breaking news
Tollywood
-
ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై ఆడియన్స్లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం హ్యాంగ్ మ్యాన్ తెలుగు మూవీతో పాటు మాలీవుడ్ టైమ్స్, కరక్కం లాంటి మలయాళ సినిమాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.6 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ప్రాజెక్ట్ హెయిల్ మెరీ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లు, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు జూలై 3న ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సడన్గా ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్డెమోన్స్ ఆఫ్ ది షాడో రియల్(జపనీస్ మూవీ)- జూలై 04స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్ప్రాజెక్ట్ హెయిల్ మెరీ(హాలీవుడ్ మూవీ)- జూలై 03మ్యాన్ ఆఫ్ వార్(హాలీవుడ్ మూవీ)- జూలై 03ప్రొటెక్టర్(హాలీవుడ్ మూవీ)- జూలై 03జియో హాట్స్టార్ మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5 మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03 వీరభద్రుని రహస్యం(వీక్లీ సిరీస్)- జూలై 03సన్ నెక్స్ట్ హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహా టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03ఆపిల్ టీవీ ప్లస్ సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03సోనిలివ్కరక్కం(మలయాళ సినిమా)- జూలై 03 హెచ్బీవో మ్యాక్స్లీ క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్)- జూలై 03లయన్స్ గేట్ ప్లే..హాఫ్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- జూలై 03 -
రాజమౌళికి అరుదైన గౌరవం.. దర్శకధీరుడు ఎమోషనల్
దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్ లియాన్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలోని దిగ్గజాల సరసన నిలిచారు. ఫ్రాన్స్ సినీ దిగ్గజాలతో పాటు మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరును శాశ్వతంగా మ్యూజియంలో ముద్రించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తన జీవితాంతం గుర్తుండిపోయే ఈ జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్వవాదాలు తెలిపారు.కాగా.. ఫ్రాన్స్లోని లియాన్లో ఉన్న లూమియర్ మ్యూజియంలో గతంలో 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ చేసిన రూమ్ను రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా లూమియర్ ఇన్స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ రాజమౌళికి సర్ప్రైజ్ ఇస్తూ ఆయన పేరు ముద్రించిన శిలాఫలకాన్ని అందించారు. ఈ ప్రకటనతో తాను భావోద్వేగానికి లోనయ్యానని రాజమౌళి రాసుకొచ్చారు. అక్కడ ఫలకాలతో నిండిన ఒక గోడకు మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి దిగ్గజాల పేర్లు... వాటిని ఎర్రటి వస్త్రంతో కప్పబడిన ఒక ప్లేట్ను గమనించానని దర్శకధీరుడు ట్వీట్ చేశారు. అక్కడ నా పేరు చూసి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయిందని రాజమౌళి పోస్ట్ చేశారు.Visited the Lumière Museum and the screening room where Eega and RRR was screened to a full house in Lyon, France.Thierry Frémaux, the director of the Institut Lumière and the Cannes Film Festival, was gracious enough to introduce me. Then he said he had planned a surprise and… pic.twitter.com/2ZA8UT7Zxf— rajamouli ss (@ssrajamouli) July 2, 2026 -
మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీని లాక్ చేశారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 16న విశ్వంభర థియేటర్లలో సందడి చేయనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. -
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
-
వారణాసి కోసం రాజమౌళి విశ్వ ప్రయత్నాలు
-
‘సమ్మర్ హాలీడేస్’ మూవీ సాంగ్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ మూవీ ప్రారంభం (ఫొటోలు)
-
గ్రాండ్గా డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి పెళ్లి.. మెగాస్టార్, వెంకీమామ సందడి
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురు కృష్ణమోహన - అనిరుధ్ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్లో జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే అంటే 2002లో రిలీజైన 'బాబీ' సినిమాలో నటించారు. ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ని కన్నడలో పునీత్ రాజ్కుమార్తో 'వీర కన్నడిగ' అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. మహేశ్ 'ఒక్కడు'ని 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ 'కంత్రి'తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ కూడా ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్తో తీసిన 'బిల్లా' మాత్రం ఆయనకు పేరు తీసుకొచ్చింది. Megastar @KChiruTweets graced the grand wedding reception of director @MeherRamesh's daughter, #KrishnaMohana, and Anirudh. #chiranjeevi #Meherramesh pic.twitter.com/lLxXfxYTUQ— Aithagoni Raju off (@AithagoniRaju) July 1, 2026 -
టాలీవుడ్లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్
తెలుగు సినీ పరిశ్రమలో వస్తోన్న పూర్తిస్థాయి తొలి ఏఐ మూవీ 'అంబాస్ రివెంజ్'. ఈ సినిమాకు జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి కృత్రిమ మేధ సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా అంబాస్ రివెంజ్ నిలవనుంది.భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని దర్శకుడు జయవర్ధన్ తెలిపారు. ఈ చిత్ర నిర్మాణంలో పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని.. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు జయవర్ధన్ వెల్లడించారు. టాలీవుడ్లో ఫస్ట్ టైమ్ ఏఐ ఆధారిత మూవీ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. -
పెద్ది మూవీ.. ఇప్పుడు చేస్తే ఏం లాభం?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన పెద్ది బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచడంతో వసూళ్లపరంగా పెద్దికి బాగానే కలిసొచ్చింది. అయితే రెండు వారాల తర్వాత లీడ్ రోల్లో వచ్చిన చిత్రం మా ఇంటి బంగారం థియేటర్లలో రిలీజైంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సమంత మూవీకి క్యూ కట్టారు. సామ్ మూవీకి హిట్ టాక్ రావడంతో పెద్ది వసూళ్లు పడిపోయాయి. మూడో వారం నుంచే పెద్ది కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. సమంత మూవీ ఎఫెక్ట్ పెద్ది వసూళ్లపై పడింది.ఈ నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ది మూవీ టికెట్ ధరలను తగ్గించారు. నైజాంలో ప్రస్తుతం ఒక్కో టికెట్ ధర రూ.105, రూ.80, రూ.50గా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సగటు అభిమానులు మండిపడుతున్నారు. మూవీ రిలీజైన నెల రోజులకు టికెట్ రేట్స్ తగ్గిస్తే లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. రెండో వీకెండ్ తర్వాత టికెట్ ధరలు తగ్గించి ఉంటే ఫలితం ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పెద్ది విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తోంది. అందువల్లే థియేటర్లకు జనాలు రావడం కూడా కష్టంగా మారిపోయింది. ఎలాగో ఓటీటీకి వస్తుంది కదా సగటు ప్రేక్షకుడు భావిస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు తగ్గించినా ఎలాంటి ఫలితం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల తర్వాత పెద్ది వసూళ్లు పెరగకపోవడానికి కారణం అధిక టికెట్ ధరలేనని చెబుతున్నారు. Experience the BLOCKBUSTER #PEDDI at Affordable Price at all Single Screens across Nizam from Tomorrow 🔥Book Your Tickets Now🎟️ https://t.co/YZtaj58HBONIZAM Release Through @mythrirelease ✨#RamCharan #BlockbusterPeddi #MythriRelease pic.twitter.com/a8weJlAFYe— Mythri Movie Distributors LLP (@MythriRelease) June 30, 2026 -
జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..!
జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ తెచ్చుకున్న ఫైమా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత చివరికీ మూడుముళ్లతో ఒక్కటయ్యామని ఎమోషనలైంది. తన ప్రియుడు ప్రవీణ్తో ఏడడుగులు వేసింది. సంప్రదాయంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేశారు. ఈ పెళ్లి జరిగి అప్పుడే వారం రోజులు పూర్తయింది. తాజాగా ఫైమా తన పెళ్లిలోని అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకటే సందర్భం.. ఇద్దరు తల్లుల వేదన అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మెట్టినింటికి వెళ్తున్న కూతురుని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఫైమా తల్లి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తెని హత్తుకుని బోరున ఏడుస్తూ కనిపించింది. ఫుల్ ఎమోషనల్గా ఉన్న వీడియోను ఫైమా తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమకు ఏది సాటి రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
సమంత బేబీ బంప్.. సిక్స్ ప్యాక్ అంటూ పోస్ట్...!
సమంత ఇటీవలే మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో మహిళా అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ హిట్ ప్రమోషన్ల టైమ్లో సమంత ప్రెగ్నెన్నీపై రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. దీంతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నానని తెలిపింది. నా బేబీ కోసం మెటర్నిటీ లీవ్లో ఉంటానని సామ్ ఆనందం వ్యక్తం చేసింది.తాజాగా సమంత బేబీ బంప్తో ఉన్న పిక్ను షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫోటోను పంచుకుంది. మై సిక్స్ ప్యాక్.. నేను నిన్ను చూసినప్పుడే చూస్తాను.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత సిక్స్ ప్యాక్ అని రాయడంతో ఆమెకు ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. -
చిరంజీవి సతీమణికి అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ఎం. సత్యనారాయణ రెడ్డిని పాలకమండలి ఛైర్మన్గా నియమించిన ప్రభుత్వం.. 11 మందితో కలిపి పాలకవర్గాన్ని ప్రకటించింది. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.గతంలో యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా పాలకమండలి ఏర్పాటు చేశారు.చైర్మన్గా సత్యనారాయణరెడ్డి..యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. -
పాములంటే భయం లేదు.. వాటిని చూస్తూ భోజనం
పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ఈమె నటించిన 'నాగబంధం' సినిమా ఈ శుక్రవారం(జూలై 03) థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్)'పాములంటే నాకు అస్సలు భయం లేదు. మాది చిక్మగళూరు. అక్కడ మా పూర్వీకుల ఇళ్లలో పాములు ఉండేవి. చెప్పాలంటే నేను, మా తమ్ముడు భోజనం చేస్తూ వాటిని చూసేవాళ్లం. కానీ పెద్దగా పట్టించుకునేవాళ్లం మాత్రం కాదు' అని నభా నటేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కన్నడ అమ్మాయి అయిన నభా.. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మ్యాస్ట్రో, డార్లింగ్ తదితర చిత్రాలు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. కరోనా టైంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు రెండు మూడేళ్ల పాటు నటనకు దూరమైంది. అనంతరం ఈమె తెలుగులో స్వయంభు, నాగబంధం అనే భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. 'నాగబంధం' రెండురోజుల తర్వాత రిలీజ్ కానుండగా.. స్వయంభు కూడా మరికొన్ని నెలల్లో థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే) -
స్టార్ హీరోలు గమనిస్తున్నారా? 95 శాతం ఫ్లాపులు, డిజాస్టర్లే
2026లో అప్పుడే ఆరు నెలలు పూర్తయిపోయాయి. తెలుగులో 100కి పైగా సినిమాలు ఈ ఆరు నెలల్లో థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో ప్రేక్షకుల్ని అలరించి హిట్ అయిన మూవీస్ ఎన్ని అంటే? వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఫ్లాప్ చిత్రాలు ఏ భాషలోనైనా ఉంటాయి. అది సహజమే. కానీ ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నా ఒక్కటి సరిగా ఆడట్లేదు. దీంతో ప్రేక్షకుల కనిపించక థియేటర్లు వెలవెలబోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఆ స్థాయి మూవీస్ లేక ఎగ్జిబిటర్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఈ ఏడాది తొలి ఆరు నెలల టాలీవుడ్ రిపోర్ట్ కార్డ్ ఏంటి? ఎన్ని మార్కులు వచ్చాయి?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)ఈ ఏడాది ప్రారంభంలో బాక్సాఫీస్ దగ్గర శుభారంభం దక్కింది. సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజైతే వాటిలో చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకరవరప్రసాద్'.. కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' కూడా మంచి వసూళ్లు అందుకోగా.. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఊహించని హిట్గా నిలచి ట్రేడ్ని ఆశ్చర్యపరిచింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్' ఘోరమైన డిజాస్టర్ కాగా.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.ఇక ఫిబ్రవరి అయితే చాలా నీరసంగా సాగింది. జనవరి జోష్ని కొనసాగిస్తుందనుకుంటే.. 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే హిట్ అయింది. ఫంకీ, సీతా పయనం, యుఫోరియా చిత్రాలు కనీసం పెట్టుబడిని కూడా రాబట్టుకోలేకపోయాయి. విష్ణు విన్యాసం చాలా నిరాశపరిచింది. మార్చిలోనూ పెద్దగా మార్పు కనిపించలేదు. 'మృత్యుంజయ్' తేలిపోయింది. నెల చివరలో కాస్తంత హైప్తో వచ్చిన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉసూరుమనిపించింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ రెండో రోజే దారుణమైన డ్రాప్ కనిపించింది.ఏప్రిల్లో పరిస్థితి కొంతవరకు పర్లేదు. అడివి శేష్ 'డెకాయిట్' ఓకే అనిపించుకోగా.. 'రాక్షస' యావరేజ్ అయింది. 'బైకర్'కి ప్రశంసలు వచ్చినప్పటికీ అవి కలెక్షన్స్గా మారలేదు. వేసవిలో కీలకమైన మే నెల కూడా ఎగ్జిబిటర్లని పూర్తిగా నిరాశపరిచింది. గోదారి గట్టుపైన, జెట్ లీ, గాయపడ్డ సింహం మూవీస్ మిడ్ రేంజ్ అయినప్పటికీ కొంత ఆసక్తిగా అనిపించాయి. కానీ కమర్షియల్గా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)ఇక జూన్ నెల పరిస్థితి కొంతవరకు పర్లేదని చెప్పొచ్చు. రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల వరకు లాభదాయకంగా నిలిచింది. కానీ మిగతా చోట్ల ఎక్కడా అస్సలు వర్కౌట్ కాలేదు. పేరుకే పాన్ ఇండియా రిలీజ్ చేశారు గానీ అస్సలు పనవ్వలేదు. అయితే ఈ నెలలో ఊహించని సక్సెస్ ఏదైనా ఉందంటే అది 'మా ఇంటి బంగారం'. చాన్నాళ్ల తర్వాత అది కూడా సమంత చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. పెద్దగా బజ్ లేనప్పటికీ థియేటర్లలో అద్భుతం చేసింది. పెట్టుబడి కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది. ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చింది. ఇక 94 ఏళ్ల దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తీసిన 'సింగ్ గీతం'.. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది కానీ డబ్బులు రాబట్టుకోలేకపోయింది.ఇక డబ్బింగ్ల విషయానికొస్తే మార్చిలో రిలీజైన 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. సూర్య 'వీరభద్రుడు'కి బీ,సీ సెంటర్లలో డబ్బులొచ్చాయి. అంచనాలతో వచ్చిన దృశ్యం 3, కేడీ చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో పాటు థియేటర్లలో నుంచి త్వరగానే వెళ్లిపోయాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది తొలి ఆరు నెలలు పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోయాయి. మన శంకరవరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పెద్ది, మా ఇంటి బంగారం మూవీస్ మాత్రమే హిట్. అంటే 95 శాతం సినిమాలు యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్లు అయ్యాయి! దీంతో సెకండాఫ్లోనైనా హిట్స్ శాతం పెరుగుతుందేమోనని హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?) -
అమ్మతోడు జరిగింది ఇదే! డెలివరీ బాయ్ దాడిపై హీరో అఖిల్ రాజు క్లారిటీ
-
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?
ఈవీవీ సత్యనారాయణ పేరు చెప్పగానే ఎక్కువగా కామెడీ సినిమాలే గుర్తొస్తాయి. జంబలకిడి పంబ, ఎవడిగోల వాడిది, కితకితలు.. ఇలా చెప్పుకొంటూ పోతే పాత నుంచి కొత్త వరకు చాలానే ఉంటాయి. అయితే ఈయన బోల్డ్ అండ్ రియలస్టిక్ కామెడీ కాన్సెప్ట్తో 'ఆరుగురు పతివ్రతలు' అనే మూవీ తీశారు. 20 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు బిగ్ స్క్రీన్పై రీ రిలీజ్ కానుందనే వార్త చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)ఈవీవీ సత్యనారాయణ దర్శకనిర్మాతగా చేసిన 'ఆరుగురు పతివ్రతలు'.. 2004 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. పెళ్లి పేరిట జరిగే మోసాలు, వైవాహిక బంధంలో భార్యభర్తల మధ్య ఉండే ఈగోలు, రకరకాల పరిస్థితులు, మనస్పర్థలని బోల్డ్గా చూపించారు. సమాజంలోని కొన్ని చేదు నిజాల్ని కామెడీగా చూపించారు. అయితే తర్వాత కాలంలో టీవీ, సోషల్ మీడియాలో కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారని కొన్ని పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి.ఎప్పుడు రీ రిలీజ్ అనే తేదీ వేయని పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగానే మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తారా? లేదంటే ఎవరైనా ఆకతాయి.. అటెన్షన్ కోసం కావాలనే ఈ పోస్టర్ని వదిలాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే రీ రిలీజైతే మాత్రం యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండే అవకాశముంది.'ఆరుగురు పతివ్రతలు' విషయానికొస్తే.. పదో క్లాస్ కలిసి చదువుకున్న ఆరుగురు అమ్మాయిలు.. పెరిగి పెద్దయిన తర్వాత చాలా ఏళ్లకు ఓ పెళ్లి సందర్భంగా కలుస్తారు. అలా కలిసిన సందర్భంలో తమ పెళ్లి జీవితాల్లో ఎదుర్కొంటున్న కష్టసుఖాలు, భర్తల ప్రవర్తన గురించి ఒకరికొకరు పంచుకుంటారు. అయితే భర్తలని అర్థం చేసుకోవడంలో భార్యల ఆలోచనలు ఎలా ఉంటాయి? భర్తల అనుమాన స్వభావం వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనే అంశాలే స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా
రీసెంట్ టైంలో ట్రెండింగ్ హీరోయిన్ అంటే కచ్చితంగా వినిపించే పేరు కాయదు లోహర్. 'ముఖిల్ పేట్టై' అనే కన్నడ మూవీతో హీరోయిన్ అయిన ఈ అస్సామీ బ్యూటీ.. 'అల్లూరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే తమిళంలో 'డ్రాగన్' చేసింది ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి చిత్రాలతో వచ్చింది. ఇప్పుడు సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది. రెండురోజుల క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 16 ఏళ్లున్నప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)'పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్కు వెళ్తుండేదాన్ని . ఒకరోజు ఒక కుర్రాడు నన్ను ఫాలో అవుతూ ఈవ్ టీజింగ్ చేశాడు. పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ నా వెంట పడుతూ హద్దులు మీరడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే పక్కనే ఉన్న పెద్ద రాయి తీసి అతడి తల మీద కొట్టా. రక్తం కారడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని కాయాదు లోహర్ గుర్తుచేసుకుంది.చూడటానికి నేను చాలా సాఫ్ట్గా కనిపించినా.. ఎవరైనా తప్పు చేస్తే నాలోని కోపం బయటికి వస్తుందని, దానికి ఎదురు వెళ్తాను. అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానని కాయదు చెప్పుకొచ్చింది. ఈమె నాని 'ప్యారడైజ్' మూవీలోనూ నటిస్తోంది. వచ్చే నెల చివరలో ఆ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత) -
డెలీవరీ బాయ్ vs హీరో.. కారుపై దాడి
గతేడాది థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరోగా నటించి, పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్ని కొట్టడం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. అయితే తొలుత అందరూ హీరోని విమర్శించారు. కానీ తర్వాత అఖిల్ తన వెర్షన్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన తల్లిని తిట్టడం వల్లే డెలివరీ బాయ్ని కొట్టానని అన్నాడు. ఇది వివాదంగా మారడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.(ఇదీ చదవండి: నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్)ఇక అఖిల్ రాజ్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పలువురు డెలివరీ బాయ్స్ కూడా అక్కడికి చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం అఖిల్.. తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా కొండాపూర్లో డెలివరీ బాయ్ రమేశ్, తన అనుచరులతో కలిసి కారుని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. పోలీసులు అక్కడికి చేరుకుని డెలివరీ బాయ్తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు.. మరో 80 రోజులు మాత్రమే)నాపై దాడికి యత్నించారు.. హీరో అఖిల్రాజ్ ఫిర్యాదు..డెలివరీ బాయ్తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారడంతో, సినీనటుడు అఖిల్రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కొండాపూర్లో కొంతమంది తన కారును అడ్డగించి దాడికి ప్రయత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, డెలివరీ బాయ్పై… pic.twitter.com/00VvsuWPPv— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2026 -
వినోదాలు పంచే రంభ ఊర్వశి మేనక
‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అన్నది ‘ట్యాగ్లైన్ ’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 4న గ్రాండ్గా రిలీజ్ కానుంది.జూన్ 30న ‘అల్లరి’ నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘అల్లరి’ నరేష్ నటిస్తున్న 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. విభిన్నమైన కథలు, మంచి కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న నరేష్ తనను హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్లో మరోసారి సందడి చేయనున్నారు.ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదభరితమైన ఘటనలతో సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
మరో 80 రోజులు మాత్రమే
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అండ్ టైమ్ట్రావెల్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రాముడిగా, రుద్రగా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు మహేశ్బాబు. మందాకిని పాత్రలో ప్రియాంకా చో ప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ , శివ భక్తుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్కు చిన్న బ్రేక్ పడింది. హీరో మహేశ్బాబు విహారయాత్రలో భాగంగా విదేశాల్లో ఉండగా, దర్శకుడు రాజమౌళి ప్యారిస్లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు ‘ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు ప్యారిస్లోని థియేటర్స్లో ప్రదర్శితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి ‘వారణాసి’ సినిమా అప్డేట్స్ను వెల్లడిస్తున్నారు. ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, అక్టోబరు కల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.తాజాగా 80 రోజులు షూటింగ్ జరిపితే ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని రాజమౌళి తెలిపారు. ఇక ఈ నెల మూడోవారంలో ‘వారణాసి’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ లోపు రాజమౌళి, మహేశ్ బాబు తమ కార్యక్రమాలను విదేశాల్లో పూర్తి చేసుకుని హైదరాబాద్కు రానున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
సంక్రాంతి బరిలో కామెడీ మల్టీస్టారర్
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో 2026 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించిన హీరో రవితేజ 2027 సంక్రాంతి పండక్కి కూడా ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందట. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు. -
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
-
‘హ్యాంగ్మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నాకు కోపం వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతే కానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు. అతన్ని కొడితే నా కెరీర్కు ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. ఇలా అడ్రస్ పొరపాటుగా ఇప్పటికీ దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెేనైతే అతనిపై కావాలని కొప్పడలేదని అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే తనకు కోపం వచ్చిందన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు. -
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట
బుల్లితెర డాక్టర్బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్తో ఫేమ్ తెచ్చకున్న నటుడు నిరుపమ్. తన సహనటి మంజులనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. టాలీవుడ్లోని ఫేమ్ ఉన్న బుల్లితెర జంటల్లో వీరిద్దరు ముందుంటారు.తాజాగా ఈ జంట ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఎంజీ బ్రాండ్కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. నా కొత్త కారు అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను నటి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.కాగా.. చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official) -
'ప్రభాస్ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ'
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్గా రాణించారు. టాలీవుడ్లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్కు వచ్చారని తెలిపారు.అప్పుడున్న ప్రభాస్కు.. ఇప్పుడున్న ప్రభాస్కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.'ఇటీవల ఫౌజీ మూవీ టైమ్లో ప్రభాస్ దగ్గరికి వెళ్లా. ఆయన నా చేయి పట్టుకుని మరి నాతో మాట్లాడారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారు. ఒకవేళ నేను ప్రభాస్ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. అలా అడిగితే నా ఫ్రెండ్షిప్తో పాటు మర్యాద కూడా పొద్ది.. నాకు డబ్బులు అవసరం లేదు.. నాకు నేను సంపాదించుకుంటున్నా. ఆ టైమ్లో నన్ను చూసిన ప్రభాస్ ఒక పాత స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడు' అని కృష్ణ మాయ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఖరీదైన గిఫ్ట్.. ఏకంగా రూ.15 లక్షలు..!
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విన్నర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి మెప్పించింది.ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ఇసకపట్నం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్..ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఐశ్వర్య రాజేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రతి సినిమాకు తనకు తానే ఓ గిఫ్ట్ కొంటానని తెలిపింది. అత్యంత ఖరీదైన గిఫ్ట్ తన చేతికి ఉన్న వాచ్ అని పేర్కొంది. అంతేకాదు ఈ వాచ్ను సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గుర్తుగా రూ.15 లక్షల వాచ్ కొన్నానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఈ వాచ్ బుక్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ప్రతి మూవీకి ఒక గిఫ్ట్ కొనడం తనకు అలవాటుగా మారిందని ఐశ్వర్య వెల్లడించింది. -
కుమారస్వామి ఎక్కడివాడు? సోషల్ మీడియాలో వింత చర్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరిని ట్రోల్ చేసుకుంటారో అస్సలు అర్థం కాదు. రీసెంట్గా 'ఇడుపు కాయితం' అనే పదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవడో ఓ ఆకతాయి పెట్టిన కామెంట్ కారణంగా ఒకరి భాష, యాసపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇందులోకి రాజకీయాలు కూడా ఎంటరయ్యాయి. సరే ఈ గోల ఎప్పుడు ఆగుతుంది అనుకుంటే కొత్తది మొదలైంది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)నిన్నటివరకు ఆంధ్రా vs తెలంగాణ నెటిజన్ల మధ్య రచ్చ నడవగా.. ఇప్పుడు తెలుగు vs తమిళ నెటిజన్ల మధ్య ట్రోల్స్ హంగామా నడుస్తోంది. దీనంతటికీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కొత్త పోస్టరే కారణం. చాన్నాళ్లుగా కుమారస్వామి కథతో తీసే సినిమాలో తారక్ నటిస్తాడనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు. త్రిశూలం, డీఎన్ఏ, యుద్ధాలు తదితర అంశాలు ఈ పోస్టర్లో చూపించారు.అయితే ఈ చిత్ర నిర్మాతలు నాగవంశీ, కల్యాణ్ రామ్.. పోస్టర్ షేర్ చేస్తూ 'ఉత్తరంలో జననం.. మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం.. దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం!' అని కుమారస్వామి గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని తమిళ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు కుమారస్వామి ఎక్కడివాడు? అనే వింత చర్చ మొదలైంది. మరి ఇదెప్పుడు ఆగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)Original name of Murugan is Ceyon ( சேயோன் ) , he was red in colour , he was the warrior god and he is the origin of all of us tamils , and his mother’s name is Kottravai - the original form of Tirupathi Venkateswara swamy .Do not ready made up history and convince yourself… https://t.co/to9yfeMLSm— Prashanth Rangaswamy (@itisprashanth) June 29, 2026 -
ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్
పవి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి బ్రిగిడా సాగా.. సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరల అయిపోయిన బ్రిగిడా సాగా.. 2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. తర్వాత అంతా మర్చిపోయారు.అలాంటిది ఇప్పుడు బ్రిగిడా సాగా తన ప్రేమ విషయం రివీల్ చేసి ప్రియుడి గురించి చెప్పడంతో తోటీ నటీనటులు విషెస్ చెబుతున్నారు. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.బ్రిగిడా సాగా తన ఇన్ స్టాలో ఆనంద్ గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి అందమైన ప్రేమకథలు సినిమాల్లో ఉంటాయని అనుకునే దాన్ని, కానీ జీవితం నాకోసం మరో అందమైన కథ రాసింది. సినిమా ప్రయాణంలో నా లాంటి డ్రీమ్స్, ఇష్టాలు కలిగిన ఆనంద్ రామ్ని కలుసుకున్నాను. స్నేహంతో మొదలైన బంధం ఇప్పుడు ప్రేమవరకు వచ్చింది. అలానే మేం 'ఐ లవ్ యూ' చెప్పుకొనే జోడీ కాదు' అని బ్రిగిడా సాగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)
-
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో నటిగా పరిచయమైంది. అలాంటి ఈమె.. పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అవ్వడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')హీరోయిన్గా తొలి సినిమాతో గుర్తింపు వచ్చిన కొన్నాళ్లకు 'ఛలో' అంటూ రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి పేరుతో పాటు అద్భుతమైన అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగులోనే 'గీతగోవిందం' మూవీ ఈమె లైఫ్, కెరీర్ రెండింటిని మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈమె భర్త అయ్యాడు. ఇది బ్లాక్బస్టర్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.తెలుగులో మంచి సక్సెస్ కారణంగా బాలీవుడ్లోనూ రష్మికకు వరస ఛాన్సుల వచ్చాయి. యానిమల్, ఛావా చిత్రాలు ఈమెని పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజికి తీసుకెళ్లిపోయాయి.ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ టైంలో ఈమె చేసిన 'కాక్టెయిల్ 2' థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే భర్తతో చేసిన రణబాలి, లీడ్ రోల్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' రిలీజ్ కానున్నాయి. ఇదంతా చూస్తుంటే పదేళ్లలో రష్మిక జీవితం ఎంతలా మారిపోయిందో కదా!(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) -
ఇలాంటి చాన్స్ అరుదుగా వస్తుంది: నభా నటేష్
‘‘నాగబంధం, స్వయంభు’ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఒకే సమయంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గవే. ఇలాంటి బిగ్ మూవీస్లో నటించడం నాకు చాలా సంతృప్తిగా ఉంది’’ అని నభా నటేష్ చెప్పారు. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ మాట్లాడుతూ– ‘‘నాగబంధం’లో నేను పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపిస్తాను.కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర కోసం రెడీ అవడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ఇలాంటి సినిమాల్లో నటించే చాన్స్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేం చాలా నియమ నిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. ‘నమోరే..’ పాటను దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్ ఆచార్య మాస్టర్ తెరకెక్కించారు. ఈ పాట స్క్రీన్పై చాలా బాగుంటుంది. అభిషేక్ నామాగారు ‘నాగబంధం’ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
సైకలాజికల్ థ్రిల్ స్టార్ట్
హీరో రామ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘హ్యాష్టాగ్ఆర్ఏపీఓ23 (వర్కింగ్ టైటిల్)’. రామ్ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవికిషోర్ క్లాప్ ఇచ్చారు. ఈ షాట్కు రామ్ స్వయంగా దర్శకత్వం వహించారు.‘‘ఈ సినిమా రెగ్యులర్ షూట్ని సోమవారం హైదరాబాద్ శివార్లలో ప్రారంభించాం. హీరో రామ్ పోతినేనితో పాటు ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు కథ అందించి, హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించారు రామ్. ఆయన కెరీర్లోనే అత్యంత సవాల్తో కూడిన పాత్రను చేస్తున్నారు. అలాగే రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూ పొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: తిరునావుకరసు. -
రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్పై దాడి
రాజు వెడ్స్ రాంబాయి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో అఖిల్ రాజ్ తీరుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్పై దాడి చేశాడు. అతని పేరేంట్స్ వద్దంటున్నా వినకుండా అఖిల్ రాజ్ భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాగా.. అఖిల్ రాజ్ హీరోగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీతోనే అఖిల్ రాజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క సినిమాకే ఇంత ఓవరాక్షన్ ఏంటని పలువురు నెటిజన్స్ అఖిల్ రాజ్ను విమర్శిస్తున్నారు. పొరపాటు జరిగిందని డెలివరీ బాయ్ చెప్పినా కూడా వినకుండా అతనిపై దాడి చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. #RajuWedsRambai Hero Akhil Raj Attacks A Delivery Boy#AkhilRaj pic.twitter.com/KJg5S0j38d— Indian Clicks (@IndianClicks) June 29, 2026 -
బాహుబలిలానే వారణాసి.. దర్శకధీరుడు ఏమన్నారంటే?
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరకడంతో మహేశ్ బాబు విదేశాలకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. తొలిసారి వీరిద్దరి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకధీరుడు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందేమోనని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. బాహుబలిలా పార్ట్-2,3 కూడా ఉంటాయా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారణాసికి సీక్వెల్పై ఇప్పటి వరకు రాజమౌళి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్లోని ఆన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి ఈ విషయంపై స్పందించారు. వారణాసి'కి సీక్వెల్స్ ఉంటాయా అని అడగ్గా.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమేనని.. సీక్వెల్ ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ఒక యూనిక్ మూవీగానే రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సీక్వెల్ ఉంటుందన్న ఊహగానాలకు రాజమౌళి చెక్ పెట్టారు.కాగా.. వారణాసి మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్తో పాటు అడ్వెంచరస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తోంది. -
త్రివిక్రమ్తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న ప్రత్యేక పోస్టర్ను షేర్ చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్తో మరోసారి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మూవీని పురాణాల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు.కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరిద్దరు మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబోలో మరో హిట్ కొడతారా టాలీవుడ్లో చర్చ మొదలైంది. The Son of Shiva.The Pride of Parvathi.The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu— Jr NTR (@tarak9999) June 29, 2026 -
ఒక్క సినిమాతో క్రేజ్.. బుల్లిరాజు పారితోషికం తెలిస్తే షాక్..!
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం ఎంతలా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అలరించారు.ఇదంతా పక్కన పడితే ఈ మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ బుడ్డోడు. ఈ మూవీ తర్వాత రేవంత్ పేరు కాస్తా బుల్లిరాజుగా మారిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ చిత్రంతో బుల్లిరాజు మరోసారి అభిమానులను అలరించారు.ఇక ఇటీవలే వెంకీమామ- అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ చిత్రంలోనూ బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన బుల్లిరాజు సందడి చేయనున్నారు.స్టార్స్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోన్న ఈ బుడ్డోడు రెమ్యునరేషన్ గురించి టాక్ నెట్టింట వైరలవుతోంది. మన బుల్లిరాజు ఒక్క రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని లేటేస్ట్ టాక్. దీంతో ఒక్క సినిమాతో మనోడి రేంజ్ ఎలా మారిపోయిందోనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్గా సూర్య!
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవలే కరుప్పు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సమ్మర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ సాంగ్ను స్వయంగా సూర్యనే పాడారు. ఈ పాటకు కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. తన గొంతుతోనే అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... కెన్ కరుణాస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్గా నిలవనుందని తెలిపారు. ఇటీవలే రిలీజైన నేనో బటర్ఫ్లై పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. THE ONE @Suriya_offl sir sings a dance number for #vishwanathandsons …. Written by @KenKarunaas ….. A #Venkyatluri film … @SitharaEnts @vamsi84 …. ❤️❤️❤️😍😍😍 pic.twitter.com/jf7yTKZRI0— G.V.Prakash Kumar (@gvprakash) June 29, 2026 -
'చంద్రప్పన్' సినిమా ట్రైలర్ లాంచ్
డా.పి.యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'చంద్రప్పన్'. యష్మన్ హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు. జూలై 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. దర్శకుడు వి. సముద్ర, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్)హీరో, డైరెక్టర్ యష్మన్ మాట్లాడుతూ..మేం చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్తో ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మూవీ చేశాం. చాలా మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లంతా డైరెక్టర్గా నేను ఎలా చెబితే అలా ఫెర్ఫార్మెన్ ఇచ్చారు. మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. జూలై 24న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి అని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన) -
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
-
కరుప్పు, కాంతార ఓకే... 'ఇడుపు కాయితం’ నాట్ ఓకే
-
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
-
బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు
బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఓ హీరో. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ రాక్షసుడు, అల్లుడు శీను తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. అయినా సరే ప్రస్తుతం మూడు నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న ఇతడు.. ప్రస్తుతం భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నాడు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ ఓ క్రేజీ రికార్డ్ సాధించాడు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి)తెలుగులో తీసిన యాక్షన్ సినిమాల్ని పేర్లు మార్చి యూట్యూబ్లో హిందీలో రిలీజ్ చేస్తుంటారు. వీటికి ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోలు రవితేజ, రామ్ తదితరులు గతంలో చేసిన చిత్రాలకు ఇలానే వ్యూస్ వచ్చేవి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శీను కాంబోలో వచ్చిన 'జయ జానకి నాయక' కళ్లు చెదిరే ఘనత సాధించింది.'జయ జానకి నాయక ఖూంకర్' పేరుతో యూట్యూబ్లో ఉన్న హిందీ వెర్షన్ సినిమా.. ఏకంగా 1000 మిలియన్లు అంటే బిలియన్ వ్యూస్ సాధించింది. దక్షిణాది నుంచి డబ్బింగ్ అయిన చిత్రాల్లో ఇదే అత్యధికం. దీని తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 1.. 860 మిలియన్ల వ్యూస్తో తర్వాతి స్థానంలో ఉంది. అయితే తెలుగులో 'జయ జానకి నాయక' సినిమా జస్ట్ యావరేజ్. కానీ హిందీలో అది కూడా యూట్యూబ్లో మాత్రం వేరే లెవల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.అయితే తన సినిమాల హిందీ డబ్బింగులకు యూట్యూబ్లో విపరీతమైన ఆదరణ వస్తుండేసరికి.. కొన్నాళ్ల క్రితం 'ఛత్రపతి' రీమేక్తో బెల్లంకొండ.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఘోరంగా డిజాస్టర్ అయ్యేసరికి మళ్లీ అటువైపు చూడలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?
కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్లే తెలుగులో వరస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం)'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', సింగిల్ తదితర చిత్రాల్లో కనిపించిన బుల్లిరాజు.. అనిల్ రావిపూడి తీస్తున్న వెంకటేశ్-కల్యాణ్ రామ్ మూవీలోనూ అవకాశం అందుకున్నాడట. ఇప్పుడీ బాలనటుడు రోజుకు రూ.లక్ష పారితోషికం అందుకుంటున్నాడట. కేవలం సినిమాలే కాదు మాల్స్ ఓపెనింగ్, టీవీ షోలు, యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది రిలీజైన తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్) -
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సింపుల్గా నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)స్వతహాగా కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే.. 2007 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'కెవ్వు కేక' మూవీలో నటించింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు సినిమాలు చేసింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్ మెంటైన్ చేసింది.కొన్నిరోజుల క్రితమే షర్మిల-సుధాన్ డేటింగ్ సంగతి బయటపడింది. ఇప్పుడు సదరు రూమర్స్ నిజం చేస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న షర్మిల.. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చు. సుధాన్ సుందరం విషయానికొస్తే విజయ్ సేతుపతి 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్) -
'ఇడుపు కాయితం.. జాతీయ సమస్యగా మార్చారు'': వీకే నరేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా ఆ సినిమా టైటిల్పైనే చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు అందరి చూపులన్నీ ఆ మూవీపైనే ఉన్నాయి. అదే ఇటీవల ప్రియదర్శి, నాగదుర్గ జంటగా ప్రకటించిన ఇడుపు కాయితం. ఈ టైటిల్పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్, స్థానిక మాండలీకంలో పెట్టిన ఈ టైటిల్పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై నటుడు వీకే నరేశ్ స్పందించారు.నరేశ్ మాట్లాడుతూ..'నేను రెండు రోజులుగా గమనిస్తున్నా. ఇడుపు కాయితం అనే మూవీ టైటిల్ను నేషనల్ సమస్యగా మార్చారు. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారని.. ఒక గొప్ప మాండలీకాన్ని అవమానపరుస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనం సిగ్గుతో తల దించుకోవాలి. తెలంగాణ, కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏ మాండలీకమైన ఎన్నో పోరాటాలు జరిగాయి. మనం తెలుగువాళ్లుగా గర్వపడాలి. కేవలం ఒక సినిమాను తీసుకుని మాట్లాడడం చాలా బ్యాడ్. కరుప్పు టైటిల్ చూశాం. కాంతారను హిట్ చేశాం. సినిమాను సినిమాగే చూడండి. దయచేసి సినిమాను, భాషను కలపకండి. దీనిపై తెలుగు భాష సంఘం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాటినిపై చర్చించి వెంటనే వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనం నరుక్కుంటే ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వం, మీడియా, తెలుగు భాష సంఘం, నెటిజన్స్ అందరూ కలిసి దయచేసి ఈ వివాదాన్ని ముగిద్దాం' అంటూ వీడియో రిలీజ్ చేశారు. My take on IDUPULA KAGITHAM . Please stop defaming/ insulting our Telugu language dialects. 🙏🏼 pic.twitter.com/kEA0sIEruk— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) June 28, 2026 -
'పెద్ది' సంగతి సరే.. బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి?
'పెద్ది' సినిమా రన్ దాదాపు ముగిసింది. మరోవారంలో ఓటీటీలోకి వచ్చేయొచ్చు. ఈ మూవీతో రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. అందుకు తగ్గట్లే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించుకున్నారు. అలా అని సినిమా బ్లాక్బస్టర్ అయిందా అంటే లేదు. పోని ఫ్లాప్ అయిందా అంటే కాదు. మధ్యలోనే అలా ఉండిపోయింది. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్)'పెద్ది' సినిమా బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే వసూళ్లలో దాదాపు డబ్బులన్నీ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. కర్ణాటకలో పర్లేదనిపించగా.. తమిళనాడు, కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాదిలోనూ జస్ట్ ఓకే అనిపించుకుంది. విదేశాల్లో అయితే పెద్దగా వసూళ్లు రాలేదు. ఓవరాల్గా చూసుకుంటే రూ.400 కోట్ల వసూళ్లు వచ్చినప్పటికీ జాన్వీ కపూర్, పలు సన్నివేశాల కారణంగా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కానీ రామ్ చరణ్కి మాత్రం కెరీర్ పరంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.'పెద్ది'.. ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన రామ్ చరణ్ బాక్సాఫీస్ మార్కెట్పై మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ఇకపోతే దర్శకుడు బుచ్చిబాబు తన తొలి మూవీ 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్కు ఒక కథ చెప్పినా అది వర్కౌట్ కాలేదు. అనంతరం రామ్ చరణ్ని ఒప్పించి 'పెద్ది' తీశాడు. ఇది వసూళ్లు సాధించినప్పటికీ, దర్శకుడిగా బుచ్చిబాబుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. పైపెచ్చు జాన్వీ సీన్ల కారణంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇక బుచ్చిబాబుకి నెక్స్ట్ ఎవరు అవకాశమిస్తారు అనే విషయానికొస్తే.. మహేశ్ బాబు పేరు వినిపించింది గానీ అది అవుతుందా లేదా చెప్పలేం! మరోవైపు తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ తదితరులు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వీళ్ల డేట్లు దొరకడం కష్టం. రామ్ చరణ్ మరో సినిమా చేస్తానని బుచ్చిబాబుకి మాటిచ్చారు కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో రెండు మూడేళ్లయినా ఆగాలి. అప్పటివరకు ఆగుతాడా? లేదంటే యంగ్ హీరోలతో సింపుల్ బడ్జెట్ మూవీ చేస్తాడా అనేది చూడాలి? (ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్) -
బాహుబలి, RRR రేంజ్ లో రావు బహదూర్..
-
సమంత మా ఇంటి బంగారం.. వసూళ్లకదే ప్రధాన కారణం..!
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. అభిమానుల అంచనాలకు మించి ఇప్పటికే రూ.73 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత మా ఇంటి బంగారం వంద కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండో వారంలో సామ్ సినిమాకు పోటీగా సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.థియేటర్లకు మహిళల క్యూ..మా ఇంటి బంగారం ఇంతలా హిట్ కావడానికి ప్రధాన కారణం లేడీ ఓరియంటేడ్ కథ కావడమే. ఎలాంటి సంప్రదాయాలు తెలియని ఒక మహిళ కోడలిగా వస్తే పరిస్థితి ఏంటనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. బలమైన కథ, కథనం వల్లే ఈ సినిమాకు మహిళలు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి మా ఇంటి బంగారాన్ని థియేటర్లలో ఆస్వాదిస్తున్నారు. రెండో వారంలోనూ ఈ మూవీ టికెట్స్ బుకింగ్స్లో దూసుకెళ్తోంది. బుక్ మై షోలో ఏకంగా గంటకు ఎనిమిది వేలకు పైగా టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే సామ్ మూవీ వంద కోట్లు కొల్లగొట్టడం ఈజీనే అనిపిస్తోంది.వసూళ్లకు అదే ప్లస్..ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడం సమంతకు మరింత కలిసొచ్చింది. పెద్ది మూవీ థియేటర్లలో ఉన్నప్పటికీ మా ఇంటి బంగారానికి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తున్నారు. ఇది వసూళ్ల పరంగా మా ఇంటి బంగారానికి బాగా ప్లస్ అయింది. అంతేకాకుండా ఈ మూవీతో ఒక మహిళ తన కుటుంబం కోసం ఏదైనా చేయగలదనే సందేశమిచ్చారు మేకర్స్. నందిని రెడ్డి డైరెక్షన్.. సమంత యాక్షన్ ఫైట్స్ మహిళలనే కాదు.. మాస్ ఆడియన్స్ను సైతం ఆకట్టుకుంటున్నాయి. రెండో వారంలో ఏ సినిమా పోటీ లేకపోవడం వల్ల మా ఇంటి బంగారం వంద కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. A super Sunday for #MaaIntiBangaaram with blockbuster bookings all over ❤🔥Going strong in the second week with 8.58K tickets booked in the last one hour on BookMyShow 💥💥Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥Book your tickets now!… pic.twitter.com/Gu3t1HFF7Q— Tralala Moving Pictures (@TralalaPictures) June 28, 2026 -
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక
-
బాహుబలి -3 లోడింగ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
‘దీవాన’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో
'జబర్దస్త్' షోతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని రంగస్థలం, మహానటి తదితర సినిమాల్లో మంచి పాత్రలు చేసిన మహేశ్.. రీసెంట్గా 'సింగ్ గీతం'లోనూ నటించాడు. ఇదంతా పక్కనబెడితే మరి ఏమైందో ఏమో సడన్గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను నిజం చెప్పేవరకు ఎవరు ఏం రాయొద్దని అన్నాడు.'లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరకు ఏమవుతుందో తెలీదు. మనం బయట చూసిన దానిబట్టి ఏవేవో ఊహించుకుని నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను నిజం చెప్పేవరకు మీరు అనుకున్నది రాయొద్దు. త్వరలో మొత్తం నేనే మీకు నిజం చెబుతాను' కమెడియన్ మహేశ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)అయితే మహేశ్ చెబుతున్నది తన జీవితం గురించా? లేదంటే కొత్త సినిమా ప్రమోషనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య పలువురు సినిమా ఇండస్ట్రీ వాళ్లు.. ఏదో జరిగిపోతుంది? ఏదో అయిపోతుంది అన్నట్లు హంగామా సృష్టించడం, తీరా చూస్తే అది మూవీ లేదా సోషల్ మీడియా ప్రమోషన్ అని బయటపడుతుంది. మరి మహేశ్ కూడా అదే చేశాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్) View this post on Instagram A post shared by Mahesh Achanta (@mahesh_achanta) -
అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నా శరీరం నా ఇష్టం అని అనుకుంటే వాడి కళ్లు వాడి ఇష్టం. అవతలి వాళ్లని కంట్రోల్ చేసే బదులు మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందించింది. ఇలా మాట్లాడటం మహిళల్ని మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అన్నారు. వీటికి కౌంటర్ ఇచ్చిన సునీత.. ఓ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)'నాపై చిన్నయికి ఎంత గౌరవం ఉందో ఆమెపై నాకు అంతే గౌరవం ఉంది. మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అన్నారు. 'నా శరీరం నా ఇష్టం' అనే దానికి అర్థమేంటో నాకు తెలుసు. ఒకరి నియంత్రణలో ఉండకపోవడం. నేను వ్యక్తిగా పుట్టాను కాబట్టి నా శరీరంపై పూర్తి బాధ్యత, పూర్తి అర్హత నాదే. ఎవరి కంట్రోల్లోనూ ఉండకూడదు. ఇలా రకరకాల అంశాలు దీనిచుట్టూ ఉన్నాయి. అవి నాకు తెలుసు. నేను ఎందుకు అలా అన్నానంటే అలాంటి సమాజంలో మనమున్నాం. అంతే కానీ నా చేయి నా ఇష్టం అంటే వెళ్లి చేతులు విరగ్గొట్టేవాళ్లలో నేను ముందుంటాను. నేనెప్పుడు మిస్ లీడింగ్గా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మొత్తం వీడియో చూడండి. మీరు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా. నాకు అది ఓకే కాదు' అని సునీత చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ) -
ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఖుష్బూ.. పెళ్లి ఫొటోలని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)'ప్రస్తుతం మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కుటుంబమే ఎప్పుడూ మా జీవితంలో అత్యంత విలువైనది. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయిస్తారని మేం నమ్ముతాం. మా కుమార్తె అవంతిక, శ్రవణ్ల వివాహం మా జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల ప్రేమాభిమానాల మధ్య ఈ వివాహ వేడుక ఎంతో ఆత్మీయంగా జరిగింది. వధూవరుల కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక నిర్వహించాం''కొన్ని సందర్భాల్లో అత్యంత అందమైన క్షణాలు మనకు అత్యంత దగ్గరైన వారితో కలిసి గడిపేవే. అవంతిక, శ్రవణ్లు తమ వైవాహిక జీవితంలో ఆనందం, అనుబంధం, ప్రేమతో కూడిన చిరకాల సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాం. వారిద్దరికీ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, శుభాకాంక్షలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం" అని ఖుష్బూ దంపతులు తమ పోస్టులో రాసుకొచ్చారు. అవంతిక ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
సూపర్స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత
గత రెండు రోజులుగా హీరో విజయ్ దేవరకొండ రణబాలి మూవీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విజయ్ నిర్మాతలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. అలాంటి వార్తలు పూర్తి ఫేక్ అని కొట్టిపారేశారు. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వెల్లడించారు. విజయ్ కేవలం పని మీదే శ్రద్ధ పెడతారని రవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. రణబాలి షూట్ కోసం విజయ్ ఎక్కువగా కారవాన్లు డిమాండ్ చేయడమే కాకుండా.. అసిస్టెంట్స్ కూడా ఎక్కువమంది ఉండాలని కోరాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై విజయ్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రణబాలి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కీలక సన్నివేశాలను రాయలసీమలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగానే షూట్ చేస్తున్నారు. -
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
-
ఈ ఫ్రేమ్ విలువ 5000 కోట్లు...
-
హీరోగా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కొడుకు (ఫొటోలు)
-
సడన్గా ఓటీటీలో లేటేస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సువిక్షిత్, గీతికా రతన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనే ఉపశీర్షిక. ఈ మూవీని కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. ఈ చిత్రాన్ని యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలో విడుదలైన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీ కథేంటంటే..హరి(సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన గొప్పింటి అమ్మాయి వాణి(గీతికా రతన్) అంటే అతని చాలా ఇష్టం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమకి పేకబాబు(భాస్కర్) ఇల్లు అడ్డా అవుతుంది. ప్రతి రోజ రాత్రి టీవీ చూసేందుకు పేకబాబు ఇంటికి వెళ్లేవారు. హరి,వాణిల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం పేకబాబుకి తెలుస్తుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు..ఎలాగైన ఆమె నుంచి హరిని దూరం చేయాలనుకుంటాడు. అందుకోసం వాణి అన్నయ్య పరశురామ్(విజయ్ కృష్ణారెడ్డి)ని పావుగా వాడుతాడు. అతనికి లేనిపోనివి చెప్పి.. ఊర్లో కులాల చిచ్చు పెడతాడు. కొన్నాళ్ల తర్వాత వాణి, హరి ప్రేమించుకుంటున్నారనే విషయం పరశురామ్కి తెలుస్తుంది. తన చెల్లి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిదనే విషయం తెలిసిన తర్వాత పరశురామ్ ఏం చేశాడు? పేక రాజు చేసిన కుట్రకి ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమను దక్కించుకునేందుకు హరి, వాణిలు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు వీరి ప్రేమ కథ విషాదంగా ముగిసిందా లేదా సుఖాంతం అయిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్ పిక్స్ చూశారా?
-
'పురుషులపై అఘాయిత్యాలు.. సినిమా తీయండి సార్'.. ది గర్ల్ఫ్రెండ్ డైరెక్టర్కు విజ్ఞప్తి
ప్రముఖ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆయన తెరెకెక్కించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీని తరహాలో మరో సినిమా తీయాలంటూ ఓ నెటిజన్ కోరాడు. ఇటీవల పుణెలో జరిగిన కేతన్ అగర్వాల్ ఎపిసోడ్ను ఉద్దేశించి ఓ సినిమా తీయండి సార్ అంటూ రాహుల్ రవీంద్రన్ను ట్యాగ్ చేశారు. ఎలాగైతే ది గర్ల్ఫ్రెండ్ సినిమా తీశారో.. అలాగే పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలపై ఒక మూవీ తీయాలని నెటిజన్ కోరాడు.దీనికి రాహుల్ రవీంద్రన్ సుదీర్ఘమైన రిప్లై ఇచ్చారు. అయితే నాకు మాత్రమే అన్ని తెలుసని చెప్పడం నాకు ఇష్టం లేదన్నారు. పురుషులపై’ ‘మహిళలు’ చేసే అఘాయిత్యాలను నేను అస్సలు చూడనన్నారు. కానీ సమాజంలో వ్యతిరేక ప్రవర్తన కలిగిన మహిళలు ఘోరమైన నేరాలకు పాల్పడటం నేను చూస్తున్నానని రాహుల్ తెలిపారు. తన చుట్టూ ఉన్న మహిళల అనుభవాలతో స్ఫూర్తి పొంది ది గర్ల్ఫ్రెండ్ మూవీ తీశానని వెల్లడించారు.అయితే పుణెలో జరిగిన ప్రత్యేక కేసుకు సంబంధించిన వివరాలను తాను ఇంకా చదవలేదని అన్నారు. కానీ తప్పకుండా చదువుతానని రాహుల్ తెలిపారు. అందులో తాను చెప్పాలనుకునే కథ ఏదైనా దొరికితే.. ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా చేస్తానని వెల్లడించారు. అంతేకానీ మీరు చెప్పారని పురుషులపై మహిళలు చేసే నేరాల గురించి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు.రాహుల్ రవీంద్రన్ తన పోస్ట్లో రాస్తూ.. "నేను చూసే విధానంలో తేడా ఉంది. మీరు ఇది గుర్తుంచుకోండి, ఇలాంటి నేర సంఘటనలు చాలా ఘోరం.. దారుణం కూడా. కానీ నేను చేయడానికి ప్రయత్నించేది మాత్రం పూర్తిగా భిన్నమైంది. దానికి అలాంటి నేరాలతో ఎలాంటి సంబంధం ఉండదు. ది గర్ల్ఫ్రెండ్ మూవీలో విక్రమ్ ఒక హంతకుడు కాదు. అందులో శారీరక హింస లేదు " అని తెలిపారు.కాగా.. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ది గర్ల్ఫ్రెండ్. ఈ చిత్రంలో రష్మిక, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో రష్మిక బాయ్ఫ్రెండ్ చేతిలో వేధింపులకు గురవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామానులను ఆమె ఎలా ఎదుర్కొందనే కోణంలో ఈ సినిమా తెరెకెక్కించారు.నెటిజన్కు రాహుల్ సమాధానం ఇవ్వడంపై ఆయన సతీమణి, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించింది. ఇది కూడా చదవండి. రాహుల్ లాంటి వ్యక్తిని చూసుకోండి లేదా పెళ్లి చేసుకోకుండా బాధపడకండి. ఇదే నా ఏకైక సలహా. మిగతాది మీ ఇష్టం, మీ జీవితం ' అంటూ రాసుకొచ్చింది. కాగా.. వీరిద్దరు మే 2014లో వివాహం చేసుకున్నారు. వారికి ద్రిప్తా అనే కుమార్తె, శర్వాస్ అనే కుమారుడు కవల పిల్లలు ఉన్నారు. వీరికి 2022 జూన్ 18న ట్విన్స్ జన్మించారు. I don’t claim to know everything bro… so educate me if I am wrong. But I don’t see atrocities of ‘women’ on ‘men’ at all. I see some horrible incidents of sociopathic human beings who happen to be women, committing horrible crimes. On the other hand… I see a self sustaining… https://t.co/dwx5Ig3kIu— Rahul Ravindran (@23_rahulr) June 25, 2026 -
'వెంకట్రామయ్య గారి తాలూకా' మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆస్కార్ అకాడమీ సభ్యుడిగా శ్రీకర ప్రసాద్
ప్రముఖ ఎడిటర్ శ్రీకర ప్రసాద్కి అరుదైన గౌరవం దక్కింది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ అకాడమీ) సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. దివంగత దర్శక–నిర్మాత ఎల్.వి. ప్రసాద్ సోదరుడు, దర్శకుడు–ఎడిటర్ అయినటువంటి అక్కినేని సంజీవి తనయుడు శ్రీకర ప్రసాద్. తండ్రి మార్గంలో ఎడిటర్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీకర ప్రసాద్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటారు. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 529 మందిని కొత్త సభ్యులుగా తీసుకుంది. వారిలో శ్రీకర ప్రసాద్కూ చోటు దక్కడం విశేషం. ఆస్కార్ నామినేషన్స్కు వచ్చే సినిమాలకు ఓటు వేసే అవకాశం ఆయనకు లభించింది. సుమారు 600లకు పైగా చిత్రాలకు ఎడిటర్గా చేసిన శ్రీకర ప్రసాద్ 9 జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఆస్కార్ అకాడమీలో సభ్యునిగా స్థానం సొంతం చేసుకున్న ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ
దినేశ్ కుమార్, దివిజ జంటగా నటిస్తోన్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది.దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..."మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించా. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది" అని తెలిపారు.ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ... "ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించా. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. . డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్గా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను కథాంశంగా కుటుంబ కథా చిత్రమని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది. -
ఖుష్బు సుందర్ కుమార్తె వెడ్డింగ్.. టాలీవుడ్ తారల సందడి
ప్రముఖ నటి ఖుష్బు సుందర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ సినితారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా హాజరయ్యారు. కోలీవుడ్ భామ త్రిష సైతం ఈ పెళ్లి వేడుకలో మెరిసింది. కాగా.. ఖుష్బు సుందర్ తమిళంతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బు సుందర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్కు అక్క పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తోంది. ముగ్గురు మొనగాళ్లు in Goa#Chiranjeevi,#Nagarjuna & #Vanktesh attends #KhushbuSundar Daughter's marriage in GoaVintage Style - Vetaran Swag pic.twitter.com/6vPg2xjK6h— Taraq(Tarak Ram) (@tarakviews) June 25, 2026 #Khushbusundar గారి కుమార్తె వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గోవా కు బయలుదేరి వెళ్లిన#Chiranjeevi #Nagarjuna కుటుంబాలు.@KChiruTweets @iamnagarjuna pic.twitter.com/3oMV1ZZZ0M— SZN (@Suzenbabu) June 24, 2026 -
మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి (ఫొటోలు)
-
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అభిమానుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కేవలం రీ రిలీజ్ల సందడి నెలకొంది.ఈ ఫ్రైడే కొత్త సినిమాల హడావుడి థియేటర్ల వద్ద లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అవతార్-3, బ్లాస్ట్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సడన్గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26 నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26 ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26 లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27జియో హాట్స్టార్ లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26 ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26అమెజాన్ ప్రైమ్ అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5 ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26 మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లే బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26హెచ్బీవో మ్యాక్స్..అండర్టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26 -
మా ఇంటి బంగారం.. సమంత కష్టాన్ని చూశారా?
సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఊహించని విజయాన్ని సాధించింది. ఈ హిట్తో పాటు సమంత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి డబుల్ ఆనందాన్నిచ్చింది.అయితే తాజాగా మా ఇంటి బంగారం మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సామ్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ కోసం సామ్ కష్టపడిన తీరు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సీన్స్లో సమంత గన్ తిప్పిన విధానం హైలెట్గా అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మా ఇంటి బంగారం కష్టాన్ని మీరు కూడా చూసేయండి. -
మీ దుస్తులు మీ ఇష్టం.. వాడి కళ్లు వాడి ఇష్టం: సింగర్ సునీత
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత మహిళలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఫెమినిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నా బాడీ.. నా హక్కు అన్నప్పుడు మీ ఇష్టమైన దుస్తులు ధరించవచ్చని సునీత తెలిపింది. మిమ్మల్ని ఎవరు చూడలేదని మీకు అనిపించినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్న తప్పులేదన్నారు. అదే సమయంలో అవతలి వ్యక్తి కళ్లు.. అతని ఇష్టమని పేర్కొన్నారు. అవతలివాళ్లు మిమ్మల్ని చూడడంలో ఎలాంటి తప్పులేదని సునీత అన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి కూడా ఆమె ఇంటర్వ్యూలో చర్చించారు.సునీత మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీలో నో చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అలా చెబితే ఇక్కడ అవకాశాలు రావడం చాలా అరుదు. ఈ విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. ఇంతకుమించి నేను ఎక్కువ ఆశించలేదు. ఇదే మన లైఫ్ అనుకుంటే సమస్యలు వస్తాయి. సింగర్ అవకాశాలు రాకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటా. మహిళలు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చు. తప్పులేదు.. కానీ అవతలి వ్యక్తులను నువ్వు ఎంతమందిని మారుస్తారు. మీకు నచ్చిన దుస్తులు ధరించండి.. కానీ దానిని స్వేచ్ఛ.. హక్కు అని పిలవకండి. అవతలి వ్యక్తులను మార్చడం కంటే మనల్ని మార్చుకోవడం చాలా సులభం. సమాజంలో మహిళను చూసే పరిస్థితి చాలా దారుణం. ఇక్కడ మాటలు, చూపులతోనే హార్ట్ చేస్తారు. ఎవరు కూడా ఇక్కడ మహిళల మాటకు విలువ ఇచ్చిన సందర్భాలు నేను చూడలేదు' అని అన్నారు. మహిళలు ధరించే దుస్తులకు, ఫెమినిజంకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ సునీత అన్నారు. ఇక్కడ మన సమాజంలో ఆడ, మగ రెండు పూర్తిగా విభిన్నమైన జాతులని ఆమె తెలిపారు. సినీ ఇండస్ట్రీ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని.. తాను 18 ఏళ్లకే అసౌకర్యకర పరిస్థితిని ఎదుర్కొన్నానని వెల్లడించారు. -
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
-
మహేష్ బాబుపై రాజమౌళి ఫైర్.. ప్రభాస్పై సలార్ స్టార్ కామెంట్స్.. !
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్, సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు విరామం లభించడంతో మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్కు వెళ్లారు.ఇదిలా ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సలార్ హీరో ప్రభాస్, మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. "ఒక సన్నివేశం కోసం మహేష్ బాబు దాదాపు 90-95 టేక్స్ తీసుకున్నారు. ఆ సమయంలో రాజమౌళి చాలా అసహనానికి గురై ఆ రోజు షూటింగ్ను నిలిపివేసి ప్యాక్ అప్ ప్రకటించారు" అని తెలిపారు. అయితే దీనిని విమర్శగా కాకుండా మహేశ్ తన పాత్రకు న్యాయం చేయాలనే పట్టుదలతో ఎంత కష్టపడతారో చెప్పే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.అదే సమయంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. "రాజమౌళి ఎప్పుడూ చెబుతుంటారు.. ప్రభాస్కు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన కేవలం కెమెరా ముందు నిలబడితే చాలు.. మిగతా వాళ్లంతా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి శ్రమిస్తుంటారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. ఒకవైపు మహేష్ బాబు పాత్ర కోసం ఎంత కష్టపడతారో చెబుతూనే.. మరోవైపు ప్రభాస్కు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ప్రత్యేకమో అని ప్రశంసించారని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా మన టాలీవుడ్ స్టార్ హీరోలపై సలార్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. Prithviraj about MB: It took MB 90-95 takes for a single shot. SSR got angry and packed up for the dayPrithviraj about Prabhas: As SSR always says, Prabhas just has to stand there while everyone else is dying to perform. pic.twitter.com/6QpxI5h6eZ— Legend Prabhas Fan 🇮🇳 (@CanadaPrabhasFN) June 25, 2026 -
షూటింగ్లకు బ్రేక్.. నేపాల్ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
-
తల్లి కాబోతున్న సమంత..!
-
‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మరో ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తిరువీర్, రాశి, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పాపం ప్రతాప్. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.పాపం ప్రతాప్ కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
తొమ్మిదేళ్ల ప్రేమ.. ఈ రోజుతో ఒక్కటయ్యాం: జబర్దస్త్ ఫైమా సర్ప్రైజ్
జబర్దస్త్ షోతో ఫేమస్ అయినవాళ్లలో ఫైమా ఒకరు. తన కామెడీ పంచ్లతో అభిమానులను ఆకట్టుకుంది. బిగ్బాస్ గత సీజన్లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. తాజాగా ఫైమా ఫ్యాన్స్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ను ఫైమా పెళ్లాడింది. తామిద్దరం తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఈ రోజు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టామని ఫైమా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సహచరులు ఫైమాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫైమా తన ఇన్స్టాలో రాస్తూ..' వారు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని విమర్శించారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకినీ అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని సహనం. వదిలేయడానికి వేయి కారణాలున్నా.. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
-
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈనెల 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చరణ్ నటించలేదని.. జీవించాడని కొనయాడారు. అంతేకాదు అవార్డుల కంటే చరణ్ నటనపై ప్రశంసలే నాకు ఎక్కువ అని అన్నారు. ఈ సినిమాలో జాతీయ అవార్డ్ ఫర్మామెన్స్ ఇచ్చాడంటూ ఆకాశానికెత్తేశారు.తాజాగా ప్రధాని మోదీ చరణ్పై ప్రశంసించడంపై మెగాస్టార్ ట్వీట్ చేశారు. చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంభోధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమన్నారు.రామ్ చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. 'పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని… pic.twitter.com/sbddqa3m61— Chiranjeevi Konidela (@KChiruTweets) June 24, 2026 -
కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే గెలిచింది
సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. కానీ పరిస్థితుల కారణంగా కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైపోయింది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత ఈమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఈమెనే దీనికి కారణమన్నట్లు చాలామంది నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. అలా టాలీవుడ్లోనే చాలానే విమర్శలు సమంత.. ఇప్పుడు అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? సామ్కి ఎక్కడ కలిసొచ్చింది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)చెన్నైకి చెందిన సమంత.. 'ఏ మాయ చేశావె'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలో చేసి జెస్సీ పాత్రకు మంచి పేరు రావడంతో సామ్ పేరు హైలైట్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి హిట్ కావడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్కి చెందిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడిపోవడంతో సమంతపైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి.విడాకుల తర్వాత సమంత సినిమాలు చేయడం కూడా తగ్గించేసింది. 2022లో వచ్చిన 'శాకుంతలం' అయితే సమంత కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అయింది. తీసింది దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ ప్రమోషన్ల టైంలో తన వ్యాధి గురించి చెప్పడం, కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి వీడియోల కారణంగా సమంతనే ఎక్కువ టార్గెట్ అయింది. తర్వాత ఏడాది చేసిన 'ఖుషి' మూవీ పర్లేదనిపించినప్పటికీ పెద్ద సక్సెస్ కాలేదు.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)ఓటీటీలో చేసిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' హిట్ అయినప్పటికీ 'హనీ బన్నీ' సిరీస్ మాత్రం ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇందులో సమంత కష్టపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీని తర్వాత 'రక్త బ్రహ్మాండ' అనే సిరీస్ మొదలుపెట్టింది గానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కెరీర్ పరంగా సమంత దాదాపు చివరకొచ్చేసిందని అంతా అనుకున్నారు.అలాంటి టైంలో సమంత నిర్మాతగా మారి 'శుభం' అనే సినిమా తీసింది. ఇదేం పెద్దగా ఆకట్టుకోలేదు. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. వెంటనే 'మా ఇంటి బంగారం' షూటింగ్లో దిగిపోయింది. సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆదరణ ఉండదు. దీంతో సామ్ మూవీ ఏముంటుందిలే అని అంతా అనుకున్నారు. దానికి తోడు బిజీగా ఉండే జూన్ మధ్యలో రిలీజ్ పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'మా ఇంటి బంగారం'కి స్టడీగా కలెక్షన్స్ వస్తున్నాయి.సమంత సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్ దాటేసింది. ఈ వారం కూడా వేరే మూవీస్ ఏం లేవు. కాబట్టి సమంత చిత్రానికి ప్లస్ అవ్వొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే రన్ పూర్తయ్యేసరికి రూ.70-80 కోట్ల వరకు వసూళ్లు రావొచ్చు. ఈ మొత్తం వస్తే గనక తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మహిళా ప్రాధాన్య చిత్రం ఇది అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అంటే సమంత గట్టి కమ్ బ్యాక్ ఇచ్చినట్లే. సామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండటం ఫ్యాన్స్కి డబుల్ సర్ప్రైజ్.(ఇదీ చదవండి: డెడ్లీ డాక్టర్గా రజనీకాంత్.. చాలా సెన్సిటివ్ స్టోరీ)This was the journey.Thank you for loving it ❤️#MaaIntiBangaaram@TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1 @MukhiSree @Actor_Gavireddy @MenonSita @Music_Santhosh @omdop @Dharmi_edits #PonyVerma @MrHydur… pic.twitter.com/TPR7Us7z2l— Samantha (@Samanthaprabhu2) June 24, 2026 -
RC17 ఎప్పుడంటే.? సుకుమార్ లీక్స్
-
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
-
ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో
ఇప్పుడు సోషల్ మీడియా విజృంభన మామూలుగా లేదు. చీమ చిటుక్కుమన్నా వార్త అయిపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందుంటోంది. దీంతో చాలామంది తమ ఎదుగుదలకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం షాక్ తగిలినట్లుగా భయపడిపోతున్నారు. కొన్ని విషయాల్ని గోరంతని కొండంత చేయడమే ఇందుకు కారణం కావచ్చు. మరికొన్ని హ్యాండిల్స్ రూమర్స్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే వాదనను కొట్టి పారేయలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ)ఒక్కోసారి పరిస్థితులని బట్టి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వా వారిని విమర్శలకు గురి చేస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించారు అని ఎదురదాడి చేస్తుంటారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాకు కొందరు భయపడుతున్నారని చెప్పక తప్పదు. తమ గురించి జరుగుతున్న వదంతుల నుంచి బయట పడటానికి కొందరు సోషల్ మీడియాకే దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక కూడా సోషల్ మీడియా దెబ్బకు భయపడుతున్నట్లు తేట తెల్లమైంది. ఇందుకు చిన్న ఉదాహరణ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే.సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల గురించి దొర్లుతున్న వదంతులపై మీ స్పందన అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. ఏం మాట్లాడినా అది వేరే విధంగా బయటకు పోతోంది. అనని విషయాలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే మనం గురించి ఎలాంటి రూమర్ ప్రచారమవుతుందోనని రోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ఎదుగుదల మంచిదే, కానీ దాన్ని కొందరు తప్పుగా వాడుతుండటమే బాగోలేదు అని రష్మిక చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడు, హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' సినిమా చేస్తోంది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'కాక్ టెయిల్ 2' రీసెంట్గానే థియేటర్లలోకి వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్) -
'వసుదేవసుతం' మూవీ ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు
సౌత్ సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తమన్నా మాట్లాడుతూ.. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో ఒకింత పురుషాధిక్యత కనిపిస్తుంది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారు. అయితే బాలీవుడ్లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే.. తమన్నా కెరీర్లో టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ స్టేటస్, భారీ పారితోషికంతో పాటు అభిమానుల నుంచి ఆదరణ కూడా వచ్చింది. ఇవన్నీ ఆమెకు దక్షిణాదే ఇచ్చాయి. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే జాబితాలో చేరిందని సినీ వర్గాలు అంటున్నాయి. -
'నా అసలు పేరు మర్చిపోతారేమో'.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ పెద్ది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో మేకర్స్నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన రామ్ చరణ్ ఎమోషనలయ్యారు. ఈ సినిమా నా లైఫ్ను మార్చేసిందని అన్నారు. ఇంత పెద్ది హిట్ ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీలోని పాటలకు అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోందన్నారు. క్లీంకార ఇప్పుడు నన్ను పెద్ది అని పిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా నా పేరు మరిచిపోయి పెద్ది అని అంటారేమోనని అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడలేని ఏదైనా ఉంటే డైరెక్టర్ సుకుమార్కు ఫోన్ చేస్తానని చెప్పారు.తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని రామ్ చరణ్ అన్నారు. మా పెద్ది సినిమాకు పాజిటివ్గా రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
వసుదేవసుతం ట్రైలర్ రిలీజ్
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్బో సినిమాస్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
టాలీవుడ్లో హిట్ టాక్.. అక్కడ కూడా సింగ్ గీతం రిలీజ్
ఇటీవలే టాలీవుడ్లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.టాలీవుడ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. From our hearts to the big screen...#SingGeetham releases on June 26th ❤️All set for a Grand Tamil Nadu Release through @agscinemas 🔥#SingGeethamFromJune26#SingeethamSrinivasaRao @ThisIsDSP @nagashwin7 @archanakalpathi @aishkalpathi @Nivetha_Tweets @23_rahulr… pic.twitter.com/sNAkVFmIiC— AGS Cinemas (@agscinemas) June 23, 2026 -
హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తమ్ముడిని చూశారా?
హిందీ నటి అయినప్పటికీ మృణాల్ ఠాకుర్.. సీతారామం, హాయ్ నాన్న లాంటి కొన్ని సినిమాలు చేసి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా అయితే 'డెకాయిట్'తో వచ్చింది. ఇందులో ఈమె యాక్టింగ్ బాగుందని అంతా మెచ్చుకున్నారు గానీ మూవీ మాత్రం జనాలకు పెద్దగా నచ్చలేదు. సరే ఈ సంగతులు పక్కనబెడితే తమ్ముడి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన మృణాల్.. ఎమోషనల్ అయిపోయింది. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'పాప్కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!)'నువ్వు సాధించిన విజయం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్న విధానం నన్ను గర్వపడేలా చేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు అభినందనలు. గ్రాడ్యుయేషన్ వేడుక చాలా బాగా జరిగింది. అది చూస్తున్నప్పుడు మూవీ సీన్లో ఉన్నట్లు అనిపించింది. ఈ అనుభూతిని నేను జీవితాంతం మర్చిపోలేను' అని మృణాల్ చెప్పుకొచ్చింది. మృణాల్ తమ్ముడు మందార్ ఠాకుర్.. అమెరికాలోని చికాగోలో మాస్టర్స్ పూర్తిచేశాడు. ఈమె పోస్ట్ చేసిన వీడియోలో అతడిని చూడొచ్చు.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రామ్ చరణ్ 'పాప్కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!
మెగా హీరో రామ్ చరణ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కొన్నాళ్ల క్రితం 'పెద్ది' మూవీతో వచ్చిన చరణ్.. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ న్యూస్ ఛానెల్ సమ్మిట్లో పాల్గొన్నాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడంలో ఓటీటీ పాత్ర ఎంతో కీలకం అని, 'పెద్ది'కి రూ.450 కోట్లు వసూళ్లు వచ్చిన సంగతి కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇదే కార్యక్రమంలోనే మాట్లాడుతూ థియేటర్లలో అమ్మే పాప్కార్న్ ధరలు తగ్గించాలని సూచించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)యాంకర్ ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.. భారతదేశంలో సినిమానే అత్యంత చవకైన వినోద సాధనమని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదించగలిగే మంచి అనుభవాల్లో ఇదొకటని పేర్కొన్నాడు. అయితే థియేటర్ అనుభవం మరింత మెరుగ్గా ఉండాలంటే మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్, తినుబండారాల ధరలు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మూడు వారాల క్రితం వచ్చిన 'పెద్ది' సంగతే తీసుకుంటే భారీ బడ్జెట్ పెట్టారని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఇలా చేస్తూ సినిమాని చవకైన ఎంటర్టైన్మెంట్ అనడం రియాలిటీకి దూరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే 'పెద్ది' లాంటి భారీ సినిమాలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు, తొలి వారం ప్రీమియం రేట్లతో అమ్మే టికెట్లు, మల్టీప్లెక్స్ ఛార్జీలు, తినుబండారాల ఖర్చులు కలిపి చూస్తే ఓ సాధారణ కుటుంబం థియేటర్కు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.మ్యూజిక్ కన్సర్ట్స్, క్రికెట్ మ్యాచుల్లాంటి వాటితో పోలిస్తే థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు తక్కువగానే ఉండొచ్చు కానీ ఏడాది పాటు ఓటీటీలకు చేసే సబ్స్క్రిప్షన్స్ మూవీస్ టికెట్ రేట్లతో పోలిస్తే మరింత చవక. అందుకే ఒకప్పటితో పోలిస్తే చాలా కుటుంబాలు.. కొన్ని సినిమాల్ని థియేటర్లకు వెళ్లి చూడటం కంటే ఓటీటీలోకి చూసుకోవచ్చులే అనుకునే పరిస్థితికి వచ్చేశాయి. దీంతో చిన్న చిత్రాల సంగతి దారుణంగా తయారైంది. ఏదైతేనేం రామ్ చరణ్ కామెంట్స్ వల్ల మరోసారి టికెట్ ధరలు, మల్టీప్లెక్స్లలో పాప్కార్న్ రేట్లు మరోసారి హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)If popcorn prices come down a bit, it would be better.— #RamCharan pic.twitter.com/ergLRw2gwF— cinee worldd (@Cinee_Worldd) June 22, 2026 -
శుభవార్త.. తల్లిదండ్రులయిన టాలీవుడ్ హీరోహీరోయిన్
తెలుగు హీరో నారా రోహిత్ తండ్రి అయ్యాడు. ఇతడి భార్య శిరీష.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'బంగారం'కి చిరు ఆశీర్వాదం.. మెగా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా)'బాణం' సినిమాతో హీరోగా పరిచయమైన నారా రోహిత్.. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొన్నాళ్ల పాటు మూవీస్ పక్కనబెట్టేశాడు. రీసెంట్ టైంలో భైరవం, సుందరకాండ తదితర మూవీస్ చేశాడు. ఇకపోతే తనతో పాటు 'ప్రతినిధి 2' చిత్రంలో హీరోయిన్ గా చేసిన శిరీషని ప్రేమించిన రోహిత్.. గతేడాది అక్టోబరులో ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లకు మగబిడ్డ పుట్టాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?) -
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్ల వరకు (ఫొటోలు)
-
ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్
సూర్య హీరోగా చేసిన 'వీరభద్రుడు' గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. పదిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు అదే వీరభద్రుడి బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఓ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ప్రోమో వీడియోని కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)బంగారం గురించి ఆశ ఎక్కువైనప్పుడు.. మహిళ మీద మోజు పెరిగినప్పుడు.. కీర్తి కావాలనే ఆశ పెరిగినప్పుడు కలి పురుషుడు వస్తాడు అని చెబుతూ ఉన్న ప్రోమో అయితే బాగానే ఉంది. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తం 60 ఎపిసోడ్ల సిరీస్గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతివారం ఒకటి రెండు ఎపిసోడ్స్ అందుబాటులోకి వస్తాయి.తెలుగులో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆని, రఘుకుంచె తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మరి థ్రిల్లర్ సిరీస్ కాబట్టి కచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. లేదంటే ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశముంది. ఇలా 60 అంతకంటే ఎక్కువ ఎపిసోడ్ల తరహాలోనే హాట్స్టార్లో పలు సిరీస్లు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్) -
సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్
స్టార్ హీరోయిన్ల మధ్య ఈగోనే తొంగి చూస్తుంది కానీ సఖ్యత, స్నేహం ఉండటం అరుదు. ఇటీవల కాలంలో ఆ మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ సమంత, నయనతారలే. వీరిద్దరూ స్టార్ హీరోయిన్లే. ఇద్దరు నిర్మాతలే. అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు నటి నయనతార. ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలతో జోడీ కట్టిన నటి సమంత. కాగా సమంత లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి దర్శకురాలు. తమిళంలోనూ 'ఎంగల్ తంగం' పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నయనతార.. సమంతని అభినందనలతో ముంచెత్తింది.నయన్ తన ఇన్ స్ట్రాలో.. 'నీ కారణంగా నేను చాలా సంతోషపడుతున్నా సామ్. అభిమానానికి, విజయానికి నువ్వు అన్ని విధాలుగా పూర్తిగా అర్హురాలివి. మా ఇంటి బంగారం చిత్ర యూనిట్కు నా శుభాకాంక్షలు' అని రాసుకొచ్చింది. కాగా ఇంతకు ముందు నయనతార సొంతంగా నిర్మించి, నటించిన 'కాత్తువాక్కుల రెండు కాదల్' మూవీలో సమంత మరో హీరోయిన్గా చేసింది. సమంత త్వరలో 'రక్త బ్రహ్మాండ' పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయాలి. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది ఇప్పటికైతే అప్డేట్ లేదు. -
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
-
'చిన్నప్పుడు ఎన్నో కష్టాలు.. నా బిడ్డకు అలా జరగకూడదు': సమంత
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించింది. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే సామ్పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా' అని అన్నారు.కాగా.. సామ్ ఇటీవల మూవీ ప్రమోషన్స్లో శారీలో కనిపించారు. బేబీ బంప్తో ఉండడం వల్లే ఆమె అలా ఈవెంట్స్కు హాజరయ్యారని నెటిజన్స్ భావిస్తున్నారు. సమంత- రాజ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
మా క్రియేటివిటీని చంపుతున్నారు: డైరెక్టర్ శ్రీకాంత్ ఆవేదన
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలో సేవ్ ది టైగర్స్-3 రికార్డ్.. టాలీవుడ్ డైరెక్టర్ సరికొత్త ట్రెండ్
టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను ఫుల్గా ఎంటర్టైన్ చేశాయి. మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్లు కడుప్పుబ్బా ఆడియన్స్ను నవ్విస్తున్నాయి. సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఇలా వరుస విజయాలతో మహి వి రాఘవ్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు. సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్లతో పాటు ‘సైతాన్’ వంటి థ్రిల్లర్ ప్రాజెక్టులతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. తాజా సిరీస్తో తన హిట్ రికార్డ్ను కొనసాగిస్తున్నారు. ఓ కథను కమర్షియల్గా, ఆకట్టుకునేలా రూపొందించటం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీ టెల్లింగ్ దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నారు.‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్కు ఒక ఫ్రాంచైజీని ఎలా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్టైన్మెంట్ను ఏమాత్రం తగ్గించకుండా రూపొందించగల సత్తా ఆయన సొంతం. ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో టెలివిజన్ సిరీస్లకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని ఆయన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. -
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
-
వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ.. నిర్మాణ సంస్థ అలర్ట్..!
సంక్రాంతికి హిట్ కొట్టే మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి వెంకీమామతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న మరో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్గా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్న ఈ మూవీలో కల్యామ్ రామ్ కూడా నటిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ప్రారంభమైందో లేదో మూవీ యూనిట్కు కొత్త చిక్కులొస్తున్నాయి. అప్పుడే కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో మోసానికి తెరలేపారు. అనిల్ రావిపూడి- వెంకీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. సినిమా అవకాశాల పేరిట మోసం చేసేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ స్పందించారు.దీనిపై నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటన విడుదల చేసింది. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు దయచేసి ఎవరూ కూడా అలాంటివీ నమ్మవద్దని ప్రకటనలో తెలిపింది. ఆ కాస్టింగ్ కాల్కు.. మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. మా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదించే వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పత్రాలు, డబ్బులు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే.. మా అధికారిక, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తామని తెలిపింది. దయచేసి మోసగాళ్ల ఉచ్చులో పడకండని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ⚠️ FAKE CASTING ALERT ⚠️Any casting call currently being circulated in the name of #VenkyAnil5 - #NKRAR2 is FAKE and unauthorized.We urge aspiring artists and the general public not to fall prey to such scams.Any official casting-related announcements will be made only… pic.twitter.com/NlLunpq20k— Shine Screens (@Shine_Screens) June 22, 2026 -
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
-
హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది
ఏదైనా సినిమా సరిగా ఆడకపోతే పలువురు తెలుగు దర్శకనిర్మాతలు.. నెపం ప్రేక్షకులు మీద లేదంటే రివ్యూయర్ల మీద తోసేస్తుంటారు. అంతే తప్పితే తాము సరిగా తీయలేదు, అందుకే ఆడలేదు, కలెక్షన్స్ రాలేదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ సమంత చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే బంగారం ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో బరువెక్కుతోంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్)ఒకప్పుడు సమంత స్టార్ హీరోయిన్. ప్రస్తుతానికి వస్తే హీరోయిన్గా ఓ సినిమా చేసి మూడేళ్లయింది. అది(ఖుషి) కూడా ఏమంత సరిగా ఆడలేదు. దీంతో 'మా ఇంటి బంగారం' ఆడుతుందా లేదా అనే విడుదలకు ముందు చాలా సందేహాలు. మరోవైపు జూన్ నెల మధ్యలో రిలీజ్, స్కూల్స్ తెరిచేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అని డౌట్స్. దీనికి తోడు రివ్యూలు కూడా యావరేజ్గానే వచ్చాయి. కానీ సమంత తన మూవీపై అందరి అంచనాల్ని తారుమారు చేసింది. వీకెండ్ అయ్యేసరికి రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఏం బాగోలేదు. ఓ మాదిరిగా ఆడిన మూవీస్ రూ.20-30 కోట్లు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. అలాంటిది హీరోలెవరూ లేకుండా సమంత మాత్రమే లీడ్ రోల్ చేసిన చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఇది చూసి చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కచ్చితంగా కళ్లుకుంటారేమో. ఎందుకంటే తమకు సాధ్యం కానిది ఓ హీరోయిన్ చేసి చూపించింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నా జనాలు ఆదరిస్తారు. కాకపోతే అవసరం ఆర్భాటాలు లేకుండా కరెక్ట్గా తీయాలంతే. దర్శకనిర్మాతలు ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ అంటే అనుష్క 'అరుంధతి'కి రూ.68 కోట్లు వచ్చాయి. 'మా ఇంటి బంగారం' జోరు చూస్తుంటే ఈ నంబర్ దాటేసేలా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రికార్డ్ అవుతుంది. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. అధికారికంగా చెప్పనప్పటికీ బేబీ బంప్ వీడియోలు వైరల్ కావడంతో ఈ సంగతి బయటపడింది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్కి మెమో) -
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్కి మెమో
'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట గురించి తెలిసిందే. ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. సోమవారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు, హీరో అల్లు అర్జున్కి సమన్లు జారీ చేసింది. కానీ ఇతడు తప్పితే కేసులో భాగమైన మిగిలిన వాళ్లందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసుని వచ్చే నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే: అల్లు అర్జున్)హాజరు కానందుకు అల్లు అర్జున్కి మెమో దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న బన్నీ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాల్సింది. కానీ ఇతడి తరఫున న్యాయవాది వచ్చారు. ముంబైలో షూటింగ్లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ రాలేకపోయారు. ముంబైలో అట్లీ దర్శకత్వంలో తీస్తున్న 'రాకా' షూటింగ్లో బన్నీ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్) -
పాట పాడతానంటూ రెబల్ స్టార్ రచ్చ..!
-
పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి
కొన్నిసార్లు నటీనటులు ఊహించనంతలా మారిపోయి షాకిస్తుంటారు. ఇప్పుడా లిస్టులోకి ఓ బాలనటి చేరింది. పదేళ్ల తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఈ పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరిచింది. తాజాగా తను ఏ హీరోయిన్కి అయితే చిన్నప్పటి పాత్ర చేసిందో.. ఇప్పుడు ఆమె కంటే ఎత్తుగా ఎదిగిపోయేసరికి నెటిజన్లు షాకవుతున్నాయి. మరి ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు మైరా దండేకర్. ముంబైకి చెందిన ఈమె.. తెలుగులో పదేళ్ల క్రితం వచ్చిన హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాల్లో బాలనటిగా చేసింది. మరీముఖ్యంగా అఖిల్ అక్కినేని చేసిన 'హలో' మూవీలో యాక్టింగ్కి గానూ మంచి గుర్తింపు అందుకుంది. తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మూవీస్ తగ్గించేసింది.రీసెంట్గా 'హలో' మూవీలో తను ఎవరికైతే బాలనటిగా చేసిందో సదరు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ని కలిసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జున్ను పదేళ్లలో ఎంతలా మారిపోయిందోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Myrah Dandekar (@myrahdandekarofficial) -
‘హ్రీం’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
సీమ రమ్మంది... స్టోరీ ఉందంది
రాయలసీమ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చంటూ రచయితలను–దర్శకులను ‘సీమ రమ్మంది... స్టోరీ ఉందంది’. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, విడుదలకు సిద్ధమైన ‘రాయలసీమ’ బ్యాక్డ్రాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.నవ్వుల కోలాటం వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో నవ్వుల కోలాటం అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘వెంకీఅనిల్5 అండ్ ఎన్కేఆర్ఏఆర్2’ (వర్కింగ్ టైటిల్) అనే ఎంటర్టైనింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ నేడు ఆరంభం కానుంది.‘కత్తిలాంటి ఐడియా’ అంటూ ఓ వినోదాత్మక కాన్సెప్ట్ వీడియోను ఆదివారం రిలీజ్ చేసి, ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని ఈ వీడియోతో స్పష్టం చేశారు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి ‘జనవరి 13న రిలీజ్, బామ్మర్ది బాల్రెడ్డి’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్, అర్చనల సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.ప్రేమ కోసం లెనిన్ ‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్తో ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ప్రేమ కోసం లెనిన్ ఏ స్థాయిలో పోరాటం చేస్తాడో ఈ క్యాప్షన్ స్పష్టం చేస్తోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ప్రేమ, కుటుంబం, రాజకీయ అంశాలతో రూరల్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ సినిమా రూపొందింది. ఈ చిత్రకథలో ‘ప్రేమ’ ప్రధానాంశంగా ఉంటుందని ఆ మధ్య విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో కూడా స్పష్టం చేసింది.లెనిన్పాత్రలో అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత మాస్ లుక్లో ఈ చిత్రంలో అఖిల్ కనిపించనున్నారు. రాయలసీమ కుర్రాడిగా ఒదిగి΄ోవడానికి అఖిల్ చిత్తూరు యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తనపాత్రకు డబ్బింగ్ కూడా చె΄్పారు. జూలై 10న ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.యోధుడు రణబాలి అది 19వ శతాబ్దం... ముఖ్యంగా 1854 – 1878 మధ్యకాలం. బ్రిటిష్పాలనలో కరువు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోంది. అప్పుడే జనాల్లోంచి ఓ యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. బ్రిటిష్వారిపై ఆ యోధుడు తిరగబడ్డాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. ఇందులో యోధుడు రణబాలిపాత్రను విజయ్ దేవరకొండ, అతనికి జోడీగా జయమ్మపాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాలు, తిరుగుబాట్ల ఆధారంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నాటి రాయలసీమ యాసలో శిక్షణ తీసుకోవడమే కాకుండా, గుర్రపు స్వారీలోనూ శిక్షణ పొందారు విజయ్ దేవరకొండ. ఈపాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియన్ దెయ్యం వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయికగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఈ చిత్రంలో కనకరాజు అనేపాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారని తెలిసింది. ఓ కొరియన్ దెయ్యానికి, కనకరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మాత్రం సినిమాలో చూడాలి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.మంగాపురంలో ప్రేమసూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేశ్బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాసా మంగాపురం’. రవీనాటాండన్ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా తిరుపతికి దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది.ఈ విలేజ్ లవ్స్టోరీ సినిమాలో శ్రీనుపాత్రలో జయకృష్ణ, మంగపాత్రలో రాషా నటిం చారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూలై 9న రిలీజ్ కానుంది. ఇంకా సాయిదుర్గా తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’తోపాటు రాయలసీమ నేపథ్యంలో రానున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
'ది రెడ్ బ్యాగ్' టీజర్ విడుదల
హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఆదివారం చిత్ర టీజర్ని ఏపీ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతుంది. అసలు ఆ రెడ్ బ్యాగ్లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్ ఉంది. నలుగురు హీరోయిన్స్ ఎంత గ్లామరస్గా కనిపిస్తున్నారో.. అంత వయలెంట్గా తెరపై విధ్వంసం చేసినట్టు అనిపిస్తోంది. శేఖర్ మోపురి సంగీతమందించారు. త్వరలో చిత్ర రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో 'బాహుబలి') -
'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?
రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు పవన్ చేసినప్పటికీ.. అవి అభిమానులకు తప్పితే మిగతా వాళ్లకు పెద్దగా నచ్చలేదు. తర్వాత చేసిన వాటిలో బ్రో, హరిహర వీరమల్లు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి టైంలో 'ఓజీ' హిట్ కావడంతో పవన్లో కాస్త జోష్ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజ్ కాగా ఆ టైంలో దీని సీక్వెల్పై టాక్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ విషయమై అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)'ఓజీ' తీసిన దర్శకుడు సుజీత్.. మళ్లీ పవన్ కల్యాణ్ని కలిశాడు. ఈ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. చూస్తుంటే త్వరలోనే షూటింగ్ మొదలయ్యేలా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ పవన్ కల్యాణ్తో కొన్నాళ్ల క్రితం సురేందర్ రెడ్డి ఓ మూవీ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అది షూటింగ్ జరుగుతుందా? లేదంటే 'ఓజీ 2' కోసం పవన్.. సురేందర్ రెడ్డిని పక్కనబెట్టేశాడా అని సందేహాలు వస్తున్నాయి.మరోవైపు సుజీత్ కూడా నానితో 'బ్లడీ రోమియో' అనే సినిమా చేయాలి. ఈ మూవీ లొకేషన్స్ కోసమే రీసెంట్గా సుజీత్.. ఇంగ్లాండ్ వెళ్లొచ్చాడనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ దర్శకుడు పవన్ని కలవడం చూస్తే నాని మూవీ మొదలవడానికి ముందే 'ఓజీ 2' చేస్తారా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నింటికి త్వరలో సమాధానమిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా?) -
ఎట్టకేలకు మూడో రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా?
'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ ఏడాది అసలు దీన్ని విడుదల చేయరని, వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. దీంతో మేలుకున్న మూవీ టీమ్.. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే)ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ 'టాక్సిక్'.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ రోజు బుధవారం. సాధారణంగా సినిమాల్ని శుక్రవారం విడుదల చేస్తుంటారు. మరీ కాదంటే గురువారం తీసుకొస్తుంటారు. కానీ యష్ మాత్రం కాస్త భిన్నంగా బుధవారం ఎంచుకున్నాడు. బహుశా వీకెండ్ లోపు ఎంతైతే అంత కలెక్షన్స్ రాబట్టేయాలని ప్లాన్ ఏమో? ఎందుకంటే పలుమార్లు వాయిదా పడటంతో ఈ మూవీపై బజ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ రిలీజ్ ముంగిట ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి?1980ల్లో గోవా బ్యాక్డ్రాప్లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీశారు. ఇందులో యష్ సరసన కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.. ఇలా ఐదుగురు హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'రామాయణ'లో యష్. రావణుడిగా విలన్ పాత్ర చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)Honour Thy Father...#Toxic In Cinemas Worldwide from 26-08-2026#ToxicTheMovie#Nayanthara @advani_kiara #TaraSutaria@humasqureshi @rukminitweets #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/oAlW0JdldO— Yash (@TheNameIsYash) June 21, 2026 -
సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి
హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తనకు ఎలాంటి సపర్యాలు చేసిందో రాజ్ సోదరి శీతల్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)'సమంత-రాజ్ పెళ్లయిన తర్వాత కొన్నిరోజుల తర్వాత వాళ్లింటికి వెళ్లాను. ఓరోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి కారణంగా నేను మంచం కూడా దిగలేని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ గ్రూప్లో నా గురించి మెసేజ్ పెట్టగా.. సమంత తాను వస్తున్నట్లు చెప్పింది. మందులు, నీళ్లు తీసుకుని తనే వచ్చింది. దుప్పట్లు లేకపోతే నాపై టవర్స్ కప్పింది. ఆ టైంకి సమంతకి చాలా పనులున్నాయి. ఉదయం షూటింగ్ ఉంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ బాధగా ఉంది''సమంత సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తర్వాతి రోజు సెట్కి వెళ్లాను. అప్పుడు సమంత చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించింది. బ్రేక్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. ఆమె ముఖంలోని ఆందోళన నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించింది. సినిమాలో ఆ సీన్స్ చూసినవాళ్లెవరికీ ఆమె అలసట గురించి తెలీదు. ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గురించి తెలీదు' అని శీతల్ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru) -
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
-
నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే
ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గురించి పోస్టులు పెడుతున్నారు. నాన్నని గుర్తుచేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?)అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'నా తండ్రే నా దైవం. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం ఆయనే ఇచ్చారు' అని రాసుకొచ్చాడు. తండ్రితో దిగిన ఫొటోలకు ప్రవచనకర్త చాగంటి వాయిస్ ఓవర్ జోడించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ప్రపంచంలోని తండ్రులందరికీ అల్లు అర్జున్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు.'పుష్ప' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్నాడు. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్తోనూ ఓ మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
రావిపూడి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..!
-
సమంత గుడ్ పార్టనర్
-
క్లింకార ఫేస్ రివీల్
-
వారణాసిలో ఫైట్
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ టైమ్ ట్రావెల్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్ను వారణాసి అండ్ టీమ్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. గత ఏడాది నవంబరులో ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్.ఈ వీడియోలో మహేశ్బాబు ఎంట్రీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశాలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారట. ఈ ఫైట్ ఎపిసోడ్ ‘వారణాసి’కి ఎంతో కీలకమైనదని తెలిసింది. కాగా, ఈ చిత్రం కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా వారణాసి సెట్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సెట్లోనే తాజా ఫైట్ షూట్ జరుగుతోందని టాక్. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
కొత్త భాష మాట్లాడాను: శ్రీ విష్ణు
‘‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒక పీరియడ్ సినిమా. 90లలో జరిగిన ఒక ఘటనకి ఫిక్షన్ జోడించి కోన వెంకట్గారు ఒక అద్భుతమైన కథని సిద్ధం చేశారు. ఈ చిత్రం కోసం ఒక కొత్త భాషను మాట్లాడాను... దాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్పై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ఒరియా పిల్ల...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్ని శనివారం నిర్వహించారు.ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్ సమయంలో నాతో పాటు అందరూ చాలా సరదాగా పని చేశాం’’ అన్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘శ్రీ విష్ణు ఈతరం ఆల్రౌండర్. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో పని చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.‘కామ్రేడ్ కళ్యాణ్’ వంద శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది’’ అన్నారు జానకి రామ్. ‘‘ఈ సినిమాలో మంచి వినోదంతో పాటు చక్కని సంగీతం ఉంది’’ అని వెంకటకృష్ణ కర్నాటి చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, నటుడు షైన్ టామ్ చాకో, లిరిక్ రైటర్ భాస్కరభట్ల, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రచయిత బీవీఎస్ రవి మాట్లాడారు. -
నాన్నకు ప్రేమతో..
నాన్న అంటే ఓ భావోద్వేగం... నాన్న అంటే నమ్మకం... నాన్న అంటే భరోసా... నాన్న అంటే సూపర్ హీరో... నాన్న అంటే ప్రేమకు నిర్వచనం... ఆ ప్రేమ అనంతం.. అందుకే సిల్వర్ స్క్రీన్పై కూడా ఫాదర్ ఎమోషన్ ఎవర్ గ్రీన్. వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కాసులు వర్షం కురిపిస్తారు. అందుకే ఫాదర్ ఎమోషన్తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఉంది. మరి... ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఫాదర్ ఎమోషన్స్తో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ కాకాజీ చిరంజీవి ‘డాడీ’ సినిమా గుర్తుందిగా..! ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో తండ్రీకూతుళ్ల ఎమోషన్ భావోద్వేగభరితంగానే సాగుతుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’లోనూ ఫాదర్–డాటర్ ఎమోషనల్ సీక్వెన్స్ ఆడియన్స్ను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఓకే చేశారట చిరంజీవి.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీక్వెన్స్లు అద్భుతంగా ఉంటాయని తెలిసింది. కథలో చిరంజీవి, అనశ్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. కోల్కతా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.తొలి షెడ్యూల్ షూటింగ్ను హైదరాబాద్లో, రెండో షెడ్యూల్ను పొల్లాచ్చిలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైందని తెలిసింది. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్స్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.కూతురు కోసం..! కూతురు కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు హీరో నాగార్జున. ఏం చేశారు? అనేది ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చని తెలిసింది. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘కింగ్ 100’. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. నాగార్జున కెరీర్లోని ఈ 100వ సినిమాలో టబు, సుష్మితా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టెక్నాలజీ సాయంతో పాతికేళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నాగార్జున కనిపించనున్నట్లు తెలిసింది.ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు... ఈ ‘కింగ్ 100’ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు కూడా నటిస్తారని తెలిసింది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ చిత్రంలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉన్న విషయం ఆ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది.ఇరుముడి రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్టు నక్షత్ర నటిస్తోంది.రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెర పాలెం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో మంచి ఫాదర్–డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే.ఇటు స్పిరిట్... అటు సలార్... దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలు ‘అర్జున్ రెడ్డి, యానిమల్’. ఈ రెండు చిత్రాల్లోనూ అంతర్లీనంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. ఈ తరహా ఎమోషనల్ బాండింగ్ సందీప్ తాజా చిత్రం ‘స్పిరిట్’లోనూ కనిపించనుందని తెలిసింది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్, ప్రకాష్రాజ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని భోగట్టా.ప్రకాష్రాజ్ సైతం పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా నుంచి తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’వచ్చింది. ఈ చిత్రంలో దేవ పాత్రలో నటించారు ప్రభాస్.తొలి భాగంలో ప్రభాస్ తండ్రి పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ రెండో భాగంలో దేవ తండ్రి ధారా ప్రస్తావన పెద్ద స్థాయిలో ఉంటుందని తెలిసింది. సలార్ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవ–ధారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలైట్గా ఉంటాయని తెలిసింది. వచ్చే ఏడాది ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి డ్రాగన్ అయితే కొడుకు లూగర్?ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో డ్రాగన్, లూగర్... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారని, కథ రీత్యా సినిమాలో డ్రాగన్, లూగర్లు తండ్రీ కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అన్షుమాన్, సిద్ధాంత్ గుప్తా, బిజు మీనన్, ఖుష్బూ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవర, వర... ఇలా తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. ఈ సినిమాకు సీక్వెల్గా ‘దేవర 2’ రూపొందనుంది. ‘దేవర’ని నిర్మించిన కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ రెండో భాగాన్ని కూడా నిరిస్తారని చెప్పోచ్చు.తండ్రి... ఇద్దరు కొడుకులు! అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇందులో తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారని తెలిసింది. ఇలా అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. దీపికా పదుకోన్, మలయాళ నటి ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలిసింది. ఈ ‘రాక’ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్ల క్యారెక్టరైజేషన్స్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 డిసెంబరులో రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇతర భాషల్లో రూపొంది, తెలుగు తెరకూ రానున్న కొన్ని చిత్రాల్లోనూ తండ్రి ఎమోషన్ ప్రధానాంశంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే... ⇒ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ‘జన నాయకుడు’ ఉండబోతున్నట్లు ట్రైలర్లోని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్, మమితా బైజు తండ్రీ కుమార్తెలుగా నటించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ప్రియమణి, నాజర్, సునీల్, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జన నాయకుడు’ సినిమా తీశారనే వార్తలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. ⇒ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇదో ఫాదర్ ఎమోషన్తో అల్లుకున్న సినిమా కథ అని టైటిల్ స్పష్టం చేస్తోంది . ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ విజయ్ ప్రకాష్ తండ్రి సర్దార్. సమాజం నిందిస్తున్నట్లు తన తండ్రి ఓ దేశద్రోహి అనే భావనలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ విజయ్ప్రకాష్. కానీ సర్దార్ ఒక ఇండియన్ స్పై ఏజెంట్ అని, నిజమైన దేశభక్తుడు అని విజయ్ప్రకాష్ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తండ్రి బాటలోనే తాను ఇండియన్ స్పై ఏజెంట్గా మారతాడు. మరి... నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ‘సర్దార్’ సినిమాలో చూడాలి. విజయ్ప్రకాష్, సర్దార్... ఇలా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన తమిళ సినిమా ‘సర్దార్’. 2022లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ చిత్రదర్శకుడు పీఎస్ మిత్రన్, హీరో కార్తీ కలిసి ‘సర్దార్2’ సినిమాని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్జె సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ షారుక్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న హిందీ సినిమా ‘కింగ్’. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన షారుక్, సుహానా ఖాన్ ‘కింగ్’ సినిమాలోనూ ఫాదర్–డాటర్ రోల్స్లో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్గా నటిస్తుండగా రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. అలాగే ఇది సుహానా ఖాన్ నటిస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్పై తన డెబ్యూ మూవీలోనే తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ కుమార్తెకు అయినా ఇంతకంటే స్పెషల్ ఏం ఉంటుంది? నిజంగా యాక్టర్గా సుహానా లక్కీ అని చెప్పవచ్చు.⇒ ఆహార కల్తీ అనేది చిన్నారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న అంశం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. కూతురి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన అసాధారణమైన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో శ్రేయాస్ తల్పాడే నటించగా, న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మించారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషిలు సహ–నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం: మంగేష్ ధాక్డే. ⇒ కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఏదైనా మంచి బహుమతి ఇస్తాడు? కానీ ఓ తండ్రి తన కుమార్తె చేతికి గన్ ఇచ్చాడు. ఎవర్నో చంపిన తర్వాత హ్యాపీ బర్త్ డే చెప్పాడు. నిజంగా అతను ఆమెకు తండ్రేనా? లేక తండ్రిలా ఆ అమ్మాయిని పెంచి, తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడా? అనేది హిందీ సినిమా ‘ఆల్ఫా’లో చూడాలి. ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆల్ఫా’. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.– ముసిమి శివాంజనేయులు -
షాకింగ్ డెసిషన్.. మనసుకు విశ్రాంతి కావాలి
స్వతహాగా అసోం అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాయదు లోహర్. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనసుకు విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)'సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. శరీరానికి ఇచ్చినట్లే మనసుకూ విశ్రాంతి కావాలి. స్క్రీన్కి దూరంగా ఉండి నాతో నేను ఎక్కువ టైం గడపాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి ప్రేమ చూపించిన వాళ్లకు థ్యాంక్స్. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నా' అని కాయదు పోస్ట్ పెట్టింది.తెలుగులో 'అల్లూరి' మూవీతో హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అలా తెలుగు, తమిళ, మలయాళంలో పలు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే తమిళంలో ఇమ్మోర్టల్, తెలుగులో 'ప్యారడైజ్' చేస్తోంది. మరి కెరీర్ పరంగా బాగానే ఉన్న టైంలో ఇలా సోషల్ మీడియాకు ఎందుకు బ్రేక్ ఇచ్చిందో?(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ రిలీజ్ టైంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని తెలిపారు.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్ఫార్మ్స్, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని షెరాజ్ తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.(ఇదీ చదవండి: ఇన్స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?) -
ఇన్స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం'కి పర్లేదనిపించే టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.13 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే ఈ విషయం పక్కనబెడితే మూవీలో సమంత అదరగొట్టేసినప్పటికీ ఈమె ఫ్రెండ్ కిరణ్మయి పాత్ర చేసిన నటి కూడా ఆకట్టుకుంది. 'లెట్స్ కమాన్' అంటూ అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇన్ స్టా, యూట్యూబ్లో తన ప్రతిభ చూపిస్తూ చాలామంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే 'మా ఇంటి బంగారం'లో సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అవకాశం దక్కించుకుంది. పాతతరం నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో గుర్తింపు మంజూష చాలానే తెచ్చుకుంది.ఓ రోజు డైరెక్టర్ నందిని రెడ్డి అనుకోకుండా మంజూష రీల్ పడింది. దీంతో ఈమెని పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడుసార్లు ఆడిషన్ చేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్కి ఎంపిక చేసింది. నందిని రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్న మంజూష.. ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు చేసొచ్చి ఫ్రెండ్ సమంతకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే పాత్రలో మంజుష భలే నటించింది. ఓవైపు అమాయకంగా మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్లో ఈమె యాక్టింగ్ తెగ నవ్విస్తోంది. ఇదే తొలి సినిమా అయినప్పటికీ చాలా సహజంగా పాత్రలో సెట్ అయిపోయి, అనుభవమున్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్లోనే ఉంటున్న ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) View this post on Instagram A post shared by Manjusha Mukkavilli (@manju_kuttilu) -
23 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో సోనాలి బింద్రే సందడి..!
-
‘నాగబంధం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రతి తుఫాను వెనుక...
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఎన్బీకే111’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.శుక్రవారం (జూన్ 19) కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్బీకే 111’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘ప్రతి తుఫాను వెనుక ఓ కారణం ఉంటుంది’ అంటూ కాజల్ పాత్ర స్వభావాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో తెలియజేసే ప్రయత్నం చేసింది యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఈ పుడమికి కావలి నువ్వు
గోపీచంద్ హీరోగా నటిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వీర జయధీర...’ అంటూ సాగే తొలి పాటను శనివారం విడుదల చేశారు.‘ఓ వీర... జయధీర.., ఓ వీర... ధ్రువతార.., పయనించే శిఖరం నువ్వేరా... ప్రవహించే సమరం నువ్వేరా.., ఈ పుడమికి కావలి నువ్వురా... ఆ కడలికి కంచెవు నువ్వురా... గగనానికి గొడుగైనావురా... అయినా నువ్వే ఒంటరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన పాడారు. ‘‘క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ‘భరత వర్ష’ మూవీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో అంచనాలను పెంచుతూనే ఉంది.‘వీర జయధీర...’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ఫుల్ పాటగా నిలుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్. -
రేవంత్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్-1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్. రామ్ భరదరం దర్శకత్వం వహిస్తున్నారు.లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీస్ని ఆకట్టుకొనేలా సినిమా తీయనున్నట్లు దర్శకుడు రామ్ భరదరం చెప్పుకొచ్చారు. సింగపూర్లో సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. హైదరాబాద్, చీరాలలో టాకీ పార్ట్ తీయబోతున్నారు. -
సడన్గా ఓటీటీకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అంతేకాకుండా తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3,రవిబాబు రేజర్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఒక్క రోజే స్ట్రీమింగ్కు వచ్చేశాయి.తాజాగా మరో మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ ఏడాది మే 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు. #Mareechika (Telugu)Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026 -
మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?
-
సమంతకు ప్రెగ్నెన్సీ.. అందుకే అలా కనిపించారా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సామ్ హిట్ కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇదే సమయంలో సమంతపై సోషల్ మీడియాలో రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్ల తర్వాత సామ్పై ఓ టాక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నిజమైతే సమంత ఫ్యాన్స్కు ఆనందం డబుల్ అని పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత టీమ్ నుంచి ఎలా స్పందన రాలేదు.చీరకట్టు వల్లే..ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లకు సమంత చీరకట్టులోనే హాజరయ్యారు. ఏ ఈవెంట్కు నిండు చీరలో అందంగా కనిపించారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఈవెంట్స్కు చీరలో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సామ్ సంప్రదాయబద్ధంగా శారీలో కనిపించడం ప్రెగ్నెన్సీ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. కొందరైతే నెటిజన్ ఏకంగా సామ్ బేబీ బంప్తో ఉందని.. అందుకే కనిపించకుండా శారీలోనే ప్రమోషన్లలో పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్పై సమంత కానీ.. ఆమె టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో సామ్- రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. -
నాన్స్టాప్ నవ్వులు ఆరంభం
వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘వెంకీఅనిల్5 అండ్ ఎన్కేఆర్ఏఆర్ 2’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి నటించనున్నారు. జీ స్టూడియోస్, అర్చన, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.గురువారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కలిసి నిర్మాత సాహు గారపాటికి స్క్రిప్ట్ అందించారు.‘‘దర్శకుడు అనిల్ రావిపూడి శైలితో కూడిన నాన్స్టాప్ నవ్వులు, వినోదంతో కూడిన సినిమా ఇది. వెంకటేశ్, కల్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వచ్చే సంక్రాంతి పండగ సీజన్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఎంటర్టైనింగ్ మూవీస్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని ఆరంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' సాంగ్ రిలీజ్
హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్పై యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో సోషల్ సెటైర్గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ఈ చిత్రం తీస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా సిప్పు సిప్పు అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ డాన్స్ ట్రాక్కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ మాళవిక పాడింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తీస్తున్నారు. -
వెంకీ-అనిల్ మూవీ లాంఛ్.. రాఘవేంద్రరావు తీరుపై విమర్శలు..!
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం రానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీ కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్ను హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రోజే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లాంఛ్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహుర్తపు షాట్కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్ షాట్కి డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్కు కారణమైంది. హీరోయిన్ కృతి శెట్టి భుజంపై తన చేయి పెట్టి మరి మాట్లాడుతూ కనిపించారు. దర్శకత్వం వరకు ఓకే కానీ.. యంగ్ హీరోయిన్ భుజంపై చేతులు వేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో హీరోయిన్తో ఆయన వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ పేరున్న డైరెక్టర్ ఇలా వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. #VenkyAnil5 Begins🎬Venkatesh, Keerthy Suresh, Kalyan Ram, Kriti Shetty. pic.twitter.com/a9iSg28COA— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)
-
వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంఛ్.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్(ఫోటోలు)
-
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను
ఒకే ఒక్క సినిమా అతని కెరీర్నే మార్చేసింది. ఏకంగా ఆ సినిమా పేరుతోనే ఆయన పిలిచేలా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఒక్క మూవీతో కెరీర్ మార్చడమే కాదు.. ఒక నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నటుడు ఎవరని అనుకుంటున్నారా? అతనే ఉదయ్ కిరణ్ మూవీ చిత్రంతో ఫేమస్ అయిన శీను.. అలియాస్ చిత్రం శీను.చిత్రం శీను అంటే కేవలం కమెడియన్ మాత్రమే.. నటుడిగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కూడా రాణించారు. పొలిమేర చిత్రాల తర్వాత గతేడాది మేఘన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చిత్ర శీను తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన గర్వం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని షాకింగ్ రివీల్ చేశారు.ఒకసారి రాజీవ్ కనకాల నాతో ఓ స్థలం కొంటున్నానని నాతో చెప్పారని చిత్రం శీను తెలిపారు. నేను మణికొండలో ప్లాట్ తీసుకుంటున్నా.. నువ్వు కూడా తీసుకో అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయనను నేను బావ అని పిలిచేవాడిని.. అప్పుడు నేను చిరంజీవి ఎక్కడ ఉంటారు.. జూబ్లీహిల్స్లో కదా.. నేను కూడా అక్కడే కొంటానని రాజీవ్తో చెప్పానని అన్నారు. నేను సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటాననే గర్వంతో ఉండేవాడినని శీను తెలిపారు. అప్పుడు నా వయసు కేవలం 23 ఏళ్లేనని.. అవగాహన లేకనే అలా మాట్లాడానని చిత్రం శీను వివరించారు. తినడానికి అన్నం లేక..తినడానికి అన్నం లేని రోజులు కూడా చూశానని చిత్రం శీను అన్నారు. బీరు బాటిల్స్ అమ్ముకుని టిఫిన్ చేసిన రోజులు ఎదుర్కొన్నానని శీను వెల్లడించారు. ఇంద్రలోక్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ వద్ద బీర్ బాటిళ్లను తీసుకెళ్లి అమ్ముకుడేవాన్ని అని తెలిపారు. ఆ తర్వాత న్యూస్ పేపర్ వేయడం ద్వారా కొంత చిల్లర డబ్బులు వచ్చేవని చిత్రం శీను తన ఎదుర్కొన్న బాధలను పంచుకున్నారు. -
మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే
-
రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి?
ఓటీటీలు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు, సిరీస్లు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్నాయి. అయితే ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యే సినిమాల్లో కేవలం చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్ల విషయానికొస్తే పెద్దగా స్టార్స్ కనిపించరు. కొంత పేరున్న నటీనటులే ఉన్నప్పటికీ అగ్రతారలెవరు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసిన సందర్భాలు చాలా తక్కువే.కానీ ఇప్పుడంతా సీన్ మారిపోయింది. ఒకప్పటి స్టార్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఓటీటీల్లోకి అరంగేట్రం చేస్తోంది. దీంతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సెకండ్ లవ్. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ లవ్ అంటే ప్రేమ, వ్యామోహం అనే కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ ఉండనుందని టైటిల్ వింటేనే అర్థమవుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ అభిమానులు షాకవుతున్నారు. -
21 ఏళ్లైనా ‘అపరిచితుడు’ మ్యాజిక్ ఎందుకు తగ్గలేదు?
ఒక సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. కానీ చాలా అరుదుగా వచ్చే కొన్ని చిత్రాలు మాత్రం కాలాన్ని దాటి తరాల తరబడి చర్చల్లో నిలుస్తాయి. అలాంటి చిత్రమే అపరిచితుడు. 2005 జూన్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సంచలన చిత్రం నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే రెండు దశాబ్దాలు గడిచినా ‘అంబి(ramanujam)’ బాధ, ‘అన్నియన్’(aparichitudu )ఆగ్రహం, ‘రేమో’ స్టైల్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో తాజాగా ఉండటం విశేషం.సాధారణంగా హీరో విలన్ను కొట్టి గెలిచే కథలే ఎక్కువగా వచ్చిన కాలంలో దర్శకుడు శంకర్ పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకున్నారు. దేశాన్ని నాశనం చేసేది కేవలం అవినీతి రాజకీయ నాయకులే కాదు.. బాధ్యత లేకుండా ప్రవర్తించే సామాన్య ప్రజలూ అని ఆయన చూపించిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, విధుల్లో నిర్లక్ష్యం చూపించడం వంటి రోజూ జరిగే విషయాలనే కథకు కేంద్రబిందువుగా మార్చారు.ఈ చిత్రానికి అసలైన బలం విక్రమ్ నటన. చట్టాన్ని నమ్మే అమాయకుడైన రామానుజం, ఫ్యాషన్ ప్రపంచంలో విహరించే రేమో, తప్పు చేసిన వారిని భయంకరంగా శిక్షించే అపరిచితుడు.. ఇలా మూడు విభిన్న వ్యక్తిత్వాలను ఒకే సినిమాలో చూపించి విక్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో గొప్ప పెర్ఫార్మెన్స్లలో దీనిని ప్రస్తావిస్తారు.సినిమాలోని శిక్షల సన్నివేశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. పురాణాల్లో చెప్పిన గరుడ పురాణ శిక్షలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. థ్రిల్లర్, సైకాలజీ, సామాజిక సందేశం.. ఈ మూడు అంశాలను శంకర్ ఒకే కథలో మేళవించడం చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.అప్పటి భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్గా కూడా కొత్త ప్రమాణాలు సృష్టించింది. విదేశాల్లో చిత్రీకరించిన పాటలు, అద్భుతమైన సెట్లు, హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.తెలుగులో ‘అపరిచితుడు’గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, టెలివిజన్లో ప్రసారమైన ప్రతిసారీ మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియా యుగంలో కూడా ‘రామానుజం’ మీమ్స్, ‘అపరిచితుడు’ డైలాగులు వైరల్ అవుతుండటం ఈ సినిమా ప్రభావానికి నిదర్శనం. 21 ఏళ్లు గడిచినా ‘అపరిచితుడు’ కేవలం ఒక సినిమా కాదు... మన సమాజం మారిందా లేదా? అని ఇప్పటికీ ప్రశ్నిస్తున్న అద్దం. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైపోయింది. ఈ ఏడాది ఇప్పటికే రష్మికతో పాటు పలువురు నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ లాంటి శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది. బేబీ బంప్తో భర్తతో కలిసి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)గుజరాత్కి చెందిన పూజా ఝావేరి.. 2015లో 'భమ్ భోళేనాథ్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'ద్వారక', సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్', రవితేజ 'టచ్ చేసి చూడు',47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్ తదితర టాలీవుడ్ చిత్రాలు చేసింది.2024లో ఎన్నారైని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి న్యూయార్క్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూజా ఝావేరి.. భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్తో తీసుకున్న వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత) View this post on Instagram A post shared by Pooja J Jhaveri (@iampoojajhaveri) -
మెగాఫోన్ పడుతున్న మన హీరోలు!
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో మల్టీ టాలెంటెడ్ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. గతంలో కేవలం నటనకే పరిమితం అయ్యేవారు హీరోలు, హీరోయిన్లు. అయితే ఇప్పటి హీరోలు కేవలం నటనకి మాత్రమే పరిమితం కావడం లేదు. యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరేమో తమ సినిమాలకు తామే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సరైన హిట్స్ లేనప్పుడు తమకు సరిపడా కథలను రాసుకుని హిట్ అందుకున్న హీరోలూ ఉన్నారు. మరికొందరేమో స్వీయ కథని సిద్ధం చేసుకోవడంతో పాటు తామే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించి, హిట్స్ అందుకున్నారు కూడా.అయితే ఇటీవల ఎక్కువ మంది హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా మారారు కూడా. సొంత ప్రొడక్షన్ హౌస్లు నెలకొల్పిన వారిలో కొందరు హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం పలువురు హీరోలుగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తుండగా, మరికొంత మంది స్వీయ నిర్మాణంలో హీరోలుగా నటిస్తున్నారు. ఈ లిస్ట్లో తెలుగులో అక్కినేని నాగార్జున, రామ్ పోతినేని, వడ్డే నవీన్, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో పాటు హీరోయిన్ సమంత ఉన్నారు. ఇక కన్నడ నుంచి యశ్, తమిళ్ నుంచి విశాల్, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ వంటి కథానాయకులు కూడా ఉన్నారు. ఇలా ఆన్ సెట్ ఆర్టిస్టులుగా ఆఫ్ సెట్ దర్శకులుగా నిర్మాతలుగా బిజీగా ఉన్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.నూరవ చిత్రానికి నిర్మాతగానూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ (1986) సినిమాతో హీరోగా పరిచయమై, నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు తన సతీమణి అన్నపూర్ణ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానర్ను నెలకొల్పి పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్పై నాగార్జున కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర రావు మరణానంతరం కూడా అన్నపూర్ణ స్టూడియోస్పై తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు నాగార్జున.తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న వందో చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్పైనే నిర్మిస్తున్నారు. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్. హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతుండటం విశేషం. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు.ఈ మూవీలో నాగార్జునతో కలిసి నటిస్తున్నారు టబు. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ’ (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో సర్ప్రైజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి... హీరో విశ్వక్ సేన్ ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫలక్నూమా దాస్’. ఈ మూవీకి కథ అందించడంతో పాటు హీరోగా నటించారు విశ్వక్ సేన్. ఈ చిత్రాన్ని ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2019 మే 31న విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. డైరెక్టర్గా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు విశ్వక్ సేన్. ఆ తర్వాత హీరోగా బిజీ అయిన ఆయన దర్శకత్వం వహించిన ద్వితీయ చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రాన్ని కూడా ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ చిత్రం విజయం అందుకుంది. అనంతరం కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన విశ్వక్ ముచ్చటగా మూడోసారి దర్శకత్వం చేపట్టారు. ఆయన హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర ΄ాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.హైదరాబాద్లో నిర్వహించిన ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను. ‘ఫలక్నూమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను’’ అని పేర్కొన్నారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మించిన ‘కల్ట్’ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. హీరోగా, నిర్మాతగా రీ ఎంట్రీ ‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ (Vadde Naveen) ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఎటాక్’. 2016 ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత సుమారు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించడం విశేషం. ఈ మూవీ ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్పై వడ్డే నవీన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. వినోదాత్మకంగా, భావోద్వేగాలతో ఉండే ఈ చిత్రం వడ్డే నవీన్ నటనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందంటూ యూనిట్ పేర్కొంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ– ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాని టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ బలంగా ఉంటుంది. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. బంగారంతో మళ్లీ నిర్మాతగా... ‘ఏమాయ చేసావె’ (2010) సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు సమంత. తొలి మూవీతోనే హిట్ అందుకుని, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారామె. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సమంత ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని నెలకొల్పిన ఆమె తొలి చిత్రంగా ‘శుభం’ మూవీని నిర్మించారు. 2025 మే 9న విడుదలఅయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న సమంత నిర్మించిన ద్వితీయ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించారు.‘ఓ బేబి’ వంటి హిట్ మూవీ తర్వాత సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు(సమంత భర్త), హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్తో రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన లుక్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ–‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నందినీగారు, రాజ్ గారు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో ఎమోషన్, యాక్షన్, డ్రామా, కామెడీ... ఇలా అన్ని వాణిజ్య అంశాలుంటాయి. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రత్యేకించి నా అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాతగా తొలి అడుగు ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (2022) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో యశ్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యశ్ హీరోగా నటించడంతో పాటు నిర్మించడం విశేషం. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ మూవీ నిర్మించారు. ఈ మూవీని ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మార్చి నుంచి జూన్ 4కి రిలీజ్ పోస్ట్పోన్ అయినప్పటికీ మరోసారి వాయిదా పడింది. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.‘‘సినిమాకాన్లో ‘టాక్సిక్’ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత అక్కడ వచ్చిన స్పందన చూశాక వరల్డ్ వైడ్గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యులను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో జూన్ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన మరో విడుదల తేదీని త్వరలోనే చెబుతాం’’ అని యశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘టాక్సిక్’ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. తొలిసారి దర్శకత్వం... హీరో విశాల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పటివరకూ హీరోగా ఆడియన్స్ని మెప్పించిన ఆయన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆర్.బి. చౌదరి నిర్మించిన 99వ సినిమా ‘మకుటం’. బుధవారం విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై క్రేజ్ని పెంచింది. ‘‘స్టైలిష్, విజువల్ ట్రీట్లా ‘మకుటం’ మూవీని తెరకెక్కించారు. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఆయన కెరీర్లోనే క్రేజీ ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలబెట్టాయి. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్గా నిలవబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఇండస్ట్రీ వర్గాలో భారీ అంచనాలున్నాయి. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. జూలైలో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ ప్రకటించింది. పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాదు.. మరికొంత మంది హీరోలు, హీరోయిన్లు కూడా నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. తొలిసారి మెగాఫోన్తో... ‘దేవదాసు’ (2006) సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రామ్ పోతినేని. వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ద్వారా హీరోయిన్ ఇలియానా కూడా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే తనదైన డ్యాన్సులు, నటనతో హిట్ అందుకున్నారు రామ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన తొలిసారి మెగాఫోన్ పడుతున్నారు. ఈ సినిమా కోసం సొంతంగా కథ రాసుకున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాతగా మారారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్పై రూపొందనున్న ‘ర్యాపో 23’ మూవీని రామ్ బర్త్డే సందర్భంగా మే 15న ప్రకటిస్తూ.. ఈ చిత్రంలో రామ్ పోషించనున్న వీర పాత్రని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘‘రామ్ పోతినేని తన కెరీర్లో మరో కీలక అడుగు వేయబోతున్నారు.నటుడిగా తన వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చిన ఆయన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో తొలిసారి లిరిసిస్ట్గా మారి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగానూ తన వాయిస్ని వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన 23వ చిత్రం ‘ర్యాపో 23’తో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వీర పాత్రలో రామ్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.డైరెక్టర్గానూ... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమా ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అయ్యారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ఈ సినిమాకి కథ అందించడంతో పాటు స్క్రీన్ప్లే అందించారు కిరణ్. 2021 ఆగస్టు 6న విడుదలైన ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (2022) సినిమాకి కథ అందించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే కేఏ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ని స్థాపించి, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమా నిర్మించారు కిరణ్. ఈ ఏప్రిల్ 17న ఈ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు తన కెరీర్లో తొలిసారి మెగా ఫోన్ పట్టారు కిరణ్. ఆయన హీరోగా, కథా రచయితగా, స్క్రీన్ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు.జాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో దేవికా భట్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా ఇది. యూత్ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కిరణ్. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో పాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారాయన. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది’’ అని మేకర్స్ తెలిపారు. హీరోగానే కాదు... దర్శకుడిగానూ... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘క్రిష్’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కథానాయకుడిగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి మిల్ గయా’. 2003 ఆగస్టు 8న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం ‘క్రిష్’. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోనూ హృతిక్ రోషన్ హీరోగా నటించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మరో చిత్రం ‘క్రిష్ 3’. రాకేష్ రోషన్– హృతిక్ రోషన్ కాంబినేషన్లోనే తెరకెక్కిన ఈ చిత్రం 2013 నవంబరు 1న రిలీజై, హిట్ అందుకుంది.ఈ ఫ్రాంచైజీలో రానున్న తాజా చిత్రం ‘క్రిష్ 4’. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు హృతిక్ రోషన్. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి మూడు సినిమాలకు తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా ‘క్రిష్ 4’కి మాత్రం హృతిక్ రోషన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనుండటం విశేషం. ‘క్రిష్ 4’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ‘క్రిష్ 4’ ఈ ఏడాదిలో సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. 2027లో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట హృతిక్ రోషన్. – డేరంగుల జగన్ మోహన్ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)కొత్త బంగారులోకం, హ్యాపీడేస్ సినిమాలతో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. మధ్యలో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. బిగ్బాస్ షో తర్వాత మళ్లీ కాస్తంత పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.'కానిస్టేబుల్' విషయానికొస్తే.. శంకరపల్లి అనే ఊరిలో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. అయితే ఈ ఊరిలో చాలామంది హత్యకు గురవుతూ ఉంటారు. కాశీ మేనకోడలిని కూడా చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుందెవరు? సీరియల్ కిల్లర్ని కాశీ పట్టుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)


