breaking news
Tollywood
-
క్రైమ్... సస్పెన్స్
అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రెయిన్’. బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయచంద్ర నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వంలో ఎండ్లూరి కళావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్లో ‘ది బ్రెయిన్’ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్ రాజా. -
సైన్స్ ఫిక్షన్ షురూ
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ లీడ్ రోల్స్లో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో ఓ సినిమా ఆరంభమైంది. వికాస్ దర్శకత్వంలో సృజన గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ విన్నాను. కొత్తగా ఉంది’’ అని తెలిపారు.సృజన గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేస్తున్నాం. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఎవరూ ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేయనున్నాం’’ అని చెప్పారు. -
చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా మొదలైంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో దీన్ని తెరకెక్కించనున్నారు. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సహచారి క్రియేషన్స్ బ్యానర్పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం (నవంబరు 02) ఘనంగా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది. నవంబర్ చివరిలో హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది వందలాది మంది నటులు, హీరోహీరోయిన్లు వస్తూనే ఉంటారు. వీళ్లలో కొందరు నిలబడతారు. మరికొందరు మాత్రం కొన్నాళ్ల పాటు పలు సినిమాల్లో కనిపిస్తారు. కొన్నాళ్ల తర్వాత పూర్తిగ తెరమరుగైపోతారు. ఈ హాస్య నటుడు కూడా సేమ్ అలానే. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఇండస్ట్రీని వదిలేసి డీజేగా పనిచేస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బబ్లూ. తేజ తీసిన 'చిత్రం' సినిమాతో కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. తర్వాత ఆనందం, ఎవడి గోల వాడిదే, ఆర్య, చిరుత, బోణీ తదితర చిత్రాలు చేశాడు. మంచు విష్ణు హీరోగా చేసిన 'వస్తాడు నా రాజు'లో చివరగా కనిపించాడు. కొన్నాళ్ల క్రితం బబ్లూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తన కెరీర్ గురించి చెప్పాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'డ్యూడ్'.. డేట్ ఫిక్సయిందా?)బబ్లూ అసలు పేరు సదానంద్. 'ముద్దుల మేనల్లుడు' సినిమాలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. జంధ్యాల తీసిన 'పోపుల పెట్టె' సీరియల్లో బబ్లూ పాత్ర చేశాడు. తర్వాత నుంచి ఇదే అతడి పేరు అయిపోయింది. వయసొచ్చిన తర్వాత 'చిత్రం'లో నటించే అవకాశమొచ్చింది. తర్వాత పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ సినిమాలు చేశాడు. అయితే జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వరసగా చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఇంట్లోనే అలా ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని బబ్లూ చెప్పుకొచ్చాడు. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా అన్నాడు.యాక్టింగ్ చేయట్లేదని బబ్లూ ఖాళీగా అయితే లేడు. ప్రస్తుతం డీజేగా పనిచేస్తున్నాడు. ఇతడి ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం డీజే వీడియోలే ఉంటాయి. 2006 నుంచి డీజే వృత్తిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఉంది. అంటే ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈ పని కూడా చేసేవాడనమాట. ఒకప్పుడు కమెడియన్గా స్టార్ హీరోలతో పనిచేసిన బబ్లూ.. ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా చేస్తుండటం మెచ్చుకోదగిన విషయమే!(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ) View this post on Instagram A post shared by DJ Bablooo (@actor_sada_dj_babloo) -
స్కర్ట్లో బుల్లితెర భామ అందాలు.. పెళ్లి కూతురిలా నిహారిక!
అలాంటి శారీలో రష్మిక మందన్నా బ్యూటీ లుక్..బ్లూ స్కర్ట్లో అందాలు ఆరబోస్తున్న జ్యోతిపూర్వాజ్..రెడ్ స్కర్ట్లో అనన్య నాగళ్ల అదిరిపోయే లుక్స్..పెళ్లి కూతురిలా ముస్తాబైన నిహారిక కొణిదెల..మెరూన్ శారీలో మెరిసిపోతున్న నటి విమలా రామన్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్!
సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్గా రాణిస్తూనే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తూనే ఉంటోంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద పేరు గట్టిగా వినిపించింది. తాజాగా చిన్మయి మరో చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి అవకాశాలివ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్ట్ చేసింది గాయని. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఇవ్వడమేనని చిన్మయి మండిపడింది. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో చిన్మయికి మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.టాలీవుడ్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా జానీ మాస్టర్పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు కోలీవుడ్ సింగర్ కార్తీక్పై సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. I dont and will never understand the repeated platforming of Jani master or Singer Karthik.Putting power and influence AND money in the hands of men who misuse it is like saying - Here is my support go sexually assault.If there is a Karma theory at work - may it come back and…— Chinmayi Sripaada (@Chinmayi) November 2, 2025 -
పెళ్లి తర్వాత లైఫ్లో థ్రిల్ కావాలా?.. అయితే ఈ టీజర్ చూసేయండి!
టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ(Priyadarshi Pulikonda) నటిస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'(Premante). ఈ మూవీతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది సబ్ టైటిల్. ఈ సినిమాలో ఆనంది(Anandhi) హీరోయిన్గా కనిపించనుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని జాన్వి నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే పెళ్లి అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నా లైఫ్ థ్రిల్లింగ్గా ఉండాలి అంతే అని హీరోయిన్ చెప్పే డైలాగ్తో కథేంటో అర్థమవుతోంది. ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. #PremanteTeaser out now!https://t.co/La06f3A9sSA Rollercoaster of Love, Laughter and Thrills on your way. ❤️In theatres from 21st November #ThrilluPraptirasthuWritten and Directed by @NavaneethFilm@Preyadarshe @anandhiactress @ItsSumaKanakala @leon_james… pic.twitter.com/OCeJ7btclu— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2025 -
రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
గత రెండు మూడు రోజుల నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. టాలీవుడ్లోని పలువురు నిర్మాతల దగ్గర నుంచి ఈ యువ దర్శకుడు అడ్వాన్సులు తీసుకున్నాడని, బదులుగా సినిమాలు చేయకుండా ఆలస్యం చేస్తున్నాడని.. దీంతో సదరు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ని ఆశ్రయించారని వినిపించింది. ఇదిలా ఉండగా 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒకరిపై ఒకరు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదులు చేసుకున్నారనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.'హనుమాన్' తర్వాత అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తమ నిర్మాణ సంస్థలోనే చేస్తానని చెప్పి రూ.10.34 కోట్ల అడ్వాన్స్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని, కానీ నిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్పై నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాల వల్ల జరిగిన నష్టానికిగానూ ప్రశాంత్ వర్మ నుంచి తమకు రూ.200 కోట్ల నష్టపరిహారం కావాలని నిరంజన్ రెడ్డి కోరారు.(ఇదీ చదవండి: ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు)మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తనకు భారీ నష్టాలు, కెరీర్లో ఎదురుదెబ్బలు తగిలాయని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా నిరంజన్ రెడ్డికి తాను ఏమీ అప్పులేనని.. అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస లాంటి సినిమాలు ఆయనతో చేస్తానని ఎక్కడా చెప్పలేదని, అగ్రిమెంట్లు లాంటివి కూడా జరగలేదని అన్నట్లు న్యూస్ బయటకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన హనుమాన్ రూ. 295 కోట్లు రాబట్టిందని, ఆ లాభాల నుంచి తనకు వాటా రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.15.82 కోట్లు మాత్రమే ఇచ్చారని, తనకు ఇవ్వాల్సిన వాటాని ఎగ్గొట్టేందుకు ఈ డ్రామాలన్నీ అని ప్రశాంత్ వర్మ అన్నట్లు తెలిసింది.ఇప్పుడు ఈ వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఓ నోట్ రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పలు మీడియా, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాల్లో అసంపూర్తి, ధ్రువీకరించని సమాచారం మాత్రమే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్ దగ్గర ఈ వివాదం పెండింగ్లో ఉంది. అక్కడ మాట్లాడిన విషయాలన్నీ బయటకు చెప్పడం సరికాదు. అలానే నాపై చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతీకారంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానెల్స్ కూడా అసంపూర్తి సమాచారాన్ని చూపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి' అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వీరిద్దరిలో ఎవరు తప్పు చేశారు? ఎవరు కరెక్ట్ అనేది కొన్ని రోజుల్లో ఫిలిం ఛాంబర్ తేల్చనుంది.(ఇదీ చదవండి: సందీప్ రెడ్డి వంగా దెబ్బకు బాలీవుడ్ గల్లంతు.. ఇప్పటికీ) -
మహేశ్ బాబు సినిమా ఈవెంట్.. ఓటీటీలో లైవ్
మహేశ్బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే, నవంబర్ 16న సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.SSMB29 ప్రాజెక్ట్ గురించి నవంబర్ 16న హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది. -
రాజమౌళి తర్వాత మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో మహేష్ మూవీ
-
రీరిలీజ్ లోనూ బాహుబలి దెబ్బ..! రికార్డ్స్ అన్నీ గల్లంతు
-
ప్రశాంత్ వర్మ రూ.200 కోట్ల వివాదం.. నిర్మాత ఫిర్యాదు
హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ కావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma) రేంజ్ మారిపోయింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ మూవీని నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) నిర్మించారు. ఆయన భారీగా లాభాలు కూడా అందుకున్నారు. అయితే, ఈ సినిమాకు సీక్వెల్గా రానున్న జై హనుమాన్ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే, నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య చాలా కాలంగా ఆర్థిక విభేదాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఇరువురు కూడా లేఖలతో నిర్మాతల మండలిని సంప్రదించడంతో అసలు విషయం బటయకు వచ్చింది.ప్రశాంత్ వర్మపై నిరంజన్ రెడ్డి ఫిర్యాదు..హనుమాన్ సినిమా తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తానని చెప్పి రూ 10.34 కోట్లు అడ్వాన్స్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారని నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే, డబ్బు తీసుకుని సినిమాలు చేయడం లేదని నిర్మాతల మండలిలో ప్రశాంత్పై ఫిర్యాదు చేశారు. పైగా రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టించి మరీ వేరే నిర్మాతల దగ్గర ఉన్న ఆక్టోపస్ సినిమాని కూడా తన చేత ప్రశాంత్ కొనిపించారని నిరంజన్ పేర్కొన్నారు. అయితే. ఆ సినిమాకు కనీసం NOC కూడా ఇప్పించడం లేదని ఛాంబర్లో నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుంచి తమకు 200 కోట్లు నష్టపరిహారం కావాలని ఆయన కోరారు. అలాగే అధీరా సినిమా కోసం అడ్వాన్స్గా ఇచ్చిన కోటి రూపాయలు కూడా తిరిగి ఇప్పించాలని ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదులో నిర్మాత నిరంజన్ రెడ్డి కోరారు. తన ఆర్థిక పరిష్కారాలు క్లియర్ అయ్యే వరకు ఈ చిత్ర ప్రాజెక్టులను ఇతర నిర్మాణ సంస్థలతో కొనసాగించవద్దని నిరంజన్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.నా వాటా ఎగరగొట్టేందుకే ఈ నాటకాలు :ప్రశాంత్ వర్మనిర్మాత నిరంజన్ రెడ్డి ఆరోపణలపై ప్రతిస్పందనగా ప్రశాంత్ వర్మ తీవ్రంగా స్పందించారు. వివరణాత్మక పాయింట్-బై-పాయింట్ వివరణతో సుమారు 4 పేజీల లేఖను సమర్పించారు. నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తనకు భారీ ఆర్థిక నష్టాలు, కెరీర్లో ఎదురుదెబ్బలు తగిలాయని ఆయన తెలిపారు. వాస్తంగా నిరంజన్ రెడ్డికి తాను ఏమీ రుణపడి లేనని చెప్పారు. 'అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు నిరంజన్తో చేస్తున్నట్లు నేను ఎక్కడా చెప్పలేదు. మా ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్ట్లకు సంబంధించి కనీసం అగ్రిమెంట్లు కూడా లేవు. ఆక్టోపస్ సినిమా విషయానికొస్తే ఆ ప్రాజెక్ట్ నిర్మాతతోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. నేను డైరెక్ట్ చేసిన హనుమాన్ రూ. 295 కోట్లు రాబట్టింది. ఆ లాభాల నుంచి నాకు వాటా రావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు నాకు కేవలం 15.82 కోట్లు మాత్రమే అందింది. నాకు ఇవ్వాల్సిన వాటాను ఎగరగొట్టేసి.. ఆ డబ్బుతో డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగ భాష ప్రాజెక్ట్లకు డైవర్ట్ చేశారు. ఇక అధీర సినిమా కోసం అడ్వాన్స్గా కోటి రూపాయలు ఇచ్చానంటున్నారు. అందులో నిజం లేదు. కేవలం అధీర టీజర్ డైరెక్ట్ చేసేందుకు మాత్రమే ఇచ్చారు. హనుమాన్ సినిమాకు వచ్చిన లాభాల్లో నా వాటను ఎగరగొట్టేందుకే ఈ స్టోరీ ప్లాన్ చేశారు.' అని ప్రశాంత్ వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇప్పుడు, పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఎవరు నిజం చెబుతున్నారు, న్యాయం ఎవరివైపు ఉంది? అనేది సమస్యగా మారింది. నిర్మాతల మండలి ద్వారా పరిష్కరించబడుతుందా లేదా కోర్టుకు వెళ్తుందా..? అనేది తేలేందుకు మరింత సమయం పడొచ్చు. ప్రశాంత్ వర్మ చుట్టూ ఆర్థిక వివాదాలు పెరుగుతున్నాయి. చాలా మంది నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ కెరీర్ పరిశ్రమలో విశ్వసనీయతకు కీలకం కానుంది. -
నా పిల్లలకైనా చెప్పాలిగా.. లవ్స్టోరీ బయటపెట్టిన అల్లు శిరీష్
ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లయిపోయినట్లే! నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Sirish)కు హైదరాబాద్కు చెందిన నయనికతో నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం నాడు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.వరుణ్- లావణ్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలుఅయితే నయనిక ఎవరు? ఇది పెద్దలు కుదర్చిన సంబంధమా? లేక లవ్లో పడ్డారా? ఈ ప్రేమకహానీ ఎప్పుడు మొదలైంది? అని అభిమానులు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ గందరగోళానికి ఫుల్స్టాప్ పెడుతూ నయనికతో పరిచయం- ప్రేమ గురించి ఓపెనయ్యాడు శిరీష్. నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్లో వారితో కలిసిన దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిరీష్. అలా మొదలైందివరుణ్, లావణ్యకు రెండో పెళ్లి రోజు శుభాకాంక్షలు. 2023 అక్టోబర్లో మీ పెళ్లి జరిగేటప్పుడు హీరో నితిన్- షాలిని దంపతులు మీకోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ నయనికను కూడా రమ్మని ఆహ్వానించింది. అలా ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజు రాత్రి తొలిసారి నయనికను చూశాను. అప్పుడే తనను కలుసుకున్నాను.నా లవ్స్టోరీ పిల్లలకు చెప్తా..కట్ చేస్తే రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఫ్యూచర్లో నా పిల్లలు మీరెలా కలుసుకున్నారు నాన్న? అని అడిగితే ఇదిగో, ఇలా మీ అమ్మను కలిశా.. అని ఈ కహానీ అంతా చెప్తాను. నయనిక స్నేహితులకు కూడా పెద్ద థాంక్స్. మీ సర్కిల్లో నన్ను కలుపుకున్నందుకు, ఎంతో బాగా చూసుకున్నందుకు థాంక్స్ అని రాసుకొచ్చాడు. అంటే, వరుణ్-లావణ్యల మ్యారేజ్ సమయంలోనే శిరీష్ పెళ్లికి పునాది పడిందన్నమాట! నితిన్ భార్య ఇచ్చిన పార్టీతోనే శిరీష్కు లైఫ్ పార్ట్నర్ దొరికింది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish)చదవండి: షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు -
బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 'కల్కి'.. ఉత్తమ నటుడిగా ఎవరంటే..
సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2025’ ( Dadasaheb Phalke International film festival awards 2025) ముంబైలో ఘనంగా జరిగింది. 2024లో విడుదలైన సినిమాలు, నటీనటులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్లు దక్కాయి. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా ఈ చిత్రం నిలిచింది. బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.అవార్డ్ విజేతలు వీరే..బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్- కల్కి 2898 ADఉత్తమ చిత్రం- స్త్రీ 2క్రిటిక్స్ ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్ఉత్తమ నటుడు - కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)క్రిటిక్స్ ఉత్తమ నటుడు - విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)ఉత్తమ నటి- కృతి సనన్ (స్త్రీ 2)బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్- నితాన్షీ గోయెల్ఉత్తమ సంగీత దర్శకుడి- దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ దర్శకుడు- కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్- దినేశ్ విజన్ఎక్స్లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా- శిల్పాశెట్టిఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్- ఏఆర్ రెహమాన్ఉత్తమ వెబ్సిరీస్- హీరామండిఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- జితేంద్ర కుమార్ (పంచాయత్- 3)ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- హుమా ఖురేషిఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్)- సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి)క్రిటిక్స్ ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- వరుణ్ ధావన్క్రిటిక్స్ ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- సోనాక్షి సిన్హా (హీరామండి) -
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రాజమౌళితో మహేశ్ బాబు
మహేశ్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్లో #SSMB29 అప్డేట్ ఇస్తామని గతంలోనే జక్కన్న ఒక పోస్ట్ చేశారు. సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, నవంబర్ మొదలు కావడంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదట మహేశ్ ఒక ట్వీట్ వేశారు. ఆ తర్వాత రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది. అలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మొదలైంది.#SSMB29 అప్డేట్ కోసం 'ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది' అని మహేశ్బాబు ట్వీట్ వేశారు.. తాను కూడా ఎదురుచూస్తున్నట్లు కళ్ల ఎమోజీ పెట్టారు. దానికి రాజమౌళి కూడా ఫన్నీగా 'అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్' అంటూ పంచ్ వేశారు. దీంతో మహేశ్ కూడా 'మీరు ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమాకు ఇద్దాం అనుకుంటున్నాను' అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చారు.అయితే, మహేశ్ అసలు విషయానికి వద్దాం అంటూ.. 'ముందుగా నవంబర్లో మీరు మాకు ఒక హామీ ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి' అని కోరారు. దీంతో జక్కన్న కూడా 'సరే మహేశ్.. నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా.. మేము తప్పకుండా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం' అని సమాధానం ఇచ్చారు.ఇంకా ఎంత సమయం కావాలి సార్ అంటూ జక్కన్నకు మరో ట్వీట్ వేశారు మహేశ్.. '2030లో స్టార్ట్ చేద్దామా..? మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచే హైదరాబాద్లోని ప్రతి స్ట్రీట్లో తనకు నచ్చిన స్టోరీలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తోంది' అంటూ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసి మహేశ్ బాబు సెటైర్లు వేశారు.బ్లైండ్గా ఏసేస్తా అంటూ ప్రియాంక ఎంట్రీ'హలో హీరో.. సెట్లో నువ్వు నాతో చెప్పిన కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా ఏంటి.. నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా ఏసేస్తా..' అంటూ మహేశ్ బాబుకు అతని స్టైల్లోనే ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. ఇంతలో జక్కన్న ఎంట్రీ ఇచ్చేసి 'ప్రియాంక చోప్రా ఇందులో నటిస్తుందనే విషయాన్ని ఎందుకు బయటపెట్టేశావ్ మహేశ్.. మంచి సర్ప్రైజ్ని ఇద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేశావ్' అంటూ పంచ్ వేశారు. ఇంతలో మహేశ్ కూడా మరో పంచ్తో తెరపైకి వచ్చారు. 'మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నావా..' అని మరో లీక్ ఇచ్చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక పోస్ట్ ఇలా చేశారు. 'రాజమౌళి సార్.. నేను ఇలాగే తరుచుగా వెకేషన్ కోసం హైదరాబాద్కు వస్తూ ఉంటే.. నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు' అని ముగిస్తారు. ఇలా సరదాగా ట్వీట్లతోనే ఈ సినిమాలో నటిస్తున్న వారిని తొలిసారి పరిచయం చేశారు.It’s November already @ssrajamouli 👀— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025 -
మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోయే 'సినీ' వారసులు (ఫొటోలు)
-
హీరోగా మరో వారసుడు ఎంట్రీ.. జోడీగా రుక్మిణీ వసంత్
చిత్ర రంగంలో ప్రముఖుల వారసులు కథానాయకుడిగా పరిచయం కావడం కొత్త కాదు. అయితే అలాంటి వారు తమ తల్లిదండ్రుల లెగసీని కాపాడుకోవడం, తాము ఎదగడమే ప్రధాన అంశం. అలా ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ ఇప్పుడు కథానాయకుడిగా అవతారమెత్తడానికి సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు గడించిన సంగీత దర్శకుడు విద్యాసాగర్. ఇప్పటికీ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన ఇప్పుడు ఎక్కువగా సంగీత కచేరీలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ విద్యాసాగర్ కూడా సంగీతాన్ని నేర్చుకుని తండ్రితోపాటు సంగీత కచేరిలో పాల్గొంటూ గుర్తింపు పొందుతున్నారు. ఈయన తాజాగా హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం ఈ చిత్రానికి దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇది రోడ్డు ట్రావెలింగ్ ఇతివృత్తంతో సాగే యాక్షన్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఇందులో హర్షవర్ధన్ విద్యాసాగర్ కు జంటగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల శివకార్తికేయన్కు జంటగా నటించిన మదరాసీ చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. కన్నడంలో నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ అమ్మడికి పలు భాషల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా వచ్చిన వాటిలో హర్షవర్ధన్ విద్యాసాగర్కు జంటగా నటించే చిత్రం అని, ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ను శ్రీలంకలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. విద్యాసాగర్ విజయనగరం జిల్లా వాసిసంగీత దర్శకుడు విద్యాసాగర్ తెలుగు వారే.. ఆయన విజయనగరం జిల్లా వాసి. కానీ, ఎక్కువగా మలయాళం, తమిళ్ పరిశ్రమలో రాణించారు. ఆయన తాతగారు ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు. చాలా మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. అలా 16 ఏళ్ళపాటు చేసాక తమిళంలో 'పూమనం' సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేశాడు. ఆయనకు తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తర్వాత టాలీవుడ్లో 100కు పైగా సినిమాలకు పనిచేశాడు. -
ఒకప్పుడు హిట్ డైరెక్టర్స్.. కొత్త కబురెప్పుడు
చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విజయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. అది హీరోలు అయినా, హీరోయిన్లు అయినా, దర్శకులైనా... ఓ హిట్ మూవీ వచ్చిందంటే చాలు హీరో హీరోయిన్లకు అవకాశాలు వెల్లువలా వస్తుంటాయి. అలాగే ఓ సినిమా విజయం అనేది దర్శకుల కెరీర్ని నిర్ణయిస్తుందంటారు. ఓ సినిమా విజయం లేదా పరాజయం క్రెడిట్ అంతా డైరెక్టర్లదే అనే నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటోంది. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే... కెరీర్లో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నట్లే. ఫ్లాప్ల తర్వాత కూడా కొందరికి కొన్ని అవకాశాలు వచ్చినా... ఎక్కువమంది కెరీర్కి మాత్రం బ్రేకులు పడుతుంటాయి. ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో పని చేసేందుకు ఇటు హీరోలు, అటు నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అంతేకాదు.. హిట్ ఇచ్చినప్పటికీ మరికొందరు దర్శకులకు కొత్త ప్రాజెక్ట్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. అలా చిత్ర పరిశ్రమలోని పలువురు దర్శకుల నుంచి కొత్త కబురు ఎప్పుడు? అనే చర్చ ఇటు మూవీ లవర్స్లో అటు ప్రేక్షకుల్లో నడుస్తోంది. మరి... ‘కొత్త కబురు’ వినిపించని ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం.రెండున్నరేళ్లు దాటినా... కృష్ణవంశీ... ఈ పేరు చెప్పగానే క్రియేటివ్ డైరెక్టర్గా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకులకు గుర్తొస్తారు. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆ΄్యాయతలు, భావోద్వేగాలను మిళితం చేసి వెండితెరపై తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరిస్తుంటారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు తెరకెక్కించి, సమాజానికి సందేశం ఇస్తుంటారు. కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఘన విజయాలు సాధించారు. కాగా నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రం 2007లో విడుదలై హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆయన ఏడు సినిమాలు తెరకెక్కించారు.2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ 2023 మార్చి 22న విడుదలైంది. ఆ చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించాయి. ఇక ఆ సినిమా విడుదలై రెండున్నరేళ్లు దాటినప్పటికీ కృష్ణవంశీ తర్వాతి చిత్రం ఏంటి? అనే ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. అయితే ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు కృష్ణవంశీ బదులిస్తూ... ‘నాకు ఓ హారర్ ఫిల్మ్ చేయాలనే ఆసక్తి ఉంది. అయితే రెగ్యులర్ హారర్ మూవీస్లా కాకుండా వేరే లెవల్లో ట్రై చేద్దాం. ఇందుకు కొంచం సమయం పడుతుంది’ అని తెలిపారు. మరి... ఆయన కొత్త సినిమా కబురు ఎప్పుడు? అంటే వేచి చూడాలి. లాంగ్ గ్యాప్... వీవీ వినాయక్ పేరు చెప్పగానే కమర్షియల్ మాస్ సినిమాలు గుర్తొస్తాయి. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఆయన శైలి ప్రత్యేకం. ‘ఆది, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఆయనకి తెలుగులో చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. టాలీవుడ్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఇంటిలిజెంట్’. సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. అయితే ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు.ఆ తర్వాత వినాయక్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. అయితే తనకు ‘దిల్’ వంటి హిట్ సినిమా ఇచ్చిన వినాయక్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు ‘దిల్’ రాజు ప్రకటించారు. అయితే ఆ సినిమా ఎందుకో సెట్స్కి వెళ్లలేదు. ఇదిలా ఉంటే... ‘లక్ష్మీ’ (2006) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్ వీవీ వినాయక్ మరోసారి కలిసి పని చేయబోతున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.‘లక్ష్మీ’కి కథ అందించిన ఆకుల శివ.. వెంకటేశ్ కోసం వినాయక్ శైలికి తగ్గట్టుగా కామెడీ, మాస్ ఎలిమెంట్స్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథని సిద్ధం చేస్తున్నారట. నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ సినిమాని నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వెంకటేశ్. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక వినాయక్ సినిమాని సెట్స్కి తీసుకెళతారట ఆయన. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ⇒ అందమైన ప్రేమకథలకు సున్నితమైన భావోద్వేగాలు కలగలిపి తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘డాలర్ డ్రీమ్స్’(2000) అనే మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన 25 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ‘ఫిదా’(2017), ‘లవ్ స్టోరీ’(2021) వంటి వరుస విజయాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కుబేర’. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 20న విడుదల అయింది.ఈ సినిమా రిలీజై ఐదు నెలలు కావొస్తున్నా శేఖర్ కమ్ముల తర్వాతి సినిమాపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తన తర్వాతి మూవీ కూడా తన అమిగోస్ క్రియేషన్స్, ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్లో ఉంటుందని ఆయన ప్రకటించినప్పటికీ హీరో ఎవరు? ఎలాంటి కథ? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే తనకు బాగా అచ్చొచ్చిన ప్రేమకథని తెరకెక్కించేందుకు ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని టాక్. వెయిటింగ్.... కల్యాణ్రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. మాస్ సినిమాలు తీయడంలో, హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయన శైలి ప్రత్యేకమనే చెప్పాలి. ‘అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక శైలి, గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో ‘ఏజెంట్’ మూవీ తర్వాత మరో సినిమా ప్రకటన ఏదీ ఆయన నుంచి రాలేదు.అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా 2023 ఏప్రిల్ 28న రిలీజైంది. ఈ చిత్రం రిలీజై రెండున్నరేళ్లు దాటినప్పటికీ సురేందర్ తెరకెక్కించబోయే న్యూ మూవీపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై రామ్ తాళ్లూరి ఈ మూవీ నిర్మిస్తారని కూడా ప్రచారం అయింది.అదే విధంగా ‘కిక్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి... సురేందర్ రెడ్డి తర్వాతి సినిమా పవన్ కల్యాణ్తోనా? లేకుంటే రవితేజతోనా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిటింగ్ తప్పదు. హిట్ ఇచ్చినా నిరీక్షణ... తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పద్దెనిమిదేళ్ల ప్రయాణం వంశీ పైడిపల్లిది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారాయన. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగులో ఇప్పటి వరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అయినా అన్నీ విజయాలు అందుకున్నాయి. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్తో తమిళంలో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా చేశారు. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది.మహేశ్బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (2019) వంటి హిట్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో తెలుగు సినిమా చేయలేదు. అలాగే తమిళంలోనూ ‘వారిసు’ తర్వాత అక్కడ కూడా ఏ మూవీ కమిట్ కాలేదు. తెలుగులో ఆయన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తున్నా తర్వాతి ప్రాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య మహేశ్బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు మహేశ్బాబు.అదేవిధంగా షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలకు వంశీ పైడిపల్లి కథలు వినిపించారనే వార్తలు బాలీవుడ్లో వినిపించినా ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందని, ‘దిల్’ రాజు నిర్మించనున్నారనే వార్తలు ఫిల్మ్నగర్లో వినిపిçస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్కి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్. మరి వంశీ పైడిపల్లి–పవన్ కల్యాణ్ సినిమా ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండేళ్లయినా... ‘భోళా శంకర్’ సినిమా తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్న సినిమా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ‘ఆంధ్రావాలా’ (వీర కన్నడిగ), ‘ఒక్కడు’ (అజయ్) వంటి తెలుగు సినిమాల కన్నడ రీమేక్తో దర్శకుడిగా పరిచయమయ్యారు మెహర్ రమేశ్. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘కంత్రీ’ (2008) చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన ‘బిల్లా’ (2009) మూవీతో హిట్ అందుకున్నారు మెహర్ రమేశ్. ఆ తర్వాత తెలుగులో ‘శక్తి, షాడో, భోళా శంకర్’ వంటి సినిమాలు, కన్నడలో ‘వీర రణచండి’ (2017) మూవీ తెరకెక్కించారు.చిరంజీవితో ‘భోళా శంకర్’ (2023) సినిమా చేసే అవకాశం అందుకున్నారు మెహర్ రమేశ్. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారాయన. వాటిలోనూ రెండు కన్నడ సినిమాలున్నాయి. అయితే ‘భోళా శంకర్’ సినిమా విడుదలై రెండేళ్లకు పైగా అయినప్పటికీ ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా రామ్చరణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు మెహర్ రమేశ్ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అదే విధంగా పవన్ కల్యాణ్తో తాను ఓ సినిమా చేస్తానంటూ మెహర్ రమేశ్ ప్రకటించడం కూడా హాట్ టాపిక్ అయింది. మరి.. ఈ వార్తల్లో ఏది నిజమవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు నిరీక్షణ తప్పదు. ⇒ ‘పెదకాపు 1’ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విరాట్ కర్ణ హీరోగా ఆయన తీసిన ‘పెదకాపు 1’ చిత్రం 2023 సెప్టెంబరు 29న రిలీజైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఆ తర్వాత రెండో భాగంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ లేదు. అయితే కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా చేయనున్నారని టాక్. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నెక్ట్స్ ఏంటి?... తెలుగు చిత్ర పరిశ్రమలో 17ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు పరశురాం. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘యువత’ (2008) సినిమాతో డైరెక్టర్గా పరిచయం అయ్యారాయన. ఆ తర్వాత ‘ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం, సర్కారువారి పాట, ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు తీసి, మంచి విజయాలు అందుకున్నారు. ‘గీత గోవిందం’ (2018) సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లారు పరశురాం. ‘గీత గోవిందం’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురాం కాంబోలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. 2024 ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచినప్పటికీ తన తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు పరశురాం. ‘ది ఫ్యామిలీ స్టార్’ నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత పరశురాం దర్శకత్వం వహించనున్న హీరోల లిస్టులో నాగ చైతన్య, రామ్పోతినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ ఈ ప్రాజెక్ట్స్పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి పరశురాం చేయబోయే నెక్ట్స్ మూవీ ఏంటి? అనే విషయంపై క్లారిటీ రావాలంటే వెయిట్ అండ్ సీ. ⇒ ‘గూఢచారి, మేజర్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క నెక్ట్స్ మూవీ ఏంటి? అనే విషయంపైనా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. అడివి శేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మేజర్’ చిత్రం 2022 జూన్ 3న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ విజయం తర్వాత కూడా ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అనే విషయంపై స్పష్టత లేక΄ోవడం విశేషం. ⇒ ‘ఖుషి’ సినిమా తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించనున్న సినిమా ఏంటి? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఆ చిత్రం రిలీజై రెండేళ్లు దాటి΄ోయినా ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్పై స్పష్టత లేదు. అయితే రవితేజ హీరోగా ఆయన ఓ మాస్ మూవీ తీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. హీరో నాగచైతన్యకి కూడా ఓ అందమైన ప్రేమకథ వినిపించారట శివ నిర్వాణ. మరి... ఆయన తర్వాతి చిత్రం రవితేజతోనా? నాగచైతన్యతోనా? లేకుంటే మరో హీరోతోనా? అన్నది తెలియాలంటే వేచి చూడాలి. ⇒ ‘మంగళవారం’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న సినిమాపై ఇప్పటివరకూ ఓ స్పష్టమైన ప్రకటన రాలేదు. ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత హీరో రమేశ్బాబు తనయుడు జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నారట అజయ్ భూపతి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ⇒ ‘భలే మంచి రోజు, శమంతకమణి, దేవ దాస్, హీరో, మనమే’ చిత్రాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న తర్వాతి సినిమాపైనా ఎలాంటి ప్రకటన లేదు. శర్వానంద్ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్గా శ్రీరామ్ ఆదిత్య దర్శకతం వహించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ మూవీ తర్వాత శ్రీరామ్ ఆదిత్య తర్వాతి సినిమా ఎంటి? అనే విషయంపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న దర్శకులే కాదు.. చంద్రశేఖర్ ఏలేటి, క్రిష్తో పాటు మరికొందరు డైరెక్టర్స్ కొత్త సినిమాల కబురు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
రిస్క్ తీసుకునేంతలా కథ నచ్చింది: నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
‘‘కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమౌతోంది. దీంతో థియేట్రికల్గా బాగుంటాయనుకునే కథలనే ఎంపిక చేసుకుంటున్నాం. ‘ది గర్ల్ఫ్రెండ్’ థియేట్రికల్ మూవీ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. రష్మికా మందన్నా లీడ్ రోల్లో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా స్టోరీ నచ్చింది. ఈ చిత్రం హీరోయిన్ కోణంలో ఉంటుంది... అంతే. కన్నడ మార్కెట్ కోసం దీక్షిత్ను తీసుకోలేదు. అతను మంచి పెర్ఫార్మర్ అనే తీసుకున్నాం. రాహుల్ చేసిన గత సినిమాల గురించి మేం ఆలోచించలేదు. రాహుల్ రాసిన ఈ కథ నచ్చి, ఈ సినిమా చేశాం. పారితోషికం తీసుకోకుండానే రష్మిక ఈ సినిమా చేశారు. ఆ కృతజ్ఞతతో ఆమెకు రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ ప్రాధాన్యం ఉన్న అతిథి పాత్ర చేశారు. నిర్మాత విద్య, నేను సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చిత్రాన్ని మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అల్లు అరవింద్గారు మాకు మంచి సపోర్ట్గా ఉంటారు’’ అని అన్నారు. మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ– ‘‘కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ‘ది గర్ల్ఫ్రెండ్’ రెగ్యులర్ సినిమా కాదు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం.దర్శకుడిగా రాహుల్కు జాతీయ అవార్డు రావొచ్చనే ప్రశంసలు సెన్సార్ వారి నుంచి వచ్చాయి. ఈ చిత్రంలోని నాలుగు పాటలు, రెండు బిట్ సాంగ్స్కి హేషమ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు ఓ ప్రాజెక్ట్ను టేకప్ చేయడం అంత సులువైన పని కాదు. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి, సినిమాలు చేయాల్సి వస్తోంది. అరవింద్గారు ఇచ్చే సలహా కూడా ఇదే’’ అని చెప్పారు. -
బాలల దినోత్సవం సందర్భంగా...
పులివెందుల మహేశ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలుపోషించారు. గంగాభవాని నిర్మించిన ఈ సినిమా బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘స్కూల్ లైఫ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేనుపోషించిన రైతు పాత్ర నా మనసుకు దగ్గరగా అనిపించింది.రైతులకు అండగా నిలబడేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం పులివెందుల వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎంతగానో అభిమానం చూపించారు’’ అని తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘ఓ సినిమాలో కథే హీరో. బడ్జెట్ కాదు... క్రౌడ్ ఫండింగ్తో ఈ చిత్రం తీశాం. మా సినిమా టికెట్ వంద రూపాయలు మాత్రమే ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మాకు చాన్స్ ఇచ్చిన మహేశ్గారికి ధన్యవాదాలు’’ అని షన్ను, సావిత్రి పేర్కొన్నారు. -
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
గత కొన్నిరోజులుగా 'ఇదేటమ్మా మాయ మాయ' అనే పాత పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే పాటని స్టేజీ మీద స్వయంగా రాజశేఖర్(Rajasekhar) హమ్ చేశారు. అలానే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు.అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్.. తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డీలా పడిపోయారు. 2017లో 'పీఎస్ గరుడ వేగ'తో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు. లాక్ డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన ఈయన.. కొన్నాళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా.(ఇదీ చదవండి: శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్)2023లో నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజశేఖర్.. తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న 'బైకర్'లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్.. ఈవెంట్లో కనిపించారు. తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు.మాటల మధ్యలో తాను చాన్నాళ్ల నుంచి 'ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్'(Irritable Bowel Syndrome) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు. ఈవెంట్కి రావాలని, నిన్న తనకు సమాచారం అందించారని.. దీంతో స్పీచ్ ఏం ఇవ్వాలనే యాంగ్జైటీతో నా కడుపు అంతా చెడిపోయిందని అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి రాజశేఖర్ మాట్లాడారు.ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటానని, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదని గతంలో రాజశేఖర్ ఓసారి చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదని అప్పట్లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి మాట్లాడటంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?) -
నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం
తెలుగులో చాలావరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి. మిగిలింది క్రిస్మస్ మాత్రమే. దానికి ఇంకా చాలా సమయముంది. నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రిలీజులేం ఉండవు. ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి? వాటి సంగతేంటి?గత రెండు నెలలు (సెప్టెంబరు, అక్టోబరు) టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది. నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రష్మిక ద 'గర్ల్ ఫ్రెండ్', దుల్కర్ సల్మాన్ 'కాంత', రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్) తొలివారంలో రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్' రానుంది. ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. మరోవైపు మహేశ్ బాబు బావమరిది సుధీర్ బాబు 'జటాధర'తో ఈ వారమే రానున్నాడు. ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమింట్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తీశారు. ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు. వీటితో పాటు తిరువీర్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం కూడా ఇదే వారం రానుంది.రెండో వారంలో దుల్కర్ సల్మాన్ 'కాంత' వస్తుంది. ఓ దర్శకుడు, హీరో, హీరోయిన్.. వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది. గతేడాది 'లక్కీ భాస్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్.. ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్లో సెటిలైపోవచ్చు. ఇదే రోజున చాందిని చౌదరి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ రానుంది. దీనిపై పెద్దగా అంచనాల్లేవు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)మూడోవారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారంలో మాత్రం రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఒక్కటే రానుంది. మాస్ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్తో పూర్తిగా నిరాశపరిచిన రామ్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇతడి కోరిక 'ఆంధ్రా కింగ్ తాలుకా'తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి? ఈ చిత్రంతో పాటు 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్. అంటే రెండు వారాల గ్యాప్లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది.పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ 'వృషభ' (నవంబరు 06), కృష్ణలీల (నవంబరు 7), ప్రేమిస్తున్నా (నవంబరు 07), స్కూల్ లైఫ్ (నవంబరు 14), ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' (నవంబరు 28) తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన) -
ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన
అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు శిరీష్ (Allu Sirish) ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి శిరీష్-నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. తమ్ముడి ఎంగేజ్మెంట్ అల్లు అర్జున్ స్టైలిష్గా కనిపించాడు. బన్నీ భార్య స్నేహ అల్ట్రా స్టైలిష్గా ముస్తాబైంది. వీరి గారాలపట్టి అర్హ ట్రెడిషనల్ డ్రెస్లో ఫుల్ క్యూట్గా ఉంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్పెషల్ అట్రాక్షన్గా మెగా ఫ్యామిలీభార్య సురేఖ, కొడుకు రామ్చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన (Upasana Kamineni Konidela), కూతుర్లు శ్రీజ, సుష్మితతో కలిసి వచ్చారు. చిరంజీవి సోదరుడు నాగబాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. బాబు పుట్టాక లావణ్య త్రిపాఠి ఇలా బయటకు రావడం ఇదే తొలిసారి! అలాగే ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఉపాసన కూడా బయట కనిపించడం ఇదే మొదటిసారి! వీళ్లిద్దరూ జిగేల్మనే రంగురంగుల డ్రెస్ల జోలికి వెళ్లకుండా సింపుల్గా కనిపించే హాఫ్ వైట్ దుస్తుల్లో మెరిశారు.రెట్టింపు సంతోషంలో ఉపాసనఇక ఉపాసన ముఖం ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. జీవితంలో బాగా సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు పదేళ్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఇక 2023 జూన్లో తొలి సంతానంగా క్లీంకార పుట్టింది. ఇటీవల దీపావళి సందర్భంగా ఉపాసన తన సీమంతం వీడియో షేర్ చేస్తూ త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. చదవండి: భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. నేనే వినలేదు: ఛత్రపతి శేఖర్ -
దేవరతో లాభాలు..'ఓజీ' ఎందుకు కొనలేదంటే..: నిర్మాత
టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దేవర సినిమా భారీగా లాభాలు అందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న కొత్త సినిమా గర్ల్ఫ్రెండ్కు ఆయన నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో బేబీ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సినిమాలను ధీరజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. తాను ఎక్కువగా క్రిష్ణా, గుంటూరు, సీడెడ్లలో చాలా సినిమాలను డిస్ట్రిబ్యూటర్గా కొనసాగారు.'దేవర'తో లాభాలుప్రముఖ నిర్మాత నాగవంశీతో తనకు ఎక్కువ అనుబంధం ఉన్నట్లు ధీరజ్ పేర్కొన్నారు. వంశీతో ఉన్న పరిచయం వల్ల దేవర సినిమాను క్రిష్ణా, అనంతపురం జిల్లాలలో డిస్టిబ్యూటర్గా విడుదల చేశానన్నారు. అయితే, తాను అనుకున్న లాభం కంటే ఎక్కువగానే వచ్చినట్లు ఆయన ఇలా తెలిపారు. 'దేవర సినిమా చాలామందికి డబ్బులు మిగిల్చింది. అయితే, ఒకరిద్దరు నష్టపోయి ఉండొచ్చు కూడా.. వారికి ఏదోరూపంలో వంశీ న్యాయం చేస్తారు. నాగవంశీ సినిమాలు తీసుకున్నవారు ఎవరూ నష్టపోరు. ఒకవేళ ఎవరైనా నష్టపోతే వారిన తప్పకుండా ఆదుకుంటారు. ఇండస్ట్రీలో ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్స్ను ఆదుకునే ఏకైక నిర్మాత నాగవంశీ మాత్రమే.. కానీ, వార్2 సినిమాతో మాతో పాటు ఆయన కూడా భారీగా నష్టపోయారు. వార్2 మూవీ బాలీవుడ్ వాళ్లది కాబట్టి నష్టపోయిన వారికి ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయినప్పటికీ ఏదో రూపంలో న్యాయం చేస్తారు.' అని ధీరజ్ అన్నారు.'ఓజీ' ఎందుకు కొనలేదంటే..ఏపీలో ఓజీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని తాను అనుకున్నట్లు ధీరజ్ ఇలా చెప్పారు. క్రిష్ణా జిల్లాలో ఓజీ డిస్ట్రిబ్యూట్ కోసం ఏకంగా రూ. 12 కోట్లు అడిగడంతో రిష్క్ చేయడం ఎందుకని వదిలేసినట్లు ఇలా తెలిపారు. 'ఓజీ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. కానీ, అంతకు మించి ఎక్కువ ఢీల్స్ జరిగాయి. ఓజీ మేకర్స్ చెప్పిన మొత్తానికి కొంటే నష్టం తప్పదని వదిలేశాను. మొదటిరోజు భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో రూ. 5 కోట్లకు పైగా కలెక్షన్స్ రావచ్చని ఒక అంచనా ఉంది. కానీ, ఓజీ కోసం రూ. 12 కోట్లు అడగడంతో వద్దని వదిలేశాను. అని ధీరజ్ చెప్పారు. అయితే, బాక్సాఫీస్ లెక్కల ప్రకారం క్రిష్ణా జిల్లాలో ఓజీ రూ. 8 కోట్లు రాబట్టిందని సమాచారం. -
భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. నేనే వినలేదు: ఛత్రపతి శేఖర్
స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్ఆర్ఆర్.. ఇలా తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించాడు చంద్రశేఖర్. అయితే ఛత్రపతి శేఖర్గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఓపింక నశించి..ఛత్రపతి శేఖర్ (Actor Chatrapathi Sekhar) మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. దేవదాసు కనకాల ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. పెళ్లయ్యాకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి గుర్తింపు వచ్చింది. ఒకానొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి. మా మధ్య ఓపిక నశించిపోయింది. రోజూ కొట్లాడుకుని పరేషాన్ అయ్యేబదులు దూరంగా ఉంటే మంచిదనుకున్నాం. నాదే తప్పుఒకరి మనసు మరొకరు నొప్పించకుండా విడిపోతే బెటర్ అని ఫీలయ్యాం. అయితే తప్పంతా నాదే! నేను బద్ధకస్తుడిని. ఏదైనా చెప్తే వినను. వాళ్లను, వీళ్లను కలువు.. పని దొరికితే డబ్బులొస్తాయని ఆమె అనేది. నేనేమో బద్ధకస్తుడిలా ప్రవర్తించేవాడిని. ఇలా మేము విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. చేయిచాచి సాయం అడిగినవారికి కాదనుకుండా డబ్బులిచ్చేవాడిని. వాళ్లు తిరిగిచ్చేవాళ్లు కాదు, నేను కూడా ఫోన్ చేసి అడిగేవాడ్ని కాను.ఫోన్ చేసింది, కానీ డబ్బయితే ఇవ్వలేదుబిగ్బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్ను నా కూతురిలాగే చూసుకున్నాను. తనకు డబ్బు సాయం చేస్తే ఇంతవరకు తిరిగివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నాను. అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది. నా గురించి ఎందుకలా నెగెటివ్గా మాట్లాడారంది. చూస్తే అందులో నేనేమీ తప్పు మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఒకటీరెండుసార్లు ఫోన్ చేసింది. కానీ, నాకివ్వాల్సిన డబ్బు మాత్రం తిరిగివ్వలేదు. నేను కూడా అడగలేదు. మనసిచ్చి చూడు సీరియల్లో నేను సంపాదించినదానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ. అడిగినవారికల్లా పంచేశాను. పెళ్లి - విడాకులుబిగ్బాస్ షోలో ఛాన్స్ వస్తే అస్సలు వెళ్లను. ఒకవేళ వెళ్తే రెండు రోజుల్లో తిరిగొచ్చేస్తాను అని శేఖర్ చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్.. నీల్యా భవానీని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు సంతానం. మనస్పర్థల వల్ల శేఖర్-భవానీ విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. ప్రస్తుతం అతడి భార్యాపిల్లలు అమెరికాలో ఉంటున్నారు. మనసిచ్చి చూడు సీరియల్లో కీర్తి భట్ తండ్రిగా నటించాడు శేఖర్. యాక్సిడెంట్లో అమ్మానాన్నని కోల్పోయిన కీర్తి.. ఈ సీరియల్ తర్వాత శేఖర్ను నాన్న అని పిలవడం మొదలుపెట్టింది.చదవండి: మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్డే మనవరాలిదైతే బహుమతులు..! -
'ఛాంపియన్'లా రోషన్.. టీజర్
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan) కొత్త సినిమా ‘ఛాంపియన్’ (Champion). సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపైకి తిరిగొస్తున్నాడు. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. డిసెంబరు 25న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై రోషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఛాంపియన్ సినిమాలో అతను ఫుట్బాల్ ఆటగాడిగా రాబోతున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో రోషన్ కనిపించబోతున్నారు . ఈ పాత్ర కోసం ఫిజికల్గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు. -
విజువల్ వండర్లా 'శంబాల' ట్రైలర్..
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్(Aadi Sai Kumar) నటించిన కొత్త సినిమా ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’(Shambhala)... డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ను ప్రభాస్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లింగ్తో పాటు సిల్వర్ స్క్రీన్పై విజువల్ వండర్ను క్రియేట్ చేసేలా ట్రైలర్ ఉంది. ఈ సినిమాతో ఆది హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ కథకు మూలం అంటూ సాయికుమార్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులోని డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులను ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. -
‘మాస్ జాతర’ సినిమా రిలీజ్..ట్రెండింగ్ లో శ్రీలీల (ఫొటోలు)
-
ఆసుపత్రిలో నటుడు ధర్మేంద్ర.. తండ్రితో పాటు బాబీ డియోల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ధర్మేంద్ర వెళ్లారని చెబుతున్నారు. సోషల్మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని వారు కోరుతున్నారు.ఆసుపత్రిలో ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్( Bobby Deol) కూడా ఉన్నారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉండటం వల్ల కొన్ని వైద్య పరీక్షలు చేపిస్తున్నట్లు చెప్పారు. చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. కానీ, డిశ్చార్జ్ తేదీపై వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర డిసెంబర్లో తన 90వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో ధర్మేంద్ర కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిదే. వృత్తిపరంగా, ధర్మేంద్ర చివరిసారిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో నటులు షాహిద్ కపూర్, కృతి సనన్ నటించారు. -
ఇట్లు మీ ఎదవ.. టైటిల్ నేనే ఇచ్చా: ఆర్పీ పట్నాయక్
‘‘బాపుగారి సినిమాకి పని చేసే అవకాశం నాకు లేకుండా పోయింది. ‘ఇట్లు మీ ఎదవ’ కథ విన్నాక... ఈ సినిమాకి పని చేస్తే బాపుగారి చిత్రం మిస్ అయ్యాననే లోటు తీరుతుందనే అనుభూతి కలిగింది. ఈ చిత్రానికి టైటిల్ సూచించింది నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. యువత తమ తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు.త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ ఆవంచ హీరోయిన్గా నటించారు. సంజీవని ప్రొడక్షన్స్పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, దర్శకుడు త్రినాథ్ కఠారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, ఒక అమ్మాయి, అబ్బాయి కథ. ఈ సినిమా 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బళ్లారి శంకర్. కెమెరామేన్ జగదీష్, డైరెక్టర్ తేజ మార్ని, నటీనటులు మధుమణి, రిషి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, తాగుబోతు రమేశ్ తదితరులు మాట్లాడారు. చదవండి: శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి! -
కరూర్ ఘటన.. తప్పు 'విజయ్'ది మాత్రమే కాదు: అజిత్
తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాటపై తొలిసారి నటుడు అజిత్ స్పందించారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఈ అంశంలో విజయ్తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాలకు చెందిన వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు.అజిత్ తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరూర్ ఘటన గురించి ఇలా మాట్లాడారు. ' కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పలాన వ్యక్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను ఎవరినీ వేలెత్తి చూపించడం లేదు.ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది. ఇది ఆ ఒక్క వ్యక్తి (విజయ్) తప్పు కాదు. కానీ, అందులో మన తప్పు కూడా ఉంది. దానికి మనమందరం బాధ్యులమే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలామంది వెళ్తారు. కానీ, వారందరూ కూడా చాలా సురక్షితంగానే తిరిగొస్తారు. అయితే, సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీడియా వీటిపై మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుంది. సినిమా థియేటర్కు వెళ్లినా అదే పరిస్థితి ఉంది. కేవలం ఇండస్ట్రీ చుట్టే ఇలా జరగడంతో పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది.' అని అజిత్ పేర్కొన్నారు. -
రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడా..!
-
'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ అన్నీ క్లోజ్
‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉండటంతో చాలాచోట్ల థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో రీరిలీజ్ చిత్రాల మొదటిరోజు కలెక్షన్స్ జాబితాలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. భవిష్యత్లో అంత సులువుగా ఎవరూ అందుకోలేనంత రేంజ్లో సత్తా చాటింది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా బాహుబలి: ది ఎపిక్ నిలిచింది.ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా విజయ్ 'గిల్' రూ. 10 కోట్ల గ్రాస్తో ఉంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ రూ. 8 కోట్ల గ్రాస్తో ఉంది. ఇప్పుడా రికార్డ్స్ అన్నీ ‘ప్రభాస్’ సినిమా దాటేసింది. ‘బాహుబలి: ది ఎపిక్’ మొదటిరోజే ఏకంగా రూ. 10.4 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ పేర్కొంది. అదే గ్రాస్ పరంగా చూస్తే రూ. 18 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతటి రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమా ఏదీ లేదు. ఇలా రీరిలీజ్తో బాహుబలి తన మార్క్ ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపింది.రీ-రిలీజ్ ఫస్ట్డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 సినిమాలుబాహుబలి: ది ఎపిక్- (రూ. 18 కోట్ల గ్రాస్)గిల్- విజయ్- తమిళ్ (రూ. 10 కోట్ల గ్రాస్)గబ్బర్ సింగ్ - (రూ. 8 కోట్ల గ్రాస్)బిజినెస్మేన్- (రూ. 5.27 కోట్ల గ్రాస్)మురారి - (రూ. 5 కోట్ల గ్రాస్) -
ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్
కోలీవుడ్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నటి ఆండ్రియా(Andrea Jeremiah) ఓకే చెప్పేస్తుంది. కానీ, మొదట తనకు నచ్చాలి. తనకు నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని, గీత రచయిత కూడా.. సంగీత పరిజ్ఞానం కలిగిన ఆండ్రియా బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ఈమె పాడిన పలు పాటలు సింగీతప్రియులను అలరించాయి. కాగా తాజాగా ఆండ్రియా ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేలా, కీర్తించే విధంగా ఒక ఆంథమ్ను రాసి పాడారు.ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులు 2025 టీమ్ కోసం బ్రింగ్ ఇట్ హోమ్ పేరుతో రూపొందించిన ఆంగ్ల ఆంథం ఇది. క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా మంచి రిథమ్, మెలోడీ, ఎమోషన్తో కూడిన హైఎనర్జిటిక్గా రూపొందిన ఈ పాటను ఆండ్రియా, నజీఫ్ మహ్మద్ కలిసి రాశారు. దీనికి నకుల్ అభయంకర్ సంగీతాన్ని అందించారు. ఆంగ్ల పదాలతో కూడిన ఈ పాటలో తరికిట్ తరికిట తరికిట థోమ్ అనే ఇండియన్ బాణీ హుక్తో ధక్ధక్ ఉయ్ 'బ్రింగ్ ఇట్ హోమ్' ఆనే పల్లవితో సాగే గీతం క్రికెట్ క్రీడాకారుల హృదయ స్పందనను తెలియజేసేలా ఉంటుందన్నారు.ఈ గీతం నవంబర్ 2న జరగనున్న ప్రపంచ మహిళా క్రికెట్ క్రీడ తుది పోరు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గీతం గురించి ఆండ్రియా తెలుపుతూ ఇది ఒక పాట మాత్రమే కాదని, పెద్దగా కలలు కనడంతోపాటు, కఠినంగా శ్రమించి విజయాన్ని ఇంటికి తీసుకొచ్చే ఒక మహిళ విజయం అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
కలనొదిలి కనుపాపే ఉంటుందా...
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర, పోలిమేర 2’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడంతోపాటు షో రన్నర్గా వ్యవహరించారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ద్వారా నాని కాసరగడ్డ దర్శకునిగా పరిచయమవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కన్నొదిలి... కలనొదిలి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. దేవ్ పవార్ సాహిత్యం అందించిన ఈపాటని హేషమ్ అబ్దుల్ వాహబ్పాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘హే.. కన్నొదిలి... కలనొదిలి కనుపాపే ఉంటుందా.., నిన్నొదిలి... నే కదిలి కాసేపైనా ఉంటానా..., నువు పిలిచే పిలుపోదిలి ఎవరేమన్నా వింటానా.., నిను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా..., చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే.., గల్లా పట్టి తొయ్యకే... బెట్టు నువ్వు సెయ్యకే...’ అంటూ ఈపాట సాగుతుంది. -
యూత్ఫుల్ ఎంటర్టైనర్.. ఇట్లు మీ ఎదవ ట్రైలర్ చూశారా?
త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. ఈ మూవీని యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు. వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో విడుదల చేశారు. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ కీలక పాత్రల్లో నటించారు. -
గ్రాండ్గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్మెంట్కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. కాగా.. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
టాలీవుడ్ సినిమాకు ఉన్న క్రేజే వేరు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే రాజమౌళి బాహుహలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. అందుకే మన తెలుగు సినిమాలంటే ఫారినర్స్ కూడా పడి చచ్చిపోతారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే పుష్ప మేనరిజంతో అలరిస్తాడు. తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో నితిన్ రాబిన్హుడ్ మూవీలో కెమియో పాత్రలో సందడి చేశాడు.అంతలా తెలుగు సినిమాలకు ఫారినర్స్ ఫిదా అవుతున్నారు. డేవిడ్ వార్నర్ లాగే ఎప్పటి నుంచో స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ దంపతులు మన చిత్రాలకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొత్త సినిమాలో ఏ హిట్ సాంగ్ వచ్చినా వీరిద్దరు కలిసి రీల్ చేయాల్సిందే. అలా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టు సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాకుండా పలు సూపర్ హిట్ సాంగ్స్కు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.తాజాగా మరో టాలీవుడ్ సాంగ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అంటూ సాగే పాటతో అలరించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం మూవీలో ఈ సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఇటీవల రిలీజైన కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. కర్ల్ స్వాన్బెర్గ్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ తెలుగు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్.. మీరిద్దరు హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియన్స్ కంటే మీ వీడియోలే బాగుంటాయని మరికొందరు కొనియాడుతున్నారు. మీ ఇద్దరికి ఆధార్, పాన్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అంటూ మరో నెటిజన్స్ భరోసానిస్తూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా మన తెలుగు సినిమాకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. సతీసమేతంగా హాజరైన నిర్మాత
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. -
డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు చెప్పగానే 'హనుమాన్' సినిమా గుర్తొస్తుంది. అంతకు ముందు పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ మూవీ అద్భుతమైన హిట్ కావడం.. ఇతడి పేరుని పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోయేలా చేసింది. ఈ ఊపులో ప్రశాంత్ వర్మకు పలువురు బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అవే ఇతడిని ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమే ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది.'హనుమాన్' రిలీజై ఇప్పటికి రెండేళ్లు అయింది. మధ్యలో ప్రశాంత్ వర్మ చేయాల్సిన రెండు సినిమాలు ఆగిపోయాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో అనుకున్నది ఒకటి కాగా, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో అనుకున్న మూవీ మరొకటి. ఇవి ఆగినప్పటికీ ప్రశాంత్ వర్మ ఖాళీగా అయితే లేడు. తన సినిమాటిక్ యూనివర్స్లో 'మహాకాళి' తీస్తున్నాడు. దీనికి కేవలం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా.. 'జై హనుమాన్'కి దర్శకత్వం వహించాల్సి ఉంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్)'హనుమాన్' హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు బాగానే తీసుకున్నాడట. మీకే నెక్స్ట్ సినిమా చేసి పెడాతనని మాట కూడా ఇచ్చాడట. అలా రూ.80-100 కోట్ల వరకు అడ్వాన్సులు రూపంలో రాగా.. ఆ మొత్తంతో హైదరాబాద్లోని సొంతంగా ఓ స్టూడియోని నిర్మించుకున్నాడట. ఇప్పుడు అందరూ నిర్మాతలు, ప్రశాంత్ వర్మని కొత్త మూవీస్ గురించి అడిగేసరికి.. నేను స్టోరీ ఇస్తాను, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను గానీ డైరెక్షన్ చేయనని అంటున్నాడట. దీంతో సదరు నిర్మాతలు.. ఇతడిపై ఫిర్యాదు చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్లే ఆలోచనలో ఉన్నారట.మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు తమ సంస్థ నుంచి ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదని, లావాదేవీలు జరపడం లాంటివి చేయలేదని 'ఓజీ' తీసిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ట్వీట్తో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు నిజమేనా అనే సందేహం కలుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై కచ్చితంగా మిగతా నిర్మాణ సంస్థలు కూడా స్పందించే అవకాశముందేమో! అప్పటివరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)pic.twitter.com/FdXzUh8LDw— DVV Entertainment (@DVVMovies) October 31, 2025 -
వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
విలక్షణ నటుడు మోహన్బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) యాంకర్గా, నటిగా రాణిస్తోంది. ఇటీవలే దక్ష సినిమాతో పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఓపెన్ అయింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇంటర్ చదివేవరకు కూడా అమ్మ సెలక్ట్ చేసిన బట్టలే వేసుకునేదాన్ని. తను ఎలా చెప్తే అలా నడుచుకునేదాన్ని. నా తలకు నూనె పెట్టి జడేసేది. అలాగే కాలేజీకి వెళ్లేదాన్ని. నాన్న అయితే చాలా స్ట్రిక్ట్.సడన్ సర్ప్రైజ్పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలైన నేను కూతురు పుట్టే సమయానికి ఇండియాకు వచ్చాను. నా భర్త కూడా వచ్చాడు. కానీ, ఇక్కడ అడ్జస్ట్ అవలేకపోయాడు. అందుకే 2019లో అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. మీకు నచ్చినప్పుడు వస్తూ ఉండండి అని చెప్పాడు. దగ్గరుండి గొడవలుపడేకన్నా.. దూరంగా ఉండటమే మంచిదని నేనూ ఒప్పుకున్నాను. అయితే తనకెంత కోపమొచ్చినా సరే.. కూతురి ముందు ఒక్క మాట కూడా అనడు. నా తమ్ముడు మనోజ్ (Manchu Manoj) కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. నేను మీకు తెలుసా? మూవీ కోసం అమెరికాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అప్పుడు సడన్గా సర్ప్రైజ్ అని మా ఇంటికొచ్చి కొన్నివారాలుండేవాడు. క్యాండిల్స్ కోసం లక్షలుఅప్పట్లో మేము సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేలపై పడుకునేవాడు. కానీ, ఇప్పుడేమో ఎక్కువ లగ్జరీ కోరుకుంటున్నాడు. క్యాండిల్ కోసం లక్షలు ఖర్చుపెడుతున్నాడు. నేను హోస్ట్ చేసిన మేము సైతం షో విషయానికి వస్తే.. ఆ షో నన్నెంతగానో మార్చేసింది. దీని తర్వాత కూడా మంచిపనులు ఆపలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించాం. దివ్యాంగులకు ఆరంతస్తుల భవంతి కట్టించాం. గుంటూరులో ఒకావిడకు ఇల్లు కట్టించాం. ఇప్పటికీ రకుల్ ఓ అమ్మాయికి చదువు చెప్పిస్తోంది. సందీప్కిషన్ ఓ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా చాలా ఉన్నాయి. కానీ, అవి బయటకు చూపించమంతే!ఇంట్లో పెద్ద గొడవముంబై షిఫ్ట్ అవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. ఎందుకో ముంబై వెళ్లాలని మనసుకు అనిపించింది, వెళ్లిపోయానంతే! పైగా అక్కడ నా కూతుర్ని సెలబ్రిటీలా ఎవరూ చూడరు, స్వేచ్ఛగా బతుకుతుంది. నా కూతుర్ని అడవిలో వదిలేస్తే ఆకులు తినైనా బతకాలి అనేలా పెంచాను. ఎందుకంటే ఈ లగ్జరీ జీవితం ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. అందుకే తనను సింపుల్గా పెంచాను. మొదట్లో తను విష్ణు స్కూల్కే వెళ్లేది. ఆరు నెలలు వెళ్లాక సడన్గా స్కూల్ మాన్పించేశాను. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.నా కూతురి భవిష్యత్తు ముఖ్యంనేను స్కూల్లో ఒక్క రూపాయి ఫీజు కట్టలేదు. పైగా అందరూ తనపై ఎక్కువ కేరింగ్ చూపించారు. కారు డోర్ తీయడం, లిఫ్ట్ నొక్కడం.. ఇలా తనను అడుగు కిందపెట్టనీయలేదు. ఇలాంటి లగ్జరీ వద్దనే ఆ స్కూల్ మాన్పించాను. గచ్చిబౌలిలోని ఓ చిన్న స్కూల్కు పంపించాను. ఇంట్లో వాళ్లు బాధపడ్డప్పటికీ నా నిర్ణయం మార్చుకోలేదు. వాళ్ల కోసం నా కూతురి భవిష్యత్తును పాడు చేయలేను. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు చూసిందే నిజమనుకుంటారు, అదే నేర్చుకుంటారు.శాపనార్థాలుమనోజ్ 'మిరాయ్' సినిమా ఈవెంట్లో ఏది మాట్లాడినా దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారు. విష్ణు గురించి ఒక్క ముక్క తప్పుగా మాట్లాడకపోయినా సరే విష్ణును తిడుతున్నట్లుగా తప్పుడు థంబ్నైల్స్ పెట్టారు. అసలు ఒక కుటంబాన్ని కలపాలనుకుంటున్నారా? విడదీయాలనుకుంటున్నారా? వాళ్ల మధ్య ఇంకా అగ్గిరాజేసి విడదీయాలని చూసిన అందరూ సర్వనాశనం అయిపోతారు. ఈ జీవితంలోనే మీ కర్మ అనుభవిస్తారు అని మంచు లక్ష్మి శాపనార్థాలు పెట్టింది.చదవండి: బాహుబలి ఎపిక్లో కొత్త సీన్.. అదిరిపోయిందయ్యా! -
వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భరత్ సతీమణి తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మొదటిసారి ఆమె పనిచేశారు. ఈ క్రమంలో ఒక వీడియోను విడుదల చేశారు. కెమెరా ముందు ఆమె తొలిసారే కనిపించినప్పటికీ చాలా చక్కగా యాడ్లో ఒదిగిపోయారు. నిమిషం పైగానే నిడివి ఉన్న ఈ ప్రకటనలో అనుభవం ఉన్న నటిగా మెప్పించడం విశేషం.మొదటి నుంచి సినిమాలపై తేజస్విని ఆసక్తి చూపించేవారట! అందుకే ఆమె అఖండ 2 నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆ పై తన తమ్ముడి మోక్షజ్ఞ చిత్రం కూడా ఆమె నిర్మాతగా లాంచ్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జ్యువెలర్స్ యాడ్కు దర్శకుడు వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీకి తేజస్విని స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
బాహుబలి ఎపిక్లో కొత్త సీన్.. అదిరిపోయిందయ్యా!
రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి (Baahubali Movie) వచ్చి పదేళ్లవుతోంది. ఇప్పటికీ దాని క్రేజ్ అలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకున్న బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిసి 'బాహుబలి: ది ఎపిక్ మూవీ' (Baahubali The Epic Movie)గా శుక్రవారం (అక్టోబర్ 31) రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని సీన్లను, పాటల్ని ఎత్తేస్తే.. రెండు భాగాల్లోనూ చూడని కొన్ని కొత్త సీన్లను యాడ్ చేశారు.చచ్చినవాడు ఎలా వస్తాడు?అందులో మహేంద్ర బాహుబలి.. మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టే సీన్ అద్భుతంగా ఉంది. అతడు చనిపోయాడంటూ బిజ్జలదేవ (నాజర్) చెప్పే డైలాగ్.. మీ అంతు చూడటానికి మళ్లీ వస్తున్నానంటూ బాహుబలి వచ్చే తీరు అదిరిపోయింది. ఆ సీన్లో ఏముందంటే.. బాహుబలి చేతిలో నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు రాజ్యానికి వచ్చి.. బాహుబలి బతికే ఉన్నాడంటూ బిజ్జలదేవకి చెబుతాడు. చచ్చినవాడు ఎలా వస్తాడు? గూస్బంప్స్ తెప్పించే సీన్వాడి రక్తం కారికారి భూమిలోకి ఇంకిపోయింది, వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది.. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంతవిశ్వంలో ఆవిరైపోయింది అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బాహుబలి రాజ్యంలో అడుగుపెడతాడు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని దేవసేన చెప్పే డైలాగ్తో ఈ సీన్ నెక్స్ట్ లెవల్కు వెళ్తుంది. థియేటర్లో ఈ సీన్ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! ఇంత మంచి సీన్ ఎలా వదిలేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమాప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 2015లో రిలీజవగా రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ రెండు భాగాల సమ్మేళనమే బాహుబలి: ది ఎపిక్. అయితే ఇందులో కిచ్చా సుదీప్తో పాటు కొన్ని సీన్లను, పాటలను తొలగించారు. అయినప్పటికీ 3.45 గంటల నిడివితో బాహుబలి ఎపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Best scene asla😭🔥#BaahubaliTheEpic pic.twitter.com/La1K6L2HBk— Satyá (@TheMovieBufffff) October 30, 2025The Best Deleted scene ever now witnessed in theater....🙏#Prabhas#BahubaliTheEpic #SSRajamouli pic.twitter.com/k9RMat2vrW— rakeshMk (@rakeshM53243116) October 30, 2025Interview lo cheppadu rajamouli duration valla theesesam ani Super undi scene 💥💥💥#BahubaliTheEpic #Prabhas pic.twitter.com/VPNC7yTV0t— Adhe_Magiccu (@Ade_magiccu) October 30, 2025 చదవండి: ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ -
రాజమౌళి మాయాజాలం.. బాహుబలి ది ఎపిక్ దుమ్ములేపాడు..
-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. గురువారం రాత్రి ముంబైలో సీఎంతో కొంత సమయం పాటు సల్మాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో చెప్పవచ్చు. దీనిని అందరికీ తెలిసేలా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా తెలంగాణ గురించి స్పందించారు. రాష్ట్రం చాలా వేగవంతంగా పురోగతి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. -
డీప్ ఫెక్పై స్పందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా డీప్ ఫేక్ ఫోటోల విషయంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారని సీపీ వీసీ సజ్జనార్కు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫెక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాతో చిరు చెప్పారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ ఫోటోల విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారని చిరు ఇలా చెప్పారు. 'ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్ ఫెక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందరం ఆహ్వానించాలి. కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.' అని చిరంజీవి అన్నారు. -
కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయం
తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత U-18 మహిళల కబడ్డీ జట్టు వైస్-కెప్టెన్ కార్తీకకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్గా బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ తరపున స్వర్ణం సాధించింది. ఇప్పటికే కార్తీక జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 20 లక్షలు అందించారు. భారత్తో పాటు తమిళనాడు కీర్తిని ఆమె పెంచిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న కార్తీక చాలా పేదరికంతో ఉన్న కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరాన్పై భారత్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపులో కార్తీకది కీలక పాత్ర ఉంది. దేశ కీర్తిని పెంచిన ఆ జట్టుకు మారి సెల్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల చెక్ను బహుమతికి ఇచ్చారు. కన్నగి నగర్ కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.కబడ్డీ నేపథ్యంతో బైసన్మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. కబడ్డీ నేపథ్యంతో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించింది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. ఆపై చిత్ర యూనిట్ను వారు మెచ్చుకున్నారు.சமீபத்தில் பஹ்ரைனில் நடந்த ஆசிய இளைஞர் விளையாட்டுப் போட்டியில் தங்கம் வென்ற இந்திய U-18 பெண்கள் கபடி அணியின் துணைத் தலைவராக விளையாடிய கார்த்திகா இந்தியாவிற்கும் தமிழ்நாட்டிற்கும் பெருமை தேடித்தந்து இறுதிப் போட்டியில் ஈரான் அணிக்கு எதிரான ஆட்டத்தில் பெற்ற வெற்றியில் அவர் முக்கிய… pic.twitter.com/nzTwkf1Aia— Mari Selvaraj (@mari_selvaraj) October 30, 2025 -
నారా రోహిత్, శిరీషల పెళ్లి.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఘనంగా నారా రోహిత్ వివాహం..
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తను ప్రేమించిన సినీ నటి శిరీష (సిరి) (Sireesha)తో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఘనంగా వారి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
లోకేష్ కనకరాజ్తో బాలీవుడ్ బ్యూటీ
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు భారీ చిత్రాలకు బ్రాండ్గా మారిన విషయం తెలిసిందే. మానగరం వంటి చిన్న చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో ఆపై కమలహాసన్ కథానాయకుడిగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలీ తదితర భారీ యాక్షన్ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక్క చిత్రం ఆశించిన విజయం సాధించకపోతే ఇంతకు ముందు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించినా అవి లెక్కలోకి రావన్నది దర్శకుడు లోకేష్ కనకరాజ్కు వర్తిస్తుంది. ఈయన తాజాగా తెరకెక్కించిన కూలీ చిత్రం అంచనాలను చేరుకోలేకపోయింది. అంతే లోకేష్ కనకరాజ్పై ట్రోలింగ్స్ వైరల్ కావడం మొదలెట్టాయి. అంతే కాదు హిందీలో షారూఖ్ ఖాన్తో చేయాల్సిన చిత్రం డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అదే విధంగా కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వానికి చిన్న బ్రేక్ ఇచ్చి నటనపై దృష్టి పెట్టారు. లోకేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలై నిర్మాణంలో ఉంది. ఇది గ్యాంగ్స్టర్ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం కోసం లోకేష్ కనకరాజ్ చాలా కసరత్తులు చేసి పాత్రకు తగినట్లు తనను తాను మలచుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నటించే నాయకి ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీ బ్యూటీ వామిక కబి(Wamiqa Gabbi) ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ భామ ఇంతకు ముందు మాల్ నేరత్తు మయక్కమ్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్తీ హీరోగా ఖైదీ–2 చేయడానికి లోకేష్ కనకరాజ్ రెడీ అవుతారని సమాచారం. -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
సర్వేపల్లి సిస్టర్స్కు స్వాగతం
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం ఉన్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, ఆల్రెడీ ‘అఖండ 2: తాండవం’ సినిమాకు చెందిన కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రికార్డు చేశారు తమన్.ఇదే సినిమాతో సర్వేపల్లి సిస్టర్స్ను పరిచయం చేస్తున్నారు తమన్. సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్తో ఈ సినిమా మ్యూజిక్ స్కోర్ రెడీ అవుతోంది. ఈ విషయాలను గురువారం మేకర్స్ అధికారికంగా వెల్లడించి, సర్వేపల్లి సిస్టర్స్తో తమన్ ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇక బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్తో... హీరో రవితేజ జెట్ స్పీడ్తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసి గురువారం రామ్చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్తో రామ్చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్ను చేయనున్నారట. అలాగే శర్వానంద్తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోంది
సూర్య భాయ్.. ఎలాగోలా ముంబయిలో బతకాలని రాలేదు.. ఈ ముంబయిని ఏలడానికి వచ్చా.. ఈ డైలాగ్ గుర్తుందా? ప్రిన్స్ ఫ్యాన్స్కు అయితే వెంటనే చెప్పేస్తారు. ఈ డైలాగ్ మూవీ పేరుతో పాటు క్యారెక్టర్ కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అంతలా ఈ సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అదేనండి.. మన మహేశ్ బాబు నటించిన మాస్ యాక్షన్ మూవీ బిజినెస్మెన్. అదే సూర్యభాయ్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ .. ఇలాంటి మళ్లీ వినాలనుకుంటున్నారా? అది థియేటర్లలో మరోసారి వింటే ఎలా ఉంటుంది. అందుకే మీకోసం మళ్లీ వచ్చేస్తున్నాడు సూర్య భాయ్.మరోసారి మిమ్మల్ని అలరించేందుకు సూర్య భాయ్ వస్తున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల నవంబర్ 29న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 4కె వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 46 years of Superstar @urstrulyMahesh in Telugu Cinema will be celebrated with the re-release of #Businessman💥#Businessman4K - noveMBer 29th, 2025 🦁#BusinessmanReRelease@MsKajalAggarwal #PuriJagannadh @musicthaman #RRMakers @MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/m0D3yel12t— Telugu FilmNagar (@telugufilmnagar) October 30, 2025 -
'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025 -
'మహాకాళి'గా భూమి శెట్టి.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో వెతుకుతున్నారు.ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది.చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్లో నిలిచింది. బిగ్బాస్తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by ಭೂMee🐚 (@bhoomi_shettyofficial) -
దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే పెళ్లీడు రాగానే వివాహం జరిపించాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చిన్న కొడుకు విషయంలో అదే ఆశపడ్డాడు. అల్లు శిరీష్ను పెళ్లి చేసుకోమని పదేళ్లుగా బతిమాలాడుతున్నాడు. ఎట్టకేలకు తండ్రి మాటకు తలూపి మ్యారేజ్ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ మధ్యే గుడ్న్యూస్ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని ప్రకటించాడు శిరీష్ (Allu Sirish). తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసులోని మాట మీ అందరికీ చెప్తున్నా.. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నా పెళ్లి చూడాలని నానమ్మ ఎంతో ఆశపడింది. కానీ, ఆ కల నెరవేరకుండానే కన్నుమూసింది. తను మా మధ్య లేకపోయినా.. తన దీవెనలు ఎప్పుడూ మాకు అండగా ఉంటాయి అని శుభవార్త చెప్పాడు. దీపావళి సెలబ్రేషన్స్లో..అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్కు నయనిక సైతం హాజరైంది. ఆమె ఫోటోను పొరపాటున అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అప్పటికింకా శిరీష్.. తనకు కాబోయే భార్య ఫోటో రివీల్ చేయలేదని తెలిసి వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ఫ్యామిలీ ఫోటోలో ఆమెను కట్ చేసి షేర్ చేసింది. రేపే నిశ్చితార్థం కావడంతో శిరీష్ కూడా ఆ పనులు చూసుకుంటున్నాడు.ఎంగేజ్మెంట్కు వర్షం ఆటంకంకానీ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్గా మార్పులొచ్చాయి. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శిరీష్ నిశ్చితార్థపు పనులకు సైతం ఈ వర్షాలు ఆటంకంగా మారాయి. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేసిన శిరీష్.. బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయి అని రాసుకొచ్చాడు. అందులో నిశ్చితార్థపు వేదిక తడిసిముద్దయినట్లు కనిపిస్తోంది.సినిమాఅల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.చదవండి: ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు! -
ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా వస్తున్న మహాకాళి పోస్టర్ను విడుదల చేశారు. మహాకాళి పాత్రలో కనిపించనున్న కన్నడ నటి ‘భూమి శెట్టి’ ఫస్ట్ లుక్ను తన సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ‘మహాకాళి’ ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రానుంది. ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు.పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వస్తున్న మహాకాళి.. బెంగాల్ ప్రాంతంలో జరిగే కథగా ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్లో రానున్న ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. కన్నడకు చెందిన భూమి శెట్టికి తెలుగులో ఇది రెండో సినిమా.. కింగ్డమ్లో సత్యదేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సోషల్మీడియాలో పాపులర్ అయిన ఆమెకు ఈ మూవీ ఛాన్స్ రావడానికి ప్రధాన కారణం ఆమె స్కిన్ టోన్ అని తెలుపుతున్నారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ‘మహాకాళి’ కోసం తీసుకున్నారట.From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025 -
పుట్టినరోజు వేడుకలో స్టార్ డైరెక్టర్ కూతురు (ఫోటోలు)
-
ఈ వారం ఓటీటీలో పండగే.. వరుసగా హిట్ సినిమాలు
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య బాగానే ఉంది. థియేటర్లో ఎటూ బాహుబలి ఎపిక్, మాస్ జాతర చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ‘కొత్తలోక: చాప్టర్ 1’ (kotha lokah chapter 1) ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జియో హాట్స్టార్ వేదికగా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇడ్లీ కొట్టు.. తిరు వంటి హిట్ సినిమా తర్వాత ధనుష్, నిత్యామేనన్ కలిసి జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కోలీవుడ్లో రూ. 60 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలా బాగుంటుంది. తన తండ్రి కోరిక మేరకు వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా ధనుష్ మెప్పించారు.‘కాంతార’కు ప్రీక్వెల్గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 820 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీ మినహా దక్షిణాదికి చెందిన అన్ని భాషలలో విడుదల కానుంది. కాంతార సినిమాతో థియేటర్లలో తన సత్తా ఏంటో కన్నడ హీరో రిషబ్ శెట్టి చూపించారు. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరుఅమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31రంగ్బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30 -
విహారయాత్రలో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
'కల్కి' క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు
కల్కి సీక్వెల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Pdukone) భాగం కావడం లేదని ప్రకటన వచ్చిన సమయం నుంచి పెద్ద చర్చే జరుగుతుంది. ముఖ్యంగా పనిగంటల విషయంలోనే విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రభాస్ స్పిరిట్ ఢీల్ విషయంలో కూడా తను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం వల్లే వదులుకుందని తెలిసింది. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్లు వైజయంతీ మూవీస్కు సపోర్ట్గా నిలిస్తే.. మరికొందరు దీపికా పదుకొనేకు అండగా నిలిచారు.ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం రూ. 1000 కోట్ల మార్క్ దాటి భారతీయ సినిమాకు అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు పొందింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్లో నిలిచింది. అయితే.. దీపికా పదుకొనే, వైజయంతీ మూవీస్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల సినిమా ఎండ్ క్రెడిట్స్లో దీపికా పేరును తాజాగా తొలగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే, దీపికా పదుకొనే పేరు తొలగింపులో వైజయంతీ మూవీస్ పాత్ర లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. ఓటీటీ సంస్థ నుంచి వచ్చిన కొన్ని గ్లిచ్స్ వల్ల ఆమె పేరు కనపడకుండా పోయిందని వివరణ ఇస్తున్నారు. ఇది కూడా హిందీ వెర్షన్లో మాత్రమే అలా వస్తుందని క్లారిటీ ఇస్తున్నారు. కానీ, తెలుగులో దీపికా పేరు క్లియర్గా కనిపిస్తుందని కూడా పేర్కొంటున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు. తర్వాత అమెరికా కాన్సులేట్లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ ఇల్లు, మైలాపూర్లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు
ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో)సూపర్స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్గా కనిపించబోతున్నాడని టాక్.పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. -
మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.డీప్ ఫేక్ వీడియోలుఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.చదవండి: టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా
-
హీరోయిన్గా మహేశ్బాబు మేనకోడలు ఎంట్రీ
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరు వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ మేనకోడలు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించనుంది. మహేశ్బాబు అక్క మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni)- సంజయ్ స్వరూప్ దంపతుల కూతురే జాన్వీ స్వరూప్. తన సినీఎంట్రీని మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.ప్రపంచం ఎదురుచూస్తోంది'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో! ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. నీకోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మై జాను' అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా జాన్వి చిన్నవయసులో ఓ సినిమా చేసింది. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది (2018) సినిమాలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ మూవీకి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.పేరెంట్స్ కూడా యాక్టర్సే!జాన్వీ పేరెంట్స్ మంజుల- సంజయ్ స్వరూప్ కూడా యాక్టర్సే! మంజుల.. షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగా మనసుకు నచ్చింది అని ఒకే ఒక్క మూవీ చేసింది. షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావె వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. సంజయ్ స్వరూప్.. అర్జున్ రెడ్డి, చల్ మోహనరంగ వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా! -
'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!
ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ నేడు ఎంతోమందికి ఛాన్సులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. టాలెంట్ను ఎప్పుడూ ప్రోత్సహించే మాస్ మహారాజ తన 75వ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. సామజవరగమన మూవీకి రచయితగా పని చేసిన భాను భోగవరపును డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాడు. తన జీవితం ముగిసిపోయిందనుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను ధమాకాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మలిచాడు. అందుకే రవితేజ అంటే భీమ్స్కు ప్రాణం. అదే విషయాన్ని ఆయన మరోసారి వెల్లడించాడు.నా వెనక ఓ ధైర్యంరవితేజ ప్రధాన పాత్రలో నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్స్ స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ధమాకా తర్వాత నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ చేసేవరకు నా వెనక ఓ ధైర్యం ఉంది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలి. ఎట్ల నేను సేద్దునో.. ఎట్ల పడి నేను సద్దునో.. అంటూ సెల్ఫోన్లో ఓ వీడియో తీసుకున్నాను. కుటుంబంతో కలిసి పైకి..అప్పుడు నా భార్యాపిల్లల్ని కూడా వీడియో తీశాను. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడుస్తుంది? అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న రోజుల్లో నాకో ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీస్కు రమ్మని ఆహ్వానం వచ్చింది. నమ్మలేకపోయాను. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలతో కలిసి కట్టకట్టుకుని పైకి వెళ్లిపోదామనుకున్నాను. దేవుడిలా కాపాడాడుఅలాంటి సమయంలో దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి పేరు, వ్యక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సర్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే కారణం ఆయనే! అమ్మానాన్న, నీ కొడుకు సజీవంగా ఉండటానికి రవితేజ సర్ కారణం. అవకాశాల కోసం చాలామంది కథలు, కహానీలు చెప్తారనుకుంటారు. సిసిరోలియో ఎప్పుడూ కహానీలు చెప్పడు. ఉన్నదే చెప్తాడు. అందుకే సర్కు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం (దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారి వాయిస్ని ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను (తూ మేరా లవర్ పాటని ఉద్దేశించి) అని భీమ్స్ సిసిరోలియో భావోద్వేగానికి లోనయ్యాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)
-
రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యానిమేటెడ్ బాహుబలి
‘బాహుబలి 3’ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం లైవ్ యాక్షన్ ఫిల్మ్ కాదట. యానిమేటెడ్ వెర్షన్ లో ఉండబోతుందని, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించరట. కానీ, ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి 3’ యానిమేటెడ్ వెర్షన్ వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలు (బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ ) కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’గా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించగా రానా, అనుష్కా శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. -
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో మరోసారి ఆడియన్స్ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్) -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
దాదాసాహెబ్ ఫాల్కే సలహా బోర్డ్ సభ్యురాలిగా సుధారెడ్డి
దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సలహా బోర్డ్ సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతిక రాయబారి సుధారెడ్డిని నియమితులయ్యారు. ఈమె కాకుండా బోర్డ్లో హిందూజా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ పి.సి. సూద్, బరోడా మహారాణి హెచ్.హెచ్. రాధికరాజే గైక్వాడ్, వి.ఎం. సల్గావ్కార్ కార్పొరేషన్ చైర్మన్ దత్తరాజ్ సల్గావ్కార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఇండియన్ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, దాదాసాహెబ్ ఫాల్కే ముని మనవరాలు గిరిజా ఫాల్కే మరాఠే, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో గౌరవనీయ సాంస్కృతిక నిపుణుడు & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ భావనా మర్చంట్, సినీపోలిస్ ఇండియా ఫిల్మ్ ప్రోగ్రామింగ్ &డిస్ట్రిబ్యూషన్ హెడ్ మయాంక్ ష్రాఫ్ మరియు భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ జ్యోతి బధేకా తదితరులు ఉన్నారు.భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వంలో డీపీఐఎఫ్ఎఫ్(DPIFF) సలహా బోర్డ్.. సాంస్కృతిక ప్రతిష్టకు నిలయంగా ఉద్భవించింది. కళాకారులు, చిత్రనిర్మాతలు, పరిశ్రమ నాయకులను నిరంతరం గౌరవిస్తూనే సినిమా రంగంలో ప్రపంచ కేంద్రంగా భారతదేశం యొక్క స్థాయిని బలోపేతం చేస్తుంది. ఇకపోతే అక్టోబరు 29-30వ తేదీల్లో ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు-2025 కార్యక్రమం జరగనుంది. -
బైసన్ కలెక్షన్స్.. బిగ్ మార్క్ అందుకున్న ధ్రువ్
విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025 -
టాలీవుడ్పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్పై ఎలా ఉండనుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి? (ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్. -
తప్పు చేసి సారీ చెప్తే ఎలా.. బిగ్బాస్లో భరణి ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కోక్కరిగా వచ్చి హౌస్లో ఉండే సభ్యులను నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ తమ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్లో ముగించారు. అయితే, మంగళవారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భరణితో పాటు శ్రేష్టి వర్మ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.భరణి ఎంట్రీ ఇవ్వగానే దివ్య చాలా సంతోషంగా వెళ్లి హగ్ చేసుకుని తన అభిమానాన్ని చూపింది. ఇంతలో ఇమ్మాన్యేయల్ దగ్గరికి వెళ్లిన భరణి.. కట్టప్ప చంపేశావ్ కదరా అంటూ సరదాగా పలకరిస్తాడు. అయితే, ఫైనల్గా సంజనాను భరణి నామినేట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. 'భరణి అన్నయ్య అంటూ నువ్వు పిలిచిన ప్రతిసారి ఒక సిస్టర్గానే నేను చూశాను. ఏరోజు కూడా ఫేక్ రిలేషన్ కొనసాగించలేదు. తప్పు చేసి సారీ అని చెప్పితే సరిపోతుందా.. 'అంటూ సంజనపై భరణి ఫైర్ అవుతారు. అయితే, దివ్యను రోడ్ రోలర్ అని కామెంట్ చేయడం వల్లనే భరణి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన ఫైట్ ఈ మంగళవారం ఎపిసోడ్లో హైలైట్ కానుంది.శ్రేష్టి వర్మ కూడా సరైన పాయింట్లతోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ ఆటపై అభ్యంతరం తెలిపింది. రీతూ ట్రాప్లోనే ఉన్నావ్ అంటూ చెప్పింది. గేమ్ పట్ల రీతూకు ఉన్న క్లారిటీ కూడా లేదంటూ పవన్ను శ్రేష్టి నామినేట్ చేసింది. -
'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమయంలో నటుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఫౌజీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సుధీర్ బాబు కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు దర్శన్కు ఫౌజీలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గూఢచారి-2లో కూడా దర్శన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అయితే, ఈ వార్తల గురించి ఫౌజీ యూనిట్, సుధీర్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'లో కూడా ఓ చిన్న పాత్రలో చరిత్ నటించారు. గతంలో తను పలు సినిమాల్లో మెరిశాడు. భలే మగాడివోయ్ సినిమాలో జూనియర్ నానిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత విన్నర్ సినిమాలో జూనియర్ సాయిధరమ్ తేజ్గా కనిపించాడు. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుదీర్ బాబు రెండో కుమారుడు దర్శన్ ఏకంగా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో)
ప్రముఖ నటులు జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య(Soundarya)ను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో పనిచేశారు. ఆ షో మొత్తం చాలా ఎనర్జీగా కనిపించిన రమ్యకృష్ణను సౌందర్య గురించి చెప్పాలని జగపతి బాబు అడిగిన క్షణం నుంచి రమ్య కాస్త బాధగానే కనిపించారు.సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన నరసింహ సినిమా నుంచి కొన్ని సీన్స్ను జగపతి బాబు చూపించారు. స్క్రీన్ మీద వీడియో రన్ అయ్యేంత వరకు రమ్య కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌందర్యతో తన జ్ఞాపకాలను రమ్యకృష్ణ ఇలా పంచుకున్నారు. ' 1995లో అమ్మోరు షూటింగ్ సమయంలోనే సౌందర్యను మొదటిసారి చూశాను. అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నాను. చిన్న తనం నుంచే తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగింది. ఆమెకు ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే.. ఎవరినీ తక్కువగా చేసి మాట్లాడదు. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగానే కాకుండా మాకు మంచి స్నేహితురాలిగా అనుబంధం ఉంది. ఆమెను ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరు.' అని రమ్యకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో ఆమె కంట కన్నీళ్లు మాత్రం ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలునరసింహ సినిమా విడుదల సమయానికి రమ్యకృష్ణకు సమానంగా సౌందర్యకు పాపులారిటీ ఉంది. ఈ మూవీ వరకు కేవలం నటిగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణకు ‘నరసింహ’ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రజనీకాంత్కు విలన్గా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అయితే, ఇదే మూవీలో తాను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని కూడా ఆమె చెప్పారు. కానీ, ఆ సీన్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని రమ్య గుర్తు చేసుకుంది. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.దేవుళ్లందరినీ తలుచుకున్నాకే ఆ సీన్ చేశారమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. -
‘కృష్ణ లీల’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హన్సిక ట్రిప్.. ఎవరితో తెలుసా..?
దక్షణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్లోని రంతంబోర్ జాతీయ పార్క్ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే. దీంతో హన్సిక, సోహైల్ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్ హీరోయిన్ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) -
రైల్వే కాలనీ డేట్ ఫిక్స్
‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది. నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రా నికి షో రన్నర్గా వ్యవహరించి, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి, స్పెషల్ వీడియోను, ΄పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా మా ‘12ఎ రైల్వే కాలనీ’ని విడుదల చేయనున్నాం. ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ చేసినపాత్రలో పలు కోణాలున్నాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘పొలిమేర’ సిరీస్లో ఆకట్టుకున్న డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. కెమెరా: కుశేంద్ర రమేశ్ రెడ్డి. ’ -
ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. గ్లింప్స్ రిలీజ్
లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్లో సీన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు. -
శర్వా వరస సినిమాలు.. కానీ హిట్ కొట్టెదెప్పుడు?
ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్పై గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు. ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది. Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025 -
మొకాళ్లపై తిరుమల కొండపైకి టాలీవుడ్ నటి కూతురు.. వీడియో వైరల్!
టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.ఇటీవల సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలను సుప్రీత మరోసారి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి మొకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతున్న వీడియోను కూడా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు తల్లీకూతుళ్ల దైవభక్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.రీసెంట్గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by trippy[FX] (@trippy__reels) -
'అలాంటి సీన్స్కు నో.. అయినా కూడా'.. హీరోయిన్ ధన్య బాలకృష్ణన్
తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan). హీరోయిన్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు డిఫరెంట్ రోల్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం ధన్య హీరోయిన్గా కృష్ణ లీల అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధన్య బాలకృష్ణన్ తన కెరీర్, అవకాశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫీలయ్యేదాన్ని ధన్య బాలకృష్ణన్ తెలిపింది. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొంది. గ్లామరస్ రోల్స్కు నేను పెట్టుకున్న నిబంధనలే కారణమని తెలిపింది. ఇంటిమేట్ సీన్స్ చేయాల్సిన రోల్స్ ఉంటే కూడా నో చెప్పేదాన్ని అని వెల్లడించింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా గర్వంగా ఉందన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయంటే నా సక్సెస్ కారణమన్నారు. నా ఫ్యామిలీని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి వచ్చానని ధన్య బాలకృష్ణన్ వెల్లడించారు. కాగా.. ధన్య బాలకృష్ణన్ తాజాగా నటించిన చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. -
ధన్య బాలకృష్ణన్ కొత్త సినిమా.. ట్రైలర్ చూశారా?
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీలా . దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.కృష్ణలీల ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ ప్రేమకథా చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తన ప్రేమ కోసం హీరో చేసిన ప్రయత్నాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్ అనే డైలాగ్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
'మిరాకిల్ మ్యాన్' జి.డి.నాయుడు.. మూడో తరగతితోనే ఎన్నో అద్భుతాలు
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ దేశానికి జి.డి.నాయుడు చేసిన సేవా ఎలాంటిదో తెలుసుకుందాం.1983లో కోయంబత్తూర్కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జి.డి.నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్గా ఈ దేశం గుర్తించింది. జి.డి.నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.చదివింది మూడో తరగతి మాత్రమేజి. డి. నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు.జి. డి. నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్లో జార్జి రాజు అంత్యక్రియలు (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల'లో ఇప్పటికీ ఉన్నాయి. తొలి ఇంజనీరింగ్ కళాశాల1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు.. సంఘసేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు.ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండితెరపై మిరాకిల్ మేన్గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్లో టాప్లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్లో చిరు వేసే స్టెప్పులు సింపుల్గా కనిపిస్తూనే చాలా స్టైలిష్గా ఉంటాయి. లిరికల్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
రవితేజ 'మాస్ జాతర' కోసం వస్తున్న సూర్య
'మాస్ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర.. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.రవితేజ మాస్ జాతర ప్రీ- రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్టైమ్ 160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.The celebration just got BIGGER! 💥🔥The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!In cinemas worldwide #MassJatharaOnOct31st Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
‘ది గర్ల్ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన రష్మికా మందన్న (ఫొటోలు)
-
ఓటీటీలో మెప్పిస్తున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2'
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. సునీల్ హీరోగా రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ (2010) సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని ‘సన్ ఆఫ్ సర్దార్’గా అజయ్ దేవగన్(Ajay Devgn) హీరోగా హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇప్పటివరకు ‘మర్యాద రామన్న’కు సీక్వెల్ రాలేదు కానీ ‘సన్ ఆఫ్ సర్దార్’కు మాత్రం మళ్ళీ అజయ్ దేవగన్ హీరోగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి టైటిల్ మాత్రమే సీక్వెల్గా తీసుకున్నా కథను మాత్రం తమ పంథాలో తీసుకున్నారు మేకర్స్. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. దీనికి అజయ్ దేవగన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. కథ దాదాపుగా స్కాట్ల్యాండ్లోనే జరుగుతుంది. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందీ చిత్రం. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కథాంశానికొస్తే... జస్సీ సింగ్ రాండ్వా పెళ్లయినా పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య విదేశాలలో ఉంటుంది. జస్సీ మాత్రం తన తల్లితో భారత్లో ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే జస్సీ భార్య డింపుల్ ఫోన్ చేసి, జస్సీకి వీసా అప్రూవ్ అయిందని, వెంటనే తను కూడా తన దగ్గరకు రావచ్చని చెబుతుంది. ఎంతో ఆనందంతో భార్యను కలవడానికి విదేశాలలో అడుగు పెట్టిన జస్సీతో విడాకులు కావాలని షాకిస్తుంది డింపుల్. ఖంగుతిన్న జస్సీ ఏం చేయాలో తోచని స్థితిలో ఫ్రెండ్ ఇంటికి వెళతాడు... అనుకోకుండా పాకిస్థాన్కి చెందిన రబియాని కలుస్తాడు జస్సీ. రబియాకి సాబా అనే కూతురు ఉంటుంది. భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రబియా కూతురు సాబా గ్యాంగ్స్టర్ రాజా సంధు కొడుకైన రాజాతో ప్రేమలో ఉంటుంది. రాజా సంధుకు భారత దేశమంటే ఎంత ప్రేమో అంతకు మించి పాకిస్థానీయులంటే ద్వేషం. అటువంటి అతని కొడుకు ఓ పాకిస్థానీ ప్రేమలో పడతాడు. జస్సీని తన భర్తగా ఉండమని చెప్పి తామిద్దరూ పంజాబీ దంపతులుగా నటించి, రాజా సంధుతో సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంటుంది రబియా. ఇదే సమయంలో రాజా సంధు ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్లో రబియా, జస్సీ తల్లిదండ్రులుగా సంబంధం ఖాయం చేసుకునే సమయంలో అటు రబియా అసలు భర్త రావడంతో పాటు ఇటు జస్సీ భార్య డింపుల్ కూడా తారసపడుతుంది. ఈ గందరగోళంలో రబియా తన కూతురు పెళ్ళి చేయగలుగుతుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కామెడీ కాలక్షేపం. ఎందుకంటే ఇది కామెడీ ఆఫ్ సర్దార్ కాబట్టి. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే. ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర 'మాయకర'గా కూడా రిషబ్నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది. 'మాయకర' పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు. కేవలం మేకప్ కోసమే ఆరు గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి 12:30 నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలౌతాయని పేర్కొన్నారు. మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు. -
నారా రోహిత్- శిరీష పెళ్లి.. హల్దీ వేడుక (ఫోటోలు)
-
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
'నెపోలియన్ రిటర్న్స్' మూవీ ఈవెంట్ (ఫొటోలు)
-
హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్
దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji)లో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. గతంలో సప్త సాగరాలు దాటి: సైడ్ బి, 3బీహెచ్కే వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించినుకున్నట్లు సమచారం. ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుండగా చైత్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇందులో అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కూడా భాగం కానున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940లో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రెడీ చేశారు.చైత్ర జె. ఆచార్ నటి మాత్రమే కాదు ఒక గాయని కూడా.. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరా (2019)లో నటించింది. కన్నడ చిత్రం 'గరుడ గమన వృషభ వాహనం'లో ఆమె పాడిన 'సోజుగడా సూజు మల్లిగే' అనే పాట ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది. చైత్ర ప్రస్తుతం ఉత్తరకాండ, మై లార్డ్, స్ట్రాబెర్రీ, మర్ణామి వంటి చిత్రాల్లో నటిస్తోంది. సప్త సాగరాలు దాటి: సైడ్ బి సినిమాలో చైత్ర ఒక వేశ్యగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
ఓ యోధుడి పోరాటం
యోధుడిగా శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు గోపీచంద్. ఈ యోధుడి శూరత్వం ఏ రేంజ్లో ఉంటుందనేది సిల్వర్ స్క్రీన్పై చూడాలి. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్లోని ఈ 33వ సినిమాను పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు.‘‘విభిన్నమైన కథతో భారతదేశ చరిత్రలోని ఓ ప్రముఖ అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నాం. గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు షెడ్యూల్స్లో 55 రోజుల షూటింగ్ను పూర్తి చేశాం. ప్రస్తుతం వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కథ 7వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్. -
పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి
ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందిఅపార్థం చేసుకున్నారుకస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!బ్లడ్ క్యాన్సర్సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. రైల్వే ట్రాక్పై పసిబిడ్డ దొరికిందిఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.చావును ప్రసాదించమన్నా..మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్. నాపై ఉమ్మేశారుతనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' -
గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శర్వానంద్.. ఫోటోలు వైరల్..
-
కాంతార1 పై బన్నీ ప్రశంసలు..!
-
'కింగ్డమ్'కు భారీ నష్టాలు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ ‘కింగ్డమ్’ (Kingdom). ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్కుమార్ కసిరెడ్డి వంటి వారు నటించారు. నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్ కలెక్షన్స్పై నాగవంశీ రియాక్ట్ అయ్యారు.'అందరూ కింగ్డమ్ సినిమా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. అందులో నిజం లేదు. అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం నైజాంలోనే రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి సినిమాను ఫెయిల్యూర్ అంటే ఎలా..? కింగ్డమ్ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్, గౌతమ్ తిన్ననూరి వంటి వారు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మేము రీచ్ కాలేకపోయాం. నా నుంచి కింగ్డమ్ సినిమాను కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. కలెక్షన్స్ పరంగా ఒకరో ఇద్దరో నష్టపోయిన బయ్యర్లకు జీఎస్టీ రూపంలో రిటర్న్ చేశాను. దీంతో వారు కూడా సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమాతో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు కింగ్డమ్ ప్లాప్ సినిమా ఎలా అవుతుంది..? కానీ, మేము అనుకున్నంత రేంజ్లో కింగ్డమ్ రన్ కాలేదు. బాక్సాఫీస్ లెక్కల పరంగా కింగ్డమ్ హిట్ చిత్రంగానే ఉంటుంది.' అని ఆయన అన్నారు. -
నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా?
తెలుగు హీరో నారా రోహిత్ (Nara Rohit) పెండ్లిపనులు షురూ అయ్యాయి. పెళ్లికూతురు శిరీష (Siree Lella) ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవలే జరిగింది. తాజాగా రోహిత్- శిరీషలు జంటగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫామ్హౌస్లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఆటలు, పాటలతో ఈ సెలబ్రేషన్స్ రెట్టింపు ఉత్సాహంతో సాగాయి. రోహిత్- శిరీష అక్టోబర్ 30న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.అలా మొదలైందినారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష హీరోయిన్గా నటించింది. రోహిత్ ప్రియురాలిగా మెప్పించింది. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ అతడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. ఇరు కుటుంబాలు పెళ్లికి పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.సినీ జర్నీనారా రోహిత్ విషయానికి వస్తే.. బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో సినిమాతో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోయాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకుని ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో అలరించాడు. Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025చదవండి: అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు! -
అల్లు అరవింద్ తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు!
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య జీవితమంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది, ఇంకా లవ్స్టోరీలకు ఛాన్స్ ఎక్కడిది? అన్నాడు. ఆ తర్వాత తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని.. తనపై చేస్తున్న కుట్రలన్నీ వెంట్రుకతో సమానం అంటూ మిత్రమండలి ఈవెంట్లో ఓ బూతు మాట కూడా అనేశాడు. ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది.ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్లో బన్నీ వాసుఇలా హద్దులు దాటి మాట్లాడినందుకు అల్లు అరవింద్ (Allu Aravind).. బన్నీ వాసుకు గట్టిగానే క్లాస్ పీకాడట! ఈ విషయాన్ని బన్నీ వాసు స్వయంగా వెల్లడించాడు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాసు వచ్చాడు. ఆయన మైక్ అందుకుని ప్రసంగం ప్రారంభించేలోపే.. నిర్మాత ఎస్కేఎన్ కలగజేసుకుని ఇప్పుడు బన్నీ ఒక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడన్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని..దీంతో అప్పటికే జ్ఞానోదయం అయిన బన్నీ వాస్.. అగ్రెసివ్ లేదు, కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు కూల్గానే మాట్లాడతాను. ఎందుకంటే ఆ కాంట్రవర్సీకి ఆయన (అల్లు అరవింద్) తిట్టినన్ని తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు. అందుకే ఈరోజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు.. మళ్లీ ఆయనే వైరు పట్టుకుని కొడతారు. ఇంకో నాలుగైదు నెలలు వైరల్ కంటెంట్కు ఛాన్సే లేదు అంటూ సరదాగా అనడంతో అంతా నవ్వేశారు.చదవండి: బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్ -
విజయ్ దేవరకొండతో పెళ్లి.. క్యూట్గా 'రష్మిక' సమాధానం (వీడియో)
టాలీవుడ్లో ఆన్స్క్రీన్ ఫేవరెట్ జంట ఎవరంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక గురించే మొదట చెప్తారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వారి సన్నిహితులు వెల్లడించారు. కానీ, ఈ జోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే, వీరిద్దరూ ఒకేరకమైన ఉంగరాలు పెట్టుకొని ఈ మధ్య కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్లో తన పెళ్లి గురించి టాపిక్ రాగానే అవుననే సిగ్నల్ ఆమె ఇచ్చేసింది.ది గర్ల్ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో యాంకర్ వేసిన ప్రశ్నతో రష్మిక పెళ్లి గురించి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తిని బాయ్ఫ్రెండ్గా ఎంపిక చేసుకోవాలంటే ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం వస్తుంది. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ కనిపిస్తుంది. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అంటూ యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ ఆన్సర్ వస్తుంది. ఆ సమయంలో రష్మిక కూడా చిరునవ్వుతో అందరికీ తెలుసే.. అంటూ చేతులతో అవుననే సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇలాగైనా ఫ్యాన్స్కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, వచ్చే ఏడాదిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Captures by Chan (@celebrities_tollywood_) -
కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’ ట్రైలర్ ఈవెంట్ కోసం మాస్క్ లేకుండా మెరిసింది. ట్రైలర్ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్కు మాత్రం మాస్క్ లేకుండానే వచ్చేశారు.రష్మిక తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా కోసం మాస్క్ లేకుండా కనిపించి ఫ్యాన్స్లో జోష్ నింపారు. మరింత గ్లామర్గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.రీసెంట్గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది. -
అందులో అసభ్యత ఎక్కడుంది: లియో నటి
బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలీ ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు. గ్లామర్కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి
అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, ది గర్ల్ ఫ్రెండ్’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...యాక్షన్ డ్రామా... మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన మోహన్లాల్ లీడ్ రోల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు పోషించారు. నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సరికొత్త ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్ రవీంద్రన్. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. సూపర్ నేచురల్ బ్యాక్డ్రాప్లో... సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.మైథలాజికల్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్’ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్.. ’ వంటి డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. తనకి సూపర్ పవర్స్తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్ ఉంటుంది. ఈ పవర్స్ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్ తెలిపారు. నవ్వుల్ నవ్వుల్ ‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్ ఉండాలి’’ అంటూ శేఖర్ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్ షో అనే బ్యానర్ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్ పేర్కొనడం విశేషం. పీరియాడికల్ డ్రామా ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ ΄÷ట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది.‘‘పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్ ఏజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్ లవ్స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. వినోదాల సంతాన ప్రాప్తిరస్తు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ అవుతోంది.‘‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్ దావూద్ జి. అందించిన స్క్రీన్ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్ కశ్యప్ సంగీతం హైలైట్గా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. వీరాభిమాని సందడి రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, తులసి రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్ అనే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.వివేక్– మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్గా రామ్ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్. తొలి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ మహేశ్బాబు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్లోనే కాదు... బాలీవుడ్లో, హాలీవుడ్లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జోడీగా నటించి ‘హక్’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్: బాడ్ల్యాండ్స్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇక అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ΄్యార్ దే 2’ నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘120 బహదూర్’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్ 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 21న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్కి రెడీ అవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
నాగార్జున రూట్లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు, గొంతు లాంటివి ఇకపై ఎవరైనా సరే అనుమతి లేకుండా ఉపయోగిస్తే అంతే సంగతులు. ఎందుకంటే చిరు వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్.. శనివారం (అక్టోబరు 25) మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, గాత్రం తదితర అంశాల్ని వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.అలానే కృత్రిమ మేథస్సు (ఏఐ)తో తయారు చేసిన మార్ఫ్ ఫొటోలు, వీడియోలు వినియోగించడాన్ని కూడా ఆపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి చిరంజీవి తీసుకువచ్చారు. ఆయన పేరుతో వీడియో, మీమ్స్ చేసి అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తద్వారా ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలుగుతోందని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. (ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)ఈ ఆదేశాల ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్, గొంతు, ఆయనకు మాత్రమే సొంతమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలని ఏ రూపంలోనైనా ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నాగార్జున కూడా ఇలానే న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. వచ్చే వేసవిలో 'విశ్వంభర' థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?) -
రష్మిక 'ది గర్ల్ఫ్రెండ్' ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
బిగ్బాస్లో బాడీ షేమింగ్.. దివ్యపై సంజన వ్యాఖ్యలు
బిగ్బాస్ షో అంటేనే బూతులకు కేరాఫ్ అంటూ చాలామంది విమర్శించడం చూస్తూనే ఉన్నాం. గతంలో సీపీఐ నారాయణ మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రోతల్ హౌస్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంత విమర్శలు బిగ్బాస్ 9వ సీజన్ మీద వస్తున్నాయి. రోజురోజుకూ షో మరీ దిగజారిపోయిందనే అభిప్రాయం కనిపిస్తుంది.హౌస్లో నటి సంజన గల్రానీ ప్రవర్తన, ఆమె చేస్తున్న కామెంట్లు చాలా అభ్యంతరకంగానే ఉన్నాయి. వాటిని ఏకంగా టెలికాస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏకంగా దివ్య అనే కామనర్ పట్ల సంజన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి కల్యాణ్ పట్ల కూడా ఆమె ఇలాగే ప్రవర్తించింది. తాను క్లాస్ అంటూ 'కల్యాణ్' లో క్లాస్ అంటూ పేర్కొంది. ఒక సెలబ్రిటీ (తనూజ) చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కల్యాణ్పై చీప్ కామెంట్లు చేసింది.మరోసారి తనూజ పట్ల కూడా జలసీ రాణీ అంటూ హైపర్ అయిపోయింది. ఇలా సంజన పదేపదే నోరు జారడం పరిపాటిగా మారిపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని షోలో టెలికాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని లైవ్ ఎపిసోడ్స్లో వస్తున్నాయి. ఒకసారి తనూజ కూడా రాము రాథోడ్ను చాలా చులకన చేసి మాట్లాడిన సందర్భం ఉంది. ఇలాంటి ధోరణితో సమాజానికి ఏం చెప్పాలని బిగ్బాస్ చూస్తున్నాడు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో సంజనను హోస్ట్ నాగార్జున నిలదీస్తారా..? లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్బాస్లో ఎప్పుడూ అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నాయ్ అంటూ అభిప్రాయం కనిపిస్తుంది. బిగ్బాస్లో ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీ కేరక్టర్లను ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b— Edits reposter (@Inspiritmodee) October 24, 2025 -
అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.రెండు లారీల పేపర్స్ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025చదవండి: సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి -
‘డ్యూడ్’ మూవీ 100 కోట్ల జర్నీ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్కు ఎదురుదెబ్బ
మలయాళ నటుడు మోహన్ లాల్కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు (Ivory Tusks) ఉన్న విషయం తెలిసిందే. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఇంట్లో ఉంచానని గతంలో న్యాయస్థానానికి ఆయన తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలను కూడా చూపారు. ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. అయితే, తాజాగా ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్లాల్కు ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం రద్దు చేసింది. ఏనుగు దంతాల విషయంలో ఇలా అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం.. మీకు నచ్చినట్లు అనుమతి ఎలా ఇస్తారని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.15 ఏళ్ల నుంచి ఏనుగు దంతాల కేసు మోహన్లాల్ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్లాల్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. 2012లో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు జతల ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో 2016 జనవరి, ఏప్రిల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్లాల్కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది. -
హీరోయిన్గా బిగ్బాస్ బ్యూటీ రతిక.. ఏకంగా మూడు భాషల్లో!
తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని బాగా పాపులర్ అయింది రతిక (Rathika Ravinder). ఈ షోలో ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ తనపై వచ్చిన నెగెటివిటీ పోగొట్టుకోలేకపోయింది. ఇక సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసే రతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎక్స్వై. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రానా, అనిజ్ ప్రభాకర్, శ్రీధర్ ఇతర పాత్రలు పోషించారు. ఎంకే సాంబశివం నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.సినిమాఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పిజ్జా, సూదు కవ్వుమ్, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతో పాటు మాయవన్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీవీ కుమార్. తాజాగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఆయన దర్శకత్వం వహించిన మరో ప్రయోగాత్మక చిత్రం ఎక్స్ వై. ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని ప్రేక్షకుల నుంచి కచ్చితంగా కితాబులు అందుకుంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: హరిహరన్ ఆనందరాజా, సంగీతం: శ్రీకాంత్ కృష్ణ. చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
సమంత 'మా ఇంటి బంగారం' షురూ!
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram Movie). ఇందులో సామ్ గృహిణిగా యాక్ట్ చేస్తోంది. సమంత బర్త్డే సందర్భంగా 2024లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ, షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఈ వారంలోనే సినిమా చిత్రీకరణ షురూ అయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో సమంత పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించడంతో పాటు సమంత తన నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్పై నిర్మిస్తున్నారు.సినిమాసమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించింది. ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత హీరోయిన్గా మరే సినిమా చేయలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్లో నటిస్తోంది.చదవండి: కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే? -
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు.ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025 -
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు నోటీసులు
మత్తుపదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్(శ్రీకాంత్), కృష్ణ బెయిల్పై ఇప్పటికే విడుదలయ్యారు. అయితే, తాజాగా వారిద్దరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. ఈ ఏడాది జూన్లో మొదట ప్రదీప్కుమార్ అనే వ్యక్తి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. అతన్ని విచారిస్తే గనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తి సరఫరా చేశాడని తేలడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఇదే కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్తో పాటు సినీనటులు శ్రీరామ్, కృష్ణ మొదలైన వారిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన శ్రీరామ్, కృష్ణ బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు సూచనతో విడుదలయ్యారు. కానీ, తాజాగా ప్రత్యేక కోర్టు అనుమతితో పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్కుమార్లను ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న నటుడు శ్రీరామ్, 29న నటుడు కృష్ణ విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు పంపారు.తప్పు చేశాను.. నా బిడ్డను చూసుకోవాలి డ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది. -
మాస్ హీరోతో.. క్లాస్ హీరో.. సంక్రాంతికి మెగా విక్టరీ
-
పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?
సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. -
ఊహకి కూడా అందదు
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఊహకి కూడా అందదు’’ అని బాలకృష్ణ పలికే డైలాగ్ ఈ వీడియోలో ఉంది. బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
బాహుబలి: ది ఎపిక్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. రన్ టైమ్ ఎంతంటే?బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఇటీవలే వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్.. ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. Two Films, One Epic Experience! Here's the Release Trailer of @ssrajamouli's #BaahubaliTheEpic.Telugu https://t.co/2vVWqhKDVUHindi https://t.co/xgsE1i0CBGIn Cinemas worldwide from 31st October 2025. #BaahubaliTheEpicOn31stOct #Prabhas @RanaDaggubati @MsAnushkaShetty… pic.twitter.com/VqlURRhbpg— Baahubali (@BaahubaliMovie) October 24, 2025 -
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ
అక్టోబర్ చివరకొచ్చేసింది. ఈ కొద్దిరోజుల్లోనే టాలీవుడ్లో పలు శుభకార్యాలు జరగబోతున్నాయి. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఈనెల చివర్లో ఉండగా, నారా రోహిత్-శిరీష పెళ్లి కూడా రాబోయే కొన్నిరోజుల్లోనే జరగనుంది. మరోవైపు ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'నాటు నాటు' పాటతో ఆస్కార్ వరకు వెళ్లిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఫొటోలు పోస్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈనెల మొదట్లో రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఇప్పుడు హరిణ్య స్వయంగా తమ పెళ్లిపనులు మొదలయ్యాయని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. లగ్నపత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ మూడు ఫొటోలని పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్, హరిణ్య జంట చూడముచ్చటగా కనిపించింది. రాహుల్లానే హరిణ్య కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. బిగ్బాస్ షోలో రాహుల్ పాల్గొన్నప్పుడే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాడు. మాస్ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు ఇతడి పాడాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే.(ఇదీ చదవండి: నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్) -
గులాబీలా అనన్య నాగళ్ల.. పింక్ చీరలో ఇలా (ఫొటోలు)
-
‘బైసన్’ మూవీ ప్రెస్ మీట్ లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
పూజా హెగ్దే కోసం ట్రై చేస్తున్న బన్నీ.. దానికోసమేనా..?
-
ప్రభాస్ కోసం గీతా ఆర్ట్స్ స్పెషల్ వీడియో.. దద్దరిల్లిన సోషల్ మీడియా
-
కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే! కవలలు రాబోతున్నారుమళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.చిరంజీవి కుటుంబంచిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.చిరంజీవి కోరిక నెరవేరేనా?దీంతో ఓ ఈవెంట్లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి! View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్! -
స్పిరిట్ సర్ప్రైజ్.. చిన్నప్పటినుంచి నాకో చెడ్డ అలవాటుందన్న ప్రభాస్!
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు వంగా. తన సినిమాతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించే ఈ డైరెక్టర్ ఈసారి ప్రభాస్తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న (అక్టోబర్ 23న) ప్రభాస్ (Prabhas) బర్త్డేను పురస్కరించుకుని ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆడియో గ్లింప్స్గురువారం రాత్రి 11 గంటలకు 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారి ప్రభాస్ గురించి ప్రకాశ్రాజ్ ఇలా అంటాడు. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని! ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం! ప్రభాస్ డైలాగ్వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్కు పంపించండి అంటాడు. అందుకు ప్రభాస్.. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటుంది.. అని సగం చెప్పడంతోనే గ్లింప్స్ వీడియో పూర్తయింది. ప్రభాస్ను ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్స్టార్గా అభివర్ణిస్తూ టైటిల్ కార్డ్ వేయడం విశేషం! గ్లింప్సే ఈ రేంజ్లో ఉంటే టీజర్, ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్దన్ రాణె సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత -
దీపావళి వెలుగుల్లో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా.. డిఫరెంట్గా శ్వేతాబసు ప్రసాద్!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ పూనమ్ బజ్వా..దీపావళి సెలబ్రేషన్స్లో బాలీవుడ్ బ్యూటీ శివాంగి జోషి..ఎల్లో శారీలో బుల్లితెర నటి మంజుల అందాలు..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్..ఢిఫరెంట్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by C Sharp (@c___sharp) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) View this post on Instagram A post shared by Nandiniii🕊 (@nandiniguptaa13) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
ముచ్చటగా మూడో సినిమాకు సెంచరీ కొట్టిన 'డ్యూడ్'
కాస్త నెగెటివ్ టాక్ వచ్చిందంటే సినిమా బండి ముందుకెళ్లడం కష్టమే! కానీ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మాత్రం మిక్స్డ్ టాక్నే ఇంజనుగా మార్చుకుని రయ్యిమని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన డ్యూడ్ సినిమా (Dude Movie) ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. బ్లాక్బస్టర్ దివాళీ సీజన్ అంటూ రూ.100 కోట్ల పోస్టర్ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మూడు సినిమాలకు వరుస సెంచరీ సాధించిన హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ చరిత్ర సృష్టించాడు. డ్యూడ్ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించగా శరత్కుమార్ కీలక పాత్ర పోషించాడు.సినిమాప్రదీప్ రంగనాథన్.. ఎల్కేజీ సినిమాకు డైలాగ్స్ రాశాడు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇందులో అతిథి పాత్రలోనూ మెరిశాడు. లవ్ టుడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వీయదర్శకత్వం వహించిన ఈ సినిమా వంద కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. రెండో సినిమా డ్రాగన్ సైతం సెంచరీ దాటేసి ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముచ్చటగా మూడో సినిమా కూడా సెంచరీ దాటేసింది. మరి డ్యూడ్ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి! DUDE SMASHES A CENTURY AT THE BOX OFFICE 💥💥💥#Dude collects a gross of over 100 CRORES WORLDWIDE, making it the biggest blockbuster of the Diwali season ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing… pic.twitter.com/maxHJwy3uo— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2025 చదవండి: బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే? -
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee) -
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
ప్రభాస్ బావ.. అరడజనుమంది పిల్లలతో హ్యాపీగా ఉండు: మోహన్బాబు
కన్నప్ప సినిమాలో ప్రభాస్ (Prabhas) నటించడానికి ప్రధాన కారణం మోహన్బాబు (Mohan Babu). ఆయన మీదున్న గౌరవంతోనే విష్ణు సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడు. తన లుక్తోనే సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ప్రభాస్ను మోహన్బాబు ముద్దుగా బావ అని పిలుస్తుంటాడు. ఈ రోజు (అక్టోబర్ 23) డార్లింగ్ బర్త్డే.. ఈ సందర్భంగా మోహన్బాబు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.బావకు బర్త్డే విషెస్మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్.. దేశానికే నువ్వు గర్వకారణం. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతులేని సంతోషంతో ఆనందంగా గడపాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని, అరడజను మంది పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో, నిన్ను ఎప్పుడూ ప్రేమించే బావ అని ట్వీట్ చేశాడు. భలే సరదా..ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రభాస్ను అలా ఊహించుకుంటే భలే సరదాగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. ఇంకా పెళ్లి ఊసే లేదంటే.. పిల్లల వరకు వెళ్లిపోయారా.. అని ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్, మోహన్బాబు.. బుజ్జిగాడు సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరూ ఒకరినొకరు బావ అని పిల్చుకుంటారు. My Dear Darling Bava #Prabhas , the pride of the entire nation —May you be blessed with endless happiness, and celebrate many more birthdays in grand style, may you live in good health and joy for a hundred years,And may you soon get married and live a happy life with half a… pic.twitter.com/tiPFY5t7Vu— Mohan Babu M (@themohanbabu) October 23, 2025 చదవండి: బ్లాక్బస్టర్ మూవీతో బ్రేక్.. వస్తున్నా, ఇప్పుడు అసలు సినిమా -
'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
ధ్రువ్ విక్రమ్ సినిమా.. భారీగా 'బైసన్' కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025 -
మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన కొణిదెల
-
బ్లాక్బస్టర్ మూవీతో బ్రేక్.. వస్తున్నా, ఇప్పుడు అసలు సినిమా షురూ!
తెలుగు నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. నిర్మాతగా హిట్లు, బ్లాక్బస్టర్స్ అందుకున్న ఆయన సినిమా నిర్మించి చాలా ఏళ్లవుతోంది. అయితే ఇటీవల దీపావళి పండక్కి టాలీవుడ్ సెలబ్రిటీలను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రోషన్, శివాజీ, తేజ సజ్జ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బెల్లంకొండ శ్రీనివాస్, తరుణ్.. తదితరులు హాజరయ్యారు.సిద్ధుపై పొగడ్తలుఈ హడావుడి అంతా చూస్తుంటే బండ్ల గణేశ్ టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అయ్యాడని అందరికీ అర్థమైపోయింది. తాజాగా అదే నిజమని ధ్రువీకరించాడు. తెలుసు కదా సినిమా (Telusu Kada Movie) బ్లాక్బస్టర్ సక్సెస్ ఈవెంట్కు బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. నేనైతే ఈ సినిమా తీయనుజోష్ సినిమాలో చిన్న వేషం కోసం తపించిన సిద్దు.. మరో రవితేజ అవుతాడు. సిద్దు, తేజ సజ్జ.. ఈ యంగ్ జనరేషన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీరు రెండు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడానికి పుట్టినవాళ్లు! నేనైతే నిర్మాతగా తెలుసు కదా సినిమా తీయను. ఈ మూవీ తీయడానికి దమ్ము, ధైర్యం కావాలి. ఈ విషయంలో విశ్వప్రసాద్ను అభినందించాల్సిందే! మీరు మా తోటి నిర్మాత అవడం సంతోషంగా ఉంది. రీఎంట్రీ అడిగారుగా..నీరజ కోన.. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయినా కూడా అందరినీ కలుపుకుపోతూ దర్శకురాలిగా మారడం అంటే మాటలు కావు. హ్యాట్సాఫ్. నిర్మాత ఎస్కేఎన్ నన్ను రీఎంట్రీ ఇవ్వమని అడిగాడు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నాను. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్! అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు.చదవండి: సినిమా ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు నష్టపోయా! లైన్లో నిలబడి.. -
‘తెలుసు కదా’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సినిమా ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు నష్టపోయా! లైన్లో నిలబడి భోజనం!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు నవభారత్ బాలాజీ. గ్యాంగ్ లీడర్, సంకెళ్లు, మేజర్ చంద్రకాంత్ (అమ్రీష్పురి కొడుకుగా).. ఇలా పలు చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తండ్రి బాబూరావు.. నవభారత్ కంపెనీ పేరిట దాదాపు 250కి పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో కొనసాగిన బాలాజీ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాడు. సినిమా ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు నష్టపోయి సీరియల్స్కు షిఫ్ట్ అయ్యాడు.ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లుతాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలాజీ (Actor Navabharath Balaji) మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లు అవుతోంది. నిర్మాతగా మూడు హిట్లు (ప్రయత్నం, కలెక్టర్గారి అల్లుడు, ఇన్స్పెక్టర్ ఝాన్సీ) కొట్టగా నాలుగో సినిమా(మరో క్విట్ ఇండియా) ఫ్లాప్ అయింది. 1994లో రిలీజైన మరో క్విట్ ఇండియా వల్ల ఒక్కరోజులోనే రూ.1కోటి నష్టం వాటిల్లింది. దాన్నుంచి కోలుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ మూవీ దెబ్బకు హైదరాబాద్లోని ఫిలింనగర్ స్థలం రూ.26 లక్షలకు అమ్మేశాను. రూ.1000 కోట్ల నష్టంనా పరిస్థితి దిగజారడంతో.. భోజనాలు పెట్టినప్పుడు లైన్లో నిలబడి తిన్న రోజులు కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలోనూ చాలా నష్టపోయాను. ఆస్తులమ్ముకోవాల్సి వచ్చింది. వాటి విలువ ఇప్పుడు రూ.1000 కోట్లు ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్లాప్స్ చూశాను. వీటి నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. థియేటర్లు లీజ్ తీసుకుని వ్యాపారం చేసి బయటపడ్డాను.సౌందర్య మా ఇంట్లోనే..హీరోయిన్ సౌందర్య కెరీర్ ప్రారంభించిన కొత్తలో మా ఇంట్లోనే ఉంది. అప్పుడు తను చాలా చిన్నపిల్ల. తన పేరెంట్స్తో కలిసి మా ఇంట్లో నెలన్నర రోజులుపైనే ఉంది. తను చాలా మంచమ్మాయి. తనతో కూడా ఓ సినిమా చేశాను. మరో సినిమా కోసం సౌందర్య, శ్రీకాంత్ను అడిగా.. కానీ, నాకే ఎందుకో కుదర్లేదు అని నవభారత్ బాలాజీ చెప్పుకొచ్చాడు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా


