breaking news
Tollywood
-
హీరో సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
విజయ్, రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..!
-
హీరోయిన్ నిత్యా మేనన్ మరో ముందడుగు
హీరోయిన్ నిత్యా మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాని, నితిన్ తదితర హీరోలతో పలు సినిమాలు చేసింది. హిట్స్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఇతర దక్షిణాది భాషలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది ఈమె నుంచి మూడు తమిళ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి నిత్య చేతిలో కొత్త ప్రాజెక్టులు అయితే ఏం లేనట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)'కేయూరి ప్రొడక్షన్ (Keyuri Productions)' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడించిన నిత్యా మేనన్.. ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వ్యాపార లాభాల కంటే కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే సినిమాలకే తన ప్రాధాన్యం అని పేర్కొంది. ప్రస్తుతానికి కొత్తగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్టులేం ప్రకటించలేదు. చూస్తుంటే తనకున్న యాక్టింగ్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత నటి, నిర్మాత కొనసాగనుంది. 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మేనన్.. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో కనిపించింది.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత) View this post on Instagram A post shared by Keyuri (@keyuriproductions) -
మా పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారు.. రాజమౌళి తండ్రి
దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమస్సో.. ఈయన సినిమాలన్నింటికీ కథలు రాసే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే ఫేమస్. మహేశ్ బాబు 'వారణాసి'కి స్టోరీ రాసిన ఈయన.. ప్రస్తుతం పలు చిత్రాలకు కథలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటిది మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన మాతా రాంబాయి అంబ్కేడర్ మెమొరియల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా అనిపించాయి.(ఇదీ చదవండి: మానస వారణాసి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)'మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు. మా పూర్వీకులు మాత్రం అంటరానితనం పేరుతో, నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశారు. అప్పటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు మనసు సిగ్గుతో, అవమానంతో కుంగిపోతుంది. మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. క్షమించండి. క్షమించండి.. క్షమించండి' అని విజయేంద్ర ప్రసాద్ వేడుకున్నారు.ఇప్పటికీ తన ఆఫీస్లో అంబేడ్కర్ ఫొటో మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం ఆయనపై ఓ సినిమా కథ రాస్తున్నానని ఈ మేరకు పరిశోధన చేస్తున్నానని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత) -
హీరోయిన్ తమన్నా 'శివరాత్రి' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్ డే కేరళ కుట్టీ.. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ (ఫొటోలు)
-
తెలుగమ్మాయి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
టాలీవుడ్లో హీరోయిన్లుగా చేసిన తెలుగమ్మాయిలు రీసెంట్ టైంలో బాగానే కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో మానస వారణాసి ఒకరు. గత వీకెండ్ రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో తొలి సక్సెస్ అందుకున్న ఈమె.. సంతోషంలో మునిగితేలుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ)మాసన పక్కా హైదరాబాదీ. చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది గానీ తండ్రి ఉద్యోగరీత్యా మలేసియా వెళ్లింది. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో చదివింది. ఆ టైంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2020లో మిస్ తెలంగాణగా నిలిచింది. అదే ఏడాది.. ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ కిరీటాలు కూడా సొంతం చేసుకుంది.పలు మోడలింగ్ పోటీల్లో గెలిచిన ఈమెకు సహజంగా సినిమాలపై ఆసక్తి కలిగింది. కానీ ఇంట్లో వాళ్లు తొలుత వద్దని చెప్పడంతో హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సేంజ్ అనలిస్టుగా కొన్నాళ్ల పాటు పనిచేసింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఇంట్లో వాళ్లని ఒప్పించి ఇండస్ట్రీలోకి ఎంటరైంది. తొలుత మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలో హీరోయిన్గా చేసింది. లుక్స్ బాగున్నప్పటికీ హిట్ అయితే దక్కలేదు.2024లో తొలి సినిమా రిలీజైతే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో వచ్చింది. ఇందులో మిత్ర అనే పాత్రలో అదరగొట్టేసింది. సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఈ చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న మానస.. టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. సంతోష్ శోభన్తోనే మరో సినిమా చేయనున్న మానసకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. శ్రీలీల, భాగ్యశ్రీ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. స్టార్ హీరోలకు సరైన జోడీగా మానస నిలిచే ఛాన్స్ ఉంది. మరి కెరీర్ని ఈమె ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: హీరో సుహాస్) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
‘బూకీ’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
సుహాస్ ‘హే బల్వంత్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు
టాలీవుడ్లో లెక్కలేనంత మంది హీరోలున్నారు. స్టార్స్ పెద్దగా కష్టాల్లాంటివి ఉండవు గానీ చిన్న హీరోలు మాత్రం చాలా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో సుహాస్ ఒకడు. షార్ట్ ఫిల్మ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఇప్పుడు తెలుగు హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అడపాదడపా మూవీస్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ ఘోర అవమానాన్ని గుర్తుచేసుకున్నాడు. దానితో లింక్ చేస్తూ తను ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్)'ఓ సినిమాకు యాక్టర్గా వెళ్లినప్పుడు పెద్ద హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర దక్కింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత.. ఇతడిని ఎందుకు పిలిచారని అక్కడే నన్ను అవమానించారు. ఆమె పక్కన నిలబడే అర్హత కూడా లేదన్నారు. కట్ ఇప్పుడు కీర్తి సురేశ్తో 'ఉప్పు కప్పురంబు' అనే మూవీ చేశాను. నా విషయంలో ఇది సక్సెస్. పెద్ద హీరోయిన్ పక్కన నేను పనికిరాను అని అన్నోళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతెందుకు కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. నేను కనిపిస్తే హగ్ కూడా ఇస్తున్నారు' అని సుహాస్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'హే బల్వంత్'. శివానీ నాగారం హీరోయిన్. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ బిజినెస్ అనే కాన్సెప్ట్తో తీసినట్లు ట్రైలర్ బట్టి అర్థమైంది. (ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన) -
ఆన్ మిషన్ జోరు మీదున్న యానిమేషన్ మూవీస్
⇒ అమరేంద్ర బాహుబలి.... భల్లాలదేవ ఢీ అంటే ఢీ అంటూ ఆయుధాలతో, ఒంటి చేత్తో ఒకరిపై మరొకరు ఎలా దాడి చేసుకున్నారో ‘బాహుబలి’లో చూశాం...⇒ కొమురం భీమ్... అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై ఏ స్థాయి పోరాటం చేశారో ‘ఆర్ఆర్ఆర్’లో చూశాం.⇒ ఇప్పుడు ఈ సినిమాల్లోని క్యారెక్టర్లు ‘యానిమేషన్’ రూపంలో కనిపిస్తే... అదో థ్రిల్. ⇒ అంతేనా... హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో ఆ విష్ణువు సంహరించిన ఘటనను ‘మహావతార్ నరసింహా’లో చూశాం. అయితే యానిమేషన్ రూపంలోనే ఈ సినిమాని చూశాం. ఈ సిరీస్లో ఇంకా ఆరు సినిమాలు రానున్నాయి.⇒ ఇవే కాదు... ఇంకా మరికొన్ని యానిమేషన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు యానిమేషన్ చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. దానికి కారణం ఆ చిత్రాలకు దక్కుతున్న ప్రేక్షకాదరణ... వస్తున్న వసూళ్లు.⇒ ఇక ‘ఆన్ మిషన్’ అంటూ జోరుగా నిర్మాణంలో ఉన్న ‘యానిమేషన్ మూవీస్’ గురించి తెలుసుకుందాం.ఇటు బాహుబలి... అటు ఆర్ఆర్ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోపాన్ ఇండియా మార్కెట్ ట్రెండ్ను తెరపైకి తెచ్చిన ఈ తరం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు మహేశ్బాబుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తూ, అదే స్థాయిలో రిలీజ్నుప్లాన్ చేస్తూ,పాన్–వరల్డ్ ట్రెండ్ను టాలీవుడ్లో స్టార్ట్ చేశారు. అలాగే రాజమౌళి చూపు యానిమేషన్ చిత్రాలపై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ విజువల్ వండర్స్ను ఆడియన్స్ తెరపై చూశారు. ముఖ్యంగా ‘ఈగ’ సినిమాను రాజమౌళి సూపర్బ్ టెక్నికల్ స్టాండర్డ్స్తో తెరకెక్కించారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి’ (‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్క్లూజన్’), ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల కొనసాగింపు కథలు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, సత్యరాజ్ ప్రధానపాత్రల్లో నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: కన్క్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా గత ఏడాది 31 అక్టోబరు 2025న విడుదల చేశారు. ఆ సమయంలో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావొచ్చనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కానీ ‘బాహుబలి’ కథకు కొనసాగింపుగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యానిమేషన్ సినిమా త్రీడీ ఫార్మాట్లో రానుందని, రాజమౌళి అధికారికంగా వెల్లడించారు.‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమా టీజర్ను కూడా రిలీజ్ చేసి, ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయనున్నట్లుగా రాజమౌళి తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. 2027లో రిలీజ్ అవుతున్నది ‘ది బాహుబలి: ది ఎటర్నల్ వార్’ తొలి భాగం మాత్రమే. అంటే... ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని యానిమేషన్ చిత్రాలొస్తాయని ఊహించవచ్చు. దేవ, రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయం ఉంటే ఏం జరుగుతుంది? అనేపాయింట్ ఆఫ్ వ్యూలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ త్రీడీ యానిమేషన్ సినిమాను దాదాపు రూ. 120 కోట్లతో తెరకెక్కిస్తున్నారట మేకర్స్.ఆర్కా మీడియా వర్క్స్, ముంబైకి చెందిన యానిమేషన్ లీడ్ స్టూడియో 88 పిక్చర్స్ ఈ సినిమా నిర్మాణంలో అసోసియేట్ అయ్యాయి. ఇషాన్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమాకు నా పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ సినిమాల్లోని క్యారెక్టర్స్తోపాటు మరికొన్ని కొత్తపాత్రలను ఈ సినిమాలో చూస్తారు’’ అని ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు.ఆర్ఆర్ఆర్ యూనివర్స్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’పాట ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడం, ఈపాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిలకు ఆస్కార్ అవార్డులు రావడం కూడా తెలిసిందే. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ‘ఆర్ఆర్ఆర్ 2’ ఉండే అవకాశం ఉందని, ఈ చిత్రం కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కథకు కొనసాగింపుగా సినిమా రానుంది. కానీ లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మ్ కాదు... యానిమేషన్ ఫిల్మ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కొనసాగింపుగా ‘ఆర్ఆర్ ఆర్’ యూనివర్స్లో ఓ యానిమేషన్ సినిమా చేసే ఆలోచన ఉందని, ఈ అంశంపై జపాన్ స్టూడియోలు వర్క్ చేస్తున్నాయని ఇటీవల ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు. ఇలా... ఒకవైపు లైవ్ యాక్షన్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తూనే, భవిష్యత్లో యానిమేషన్ సినిమాల హవా ఉంటుందని ఇప్పట్నుంచే రాజమౌళి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందిఏఐతో ‘కొచ్చడైయాన్’ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘కొచ్చడైయాన్’ (2014). ఈ తమిళ పీరియాడికల్ యానిమేషన్ మూవీని సునీల్, సునంద మురళీ మనోహర్, ప్రశీదా చౌదరి నిర్మించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే...‘కొచ్చడైయాన్’ సినిమాను ఏఐ (కృత్రిమ మేధ)తో కొత్త వెర్షన్ రెడీ చేశారు.ఈ రీ మాస్టర్డ్ ‘కొచ్చడైయాన్’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను మంగళవారం రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పదేళ్ల క్రితం మోషన్ క్యాప్చర్ ఫిల్మ్గా చేశాం. ఈ సినిమా నన్ను చాలెంజ్ చేసింది. నన్ను చేంజ్ చేసింది. ‘కొచ్చడైయాన్’ రీ మాస్టర్డ్ టీజర్ని రిలీజ్ చేయడం భావోద్వేగానికి గురి చేస్తోంది’’ అని సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శోభన్, ఆర్. శరత్కుమార్, ఆది పినిశెట్టి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. మహావతార్ యూనివర్స్ గత ఏడాది జూలైలో విడుదలైన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ సినిమాను దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో మేకర్స్ నిర్మించగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అశ్విన్కుమార్ డైరెక్షన్లో క్లిమ్ ప్రోడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ సంస్థలు ‘మహావతార్ నరసింహా’ను నిర్మించాయి.అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే...‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ‘మహావతార్ పరశురామ్’ (2027), ‘మహావతార్ రఘునందన్’ (2029) – (రామావతారం), ‘మహావతార్ ద్వారకాధీష్’ (2031) – (కృష్ణుడు), ‘మహావతార్ గోకులానంద’ (2033) – (కృష్ణుడి బాల్యం/గోకులం), ‘మహావతార్: కల్కిపార్ట్ 1’ (2035), ‘మహావతార్: కల్కిపార్ట్ 2’ (2037) చిత్రాలు రానున్నాయి.‘మహావతార్ నరసింహా’ తర్వాత ‘మహావతార్ పరశురామ్’ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేస్తామని, ప్రతి రెండేళ్లకొకసారి, మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ యానిమేషన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని, దర్శకుడు అశ్విన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భవిష్యత్లో యానిమేషన్ చిత్రాలకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప ఆదరణ ఉంటుందని కూడా అశ్విన్ పేర్కొన్నారు.వాయుపుత్ర భారతీయ ఇతిహాసాలు ‘రామాయణం, మహాభారతం’ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి... మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కాగా పర్వతాలనే కదిలించిన మహా బలశాలి, అంజనీపుత్రుడు హనుమంతుని జీవితం ఆధారంగా ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా తెరకెక్కుతోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ త్రీడీ యానిమేషన్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ‘వాయుపుత్ర’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 2డీ, 3డీ ఫార్మాట్స్లో ‘వాయుపుత్ర’ సినిమాను ఈ ఏడాది దసరాకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కీకీ అండ్ కోకో యానిమేషన్ చిత్రాల్లోనే కిడ్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. హాలీవుడ్ నుంచి ఇండియన్ వ్యూయర్స్ ముందుకు వచ్చిన పలు బాలల యానిమేషన్ చిత్రాలకు విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఈసారి ఈ జానర్లో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ‘కీకీ అండ్ కోకో’ సినిమా రానుంది. బాలనటి శ్రీనిక ప్రధానపాత్రధారిగా పి. నారాయణన్ దర్శకత్వంలో ధరణి నిర్మించిన ఈ కిడ్స్ యానిమేషన్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. పినాకిన్ లార్డ్ శివ నేపథ్యంలో ‘పినాకిన్’ అనే యానిమేషన్ చిత్రం రూపొందుతోంది. కమల్భారతి ఎంటర్టైన్మెంట్ పతాకంపై హర్‡్ష పండిట్, వామన్ రాణే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ‘పినాకిన్’ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఈ ఏడాదే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగానే ‘శివ్ సతీ’ అనే మరో యానిమేషన్ సినిమాను ప్రకటించారు. వివేక్ అంచాలియా ఈ సినిమాకు దర్శకడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హను–మాన్’ సినిమా ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్ నుంచే ఇంకా ‘మహాకాళి, అధీర, జై హనుమాన్’ వంటి సినిమాలు రానున్నాయి. హనుమాన్ మూవీకి 71వ జాతీయ అవార్డుల్లో వీఎఫ్ఎక్స్–యానిమేషన్ విభాగంలో అవార్డులు వచ్చిన విషయం గుర్తుంటే ఉంటుంది (యానిమేషన్ విభాగంలో జెట్టి వెంకట్కుమార్ అవార్డు అందుకున్నారు). అయితే ఈ యూనివర్స్ నుంచే రెండు యానిమేషన్ చిత్రాలను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ వర్మ.గత ఏడాది గోవా వేదికగా జరిగిన 56వ ఇఫీ వేడుకల్లోపాల్గొన్న ఆయన యానిమేషన్ చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. ఇక రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని ‘జై హనుమాన్’ సినిమా ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని, ఈ సినిమాలో రానా ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్’ చిత్రంలో తేజ సజ్జా కూడా నటిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు.భలే భలే మగాడివోయ్ సీక్వెల్ నాని, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా 2015లో విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రావొచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్లో మారుతి ఈ అంశంపై స్పందించారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు సీక్వెల్ కథను యానిమేషన్ రూపంలో తీసుకు వచ్చే ఆలోచన ఉందని మారుతి చెప్పారు. ఇండస్ట్రీకి రాకముందు మారుతికి యానిమేటర్గా వర్క్ చేసిన అనుభవం ఉంది. అలా యానిమేషన్ రంగంలో ఆల్రెడీ ఆయనకు ప్రవేశం ఉంది. ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాల హవా ఊపందుకుంటే, ఆయన డైరెక్షన్లో ఓ యూనిమేషన్ మూవీ రావొచ్చని ఊహించవచ్చు.ఈ కోవలో మరికొన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా మన భారత పురాణ కథల ఆధారంగా ఎక్కువగా యానిమేషన్ చిత్రాలు రూపొందడం విశేషం. ఆ రకంగా వినోదానికి వినోదం... విజ్ఞానానికి విజ్ఞానం అందుతుంది. నేటి తరం పురాణ కథలు తెలుసుకోవడానికి ఈ యానిమేషన్ చిత్రాలు ఉపయోగపడతాయని చెప్పోచ్చు. యానిమేషన్ సినిమా వసూళ్లు రూ. 19 వేల కోట్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో ఓ యానిమేషన్ సినిమా ఉంది. అదే ‘నే ఝా 2’ (2019లో వచ్చిన ‘నే ఝా’ సినిమాకు ఇది సీక్వెల్). చైనీస్ మైథాలజీతో కూడిన ఈ ‘నే ఝా 2’ చిత్రం గత ఏడాది జనవరి 29న రిలీజైంది. యు యంగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనాలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025 చివర్లో ఇతర విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా అనువాదమై, సూపర్హిట్గా నిలిచింది. దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చైనీస్ యానిమేషన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ట్రెడ్ వర్గీయులను ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించింది. మాస్టర్ షెన్కు వ్యతిరేకంగా నే ఝా ఎలా పోరాటం చేశాడు? ఈ పోరాటంలో నే ఝా స్నేహితుడు అవో బింగ్ సహకారం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘నే ఝా 2’ కథ సాగుతుంది. ఈ సినిమా ఈ నెల 20 నుంచి జియో హాట్స్టార్ ఓటీటీలో ఇంగ్లిష్, హిందీ, మాండరీన్ (చైనా భాష) భాషల్లో యాపిల్ టీవీప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. – ముసిమి శివాంజనేయులు -
థ్రిల్ స్టార్ట్
ఆది పినిశెట్టి హీరోగా నటించిన హిట్ మూవీ ‘మరకతమణి’ (2017)కి సీక్వెల్గా ‘మరకతమణి 2’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు.సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్ – కేవీ దురై నిర్మిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఈ చిత్రం ప్రారంబోత్సవానికి హీరో కార్తీ అతిథిగా హాజరై, క్లాప్ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు ‘కెమెరా రోలింగ్, యాక్షన్’ అంటూ షూటింగ్ ఆరంభించారు. ‘‘మరకతమణి 2’ చిత్రం ప్రేక్షకులకు మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ధిబు నినాన్ థామస్, కెమెరా: పీవీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మోహన్ .పి. -
షేర్ రెడీ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ‘‘ది ప్యారడైజ్’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మా సినిమాకి అనిరుధ్ రవిచందర్ చక్కని సంగీతం అందించారు. ‘ఆయా షేర్’పాటని సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వందలాది మంది డ్యాన్సర్లతో నానిపై భారీ సెట్లో చిత్రీకరించాం. ఈ సాంగ్ నాని ఫ్యాన్స్కు బర్త్డే ట్రీట్లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి కెమెరా: సీహెచ్ సాయి. -
క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు: విజయ్ ఆంటోని
అజయ్ ధీషన్, ధనుషా హీరో హీరోయిన్లుగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ తమిళంలో విడుదలైంది. తెలుగులో ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశాను. ఇది యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే యూత్ఫుల్ సినిమా’’ అన్నారు. ఈ సినిమా సమర్పకుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి టాలెంట్ను ప్రోత్సహిస్తారు. ‘మార్గన్’ సినిమాతో నటుడిగా అజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ‘బూకీ’లోనూ అజయ్ నటన ఆడియన్స్ను అలరిస్తుంది.లక్ష్మి, సునీల్గార్లు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు ఆడియన్స్కు కన్నీళ్లు వస్తాయి. సురేష్ ప్రోడక్షన్స్, నిర్మాత రామ్లతో ఇకముందు కూడా మా అసోసియేషన్ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘హీరోగా నేను చేసిన తొలి సినిమా ఇది’’ అని చెప్పారు అజయ్. ‘‘నేను తమిళ్ అబ్బాయిని. కానీ విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక ఈ సినిమాలో మంచి సర్ప్రైజ్ ఉంది’’ అని చెప్పారు గణేష్ చంద్ర. రచయిత భాష్యశ్రీ మాట్లాడారు. -
బేబీ హీరోయిన్ లేటేస్ట్ లుక్..శారీలో సింగర్ మధు ప్రియ..!
ఈషా ఫౌండేషన్ ఈవెంట్ జ్ఞాపకాల్లో తమన్నా..జిమ్లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..శారీలో సింగర్ మధు ప్రియ..బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్.. View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్గా నిలిచిందని టీమ్ను అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్తో సైలెంట్ హిట్గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్ హిట్గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్తోనే సక్సెస్ వచ్చింది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్సంగీతమందించారు. -
నెట్ఫ్లిక్స్ సినిమాల పండగ.. నేరుగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్ సినిమాల జాబితాను ప్రకటించింది. 2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి.తెలుగు సినిమాలు..తక్షకుడు (మూవీ)సూపర్ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్)హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు..హమ్ హిందుస్థానీ(మూవీ)హలో బచ్చో..(మూవీ)ఇక్కా..(మూవీ)టోస్టర్..(మూవీ)మా బెహన్..(మూవీ)గాంధారి..(మూవీ)కర్తవ్య..(మూవీ)బాలీవుడ్ వెబ్ సిరీస్లుఫ్యామిలీ బిజినెస్..(వెబ్ సిరీస్)తలాశ్: ఎ మదర్స్ సెర్చ్..(వెబ్ సిరీస్)మిస్ మ్యాచ్డ్ : సీజన్4..(వెబ్ సిరీస్)ముజాఫర్ కేఫ్..(వెబ్ సిరీస్)లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)చుంబక్..(వెబ్ సిరీస్)ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్) మామ్లా లీగల్ హై -సీజన్2..(వెబ్ సిరీస్)గ్లోరీ.. (వెబ్ సిరీస్)ఆపరేషన్ సఫేద్ సాగర్..(వెబ్ సిరీస్)కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు..మేడ్ ఇన్ కొరియా (మూవీ)లవ్ (తమిళ వెబ్ సిరీస్)లెగసీ (తమిళ వెబ్ సిరీస్)టాక్ షోగ్రేట్ ఇండియన్ కపిల్ షో- సీజన్-5 -
కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్జున్ సర్జా
తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయన్గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్రలో మెప్పించారు. Aanaadu #SriAnjaneyam lo Anjaneyudu laa manalni abhimanulu ga maluchukunna #Arjun garu Eroju #SeethaPayanam hit Aina Sandharbhamga #Kondagattu #SriAnjaneya Swamy vaarini dharsinchukunnaru... pic.twitter.com/nOCrnrarH6— Prabhas Fan (@ivdsai) February 16, 2026 -
సొంతిల్లు లేదు.. అకౌంట్లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే రోటిన్ భిన్నంగా కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్ మీట్లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు. దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్ ఎడ్యుకేషన్కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్ సినిమాకు అడ్వాన్స్ బ్యాంక్లో పడే వరకూ తన అకౌంట్లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్నుమా దాస్ రిలీజ్ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్ సినిమాకు అడ్వాన్స్ రూ.50 వేలు బ్యాంక్ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు. -
నిజమైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన
నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను''నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
హీరో సుహాస్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
ఇళయరాజా.. ఇకపై కేసులు పెట్టడానికి నో ఛాన్స్
ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు జోరు తగ్గిపోయింది గానీ 90స్, 20స్ టైంలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. అయితే గత కొన్నాళ్ల నుంచి కాపీరైట్ పేరుతో కోర్టులో కేసులు వేస్తూ పలువురు దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతూ వచ్చారు. వీటిలో చాలావరకు ఈయన అనుకూలంగా తీర్పులే వచ్చాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈయనకు పెద్ద షాకిచ్చింది.(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)గతేడాది 'అగత్యా' అనే సినిమా విడుదల సందర్భంగా ఇళయరాజా, ఆడియో సంస్థ 'సరిగమ'కు మధ్య వివాదం మొదలైంది. ఇదికాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంతవరకు 'సరిగమ'కు సొంతమైన 134 సినిమాల్లో పాటలని ఇళయారాజా ఉపయోగించడానికి ఏ మాత్రం వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.1976 నుంచి 2001 వరకు ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల పాటల హక్కులని ఆయా నిర్మాతలు.. శాశ్వత ప్రాతిపదికన సరిగమ ఆడియో సంస్థకు విక్రయించారు. అయితే అందులోని కొన్ని పాటలని ఉపయోగించుకోవచ్చని.. ఇళయరాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్స్కి అనుమతి ఇచ్చారు. దీంతో సరిగమ.. కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ఇళయారాజాకు షాకిచ్చేలా తీర్పు వచ్చింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన ఆడియో సంస్థకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా సాంగ్స్ ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. దీనిబట్టి ఇకపై సదరు పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు కుదరదు. అలానే సదరు పాటలకు ఈయనకు హక్కు లేనట్లే.(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత) -
అల్లు అర్జున్పై వ్యాఖ్యలు నా కల్పితమే.. క్షమాపణలు కోరిన కావేరి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజర్ ఓ పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ (Allu Arjun)తో యాడ్ షూటింగ్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్ విడుదల చేసింది. అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది. 42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది. బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్గా బన్నీ గురించి వైరల్ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూ పాడ్కాస్టర్ స్వీకృతి కూడా తన ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్కాస్ట్ ఎపిసోడ్తో పాటు ఇన్స్టా రీల్ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది. View this post on Instagram A post shared by Sweekriti Talks Podcast (@sweekriti.talkspod) -
నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటీషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు.చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నాలుగు వారాల్లో లొంగిపోవాలిసీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్కెళ్లింది. పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది.అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్ కాల్.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్లో ఉన్న శిరికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్ చేసినా సరే ప్రత్యూష ఫోన్ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.ప్రత్యూష పోస్ట్మార్టమ్ప్రత్యూష పోస్ట్మార్టమ్ నిమ్స్లో జరిగిందని ప్రత్యూష తల్లి చెప్పారు. 'సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.పాయిజన్ ఎందుకు తీసుకుందో..ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను.ప్రత్యూష సినిమా విశేషాలుసినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్. -
ప్రముఖ హీరోయిన్కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది.2017న వ్యాపారావేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమీషా పటేల్ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ రూ. 14.50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్లోని ఢిల్లీ రోడ్లోని ఒక హోటల్లో అమీషా పటేల్ కోసం లగ్జరీ హోటల్ బుకింగ్ చేశారు. అయితే, చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమీషా. . రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని మిగిలిన రూ. 4.50 లక్షల చెక్కు తరువాత బౌన్స్ అయిందని కోర్టుకు వర్మ తెలిపారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్కు పలుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ, ఆమె హాజరు కాలేదు. ఆమె హాజరును నిర్ధారించడానికి కోర్టు ఇప్పుడు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఈ వివాదం 2017 నాటిదని, ఒక ఒప్పందం ద్వారా సమస్య ఎప్పుడో క్లియర్ అయిందన్నారు. ఆమేరకు మొత్తం డబ్బును తిరిగి ఇచ్చిందని ఆయన అన్నారు. అమీషా పటేల్ వివరణఈ విషయంపై అమీషా పటేల్ సోషల్మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. 'అర్ధిక లావాదేవీలకు సంబంధించి పవన్ వర్మతో సెటిల్మెంట్ గతంలోనే పూర్తి అయింది. ఆమేరకు డీడ్పై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తను ఇప్పటికైనా మానుకోవాలి.' అని అమీషా తెలిపింది. -
విజయ్- రష్మికల పెళ్లికి వెళ్తున్న స్టార్స్ వీళ్లే..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనుంది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొననున్నారు. అయితే, మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో భారీగా టాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.విజయ్, రష్మికల వివాహానికి ఉదయ్పూర్ వెళ్లే అతిధుల జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుండి ఎంపిక చేసిన ప్రముఖులతో పాటు వారి సన్నిహితులు మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, కృతి సనన్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అయితే, హైదరాబాద్లో మార్చి 4న జరిగే రిసెప్షన్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు స్టార్స్తో పాటు యువ నటీనటులు హజరుకానున్నారు. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుండి కొంతమంది కీలక రాజకీయ నాయకులు కూడా విజయ్ పెళ్లిలో పాల్గొంటారని సమాచారం. ఈ జాబితా గురించి విజయ్ జోడీ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. -
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్దాస్ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. -
అల్లు శిరీష్, నయనిక వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నారంటే.. (ఫోటోలు)
-
ఫౌజి షూటింగ్లో..
వరుస పాన్ ఇండియన్ ఫిల్మ్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఫౌజి’ ఒకటి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ సీన్స్ తెరకెక్కిస్తుండగా అదుపు తప్పి ప్రభాస్ కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘‘ఏదైనా సినిమా షూటింగ్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమే. ప్రభాస్కి పెద్ద గాయాలు కాలేదు.ఆయన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడింది. అది కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అభిమానులు కంగారుపడొద్దు’’ అంటూ పేర్కొనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజి’ విడుదల కానుంది. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలున్నాయి. -
ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం
‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్ శివానీ నాగారం. సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్వంత్!’ (హే భగవాన్ టైటిల్ను హే భల్వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం హైదరాబాద్. గాయనిగా కెరీర్ను ప్రారంభించాను. యాక్టర్గా తొలిసారి సుహాస్తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్తో ‘హే బల్వంత్’ చేశాను.నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తాను. అవకాశం వస్తే సింగర్గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు. -
పిలిచే మల్లికా...
ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ యాక్షన్ డ్రామా ‘కాటాలన్’. ఈ చిత్రంలో దుషారా విజయన్, సునీల్, కబీర్ దుహాన సింగ్, తరందాసు, పార్థ్ తివారీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాల్ జార్జ్ దర్శకత్వంలో క్యూబ్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మే 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మజాకో మల్లికా..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ‘రాజ రా.. రాజ రా రాజా.. పిలిచే మల్లిక... మజాకో మల్లికా..’ అంటూ ‘మజాకో మల్లికా...’ అంటూ తెలుగు వెర్షన్ సాంగ్ లిరిక్స్ వినిపిస్తాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ పాటకి రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అరుణ్, సమీర పాడారు. -
సినిమాలను వదిలేద్దామనుకున్నా.. కానీ.. : అర్జున్ సర్జా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.అయితే ‘జెంటిల్మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్మెన్’ సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్గా ఎన్నో హిట్లు తన కెరీర్లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్లో ‘జెంటిల్మెన్’ అలాంటి మలుపు. -
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే
తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026 -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
మిడ్ రేంజ్ హీరోలకు డేంజర్ బెల్స్.. లేటెస్ట్గా విశ్వక్
గత కొన్నేళ్లుగా చూసుకుంటే తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు ఎప్పటికప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రేక్షకుల పల్స్ వీళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారా? సరైన స్టోరీలని ఎంపిక చేసుకోలేకపోతున్నారా? తెలియట్లేదు గానీ చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. ఒకవేళ సక్సెస్ అయినా సరే కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ విశ్వక్ సేన్. వరసపెట్టి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్నుమా దాస్', 'హిట్' లాంటి సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాత చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కెరీర్ ఏ మాత్రం ఆశజనకంగా లేదు. 2024లో ఏకంగా మూడు చిత్రాలతో వస్తే.. వాటిలో 'గామి' ప్రయోగాత్మక చిత్రం కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటే.. 'మెకానిక్ రాకీ' ఘోరంగా దెబ్బతింది. గతేడాది ఇదే టైంకి వచ్చిన 'లైలా' అయితే అల్ట్రా డిజాస్టర్. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్తో కలిసి 'ఫంకీ' చేశాడు. ఇదీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.ఒకప్పటితో పోలిస్తే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ ఎలా తగ్గిపోయిందో.. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అలానే తగ్గిపోతూ వస్తున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడి చేతిలో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్, దర్శకుడిగా చేస్తున్న 'కల్ట్' ఉన్నాయి. ఈ రెండింటితోనైనా విశ్వక్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)విశ్వక్ సేన్ మాత్రమే కాదు టాలీవుడ్లో చాలామంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్ దాదాపు ఇలానే ఉంది. గోపీచంద్, రవితేజ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. వీళ్లు సినిమాలైతే చేస్తున్నారు గానీ అటు కంటెంట్ పరంగా ఇటు మార్కెట్ పరంగా రెండూ వర్కౌట్ కావట్లేదు. వసూళ్లు కూడా పెద్దగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, శర్వానంద్, అల్లరి నరేశ్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే.పైన చెప్పిన హీరోలు.. తాము అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్పుడో ఇప్పుడో అన్నట్లు వస్తున్నారు. కానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వీళ్లు కాకుండా ఉన్న మిగతా మిడ్, చిన్న రేంజ్ హీరోల పరిస్థితి అయితే అంతకంటే దారుణంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో ఏంటో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్) -
'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్మీట్కు హాజరైన వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్ఫర్ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.ఆ షూటింగ్కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్ ప్రశంసించారు.నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతె ట్రైన్లో సెనగలు తిందాం అంటూ షూటింగ్ ఆగనివ్వకుండా చేసారు.సింప్లిసిటీ కి మారో పేరు కృష్ణ గారు...- Actor #Naresh !#HeyBhalwanth pic.twitter.com/wMgWkQpYed— Karthikuuu (@Anchor_Karthik_) February 16, 2026 -
నాకు ఏం కావాలి? ఏం వద్దో బాగా తెలుసు: శోభిత
కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్ టీమ్ అసలే లేదని చెప్తోంది హీరోయిన్ శోభిత ధూళిపాళ.24 గంటలు కనిపించాలా?తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.అదైతే తెలుసునాకు పీఆర్ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.సినిమాశోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్లో ఎక్కువ పాపులర్ అయింది. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్ -
‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్లోని ఉదయ్పుర్కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష) -
'పెద్ది' సెట్లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్ రెడ్డి. తర్వాత సడన్గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.అందుకే బ్రేక్నటుడు సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్ కొట్టేసి బ్రేక్ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!కావాలనే నా ప్రతిష్ట దిగజార్చిందిపెళ్లి వర్కవుట్ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరింత కుంగిపోయాను. బిగ్బాస్ ఆఫర్ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్బాస్కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. మరో పెళ్లి చేసుకోనుమొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్బాస్ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్ రెడ్డి చెప్పుకొచ్చాడు.చదవండి: 4 రోజుల్లో రిలీజ్.. హే భగవాన్ టైటిల్ ఛేంజ్ -
అలాంటి కంటెంట్కి లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకు?
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కాస్త పద్ధతిగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సెన్సార్ బోర్డ్ ఏమైనా కళ్లు ముసుకుందా అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిత్రాల్లో బూతులు వినిపిస్తుంటాయి. మరికొన్నింటిలో అయితే మితిమీరిన హింస కనిపిస్తూనే ఉంటుంది. అసలు సెన్సార్ దాటుకుని ఈ మూవీస్ ఎలా బయటకు వచ్చాయా అనేది అంతుచిక్కని ప్రశ్న. వీటిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు విచిత్రంగా సెన్సార్ బోర్డ్.. తెలుగు సినిమా టైటిల్స్పై దండయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)గత నెలన్నర రోజుల్లోనే ఏకంగా నాలుగు తెలుగు సినిమాల టైటిల్స్ విషయంలో సెన్సార్ చాలా ఇబ్బంది పెట్టేసింది. గత నెలలో రిలీజైన 'వనవీర' విషయానికొస్తే.. తొలుత వీళ్లు 'వానర' అనే టైటిల్ అనుకున్నారు. దాదాపు ఆ పేరుతో ప్రమోషన్ అంతా చేసుకున్నారు. తీరా సెన్సార్ జరిగే సమయానికి పేరు మార్చాలని బోర్డ్ చెప్పింది. తప్పని పరిస్థితుల్లో 'వనవీర' అని మార్చుకున్నారు. దీంతో అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా వృథా అయినట్లేగా.గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయం గురించి ప్రమోషన్లలో మాట్లాడిన డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని.. టైటిల్ని 'ఫ్రెండ్లీ కపుల్' అని మారిస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తాం లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామని.. సెన్సార్ తమతో చెప్పిందని అన్నారు. చివరకు మూవీ టీమ్.. పేరు మార్చకుండానే సినిమాని రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?)ఈ వారాంతంలో థియేటర్లలోకి రావాల్సిన సుహాస్ 'హే భగవాన్' సినిమాకు ఇప్పుడు టైటిల్ మార్చేశారు. భగవాన్ బదులుగా బల్వంత్ అని పేరు పెట్టారు. తద్వాతా 'హే బల్వంత్' అయింది. అలానే 'చాయ్ వాలా' అనే మూవీకి కూడా 'నవాబ్స్ కేఫ్' అని టైటిల్ మార్పించారు. పైన చెప్పిన నాలుగు సినిమాల టైటిల్స్లోనూ బూతులు గానీ, కించపరిచే పదాలు గానీ లేవు. పోనీ వాటిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే లేదు. అలాంటిది సెన్సారే తనకు తానుగా టైటిల్ మార్చాల్సిందేనని చెప్పడం ఇక్కడ వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది.రీసెంట్గా రిలీజైన పలు టీజర్లు, సినిమాలు చూస్తే రక్తం ఏరులైపారుతుంది. లేదంటే టీనేజీ రొమాన్స్ని మితిమీరి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సెన్సార్ ఎందుకు అసలు దృష్టి పెట్టట్లేదు అని నెటిజన్లు.. ఎత్తిచూపుతున్నారు. వీటితో లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకొచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్) -
నాలుగు రోజుల్లో రిలీజ్.. 'హే భగవాన్' టైటిల్ మార్పు
టాలీవుడ్ను సెన్సార్ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 'కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్ మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇప్పుడు తాజాగా సుహాస్ సినిమాకు అలాంటి ఇబ్బందే వచ్చింది. విడుదలకు కేవలం నాలుగురోజుల ముందు టైటిల్ మార్చాలని CBFC పేర్కొంది. దీంతో తప్పని పరిస్థితిల్లో సినిమా పేరును మార్చి పోస్టర్ను విడుదల చేశారు.తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని 'హే భగవాన్' మూవీలో ఓ కొత్త కోణంలో చూపిస్తామని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. అయితే, తాజాగా సెన్సార్ సూచన ప్రకారం ఈ టైటిల్ను 'హే బల్వంత్'(Hey Balwanth)గా మార్చారు. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రమిది. వీకే నరేశ్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీకి CBFC నుండి A సర్టిఫికేట్ లభించింది. కేవలం టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. అదే 'ఫ్రెండ్లీ కపుల్' టైటిల్ పెడితే 'U/A' వచ్చేదని ఆయన గుర్తుచేశారు. దీంతో పెద్దలు మాత్రమే థియేటర్లలో సినిమా చూడాల్సి ఉంటుందనేది తెలిసిందే. మరోవైపు వానర మూవీ టైటిల్ను కాస్త వనవీరగా మార్చారు. హనుమంతుడితో ముడిపడి ఉన్న పేరు కావడంతో సున్నితమైన కుల,రాజకీయ అంశాలు ఉండటం వల్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు కారణాలతో చిన్న సినిమాలకు సెన్సార్ చిక్కులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
'ప్రభాస్'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్
ఫౌజీ మూవీ షూటింగ్లో హీరో ప్రభాస్ గాయపడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ ప్రకటించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సోషల్మీడియాతో పాటు ప్రధాన వెబ్సైట్స్లలో కూడా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే మన డార్లింగ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సినిమా సెట్స్ లో ప్రభాస్కు ఎలాంటి గాయం కాలేదని చెప్పింది. ఈరోజు కూడా షూటింగ్లో పాల్గొన్నారని తెలిపింది. మూవీ సెట్స్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమని తన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడినట్లు పేర్కొంది. ఆ గీటు కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. అభిమానులు ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని ప్రభాస్ టీమ్ వెల్లడించింది.‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
'విశ్వంభర' ట్రైలర్.. నిర్మాత హై ఓల్టేజ్ కామెంట్
ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ, ఈ మూవీ కంటే ముందే విడుదల కావాల్సిన 'విశ్వంభర' గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. టీజర్ విడుదల సమయంలో వీఎఫ్ఎక్స్ వర్క్పై ట్రోల్స్ రావడంతో దర్శకుడు వశిష్ట సరిచేసే పనిలో ఉన్నారు. అయితే, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారు. తాజాగా నిర్మాత, పంపిణీదారు ధీరజ్ మొగిలినేని ఒక వేడుకలో మాట్లాడుతూ విశ్వంభర గురించి పలు విషయాలు పంచుకున్నారు.వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మెప్పిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ ట్రైలర్పై ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు మరింత బజ్ని క్రియేట్ చేశాయి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్ మీట్లో ధీరజ్ ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ విశ్వంభర ట్రైలర్ చూశాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది. యూట్యూబ్లో విడుదలైన తర్వాత ట్రైలర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తాయి. సినిమాకు సంబంధించి అసలు కథను చాలా దాచి ఉంచారు. ట్రైలర్ చూడగానే నాకు హై ఓల్టేజ్ ఫీల్ కలిగింది. ఈ ఏడాదిలో విశ్వంభరతో పాటు శర్వానంద్ బైకర్ చిత్రాలు రెండూ యువి క్రియేషన్స్ను ఉన్నత స్థానానికి చేరుస్తాయి.' అని ఆయన అన్నారు. అయితే, విశ్వంభర సినిమాను తాను డిస్ట్రిబ్యూట్ చేయలేదని ఆయన అన్నారు. ఆ సినిమాను పంపిణీ చేయాలంటే తనలాంటి వారు మరో పదిమంది కావాలని ఆయన చెప్పుకొచ్చారు. తన స్థాయికి మించి విశ్వంభర మార్కెట్ ఉందని ఆయన అన్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ మార్చిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. -
స్టార్ హీరోలతో పోటీ పడుతున్న వెంకీ మామ
-
మైత్రి మూవీస్తో ధ్రువ్ సినిమా.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎంట్రీ
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ కొత్త సినిమాను లాక్ చేసే పనిలో ఉన్నాడు. గతేడాదిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్తో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు. అయితే, ఈసారి డైరెక్ట్గా తెలుగు సినిమా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మణిరత్నంతో ఒక లవ్స్టోరీ చేసే ప్లాన్లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందమైన ప్రేమకథకి హీరోయిన్గా రుక్మిణీ వసంత్ని ఎంపిక చేసినట్లు వైరల్ అయింది.అయితే, ఈ ప్రాజెక్టుకు నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అతను తన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్తో సినిమా ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ చిత్రం ఒక రొమాంటిక్-కామ్ ఎంటర్టైనర్ అని, ఇందులో రుక్మిణీ వసంత్తో పాటు శ్రీలీల మరో మహిళా కథానాయికగా నటించనుందని చెబుతున్నారు.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధ్రువ్ విక్రమ్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. ఈ చిత్రానికి మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్త వైరల్ అవుతోంది. -
'ఫౌజీ' షూటింగ్లో ప్రమాదం.. ప్రభాస్కు గాయం!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో విడుదల కానుంది. -
మూడు ఓటీటీలలో యూత్ఫుల్ సినిమా స్ట్రీమింగ్
యూత్ను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్.. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. వంశీ పూజిత్. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైంది. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీని డి.సురేశ్బాబు సమర్పణలో సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్ మేనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు.ట్రయాంగిల్ ప్రేమకథ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, 'పతంగ్' మూవీని దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ (SUN NXT)ఓటీటీలో విడుదలైన పతంగ్.. ప్రస్తుతం అమెజాన్(Amazon Prime), ఆహా(Aha) తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.కథేంటి..?హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే అరుణ్(ప్రణవ్ కౌశిక్) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ. -
వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమా
సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. అయితే, వెయ్యేళ్ల క్రితం సోమనాథ్పై జరిపిన గజనీ దండయాత్రను వెండితెరపై చూపించేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. ఆయన సమర్పణలో ‘జై సోమనాథ్’ (JAI SOMNATH)అనే సినిమా రాబోతుంది. దర్శకుడు కేతన్ మెహతాతో కలిసి భన్సాలీ(Sanjay Leela BhansaliSanjay Leela BhansaliSanjay Leela Bhansali) తెరకెక్కిస్తున్నారు. ఆలయం కూలిపోవచ్చు.. విశ్వాసం కాదు అంటూ ఒక పోస్టర్తో పాటు వీడియోను విడుదల చేశారు. 2027లో ఈ మూవీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మూవీలో నటించబోయే వారి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. సోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది.పర్షియా, మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్లను కలిపి సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని గజనీ మహమ్మద్ అనుకున్నాడు. అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం భారత్పైకి దాడి చేసేందుకు దిగాడు. కీ.శ.1000-1027 సమయంలో 17 సార్లు దండయాత్ర చేసి ఎంతో సంపదను భారత్ నుంచి దోచుకున్నాడు. అయితే, 15వ దండయాత్ర ఐశ్వర్యవంతమైన సోమనాథ దేవాలయంపై కొనసాగింది. సోలంకి రాజు భీమదేవుడిని ఓడించి సోమనాథ్ ఆలయాన్ని గజనీ మహమ్మద్ కొల్లగొట్టడమే కాకుండా ధ్వంసం చేశాడు. సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే.. (వ్యాసం కోసం క్లిక్ చేయండి)ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. -
జన నాయగన్కు మరో షాక్.. ఆ రోజు వరకు వచ్చే ఛాన్సే లేదు
విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయగన్ చిత్రానికి ఎదురౌతున్న అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నటుడు విజయ్ చిత్ర షూటింగ్కు ముందే తన చిత్ర విడుదల సమయంలో ఆటకాలు ఎదురౌతాయని, వాటిని అధిగమించగలరా? అని ఏ ముహూర్తానా అన్నారో తెలీదు గానీ.. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కోసం గత డిసెంబర్ నెలలో సెన్సార్బోర్డుకు పంపారు. అయితే ఇప్పటి వరకూ సర్టిఫికెట్ రాలేదు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్రాలన్నీ సఫలం కాలేదు. చివరికి హైకోర్టు నుంచి పిటిషన్ను వాపస్ తీసుకున్నారు. అయితే సెన్సార్ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయగన్ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. జనవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెల 20న చిత్రం విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్ సినిమాస్ సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్ 30 వరకూ విడుదల అవ్వడానికి అవకాశం లేదని, అందుకే టిక్కెట్ బుక్కింగ్ డబ్బులను రిఫండ్ చేసుకోండి అని పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాంటిది ఆ సమయంలో జననాయగన్ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పరిస్ధితులు విజయ్ అభిమానులకు జీర్ణయింకుకోవడం కష్టమే అవుతుంది. ఇక జననాయకన్ చిత్ర నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో -
కుష్బూ వారసురాలిద్దరూ రెడీ..
ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్ సెల్వన్ 1, 2, థగ్లైఫ్ చిత్రాలకు పని చేశారు. పెద్ద కూతురు అవంతిక హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు. -
పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్ యాక్టర్ తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. -
తెరపై శివతాండవం చేసిన హీరోలు వీళ్లే..
హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. భోళా శంకరుడు పార్వతీదేవిని పెళ్లాడిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 15న) చాలామంది ఉపవాసం, జాగరణ ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి సినిమాలు చూస్తారు. పలువురు నటీనటులు వెండితెరపై మహాశివుడిగా మెప్పించారు. శివుడి వేషం వేసిన ఆ నటులెవరో చూసేద్దాం..ముందు గుర్తొచ్చేది ఆయనే..ఇప్పుడంటే భక్తి సినిమాలు తక్కువయ్యాయి.. కానీ ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చాయి. పురాణ కథలను వెండితెరపై చక్కగా చూపేవారు. వెంకటేశ్వరస్వామి, రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా అందరి దేవుళ్ల వేషం కట్టేవారు. ఇక శివుడి పాత్ర వేసిన నటులు అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం వంటి సినిమాల్లో ఆయన భోళాశంకరుడిగా ఆకట్టుకున్నారు.ఏఎన్నార్, శోభన్బాబు కూడా..మూగ మనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో అక్కినేని నాగేశ్వరరావు శివుడి రూపంలో కనిపించాడు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు, పరమానందయ్య శిష్యుల కథలో శోభన్బాబు, మగరాయుడు సినిమాలో కమెడియన్ మల్లికార్జునరావు, మావూర్లో మహాశివుడు మూవీలో రావు గోపాలరావు.., భూకైలాస్, నాగుల చవితి సినిమాల్లో నాగభూషణం, శ్రీ సత్యనారాయణస్వామి మూవీలో సుమన్ శివుడిగా మెప్పించారు.దేవుడిగా అద్భుతాలుశ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి, ఢమరుకంలో ప్రకాశ్ రాజ్, కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ శివయ్యగా ఆకట్టుకున్నారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో బాలకృష్ణ కాసేపు శివుడిగా కనిపించాడు. ఇలా ఎందరో యాక్టర్స్ యాక్షన్, ఎమోషన్స్తోపాటు పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించగలమని నిరూపించారు. తెరపై శివతాండవం చేసి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. -
మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు: సుప్రిత
సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అమరావతికి ఆహ్వానం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. తాజాగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కెరీర్ ఆరంభంలోనే అనేక వివాదాలతో పాటు ట్రోలింగ్ను దాటుకుని వచ్చింది. అయితే, తమ వ్యక్తిగత జీవితం గురించి సుప్రిత పంచుకుంది.'కొన్ని సో కాల్డ్ మీడియా వారు మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతిదానికి మా గురించి తప్పుడు కథనాలు రాసేస్తున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్లాం. అయితే, ఇప్పుడు బలంగా తయారయ్యాము. ఎంతటి నెగటివిటీ చేసినా సరే పట్టించుకనేది ఉండదు. గతంలో తెలిసోతెలీకనో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం. ఇప్పుడు అది కూడా లేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాల గురించి తెలిసిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం. నిర్మాత కేపీ చౌదరితో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా సరే.. పదేపదే డ్రగ్స్తో లింక్లు అంటూ మాపై కొన్ని మీడియా ఛానల్స్లలో ప్రచారం చేశారు. కేపీ చౌదరిపై వచ్చిన వార్తా కథనాల వల్ల ఆయన కూడా కుంగిపోయారు. డ్రగ్స్తో సంబంధాలు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు. కానీ, మరణించిన తర్వాత కూడా తప్పుడు థంబ్నైల్స్ పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బు సంపాధించేకునేందుకు ప్లాన్ చేశాయి. అతను ఒక మంచి వ్యక్తిగా మాకు తెలుసు. కానీ, లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారు.' అని చెప్పింది.తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి చేయాలనేది కేవలం తన కోరిక మాత్రమేనని ఆమె చెప్పింది. తన మదర్కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. -
'ఓం శంభో శివ శంభో' ఈ సాంగ్ విన్నారా..?
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పరమేశ్వరుడి భక్తి పాటను హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. 'ఓం శంభో శివ శంభో స్వయంభో..' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా నారాయణ్ శర్మ ఆలపించారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్తో క్రియేట్ చేసిన ఈ సాంగ్ భక్తులను మెప్పస్తుంది. ఈ పాటలో శివుడు అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. గతేడాది మహావతార నరసింహ సినిమాతో భారీ విజయం అందుకున్న హోంబలే ఫిల్మ్స్ తాజాగా శివయ్యపై భక్తితో రూపొందిన ఈ పాటకు అద్భుతమైన విజువల్స్ను జోడించి విడుదల చేశారు. -
మహేశ్బాబు చేతులమీదుగా టీజర్.. అదిరిపోయేలా విజువల్స్
పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్బాబు చేతులమీదు టీజర్ను రిలీజ్ చేశారు.భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్
సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ చిత్రంలో యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా దూసుకెళ్తెంది. హీరోయిన్ల డ్రెస్ల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ డ్రెస్లు ఎవరు సెలక్ట్ చేస్తారనేది స్రవంతి క్లారిటీ ఇచ్చింది.' ఏదైనా ఒక సినిమా ఈవెంట్కు వెళ్లితే మా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా చాయిస్ కాదు. శ్రీవిష్ణు నటించిన సింగల్ మూవీ ఈవెంట్ కోసం లుంగీ కట్టుకుని రమ్మని చెప్పారు. అప్పుడు అదే పనిగా కళ్లజోడు, లుంగీ కొనుగోలు చేసి వాటిని ధరించి యాంకరింగ్ చేశాను.నో చెబితే అవకాశాలు రావు. అందుకే ఈ విషయంలో మాకు ఆప్షన్ ఉండదు. దుస్తుల విషయంలో మాకు ఆప్షన్ ఇస్తే నేను ట్రెడిషనల్ డ్రెస్నే ఎంపిక చేసుకుంటాను. కొన్ని సినిమాలకు చీరలు కట్టుకునే ప్రమోషన్స్ కార్యక్రమాలకు పాల్గొన్నాను. నా వద్ద సుమారు వెయ్యికి పైగా చీరలు ఉన్నాయి.' అని స్రవంతి చెప్పింది.హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు సబబుగానే ఉన్నాయని స్రవంతి పేర్కొంది. కానీ, మహిళల గురించి మాట్లాడుతూ ఆయన నుంచి రెండు పదాలు తప్పుగా దొర్లాయి.. వాటిని తాను కూడా సమర్ధించను. తర్వాత శివాజీ కూడా క్షమించాలని బహిరంగంగానే చెప్పారని ఆమె గుర్తు చేసింది. -
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 12న బిడ్డ పుట్టగా.. శివజ్యోతి బర్త్డే సందర్భంగా ఈనెల 14 శుభవార్తను పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.తాజాగా బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ చేసింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రాసుకొచ్చింది. నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం...నా స్వామి ఇచ్చిన మహా లక్ష్మి... వెంకటేశ్వర స్వామి నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతని ఇదేనని భావోద్వేగ పోస్ట్ చేసింది. కుమార్తెను కనడం నా జీవితకాల కోరికని శివజ్యోతి వెల్లడించింది.శివజ్యోతి తన ఇన్స్టాలో రాస్తూ..' బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల. అందులో ఒక కుమార్తెను కనడం నా జీవితకాల కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను ఎప్పుడూ భావించా. అత్యంత సరైన సమయంలో ఆయన నాకు ఆశీర్వాదాన్ని కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. కానీ.. మొదటి నెల నుంచే నా హృదయం ఆడపిల్ల కోసం బలంగా కోరుకుంది. కానీ నా మనస్సు అబ్బాయి కావచ్చని చెబుతూనే ఉంది. ఆ తర్వాత నా డెలివరీ గడువు తేదీకి కేవలం రెండు రోజుల ముందు అకస్మాత్తుగా నా హృదయంలో ఆ భావన మారిపోయింది. మనకు ఆడపిల్ల పుట్టబోతోందని భావించా. ఈ రోజు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రకృతి దయతో మాకు అందమైన ఆడపిల్ల పుట్టిందని' రాసుకొచ్చింది.ప్రస్తుతం నా భర్త గంగూలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, అదృష్టవంతుల్లో ఒకరని తెలిపింది. ఆ జెంటిల్మెన్ స్వభావం, స్వచ్ఛమైన, దయగల హృదయం కారణంగానే మాకు ఆడపిల్ల పుట్టిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని తెలిపింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నామని పోస్ట్ చేసింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. పవిత్రా లోకేశ్కు నరేశ్ స్వీట్ విషెస్..!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా వస్తోన్న హే భగవాన్ మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవిత్రా లోకేశ్తో సరదా ఇంటర్వ్యూ జరిగింది. హే భగవాన్ మూవీ గురించి పవిత్రా లోకేశ్ ప్రశ్నలు అడగ్గా.. నరేశ్ సమాధానాలిచ్చారు. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేను మరిచిపోలేని పది సినిమాల్లో పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఫీలవుతున్నారని పవిత్రా అడగ్గా.. నువ్వు చాలా బాగా మాట్లాడావ్.. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి యాంకర్ అవుతావని నేను నమ్ముతున్నా అంటూ పంచులు వేశారు.అంతేకాకుండా వాలెంటైన్స్ డే కావడంతో పవిత్రకు స్పెషల్గా విషెస్ తెలిపారు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.. ప్రియతమ నువ్వు అచట కుశలమా.. నేను ఇచట కుశలమే అంటూ లవ్ సాంగ్ పాడుతూ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమికుల రోజున మూవీ ప్రమోషన్తో పాటు వీరిద్దరి ప్రేమబంధం చూసిన ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పవిత్రకే బిజినెస్ ఏంటో చెప్పలేదు...మీరు చెబితే 20K,#Guess Cheyyandi#HeyBhagawan pic.twitter.com/hwOA60mRVh— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026 -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్గారు సూపర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగా అభిమానులను మెప్పించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
నెలాఖరులో విష్ణు విన్యాసం
విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో హేమ అండ్ షాలినిల సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ నటించిన ఈ సినిమాకు సంగీతం: రథన్. -
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్
'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు. -
పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
-
కొడుకు, కోడల్ని అభినందించిన చిరంజీవి
కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్చరణ్- ఉపాసన దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార పుట్టగా ఈ ఏడాది జనవరి 31న కవలలు (బాబు, పాప) జన్మించారు. వీరికి ఫిబ్రవరి 11న బారసాల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగా, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అర్థవంతమైన పేర్లుకుమారుడికి శివరామ్ కొణిదెల అని, కుమార్తెకు అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ రామ్చరణ్ దంపతులు మాత్రం ఆధ్యాత్మిక భావనకు పెద్ద పీట వేస్తూ మంచి అర్థవంతమైన పేర్లు పెట్టారు. ఈ విషయంపై తమను చాలామంది అభినందిస్తున్నారంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.కొడుకు- కోడల్ని అభినందించిన చిరంజీవిస్నేహితులు, బంధువులు, అభిమానులు... ఇలా అందరూ కవలల పేర్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చరణ్, ఉపాసనను అభినందించాల్సిందే! ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, దేవుడి ఆశీర్వాదం లభించేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంచుకున్నారు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది.ముందు తరాలకు మార్గనిర్దేశంభక్తి, సంస్కృతి మేళవించిన ఈ పేర్లు ముందు తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఉన్నాయి. అలాగే చరణ్.. అతడి నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా కూతురికి అన్వీరా 'దేవి' పేరు పెట్టడం నా మనసును కదిలించింది. చరణ్, ఉపాసనతో పాటు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు ఉసాపన.. లవ్యూ మామయ్య అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: రాజాసాబ్లో డూప్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
రాజాసాబ్లో డూప్? క్లారిటీ ఇచ్చిన మాళవిక
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో 'ది రాజాసాబ్' సినిమా ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తీరా సినిమా రిలీజయ్యాక కూడా ట్రోలింగ్స్ మరింత పెరిగాయే తప్ప ఆగలేవు. ముఖ్యంగా ప్రభాస్కు చాలాచోట్ల డూప్ ఉపయోగించడంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఓ ఫైట్ సీన్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్కు కూడా డూప్ ఉపయోగించడంతో తనను కూడా ట్రోల్ చేశారు.ట్రోలింగ్పై స్పందించిన హీరోయిన్తాజాగా ఈ వివాదంపై మాళవిక మోహనన్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ది రాజాసాబ్ సినిమాలో నేనే స్వతాహాగా స్టంట్స్ చేశానని చెప్పుకున్నాను. అయితే నా బాడీ డబుల్ (డూప్) యాక్షన్ సీన్లో ఉన్నట్లుగా ఓ ఫోటో వైరలవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి స్టంట్ ఆర్టిస్ట్.. అలాగే నా డూప్ కూడా!చిన్నతనం నుంచే..ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. నాకు యాక్షన్ అంటే ఇష్టం. ఫైట్ సన్నివేశాల్లో పాల్గొనడాన్ని ఆస్వాదిస్తాను. చిన్నతనం నుంచే నేను స్పోర్టివ్ అమ్మాయిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, శరీరాన్ని ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో విషయం.. సెట్లో ఎప్పుడూ స్టంట్ డబుల్స్ సిద్ధంగా ఉంటారు. నటీనటులు సొంతంగా యాక్షన్ సీన్స్ చేసినా సరే వారు అందుబాటులోనే ఉంటారు.రిస్కీ షాట్స్ మాత్రం..వారు అనుభవజ్ఞులు కాబట్టి.. యాక్షన్ డైరెక్టర్ వారిని ఫైట్ రిహార్సల్స్ చేయమని చెప్తాడు. ఫైనల్ షాట్ మాత్రం మాపై చిత్రీకరిస్తారు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ప్రమాదకరం అని భావించినప్పుడు నటులకు బదులుగా స్టంట్ డబుల్ను సీన్ పూర్తిచేయమని అడుగుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అయితే ఏ సమస్యా లేకుండా వాటిని ఈజీగా చేయగలరు.వివరణ అక్కర్లేదుఫైనల్గా.. నేను ఫైట్ సీన్స్ సమర్థవంతంగా చేసేందుకు నా స్టంట్ డబుల్ ఎంతగానో తోడ్పడింది అంటూ వీడియోలు షేర్ చేసింది. ఒక్క ట్వీట్ ద్వారా యాక్షన్ సీన్స్ తానే చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు టాలెంటెడ్ అని మాకు తెలుసు.. నువ్వు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026 చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?
టైటిల్: అమరావతికి ఆహ్వానంనటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులుదర్శకత్వం: జీవీకేనిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్నిర్మాతలు: కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావుసినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డిసంగీతం: పద్మనాబ్ భరద్వాజ్ఎడిటింగ్: సాయిబాబు తలారివిడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026టాలీవుడ్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్గా తెలుగులోనే వచ్చిన హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అమరావతికి ఆహ్వానం కథేంటంటే..ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్ ఛానెల్ను రన్ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు షూట్ చేసి.. కంటెంట్ అప్లోడ్ చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది.అయితే సడన్గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విషయాన్ని లైవ్లో నిరూపిస్తానని.. ఈ వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సీఐగా ఈశ్వర్ సస్సెండ్ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటే..దెయ్యాలు అనే కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హారర్ థ్రిల్లర్ సినిమా.అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్ సీన్తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడు. ఫస్ హాఫ్లో భార్గవి వీడియోలు షూట్ చేయడం, మహేశ్ (శివ హరీశ్)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్ను భయపెట్టే సీన్స్ పెద్దగా కనిపించవు. ఈశ్వర్ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేసింది.సెకండాఫ్లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్బ్యాక్ ఎపిసోడ్తో కథనం ఆడియన్స్కు ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్ వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్ థ్రిల్లర్లో సాంగ్స్ ఉంటే కథ సెట్ అవ్వదు. సెకండాఫ్లో ముగ్గురు హీరోయిన్స్తో సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఓ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ జీవీకే. తన కథకు తగినట్లుగానే క్లైమాక్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు. క్లైమాక్స్లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.ఎవరెలా చేశారంటే..ఈశ్వర్, జగదీష్ పాత్రలలో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ ఏస్తేర్. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్ సీన్స్లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ బీజీఎం హారర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా తలారి తన ఎడిటింగ్కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలో మనశంకర వరప్రసాద్గారు.. 24 గంటల్లోనే రికార్డ్
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వారణాసి జానర్పై కన్ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్ టచ్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్లో మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.కొందరు ఈ సినిమాను ఫిక్షన్ అని అంటున్నారు. మరికొందరేమో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్లుక్ చూసి సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్పై ఆడియన్స్లో విపరీతమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ అనుమానాలకు చెక్ పడినట్లైంది. కాగా.. వారణాసిలో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. -
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
-
'మెన్షన్ హౌస్ మల్లేష్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
అర్జున్ సర్జా కామెంట్స్పై స్పందించిన విశ్వక్సేన్
విశ్వక్ సేన్, అర్జున్ సర్జాల సినిమాలు ఒక్కరోజు గ్యాప్తో రిలీజవుతున్నాయి. ఫంకీ ఫిబ్రవరి 13న విడుదలవగా సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజవుతోంది. అన్నీ కుదిరితే "సీతా పయనం"లోనూ విశ్వకే హీరోగా ఉండేవాడు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, షూటింగ్ కూడా మొదలుపెట్టారు! కానీ అనివార్య కారణాల వల్ల అతడు సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్, విశ్వక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.విశ్వక్పై పాజిటివ్ రియాక్షన్అయితే విశ్వక్తో వివాదం గురించి ఇటీవల అర్జున్ సానుకూలంగా స్పందించాడు. తను యువకుడు అని, తనకు చాలా భవిష్యత్తు ఉందన్నాడు. ఏదో కుదర్లేదని ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదన్నాడు. విశ్వక్ తల్లి చేతి భోజనం తిన్నానని, అతడు బాగుండాలని కోరుకుంటానని తెలిపాడు. కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, రెండు సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించాడు.స్పందించిన విశ్వక్సేన్ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్ స్పందించాడు. ఆయన మాట్లాడింది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. అదే కదా జీవితం! పైగా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి. ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడాడు. అది విని నాకు మంచిగా అనిపించింది. సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. కాగా సీతాపయనం మూవీలో విశ్వక్ స్థానంలో నిరంజన్ నటించాడు.చదవండి: రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. గుండె ముక్కలైందన్న హీరోయిన్ -
బ్యూటీ విత్ బ్రెయిన్.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫోటోలు )
-
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
రామ్చరణ్ ట్విన్స్ బారసాల.. చిరంజీవి పేరు కలిసొచ్చేలా..
మెగా హీరో రామ్చరణ్ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. తండ్రీకొడుకుల పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి శివరామ్ అని నామకరణం చేశారు. కూతురికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు.కవలలకు నామకరణంఈ బారసాల ఫంక్షన్ గురించి రామ్చరణ్ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన, నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయి. నా పిల్లల విషయానికి వస్తే.. కొడుకు పేరు శివరామ్ అని పెట్టాం. శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు. అలాగే ఇది నా తండ్రి జన్మపేరు శివ శంకర వరప్రసాద్ను సూచిస్తుంది.పేరు వెనక కథకూతురి పేరు అన్వీరా దేవి.. ఇది అపరిమిత ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టాం. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరా దేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి సైతం బారసాల ఫంక్షన్ ఫోటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: చికిరి చికిరి హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసింది రామ్చరణా? -
‘మార్కండేయ’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.కంపోజ్ ఎవరు చేశారంటే?తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు. సినిమాఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు -
దిల్ రాజు డ్రీమ్స్లో మార్కండేయ
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన 23 ఏళ్లలో 60 చిత్రాలు పూర్తి చేసిన మా సంస్థకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ మరో విభాగం. ‘మార్కండేయ’ మూవీ కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో తొలి సినిమాగా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అని ‘దిల్’ రాజు తెలిపారు. విక్రాంత్ హీరోగా సిస్ట్లా వీఎంకే తెరకెక్కిస్తున్న చిత్రం‘మార్కండేయ’. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్గా డబ్బు పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ‘పెళ్లి పందిరి’ సినిమా నిలబెట్టింది.‘మార్కండేయ’ మూవీని 2027 మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ బ్యానర్లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్గా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ వంటి సినిమాలు నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి నిలబెడుతున్న రాజుగారికి థ్యాంక్స్’’ అని సిస్ట్లా వీఎంకే పేర్కొన్నారు. ‘‘ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేం చేస్తున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘మార్కండేయ’’ అన్నారు విక్రాంత్. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ జగదీశ్ వర్మ భూపతిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ హరి ఎస్ఆర్ మాట్లాడారు. -
గర్భంతోనే ‘సతీ లీలావతి’ షూటింగ్లో పాల్గొన్నా: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. నాగ మోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ–‘‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. మూడు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. దర్శక–నిర్మాతల సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘కమల్హాసన్గారి ‘సతీ లీలావతి’ చిత్రంతో నా సినిమాను పోల్చను. కానీ ప్రేక్షకులందరూ రిలేట్ అయ్యేలా మా సినిమాను తీశాం’’ అని చెప్పారు తాతినేని సత్య. ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను’’ అని చెప్పారు నాగ మోహన్. నటుడు సప్తగిరి మాట్లాడారు. -
రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు: విశ్వక్ సేన్
‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫంకీ’ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా మా సినిమా చూసి హాయిగా నవ్వుకుంటారు’’ అని విశ్వక్ సేన్ తెలిపారు. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఫంకీ’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘ఫంకీ’ నా కెరీర్లో మొదటి కామెడీ సినిమా’’ అన్నారు కయాదు లోహర్. ‘‘సినిమా నేపథ్యంలో జరిగే కథ ఇది. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. -
Mrunal Thakur: ధనుష్తో పెళ్లి..? మృణాల్ ఠాకూర్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్లో వీరిద్దరూ క్లోజ్గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది. -
అమలాపాల్ ఫుల్ గ్లామరస్.. సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ పిక్స్..!
ఫుల్ గ్లామరస్తో మెరిసిపోతున్న హీరోయిన్ అమలా పాల్..స్వయంభూ బ్యూటీ సంయుక్త మీనన్ లేటేస్ట్ పోజులు..యూకేలో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..బ్లాక్ డ్రెస్లో కల్యాణి ప్రియదర్శన్ గ్లామరస్ పిక్స్.. స్టైలిష్ హెయిర్ లుక్లో హీరోయిన్ ప్రియమణి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by SEERATH SHEIK | MAKE-UP ARTIST (@seerathmystique) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. I don’t want to rush. I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026 -
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్గా కనిపించనుంది. గోపి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. -
'హే భగవాన్' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'హే భగవాన్'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్)
సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్' ట్రైలర్ వచ్చేసింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు తదితర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు. -
మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)
-
శివాజీ కామెంట్స్ తర్వాతే పద్దతిగా శారీస్ కట్టుకుంటున్నారా..!
-
నా గర్భాశయాన్ని తీసివేయించాడు.. ఉదిత్ నారాయణ్పై రంజనా ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్లోని సుపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ నారాయణ్తో విడాకులు తీసుకున్న తర్వాత రంజనా ఝా పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అయితే, తాజాగా ఆమె చేసిన ఆరోపణ అత్యంత హేయంగా ఉంది. ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం... 1996లో హెల్త్ చెకప్ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది. తన అంగీకారం లేకుండా ఉదిత్ నారాయణ కుట్ర పన్నారని చెప్పింది. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని చెప్పింది. మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడిందని పేర్కొంది. ఉదిత్ నారాయణ్ చేసిన ఈ మోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో కుంగదీసిందని పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య దీప కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ని రెండో పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. 1984న హిందూ ఆచారాల ప్రకారం తనను మొదట పెళ్లి చేసుకున్నాడని రంజనా తెరపైకి వచ్చింది. అయితే తొలుత బుకాయించాడు గానీ ఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. కొంత కాలంగా భరణం కూడా చెల్లించడం లేదని రంజనా తెలుపుతుంది. -
రాజ్కుమార్ హిరాణి హిట్ సినిమా సీక్వెల్ రెడీ
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి 3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్ ప్రకటించాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని తెలిపాడు. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో 3 ఇడియట్స్ సీక్వెల్ గురించి రాజ్కుమార్ హిరాణి ఇలా అన్నారు. 3 ఇడియట్స్ సీక్వెల్ కథ కోసం పనులు ప్రారంభించామన్నారు. స్టోరీ విషయంలో సరికొత్త ఆలోచన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టలేదంటూనే దాదాపు అంతా సిద్ధమైందన్నారు. ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా. మరోవైపు మున్నాభాయ్ సీక్వెల్ కూడా కథ పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.జీవా హిట్ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) నెట్ఫ్లిక్స్(Netflix)లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండానే విడుదల చేయడంతో ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. థియేటర్లో కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్కు తీసుకురావడం విశేషం. రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఇప్పటికీ నెరవేరని కోరిక ఒకటి ఉంది: శ్రియ
సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగారు. ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత 25 ఏళ్లుగా నాట్ అవుట్గా కొనసాగుతున్న శ్రియ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉండిపోయిందన్నారు. ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. తన కెరీర్ మొత్తంలో ఎవరూ కూడా అలాంటి పాత్ర తమ సినిమాలో ఉందని తనను కలవలేదని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి. -
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!
శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
ఇన్నాళ్లు అక్కడే నలిగిన జ్ఞాపకం.. ఇంతకాలానికి!
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్ పింక్ కలర్ గౌన్లో అందంగా ముస్తాబైంది.గర్వంగా ఉందిఅయితే ఈ డ్రెస్ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది. అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్ కప్బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్ స్కూల్లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.సినిమామలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి -
ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి
ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చందమామ కథలాంటి అనుభూతితాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. నట జీవితానికి పునాది రాళ్లుఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. తన ఫస్ట్ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్కు జత చేశారు. ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026 చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా: హీరో నిఖిల్ -
ఐశ్వర్య అర్జున్కు బ్రహ్మనందం బర్త్ డే గిఫ్ట్.. అదేంటంటే?
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ సర్జానే దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కెమియో రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు బ్రహ్మనందం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న ఐశ్వర్య బర్త్ డే కావడంతో తానే స్వయంగా గీసిన శ్రీరాముడు, హనుమాన్ పెయింటింగ్ కానుకగా అందజేశారు. ఐశ్వర్య తన కూతురు లాంటిదని బ్రహ్మనందం అన్నారు.కాగా.. సీతా పయనం మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #Brahmanandam garu presented his hand drawn picture of Hanuman & Sri Rama To #AishwaryaArjun#SeethaPayanam pic.twitter.com/5ThsSWFfni— cinee worldd (@Cinee_Worldd) February 10, 2026 -
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.థాంక్యూనా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం. సేఫ్ డెలివరీనువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్బీర్ కపూర్ -
అర్జున్ సర్జాకు గిఫ్ట్ ఇచ్చిన ట్యాంక్ బండ్ శివ.. వీడియో వైరల్
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివను ఘనంగా సత్కరించారు.ఈవెంట్కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్ను అర్జున్కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్ బండ్ శివకు లక్ష రూపాయల చెక్ను అర్జున్ సర్జా అందజేశారు."నా భార్య శాంతే నా జీవిత ప్రయాణానికి అర్థం.. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నా.."-నిష్కల్మషమైన తన స్పీచ్ తో సభికుల మనసులను గెలుచుకున్న ట్యాంక్ బండ్ శివ..#SeethaPayanam pic.twitter.com/VJvjFyXpYN— Mega Abhimani (@megaabhimani3) February 10, 2026 -
డబ్బు కట్టలేక జైలుకెళ్తున్నా.. రాజ్ పాల్ కు అండగా సోనూ సూద్
-
నటితో విడాకులు.. చాలా హ్యాపీగా అనిపించింది: డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ఆర్ పార్తీబన్ కెరీర్..కాగా.. ఆర్ పార్తీ బన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్ 1 వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. I have never worried about separation with my ex wife Seetha, to be honest I'm very happy about it. The 12 years with her is the Sweetest memory of my life.These days men & women prefer independence over Marriage. No woman wants a restricted life in the name of Marriage.… pic.twitter.com/LfgirOi8Eh— Kolly Censor (@KollyCensor) February 10, 2026 -
'అప్పుడు నాకు రెండు నెలలే'.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. ఉదయ్కిరణ్ మేనల్లుడు తేజ కూడా..‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.#UdayKiran మేనకోడలు #Mahathi వీడియో బైట్లో సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ❤️#ManasanthaNuvve4K రీ రిలీజ్ థియేటర్స్లో ఫిబ్రవరి 14న 🎬🍿#ManasanthaNuvve pic.twitter.com/4PydDi1T4K— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 11, 2026 -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ మూవీ చేశా.. హీరో నిఖిల్
'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న హీరో నిఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్వయంభు'. బుధవారం (ఫిబ్రవరి 11న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. హ్యాపీ డేస్ వచ్చి 19 ఏళ్లవుతోంది. ఇది నా 22వ సినిమా.ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా..ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అన్ని సమయాల్లో మీరంతా తోడున్నారు. గత రెండేళ్లుగా నేను కనిపించలేదు. కార్తికేయ 2 తర్వాత మంచి సినిమాతో మీ ముందుకు రావాలనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని, భయపడుతూ, జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభు. నిఖిల్ మావాడు అని గర్వంగా చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతోమంది పోరాట యోధుల వల్లే మన దేశం ఈరోజు ఇలా ఉంది. కొన్నిసార్లు వారి గురించి మన పుస్తకాల్లో కూడా ఉండదు. వెయ్యేండ్ల కిందట జరిగిన కథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం అని చెప్పుకొచ్చాడు.సినిమాస్వయంభు విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించగా, నభా నటేశ్, సంయుక్త, సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా భువన్, శ్రీకర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్ కానుంది.చదవండి: స్వయంభు టీజర్ రిలీజ్ -
నిఖిల్ 'స్వయంభు' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పావలా విలువ లేని ట్రోల్స్.. 'అల్లు అర్జున్'పై విమర్శల దాడి
అల్లు అర్జున్.. తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైమ్లోనే తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పావలా విలువ కూడా చేయని వాళ్లే సోషల్మీడియాలో ట్రోలింగ్కు దిగుతారని తెలిసిందే.3వేల మంది ఫాలోవర్స్ఈ క్రమంలో తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్ చేసుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సోషల్మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ కేవలం 3వేలు మాత్రమే.. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్ కావచ్చని పక్కా ప్లాన్తోనే బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.ఆధారాలు లేకుండానే..ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను యూట్యూబ్లో తొలగించారు. అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ, అవేంటి అనేది చెప్పలేదు. తనకు ఎవరో చెప్పారు అంటుంది. పైగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు.. ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. సంధ్య థియేటర్ గొడవ, ఎయిర్పోర్ట్లో మాస్క్ తీయాలంటూ వీడియో వైరల్, ఇప్పుడు స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్కు వ్యతిరేఖంగా నడుపుతున్న యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో.. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఒక పత్రాన్ని రెడీ చేసి సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్ పెడుతారని ఎవరు చెప్పారో వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ, వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోను తొలగించి సైలెంట్ అయిపోయారు.ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాడ్కాస్ట్లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వారందరూ బన్నీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. (అల్లు అర్జున్ గురించి ఆయన అభిమానులు విడుదల చేసిన వీడియో) Ilanti person mida edustaru 🙏 pic.twitter.com/IxBpgnHN3b— 𝒞𝒽𝒾𝓀𝒾𝓉𝒽𝒶 (@chikithaaaaaaa) February 10, 2026 -
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
కొన్నిసార్లు మన చుట్టూ ఏం జరిగినా చూసీచూడనట్లు పోతాం. కానీ, మానవత్వంతో ఆలోచించి ఒక్క నిమిషం కేటాయిస్తే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నాడు బిగ్బాస్ ఫేమ్, నటుడు శ్రీహాన్. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ రన్నరప్గా నిలిచిన శ్రీహాన్.. మా ఆవారా జిందగీ, వర్జిన్ బాయ్స్ సినిమాల్లో నటించాడు.పూటుగా తాగేసి..తాజాగా అతడు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. రాత్రిపూట రోడ్డుపై కారులో వెళ్తున్న శ్రీహాన్ మార్గమధ్యలో ఓ వ్యక్తి పూటుగా తాగేసి పడి ఉండటాన్ని గమనించాడు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా కారు ఆపేసి మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు.రెండు నిమిషాల పనిదీనిగురించి శ్రీహాన్ మాట్లాడుతూ.. పెద్దాయన తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆయనకే సమస్యలున్నాయో, ఎందుకు తాగాడో మనకు అనవసరం. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉంది. ట్రాఫిక్ ఎక్కువున్నప్పుడు కార్లకు, పెద్ద వాహనాలకు రోడ్డుపై ఉన్న అతడు కనిపించడు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఏదైనా జరిగితే..రోడ్డు అవతలివైపు జనాలు నిలబడి చూస్తున్నారంతే! ఒకటీరెండు నిమిషాల సమయం కేటాయిస్తే అతడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అది రీల్స్లో చూసి అయ్యో, పాపం అనుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. వీడియోలో టైం, డేట్ తప్పుగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దని కోరాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మంచి పని చేశావంటూ శ్రీహాన్ను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) చదవండి: అల్లు అర్జున్ సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న స్రవంతి -
RC17 లో పుష్ప షేడ్స్.. అనుపమ ఛాన్స్ కొట్టేసినట్టేనా..!
-
డబ్బు లేకనే జైలుకెళ్తున్నా.. రాజ్పాల్కు అండగా సోనూ సూద్
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కొంత కాలంగా చెక్బౌన్స్ కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తను చేసిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. తిరిగి చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదు.. సాయం చేసేందుకు స్నేహితులు కూడా లేరు. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు ప్రకారం లొంగిపోవడం తప్ప మరోక దారి నాకు కనిపించలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా సోషల్మీడియాలో పోస్టు చేశాడు.నటుడు రాజ్పాల్ కోసం నిర్మాతలు, దర్శకులతో పాటు తన సహచర నటులందరూ కలిసికట్టుగా నిలబడి సాయం చేయాలని సోనూ సూద్ కోరారు. తనకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు. ఇదీ దాతృత్వం కాదు.. ఒక నటుడి గౌరవాన్ని కాపాడేందుకు మనందరం ముందుకు వద్దాం. మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఒంటరి కాదని గుర్త చేసే బాధ్యత మనపై ఉంది. అని సోనూ సూద్ అన్నారు. ఈ క్రమంలోనే నటుడు రాజ్పాల్కు కొంత మొత్తంలో అడ్వాన్స్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. Rajpal Yadav is a gifted actor who has given years of unforgettable work to our industry. Sometimes life turns unfair, not because of talent, but because timing can be brutal. He will be part of my film, and I believe this is the moment for all of us..producers, directors,…— sonu sood (@SonuSood) February 10, 2026 -
‘సన్ ఆఫ్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'అల్లు అర్జున్' సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది. 2009లోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన గుర్తింపు లేక ఛాన్స్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, పుష్ప విడుదల సమయంలో అల్లు అర్జున్తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెబుతూ శ్రవంతి ఎమోషనల్ అయింది.2021లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ను యాంకర్ స్రవంతి ఇంటర్వ్యూ చేసింది. ఆమె కెరీర్లో అతిపెద్ద స్టార్ను కలవడం అదే తొలిసారి. తర్వాత ఆ ఇంటర్వ్యూ సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెకు వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ దక్కింది. అనంతరం తన కెరీర్ పూర్తిగా ఉన్నత స్థానానికి చేరుకుంది. కేవలం బన్నీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కడంతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె చెబుతుంది. అల్లు అర్జున్ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది.'పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్తో ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంటర్వ్యూ యూట్యూబ్లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అలా నాకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్ వల్ల నా జీవితమే మారిపోయింది. అందుకే ఆయనపట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైమా అవార్డ్స్లో బన్నీని కలిశాను. సైమా వేదికపై అవార్డ్ అందుకునేందుకు బన్నీ పేరును నేనే పిలిచాను.. అప్పడు నా గతాన్ని గుర్తుచేసుకుని బన్నీని చూడగానే తెలీయకుండానే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఆయన చాలా సాయం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్తాను. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ మాత్రమే..' అంటూ శ్రవంతి చెప్పింది.అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్లో ఎలాంటి గర్వం ఉండదని స్రవంతి చెప్పారు. కానీ, కొందరు పనికట్టుకుని విమర్శించడం సాధరణమే అన్నారు. రెగ్యూలర్గా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్తుంటారు. వారందరితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇతరులను ఆయన ఎప్పడు కూడా చులకన చేసి చూడరు. ఇలా బన్ని గురించి స్రవంతి చెప్పింది.అల్లు అర్జున్ చేసిన సాయం తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి@alluarjun @urs_sravanthi 📹https://t.co/lj4Z1Wb4Z0 pic.twitter.com/5j49D2T4ca— greatandhra (@greatandhranews) February 11, 2026 -
రియల్ హీరోలను సత్కరించిన అర్జున్.. గిఫ్ట్గా రూ.లక్ష
ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన కొత్త మూవీ ‘సీతాపయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు సన్మానించారు. ఎంతోమందికి సాయపడుతున్న రియల్ హీరోలు మీరే అంటూ అర్జున్ వారిని గౌరవించారు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను వేదికపై పిలిచి సత్కరించారు. ఆపై ఒక్కొక్కరికి రూ.లక్ష కానుకగా ఇచ్చ తన మంచి మనుసు చూపించారు.డాక్టర్ మందాకిని ఆమ్టే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ఆమె భర్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టేతో కలిసి, గడ్చిరోలిలోని హేమల్కసాలో మాడియా గోండ్ ఆదివాసీల కోసం లోక్ బిరాదరి ప్రకల్పం (Lok Biradari Prakalp) ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నారు. గాయపడిన, నిరాశ్రయమైన వన్యప్రాణుల సంరక్షణ చేపట్టారు. 2008లో ఈ సేవలకు గానూ ఆమెకు రామన్ మెగసెసే అవార్డు లభించగా ఆమె భర్త ప్రకాష్ ఆమ్టే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించింది.ట్యాంక్ బండ్ శివ అనడం కంటే శవాల శివ అనగానే హైదరాబాద్లో ఇట్టే గుర్తుపడుతారు. తన తొమ్మిదేళ్ల వయసులోనే హుస్సేన్ సాగర్లో పడిపోయిన ఒకరిని కాపాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటి నుచి వందలాది మందిని ప్రాణాలతో రక్షించాడు. నిత్యం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ వేలాది శవాలను బయటకు తీశారు. ఆపై వారికి తోచిన సాయం కూడా చేస్తారు.సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పర్యావరణ పరిరక్షణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల వారకి సుపరిచయమే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 70ఎకరాల్లో అడవినే సృష్టించి ఆశ్చర్యపరిచారు. అందులో దాదాపు 5 కోట్ల మొక్కలు నాటారు. గవర్నర్ ప్రతిభా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. -
మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్ హీరో
నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్కు జంటగా కోలీవుడ్కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
‘సీతా పయనం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫ్లో చూస్తుంటే సినిమా కూడా తీసేస్తారేమో!
గతేడాది, ఈసారి వరసగా 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రసాద్' సినిమాలతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. త్వరలో కొత్త మూవీ ప్రకటనతో వస్తానని కొన్నిరోజుల క్రితమే చెప్పాడు. కానీ అనిల్.. నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు? స్టోరీ ఏంటి? ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు? అని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి పుల్స్టాప్ పెడుతూ స్వయంగా ఈ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు.'నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాం' అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.అయితే అనిల్.. తన తర్వాత సినిమా వెంకటేశ్ హీరోగా తీయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టులోనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని.. వెంకీ, ఫహాద్ బావబావమరిదిగా నటిస్తారని.. ఇందులో వెంకీ సరసన కీర్తి సురేశ్, పూజా హెగ్డే హీరోయిన్లు అని.. ఫహాద్ సరసన ఆషికా రంగనాథ్ కనిపిస్తుందని మాట్లాడుకున్నారు. అలానే మూవీకి 'శ్రీమతి లలితా రెడ్డి' అనే టైటిల్ కూడా నిర్ణయించారని, ప్రస్తుతం ఓటీటీ చర్చలు జరుగుతున్నాయని.. ఇది పూర్తవగానే అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇవే నిజమవుతాయా? లేదంటే అనిల్ రావిపూడి.. వేరే ప్రాజెక్ట్ చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏నటినటులు కధటైటిల్ కూడా పెట్టేసారు ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను....అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో...నిజమైనపూర్తి వివరాలు... మీకు… pic.twitter.com/bfhQ4NrOfu— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026 -
హీరోగా చేయడం నాకు ఇష్టం లేదు
‘‘నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. దీంతో నా సినిమాల్లో కథ, లాజిక్లు ఉండవని ఆడియన్స్కు అనిపించవచ్చు. కానీ నా అన్ని సినిమాల్లో కథ, లాజిక్ ఉంటాయి. ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగానే ‘ఫంకీ’ ట్రైలర్ను కట్ చేశాం. ట్రైలర్లో ఎక్కువగా కామెడీ సీన్స్ కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో మంచి లవ్స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చెప్పారు కేవీ అనుదీప్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరల సమావేశంలో కేవీ అనుదీప్ పంచుకున్న సంగతులు. ⇒ ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ సినిమా దర్శకుడి పాత్ర చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘ఫంకీ’లోని హీరో క్యారెక్టరైజేషన్కు విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. కథ నచ్చి, ఆయన ఒప్పుకున్నారు. ⇒ జాతి రత్నాలు’తోపోలిస్తే ‘ఫంకీ’ కొత్తగా ఉంటుంది. దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, సరదాగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కొన్ని ఊహించని సన్నివేశాలను కూడా చూస్తారు. నిర్మాతలు నాగవంశీ, ‘దిల్’ రాజులతో పాటు దర్శకులు హరీష్ శంకర్, కల్యాణ్ శంకర్ గెస్ట్ రోల్స్ చేశారు. నేను కూడా నటించాను. కానీ హీరోగా యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. దర్శకుడిగా నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి.⇒ విశ్వక్ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. హీరోకు సమానమైన పాత్రలో కయాదు యాక్ట్ చేసింది. ఈ చిత్రం విషయంలో నాగవంశీగారితో కంటే కూడా నేను చినబాబుగారితో ఎక్కువగా ట్రావెల్ చేశాను. త్రివిక్రమ్గారు సినిమా చూసి, మంచి సలహాలు ఇచ్చారు. ⇒ ప్రతి సినిమా హిట్ కావాలనే ఆకాంక్షతోనే చేస్తాం. కానీ నా గత చిత్రం ‘ప్రిన్స్’కు సరైన రిజల్ట్ రాలేదు. స్క్రిప్ట్ వర్క్కు సరైన సమయం దొరకలేదు. ‘ఫంకీ’ స్క్రిప్ట్కు మంచి టైమ్ దొరికింది... మంచి కథ కుదిరింది. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉంటే ఆ సినిమా ఆడియన్స్కు చేరువ అవుతుంది. అలా ‘జాతి రత్నాలు’ విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. ఇక ‘జాతిరత్నాలు 2’ ఇప్పట్లో ఉండదు. కథ పరంగా సంతృప్తిగా ఫీలైనప్పుడే ‘జాతిరత్నాలు 2’ చేస్తాం. ⇒ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల్లో నేను సినిమాలు చేయాల్సి ఉంది. వెంకటేశ్గారితో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. రవితేజగారితో సినిమా కోసం చర్చలు జరిగాయి కానీ ఈ సినిమా ఉండదు. ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఉంది. -
రవిబాబు 'రేజర్'.. యాక్షన్.. థ్రిల్
రవిబాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, ఒకపోస్టర్తో పాటు స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేశారు.‘‘డార్క్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన చిత్రం ‘రేజర్’. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని సరికొత్త కథాంశంతో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ వేసవిలో మా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: ఎస్ఎస్ రాజేశ్. -
వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే
టాలీవుడ్... కోలీవుడ్.... మాలీవుడ్... శాండల్వుడ్... బాలీవుడ్... ఇప్పుడు అన్ని వుడ్స్ ఒకటే. ఇప్పటివరకూ హీరోయిన్లు మాత్రమే రక రకాల భాషల్లో సినిమాలు చేసేవారు. అప్పుడప్పుడూ డైరెక్టర్లు కూడా వేరే భాషల్లో వేరే హీరోలతో సినిమాలు చేసేవారు. అయితే ఆ కాంబినేషన్ అరుదుగా సెట్ అయ్యేది. ఇప్పుడు పాన్ ఇండియా’ హవాతో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో... తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.... అలానే వేరే భాషల దర్శకులతో ఇంకో భాషకు చెందిన హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువైంది. ఒక్క తెలుగు గురించి మాట్లాడుకుంటే... ఇక్కడి టాప్ స్టార్స్ కొందరు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ అవి సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఇక ‘వాంగ అన్నే... రెడీయా... స్టార్ట్ కెమెరా’ (రండి అన్నా... రెడీయా... స్టార్ట్ కెమెరా) అంటూ తెలుగు హీరోలను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న తమిళ దర్శకులు, చర్చల్లో ఉన్న దర్శకుల గురించి తెలుసుకుందాం. యంగ్ డైరెక్టర్తో నూరవ చిత్రం నూరవ చిత్రం అనేది ఏ హీరోకైనా వెరీ వెరీ స్పెషల్. ఈ మైల్స్టోన్ మూవీ గ్రాండ్గా ఉండాలని, మంచి కథతో, మంచి దర్శకుడితో రూపొందించాలని అనుకుంటారు. నాగార్జున కూడా అలానే అనుకుని, పకడ్బందీగాప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగు దర్శకుడికి కాకుండా తన నూరవ చిత్రం దర్శకత్వ బాధ్యతను తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్కి ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితం నాగార్జునకు కార్తీక్ ఓ స్టోరీ లైన్ వినిపించారని, అది నచ్చి కథగా డెవలప్ చేయమన్నారనీ తెలిసింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కార్తీక్కి ఇది రెండో చిత్రం.తమిళ చిత్రం ‘నిదమ్ ఒరు వానమ్’తో దర్శకుడిగా పరిచయమై, రెండో ఫీచర్ ఫిల్మ్కే నాగార్జునలాంటి స్టార్ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం లాటరీ నేపథ్యంలో ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్’ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. అలాగే అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్? ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్, ‘వార్ 2’లో హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటించిన ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్తో ‘జైలర్’ వంటి హిట్ మూవీ తెరకెక్కించి, ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా రజనీతోనే ‘జైలర్’ 2’ తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ నెక్ట్స్ ఓ సినిమాప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఓ భారీ యాక్షన్ స్టోరీని తయారు చేశారని సమాచారం. ఆ స్టోరీ లైన్ని ఎన్టీఆర్కి వినిపించారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.మరోవైపు కొత్త చిత్రాల కోసం కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలోనే నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ విని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే మల్టీస్టారర్ మూవీగా రూపొందనుందని భోగట్టా. ఎన్టీఆర్తో పాటు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం అవుతోంది. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారట. సో... ఓ తమిళ స్టార్ హీరో నటించే అవకాశం ఉందని అటు చెన్నై ఫిల్మ్నగర్ అంటున్న మాట. మరి... ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అది సోలో హీరో సినిమానా? లేక మల్టీస్టారరా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.ఇద్దరు దర్శకులతో... వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్లో ఉండగానే... సంక్రాంతి సందర్భంగా మరో చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఆ మధ్య లోకేశ్ హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్కి స్టోరీ లైన్ వినిపించారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ దర్శకుడి కాంబినేషన్లో ఈ హీరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆ ఊహలను నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా ముగిసే సమయానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా షూట్ని ఆరంభించాలనుకుంటున్నారట. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆరంభం కానుందని తెలిసింది. తమిళ దర్శకుడు–తమిళ బేనర్... ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత రామ్ ఓ కొత్త దర్శకుడితో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించనున్నారట. కాగా టాలీవుడ్కి చెందిన ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్కి నచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆరంభం కానుందని తెలిసింది. మరోవైపు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ నటుడు–దర్శకుడు సముద్ర ఖనితో సినిమా చేయడానికి రామ్ అంగీకారం తెలిపారని భోగట్టా. ఈ చిత్రాన్ని తమిళ బేనర్ కేవీఎన్ నిర్మించనుందట.ఈ సినిమా కథ రెడీ అయిందని, రామ్కి సముద్ర ఖని కథ నరేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ నచ్చి, ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాఘవేంద్ర రావు బేనర్లో నూతన దర్శకుడితో సినిమా పూర్తయ్యే సమయానికి సముద్ర ఖనితో సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నారట రామ్. ఇక సముద్ర ఖని ఇప్పటికే తెలుగులో ‘శంభో శివ శంభో, జెండా పై కపిరాజు, బ్రో’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఉన్నట్లా? లేనట్లా? ‘దసరా, హిట్ 3’... ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన మాస్ సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అనేలా భారీ యాక్షన్తో రూపొందుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాని. ఇక రెండు మూడేళ్లుగా ఫలానా దర్శకుడితో నాని సినిమా చేయనున్నారంటూ వినిపించిన లిస్ట్లో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా ఉంది.శివ కార్తికేయన్ హీరోగా శిబి దర్శకత్వంలో రూపొందిన ‘డాన్’ (2022) సినిమా చూసి, ఇంప్రెస్ అయ్యారట నాని. ఈ నేపథ్యంలోనే శిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారనే వార్త ప్రచారమైంది. నానీకి శిబి స్టోరీ లైన్ కూడా చెప్పారట. అయితే ఆ లైన్ అసంతృప్తిగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడిందని సమాచారం. మరి... నాని–శిబి చక్రవర్తి కాంబినేషన్లో సినిమా ఉన్నట్లా? లేనట్లా... కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే.... ఈ యువదర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుందర్ ఔట్ శిబి ఇన్ ‘తలైవర్ 173’ (వర్కింగ్ టైటిల్) పేరుతో రజనీకాంత్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాకి ముందు సుందర్. సీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కమల్హాసన్ ఓ నిర్మాత. కమల్–రజనీ–సుందర్ కాంబినేషన్లో ‘తలైవర్ 173’ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్లీ సూపర్ స్టార్ సినిమా శిబి చక్రవర్తికి దక్కింది. ఇలా తెలుగు–తమిళ దర్శకుల కాంబినేషన్లో సినిమాలంటూ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. -
మరింత హాట్గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు..టాలీవుడ్ నటి పూర్ణ బేబీ బంప్ ఫోటోలు..గ్రీన్ శారీలో ఫుల్ గ్లామరస్గా ఐశ్వర్య రాజేశ్..పూల లాంటి డ్రెస్లో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల.. బాయ్ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్లో పాయల్ రాజ్పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by BRIDAL JEWELRY RENTAL DUBAI, UAE (@rahz_allure_jewelry_rental_uae) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
'ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు.. అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన'
అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Unbelievable rules of Allu Arjun.A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026 -
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి అన్నప్రాసన వేడుక.. వీడియో వైరల్
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.గతేడాది మరోసారి తండ్రైన ఆది రెడ్డి దంపతులకు కూతురు పుట్టింది. తాజాగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు. మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ అన్నప్రాసన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మొదటి వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kavitha Bondala (@kavitha_bondala) -
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026 -
'తన కెరీర్లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు . ఇందులో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఒకేరోజు రెండు హిట్ సినిమాలు.. ప్రేక్షకులకు పండగే
ఈ సంక్రాంతి సీజన్లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్గా నిలిచాయి. థియేటర్ రన్ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్ఫామ్లలో ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్ఫ్లిక్స్(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్గా మారుతుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా ఉండనున్నాయి. -
జన నాయగన్ 'విజయ్' ఫ్యాన్స్కు శుభవార్త
దళపతి విజయ్ అభిమానులకు శుభవార్త. జన నాయగన్ మూవీ నిర్మాతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మధ్య జరిగిన చట్టపరమైన వివాదం ముగిసింది. చిత్ర నిర్మాతలకు CBFCపై వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ కేసులో KVN ప్రొడక్షన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం చేసిన అభ్యర్థనను జస్టిస్ PT ఆశా అనుమతించారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలియజేసింది. సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. CBFCకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకోవడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటికే జన నాయగన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని CBFC రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. -
'ఎర్ర చీర' మూవీ హీరోయిన్ కారుణ్య చౌదరి స్టన్నింగ్ స్టిల్స్
-
మైథాలజీ వరల్డ్కు కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా పనులు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో ఆయన భాగమయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో ఈ సినిమాను మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను నిర్మించేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదే సమయంలో హీరోయిన్ ఎంపికపై బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు వంటి సాంకేతిక యూనిట్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ను సమన్వయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బు చెల్లిస్తారా.. జైలుకెళ్తారా రజనీకాంత్ నిర్మాతకు కోర్టు ఆదేశాలు
చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్ హీరోగా 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా కొచ్చడైయాన్ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది. -
'బాలకృష్ణ' ఫ్యాన్స్ను పదేపదే నిరాశపరుస్తున్న తమన్
సంగీత దర్శకుడు తమన్ కొట్టే బీజీఎమ్కు ఫ్యాన్స్కు పూనకాలు వస్తుంటాయి.. కొన్ని చోట్ల థియేటర్ సౌండ్ బాక్స్లు బద్దలవుతాయి. డాల్బీ థియేటర్ అయితే మరింత కిక్ ఇస్తుందని అభిమానులు అంటుంటారు. తమన్ కొట్టే మ్యూజిక్కు డెసిబుల్ స్థాయి మారిపోతుందని తన వర్క్ ఔట్పుట్ గురించి చెబుతుంటారు. అయితే, తమన్ ఏడాది క్రితం బాలకృష్ణ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశ చెందుతున్నారు.డాకు మహారాజ్ మూవీ OST/BGM విడుదల చేస్తానని సరిగ్గా ఏడాది క్రితం థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం గురించి హామీలు ఇచ్చినప్పటికీ, అతను దానిని అమలు చేయలేదు. ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, డాకు మహారాజ్ తర్వాత వచ్చిన అనేక సినిమాలకు సంబంధించిన OSTని కూడా ఆయన విడుదల చేశారు. ఇదీ బాలయ్య ఫ్యాన్స్ను మరింత నిరాశ చెందేలా చేసింది. కొద్దిరోజుల క్రితం 2026 జనవరిలో విడుదల చేస్తానని మరోసారి మాట ఇచ్చాడు. ఆ తేదీ కూడా దాటిపోవడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.డాకు మహారాజ్లో డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా... ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా'అంటూ సాగిన ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. దీంతో పాటు 'సర్కారు రా' అంటూ సాగిన ఈ రెండు ఈ పాటలలో తమన్ కొట్టిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఈ ట్రాక్ కావాలని చాలాసార్లు కోరుతున్నారు. గతేడాది సంక్రాంతి విడుదలైన ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయినప్పటికీ ఫ్యాన్స్ను మాత్రం ఈ మూవీ మెప్పించింది. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో పాటు ‘డాకు మహారాజ్’కు తమన్ సంగీతం అందించాడు. ఇవన్నీ కూడా ఆదరణ పొందాయి. దీంతో తమన్కు ఖరీదైన కారును గిఫ్ట్గా బాలకృష్ణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమిర్పేట్లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. -
‘హై’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
చిత్రపరిశ్రమలో కథానాయికలు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్ హీరోయిన్గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోకి ఇమైకా నొడిగల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్తో కలిసి తిరుచిట్రంఫలం (తిరు) చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. విశేషం ఏమిటంటే కోలీవుడ్లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగులోనూ హిట్ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని హాట్హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
పుట్టినరోజు ప్రత్యేకం
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంతో రూపొందిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సోషియో ఫ్యాంటసీ సూపర్ నేచురల్ చిత్రంలో సుమంత్ హీరోగా నటించారు. మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.రాజశ్యామల పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. సోమవారం (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కొత్త గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు నటించారని, వారి వివరాలను, రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
డ్రాగన్ యాక్షన్
జోర్డాన్ లో ల్యాండ్ అయ్యారు డ్రాగన్ . హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, టొవినో థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ జోర్డాన్ లొకేషన్స్ లో ప్రారంభం అయిందని తెలిసింది.దాదాపు నెల పాటు జరిగే ఈ షూటింగ్లో ప్రధానంగా మూడు యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి ‘డ్రాగన్ ’ ఫస్ట్లుక్, టీజర్ రిలీజ్ కావొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
ఆయా షేర్
‘ది ప్యారడైజ్’ సినిమా కోసం అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు జడల్. ఏ రేంజ్లో అనేది సిల్వర్ స్క్రీన్స్ పై చూడాలి. ‘దసరా’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నానిపై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఈ పాటకు సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎనిమిది భాషల్లో ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్లైట్లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43)


