22 August release #Paradha during her Andhra tour! pic.twitter.com/9RxeYvglMI— idlebrain jeevi (@idlebrainjeevi) August 12, 2025 -
ఉదయభాను అగ్రెసివ్ రోల్.. త్రిభాణధారి బార్బరిక్ ట్రైలర్ చూశారా?
సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో ఉదయభాను ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ కథను డ్రగ్స్ మాఫియా కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉదయభాను రోల్ చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్, వీటీవీ గణేశ్, రాజేంద్రన్ కీలకపాత్రల్లో నటించారు. -
నా సినిమా చూడండి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లేటెస్ట్ మూవీ పరదా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మంగళవారం నాడు విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్లో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పూర్తి చేసిన సినిమా పరదా. దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంత ఈజీ కాదుఎందుకిలా ఎమోషనల్ అవుతున్నారన్న ప్రశ్నకు.. ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ ఒకమ్మాయి సినిమా చేసి ముందుకు రావడం అంత సులువేమీ కాదు. మూవీ చేయడానికన్నా దాన్ని రిలీజ్ చేయడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. నా సినిమా కాబట్టి చూడమని చెప్పడం లేదు. నేను చేసిన సినిమాల్లోనే సగం నాకు నచ్చవు. విమర్శిస్తూ ఉంటాను. కానీ, ఈ మూవీలో నేను విమర్శించడానికేం లేదు అంటూ ఏడ్చేసింది. చదవండి: Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు! -
ది రాజాసాబ్ హీరోయిన్కు ప్రభాస్ సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్కు భోజనం పంపించారు మన ప్రభాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.ది రాజాసాబ్లో నిధి..ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ప్రయాణించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్కు వెళ్లిన నిధి అగర్వాల్కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025 -
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దుఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తరలించడం జరగదు, చంపేస్తారా?తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ప్రోగ్రామ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.మా జేబులో నుంచి తీస్తున్నాంజంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. లోలోపలే చచ్చిపోతున్నా..ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) చదవండి: గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య! -
గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య!
బుల్లితెర షో ద్వారా కమెడియన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్ ఆచంట (Mahesh Achanta). జబర్దస్త్ కామెడీతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. శతమానం భవతి చిత్రంతో క్లిక్ అయ్యాడు. రంగస్థలం సినిమాతో టాప్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి రంగస్థలం మహేశ్గా స్థిరపడిపోయాడు.సినిమామహానటి, యాత్ర, మహర్షి, గుణ 369, గుంటూరుకారం, జాతిరత్నాలు, విరూపాక్ష, సీతారామం, తండేల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేశ్.. బంధువులమ్మాయి పావనిని వివాహమాడాడు. 2020లో లాక్డౌన్లోనే వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు సంతానం.గుడ్న్యూస్తాజాగా మహేశ్ ఆచంట ఓ గుడ్న్యూస్ చెప్పాడు. రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్య మెటర్నటీ ఫోటోషూట్లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన తారలు, అభిమానులు మహేశ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by kidsography by Nikhil Ronald (@kidsography_by_nikhil_ronald) చదవండి: బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే -
సింహాచల దర్శనం చేసుకున్న నటి లయ (ఫొటోలు)