Vizianagaram
-
బైక్పై వచ్చి బంగారం అపహరణ
గుర్ల: మండలంలో చైన్స్నాచింగ్ జరగడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. గరివిడి మండలంలోని కె. పాలవలసకు చెందిన గొర్లె సుజాత గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో ఉంటున్న తల్లి అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో తల్లి బాగోగులు చూడడానికి సుజాత ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి కె.పాలవలసలోని తమ స్వగృహనికి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుజాత మెడలో ఉన్న బంగారు అభరణాలను చూసి విజయనగరం నుంచే ద్విచక్ర వాహనంపై వెంబడిస్తున్న ఇద్దరు వ్యక్తులు గుర్ల సమీపంలోని శివాలయం వద్ద చేరుకోగానే మెడలో నుంచి సుమారు రెండుంపావు తులాల బంగారం చైన్ను తెంపి వెళ్లిపోయారు. దుండగులు తెల్లని ఎన్ఎస్4 ద్విచక్రం వాహనంపై వచ్చి మాస్కులు ధరించి ఉన్నట్లు బాధితరాలు చెబుతోంది. బంగారు అభరణాలు అపహరించడంతో గుర్ల పోలీసులకు బాఽధితురాలు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. బంగారు అభరణాలను అపహరించిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వివరాలు ఎవరికై నా తెలిస్తే గుర్ల పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. -
రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి
గరుగుబిల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గరుగుబిల్లి మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు(24), భోగి తేజ వ్యక్తిగత పనుల నిమిత్తం పార్వతీపురం వచ్చి, తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా పార్వతీపురం వైపు నుంచి మరో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా రహదారి పరిధిలోని ఉల్లిభద్ర కూడలి వద్ద ప్రమాదవశాత్తు ఒకదాని కొకటి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు మృతి చెందాడు. రావుపల్లి తేజాతో పాటు మరో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు భాస్కరరావుకు తల్లి ఆదిలక్ష్మి, చెల్లి ఉన్నారు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భాస్కరరావు, తేజాలు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒకే దగ్గర ఉంటున్నారు. భోగి తేజ, తల్లి వర్ధంతి కార్యక్రమానికి రెండు రోజుల క్రితం గ్రామానికి ఇద్దరూ వచ్చారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డెంకాడ: మండలంలోని పెదతాడివాడ కూడలి వద్ద ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో వలిరెడ్డి పద్మ (49) ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం, పూసపాటిపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు, ఆటోపై జామి మండలం భీమసింగి గ్రామానికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడివాడ కూడలి వద్దకు వచ్చేసరికి వారి ఆటోను వెనక నుంచి మరొక ఆటో బలంగా ఢీకొనడంతో అదుపుతప్పి ఆటో తిరగబడడంతో వలిరెడ్డి పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం అదే ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియపరచగా వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని భోరుమన్నారు. మృతురాలి కుమారుడు వలిరెడ్డి రాంబాబు డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీతంపేట: మండలంలోని సోమగండి గ్రామానికి చెందిన బాలింత నిమ్మక మాధురి (32) శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. రెండో కాన్పులో ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి పాలకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రిలో ప్రసవం కోసం కుటుంబసభ్యులు చేర్చగా వైద్యసిబ్బంది సిజేరియన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పచ్చకామెర్ల లక్షణాలు, యూరిన్ నిలిచిపోవడం,ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బిడ్డ క్షేమంగా ఉన్నాడు. మృతురాలికి భర్త శివకుమార్, మూడున్నరేళ్ల ఆరాధ్య అనే కుమార్తె ఉన్నారు. మాధురి పాలకొండ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. మాధురి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గజపతినగరం రూరల్: మండలంలోని దావాలపేట గ్రామ సమీపాన గల రైల్వే గేట్ వద్ద మూడు రోజుల క్రితం రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బండారు ఈశ్వరరావు ఆదివారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం, దావాలపేట గేట్మన్ ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని మృతదేహం రైల్వే ట్రాక్ సమీపంలో ఉండడాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో జీఆర్పీ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న ఆనవాళ్లు, ఆధారాలు సేకరించారు. ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా ముఖానందపూర్ గ్రామానికి చెందిన మమత ట్యాండ్ అలియాస్ బేగ్ద (37) మృతదేహంగా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ఈనెల 14వ తేదీన జునాగఢ్ నుంచి భువనేశ్వర్కు జునాగర్ ఎక్స్ప్రెస్లో మమతా బేగ్ ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు విజయనగరం రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ వి.బాలాజీ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధన ధరల పెంపుపై నిరసన
ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయనగరం మండలం, వీటీ అగ్రహారం గ్రామ సచివాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇంధన ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియగానే అమాంతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహనరావు మండిపడ్డారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఇది అటు వాహనదారులకు ఇటు సామాన్య ప్రజలకు ఇబ్బందేనన్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ ప్రకటించి, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. – విజయనగరం గంటస్తంభం -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం..
విజయనగరం ఫోర్ట్: పీఏసీఎస్ (ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు)ల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.కామేశ్వరావు అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 డిసెంబర్ 6 నుంచి 80 రోజుల పాటు నిర్వహించిన ఆందోళన సందర్భంగా పీఆర్సీలు, గ్రాట్యూటీ, ఇన్సురెన్స్ వంటి అంశాలపై హామీలు ఇచ్చినా.. తర్వాత జారీ చేసిన జీఓలు 112, 322 ద్వారా ప్రభు త్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. మోసపూరిత జీఓలు ద్వారా ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రానున్న కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. సమావే శంలో ఏఐటీయూసీ నాయకులు రంగరాజు, రెడ్డి సత్యారావు, బెల్లాన రామునాయుడు, డి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: స్థానిక పూల్బాగ్ లక్ష్మీగణపతి కాలనీలో వెలిసిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి చల్లదనం మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామునుంచే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సుమారు మూడు శతాబ్దాల నుంచి కొలువై ఉన్న మరిడిమాంబ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోందని ఆలయ ప్రాజెక్ట్ చైర్మన్ సముద్రాల నాగరాజు పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్దాంతి ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. సాంప్రదాయ జముకుల కళాకారులు అమ్మవారి చరిత్రను గానం చేస్తూ, నృత్యాలు చేస్తూ సాగిన ఊరేగింపు విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారా వు, బెహరా కూర్మారావు, దువ్వు శ్రీనివాసరా వు, ఎస్.అచ్చిరెడ్డి, పైడిరాజు పర్యవేక్షించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీతో జీవించే వారి పట్ల ఆదరణ భావం కల్గి ఉండాలని డీఎంహెచ్ ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. అంతర్జాతీ య ఎయిడ్స్ కొవ్వొత్తుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఆదివారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపకూడదన్నారు. అందరితో సమానంగా రాజ్యాంగం పొందుపరిచిన పౌర హక్కులు అన్ని పొందేటట్టు చూడాలన్నారు. హెచ్ఐవీ వచ్చే అన్ని మార్గాలను ఆపి వేయాలన్నారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పట్ల అవగాహన కల్గి ఉండా లన్నారు. హెచ్ఐవీ రోగులు క్రమం తప్ప కుండా మందులు వాడాలని, దీని వల్ల ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీపీఎం ఉమామహేశ్వరావు పాల్గొన్నారు. జియ్యమ్మవలస రూరల్: చినకుదమ, కుందరతిరువాడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ఇటీవల పెదబుడ్డిడి, చినబుడ్డిడి ప్రాంతాల్లో పంట ధ్వంసం చేసిన ఏనుగులు ఆదివారం ఇటువైపు రావడంతో రైతులు, ప్రయాణికులు భీతిల్లుతున్నారు. -
పైనాపిల్ సీజన్ ఆరంభం
సీతంపేట: గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారమైన పైనాపిల్ సీజన్ ఆరంభమైంది. సీతంపేట మన్యంలో అత్యధికంగా ఈనెల నుంచి ఆగస్టు వరకు దిగుబడి అవుతుంది. 7,300 ఎకరాల్లో పంట విస్తరించి ఉంది. దాదాపు 41 వేల టన్నుల పైనాపిల్ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రూ.15 నుంచి 18మధ్య ఒక్కో పండు ధర పలుకుతోంది. వారపు సంతలకు గిరిజనులు పైనాపిల్ పంటను తీసుకువస్తున్నారు. గతేడాది సీజన్ ఆరంభంలో రూ.20 ధర పలికి సీజన్ ముగిసే నాటికి రూ.5కు పడిపోయింది. దీంతో గిరిజనులు అవస్థలు పడ్డారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో బాగంగా మిశ్రమ పండ్ల తోటల్లో ఈ పంట అంతరపంటగా సాగు చేస్తున్నారు. కోడిశ, కుశిమి, ముత్యాలు, శంభాం, అక్కన్నగూడ, రాజన్నగూడ, జోగైనాయుడుగూడ, కోడిశ. తొత్తడి, రామానగరం, అంటికొండ,పొల్ల, దోనుబాయి, మానాపురం తదితర గిరిజన గ్రామాల్లో విస్తారంగా పైనాపిల్ తోటలను వేశారు. ఈ తోటల పెంపకానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు అవసరం లేకపోవడంతో గిరిజనుల్లో ఈ పంటపై నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. సీజన్లో గిరిజనులకు మంచి ఆదాయం వస్తుంది. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు గిరిజనులు విక్రయిస్తారు. దళారీ వ్యాపారులు సంతలకు వచ్చి పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన పైనాపిల్కు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసి లారీలు, వ్యాన్లలో తరలించుకుపోయి వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తారు. ఒక్కో పండుపై కనీసం రూ.10 నుంచి 15 వరకు లాభాలు వస్తాయని వ్యాపారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు సిండికేట్ మారి ధరలు తగ్గించడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. వారపు సంతలకు తెచ్చిన పైనాపిల్ ఏమాత్రం నాణ్యత లోపించినా కొనుగోలు చేయరని గిరిజనులు తెలిపారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమిలలో వారపు సంతలు జరుగుతాయి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీజన్ ఆరంభంలో గిరిజనులకు ముందు అడ్వాన్సులు ఇచ్చి పంటలను స్వాధీనం చేసుకోవడంతో ఇతరులెవరీకీ విక్రయించడానికి అవకాశముండదని గిరిజనులు తెలిపారు. గతంలో ఇలా... ఐటీడీఏ చొరవతో రెండేళ్ల కిందట ఇతర జిల్లాల్లో 41రైతు బజార్లలో వీటిని రైతు సంఘాల గ్రూపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి గిరిజనులకు ఆదాయం వచ్చే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఎఫ్పీవోల ద్వారా రైతులను నుంచి గ్రేడ్ ను బట్టి రూ.15కు తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఐటీడీఏ, ఉద్యానవనశాఖ, వెలుగు వంటి శాఖలు పైనాపిల్కు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. 7,300 ఎకరాల్లో సీతంపేట ఏజెన్సీలో విస్తరించి ఉన్న పంట 41వేల టన్నుల దిగుబడి నాణ్యతను బట్టి రూ.15–18మధ్య పలుకుతున్న ఒక్కో పండు పట్టణ ప్రాంతాల్లో రూ.40 వరకు విక్రయం ఏటా సీజన్ ఆఖరులో రూ.5కు పడిపోతున్న పండు ధర ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలుతున్న పంట గిరిజన రైతుల ప్రధాన ఆదాయవనరు పైనాపిల్ రైతులను ఆదుకోవాలిపైనాపిల్ రైతులను మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఇక్కడే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది. ఈ పంటే జీవనాధారమై బతుకుతున్న గిరిజనులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నేరుగా ఐటీడీఏ ద్వారా పైనాపిల్ కొనుగోలు చేయించి మార్కెటింగ్ చేయించాం. దీంతో గిరిజనుల ఆదాయ వనరులు మెరుగయ్యాయి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండమార్కెటింగ్కు చర్యలు: పైనాపిల్కు సంబంధించి గిరిజనులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు గిరిజన రైతులతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలిస్తున్నాం. మారిషస్ అనే పైనాపిల్ వైరెటీని గతేడాది 70 ఎకరాల్లో వేయించాం. ఈ సంవత్సరం 500 ఎకరాల్లో విస్తరింప చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఎస్.వి.గణేష్, పీహెచ్వో, సీతంపేట ఐటీడీఏ పంట దిగుబడి బాగుంది ఈ సంవత్సరం కూడా పైనాపిల్ పంట మంచి దిగుబడి వచ్చింది. ధరలే వారం, వారం తగ్గుముఖం పడుతున్నాయి. ధరల్లో నిలకడ ఉండడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎస్.రమేష్, ముత్యాలు -
క్రీడల్లో సత్తాచాటిన రేగిడి విద్యార్థులు
రేగిడి: మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించారని పాఠశాల పీడీ కోటిచక్రధరరావు ఆదివారం విలేకరులకు తెలిపారు. విజయవాడలో జరిగిన అండర్–17 కేటగిరీలో గుండాల సాగర్, అండర్ –19 విభాగంలో కడగల కార్తీక్ ట్రైఅథ్లాన్ విభాగంలో షూటింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ కాంబినేషన్లో పాల్గొన్నారని తెలిపారు. కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించగా సాగర్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడని తెలిపారు. వారు మోడ్రన్ పెంటాథ్లాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారని పీడీ వెల్లడించారు. విద్యార్థుల ప్రతిభపట్ల ఎంఈఓలు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
భూములిచ్చిన రైతులపైకి బుల్డోజర్లా...
● చంద్రబాబు మార్కు పాలనకు నిదర్శనం ● ప్రభుత్వ తీరు దుర్మార్గం ● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పూసపాటిరేగ : భోగాపురం గ్రీన్ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులను బుల్డోజర్తో నెట్టి వేయడం దుర్మార్గం అని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నా రు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన కలిశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాలకు అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్ఫీల్డు ఎయిర్పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనేక మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. అయితే బైరెడ్డిపాలెంలో అప్రోచ్ రోడ్ కోసం భూములు ఇచ్చిన 20 కుటుంబాలకు రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ రేటుతో బ్యాంకులో పరిహారం జమ చేస్తామని రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూమి తప్పా ఎటువంటి ఆధారం లేని కుటుంబాల పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబాలపై అధికారులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. బాధితులపైకి జేసీబీ, బుల్డోజర్లు ఎక్కించడానికి ప్రయత్నించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తిని అబివృద్ధి కోసం త్యాగం చేస్తే పోలీసులతో బెదిరించడం అన్యాయం అన్నారు. ఎయిర్పోర్టులో బడాబాబులకు అనుకూలంగానే భూసేకరణ జరగడంతో లాభపడి నిరుపేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాధితులను నడిరోడ్డుపై వదిలేసిన స్థానిక నాయకుల తీరును ఆక్షేపించారు. కోర్టులు పేరుతో సాగదీయకుండా పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ప్రకారం ఎకరాకు రూ.80 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీ రమణ, పార్టీ మండల బాధ్యులు బచ్చల సూర్యనారాయణ, బైరెడ్డిపాలెం బాధిత రైతులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రసన్న
విజయనగరం టౌన్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. గతంలో వాసవీ క్లబ్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, విజయనగరం కంటోన్మెంట్ ఆర్యవైశ్య సేవా సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె సేవలందించారు. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ గతేడాది రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇనిస్పిరేషన్ అవార్డ్ తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ మహిళా పురస్కారాన్ని స్వీకరించారు. గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్ విజయనగరం పోటీల్లో విజేతగా ఆమె నిలిచారు.బేత లల్లూపై పీడీ యాక్ట్విజయనగరం క్రైమ్: చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టయిన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ (23)పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. నగరంలోని శివాలయంవీధికి చెందిన బేత లల్లూ 2023 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని 2 గంజాయి అక్రమ రవాణా కేసులు, 3 దొంగతనాల కేసులు, ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడి నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. లల్లూపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ విజయనగరం వన్ టౌన్ పోలీసులు డీపీఓకు ప్రతిపాదనలు పంపగా, వాటిని సిఫార్సు చేస్తూ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అదేశాలతో నిందితుడు బేత లల్లూను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని ఎస్పీ వివరించారు. 8మంది జూదరుల అరెస్టుబలిజిపేట: మండలంలోని గౌరీపురం దాటిన తరువాత మామిడి తోటలో జూదం ఆడుతున్న 8మందిని పట్టుకున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గౌరీపురం గ్రామం దాటిన తరువాత ఉన్న మామిడి తోటలో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేశారు. ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి రూ.22,500లు స్వాధీనం చేసుకున్నారు. జూదరులు వీరఘట్టం, వంగర తదితర ప్రాంతాలకు చెందిన వారని, వారిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలువిజయనగరం టౌన్: జిల్లాలోని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన 500 మార్కులు పైబడి పదోతరగతిలో మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. నాయీబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సత్కారంతో పాటు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ చదువుతోనే విజ్ఞానం, అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ జీవితాలను మార్చుకోవాలంటే ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పెదపెంకి శివ ప్రసాద్, వెంకట పద్మనాభం, పడాల రమణ, అప్పారావు, టీవీ దుర్గారావు, దిమిలి పైడిరాజు, షణ్ముఖరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దిమ్మిడిజోల సమీపంలోకి ఏనుగులుభామిని: తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న ఏనుగుల గుంపు విచ్చల విడిగా తిరుగాడుతున్నాయి. ఆదివారం భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు వచ్చి కళ్లాల్లోని చేల కుప్పలు పాడుచేశాయి. అనూహ్యంగా దిమ్మిడిజోల గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు చూడడానికి పరుగులు పెట్టారు. వేసవి తీవ్రతకు అల్లాడుతున్న ఏనుగుల గుంపు ప్రజలను చూసినా ఏమీ అనకుండా చేను మేయడంలో తలమునకలయ్యాయి. -
వ్యవసాయ శాఖలో వింత పోకడ..!
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నోరెత్తితే చాలు నీతి, నిజాయితీ గురించి వల్లె వేస్తారు. సత్యహరిశ్చంద్రునికి అన్నదమ్ముడి మాదిరి వ్యవసాయ శాఖను పారదర్శకంగా నడిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. గురవింద గింజ తన కింద మచ్చను చూడని విధంగా వ్యవసాయ శాఖలో అనేక అక్రమాలు జరుగుతు న్నా పట్టించుకోకుండా వాటిని కప్పిపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖలో జరుగుతు న్న తంతు వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు రైతులను విస్తుగొల్పుతుంది. గజపతినగరం ఏడీఏగా పని చేసిన నిర్మలాజ్యోతి, ఆమె భర్తతో కలిసి నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయాన్ని ప్రోత్సహించారని వ్యవసాయ శాఖ సిబ్బందే వ్యవసాయ శాఖ కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యవసాయ సిబ్బంది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆ శాఖ కమిషనర్ విచార ణకు ఆదేశించారు. కమిషనర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏడీఏ సెలవు పెట్టేశారు. విచార ణ నుంచి తప్పించుకునేందుకు సెలవు పెట్టేశార నే ఆరోపణలు ఉన్నాయి. ఆమె సెలవు పెట్టడంతో విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ గా పనిచేస్తున్న గాలి శ్రీనివాస్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మూడు రోజులు క్రితం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏగా నిర్మలా జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. దీంతో వ్యవసా య శాఖలో పనిచేసే సిబ్బంది, సహచర అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయానికి సహకరించారనే సంచలన ఆరోపణలు వచ్చిన ఏడీఏకు జిల్లా కేంద్రంలో అది కూడా విచారణ పూర్తి కాకుండానే పోస్టింగ్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరే గుతున్నాయి. సాధారణంగా అంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీ చేయడమో.. లేదా సరెండర్ చేయడమో చేస్తారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాఖలో అక్రమార్కులకు అందలం ఎక్కించే విధంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గజపతినగరం ఏడీఏ నిర్మలాజ్యోతికి విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా వ్యవసాయ శాఖ కమిషనర్ నియమించారు. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు. – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
విజయనగరం
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026తూతూ మంత్రంగా.. కిశోరీ వికాసం! గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారమైన పైనాపిల్ సీజన్ ఆరంభమైంది. సీతంపేట మన్యంలో అత్యధికంగా ఈ నెల నుంచి ఆగస్టు వరకు దిగుబడి అవుతుంది. –8లోరామభద్రపురం: కిశోరీ బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరీ వికా సం కార్యక్రమం తూతూ మంత్రంగా సాగుతుంద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్య దశలోనే లైంగిక వేధింపులు, పదో తరగతి పూర్తికాక ముందే మూడు ముళ్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు అనేక రకాల వేధింపుల వంటి చర్యలతో ఏం చేయా లో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు కిశోరీ వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కార్యక్రమం నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం పైసా నిధులు విదల్చని పరి స్థితి ఉంది. నిధులు కొరతతో మంచి ఆశయంతో కౌమార దశలో ఉన్న బాలబాలికల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిశోరీ వికాసం కార్యక్రమం గాడి తప్పుతోంది. అంగన్వాడీ టీచర్లు వారి సొంత డబ్బులు వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. ఫొటోలకు పోజిలిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో ఈ నెల 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు 11 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాలలోపు బాలురకు గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. ఇందులో విద్య, ఆరోగ్యం, సచివాలయం, మెప్మా, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, ఆర్పీలు భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే ఐసీడీఎస్ అధికారులు బాల, బాలికలకు కలిపి ఉదయం పూటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎగ్గొట్టేస్తున్నారని తెలిసింది. ఈ కార్యక్రమంలో కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది కూడా గైర్హాజరవుతున్నార న్న విమర్శలు లేకపోలేదు. పర్యవేక్షణ లోపం అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శిబిరాల నిర్వహణపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు కనీస అవగాహన లేకుండా పొవడంతో పాటు కిశోరీ వికా సం వేసవి శిబిరాల ఆశయం నేరవేరడం లేదు. బాల బాలికలను బృందాలుగా విభజించి అందులో సభ్యులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం. స్వీయ అవగాహన ద్వారా తనను తాను తెలుసుకోవడం, ఆత్మ విశ్వాసం పెంచేలా చేయడం. ఆరోగ్య మేళా, రక్తహీనత, కిశోరీ బాలికల ఆరోగ్య సమస్యల నివారణపై అవగాహన కల్పించడం. సమాజంలో పిల్లలు ఎదుర్కొనే వ్యక్తిగత, సమూహ అవసరాలు, సవాళ్లను అధిగమించడం, ధైర్య సాహసాలు పెంపొందించడం. దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు. పోక్సో చట్టం, పీసీఎంఏ చట్టం, డీవీ, ఆర్టీఈ చట్టాలపై అవగాహన. పొదుపు అలవాట్లు, క్రీడలు, యోగా ప్రాముఖ్యం. సైబర్ భద్రత, ఆన్లైన్ భద్రతపై అవగాహన, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలు వివరించడం. బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్య ప్రోత్సాహం తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ఆదేశించిన అన్ని శాఖల సిబ్బంది అందరూ కలిసి చిత్తశుద్ధితో కిశోరీ వికాసం కార్యక్రమం నిర్వహించాలి. కార్యక్ర మం నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. కిశోరీ వికాసం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. – బాలామణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం -
ఏజెన్సీలో ఆగని.. గిరిజన విద్యార్థుల మరణాలు
కొమరాడ మండలం ● 2024 సెప్టెంబర్ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతి చెందింది.కురుపాం మండలం ● 2024 నవంబర్ 6వ తేదీన కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు)లో నాల్గో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ● 2025 సెప్టెంబర్ 26వ తేదీన కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతిచెందింది. ● 2025 సెప్టెంబర్ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్లో మృతిచెందింది.జియ్యమ్మవలస మండలం ● 2024 నవంబర్ 6న రావాడ రామభద్రపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్ కుమార్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. ● నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మతిచెందాడు.గుమ్మలక్ష్మీపురం: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో పలువురు అనారోగ్యం కారణంగా మృతి చెందుతుండడం దురదృష్టకరం. కొంతమంది విద్యార్థులు పాఠశాలలు నడుస్తున్న వేళల్లో అనారోగ్యం బారిన పడి మృతిచెందగా.. మరికొంత మంది విద్యార్థులు వేసవి సెలవులకు ఇంటికి వెళ్లినప్పటికీ అనారోగ్యం బారిన పడి మృతిచెందుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు కానరావడం లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రుల కలలు కలగానే మిగిలిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం హయాంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో చదువుతూ మృతి చెందిన విద్యార్థుల వివరాలు వేసవి సెలవుల్లోనూ.. నలుగురు విద్యార్థుల మృతి ఈ ఏడాది వేసవి సెలవులు ఇచ్చిన 23 రోజుల్లోనే గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలకు చెందిన నలుగురు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు మృతిచెందారు. ఈమేరకు కురుపాం మండలం నీలకంఠాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక రాహుల్, దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలకు చెందిన జి.అఖిల్, దొరజమ్ము ఆశ్రమ పాఠశాలకు చెందిన నిమ్మక అసిరయ్యలతో పాటు గుమ్మలక్ష్మీపురం కేజీబీవీకి చెందిన పత్తిక సుస్మిత ఆయా అనారోగ్య కారణాలతో మృతిచెందారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి గిరిజన విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు కానరాకపోవడం పట్ల గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచైనా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 23 రోజుల్లోనే నలుగురి మృతిగుమ్మలక్ష్మీపురం మండలం 2024 జూలై 21వ తేదీన వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్ (9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు. 2024 అక్టోబర్ 2వ తేదీన పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2024 డిసెంబర్ 17వ తేదీన దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినేష్(14) పచ్చకామెర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మృతిచెందాడు. 2025 డిసెంబర్ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్న టి.అవిష్ అనారోగ్యంతో మృతిచెందాడు. 2026 జనవరి 7వ తేదీన రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప బ్రీతింగ్ ప్లోబ్లంతో పాటు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. -
సరికొత్తగా నగర స్వరూపం
విజయనరగం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని మున్సిపల్ శాఖ జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 62కు పెంచేందుకు కసరత్తు పూర్తి చేశాం. ఇప్పటికే దీనిపై ఒక అవగాహన కలిగి ఉన్నాం. తయారు చేసిన జాబితాను ప్రచురించి న అనంతరం అభ్యంతరాలు స్వీకరించి ఉన్న తాధికారులకు పంపిస్తాం. అనంతరం కలెక్టర్ అనుమతితో కమిషనర్ అండ్ డెవెలప్మెంట్ మున్సిపల్ అథారిటీకి పంపిస్తాం. – హరిబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ముఖచిత్రం విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. 2011 జనాభా లెక్కలను అనుసరించి మా ర్పులు చేస్తుండగా.. అన్నింటా ఒకే విధంగా జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రణాళికా విభాగం నుంచి వివరాలు తీసుకుని.. హద్దులు నిర్ణయించే ప్రక్రియను పూర్తిచేశారు. సోమవారం డ్రాఫ్ట్ ప్రతిపాదిత డివిజన్ల పునర్విభజ న జాబితాను ప్రచురించనుండగా... ఆ తర్వాత వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 10 రోజుల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఆపై వాటిని ఖరారు చేసి.. రిజర్వేషన్లపై దృష్టి సారించనున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల విభజన ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వ చ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తు తం ఉన్న 50 డివిజన్లను 62 డివిజన్లుగా విభజించారు. ఒక్కో డివిజన్లో గరిష్టంగా 4000మంది జనాభా ఉండేలా సరిహద్దులు నిర్ణయించారు. ఆయా ప్రతిపాదనలను సోమవారం ప్రచురించనున్నారు. డ్రాఫ్ట్లో ప్రతి కాలనీ పేరు, ప్రాంత పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారో.. లేదో.. చూడా ల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాజకీయ పక్షాలు,ప్రజ ల నుంచి అభ్యంతరాలు వస్తే మరల సరిచేయాల్సి వస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం మారనుంది. ఇప్పటి వరకు 50 డివిజన్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 12 డివిజన్లు పెరిగాయి. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 62కు చేరనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఈ ప్రక్రియకు సంబంధించిన జీఓను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని దానికి 10 శాతం జనాభాను కలిపి డిజిజన్ల సంఖ్యను పెంచినట్లు జీఓలో పేర్కొంది. దీని ప్రకారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో జనాభా 2011లో 2,44,598 మంది ఉన్నారు. దీనికి పది శాతం కలిపితే 2.69లక్షలకు పైగా జనాభా అవుతుంది. వాస్తవానికి అంతకు మించి జనాభా ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లెక్కలు వేయటం గమనార్హం. ఈ లెక్కన నగరంలో డివిజన్లు 50 నుంచి 62కు పెరగనున్నాయి. నగరం, పట్టణాల్లో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుండటంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది. గత ఎన్నికల్లో చాలా మంది టికెట్లు ఆశించి భంగప డ్డారు. అప్పట్లో వార్డుల సంఖ్య తక్కువగా ఉండటం, పోటీపడేవారు ఎక్కువ మంది ఉండటంతో చాలా మంది చివరి నిమిషంలో అవకాశాలు కోల్పోయారు. రానున్న ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే డివిజన్ల పెంపు ఎవరికి కలిసి వస్తుందో... ఎవరికి కొంప ముంచుతుందో వేచి చూడాల్సి ఉంది. విజయనగరం మున్సిపల్ ప్రస్థానం 1888లో మొదలైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో మున్సిపల్ అసోసియేషన్ ఏర్పడింది. ఆ తరువాత వివిధ పార్టీల ఆధారంగా 1974లో తొలి మున్సిపల్ ఎన్నికలు 27 వార్డులకు జరిగాయి. 1971వరకు సోషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా ఉండేది. 1998లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాల్టీగా పార్టీగా మారింది. 40 వార్డులుగా విభజించారు. 2019లో నగరపాలక సంస్థగా మారింది. 50 డివిజన్లను చేసి 2020లో ఎన్నికలను నిర్వహించారు. తాజాగా 62 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓ చేసింది. -
మద్దతు గోరంత..!
● అరకొరగా మద్దతు ధర పెంపు ● వరి క్వింటాకు పెరిగిన ధర రూ.72 ● మొక్కజొన్నకు పది రూపాయలు పెట్టుబడి కొండంత..పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వంలో సాగుబడి నానాటికీ కుదేలవుతోంది. రాబోయే ఖరీఫ్ సీజన్ (2026–27)కు సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు అన్నదాతల కష్టాలను తీర్చేలా లేకపోగా, వారిని మరింత కుంగదీసేలా ఉన్నాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపు అవుతుండడం, కూలీల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పెట్టుబడులు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధరలు కంటితుడుపు చర్యగానే మిగిలాయి. దీనికి తోడు స్థానికంగా మార్కెట్లను క్రమబద్ధీకరించడంలో, రైతులకు అండగా నిలవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆవేదన రైతుల నుంచి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. నామమాత్రంగా ధరల పెంపు.. ఈ ఖరీఫ్లో ప్రధాన పంట అయిన సాధారణ రకం వరి క్వింటాకు కేవలం రూ.72 మాత్రమే పెంచడంతో ప్రస్తుత ధర రూ.2,441కి చేరింది. గ్రేడ్–ఎ రకం వరి ధరను రూ.2,461గా నిర్ణయించారు. దీని ప్రకారం మార్కెట్లో 80 కేజీల ధాన్యం బస్తా ధర రూ.1,952 మాత్రమే పలకనుంది. ఇక అత్యధికంగా సాగయ్యే మొక్కజొన్నపై కేవలం రూ.10 (ప్రస్తుత ధర రూ.2,410), పెసరపై రూ.12 (ప్రస్తుత ధర రూ.8,780) మాత్రమే పెంచడం గమనార్హం. పత్తికి రూ.8,667, కందులుకు రూ.8,450, మినుములకు రూ.8,200 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ..ఆయా పంటల పెట్టుబడి వ్యయంతో పోలిస్తే ఇవి ఏమాత్రం సరిపోవని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. . భారమవుతున్న సాగు జిల్లాలో సుమారు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు, ఎరువుల లభ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు పెట్టుబడి భారం రెట్టింపైంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ఉధృతితో పంట దిగుబడులు పడిపోతుంటే, మరోవైపు పెరిగిన కూలి రేట్లు సాగును మరింత కష్టతరం చేస్తున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో, చివరకు దళారులు అడిగిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు బోనస్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమను ఆదుకోవాలని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. -
తాగునీరు లేక అల్లాడిపోతున్నాం..
● ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఎల్.కోట మేజర్ పంచాయతీ ప్రజలు లక్కవరపుకోట: లక్కవరపుకోట మేజర్ పంచాయతీ ప్రజలు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటిని శనివారం తెల్లవారుజామున ముట్టడించారు. కొద్ది రోజులుగా తాగునీరు లేక అల్లాడిపోతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు. కొద్దిసేపటి తర్వాత జామివీధి, సంఘం వీధిలో ఎమ్మెల్యే పర్యటించి మహిళలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. వెంటనే అర్డబ్ల్యూఎస్ డీఈ పైడిరాజు, ఎంపీడీఓ అల్లు భాస్కరరావుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నిబంధనలు గాలికి.. ప్రమాదాలు ప్రజలకి..
రాజాం: రాజాం పట్టణంతో పాటు చుట్టుపక్కల స్క్రాబ్ వ్యాపారాలు అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా ఈ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేయడంతో చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దగ్గర్లోని సచివాలయాలు, అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యాపారాలు మరింత భయానక వాతావరణంలో జరుగుతున్నాయి. నిషేధిత వ్యర్థాలతో కూడిన వస్తువులు కొనుగోలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తరచుగా ప్రమాదాలు ఇటీవల రాజాంలో స్క్రాబ్ వ్యాపారాల వద్ద తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట మండలంలోని వీఆర్ అగ్రహారంలో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకర కెమికల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. అంతకుముందు రాజాం పట్టణంలో ఓ షాపు వద్ద కూడా ఇలానే అగ్నిప్రమాదం జరిగింది. దగ్గర్లో నీటి సదుపాయం ఉండడంతో మంటలను అదుపుచేశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. నిబంధనలు బేఖాతరు ఇటీవల ఫైర్ శాఖాధికారులు రాజాంలో స్క్రాబ్ షాపులను తనిఖీ చేశారు. రాజాం పట్టణంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో 30కి పైగా షాపులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ వ్యాపారాలకు జీఎస్టీ గుర్తింపు, కార్మికశాఖ, మున్సిపల్, సచివాలయాల అనుమతులు ఉండాలి. కాని అవేమీ లేవు.అలాగే ఇనుము, ప్లాస్టిక్ వస్తువుల కొనుగోలుకే వేర్వేరుగా అనుమతులిస్తారు. కెమికల్స్ వస్తువులు అస్సలు కొనుగోలు చేయరదు. జనావాసాలకు దూరంగా స్క్రాబ్ వస్తువులు నిల్వ చేయాలి. కాని ఏ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడం లేదు. ఫిర్యాదులున్నా పట్టించుకోరే.. రాజాం మండలం పెనుబాక గ్రామ పరిధి కొత్తవలస రోడ్డులో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద ప్రమాదకర రీతిలో ప్లాస్టిక్ నిల్వలున్నాయి. వీటిని అడ్డుకోవాలని, ఇక్కడ రాత్రి సమయాల్లో భారీగా అక్రమ సరుకు రవాణా అవుతోందని అటు మున్సిపల్, ఇటు పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకూ స్పందించలేదు. జీఎస్టీ లేకుండా వేరే ఫార్మా కంపెనీల పేర్లతో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వీఆర్ అగ్రహారం స్క్రాబ్ షాపులో ప్రమాదం అనంతరం పొగిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న షాపుపై గ్రామ సచివాలయంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటాం.. రాజాంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో స్క్రాబ్ షాపుల్లో తనిఖీలు చేశాం. నిబంధనలు పాటించని వారికి అవగాహన కల్పించాం. కొన్నిచోట్ల ప్రమాదకర ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్ సామాగ్రి నిల్వలు అధికంగా ఉన్నాయి. వీటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. పి.అశోక్, ఫైర్ అండ్ సేప్టీ అధికారి, రాజాం. -
మహిళలంటే ఎందుకంత చులకన..!
విజయనగరం: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగదని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మండిపడ్డారు. నాడు ఓట్ల కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ మాట ఇచ్చిన నాయకులు, నేడు ఆ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఉచిత ప్రయాణంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకోవాలని డిమాండ చేశారు. ప్రయాణికుల రద్దీకి తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్టీసీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలో మహిళల ఆత్మగౌరవం పెరిగేలా పాలన సాగిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. పేరుకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవసరమైన బస్సులు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతో దురదృష్టవశాత్తూ ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, నగర మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, మహిళా విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు తప్పని పాట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: పట్టణాల సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ’సాసా’, ’స్వచ్ఛ భారత్ – స్వర్ణ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, పర్యావరణ అవగాహన ర్యాలీల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక మున్సిపల్ పార్కును సందర్శించిన కలెక్టర్.. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాత, పనికిరాని టైర్లతో సృజనాత్మకంగా రూపొందించిన ఆట పరికరాలను పరిశీలించారు. వ్యర్థాలను పర్యావరణహితంగా, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడంపై అధికారులను అభినందించారు. పార్కును నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల భద్రతకు ఎక్కడా లోటు లేకుండా ఆట స్థలాలను పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ప్రదర్శనలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కొద్ది దూరానికి కూడా వాహనాలు వినియోగించవద్దని సూచించారు. ఒకే ప్రాంతానికి వెళ్లేవారు ’కార్ పూలింగ్’ విధానాన్ని అవలంభించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. భవిష్యత్లో విద్యుత్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపాలని, ఇందుకు అనుగుణంగా పట్టణంలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాల అనవసర వినియోగాన్ని తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత నగరమే ధ్యేయంగా శివాలయం వీధి చెరువు పరిసరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సైకిల్ ర్యాలీలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణలో (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానాన్ని అమలు చేయడమే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రజల సహకారం అవసరమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ ఆర్. వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
బీచ్ కబడ్డీలో సత్య కాలేజ్ విద్యార్థినుల సత్తా
విజయనగరం గంటస్తంభం: నెల్లూరు జిల్లా దువ్వురు – సంగం మండలాల ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులుప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జరిగిన మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ పోటీల్లో కళాశాలకు చెందిన బి.నీలిమ ( ఫైనల్ బీఏ) అత్యుత్తమ ఆటతీరుతో చాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో శనివారం జరిగిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి గోపాలరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు. నమ్మించి మోసం చేశారు.. శృంగవరపుకోట: అమాయకులమైన తమను నమ్మించి, బెదిరించి, భూములు అమ్మించి పరిహారం తినేశారని మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు వాపోయారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుకు నిరసనగా ఉరి తాళ్లు బిగించికుంటూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిందాల్ భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులు తామరపల్లి రాము, గౌరమ్మ, సోమేష్, సిరగం బుదరయ్య, సన్యాసిదేముడు, ముత్యాలు, జె.గౌరీష్ మాట్లాడుతూ.. గిరిజనులకు చెందిన 27 ఎకరాల భూమిని అమ్మేసి, గుట్టు చప్పుడు కాకుండా పరిహారాన్ని తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. సొమ్ములు స్వాహా చేసిన బినామీలు ముదునూరు సత్యనారాయణవర్మ, ముదునూరు వరలక్ష్మి, వెంపటాపు అప్పలనాయడు, చల్లా రాములపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే గిరిజన సంఘాల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మొద్దు డెంకాడ: సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. మండలంలోని పినతాడివాడలో ఉపాధి హామీ పథకం పనులు జరిగిన చోటుకు శనివారం వెళ్లి, సైబర్ నేరాలు–వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిరక్షరాస్యులు, అక్షరాస్యులనే తేడా లేకుండా ప్రతిఒక్కరికీ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలు అడిగే అవకాశం ఉందని, పొరపాటున కూడా ఆ వివరాలు ఇవ్వొద్దన్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దన్నారు. అలాగే మహిళల భద్రతకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని, బాల్యవివాహాలు చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ను ప్రోత్సహించవద్దని కోరారు. నందిగుడ్డి కాలనీవాసులతో..విజయనగరం క్రైమ్: స్థానిక రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని నందిగుడ్డి కాలనీవాసులతో సీఐ శ్రీనివాస్ శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కాలనీ నుంచే పలు నేరాలకు సంబంధించిన నిందితులు వచ్చినట్లు తమ విచారణలో తేలిందని, పౌరులంతా మంచి అలవాట్లు అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు. -
ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి
● ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహనరావువిజయనగరం గంటస్తంభం: మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు వాహనాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డ్రైవర్లు, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. జగన్ మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక రింగ్రోడ్ డంపింగ్యార్డు వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డ్రైవర్ల వేతనాలు పెంచడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిపై జీఓలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ వాహనాలను ఔట్సోర్సింగ్కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో కార్మికులను అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి
చీపురుపల్లిరూరల్(గరివిడి): పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాపై వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్లు, నాయకులు దృష్టిసారించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిశానిర్ధేశం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్తో కలిసి గరివిడిలోని పార్టీ కార్యాలయంలో మెరకముడిదాం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ క్లస్టర్,డివిజన్ ఇన్చార్జ్లు,బూత్ ఏజెంట్లతో శనివారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు,పేర్ల మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై బూత్స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకుని పార్టీకి మరింత బలం చేకూరేలా పని చేయాలని అన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు,మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, నాయకులు తాడ్డి వేణు,బూర్లె నరేష్కుమార్,హరిబాబు, రాము, ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. -
దళారీలను నమ్మవద్దు..
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ జామి: దళారీలను నమ్మి మోసపోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్.కోట బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందకపోయినా, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోయినా నేరుగా న్యాయసేవా కేంద్రంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ కేంద్రం ద్వారా ఉచితంగా సేవలందిస్తామని చెప్పారు. ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి బి.కనకలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ న్యాయసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కోర్టులను ఆశ్రయించవద్దని.. వీలైనంతవరకు గ్రామపెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఎం.దొరబాబు, బి.వెంకటరావు, జి.చిట్టిబాబు, శివ,ప్రసాద్, తహసీల్దార్ వి.కృష్ణంరాజు, ఎంపీడీఓ ఎన్.అప్పలనాయుడు, ఎస్సై వీరజనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
● ప్రతి నెలా పంపిణీ కాని పింఛన్ల వివరాలు అందించాలి ● స్థాయి సంఘం సమావేశంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం రూరల్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగిలే అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన శనివారం స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణం, ప్రణాళిక, ఆర్థిక సంఘం, వ్యవసాయ సంఘం, విద్య, వైద్య సంఘం, సంక్షేమ సంఘం, మహిళా శిశు సంక్షేమ సంఘం, కమ్యూనికేషన్లు, పనులు, తాగునీరు, పారిశుధ్య సంఘాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ డీఆర్డీఏ పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు, అప్పుల వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. వ్యవసాయం, నీటి పారుదల సమీక్షలో భాగంగా రాబోయే వర్షాకాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సాగునీటి విడుదలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు గోనె సంచులకు చెల్లించాల్సిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పురోగతిపై చర్చించారు. పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా నాలుగు మరణాలు సంభవించడం విచారకరమని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పనుల వద్ద నీడ, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన గృహ ప్రవేశాలు, కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను అధికారులు సభ్యులకు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఇ.నాగలక్ష్మి, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేద రైతులపై.. ప్రభుత్వం ఉక్కుపాదం
పూసపాటిరేగ: భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో నిరుపేద రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యంత్రాలతో బలవంతపు భూసేకరణ చేయడానికి ప్రయత్నించడంతో రెండు రోజులుగా ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం చెల్లించకుండానే జిరాయితీ భూములులో పనులు ప్రారంభించడంతో గ్రామానికి చెందిన బైరెడ్డి అప్పలనర్సయ్య అనే వృద్ధ రైతు పనులు అడ్డగించారు. తమకు చెందిన భూములకు సంబంధించి పరిహారం తీసుకోకపోయినా బలవంతంగా భూసేకరణ చేయడానికి ప్రయత్నించడంతో రోడ్డున పడ్డామని బైరెడ్డి అప్పలనర్సయ్య, శీరపు అప్పయ్యమ్మ, బైరెడ్డి పెంటయ్య, బైరెడ్డి సూరి, బైరెడ్డి అప్పలరాములు, బైరెడ్డి దుర్గయ్య, బైరెడ్డి అప్పన్న, సరగడ రాముడులు వాపోయారు. కంచేరు రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబరు 72–11, 72–16లో బలవంతపు భూసేకరణ చేస్తున్నారని శుక్రవారం పనులు అడ్డుకున్న బైరెడ్డి అప్పలనర్సయ్య కుటుంబాన్ని జేసీబీ బకెట్తో పక్కకు నెట్టారు. భోగాపురం ఎస్ఐ పాపారావు, జీఎంఆర్ సిబ్బందితో కలిసి శనివారం ఎయిర్పోర్టు రహదారి నిర్మాణ పనులు మరలా ప్రారంభించారు. పరిహారం తీసుకోకుండానే బలవంతంగా భూసేకరణ చేయడం దుర్మార్గం అని, సర్కారు బలవంతపు భూసేకరణ దారుణమని వాపోయారు. బడాబాబుల భూములు తప్పించి ఎయిర్పోర్టు అప్రోచ్ రహదారి వాస్తవానికి అటాచ్ రోడ్డుకు కనెక్టింగ్ వేరే మార్గం ద్వారా ఇవ్వాల్సి వుండగా, కేవలం ఆ మార్గంలో బడాబాబుల భూములు వుండటంతో నిరుపేదల భూముల వైపు ప్రతిపాదనలు మార్చి రహదారి నిర్మాణానికి పూనుకొన్నారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతులనే లక్ష్యంగా చేసుకొని భూసేకరణ చేశారన్నారు. తక్షణమే నిరుపేద రైతులకు ప్రభుత్వ న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ హరి వద్ద ప్రస్తావించగా ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్కు సంబంధించిన విషయం కోర్టులో ఉందని తెలిపారు. బైరెడ్డిపాలెంలో ఆయా రైతులకు జూన్ 15 తరువాత పరిహారం మంజూరు అవుతుందని చెప్పారు. బైరెడ్డిపాలెంలో దాష్టీకం బలవంతపు భూసేకరణను అడ్డుకున్న రైతులు రెండు రోజులుగా ఎయిర్పోర్టు రహదారి నిర్మాణ పనుల్లో ఉద్రిక్తత పోలీసు పహరాలో పనులు -
● ఒక్కసారిగా తగ్గిన ధర ● సీజన్ ఆరంభంలో టన్ను ధర రూ.60 వేలు ● ప్రస్తుతం రూ.20 వేల నుంచి 30 వేలుకు పడిపోయిన వైనం ● జిల్లాలో 32 వేల హెక్టార్లలో సాగు ● గణనీయంగా తగ్గిన దిగుబడి
దిగుబడి తగ్గింది గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తగ్గిపోయింది. నేను నాలుగు ఎకరాలు మామిడి తోటలను కౌలుకు చేస్తున్నాను. గత ఏడాది ఎకరానికి మూడు టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఎకరానికి టన్నున్నర మాత్రమే దిగుబడి వచ్చింది. టన్ను ధర నెల రోజుల క్రితం బంగినిపల్లి రూ.50 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేలు తగ్గిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – గౌరునాయుడు, మామిడి రైతు, విజయనగరం మండలం విజయనగరం ఫోర్ట్: మామిడి రైతులకు కష్టాలు వీడడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచే మామిడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మామిడి పూత ఆశాజనకంగా వచ్చినప్పటకీ మంచు ప్రభావంతో నల్లగా మాడిపోవడంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మామిడి రైతులు ఈ ఏడాది పంటపై సగం ఆశలు వదులుకున్నారు. అక్కడక్కడ మిగిలి ఉన్న పూత వల్ల వచ్చిన మామిడికి కూడా ధరలు తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ఏడాది ధర రాక ఇబ్బంది పడితే మరో ఏడాది దిగుబడి తగ్గిపోయి ఇలా ప్రతీ ఏటా ఏదో ఒక సమస్యతో మామిడి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఇంకోవైపు మామిడి వ్యాపారులు సిండికేట్గా మారడం వల్లే ధరలు తగ్గిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ మామిడి పంట ఉద్యానశాఖ పరిధిలోకి వస్తుంది మాకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇరు శాఖల సమన్వయ లోపం మామిడి రైతుల పాలిట శాపంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ● జిల్లాలో 32 వేల హెక్టార్లలో సాగు జిల్లాలో ఉద్యాన పంటల్లో అధికంగా సాగయ్యేది మామిడి పంటే. అంతేకాకుండా విజయనగరం జిల్లా నుంచే మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఎక్కువగా అవుతుంది. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబయి, కోల్కత్తా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచే మామిడి పంటను ఎగుమతి చేస్తారు. జిల్లాలో 32 వేల హెక్టార్ల వరకు మామిడి పంట సాగైంది. ● సీజన్ ఆరంభంలో మంచి ధరే.. సీజన్ ఆరంభంలో మామిడికి మంచి ధర పలికింది. ఇప్పుడు ఒక్కసారిగా ధర సగం వరకు తగ్గిపోయింది. మామిడి కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధరలు తగ్గిపోవడానికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో మామిడి టన్ను ధర రూ.60 వేలు వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేలుకు తగ్గిపోయింది. బంగినిపల్లి టన్ను ధర రూ.50 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేలకు పడిపోయింది. సువర్ణ రేఖ రకం మామిడి టన్ను ధర రూ.60 వేల నుంచి ప్రస్తుతం రూ.30 వేలకు తగ్గిపోయింది. తోతాపూరి మామిడి రకం టన్ను ధర రూ.30 వేల నుంచి రూ.10 వేలకు తగ్గిపోయింది. పరియాలు టన్ను ధర రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం రూ.5 వేలుకు తగ్గిపోయింది. ● గత ఏడాది కంటే తగ్గిన దిగుబడి గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది మామిడి దిగుబడి ఎకరానికి 3 టన్నులు వచ్చింది. ఈ ఏడాది టన్నున్నర నుంచి 2 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది టన్ను నుంచి టన్నున్నర వరకు దిగుబడి తగ్గిపోయింది. -
న్యాయం చేయాలి
బైరెడ్డిపాలెంలో ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డు పేరిట నిరుపేదల భూములు కాజేయాలని చూస్తున్నారు. పరిహారం తీసుకోకుండానే బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు నిరుపేద రైతులకు న్యాయం చేసిన తరువాత భూసేకరణ చేయాలి. బలవంతంగా యంత్రాలతో పక్కకు నెట్టి పనులు చేయడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాలి. – బైరెడ్డి అప్పలనర్సయ్య, బైరెడ్డిపాలెం అప్రోచ్ రోడ్ ప్రతిపాదనలు మార్చాలి బైరెడ్డిపాలెం సమీపంలో ఎయిర్పోర్టు అప్రోచ్ రహ దారి నిర్మాణం ప్రణాళికబద్దంగా లేదు. నిరుపేద రైతులను లక్ష్యంగా చేసుకొని రహదారి ప్రతిపాదనలు చేశారు. బడాబాబుల భూములను ఉద్దేశపూర్వకంగా తప్పించి నిరుపేదల భూములు వైపు రహదారి నిర్మాణం మార్చారు. తక్షణమే అధికారులు పునరాలోచన చేయాలి. – బైరెడ్డి దుర్గమ్మ, బైరెడ్డిపాలెం అధికారులు పునరాలోచన చేయాలి బైరెడ్డిపాలెంలో ఎయిర్పోర్టు రహదారి నిర్మాణంపై ఆలోచన చేయాలి. కేవలం నిరుపేద రైతుల భూములలో రహదారి వేసే విధంగా ప్రతిపాదనలు చేశారు. బడాబాబుల భూములను వదిలేసి నిరుపేదలపై కక్ష కట్టారు. అధికారులు పునరాలోచన చేయాలి. – కొత్త పాపమ్మ, బైరెడ్డిపాలెం -
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి
–8లో● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ Ð]l$íßæ-âýæ-ÌS…sôæ G…§ýl$-MýS…™èl ^èl$ÌSMýS¯]l..!˘ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగ దని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణి మండిపడ్డారు. చీపురుపల్లి రూరల్(గరివిడి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. గరివిడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల నాయకులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఐక్యతగా పని చేయాలన్నారు. గ్రామ, వార్డు, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని నాయకులకు సూచించారు. ప్రతీ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలపై వెంటనే స్పందిస్తూ పార్టీపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాయకులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీకి మరింత బలమైన పునాది వేసే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొత్స సందీప్, బొత్స అనూష, మూడు మండలాల పార్టీ నాయకులు ఎస్వి.రమణరాజు, మీసాల వరహాలనాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, బూర్లె నరేష్, పలు పంచాయతీల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. -
ఎంపీఎఫ్సీ గోదాములను వినియోగంలోకి తేవాలి : జేసీ
విజయనగరం ఫోర్ట్: బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలను (ఎంపీఎఫ్సీ గోదాములు) వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 38 ఎంపీఎఫ్సీ గోదాముల నిర్మాణాన్ని చేపట్టగా వీటిలో ఇప్పటి వరకు 27 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని, వీటిన్నంటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. స్థానిక పరిస్థితులు బట్టి వ్యవసాయ అవసరం లేని పక్షంలో ఎవరికై నా లీజుకు ఇచ్చి, ఇతర ప్రజావసరాలకు వినియోగించాలని అన్నారు. ప్రతీ గోదాముకు రహదారి సౌకర్యం, విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, డ్వామా పీడీ శారదాదేవి, మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కౌశలం ద్వారా యువతకు ఉపాధి కౌశలం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. కౌశలం కార్యక్రమం అమలుపై రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ అమరావతి నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.‘డెంగీ’పై అవగాహన అవసరం : డీఎంహెచ్ఓ విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. దోమల పెరుగుదలను నియంత్రించడం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమ తెరలను ఉపయోగించాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. మాక్ ఎలీసా టెస్ట్ ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఎంఓ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యానికి మించి పోస్టల్ బీమా పాలసీలు ● పోస్టల్ సూపరింటెండెంట్ బాబూరావు బొబ్బిలి: గతేడాది పోస్టల్ బీమా పాలసీలను లక్ష్యానికి మించి సేకరించామని పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ ఏడాది లక్ష్యాలపై సమాయత్త సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతేడాది రూ.60 కోట్ల లక్ష్యం కాగా రూ.60 కోట్ల పాలసీలు సేకరించినట్టు చెప్పారు. ఈ ఏడాది రూ.110 కోట్ల లక్ష్యం విధించినట్టు చెప్పారు. రామభద్రపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో సబ్ పోస్టాఫీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ సేవలను మరింత అధికంగా అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమిదన్నారు. గతేడాది లక్ష్యాలను అధిగమించిన సిబ్బంది, అధికారులకు సూపరింటెండెంట్ చేతుల మీదుగా ప్రోత్సాహకాలు, ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. బొబ్బిలి ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, పోస్టుమాస్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి
● రాష్ట్ర జనగణన శాఖాధికారి సాయిశేఖర్నెల్లిమర్ల రూరల్: ఇంటింటా చేపడుతున్న జనగణనలో ప్రతి ఇంటి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని రాష్ట్ర జనగణన శాఖ(డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్) సంయుక్త సంచాలకులు బీవీఎల్ సాయిశేఖర్ సూచించారు. మండలంలోని కొత్తపేటలో తహసీల్దార్ శ్రీకాంత్తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఇతర ప్రాధమిక సమాచారం నమోదు చేసే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తప్పిదం కాకుండా చూసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలకు జనగణన కీలకమని, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిని చంపిన కోరిక!
విజయనగరం: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్్మలకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయం తీసుకుని తల్లినే హతమార్చాడు. ఇవీ రాజాం పట్టణం డోలపేటలో ఈనెల 4న జరిగిన స్పందన హత్యకేసు ఘటన వివరాలు. పదిరోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని, స్నేహితుడిని పట్టుకుని రాజాం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ఈ నెల 4న డోలపేటలో స్పందన అనుమానాస్పద హత్యకు గురైంది. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్ఫోన్లో యానిమేషన్ ఫిల్్మకు ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్ఫోన్ వినియోగించరాదని తల్లి బుద్ధులు చెప్పడంతో పాటు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది. ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్ చేస్తోందని, ఇల్లు వదిలి బయటకు వెళ్లి డాన్గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలపేట సమీపంలోని గ్రామానికి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలానే ఆలోచించడం, ఇంటర్పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగుచెంది కోపం పెంచుకోవడంతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు. దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి పథకం వేసుకున్నారు. అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈనెల 4న స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వచ్చి కాళ్లు కడుక్కుంటుందని అని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్రూమ్లో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్రూమ్లో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడపట్టుకుని కిందపడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని రెండో చేతితో గట్టిగా మూశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. చనిపోయిందని అనుకుని వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరూ ఇంట్లో ఉన్న కత్తులతో దాడిచేశారు. బాత్రూమ్లో రక్తాన్ని కడిగేసిన తరువాత చీరలో అమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరపడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరూ ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5వేలు నగదు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్కు ఇన్స్ట్రాగామ్ ద్వారా మెసేజ్లు చేసేవారు. అలా ఇన్స్టా గ్రామ్ మెసేజ్ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్లు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకుని వారి వద్ద ఉన్న బంగారం కడియం, కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్కు తరలించనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.మాఫియాకు ఆధారాలు చూపించాలనే..సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని, జపాన్ యానిమేషన్లు తరచూ చూస్తూ వాటిని అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్లు కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తల్లిని చంపిన తరువాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డీఎస్పీ తెలిపారు. పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలి..ఇంట్లో చిన్నారుల కదలికలతోపాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని డీఎస్పీ రాఘవులు అన్నారు. ఎక్కువగా సెల్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలు ఏం చేస్తున్నారు? వారి ఫ్రెండ్స్ ఎవరు? సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి వంటి వాటిని గ్రహించాలని హితవు పలికారు. ఇలా వారిపై దృష్టిసారిస్తే తీవ్రమైన నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. సమావేశంలో టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్కుమార్, హెచ్.ఉపేంద్ర, ఎస్సై సల్మాన్ బేగ్లు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తలకే జనసేన తీర్థం
పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు జనసేనలోకి వలస వెళ్లినట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కుమిలి గ్రామ వైఎస్సార్సీపీ నాయికుడు గుజ్జు సురేష్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమిలి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంజేరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కుమిలి గ్రామానికి చెందిన 40 వైఎస్సార్సీపీ కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలో చేరినట్లు పేపరుకు తప్పుడు ప్రకటన ఇచ్చారన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాసరి అప్పలరెడ్డి, దాసరి సోమయ్యరెడ్డి, దాసరి రామకృష్ణ, దాసరి అప్పలరెడ్డి, పడాల సూర్యనారాయణ, పడాల అప్పలస్వామి, నాయిని సింహాద్రి, నీలాపు సురేష్, నీలాపు శ్యామల, గోవిందల సూర్యారావు, దాసరి సూర్యనారాయణ, దారపు జోగిరెడ్డి, అక్రమాని అప్పన్న, గండ్రేటి అప్పలరెడ్డిలు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్తే వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లినట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చారన్నారు. కుమిలిలో వైఎస్సార్సీపీ బలంగా ఉందని, ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త వలస వెళ్లలేదన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని జనసేన నాయకులకు సవాల్ విసిరారు. వాస్తవాలు పక్కనపెట్టి తప్పుడు ప్రకటనలు ఇచ్చుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గాబు సూరప్పన్నరెడ్డి, కర్రి అప్పారావు, డొంక దుర్గరాజు, దున్న నర్సింగరావు, కనకం సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుమిలి వైఎస్సార్సీపీ నాయకులు -
ఖాతాలు సక్రమంగా నిర్వహించాలి
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి విజయనగరం ఫోర్ట్: మండల సమాఖ్య ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక జిల్లా సమాఖ్య కార్యాలయంలో 27 మండలాల మండల సమాఖ్య ఖాతాలు, ఎఫ్పీఓ ఖాతాలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖర్చు చేసిన వివరాలు రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. శిక్షణలో ఏపీడీ కె.సావిత్రి, డీపీఎం సీతారామయ్య, విశ్వేశ్వరరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, మేనేజర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ● పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 99.3 శాతం పనులను పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్తో కలిసి ఆయన విమానాశ్రయ పనులను శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించామని, దీని ద్వారా ప్రపంచంతో ఉత్తరాంధ్ర అనుసంధానం కాబోతోందన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ నెల్లిమర్ల: పట్టణంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించిన కలెక్టర్ భద్రత ఏర్పాట్లు, గోదాం తాళాలు, సీళ్లను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లపై సంతకం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ సాగర్, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. బడి బస్సులకు భద్రతా పరీక్ష పార్వతీపురం రూరల్ : విద్యార్థుల సురక్షిత ప్రయాణమే సంకల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో బడి బస్సుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. పారదర్శక సేవలే లక్ష్యంగా జిల్లా రవాణా అధికారి (డీటీఓ) దుర్గాప్రసాద్ రెడ్డి శుక్రవారం క్షేత్ర స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 95 పాఠశాల బస్సులకుగాను, ఇప్పటివరకు 63 వాహనాల పరిశీలన పూర్తయింది. ఈ తనిఖీల్లో బస్సుల సాంకేతిక స్థితిగతులు, భద్ర తా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల ఫిట్నెస్ నిర్ధారించడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని డీటీఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ మరమ్మతుల్లో ఉన్న మిగిలిన 32 బస్సులను కూడా బాగు చేయించిన అనంతరం.. నిర్ణీత గడువులోగా తనిఖీ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను డీటీఓ ఆదేశించారు. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరవేయడంలో మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. -
గిరిజన హక్కులకు రక్షణ కల్పిస్తాం: జిల్లా జడ్జి
బొబ్బిలి రూరల్: గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయ వ్యవస్థ అండగా ఉంటుందని జిల్లా కుటుంబ న్యాయస్థానం జడ్జి బి. అప్పలస్వామి అన్నారు. మండలంలోని ఎరంకందొరవలస గిరిజన గ్రామంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. గిరిజనుల భూములను కాపాడుకునేందుకు, వారి జీవనోపాధిని రక్షించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు కల్పించబడ్డాయన్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతి చిన్న విషయానికీ కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్అదాలత్లో రాజీ చేసుకోవాలని సూచించారు. సీఐ నారాయణరావు మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగించినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎ. రాధాకృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్, ప్యానల్ న్యాయవాదులు ఆర్వీ ప్రసాద్, సీహెచ్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
కన్న పేగే యమపాశమై..!
రాజాం సిటీ: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్మ్లకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయం తీసుకుని తల్లినే హతమార్చాడు. ఇవీ రాజాం పట్టణం డోలపేటలో ఈనెల 4న జరిగిన స్పందన హత్యకేసు ఘటన వివరాలు. పదిరోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని, స్నేహితుడిని పట్టుకుని రాజాం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న డోలపేటలో స్పందన అనుమానాస్పద హత్యకు గురైంది. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్ఫోన్లో యానిమేషన్ ఫిల్మ్కు ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్ఫోన్ వినియోగించరాదని తల్లి బుద్ధులు చెప్పడంతో పాటు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది. ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్ చేస్తోందని, ఇల్లు వదిలి బయటకు వెళ్లి డాన్గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలపేట సమీపంలోని గ్రామానికి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలానే ఆలోచించడం, ఇంటర్పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగుచెంది కోపం పెంచుకోవడంతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు. దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి పథకం వేసుకున్నారు. అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈనెల 4న స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వచ్చి కాళ్లు కడుక్కుంటుందని అని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్రూమ్లో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్రూమ్లో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడపట్టుకుని కిందపడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని రెండో చేతితో గట్టిగా మూశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. చనిపోయిందని అనుకుని వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరూ ఇంట్లో ఉన్న కత్తులతో దాడిచేశారు. బాత్రూమ్లో రక్తాన్ని కడిగేసిన తరువాత చీరలో అమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరపడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరూ ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5వేలు నగదు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్కు ఇన్స్ట్రాగామ్ ద్వారా మెసేజ్లు చేసేవారు. అలా ఇన్స్టా గ్రామ్ మెసేజ్ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్లు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకుని వారి వద్ద ఉన్న బంగారం కడియం, కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్కు తరలించనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. మాఫియాకు ఆధారాలు చూపించాలనే.. సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని, జపాన్ యానిమేషన్లు తరచూ చూస్తూ వాటిని అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్లు కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తల్లిని చంపిన తరువాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డీఎస్పీ తెలిపారు. పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలి.. ఇంట్లో చిన్నారుల కదలికలతోపాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని డీఎస్పీ రాఘవులు అన్నారు. ఎక్కువగా సెల్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలు ఏం చేస్తున్నారు? వారి ఫ్రెండ్స్ ఎవరు? సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి వంటి వాటిని గ్రహించాలని హితవు పలికారు. ఇలా వారిపై దృష్టిసారిస్తే తీవ్రమైన నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. సమావేశంలో టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్కుమార్, హెచ్.ఉపేంద్ర, ఎస్సై సల్మాన్ బేగ్లు పాల్గొన్నారు. అతిగా ఆంక్షలు పెడుతోందని తల్లిపై కక్ష స్నేహితుడి సహాయంతో హత్య ముంబై మాఫియాలో చేరి, డాన్గా మారాలని ఆశ స్పందన హత్యకేసును చేధించిన పోలీసులు -
ఏయు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో జయరామ్కు ఫస్ట్ ర్యాంక్
తెర్లాం: ఆంధ్రా యూనివర్జిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ఏయూఈఈటీ)–2026 ఫలితాల్లో తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇంటర్మీడియట్ తరువాత బీటెక్లో జాయిన్ అయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో జయరాం 84 మార్కులు సాధించి ఏయూ పరిధిలో ఫస్ట్ ర్యాంక్ను కై వసం చేసుకున్నాడు. తెర్లాం మండలంలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం 1–5 తరగతులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోను, 6–10 తరగతులు బొబ్బిలి అభ్యుదయ స్కూల్లోను, ఇంటర్మీడియట్ విశాఖపట్నం కేఎంఆర్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాడు. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు సత్యనారాయణ, నరసనీలిమల చిన్న కుమారుడు జయరాం. తండ్రి వ్యవసాయదారు కాగా తల్లి గృహణి. కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
17న మరిడిమాంబ మహోత్సవం
విజయనగరం టౌన్: పట్టణ శివారు పూల్బాగ్ కాలనీలో వెలిసిన మరిడిమాంబ అమ్మవారి చల్లదనం మహోత్సవం ఈ నెల 17న ఆదివారం వైభవంగా నిర్వహించనున్నట్టు కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు మూడు శతాబ్దాల నుంచి మరిడిమాంబ అమ్మవారు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని ప్రాజెక్టు చైర్మన్ సముద్రాల నాగరాజు పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించినా, ముందుగా ఆలయానికి వచ్చి పసుపు, కుంకుమలు సమర్పించడం ఇక్కడ విశిష్ట సంప్రదాయమని అర్చకులు కన్నబాబు తెలిపారు. మహోత్సవం రోజు ఉదయం నుంచే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామన్నారు. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్దాంతి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపాధ్యక్షుడు బెహరా కూర్మారావు వివరించారు. సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, సభ్యులు దువ్వు శ్రీనివాసరావు, అచ్చిరెడ్డి, చిలకలపూడి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్విమ్మింగ్కు కుసుమూరు ఉపాధ్యాయుడు
● జూలై నెలలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నహాలు ● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు ఈదుతానంటున్న గణేష్ సీతంపేట: దివ్యాంగుడైనా ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఈతలో మంచి పట్టు సాధించి సప్త సముద్రాలను ఈది తానేంటో నిరూపిస్తానని అంటున్నారు మండలంలోని కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బలగ గణేష్. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం డొంకలపర్తి గ్రామం. జూలైనెల 20 నుంచి 29 మధ్య స్పెయిన్ నుంచి మొరాకా మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని ఈదనున్నట్లు తెలిపారు. 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం ఆగకుండా ఈదనున్నట్లు చెప్పారు. ఈ సాహసోపేతమైన స్విమ్మింగ్కు అనుమతి కూడా లభించిందన్నారు. 2020 నుంచి స్విమ్మింగ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని 2020లో అవకాశాలు వచ్చినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయినట్లు తెలిపారు. 2025లో శ్రీలంక–ధనుష్కోట మధ్య ఉన్న సముద్రాన్ని 28 కిలోమీటర్లు 10 గంటల 40 నిమిషాల పాటు ఈదినట్లు చెప్పారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పారా స్విమ్మర్గా రికార్డు సాధించానన్నారు. 2025 జూన్ 16న లండన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కిలోమీటర్లు 13 గంటలపాటు ఇంగ్లీష్ చానల్ ఈదినట్లు తెలిపారు. ఏడు సమూద్రాలను ఈదడానికి నిర్ణయించానని ఇప్పటికి రెండు ఈదానని, మిగతా ఐదు సముద్రాల్లో కూడా స్విమ్మింగ్ చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మరో విశేషమేమిటంటే తన కుమారుడు స్వామినాయుడు రాష్ట్రంలోనే అత్యంత వేగవంతమైన స్విమ్మర్గా ప్రశంస పొందాడన్నారు. తాను ఇచ్చిన కోచింగ్ తన కుమారుడికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూ టీ ఈఓ పి.నారాయుడు, ఎంఈవో సూర్య చంద్రరావు తదితరులు ఆయనను అబినందించారు. -
భోగాపురం ఎయిర్పోర్ట్తో పర్యాటక రంగానికి ఊపు
● అంతర్జాతీయ అనుసంధానతకు గేట్వేగా విశాఖ ● ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్మోహన్ పూసపాటిరేగ: రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర పర్యాటక, ఆతిథ్య రంగాల భవిష్యత్తును పూర్తిగా మార్చేయనుందని ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్మోహన్ అన్నారు. శుక్రవారం భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకను పెంచుతూ, తూర్పు తీరంలో పర్యాటకం, వాణిజ్యానికి ఈ విమానాశ్రయం ఒక కీలక గేట్వేగా మారబోతోందన్నారు. కొత్త విమానాశ్రయం కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది ప్రాంతీయ అభివృద్ధిని, ఉపాధిని నడిపించే వ్యూహాత్మక వృద్ధి ఇంజిన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు ఇక్కడికి వస్తుండటంతో విశాఖపట్నం వేగంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతోందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దీనికి గేమ్–ఛేంజర్ కానుందని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ రాష్ట్రంలో బౌద్ధ, గిరిజన పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి ద్వారా ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల నుంచి ఆధ్యాత్మిక పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే అవకాశం ఉందని విజయ్మోహన్ వివరించారు. మౌలిక సదుపాయాలను కేవలం రవాణా కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రగతికి సాధనంగా చూస్తున్న తరుణంలో, భోగాపురం విమానాశ్రయం తూర్పు తీర ప్రాంత పర్యాటక ఆధారిత ఆర్థిక వృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. -
మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు చెక్కు అందజేత
విజయనగరం క్రైమ్: విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ భార్య దమయంతికి ఎస్పీ దామోదర్ శుక్రవారం తన చాంబర్ లో గ్రూప్ పర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్సు పాలసీ ద్వారా మంజూరైన రూ. 20.95 లక్షల చెక్కును అందజేశారు. గజపతినగరం పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న టి.తిరుపతిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ ప్రమాదంలో మరణించినందున గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు పాలసీ మంజూరు చేసేందుకు డీపీఓ నుంచి హెడ్ క్వార్టర్కు ప్రతిపాదనలు పంగా ప్రతిపాదనలను పరిశీలించి తిరుపతిరావు కుటుంబానికి పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మంజూరైందని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ వి.లలిత పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘వెల్ఫేర్ డే’పార్వతీపురం రూరల్: అహర్నిశలు ప్రజాసేవలో అంకితమయ్యే పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించడమే తమ మొదటి ప్రాధాన్యమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) వేదికగా ఆయన సిబ్బందితో ముఖాముఖి భేటీ అయ్యారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లతో పాటు, సిబ్బంది ఆరోగ్యం, కుటుంబ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసట ఎరుగక శ్రమించే సిబ్బందికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన విన్నపాలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సమస్యల పూర్వాపరాలను ఆరా తీసి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం సీసీ సంతోష్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మోపెడ్ అదుపుతప్పి యువకుడికి గాయాలుబలిజిపేట: మండలంలోని బలిజిపేట–పెదపెంకి రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో వెంగాపురం గ్రామానికి చెందిన బండి వెంకటేష్ గాయాల పాలయ్యాడు. బలిజిపేట–పెదపెంకి మార్గంలో రోడ్డుపక్కన పడిఉన్న వెంకటేష్ను అటువైపుగా వెళ్తున్న వారు చూసి బలిజిపేట పీహెచ్సీకి తరలించారు. మోపెడ్పై వెళ్తున్న వెంకటేష్ దానిని అదుపుచేయలేకపోవడంతో గాయాల పాలై పడిపోయి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంకటేష్కు పీహెచ్సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం పీహెచ్సీకి తరలించారు. గాయపడిన వ్యక్తి మృతితెర్లాం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం వాడాడకు చెందిన గొట్టాపు శ్రీనివాసరావు(47)ద్విచక్ర వాహనాన్ని మండలంలోని కూనాయవలస జంక్షన్ వద్ద ఈనెల 11న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హెచ్సీ నాగేశ్వరరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నెలకు రూ.4.70 కోట్ల భారం
రోజుకి రూ.200 ఆదాయం రావడం లేదు ఉచిత బస్సు వల్ల మా ఆటోలు ఎవరూ ఎక్కడం లేదు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. రోజుకి రూ.200 కూడా ఆదాయం రావడం లేదు. నా ఆటో పెట్రోల్తో నడుస్తుంది. ధర పెరగడం వల్ల మాపై అదనపు భారం పడనుంది. ఇక కుటుంబ జీవనం కష్టమే. – ఆనంద్, ఆటో డ్రైవర్, విజయనగరంమోయలేని భారమే.. విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఉన్న ప్రైవేటు కాలేజీలో పని చేయడానికి ప్రతీ రోజు బైక్పై వెళతాను. ప్రతీ రోజు 70 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేస్తాను. ప్రస్తుతం రోజుకి రూ.120 వరకు పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు పెట్రోల్కు రూ.3.29 పెరగడం వల్ల మరింత అదనపు భారం పడనుంది. ఇలా అయితే సామాన్యులకు కష్టమే కదా.. – శివ, ప్రైవేటు ఉద్యోగి, గంట్యాడ మండలం విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఊరువాడా గొప్పగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రంలో కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ఎక్కువ అమ్ముతున్నారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా ధరలు పెంచడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులతో పాటు ఆటో కార్మికులు, రైతులకు ఇది ఇబ్బందికర పరిస్థితే. నిన్న, మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఏకంగా ధరలు పెంచడంతో మరింత ఇబ్బంది పడనున్నారు. ● పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం పెంచింది. పెట్రోల్పై లీటరుకు రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెంచారు. నిన్నటి వరకు పెట్రోల్ ధర 109.74 ఉండగా పెరిగిన ధర 113.03 అయింది. డీజిల్ ధర రూ.97.57 ఉండగా పెరిగిన ధరతో 100.71 అయింది. ● ఆటో కార్మికులకు ఇబ్బందే.. ఉచిత బస్సు కారణంగా ఆటో కార్మికులకు బేరాలు లేక అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా వారు మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. జిల్లాలో మూడు లక్షల వరకు ఆటోలు ఉంటాయి. వీటిలో పెట్రోల్తో కొన్ని నడవగా, డీజిల్తో కొన్ని నడుస్తున్నాయి. వచ్చే ఆదాయం తక్కువ, ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ద్విచక్ర వాహనాలపై నిత్యం వెళ్లేవారికి కూడా ఇబ్బందే. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసే వారు వేల సంఖ్యలో తమ సంస్థలకు వాహనాలపై ప్రయాణం చేస్తుంటారు. పెరిగిన పెట్రోల్ ధరల వల్ల వీరందరిపై అదనపు భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం జిల్లాలో 136 పెట్రోల్ బంక్లు పెట్రోల్పై రూ.3.29 పెంపు డీజిల్పై రూ.3.14 పెంచిన వైనం వాహనదారులపై నెలకు రూ.4.70 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా వాహనదారులపై నెలకు కోట్లాది రుపాయిల భారం పడనుంది. జిల్లాలో సుమారుగా 2 లక్షల లీటర్ల పెట్రోల్, 2.90 లక్షల లీటర్ల వరకు డీజిల్ వినియోగం అవుతుంది. పెట్రోల్ ధర పెరిగిన కారణంగా రోజుకి రూ.6.60 లక్షల వరకు భారం పడనుంది. డీజిల్ ధర పెరిగిన కారణంగా రోజుకి సగటున రూ.9 లక్షల వరకు భారం పడనుంది. నెలకు సుమారు పెట్రోల్, డీజిల్ ధర పెరగడం వల్ల రూ.4.70 కోట్ల వరకు భారం పడనుంది. -
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
విజయనగరం: అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతర ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం పని చేసే వైఎస్సార్సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం రింగ్రోడ్డులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రధానంగా పార్టీ పరంగా కమిటీల నియామకాలను శతశాతం పూర్తి చేయాలని, బీఎల్ఏలను నియమించాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీలో అసమ్మతులతో చర్చించి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దటంతో పాటు కూటమిలో వ్యతిరేకులను ఆకర్షించి పార్టీలో చేరేలా కృషి చేయాలని తెలిపారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై విస్తృత ప్రచారం చేయాలి రెండేళ్ల క్రితం అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ఒక్కరికీ కొత్త పింఛను ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ హమీలు గాల్లో కలిపేసి అన్ని అమలు చేసామంటూ ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ప్రభుత్వంలో చలనం లేదని ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలతోనే తరిమి కొట్టించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతీరాణి, ఎస్.కోట నియోజకవర్గ పరిశీలకులు కె.భాగ్యలక్ష్మి, గజపతినగరం నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్మోహన్రావు, రాజాం నియోజకవర్గ పరిశీలకులు కెవి.సూర్యనారాయణరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను అందుకు సిద్ధం చేయాలని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. తద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాలి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు 7 నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
మక్కువ: మండలంలోని పనసభద్ర పంచాయతీ ఎర్ర సామంత వలసలో శుక్రవారం విద్యుత్ షాక్ కొట్టి ఓ యువకుడు మృతిచెందాడు. వేసవిలో ఈదురుగాలుల దృష్ట్యా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఎర్రసామంత వలస 11 కేవీ లైన్పై పిచ్చి మొక్కలను తొలగించడానికి విద్యుత్ శాఖ సిబ్బంది శుక్రవారం పనులను ప్రారంభించారు. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామానికి చెందిన కొంత మందితో పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. 11 కేవీ విద్యుత్ లైన్ పై ట్రీ కటింగ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన పీడిక నవీన్ (20) విద్యుత్ షాక్కి గురై అక్కడకక్కడే మృతిచెందాడు. కొమ్మల కత్తిరింపులో భాగంగా ఆయిల్ పామ్ తోటల్లో పొడవాటి కొమ్మలను కత్తిరించేందుకు ఉపయోగించిన కత్తి, అదుపుతప్పి సమీపంలో ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్పై పడడంతో యువకుడు చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. 11 కేవీ విద్యుత్ లైన్ పై ట్రీ కటింగ్ చేసేటప్పుడు సమీపంలో గల 33 కేవీ లైన్ విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోవడమే యువకుడి మృతికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలని బంధువులు కోరుతున్నారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు, తండ్రి, సోదరి, సోదరుడు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి సాలూరు: విద్యుత్శాఖ నిర్లక్ష్యం వల్లనే గిరిజన యువకుడు మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు ఆరోపించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలసలో విద్యుత్లైన్లు తగిలి విద్యుత్శాఖలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న పీడిక ప్రకాష్ అలియాస్ నవీన్(23) మృతిచెందాడని తెలిసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని సీపీఎం బృందం పరామర్శించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సదరు యువకుడి మృతికి విద్యుత్ శాఖ అధికారులు అధికారులు బాధ్యులని కావున విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడైన ప్రకాష్పై ఆధారపడి ఆయన తండ్రి చిన్నప్ప, తల్లి సంబరమ్మ, అక్క, తమ్ముడు చిన్నారి,గణేష్లు జీవిస్తున్నారని అన్నారు. విద్యుత్ పనుల నిమిత్తం వెళ్లిన ప్రకాష్ విగతజీవిగా మారాడని, కావున ఆ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్వైనాయుడు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో దాహం తీర్చే ఊటలు
విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు వేసవి మొదలైందంటే చాలు..విజయనగరం జిల్లాలోని అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారేది. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో జంతువులు దాహంతో అల్లాడేవి. నీటి కోసం అడవిని విడిచి గ్రామాల దారిపట్టేవి. ఆ సమయంలో వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ కంచెలు, రహదారి ప్రమాదాలకు బలై ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటవీశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో విజయనగరం అభయారణ్యం ఇప్పుడు వన్యప్రాణులకు జీవనాధారంగా మారింది. అడవి మధ్యలోనే నీటికుంటలు, చెక్డ్యామ్లు, చెలమలు, రాతికట్టడాలు, సాసర్పిట్లు నిర్మించి వేసవిలో కూడా జంతువులకు నీటి కొరత లేకుండా చేస్తున్నారు. దీంతో అడవులు మరింత పచ్చగా మారడమే కాకుండా వన్యప్రాణుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అడవి గుండెలో నీటి జలధారలు విజయనగరం జిల్లా పరిధిలో సుమారు 17,300 హెక్టార్లలో విస్తరించి ఉన్న అభయారణ్యం దాదాపు 173 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. కొండలు, లోయలు, గిరిజన గ్రామాలు, లోతట్టు అటవీ ప్రాంతాలతో ఈ ప్రాంతం ప్రకృతి సంపదకు నిలయంగా నిలుస్తోంది. గతంలో వేసవి రాగానే అడవిలోని చిన్నచిన్న వాగులు, చెలమలు పూర్తిగా ఎండిపోయేవి. దీంతో జంతువులు నీటి కోసం నదులు, గ్రామాలవైపు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అడవి లోపలే నిర్మించిన నీటి వసతుల వల్ల జంతువులు బయటకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. పచ్చదనంతో అభయారణ్యం: అటవీశాఖ చేపట్టిన చర్యలతో అడవులు మళ్లీ పునర్జీవం పొందుతున్నాయి. గత తొమ్మిదేళ్లుగా సాగుతున్న వన సంరక్షణ చర్యల ఫలితంగా అభయారణ్యంలో పచ్చదనం పెరిగింది. అడవులు మరింత దట్టంగా మారాయి. ఇప్పుడు అడవిలో అడవి పందులు, ఎనుబోతులు, ఎలుగుబంట్లు, జింకలు, దున్నలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. కోతులు, కొంగలు, నెమళ్లు, అరుదైన పక్షులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతౌల్యం క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు: అటవీ గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం–1972 గురించి గ్రామస్తులకు వివరిస్తున్నారు. జంతువులకు హాని చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నారు. అడవిలో జంతువులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా ఉండాలని, వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అభయారణ్యంలో పుష్కలంగా నీటివసతులు జంతువుల కోసం నీటికుంటలు, చెక్ డ్యామ్లు తాగునీటి కోసం గ్రామాలకు రాకుండా అడవిలోనే ఏర్పాట్లువేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం: వన్యప్రాణులను రక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తున్నారు. విద్యుత్ కంచెలు, ఉచ్చులు, అక్రమ వేటకు సంబంఽఽధించిన సమాచారం వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో సీసీ కెమెరాలు, మొబైల్ పర్యవేక్షణ, స్ధానిక గిరిజనుల సహకారంతో వేటగాళ్ల కదలికలను గుర్తిస్తున్నారు.జంతువుల దాహం తీరేలా ప్రత్యేక ప్రణాళిక వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కృత్రిమ నీటి వనరులు ఏర్పాటు చేస్తున్నారు. చెక్డ్యామ్లు, సాసర్ పిట్లు, మినీ వాటర్ పాయింట్లు, రాతి కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ అడవిలోని నీటికుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచుతున్నారు. అధికారులు, అటవీ సిబ్బంది ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తూ నీటి పరిస్ధితిని పరిశీలిస్తున్నారు.వన్యప్రాణులను కాపాడడం అందరి బాధ్యత వేసవిలో వన్యప్రాణులు ఇబ్బంది పడకుండా అడవిలోనే నీటి వసతులు కల్పిస్తున్నాం. చెక్డ్యామ్లు, నీటికుంటలు, చెలమల ద్వారా జంతువులకు తాగునీరు అందిస్తున్నాం. వేటగాళ్లపై కఠిన నిఘా కొనసాగుతోంది. ప్రజలు కూడా వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలి. అడవిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత. – బిర్లంగి రామ్నరేష్, అటవీ రేంజ్ అధికారి, విజయనగరం -
ఎరువుల డీలర్పై కేసు నమోదు
భామిని: మండలకేంద్రంలోని శ్రీ షిరిడీసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణం డీలర్పై కేసు నమోదు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినట్లు భామిని వ్యవసాయాధికారి కొల్లి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిలిలోని ఎరువుల డిపోపై పాలకొండ ఇన్చార్జ్ ఏడీఏ ఎన్ని వాహిని ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేసినట్లు వివరించా రు.బత్తిలి డీలర్కు ఈ నెల–12న 50 టన్నుల ఎరువులు వచ్చాయని వాటి పంపిణీలో ఎటువంటి రికార్డులు లేకుండా అమ్మకాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో దర్యాప్తు చేసినట్లు తెలియజేశారు. ఏభై టన్నుల 20–20–0–13 అనే కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సేల్ చేయకుండా, రైతుకు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు చెబుతున్న కారణంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు, ఎరువుల దుకాణంతో పాటు, గొదాంలు కూడా తనిఖీ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో రెవెన్యూ అధికారి నిమ్మల మహేష్, వ్యవసాయ సహాయకుడు ఆరిక నిఖిల్, స్థానిక రైతులు ఉన్నారని తెలిపారు. -
గురువుల భవితకు పరీక్ష!
రామభద్రపురం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత అయ్యవార్లందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధంకావాలా అనే సందిగ్దంలో పడ్డారు. గురువుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా మిన్నకుండడంపై ఉపాధ్యాయులు, సంఘ నాయుకులు మండిపడుతున్నారు. టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విస్మరించడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇన్సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించాలి.. టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం తొందర పడడం సరికాదు. ఉపాధ్యాయులందరిలోనూ టెట్ పరీక్ష అలజడిరేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్–2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. టెట్ అమలులోకి రాకముందు నియాకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. – బొప్పే రవికుమార్, ఏపీటీఎఫ్(1938) రామభద్రపురం మండలశాఖ అధ్యక్షుడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. 20, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురిచేస్తోంది. ఉద్యోగోన్నతులు కూడా టెట్ రాయాలనే నిబంధన సరికాదు. బీఈడీ, డీఈడీ పూర్తిచేసి, డీఎస్సీతో ఎంపికై న వారికి టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సవరించాలి. – ప్రసన్నకుమార్, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు, రామభద్రపురం ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి.. డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైనది కాదు. ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. టెట్ ఉత్తీర్ణత తప్పనిపరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టడం సరికాదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి5,400 మందికి తప్పనిసరి..ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్లు సుమారు 9,000 మంది ఉండగా ఇందులో సుమారు 5,400 మంది వరకు టెట్ రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల అంచనా. వీరిలో 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు మినహా ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలి. అయితే, 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల్లో ఎక్కడా లేదని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. టెట్ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయులు వినతులివ్వగా టెట్పై ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి అయోమయంలో అయ్యవార్లు..! టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామన్న హామీని విస్మరించిన విద్యాశాఖా మంత్రి లోకేశ్ తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు -
కాలువ ఇలా.. సాగునీరు వెళ్లేదెలా?
చిత్రంలో కనిపిస్తున్నది రాజాం మండలంలోని వీఆర్ అగ్రహారం, పొగిరి గ్రామాల మధ్య ఉన్న తోటపల్లి పిల్లకాలువ. కాలువ నిండా పిచ్చిమొక్కలు పెరగడం, పూడికపోవడంతో రైతులకు ఖరీఫ్లో సాగునీరు అందడం లేదు. గతంలో వేసవిలో ఉపాధిహామీ నిధులతో కాలువను బాగుచేసేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు పనులు చేయలేదు. ఖరీఫ్ సమీపిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాలువ ఇలా ఉంటే సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాలువలో పూడికలు తొలగించాలని, మరమ్మతులకు గురైన స్లూయీస్లు బాగుచేయాలని కోరుతున్నారు. – రాజాం -
రైతన్నకు మద్దతు కరువు..!
విజయనగరం ఫోర్ట్: పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. కిలోకు పైసల్లో పెంచడం సరికాదని, రైతుకు ఏమాత్రం భరోసా ఇచ్చేలా లేవని వాపోతున్నారు. పంటల సాగు వ్యయం భారీగా పెరిగినప్పటకీ దానికి అనుగుణంగా పంటలకు మద్దతు ధర పెరగలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రకటించిన మద్దతు ధరకు అయినా రైతుల పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారా అంటే అదీలేదు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు మద్దతు ధరకు పంటను అమ్ముకోలేని పరిస్థితి. తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం వరి పంటకు కిలోకు 72 పైసలు చొప్పున క్వింటాకు పెంచింది రూ.72 మాత్రమే. 2025–26 ఖరీఫ్లో వరి సాధారణ రకం మద్దతు ధర రూ.2,369 కాగా, 2026–27 ఖరీప్లో వరి మద్దతు ధరను రూ.2,441కు పెంచారు. వరి ఏగ్రేడ్ రకం మద్దతు ధర రూ.2,389 నుంచి రూ.2,461కు పెంచారు. మొక్కజొన్నలకు క్వింటా రూ.2400 నుంచి రూ.2,410కు పెంచారు. కేవలం రూ.10 మాత్రమే పెంచారు. పెసర పంటకు రూ.8,768 నుంచి రూ. 8,780 కి పెంచారు. కేవలం రూ.12 మాత్రమే పెంచారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కనీసం పెంచిన మద్దతు ధర రైతులకు అందుతుందన్న ధీమా లేకపోతోంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో తక్కువ ధరకే పంటను దళారులకు అమ్మాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.వరి పంటకు పెంచింది రూ.72 మాత్రమే... పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధర పెంచలేదు పంటలకు సాగు ఖర్చులు అమాంతం పెరిగాయి. వాటికి అనుగుణంగా మద్దతు ధర పెంచలేదు. రబీలో మొక్కజొన్న పంట క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల వ్యాపారులు రూ.1700కు మించి కొనుగోలు చేయలేదు. ధాన్యం 105 కేజీలు రూ.1800కు విక్రయించాల్సి వచ్చింది. మద్దతు ధర అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీనివల్ల వ్యాపారులు ఎంత అంటే అంతకు పంటను రైతులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి. మద్దతు ధర ప్రకటనలకే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కిలో ధాన్యానికి 72 పైసల ధర పెంపు మొక్కజొన్నకు 10 పైసలు, పెసలకు 12 పైసలు మాత్రమే పెంపు ఆందోళనలో రైతన్న పెట్టుబడి పెరిగిన స్థాయిలో ధర పెంచలేదంటూ గగ్గోలు కొనుగోలు కేంద్రాలు లేక మద్దతు ధర అందని వైనం -
సెల్ఫోన్ ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
తెర్లాం: సెల్ఫోన్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెర్లాం మండలం గోపాలవలస పంచాయతీ పరిధిలోని జగన్నాథవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, తెర్లాం ఎస్ఐ సాగర్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథవలస గ్రామానికి చెందిన గొందాల అనుష్క(16) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత సాధించింది. తక్కువ మార్కులు రావడంతో బెటర్మెంట్కు ప్రిపరేషన్ అవుతోంది. ఉదయం చదువుకోడానికి సెల్ఫోన్ ఇవ్వాలని తల్లిదండ్రులు రాంకుమార్, హేమను అనుష్క అడిగింది. పొలం పనికి వెళ్తున్నామని, సెల్ఫోన్ తమవెంట తీసుకెళ్తున్నామని, పుస్తకాలు తీసి చదవమని చెప్పి వెళ్లిపోయారు. తన ప్రిపరేషన్ కోసం తల్లిదండ్రులను సెల్ఫోన్ అడిగినా ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఉన్న అనుష్కను చూసి కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను కిందకు దించి వెంటనే రాజాం సీహెచ్సీకి తరలించారు. అప్పటికే అనుష్క మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెర్లాం ఎస్ఐ సాగర్బాబు కేసు నమోదు చేశారు. -
హెచ్సీ వైద్యఖర్చులకు సిబ్బంది చేయూత
● రూ.6.75 లక్షల ఆర్థిక సాయం అందజేత విజయనగరం క్రైమ్: ప్రార్థించే పెదవులు కన్నా... సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటను జిల్లా పోలీశాఖ సిబ్బంది గురువారం అక్షరాలా పాటించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్న ఆదిమడపల శ్రీనివాసరావు గతనెల 28న బొబ్బిలిలో జరిగే పండగ బందోబస్తుకు వెళ్తుండగా గజపతినగరం వద్ద కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెచ్సీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆరోగ్య భద్రత అధికారులతో ఎస్పీ మాట్లాడి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మెరుగైన చికిత్సకు అదనంగా డబ్బులు అవసరంకావడంతో ‘చేయూత‘ పథకం కింద సిబ్బంది అంతా కలిసి ఇచ్చిన రూ.6.75 లక్షలను శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమిలకు ఎస్పీ దామోదర్ గురువారం తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్, వన్టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వు ఇన్స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన జెడ్పీచైర్మన్
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసంలో మజ్జి శ్రీనివాసరావు కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. -
మార్చురీ వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే అంశంపై ‘శవాలపై కాసులవేట ..!’ అనే శీర్షికన సాక్షిలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి అధికారులు స్పందించారు. మార్చురీ వద్ద లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమనే బోర్డులను ఏర్పాటుచేశారు. లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఫోన్నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మార్చురీ సిబ్బందిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలని ఆర్ఎంఓను ఆదేశించినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీలో ఇండో–యూరో సింక్రోనైజేషన్ ఆధ్వర్యంలో జర్మన్ భాష ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణులు సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ వి.వి.సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన బ్రోచర్ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత జర్మన్ భాషా శిక్షణలో ఏ–2 లెవెల్ ఉత్తీర్ణత పొందిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇండో–జర్మన్ సింక్రమైజేషన్ సంస్థ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల వయో పరిమితి 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. సుమారు 3 నెలలపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో గాని, బ్రోచర్లోని క్యూఆర్కోడ్ స్కాన్చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డి.రాజ్యలక్ష్మి, శిక్షణాధికారిణి వి.ఎస్.వకుళ, తదితరులు పాల్గొన్నారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు ● బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెర్లాం: బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని తెర్లాం మండలంలో బీటీ రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. తారు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడమే దీనికి కారణంగా పేర్కొన్నారు. కొరటాంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పణుకువలస నుంచి వంతరాం వరకు గల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.5కోట్లు, సుందరాడ–గలావల్లి రోడ్డుకు కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అప్పటివరకు పనులు జరిగే అవకాశం లేదన్నారు. చోరీకి యత్నం ● పట్టుబడిన నిందితుడు బొబ్బిలిరూరల్: మండలంలోని చింతాడ గ్రామంలోని కర్రిపార్వతి ఇంటిలోకి చొరబడి చోరి యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఉపాధిహామీ పనులకోసం బయటకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి పథకం ప్రకారం చోరీకి పాల్పడుతున్న రొంపిల్లి గ్రామానికి చెందిన మణికంఠను గ్రామస్తులు పట్టుకున్నారు. సీఐ నారాయణరావుకు అప్పగించారు. విచారణ జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. తైక్వాండో పోటీల రిఫరీగా బొబ్బిలి క్రీడాకారుడు బొబ్బిలి: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న తైక్వాండో పోటీలకు బొబ్బి లి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు బంగారి కిశోర్కుమార్ రిఫరీగా ఎంపికై నట్టు కోచ్ ప్రసాద్ గురువారం తెలిపా రు. జిల్లా తైక్వాండో కార్యదర్శి వేణుగోపాల్ ఆధ్వర్యంలో రిఫరీగా ఎంపికయ్యాడన్నారు. -
సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్
● రెవెన్యూ, పరిపాలనాంశాలపై ఆరా డెంకాడ: మండలంలోని డెంకాడ స్వర్ణ గ్రామాన్ని (సచివాలయం) కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలపై ఆరా తీశారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన జనగణన ప్రక్రియ, భూముల రీ–సర్వే పురోగతి, మ్యుటేషన్ (భూ మార్పిడి) దరఖాస్తుల పరిష్కారం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్.. కార్యాలయ ప్రాంగణాన్ని, గ్రామ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.టి.రామారావు గజపతినగరం: రైతులకు కల్తీ ఎరువులు, నాసిరకం విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.టి.రామారావు డీలర్లను హెచ్చరించారు. గజపతినగరం రైతు సేవా కేంద్రంలో పురుగు మందులు, విత్తనాలు విక్రయించే డీలర్స్తో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు రాగానే ముందుగా మొలకశాతం నిర్ధారించి రిజిస్ట్రర్లో నమోదుచేయాలని సూచించారు. 80 శాతం కంటే తక్కువ మొలకశాతం ఉన్న విత్తనాలను వెనుకకు పంపించాలన్నారు. యూరియా కార్డ్స్ను అర్హులైన ప్రతీ రైతుకు అందజేస్తామన్నారు. 2026 సీజన్లో ప్రభుత్వం యూరియా కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే యూరియా, డీఏపీ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు గాలి శ్రీనివాస్, గజపతినగరం డివిజన్ నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు కిరణ్ కుమార్, గోకుల్ కృష్ణ, గోవిందమ్మ, చంద్రకళ, నాలుగు మండలాల వ్యవసాయ సహాయకులు, ఏఈఓలు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం లెక్కింపు
చీపురుపల్లి: స్థానిక శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి జి.శ్యామ్ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్.నానాజీబాబు సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. ఫిబ్రవరి 25, 2026 నుంచి మే 14, 2026 వరకు హుండీల ద్వారా మొత్తం రూ.3,70,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ప్రతినిధులు పొట్నూరు త్రినాథరావు, లెంక చిన్నారావు, అడ్డూరి భారతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక రుగ్మతలపై పోలీస్ ‘నజర్’
● బాల్య వివాహాలు, అక్రమ రవాణా నిర్మూలనకు సమష్టి కృషి ● పోలీసులకు అవగాహన సదస్సులో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: సమాజ పురోగతికి ఆటంకంగా మారిన బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాండెడ్ లేబర్ వంటి సామాజిక రుగ్మతలను సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అ మేరకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తోట కనకదుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక అరిష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చైతన్యమే ఆయుధంగా, చట్టమే కవచంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకదుర్గ, డీసీపీఓ సత్యనారాయణ మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల బాలికల విద్య, ఆరోగ్యం ఛిన్నాభిన్నమవుతాయని పేర్కొన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోక్సో చట్టం–2012, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 పై అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా బాల్య వివాహాలు లేదా బాల కార్మిక వ్యవస్థ వంటి ఘటనలు గమనిస్తే తక్షణమే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ ’1098’ కు సమాచారం అందించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
జిందాల్ అవకతవకలకు నేతలే కారణం
శృంగవరపుకోట: జిందాల్లో అవకతవకలకు నేతలే కారణమని, జిందాల్ పేరు చెప్పి పేదల భూములు లాక్కుని మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక సీపీఎం నేతలతో కలిసి జిందాల్ అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా భూములు లాక్కుని మాకు ఇచ్చిన పరిహారాన్ని ఎమ్మెల్సీ అనుచరులు తినేశారంటూ పీజీఆర్ఎస్లో బాధితులు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. నాడు జిందాల్కు భూములిచ్చింది మొదలు నేటివరకూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నోళ్లు, గతంలో అధికారం వెలగబెట్టిన వారంతా అవకతవకలకు పాల్పడ్డారన్నారు., కంపెనీకి భూములివ్వొద్దని నాడే సీపీఎం చెప్పిందని, 18యేళ్లయినా కంపెనీ పెట్టలేదని, ఆరేళ్లలోగా కంపెనీ పెట్టకుంటే భూములు వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, చట్టప్రకారం నాడు పశ్ఛిమబెంగాల్లో అధికారంలో ఉన్న సీపీఎం నందిగ్రామ్ భూములు వెనక్కి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ 250రోజులుగా భూముల్ని బాధితులకు ఇవ్వాలని ఉద్యమం సాగుతుండగా, 27ఎకరాల భూములు తీసుకుని, పరిహారం చెల్లింపుల్లో నాయకులు, అధికారులు అవకతవకలకు పాల్పడి, అడిగితే బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కల్టెక్టర్ కొత్త అయినా అధికారులు అంతా పాతవారేనన్నారు. గతంలో బినామీలు జిందాల్ సొమ్ములు స్వాహా చేశారని ఫిర్యాదు చేసిన ఒక పార్టీనేత ముడుపులు ముట్టడంతో తర్వాత మాట్లాడలేదన్నారు. బినామీ పేర్లతో గిరిజనుల సొమ్ము కాజేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకుంటే జిందాల్ నిర్వాసితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యకన్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, చెలికాని ముత్యాలు పాల్గొన్నారు. -
అందరికీ ఇస్తాం
రైతులు అందరికీ రైతు కార్డులు ఇస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. రైతులు ఆర్ఎస్కేలకు వెళ్లి వి వరాలు నమోదుచేయాలి. రైతు కార్డు ఉంటేనే ఎరువులు అందుతాయి. అవి కూడా అందులో నమోదు చేసే పంటల ఆధారంగా ఇస్తాం. కె.చంద్రరావు, వ్యవసాయశాఖ ఏడీఏ, రాజాం రైతులందరికీ ఎరువులు అందిస్తాం రానున్న ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులందరికీ ఎరువులు అందిస్తాం. ఎరువులు అనధికారుల చేతిలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎరువులు కార్డులు ఉన్న వారిందరికీ అవసరం అయిన ఎరువులు అందిస్తాం. ఎ.తిరుపతిరావు, ఏఓ, గుర్ల -
సీతంలో రెగ్యులర్ డిప్లమో కోర్సులు
● అధునిక టెక్నాలజీ కోర్సులతో విద్యార్ధులకు కొత్త అవకాశాలు విజయనగరం గంటస్తంభం: సీతం కాలేజీలో ఐదు రెగ్యులర్ డిప్లమో కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ డా.మజ్జి శశిభూషణ రావు తెలపారు. డిప్లమో ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తక్కువ వయసులోనే నైపుణ్యాలు సంపాదించి మంచి ఉద్యోగాలు పొందేందుకు పాలిటెక్నిక్ విద్య ప్రయోగశాలలు, గ్రంఽథాలయం వంటి మౌలిక సదుపాయాలతో కళాశాల సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్ జి.టి.నాయుడు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మిషిన్లెర్నింగ్ రంగాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయని డీన్ఆర్డీ డా.వీజీ.ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు 17 పరిశోధన ప్రాజెక్టులకు దరఖాస్తు చేయగా, వాటిలో ఎక్కువ క్వాంటం టెక్నాలజీకి సంబంధించినవని చెప్పారు. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాతావరణ సూచనలపై ఆధునిక పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్ల డించారు. -
ప్రమాదరహితంగా భోగాపురం విమానాశ్రయం
● చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిపూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పక్షులు, వన్యప్రాణుల ద్వారా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన రెండవ ఏరోడ్రోమ్ ఎన్విరానన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాల ప్రకారం విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడమే ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతికి అనుకూలమైన, సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో పక్షులు, కుక్కలు లేదా ఇతర వన్యప్రాణులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పక్షులు విమానం ఇంజినన్లోకి వెళ్లడం వల్ల జరిగే భారీ ప్రమాదాలను నివారించేందుకు ఈ ప్రాంతాన్ని ‘బర్డ్ స్ట్రైక్ ఫ్రీ జోన్’గా మార్చాలని ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో మాంసం దుకాణాలు, బహిరంగ వ్యర్థాలు ఉండడం వల్ల పక్షులు ఆహారం కోసం వస్తుంటాయని, అందుకే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, సమగ్ర చెత్త నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితి సంతప్తికరంగా ఉందని, భవిష్యత్తులో పక్షులు, వన్యప్రాణుల వల్ల ముప్పు పెరగకుండా చూడాలని కోరారు. దీనికోసం విమానాశ్రయ నిర్వహణ సంస్థ, స్థానిక పరిపాలన యంత్రాంగం మధ్య నిరంతర సమన్వయం ఉండాలని, ఈ మేరకు విమానాశ్రయ సమీపంలోని ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలుఅన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలంటే ప్రజల సంపూర్ణ సహకారం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. అందువల్ల విమానాశ్రయ సమీపంలోని సుమారు 21 గ్రామాల్లో నివసించే ప్రజలకు పారిశుధ్యం, నిబంధనలు, విమాన ప్రయాణ భద్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. వెంటనే అవగాహనా కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ ప్రగతిని పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో భోగాపురం విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లక్కీ వర్మ భాస్కర్, సీఈవో కన్వర్ బీర్ సింగ్ కలరా, ప్రాజెక్ట్ హెడ్ బీహెచ్ఏ రామరాజు, వన్యప్రాణి రక్షణ నిపుణులు బిభూ దత్తా పాడి, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ హెడ్ విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.జీవన రాణి, ఆర్డీవో సుధాసాగర్, పీసీబీ ఈఈ బీబీ సరిత, డీపీవో మల్లికార్జునరావు, మత్స్యశాఖ డీడీ విజయ్కృష్ణ, డీఎఫ్ఓ ఎం.సోమసుందర్, ఎఫ్ఆర్ఓ బి.రాంనరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు ఎరువు కరువే..!
రాజాం/గుర్ల: గతంలో మాదిరిగా ఎరువులు ఎక్కడ కావాలంటే అక్కడ..ఎప్పుడు కావాలంటే అప్పడు లభించే పరిస్థితి మారబోతోంది. ఆయా రైతు సేవా కేంద్రాలకు వచ్చే ఎరువులను రైతులు, భూములు లెక్క కట్టి ఇవ్వనున్నారు. ఈ విధానంలో పెద్ద రైతులకు, కౌలు రైతులకు గడ్డు పరిస్థితే. భూమిని సాగుచేసే రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదుకాకుంటే ప్రభుత్వ కేంద్రాలే కాకుండా ప్రైవేట్ స్టోర్లలో సైతం ఎరువు లభించదు. ఇప్పటికే చాలా మంది రైతుల భూముల వివరాలు సక్రమంగా లేవు. రైతుకు సక్రమంగా ఎరువులు అందించేందుకు అమలుచేస్తున్న రైతు కార్డు ఆ రైతులకు పూర్తిస్థాయిలో ఎరువును సకాలంలో అందించగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 52 లక్షల హెక్టార్లలో ప్రతి ఏడాదీ ఖరీఫ్ సాగు జరుగుతోంది. ఇందులో ఎక్కువ సాగు వరి పంటదే. వరి పంటకు సకాలంలో అందాల్సిన ఎరువును కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అందించలేకపోయింది. కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ఎరువులు తెప్పించుకున్నారు. ఒక్కో యూరియా బస్తాపై అదనంగా రూ.300 వరకూ చెల్లించారు. భారీగా ఎరువులకు పెట్టుబడులయ్యాయి. జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు సాగుదారులుగా ఉన్నారు. వారికి రైతు కార్డులు అందించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. రైతు కార్డు ఉండాలంటే భూమి వివరాలు సక్రమంగా ఉండాలి. ఈ వివరాలు సక్రమంగా లేని రైతులకు కార్డులు అందవు. జిల్లాలో సగానికిపైగా రైతులకు సంబంధించిన భూముల వివరాలు సక్రమంగా లేవు. దీంతో ఆయా రైతులకు సరిపడ వివరాలతో కూడిన కార్డులు అందే అవకాశం తక్కువగా ఉంది. ఈనెల 15 నుంచే అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసి, కార్డులు అందించనున్నారు. ఈ కార్డులు ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు ఇస్తారు. కౌలు రైతులకు ఈ కార్డులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. అంటే కౌలు రైతుకు రానున్న ఖరీఫ్లో ఒక్క బస్తా ఎరువు కూడా లభించని దుస్థితి కనిపిస్తోంది. పరిమితంగానే.. రసాయన ఎరువుల కొరతను అధిగమించేందుకు వ్యవసాయశాఖ ఈ విధానం అవలంబిస్తున్నప్పటికీ రైతులకు సకాలంలో ఎరువులు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొంతమంది రైతుల వివరాలు కార్డుల్లో నమోదు కాకపోయినా, ఆయా రైతు సేవా కేంద్రాలకు ఎరువు సక్రమంగా రాకపోయినా, వచ్చిన ఎరువు తక్కువైనా రైతులకు ఇబ్బందులు తప్పవు. వచ్చిన ఎరువునే మొత్తం రైతులు సర్దుకోవాలి. ఈ నిబంధనలతో కొంతమంది రైతులకు ఎటూ చాలని ఎరువుతో వ్యవసాయం కష్టతరంగా మారనుంది. ఎక్కడెక్కడ ఇస్తారు రైతు కార్డు ఆధారంగా ఎరువును రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో అందిస్తారు. ఎక్కడ రైతు ఎరువు పొందాలన్నా కార్డులు ఉండాలి. ఆ భూమికి సరిపడ ఎరువులో తొలుత 30 శాతం, తరువాత 30 శాతం, తరువాత 40 శాతం ఇలా ఇస్తారు. కేవలం పరిమితితో ఇచ్చే ఈ ఎరువు సకాలంలో అందకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కౌలు రైతుకు కష్టమే కౌలు రైతులకు ప్రస్తుతం రైతు కార్డులు ఇవ్వడం లేదు. కౌలుకు పంటపొలాలు తీసుకున్న రైతులకు ఎరువు కష్టంగా మారనుంది. అసలైన భూ యజమాని పేరున రైతు కార్డులు వస్తాయి. ఆ యజమానికి మాత్రమే ఎరువులు ఇస్తారు. ఈ రైతు కార్డు వచ్చిన తరువాత కౌలు రైతులకు పంట రుణాలు సైతం మాయం కానున్నాయి. అసలైన రైతులకు ఎరువు కార్డుల పంపిణీ ఈ కార్డు ఆధారంగానే ఎరువుల సరఫరా గతంలో మాదిరిగా అదనపు ఎరువులు కట్ నేటి నుంచే కార్డుల జారీ భూమి వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందేరైతు కార్డులో ఏముంటాయంటే.. రైతు పేరు రైతు ఐడీ, భూమి వివరాలు పంట వివరాలు అవసరమైన ఎరువులు -
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్: పొట్టకూటి కోసం ఉపాధిహామీ పనులకు వెళ్తున్న వేతనదారు వడదెబ్బకారణంగా మృత్యువాత పడ్డాడు. పాలకొండ మండలంలోని భాసూరు గ్రామానికి చెందిన వేతనదారు కోమటి పుష్పనాథం(62)గురువారం గ్రామ సమీపంలో రావాడ గెడ్డ వద్ద పనులు చేస్తున్నాడు. ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. సహచర వేతనదారులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి పుష్పనాథంమరణించాడని వేతనదారులు వాపోయారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిపనుల వద్ద వేతనదారులు విశ్రాంతి తీసుకునేందుకు ఎటువంటి టెంట్లు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని సహ వేతనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతునికి భార్య కళావతితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు కలెక్టర్, శాఖాపరమైన ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యకోనేరులో మృతదేహం గుర్తింపు.. విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అయ్యకోనేరులో గురువారం ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గురాల గురవాజీ(40) అనే వ్యక్తి తన భార్య పోలమ్మతో పూల్బాగ్ కాలనీలో నివాసముంటున్నాడు. కుటుంబ పోషణ కోసంచేపల వేట వృత్తి చేస్తున్న గురవాజీ తన స్నేహితులు సత్తయ్య, వాసుపల్లి పెద్దయ్య, ఎర్రపల్లి శివలతో కలిసి అయ్యకోనేరుకు వెళ్లాడు. ఆ క్రమంలో ఫిట్స్ వచ్చి పడిపోయినట్లు గురవాజీ భార్య పోలమ్మకు ఎర్రపల్లిశివ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఘటనా స్థలికి వెళ్లి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. -
కళ్లెదుటే కన్నకొడుకు మృతి
రేగిడి: చేతికి అందొచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడని ఎంతో ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కళ్లెదుటే కన్నకుమారుడు బస్సు ప్రమాదంలో మృతిచెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పనసలవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన నారు అప్పలనాయుడు, నారు సత్యవతి, వారి పెద్దకుమారుడు సాయి అనిల్కుమార్(24), చిన్నకుమారుడు నారు గోపాల్తో కలిసి విజయవాడలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి బుధవారం సాయంత్రం ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలో పనసలవలస గ్రామానికి చెందిన సాయి అనిల్కుమార్ కూర్చోవడంతో బస్సును టిప్పర్ ఢీకొనడంతో సాయిఅనిల్కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా గోపాల్తో పాటు తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తమ కళ్లెదుటే కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కుటుంబానికి అండగా ఉంటానన్నాడు.. కాయకష్టంచేసి ఇద్దరు అన్నదమ్ములను డిగ్రీ వరకు చదివించామని, పీజీచేసి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి అండగా ఉంటానని సాయిఅనిల్కుమార్ అన్నమాటలను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు గుర్తు చేసుకుని విలపిస్తున్నారు. అందరిలో మంచివ్యక్తిగా పేరు సంపాదించిన సాయిఅనిల్కుమార్ కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న యువకుడు చనిపోవడం దారుణమని, ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు వాపోతున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే అనంతలోకాలకు పయనం పెళ్లికి వెళ్లుండగా బస్సు ప్రమాదం కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్న కుటుంబసభ్యులు పనసలవలస గ్రామంలో విషాదఛాయలు -
మొక్కజొన్న, వరి పంటలకు లభించని మద్దతు ధర...
2026–27 రబీలో సాగుచేసిన మొక్కజొన్న, వరి పంటలకు మద్దతు ధర లభించలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. వరికి గతేడాది మద్దతు ధర క్వింటాకు రూ.2,369గా ప్రకటించారు. కానీ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల 105 కేజీల ధాన్యం రూ.1800, రూ.1900కు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ.2,400 కాగా, కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల వ్యాపారులకు రూ.1600, రూ.1700కు విక్రయించుకోవాల్సిన దుస్థితి. పెసర, మినుము పంటలకు సంబంధించి ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెసర, మినుము పంటల ఉత్పత్తి 38,373 మెట్రిక్ టన్నులు రాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ద్వారా కేవలం 39 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పెసర, మినుము పంటలకు కూడా మద్దతు ధర రాని పరిస్థితి. క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్ట పోయారు. -
బొడ్డమానుగూడ... సమస్యల జాడ
● రోడ్డు లేదు.. తాగునీటికి కటకట ● గిరిజనుల దుర్భర జీవనం ● అత్యవసర వేళ తప్పని డోలీమోతలు పార్వతీపురం: కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీ పరిధిలోని బొడ్డమాను గూడ గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. రోడ్డు, తాగునీరు సదుపాయం లేక గిరిజనులు దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. గ్రామంలో సుమారు 60 మంది గిరిజనులు నివసిస్తున్నారు. నీలకంఠాపురం నుంచి జరడ గ్రామం మీదుగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే ఆధారం. మట్టి దారులు, కొండ చరియలు దాటి గ్రామానికి చేరుకోవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణం. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు డోలీలోనే రోగులను తరలించాల్సిన పరిస్థితి. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు సమీపంలో కొండపక్కన ఏర్పాటు చేసుకున్న గుమ్మి(గుంట) నుంచి వచ్చే నీటిని తాగునీటిగా, వాడుక నీటిగా వినియోగిస్తున్నా రు. ఆ నీరు కలుషితమైనది కావడంతో తరచూ రోగాలబారిన పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి బొడ్డమానుగూడ గ్రామానికి రోడ్డు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఆకతాయిలకు ఎస్పీ వార్నింగ్
విజయనగరం క్రైమ్ : విజయనగరంలో నివాసముంటూ ఈవ్ టీజింగ్, పోకిరి వేషాలు వేసే ఆకతాయిలను ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. నగరంలో సక్రమంగా ఉంటే ఉండాలని, లేకుంటే నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. నగరంలో 32 చోట్ల ఏక కాలంలో దాదాపు 200 మంది సిబ్బందితో నాకా బందీ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఇన్సురెన్స్, సీ బుక్, ఆర్సీ, హెల్మెట్ తదితరమైనవి లేని దాదాపు 1200 వాహనాలకు జరిమానా విధించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు విస్తృతంగా తనిఖీలతో పాటు నాకా బందీ నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ రెల్లి వీధి రామమందిరం వద్ద గజపతినగరం సీఐ సన్యాసిరావుతో పాటు విజయనగరం వన్ టౌన్ ఎస్ఐ లీలావతి, ఏఎస్ఐ లక్ష్మణరావులు తమ సిబ్బందితో తనికీలు నిర్వహించారు. తనిఖీలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జొన్నగుడ్డిలో పావాడ హరనాధ్ హత్యతో నగరంలో అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సున్నితమైన ప్రాంతాలైన జొన్నగుడ్డి, లంకాపట్నం, శాంతినగర్, రెల్లివీధి, గంజిపేట వంటి ప్రదేశాల్లో నిఘా పెట్టామని తెలిపారు. ఇకపై ప్రతీ రోజు ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలు వెకిలి చేష్టలకు ఫుల్స్టాప్ పెడతామన్నారు. లంకాపట్నంపై కూడా టు టౌన్ పోలీసులు దృష్టి పెట్టారన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరూ పాల్పడినా ఉక్కుపాదం మోపుతామన్నారు. రహదారి భద్రత, గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణ నియంత్రణకు విజయనగరం వన్ టౌన్, టు టౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యలు సృష్టించే ఏడు ముఖ్య ప్రాంతాల్లో 32 పాయింట్లలో ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ తనికీల్లో 13 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు 600 మంది కానిస్టేబుళ్లు, హొంగార్డు పాల్గొనగా డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలను పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో డీఎస్పీలు ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీఐలు ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, దుర్గాప్రసాద్, సాగర్, లక్ష్మీ ప్రసన్నకుమార్, లీలావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్, కారు ఢీ: ఒకరి మృతి
సీతానగరం: మండలంలోని గుచ్చిమి పెట్రోల్బంక్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని జమదాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆయిల్ కొనుగోలు నిమిత్తం మోటార్సైకిల్పై గుచ్చిమి పెట్రోల్ బంక్కు వచ్చారు. మోటార్ సైకిల్పై వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో రోడ్డు ఎక్కుతుండగా అదేసమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదంలో అల్లు రోహిత్(17) మృతి చెందగా జన్ని చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుడిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని ఏఎస్సై లక్ష్మణరావు పరిశీలించి క్షతగాత్రుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనందపురం(విశాఖ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొయ్యపేట గ్రామానికి చెందిన రైతు కాగితాల రాంబాబు (49) మృతిచెందాడు. గ్రామంలో పూలు సాగు చేసే ఆయన, రోజూ పూలను ఆనందపురం మార్కెట్లో విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగానే తెల్లవారుజామున 3 గంటలకు ఆయన ఓ ప్రైవేట్ వ్యాన్లో ఆనందపురం మార్కెట్కు బయలుదేరాడు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో ఉన్న రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య కాగితాల పాపాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ సీహెచ్.వాసు నాయుడు కేసు నమోదు చేయగా ఎస్సై దర్యాప్తు చేపట్టారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. విజయనగరం క్రైమ్: విజయనగరం జీఆర్పీ సిబ్బంది గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలులో జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తూ, స్కృహ కోల్పోయినట్లు గుర్తించామని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాం నంబర్ నాలుగుపై దింపగా, ఆన్ డ్యూటీ రైల్వే డాక్టర్ పరీక్ష చేసి ఆ వ్యక్తి మృతి చెందాడని నిర్ధారించారన్నారు. మృతుడు సుమారు 5 అడుగుల పొడవు కలిగి, చామన ఛాయ రంగులో ఉన్నాడని మృతుని కుడివైపు ఛాతీమీద, పొట్ట మీద పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మృతుడు నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ కోరారు. -
ఎన్నాళ్లో వేచిన కల..!
● సువర్ణముఖిపై వంతెనకు రూ.9 కోట్లు విడుదల ● పీఆర్ (ప్రాజెక్ట్స్) ఏఈ శంకరరావు సీతానగరం: మండలంలోని బూర్జ వద్ద సువర్ణముఖినదిపై వంతెన నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు పీఆర్ (ప్రాజెక్ట్స్) ఏఈ శంకరరావు తెలిపారు. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కల అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో నేటికి సార్థకమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2023 అక్టోబరు నెలలో సువర్ణముఖినదిపై బూర్జ–చినంకలాం, గాదెలవలస గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి జీఓ విడుదలచేస్తూ రూ.9 కోట్లు నిధులు మంజూరు చేసింది. అప్పట్లో ఉత్తర్వులు వెలువడడం వల్ల బూర్జ చుట్టుపక్కల 50గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంతో దీర్ఘకాలంగా పలుగ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న వంతెన కల నాటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషి ఫలితంగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో నెరవేరింది. బూర్జ పంచాయతీలో సువర్ణముఖి నదికి అవతల ఆవాలవలస, బూర్జగ్రామానికి చెందిన రైతులకు ఆవాలవలసను ఆనుకుని వ్యవసాయ భూములున్న రైతులు, ఆవాలవలస గ్రామస్తులకు నిత్యావసర సరుకులు కావాలన్నా, పంచాయతీ పనులకోసం వచ్చేందుకు వేసవిలో అయితే 30 నిమిషాల్లో ఇంటికి చేరే రైతులు, ప్రజలు వర్షాకాలంలో నదిలో దిగడానికి వీలుకాని పరిస్థితిలో 16 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పట్లో పనులు ప్రారంభించడానికి 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల నదిలో స్తంభాల నిర్మాణానికి బోర్లు తీయడంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ప్రస్తుత పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న అవే పనులకు భూమి పూజ చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు స్థానిక పెద్దల ద్వారా తెలియవచ్చింది. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్
● స్థానిక ఎన్నికల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలి ● ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాలు ● డీపీఓలో నేర సమీక్షా సమావేశంవిజయనగరం క్రైమ్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ను ప్రయోగించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో డీపీఓలో బుధవారం ఎస్పీ దామోదర్ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీసీ, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాదాలు, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గ్రామ, వార్డు సందర్శనలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేయాలి గ్రామాలు, వార్డుల్లో అల్లర్లు సష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, మంచి ప్రవర్తన కోసం వారిని బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారి కదలికలను గమనించాలని, అవసరమైతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతిపోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అపార్ట్మెంట్లు, వ్యాణిజ్య సముదాయలు, వ్యాపారులు, కాలనీ వాసులకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ఎంఎస్పీల సహకారం తీసుకోవాలి టెక్నాలజీని వినియోగించుకుని కేసుల మిస్టరీని ఛేదించాలని తెలిపారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటూ సేవలను విస్తృతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆయా గ్రామాల దత్తత కానిస్టేబుళ్లు, మహిళా సంరక్షణ పోలీసుల (ఎంఎస్పీ) సేవలను వినియోగించుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోను ఈ–సాక్ష్య యాప్ను వినియోగించాలని, ఫొటోలను, వీడియోలను ఈ–సాక్ష్యలో నిక్షిప్తం చేయాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయంలోగా ఆయా న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావులతో పాటు 32 స్టేషన్ల ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లైంగికంగా వేధిస్తే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం లీగల్: లైంగికంగా బాలబాలికలను వేధించినా, అవమాన పరిచినా నేరం చేసిన వ్యక్తికి కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు శిక్షకు గురి కానున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం మండలంలోని పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికలకు దగ్గరి వారి నుంచి ముప్పు పొంచి ఉందని, తెలిసిన వారే నేరానికి పాల్పడుతున్నారని వారినుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రక్షిత బాల్యం–సురక్షిత భవిష్యత్తు అనే నినాదంతో పోక్సో–2012 చట్టంపై, అవగాహన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయమని వచ్చిన ఆదేశాల మేరకు విజయనగరంలో కూడా నిర్వహించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడ్టచ్, బ్యాడ్టచ్ గురించి బాలికలకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు తెలిసీతెలియని టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతున్నారని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ప్రభావాలకు లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పాలని, అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. అలాగే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి సహాయాన్ని కోరవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఆనందరావు, పి.సత్యవతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, ప్యానల్ న్యాయవాది డాక్టర్ పైల కుమార్ నేచర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ జి.దుర్గ, పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు రమణమ్మ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి దుర్మరణం
పీఎం పాలెం (విశాఖ): అజాగ్రత్తగా ఆర్టీసీ బస్సు దిగిన వ్యకి ఆదే బస్సు చక్రాల కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మధురవాడ బస్టాప్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చౌదంతివలస గ్రామానికి చెందిన చీమల సింహాచలం(51) నగరానికి వలస వచ్చి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య గంగమ్మతో స్థానికంగా ఓ భవనంలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 11న పండుగ నిమిత్తం భార్యాభర్తలు స్వగ్రామం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి విజయనగరంలో మెట్రో బస్సు ఎక్కారు. మధురవాడ బస్టాప్లో సింహాచలం అజాగ్రత్తగా బస్సు దిగుతూ కింద పడిపోయాడు. అది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక చక్రాల కిందపడి సింహాచలం అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టంనిమిత్తం కేజీహెచ్కు తరలించి మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్్ుట్ల సీఐ బాలకృష్ణ తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యనెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై గణేష్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబళ్ల మణికంఠ(36) ఈ నెల 11న అర్ధరాత్రి పురుగు మందు తాగేశాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ తెలిపారు. -
అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న స్టార్టప్
విజయనగరం అర్బన్: చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు అంతరిక్ష సాంకేతిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దిశగా దూసుకెళ్తోంది. విజయనగరం పట్టణానికి చెందిన యువ ఇంజినీర్, స్టార్టప్ వ్యవస్థాపకుడు దేవగుప్తపు ప్రకాశ్ నవదీప్ తన కలను సాకారం చేస్తూ స్థాపించిన రౌద్రనెక్స్ స్పేస్ టెక్నాలజీస్ ప్రస్తుతం స్పేస్ ప్రొపల్షన్ టెక్నాలజీలో కీలక ముందడుగు వేస్తోంది. సమీప అంతరిక్ష కార్యకలాపాల నుంచి దీప్ స్పేస్ మిషన్స్ వరకు ఉపయోగపడే అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్ ప్రయాణం ప్రారంభమైంది. పరిమిత వనరులు, సాంకేతిక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువ బృందం వెనుకడుగు వేయలేదు. ప్రస్తుతం సంస్థ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్)లో ఇన్క్యుబేట్ అవుతోంది. రాష్ట్రం నుంచి అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ సంస్థ పూర్తి స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టడం విశేషం. ఇటీవల రెడ్ బెలూన్ ఏరోస్పేస్తో కలిసి నిర్వహించిన టెథర్డ్ లాంచ్ పరీక్షలో రౌద్రనెక్స్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ పేలోడ్ విజయవంతంగా ఫ్లైట్ రెడీనెస్ను పూర్తి చేసింది. పేలోడ్లోని అన్ని సబ్సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేయడం సంస్థకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ నెలలో జరగనున్న భారత దేశపు తొలి సూపర్ ప్రెజర్ బెలూప్ లాంచ్లో భాగంగా రౌద్రనెక్స్ తన పేలోడ్ను స్ట్రోటోస్పియర్లోకి పంపించనుంది. ఇందులో ప్రపంచంలోనే తొలి ‘ఎయిర్ బ్రీతింగ్ కోల్డ్ స్లాస్మా ప్రొపల్షన్ సిస్టమ్’ ప్రయోగాత్మకంగా పరీక్షించనుండడం విశేషం. సంస్థ సహ వవ్యవస్థాపకుడు, సీఈఓ ప్రకాష్ నవదీప్ మాట్లాడుతూ ‘భారత దేశం నుంచి ప్రపంచ స్థాయి స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నదే మాలక్ష్యమన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే డేటా భవిష్యత్ ఉపగ్రహ వ్యవస్థలు, ఆల్ట్రాలో ఎర్త్ ఆర్పిట్, దీప్ స్పేస్ మిషన్స్కు ఉపయోగపడే తదుపరి తరం ప్రొపల్షన్ టెక్నాలజీలకు దోహదపడుతుందని చెప్పారు. ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చదివిన నవదీప్ తండ్రి డీవీ రవిశంకర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీఎస్డీటీగా పనిచేస్తున్నారు. తల్లి శారదా స్రవంతి గృహిణి. సాధారణ యుకుడిగా ప్రారంభమైన ప్రయాణం..ఇప్పడు అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిభను ప్రపంచానికి చాటే స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘రౌద్ర నెక్స్’తో స్పేస్ టెక్నాలజీలో కొత్త అధ్యాయం ప్రొపల్షన్ పేలోడ్ ఫ్లైట్ రెడీనెస్ పరీక్షలు విజయవంతం నెరవేరిన పట్టణ విజయనగరం యువకుడి కల -
సమోవాలో స్వర్ణ విజయాలు..
నెల్లిమర్ల రూరల్: పేదరికం వారి అడుగులు ఆపలేదు. కూలి పనులు చేసే తల్లిదండ్రుల కష్టాలు వారి కలలను చిన్నవి చేయలేదు. తండ్రి సంగిడీరాళ్ల పోటీల్లో రాణించాలన్న కల పేదరికం కారణంగా నెరవేరలేదు. కుమార్తెల రూపంలోనైనా తన కలను నెరవేర్చుకునేందుకు సంకల్పించాడు. వచ్చిన కూలిడబ్బులతో కుమార్తెలకు వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించాడు. అది ఫలించింది. ఇద్దరు కుమార్తెలు ప్రపంచ వేదికలపై పతకాల పంట పండిస్తున్నారు. దేశం పేరును ఇనుమడింపజేస్తున్నారు. వారే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన బెల్లాన శ్రీను, గౌరి కుమార్తెలు హారిక, భార్గవి. ఇటీవల సమోవాలో జరిగిన కామన్వెల్త్ యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి పేరుతెచ్చారు. ● తండ్రి కలను సాకారంచేస్తూ... హారిక, భార్గవిల తండ్రి బెల్లాన శ్రీనుకు చిన్నప్పటి నుంచి గ్రామీణ క్రీడలంటే అపారమైన అభిమానం. ఉత్తరాంధ్రలో గ్రామీణ క్రీడగా పేరొందిన సంగిడీ రాళ్ల పోటీల్లో ఆయన చిన్నతనం నుంచే పాల్గొని ప్రతిభ కనబరిచేవాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తన కలను కొనసాగించలేక వ్యవసాయ కూలీగా మారాల్సి వచ్చింది. తనకు నెరవేరని కలను కుమార్తెల ద్వారా నిజం చేసుకోవాలని శ్రీను నిర్ణయించుకున్నారు. శ్రీను, ఆయన భార్య గౌరి కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను వెయిలిఫ్టింగ్లో ప్రోత్సహించారు. అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు తమవంతు తోడ్పాటునందించారు. ● ఎనిమిదేళ్ల వయసు నుంచే శిక్షణ... తన కుమార్తెల ప్రతిభను చిన్న నాటి నుంచే గుర్తించిన శ్రీను వారిని ఎనిమిదేళ్ల వయస్సులోనే శిక్షణకు పంపించారు. కామన్వెల్త్ గేమ్స్ విజేత, ఇండియన్ వెయిట్లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు వారికి మేనమామే కావడంతో వాళ్ల విజయానికి సూచనలు, సహకారం అందింది. శ్రీనివాసరావు వద్ద ఇద్దరూ కఠిన సాధన ప్రారంభించారు. పల్లెటూరి వాతావరణంలో ప్రారంభమైన వారి ప్రయాణం క్రమంగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరింది. క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమతో అక్కా చెల్లెళ్లు వెయిట్లిఫ్టింగ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ● ప్రభుత్వం ఊతమిస్తే మరిన్ని విజయాలు.. పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలంటే మంచి శిక్షణ, పౌస్టికాహారం, ఆధునిక సదుపాయాలు అవసరం. మా స్థోమత మేరకు కష్టపడుతున్నాం. ప్రభుత్వం సహాయం చేస్తే వారు ఇంకా గొప్ప విజయాలు సాధిస్తారని తండ్రి శ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఇద్దరు కుమార్తెలు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఒలింపిక్స్లో రాణించడమే లక్ష్యంగా... అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు అందించడమే తమ లక్ష్యమని హారిక, భార్గవి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిథ్యం వహించి పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎంత కష్టమైనా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తండ్రి శ్రీను కష్టం, తన మేనమామ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వమే తమ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. నమ్మకానికి తూట్లు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రారంభం నుంచీ వైఫల్యాల పుట్టగానే మారింది. 720 మార్కులకు గాను దాదాపు 600 మార్కుల విలువైన ప్రశ్నలు ముందే లీకేజీ కావడం దారుణం. కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల దోపిడీకి మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. వెంటనే ఎన్టీఏను రద్దు చేసి, పరీక్షల బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలి. – డి.రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి, విజయనగరం మంత్రి రాజీనామా చేయాల్సిందే.. దేశవ్యప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి రాసిన పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నైతిక ఓటమి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. – ఎన్.నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మా కష్టానికి విలువేది..? నేను డాక్టర్ అవ్వాలని రెండేళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపి నీట్కు చదివాను. తీరా పరీక్ష రాశాక, పేపర్ లీక్ అయిందని తెలియగానే నా ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది. మేం పడిన కష్టానికి, మా తల్లిదండ్రుల త్యాగానికి విలువే లేదా? – కె.యామిని, విద్యార్థిని, విజయనగరం బతుకులను వేలం వేస్తారా? రెక్కాడితే గాని డిక్కాడని మా బతుకుల్లో బిడ్డను డాక్టరుగా చూడాలనేది ఒక పెద్ద కల. మా కడుపు మాడ్చుకుని పిల్లలను చదివిస్తున్నాం. మోదీ ప్రభుత్వం మా పిల్లల జీవితాలను వేలం వేసి అమ్ముకుంటోంది. పిల్లల మానసిక ఆందోళనకు బాధ్యులెవరు? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి. – కోరాడ వేణుబాబు, చెల్లూరుబాగా రాశాను... బాధగా ఉంది పరీక్ష బాగా రాశాను. చాలా సంతృప్తినిచ్చింది. కీ చూసుకున్న తర్వాత 600 వరకు మార్పులు వస్తాయని భావించాను. నా ప్రిపరేషన్కి తగ్గ ఫలితం లభించింది అనుకున్నాను. ఇంతలో పిడుగులాంటి నీట్ రద్దు వార్త విన్నాను. చాలా బాధేస్తోంది. మళ్లీ అదే స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించగలమా అనే సందేహం కలుగుతోంది. –మంత్రి నిహారిక నాయుడు, న్యూ కాలనీ, పురిటిపెంట ఆ ఉత్సాహం వస్తుందా.. నీట్లో 570 మార్కులు స్కోర్ చేశాను. మొదటిసారి ఉన్నంత ఉత్సాహం రెండో సారి ఉంటుందా అన్న సందేహం నెలకొంది. ప్రశ్నపత్రాన్ని అమ్మేయడం దారుణం. బాధగా ఉంది. – లెంక పుష్పహాసిని, విద్యార్థి, దిగువ వీధి, గజపతినగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు... హారిక ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. ఆసియా యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2023లో ఒక స్వర్ణం, కాంస్యం గెలుచుకుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అస్మిత ఖేలో ఇండియా పోటీల్లోనూ ప్రతిభ చాటింది. భార్గవి కూడా కామన్వెల్త్ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2024లో స్వర్ణ పతకం సాధించింది. ఐడబ్ల్యూఎల్ఎఫ్ నేషనల్ యూత్ పోటీల్లోనూ రజత పతకాలు గెలుచుకుని తన ప్రతిభను నిరూపించింది. పలు రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. ఇటీవల దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న సమోవాలో జరిగిన పోటీల్లో అక్కాచెల్లెళ్లు హారిక, భార్గవి సత్తాచాటారు. 19 ఏళ్ల హారిక జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. స్నాచ్లో 86 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 111 కిలోలు మొత్తంగా 197 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. అదే వేదికపై 17 ఏళ్ల భార్గవి యూత్ విభాగంలో స్నాచ్లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 102 కిలోలు... మొత్తంగా 180 కిలోల బరువును ఎత్తి స్వర్ణపతకంతో పాటు వెండి పతకాన్ని దక్కించుకుంది. -
గురుకుల ప్రవేశ పరీక్షలో కిర్ల విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు
● ఏపీ రెసిడెన్షియల్ పరీక్షలో ఫస్ట్ర్యాంకు సాధించిన ఆకాష్రెడ్డి జామి: విజయనగరం జిల్లా జామి మండలంలోని కిర్ల గ్రామానికి చెందిన ఆకాష్రెడ్డి అనే విద్యార్థి ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. 100కు 97 మార్కులు సాధించి ముందంజలో నిలిచాడు. కిర్ల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిన అకాష్రెడ్డి అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్షలోనూ రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఏపీ మోడల్ స్కూల్ పరీక్షల్లోనూ కొత్తవలస మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆకాష్రెడ్డిని గ్రామపెద్దలు, తల్లిదండ్రులు అభినందించారు. -
పైపులతో పెద్దగెడ్డ సాగునీరు
రామభద్రపురం వద్ద పెద్దగెడ్డ కాలువ రామభద్రపురం: పెద్దగెడ్డ జలాశయాన్ని కేంద్ర ప్రభుత్వం మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (ఎం–కాడ్) పథకంలో పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ జలాశయం నుంచి హైప్రెజర్ డ్రిప్ విధానంలో అండర్ గ్రౌండ్ పైపులైన్లతో ఆయకట్టుకు సాగునీరు అందజేయనున్నారు. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున రూ.73 కోట్లు కేటాయించాయి. పెద్దగెడ్డ జలాశయం ప్రధాన కుడి కాలువ పరిధిలోని పాచిపెంట, రామభద్రపురం, సాలూరు మండలాలకు చెందిన సుమారు 7,500 ఎకరాలకు పైపులతో సాగునీరందించే పనులు జరగాల్సి ఉంది. పనులు ఇలా... పెద్దగెడ్డ జలాశయంలో బారీవెల్ తీస్తారు. అందులో పెద్దవి 4 హైప్రెజర్ మోటార్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో మూడు నిర్వహణలో ఉంచుతూ ఒకటి రిజర్వ్లో ఉంచుతారు. ప్రధాన పైపు నుంచి బూసాయవలస దండాసివాని చెరువు, ఎరకన్నదొర చెరువు వరకు సాగునీరు మళ్లిస్తారు. అక్కడి నుంచి బ్రాంచిల ద్వారా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తారు. జలాశయం వద్ద కంట్రోల్ రూం ఉంటుంది. అక్కడ పంపుచేసే హెడ్ ఉంటుంది. ఆ హెడ్ ద్వారా ఏ ఏరియాకు ఎప్పు డు నీరు విడుదల చేయాలో ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతులు నచ్చినట్లు వాడుకుని సాగునీటి వృథా చేయకుండా నీరు సరఫరా చేసే వీలుంటుంది. ఇప్పటి వరకు ఒక ఖరీఫ్ సీజన్లో మాత్రమే కొద్దోగొప్పో నీరు విడుదల చేసేవారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీరు అందించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ అందించనున్నారు. పెద్దగెడ్డ జలాశయం కుడి కాలువ పరిధిలోని చెరువులను పైపులతోనే సాగునీరు నింపుతారు. పైలెట్ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని ఎం–కాడ్ డీఈఈ డి.సురేష్ తెలిపారు. అయితే, ఇంకా పనుల ప్రక్రియ టెండర్ల దశలోనే ఉందని, టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. పనులపై ఈ నెల 18వ తేదీన రైతులతో సమావేవమై అవగాహన కల్పిస్తామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద పెద్ద గెడ్డ జలాశయంను ఎం–కార్డ్ పథకంలో గుర్తింపు 7,500 ఎకరాలకు అండర్ గ్రౌండ్ పైపులతో సాగునీరు -
లీకేజీలతో భవిష్యత్ అంధకారం
విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (ఎన్ఈఈటీ) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. డాక్టర్ కావాలనే కలతో సంవత్సరాల పాటు కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయింది. అమ్మ కష్టం.. నాన్న త్యాగం.. చివరికి లీకేజీల పాలు అంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజుకు గంటల తరబడి చదువులు, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ భరించి పరీక్ష రాసిన విద్యార్థులకు ఇప్పుడు పేపర్ లీకేజీ వార్తలు మానసికంగా తీవ్ర దెబ్బతీశాయి. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ రాయగా, ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 11 ఏళ్లలో 89 సార్లు పేపర్ లీకేజీలు జరగడం, 48 పునఃపరీక్షలు నిర్వహించాల్సి రావడం విచారకరమని, పరీక్ష వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విద్యార్థిసంఘాలు విమర్మిస్తున్నాయి. పరీక్షను నిజాయితీగా రాసిన విద్యార్థులు నష్టపోతుండగా, డబ్బులు పెట్టి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసే మాఫియాలు లాభపడుతున్నాయని ఆరోపించారు. వెంటేనే ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 11 ఏళ్లలో 89 సార్లు లీకేజీలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అమ్మేసింది నీట్ పేపర్ కాదు.. విద్యార్థుల భవిష్యత్తును.. ఎన్టీఏను రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ -
కల్యాణం... రుణమయం..!
పేద కుటుంబాల పిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన కల్యాణమస్తు, షాదీతోఫాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పెళ్లి కానుక ఇస్తామంటూ రెండేళ్లుగా ఊరించింది. ఏ ఒక్కరికీ కానుకలు అందజేయకుండానే పథకానికి పాతరేసింది. తాజాగా కల్యాణలక్ష్మి పేరుతో పావలా వడ్డీకి రుణం ఇచ్చే పథకాన్ని తెరపైకి తెచ్చింది. కల్యాణాన్ని కాస్త రుణమయంగా మార్చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరును మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతటి మోసపూరిత పాలనను ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: చేసిన సాయం శూన్యమైనా... ఏదో ఇస్తున్నట్టు నమ్మించడం.. ప్రచారం చేయడం.. జనాన్ని ముంచేయడంలో చంద్రబాబుకు మించినవారు ప్రపంచంలోనే ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారం కోసం హామీలు గుప్పించడం.. అధికారం చేతికి చిక్కాక మోసం చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఊరించారు. నెలకు రూ.1500 చొప్పున మహిళల ఖాతాల్లో జమచేస్తామని చెప్పి మోసం చేశారు. పేదకుటుంబాల పిల్లల వివాహాల సమయంలో ‘పెళ్లి కానుక’తో ఆదుకుంటామని నమ్మించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ పథక లబ్ధి కలిగించకుండానే ఎత్తేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లింటికి పావలా వడ్డీ రుణం అందజేస్తామని చెబుతుండడంపై డ్వాక్రా మహిళలు నివ్వెరపోతున్నారు. ఇదెక్కడ రుణ పథకం అంటూ మండిపడుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదింటి బిడ్డల వివాహానికి కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఉచితంగా సాయమందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకు మహిళల సంక్షేమానికి పాతరేస్తున్నారని, పేదల కష్టాలు పట్టడంలేదని వాపోతున్నారు. రెండేళ్లలో వివాహంతో ఒక్కటైన జంటలు రూపాయి సాయానికి నోచుకోలేదని నిట్టూర్చుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో పేదకుటుంబాల్లో కొత్తగా పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇళ్లలో ఆడబిడ్డలకు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ.లక్షా50వేల వరకు ఆర్థిక సాయం చేసేది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. మహిళలకు రుణం బురిడీ... అప్పుడు అలా.. ఇదెక్కడి పథకం బాబూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఒక్కో పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేస్తోంది. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలకు స్వస్తిపలికింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణమస్తు, షాదీ తోఫాలను ఎత్తేసింది. పెళ్లికానుక అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. ఇప్పుడు పేదింటి బిడ్డల పెళ్లిఖర్చులకు కల్యాణలక్ష్మి పథకం కింద వడ్డీతో కూడిన రుణం ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. ఉచిత సాయాన్ని ఎగ్గొట్టి పెళ్లిని రుణమయంగా మార్చడం ఎంతవరకు సమంజసం. – సూరెడ్డి హైమావతి, మహిళా నాయకురాలు, మెంటాడ మండలం పెళ్లి ఖర్చులకు రుణం ఇస్తాం కల్యాణ లక్ష్మి పేరుతో ఆడ పిల్లలకు వివాహం చేసే డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు నుంచి రూ. లక్ష వరకు రుణం ఇస్తాం. పావలా వడ్డీతో కలిసి రుణాన్ని పూర్తిగా చెల్లించాలి. – శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ ‘పెళ్లికానుకకు’ పాతర కల్యాణలక్ష్మి పేరుతో కొత్త ఎత్తుగడ డ్వాక్రా మహిళల ఇళ్లలో పెళ్లికి వడ్డీతో కూడిన రుణం పేదింటి వివాహాలకు ఇచ్చే సాయానికి మంగళం టీడీపీ సర్కారు మాయజాలంపై భగ్గుమంటున్న మహిళలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో ఆర్థిక సాయం చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందన్నది జనంమాట. దీనికి కల్యాణలక్ష్మి పథకమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇవ్వనున్నారు. రూ.10 వేలు నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తారట. ఇచ్చిన రుణం వడ్డీతో సహా తీర్చాల్సిందే. అప్పుగా ఇచ్చే పథకానికి కూడా చంద్రబాబు సర్కార్ ఉచితంగా సాయం చేసినట్టు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేయడంలేదు. పావలా వడ్డీ రుణాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో ఉచితంగా అందజేయాల్సిన పెళ్లి సాయాన్ని కమిర్షియల్గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
మాతృ, శిశు మరణాలు నివారించేది ఎప్పుడు?
● వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ రాంసుందర్రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాతృమరణాలపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉందని, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. మార్చి నెలలో సంభవించిన రెండు మాతృ మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని, బాధ్యులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంహెచ్ఓ జీవనరాణిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, బాలంతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, గైనికాలజీ హెచ్ఓడీ అరుణ శుభశ్రీ, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 21 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందింరంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ ఎస్.తవిటినాయుడుతో కలిసి పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, విద్యార్థులకు రవాణా సౌకర్యాలు, వైద్య సహాయం, బందోబస్తు సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
బంగారు తల్లులు
● వెయిట్లిఫ్టింగ్లో సత్తా చూపుతున్న అక్కాచెల్లెళ్లు ● అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట ● కొండవెలగాడ యువతుల ప్రతిభ ● ఇటీవల సమోవాలో జరిగిన పోటీల్లో బంగారు పతకాల సాధన ● ఒలింపిక్స్ లక్ష్యంగా హారిక, భార్గవి కఠోర శ్రమ ● ప్రభుత్వం ఊతమిస్తే మరిన్ని విజయాలు బరువు ఎత్తుతున్న భార్గవి సమోవాలో బరువును ఎత్తుతున్న అక్క హారిక -
శివ అంకుల్ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!
విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
రెచ్చిపోయిన పచ్చమూకలు
వండాన పేటలోరేగిడి: మండల పరిధిలోని వండానపేట గ్రామంలో సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులపై పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డాయి. రాత్రి నిద్రపోయే వేళ ఇంటికి వెళ్లి దాడిచేయడంతో బాధితులు పరుగులు తీశారు. విడిచిపెట్టాలంటూ ప్రాథేయపడినా విడిచిపెట్టలేదు. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్ర గాయాలైన వియ్యపు జనార్దనరావు, వియ్యపు సూర్యనారాయణ, వియ్యపు వెంకటరమణ, వియ్యపు వెంకటలక్ష్మిను వారి కుటుంబ సభ్యులు 108లో రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదుచేశామని ఎస్ఐ వి.బాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఘటన వివరాలను మాజీ సర్పంచ్ వియ్యపు చక్రపాణిని అడిగితెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజాం నియోజకవర్గంలో దాడులు అధికమయ్యాయన్నారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం టౌన్ పార్టీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పార్టీ వంగర మండలాధ్యక్షుడు కరణం సుదర్శనరావు, రాజాం నియోజకవర్గ బీసీ సెల్ విభాగం అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కెంబూరు నారాయణరావు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు శాసపు వేణుగోపాలనాయుడు, సలాది సతీష్, దూబ గోపాలం, కోరాడ రామినాయుడు తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి పలువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇన్చార్జి తలే రాజేష్ -
అన్నదాతతో ఆటలు..!
విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే అన్నదాతలతో టీడీపీ సర్కార్ ఆటలాడుతోంది. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేసింది. గడిచిన రెండేళ్లుగా ఎటువంటి యంత్ర పరికరాలు టీడీపీ ప్రభుత్వం అందించలేదు. తాజాగా మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు అందిస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో మాదిరి కాకుండా లాటరీ ద్వారా యంత్ర పరికరాలు కేటాయిస్తామని మెలిక పెట్టింది. లాటరీ పద్ధతిపై యంత్ర పరికరాలు కేటాయించడం అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీ వరించినా కష్టమే లాటరీలో యంత్ర పరికరం వచ్చినప్పటికీ అది అన్నదాతకు అందుతుందనే గ్యారంటీ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందాన లాటరీలో వరించినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి అమోదంతోనే యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. లాటరీ వరించిన రైతు అధికార పార్టీకి చెందిన వారు కాకపోతో పక్కన పెట్టేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లాటరీ టీడీపీ సర్కార్ వింత ధోరణి రైతులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన లాటరీ వరించినా ఇన్చార్జి మంత్రి అమోదం తప్పనిసరి జిల్లాకు యంత్ర పరికరాల కోసం రూ.4.22 కోట్లు కేటాయింపు -
జరిగేవరకూ ఉద్యమిస్తాం
దళిత క్రైస్తవులకు న్యాయం● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంవిజయనగరం టౌన్: దళిత క్రైస్తవులకు న్యాయం చేకూరేవరకూ ఉద్యమిస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాజ్యాంగం, మతస్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.విజయకుమార్ (ఐఏఎస్) మాట్లాడుతూ ప్రస్తుతం వివక్ష కొనసాగుతోందన్నారు. మానవ మనుగడకు ఆటంకం ఏర్పడిందని సమానత్వం హక్కు ఎస్సీ క్రిస్టియన్స్కు, ముస్లింలకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పీవీ.సునీల్ కుమార్ (ఐపీఎస్) మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనలో దళితులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ ఒఫిర్, వైఎంసీఏ అధ్యక్షుడు రోలెండ్ విలియమ్స్లు ప్రసంగించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ అధ్యక్ష్యతన నిర్వహించిన దళిత మహాసభలో సిమ్స్ చర్చి అధ్యక్షుడు తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ ఆంద్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, జమాతే ఇస్లాం కమిటీ ప్రతినిధి హబీబ్, రిటైర్ట్ పీటీసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశిఖామణి, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘ ప్రతినిధులు, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు. -
బాలభవన్ను సందర్శించిన జీతెలుగు డైరెక్టర్
రాజాం: పట్టణంలోని మెంతిపేటలో గల ప్రభుత్వ జవహర్ బాలభవన్ వేసవి శిక్షణ తరగతులను జీ తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ శేఖర్ మంగళవారం సందర్శించారు. జీ తెలుగులో పలు కార్యక్రమాలకు దర్శకత్వం వహిస్తున్న ఆయన బాలభవన్లో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా నేర్పిస్తున్న పలు కార్యక్రమాలపై ఆరాతీయడంతో పాటు వాటిని పరిశీలించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో రాణించాలని, ఇవి ఉపాధినే కాకుండా మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు. సంగీతం, నృత్యం వంటి కళల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. కళాకారులుగా గుర్తింపు పొంది, జిల్లాకు, రాష్ట్రానికి పేరుతేవాలన్నారు. ఈ సమయంలో నేర్చుకున్న కళలు జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడ్తాయని గుర్తుచేశారు. మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వేసవి చిన్నారులకు మంచి మానసిక ఆటవిడుపుగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో సమర్థంగా సేవలందించాలి
● పీటీసీలో ట్రైనీ ఎస్సైలకు ఎస్పీ సూచనవిజయనగరం క్రైమ్: సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. ఈ మేరకు స్థానిక పీటీసీలో ప్రీ ప్రమోషనల్ ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న 49 మంది ఏఎస్సైల నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీసు శాఖలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆరు వారాల శిక్షణ నిమిత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసిన 49 మంది ఎస్సై శిక్షణార్థులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ మమేకమై, భవిష్యత్తులో ఎస్సైలుగా నిర్వహించాల్సిన విధులపట్ల దిశానిర్దేశం చేశారు. పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు ఎస్పీకి పూల మొక్కను అందజేసి, స్వాగతం పలకగా, పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో సుమారు 35 సం.లు పైబడి సర్వీసు పూర్తి చేసుకుని, నేడు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు శిక్షణకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్సీ వాసుదేవ్, పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ట్రైనీ ఏఎస్సైలు పాల్గొన్నారు. -
రక్తదానం చేసిన మహిళ
విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న ఓ మహిళకు మరో మహిళ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. జామి మండలం జాగారం గ్రామానికి చెందిన అల్లు వెంకటలక్ష్మి శస్త్రచికిత్స నిమత్తం ఘోషాఆస్పత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స నిమిత్తం ‘ఒ పాజిటివ్’ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో వారి బంధువులు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి. రామకృష్ణారావును ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు క్లబ్ సభ్యురాలు సాయి ఝాన్సీ మంగళవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసినందుకు గాను ఝాన్సీని రామకృష్ణారావు, రోగి బంధువు చిన్ననాయుడు సత్కరించారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణసీతంపేట: గిరిజన విద్యార్థులు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్పై శిక్షణలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. నాల్గవ సంవత్సరం చదువుతున్న బీఎస్సీ విద్యార్థులు, ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ప్రెజర్ కుక్కర్ పేలి మహిళకు తీవ్రగాయాలుగజపతినగరం: మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో వంట చేస్తుండగా లక్ష్మి అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద గ్యాస్ పై ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తుండగా ఒక్క సారిగా ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను బంధువులు గజపతినగరం ప్రాంతీయ ఆస్పత్రికి ఆటోలో తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మాజీ సైనికుడికి 10రోజులు జైలుశిక్ష● రూ.10,000 జరిమానా విజయనగరం క్రైమ్/లక్కవరపుకోట: ఒక మాజీ సైనికుడు మందు తాగి డ్రంకెన్ డ్రైవ్లో చిక్కినందుకుగాను కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విజయచందర్ పది రోజులు జైలు శిక్ష, రూ.పదివేలు జరీమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. ఎల్.కోట ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మే 11న ఎల్.కోట పోలీస్ స్టేసన్ పరిధిలో గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా జమ్మాదేవి పేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కూరిమిని శ్రీనివాసరావు మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మాజీ సైనికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి మే 12న కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీసులు మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లే దారిలో సీతం కాలేజీవద్ద 55 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఏఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మృతురాలిని గుర్తించగలిగిన వారు వన్ టౌన్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలపాలని కోరారు. -
రామతీర్థంలో వైభవంగా హనుమాన్ జయంతి
● కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని తమలపాకులు, సిందూరం, పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్కుమార్, పవన్, రామగోపాల్, తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొత్తపేట, ఒమ్మి, సతివాడ, గొర్లిపేట, తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు. విగ్రహాలకు భారీ పూలదండలు వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. -
గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలో నమోదైన గంజాయి (ఎన్డీపీఎస్) కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దర్యాప్తు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..పెండింగ్లో ఉన్న కేసులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ’పిట్ ఎన్డీపీఎస్’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి, వాహనాలకు సంబంధించి న్యాయస్థానాల సమక్షంలో త్వరితగతిన ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు త్వరగా తెప్పించుకుని, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ’సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0’ పేరిట రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక
వెంకట్రాయుడిపేట వద్ద ప్రస్తుతం వీఆర్ఎస్ కాలువ దుస్థితి నోటీసులిస్తాం... జైకా నిధులతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా ముందుకు రావడం లేదు. మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం వేసవిలో పూర్తికాని కాలువల లైనింగ్ పనులు ఈ ఏడాది ఖరీఫ్లోనూ సాగునీటికి కటకటే.. ఆవేదనలో రైతాంగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జైకా పనులు ప్రభుత్వం మారడంతో పనులపై నిర్లక్ష్యం -
నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ సమరభేరి
● నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య అమ్మకానికి కాదు–మా హక్కు, నీట్ మాఫియాను అంతం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్మించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను ఈ విద్యా మాఫియా చిదిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఏ వైఫల్యం.. 2015 నుంచి నేటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన పరీక్షల్లో నాలుగు సార్లు నీట్ పేపర్ లీక్ అవ్వడం, యూజీసీ నెట్ రద్దు కావడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్ధమవుతోందని రామ్మోహనరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నీట్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు కేంద్రానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, గర్ల్స్ కన్వీనర్ శిరీష్, జిల్లా నాయకులు సోమేష్, జగదీష్,నాని, డీవైఎఫ్ఐ నాయకులు హరీష్, రవి, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. 620 మార్కులు వస్తాయని ఆశపడ్డాం నీట్ పరీక్షలో బాగా రాశా. కీలో చూస్తే 620 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు తగ్గవనుకున్నా. మా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. ఇంతలో పరీక్షను రద్దుచేశారు. హతాశయులయ్యాం. మళ్లీ ఇంత ప్రిపరేషన్ సాధ్యమా? విద్యార్థుల భవిష్యత్తుపై పిడుగు వేశారు. – బొట్ట హేమంత్, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి ఇది సరికాదు మా కుమార్తె మాధురి తొలిసారి నీట్ పరీక్ష రాసింది. బాగానే రాయడం వల్ల కీలో కూడా మంచి మార్కులు వచ్చాయి. పరీక్ష రద్దుచేశారని తెలియగానే కుమార్తెతో పాటు తామంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభావం ఉన్నచోట మాత్రమే పరీక్ష రద్దు చేయాలి. – లచ్చుపతుల శ్రీనివాసరావు, విద్యార్థిని తండ్రి -
సజావుగా ఈఏపీసెట్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు 2,060 మందికి 1,893 మంది పరీక్షకు హాజరయ్యారు. 266 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఖరీఫ్లో 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ● వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు కొత్తవలస: రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు రాయితీపై అందజేసేందుకు 48వేల క్వింటాళ్లు వరి విత్తనాలను సిద్ధం చేశామని, అందులో 35 వేల క్వింటాళ్లు 1121 రకం విత్తనాలేనని వ్యవసాయ శాఖ జేడీ వి.తారకరామారావు తెలిపారు. కొత్తవలస ఏడీఏ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా15వేల ఎకరా లుగా పేర్కొన్నారు. 38 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎకరానికి 75 కేజీల యూరియా మాత్రమే అందజేస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవాకేంద్రాల్లో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏడీఏ భానులత ఉన్నారు. దళితుల హక్కులను కాపాడండి ● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం విజయనగరం: దళిత వర్గాల హక్కులను కాపాడి, వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. విజయనగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు, దళితుల నుంచి వచ్చిన వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. మధ్యాహ్నం పలువురి నుంచి వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ యం.లక్ష్మణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏడీ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన, విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమర్ధమైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో ఉన్నత చదువుల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. అనంతరం ఉత్తమమార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, సహాయ సంచాలకులు అరుణజ్యోతి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
హనుమాన్ శోభాయాత్ర
భక్తిశ్రద్ధలతో..విజయనగరంలో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్షాసమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. భాజాభజంత్రీలు, కోలాట ప్రదర్శనలు, డప్పువాయిద్యాల నడుమ జై హనుమాన్ నామస్మరణతో విజయనగరం కోట కూడలి నుంచి గంటస్తంభం మీదుగా హనుమాన్ కూడలి వరకు శోభాయాత్ర సాగింది. పాత మహారాజా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్చార్జి రామ్ తరుణ్, సహాయ కార్యదర్శి రామ్రాజేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
బిల్లులు చెల్లించినా..!
బొబ్బిలి: సాగునీరు సకాలంతో అందితేనే పంటలు పండుతాయి. రైతులు లాభపడతారు. అదే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నిధులతో పనులు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. పూడుకుపోయిన కాలువలు, పాడైన మదుములు, అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులను చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. వేసవి కాలంలో పనులు జరగకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు తప్పవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇదీ పరిస్థితి... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో 71,063 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువలు లైనింగ్ సరిగా లేక, మదుములు మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగక దాదాపు 40 శాతం భూములకు సాగునీరు అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.165 కోట్ల జైకా నిధులతో పనులకు పరిపాలనామోదం వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులకు లైనింగ్తో పాటు ప్రధాన ప్రాజెక్టు, స్పిల్వే వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. దశలవారీగా బిల్లులు కూడా అందాయి. ముందుగా గట్ల పటిష్టతను చేశారు. అలాగే, బుష్ క్లియరెన్స్ చేసి ప్రాజెక్టుల గట్లను పటిష్టం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే, పనులపై శ్రద్ధచూపేవారే కరువయ్యారు. వైఎస్సార్సీపీ హయాంలో బొబ్బిలి–మక్కువ మండలాల మధ్య వీఆర్ఎస్ కాలువ ఇలా (ఫైల్)24,500 ఎకరాల ఆయకట్టు ఉన్న వీఆర్ఎస్ ప్రాజెక్టుకు లైనింగ్ చేపట్టారు. రూ.8.2 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినా మిగులు పనులు పూర్తిచేయలేదు. పెదంకలాం ప్రాజెక్టు పనులకు రూ.36 లక్షల బిల్లులు చెల్లించినా కాంట్రాక్టరు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డకు లక్ష్యం ప్రకారం పనులు చేయలేదని బిల్లులు కూడా చెల్లించలేదు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు వేసవిలో ప్రారంభిస్తేనే జూన్లో ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు వీలుంటుంది. అధికారులు మాత్రం ప్రతిసారీ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు చెప్పడం, వారు తలూపడం వదిలేయడం మామూలైపోయింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. -
లేబర్ కోడ్ రూల్స్ మాకొద్దు
విజయగనరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగారుస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రం నోటిఫై చేసిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతాలను దహనం చేశారు. కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. పని గంటలను 12కు పెంచడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్మిక దోపిడీ విధానాలను అడ్డుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, కోశాధికారి ఎ.జగన్మోహన్రావు, కార్యదర్మి బి.సూర్యనారాయణ, సీహెచ్ వెంకటేష్, బాధిత హెల్పర్లు కిల్లాడ అనసూయ, ముగడ భాగ్యలక్ష్మి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల భవిష్యత్తుకు మాది భరోసా
● పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి, సదుపాయాలు చూసి తమ పిల్లలను చేర్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి జమ్ము నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. 591కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 13 మంది, 585కు పైగా మార్కులు సాధించిన వారు 68 మంది, 550కు పైగా మార్కులు సాధించిన వారు 1238 మంది, 500కు పైగా మార్కులు సాధించిన వారు 4,174 మంది ఉన్నారని వెల్లడించారు. ఈ ఫలితాలే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు, ఎంఈఓలు పి.సత్యవతి, సీహెచ్ ఆనందమూర్తి, ప్రధానోపాధ్యాయులు వి.హరికృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చందులూరులో ఉపాధి నిధుల మేత..!
చందులూరులో ఉపాధిహామీ నిధుల స్వాహాపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి వివరిస్తున్న గ్రామస్తులు విజయనగరం గంటస్తంభం: జిల్లాలో లక్కవరపుకోట మండలం చందులూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్జీ) నిధులు అక్రమార్కులకు అక్షయపాత్రగా మారాయి. పేదలకు పని కల్పించాల్సిన నిధులను అధికార టీడీపీ పార్టీ నాయకులు, అధికారులు కలిసి అప్పనంగా బోంచేస్తున్నారు. దాదాపు రూ.2 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. గ్రామసభ తీర్మానాలు లేవు.. సాంకేతిక అనుమతులు లేవు.. కానీ ఎం బుక్కుల్లో మాత్రం రికార్డులు చకచకా నమోదువుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న అఽధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం వినతిపత్రం అందజేశారు. గత నెల ఏప్రిల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ అడిట్)లో రూ.21 లక్షలు అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనికి బాధ్యులుగా ఏఈ, ఈఏలను గుర్తించి రికవరీకి ఆదేశించారు. అయితే, ఇది కేవలం మంచుకొండ చివర మాత్రమేనని, లోతుగా విచారిస్తే రూ.2 కోట్ల భారీ కుంభకోణం బయటపడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులకు కన్నీళ్లు... అధికారుల మౌనం... అక్రమార్కులకు వరం ఒకే తీర్మానం.. అనేక దోపిడీలు! ఒక్క గ్రామసభ తీర్మానాన్ని పట్టుకుని ఒకే చోట పలుమార్లు వేర్వేరు పనుల పేరిట అనుమతులు పొందుతూ నిధులు కాజేస్తున్నారు. ఒక ప్రాంతంలో రూ.10 లక్షలతో పనులు పూర్తి చేసి, కొన్ని నెలల తర్వాత అదే తీర్మానంతో రూ.40 లక్షల అంచనాలతో మరో పనిని సృష్టించి బిల్లులు డ్రా చేస్తున్నారు. ఆరేళ్ల కిందట వేసిన సిమెంట్ రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేసినట్లు చూపి రూ.25 లక్షలు కాజేశారంటే ఇక్కడ అక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రూ.2కోట్ల ఉపాధిహామీ నిధులు స్వాహా! నిబంధనలు తుంగలో తొక్కిబిల్లుల డ్రా.. ప్రజాధనం లూటీ చేస్తున్న పచ్చపార్టీ నేతలు పాత పనులకే కొత్త రంగులు అక్రమ మైనింగ్తో చెరువుల విధ్వంసం రైతుల అనుమతి లేకుండానే పొలాల్లో రోడ్లు ఉపాధి నిధుల గోల్మాల్పై కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు రైతుల పొట్ట కొడుతున్నారు మా అనుమతి లేకుండానే మా పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల పొలాల్లోకి నీరు చేరి పంట నష్టపోతున్నాం. ట్రాక్టర్లు కూడా దిగనివ్వడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని కొందరు నాయకులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నారు. – పి.వి.జగన్నాథం, రైతు, చందులూరు అడుగడుగునా అవినీతే... చందులూరులో గ్రామసభ తీర్మానం లేకుండానే కోట్ల రూపాయల పనులు మంజూరు చేసుకున్నారు. టెండర్లు లేవు. పారదర్మకత లేదు. అక్రమ పనులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ దోపిడీపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి. – యడ్ల కిశోర్కుమార్, ఎంపీటీసీ, చందులూరు గ్రామంలో బాపుని చెరువు అడ్డుగా సుమారు 600 మీటర్లు పొడవున అక్రమంగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. దీనివల్ల వర్షపునీరు బయటకు వెళ్లే దారిలేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఒక నాయకుడికి చెందిన 60 ఎకరాల సైట్ ప్రయోజనం కోసం సామాన్య రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోంచి 60 అడుగుల రోడ్డును దౌర్జన్యంగా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి ఇలాకాలో మద్యం దందా..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో లిక్కర్ దందా సాగుతోంది. అక్రమ వ్యాపారానికి ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఇన్నాళ్లూ నకిలీ మద్యం మాత్రమే ఉందని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) ఉల్లంఘనకు తెరతీయడంతో ఆందోళన చెందుతున్నారు. లిక్కర్ షాపులను ప్రధాన వనరుగా మార్చుకున్న ‘పెద్దలు’ ఒక్కో క్వార్టర్ మీద రూ.10, బీరుపై రూ.10 అద నంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ మద్యం ఫుల్బాటిల్ మీద రూ.50 వరకు అదనపు భారం వేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎండకాలం చల్లగా బీర్లు ఉండాలంటే రూ.10 ఇవ్వాలి బ్రదర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతేమరి... గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల్లో మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి లాటరీలో ఎవరికీ దక్కినప్పటికీ వాటిని సిండికేట్ రూపంలోకి మార్చి ఆ సిండికేటును టీడీపీ నాయకులే నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే తమకు అనుకున్న లాభాలు రావడం లేదని... ఇలాగైతే మద్యం షాపు దక్కించుకుని ప్రయో జనం ఏముందని భావించిన వాళ్లంతా మంత్రి వద్ద తమగోడు వెళ్లబోసుకోగా... ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముకునేందుకు మంత్రితోపాటు, మాజీ ఎంపీపీ కొండబాబు కూడా మద్దతు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రతిసీసా మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై కొందరు మందుబాబులు వాగ్వాదం చేస్తున్నా... అదనపు వడ్డన మానడంలేదు. అంతా ఓ మాజీ జెడ్పీటీసీ కనుసన్నల్లోనే... ఈ మద్యం సిండికేటు ఏర్పాటు... వారి మధ్య ఏర్పడే చిక్కులు... వాటాల పంపకం.. తదితర బాధ్యతలన్నీ ఓ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చూస్తున్నారు. పోనీ ఇంత పెద్దరికం చేస్తున్నందుకు మీ గురువుకు ఏమైనా కాణి పరకా మిగులుతుందా అంటే అబ్బే అదేం లేదు. మావాడిది అంతా పైసారాని దండాసి చాకిరీ అని ఆయన అనుచరులు సైటెర్లు వేసుకుంటున్నారు. ధరల పెంపు ద్వారా సమకూరుతున్న అదనపు ఆదాయంలో సగం నాయకుడికి... మిగతా సగం వ్యాపారులు... ఎకై ్సజ్ వాళ్లకు సర్దుబాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామ్మూళ్ల ‘మత్తు’... వాస్తవానికి అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడే అధికారులకు పని ఉంటుంది. అక్కడే వాళ్ల పవర్ చూపుతారు. ఇప్పుడు లిక్కర్ షాపుల వాళ్లు రేట్లు పెంచి అమ్ముతుండడంతో ఎకై ్సజ్ అధికారులు కొందరు మా సంగతి ఏమిటి? రైడ్స్ చేయాలా ఏంది అంటూ కన్నుగీటుతున్నారు. వచ్చిన పది రూపాయల్లో మంత్రి ఖాతాలోకి కొంత... సిండికేట్కు కొంత.. పోలీసులు.. ఎకై ్సజ్ వాళ్లకు కొంత ఇచ్చుకుంటూ వస్తున్నామని మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రతినెలా గజపతినగరం నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు పెంచడంతో నెలకు రూ.50లక్షల వరకు మందు బాబులపై పడుతోంది. అ‘ధన’పు వసూళ్లు అన్నీ వాటాలుగా పంచుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనాథుడు, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ -
ప్రభుత్వబడి పిల్లలకు విమాన ప్రయాణం
● మాట నెలబెట్టుకున్న తెలుగు మాస్టారు సత్యారావు విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, పోటీతత్వాన్ని పెంచేందుకు గోపన్నవలస జెడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాను ఇచ్చిన మాట ప్రకారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదివారం విశాఖ నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లారు. విమాన ప్రయాణం చేసిన వారిలో మంత్రి విజయలక్ష్మి, నామాల లిఖిత, సంచాన దినేష్, ఇప్పిలి శేఖర్, మంత్రి ప్రియవర్షిని, గండ్రేటి కార్తీక్ ఉన్నారు. విజయవాడలో పలు దర్మనీయ ప్రదేశాలను సందర్మించిన అనంతరం వీరు సోమవారం విజయనగరం చేరుకున్నారు. కలెక్టర్ రాంప్రసాద్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఏడాది కూడా విద్యార్థుల తల్లిదండ్రులను విమానం ఎక్కించి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించారు. -
శవాలపై కాసుల వేట..!
●డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం ●పైసలివ్వకుంటే అంతే.. ●రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు! ●విజయనగరం మండలానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ సిబ్బంది పోస్టుమార్టం చేయడం కోసం రూ.3200 మృతురాలి బంధువుల నుంచి తీసుకున్నట్టు తెలిసింది. రూ.1000 కంటే ఎక్కువ ఇచ్చుకోలేం.. అని చెప్పినప్పటకీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో అడిగినంత ఇవ్వక తప్పలేదు. ●గంట్యాడ మండలానికి చెందిన ఎర్నాయుడు అనే వ్యకి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయడానికి రూ.2500 తీసుకున్నట్టు సమాచారం. ●విజయనగరం పట్టణానికి చెందిన ఓ మహిళ అగ్ని ప్రమాదంలో ఇటీవల మృతి చెందింది. ఆమె మృతదేహానికి కూడా పోస్టుమార్టం చేయడానికి రూ.3 వేలు వరకు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే మృతదేహాల పోస్టుమార్టంకు అక్కడ ఉన్న సిబ్బంది రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓ వైపు తమ కుటుంబసభ్యులు మృతి చెందారనే ఆవేదనతో బంధువులు ఉంటే... మృతదేహం పోస్టుమార్టం కోసం ఇలా పైసలు పేరిట సిబ్బంది వేధించడంతో వాళ్లు మరింత కృంగిపోతున్నారు. చివరకు శవాలను కూడా వదలడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇంతకంటే దౌర్భగ్యం ఏముందంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడే వారి మృతదేహాలు ఇక్కడకు పోస్టుమార్టం నిమిత్తం వస్తాయి. వీటిపై కింది సిబ్బంది కాసుల వేట సాగిస్తున్నారు. బంధువులు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగింతలో చెప్పలేనంత ఆలస్యం చోటు చేసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో తీరని ఆవేదనలో కూడా మృతుల కుటుంబసభ్యులు సిబ్బంది అడిగినంత ముట్టజెప్పక తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.3 వేల నుంచి రూ.5 వేలు వరకు వసూలు మృతదేహం పోస్టుమార్టం చేయడానికి కూడా సిబ్బంది నిర్ధిష్టమైన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం రూ.3 వేలకు తక్కువైతే పోస్టుమార్టం చేయకుండా అక్కడ వైద్య సిబ్బంది కావాలనే జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చేసేది లేక సిబ్బంది అడిగినంత సమర్పించుకుంటున్నారు. తాము పేదవాళ్ల మని ఎంతగా ప్రాధేయపడుతున్నా... సిబ్బంది కనికరించడం లేదు. పోస్టుమార్టం గదిలో విధులు నిర్వహించాల్సిన వారు పూర్తిగా మానవత్వాన్ని మరచి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యాధికారులకు సైతం ఈ విషయం తెలిసినప్పటికీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మార్చురీ సిబ్బంది అడిగినంత ఇచ్చేయండని కొందరు పోలీసులు కూడా చెబుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇలా శవాలపై కాసుల దందా సాగిస్తున్న దానిపై ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తుల మృతదేహాలు ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఉచితంగా పోస్టుమార్టం చేయాలి. డబ్బులు వసూలు చేయడం కూడదు. అలా చేసినట్టు నా దృష్టికి రాలేదు. ఒక వేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే లిఖితపూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేయాలి. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
పైళ్లెంది.. విషాదం మిగిలింది..
వారిద్దరూ ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఒకరు శనివారం విజయనగరంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మళ్లీ తమ రూమ్కు వచ్చేందుకు అట్నుంచి మరో స్నేహితుడితో కలిసి బైక్పై ఇద్దరూ వస్తున్నారు. ఇంతలోనే దారి కాచిన మృత్యువు వారిని అయినాడ జంక్షన్ వద్ద కాటేసింది. స్నేహితులతో సందడిగా.. సంతోషంగా అప్పటి వరకు గడిపిన వారిద్దరూ ఇంతలోనే మృత్యువు పాలవడంతో ఇటు కుటుంబాల్లోనూ... అటు స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ/మక్కువ/సీతానగరం: డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మణం చెందారు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ అయినాడ జంక్షన్ వద్ద చింతలవలస గ్రామం వైపు వచ్చేందుకు కుడివైపు తిరుగుతున్న క్రమంలో డీసీఎం వాహనాన్ని విజయనగరం నుంచి వస్తున్న మోటారుసైకిల్ ఢీకొంది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న తన్నా హర్షచైతన్య(19), రెడ్డి ఉదయ్కుమార్(20) తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న రెడ్డి ఉదయ్కుమార్ను విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు అతివేగంతో వచ్చిన కారు ముందు భాగంతో కొంత దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఉదయ్కుమార్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హర్షచైతన్యను చికిత్స నిమిత్తం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తన్నా హర్షచైతన్య చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీంతో చింతలవలసలోనే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. శనివారం విజయనగరంలో ఓ పెళ్లికి వెళ్లిన హర్షచైతన్య తిరుగు ప్రయాణంలో స్నేహితుడు రెడ్డి ఉదయ్కుమార్తో మోటారు సైకిల్పై విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అయినాడ జంక్షన్ వద్ద చింతలవలసకు వెళ్లేందుకు తిరగాలి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వస్తున్న డీసీఎం వాహనాన్ని మోటారుసైకిల్ ఢీకొంది. రెండు నిమిషాల్లో రూమ్కు చేరుకోవాల్సిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరణించిన హర్ణచైతన్యది మక్కువ మండలంలోని ఎ.వెంకంపేట గ్రామం. ఇదే ప్రమాదంలో మరణించిన రెడ్డి ఉదయ్కిరణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని కొత్తవలస గ్రామం. సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగర తీరాన..సందడి..!
విజయనగరం గంటస్తంభం: అవి పర్యావరణ రాయబారులు.. సముద్రపు ఆరోగ్యాన్ని చాటిచెప్పే సంకేతాలు. ప్రకృతి సమతుల్యానికి ప్రతీకలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో విజయనగరం జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆశ్రయించి సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీర ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరుస్తూ, పిల్లలుగా పొదిగిన అనంతరం తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతోంది. 2025–26 సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 52 వేల తాబేళ్ల గుడ్లను సేకరించగా, వాటిలో 41 వేల పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేశారు. మిగిలిన గుడ్లును కూడా ప్రత్యేక సంరక్షణలో ఉంచి పిల్లలుగా మారిన వెంటనే సముద్రంలో విడిచిపెట్టేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. పర్యావరణ హితులైన ఆలివ్ రిడ్లేలు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కనిపించే ప్రాంతాలు కాలుష్యం తక్కువగా ఉండే పర్యావరణ హిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయి. గుజరాత్ నుంచి ఒడిశా వరకు భారత తీర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూ సంతతి వృద్ధి కోసం ప్రశాంతమైన తీరాలను ఎంపిక చేసుకుంటాయి. అలల తీవ్రత తక్కువగా ఉండే, మానవ కదలికలు తగ్గిన ప్రాంతాల్లో గూళ్లు కట్టి ఒక్కో తల్లి తాబేలు 100 నుంచి 130 వరకు గుడ్లు పెడుతుంది. పది హేచరీస్లతో సంరక్షణ కవచం జిల్లాలోని బొడ్డుగుయ్యపేట, తిప్పలవలసల్లో రెండేసి చొప్పున, చేపలకంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లి ప్రాంతాల్లో ఒక్కో హేచరీస్ ఏర్పాటు చేశారు. మొత్తం పది హేచరీల్లో ప్రస్తుతం 246 గూళ్లను భద్రపరిచి సంరక్షిస్తున్నారు. హేచరీస్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గుడ్ల సంరక్షణతో పాటు పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం 25 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల్లో అవగాహన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో మత్స్యకారుల పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వేట వలలు, గ్రిల్నెట్స్, టేకు వలలు వల్ల తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు చిక్కుకున్నప్పుడు వెంటనే సముద్రంలో వదిలేయాలని సూచిస్తున్నారు. వలల మృత్యుపాశం.. టెడ్ వాడకం అనివార్యం సముద్రంలో చేపల వేట కోసం వాడే యాంత్రిక బోట్ల వలల్లో చిక్కుకుని ఏటా వందలాది తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇవి పైకి రావాల్సి ఉంటుంది. కానీ వలల్లో చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు టెడ్ పరికరాలను వలలకు అమర్చుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
రైతుసంక్షేమంలో ప్రభుత్వం విఫలం
రేగిడి: రైతులకు సంక్షేమపథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించుకున్న మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ధర రూ. 2500లు మొక్కజొన్నకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లుకు విక్రయించడంతో ఎకరాకు వేలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న సాగునీటి వనరులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మడ్డువలస ప్రధాన కుడికాలువకు అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలు పూర్తిగా పాడవడంతోపా టు షట్టర్లు, తలుపులు లేకపోవడంతో పంటపొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇటు రైతు, అటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కూట మి ప్రభుత్వం హాయిహాయి గారడీగా ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాలకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరీఫ్కు ముందుగానే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచేవారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
పాదర్శకత ఉండాలి
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి పాదర్శకత అవసరం. జిల్లాలో అనేక మంది తల్లికి వందనం పథకం లబ్ధి కోల్పోయారు. గత వైఎస్.జగన్ హయాంలో లబ్ధి పొందినవారు గత ఏడాది అర్హత పొందలేకపోయారు. యూడైస్లో తప్పుడు సమాచారం ఆన్లైన్ ద్వారా నమోదైనట్లు చెప్పిన యంత్రాగం వాటిని సరిచేసుకున్నా నగదు జమ చేయలేదు. గతంలో ముఖ్యంగా పాలకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో అనేకులు అర్హత కోల్పోయారు. పాదర్శకంగా వివరాలు నమోదు చేయడంతో పాటు గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఈ ఏడాది రూ.30వేలు జమ చేయాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ -
ఆ గ్రామానికి సర్టిఫికెట్ల సమస్య
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామాన్ని సర్టిఫికెట్ల సమస్య వేధిస్తోంది. విద్యాసంవత్సరం ముగిసింది. తమ పిల్లలు మరో మెట్టుపైకి వస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోతూ సచివాలయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం వెళ్లుంటే అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత సంతకవిటి వెళ్లాలని అక్కడ తహసీల్దార్ సంతకం చేసుకుని రాజాం తహసీల్దార్ వద్దకు వెళ్తే సర్టిఫికెట్ వస్తుందని చెబుతుండడంతో అవాక్కవుతున్నారు. గతంలో ఈ సమస్య ఎప్పుడూ రాలేదని వారితే చెప్పినా తమకు ఫలితంలేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సేవలు ప్రజల ముంగిటకే అందేవి. విద్యార్థులకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే వెంటవెంటనే అందడం వంటి సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కావాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న రాజాంలో కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడినుంచి మళ్లీ సర్టిఫికెట్లు పొందేందుకు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి రాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలోనే అందించాలని కోరుతున్నారు. ఇదీ అసలు సమస్య.. 2005 వరకు సంతకవిటి మండలంలో కొనసాగిన పొనుగుటివలస గ్రామం ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీలో కొనసాగుతోంది. 2005లో రాజాం మండలంలోని రాజాం, సారథి మేజర్ పంచాయతీలతోపాటు కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా ఏర్పాటుచేశారు. అప్పటికే ఈ పంచాయతీలకు సర్పంచ్లుగా ఉన్నవారి పదవీకాలం ముగియకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో నగరపంచాయతీ (2020లో థర్డ్గ్రేడ్ మున్సిపాల్టీగా రాజాం అప్గ్రేడ్) ఏర్పడినప్పటికీ మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. దీంతో సంతకవిటి మండలంలో భాగమైన పొనుగుటివలస రెవెన్యూ, పంచాయతీ రికార్డులు నగరపంచాయతీకి అప్పగించకుండా సంతకవిటి మండలంలోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి ప్రతి పనికి మున్సిపాల్టీకి వెలితే సంతకవిటి మండలానికి వెళ్లాలని, సంతకవిటి వెళ్తే నగరపంచాయతీకే వెళ్లాలని అధికారులు చెబుతుండడంతో చేసేదిలేక అటూ ఇటూ తిరుగుతూ ఏదో విధంగా గ్రామస్తులు తమ పనులను మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల విషయంలో ప్రజలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు మండలాల నడుమ నలుగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయంలోనే సర్టిఫికెట్ల అందజేత సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు -
మడ్డువలసలో తగ్గుతున్న నీటిమట్టం
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్ఫ్లోస్ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా ఉద్యోగోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్పై క్రేన్ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు. -
కిల్లో స్వప్న పేరు వచ్చింది
నా కుమార్తె కార్తిక ప్రస్తుతం 7వ తరగతి చదువుతుంది. నా బిడ్డ తల్లి పేరు కిల్లో స్వప్న అని ఆన్లైన్లో నమోదు కావడంతో గత ఏడాది లబ్ధి కోల్పోయాం. మధ్యతరగతి కుటుంబం మాది. ఈ పథకం వర్తిస్తే పిల్ల చదువులకు ఉపయోగపడతాయి. గతంలో వచ్చిన సాంకేతిక సమస్య పరిష్కారం కోరి సచివాలయంలో అర్జీచేశాం. అటుపై ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిందన్నారు. త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఫలితం లేకపోయింది. ఈ ఏడాదైనా పథకం వర్తింపజేయాలి. అల్లెన భావన, లబ్ధికోల్పోయిన విద్యార్థిని తల్లి, పాలకొండ -
ఆలయ నిర్మాణాలపై వీహెచ్పీ ఆరా
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలను, విగ్రహల ఏర్పాటును వీహెచ్పీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఫల్గుణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, వీహెచ్పీ ఇతర సభ్యులు అనంత్, జిల్లా అధ్యక్షుడు చింతా భాస్కరరావు, సీతానగరం మండల అధ్యక్షుడు జి.బాలకృష్ణ తదితరులు పరిశీలించారు. తోటపల్లి ఆలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించి బీజేపీ, వీహెచ్పీ చేసిన ఆందోళనల నేపథ్యంలో వారు స్పందించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే తోటపల్లిలో స్వయం భుగా వెలసిన విగ్రహం 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహాన్ని ఆర్అండ్బీ రోడ్ స్థలంలో రేకుల షెడ్లో బంధించి ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో విగ్రహాలు, నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర వివరాలపై సిబ్బంది, అర్చకులతో మాట్లాడి ఆరా తీశారు. పుట్టు దేవుని విగ్రహాలను బయట ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. తోటపల్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించి నోట్ చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎండోమెంట్ వారితో స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసేలా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. విగ్రహ పునఃప్రతిష్టకు చర్యలు -
పెళ్లింట విషాదం
● లారీ, ఆటో ఢీకొని ఇద్దరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్ధితి విషమంజామి: పెళ్లింట బంధువులు, మిత్రులు అంతా సరదాగా గడిపారు. పెళ్లి కూడా సందడిగా జరిగిపోయింది. బంధువులు ఎవరింటికి వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలోనే విషాదవార్త వినవలసి వచ్చింది. మరో పదినిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటారనగా లారీ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలంలోని తోటవలస గ్రామంలో ఆడపిల్ల ఇంటివద్ద వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఆదివారం పెండ్లి కుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు, తల్లి కనకమ్మ, వరుసకు పెళ్లి కుమార్తె చిన్నాన్న విజయనగరం మండలం చాకలిసేటకు లావేటి పైడిరాజు, పిన్ని గౌరమ్మ, బంధువులు ఆటోలో తిరిగి పెండ్లికుమారుడి స్వగ్రామం జామి మండలంలోని అన్నంరాజు పేట గ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో జామి మండలంలోని జన్నివలస వద్ద విశాఖ గ్రీన్ఫీల్డ్ హైవేపై పాచిపెంటనుంచి వస్తున్న ఆటోను జామి నుంచి విజయనగరం వెళ్తున్న లారీకి టైర్ పంక్చరై అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసిరావు(62), అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికుమార్తెకు వరుసకు చిన్నాన్న లావేటి పైడిరాజు(52), పెండ్లి కుమారుడి తల్లి కనకమ్మ, బంధువులు ఒకే కుటుంబానికి చెందిన మడ్డు రాఘువ, వట్టి సాయి కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లావేటి పైడిరాజు మృతిచెందాడు. కనకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జామి ఎస్సై వీర జనార్దన్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శ్మశాన వాటిక పరిశీలన
● పరిష్కారం కాని దళితుల శ్మశాన, అసైన్డ్ భూవివాదం ● రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న రెవెన్యూ అధికారులు ● సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటున్న రిటైర్డ్ జడ్జిజియ్యమ్మవలస రూరల్: కొన్నేళ్లుగా మండలంలోని చింతలబెలగాం గ్రామ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక, అసైనన్డ్ భూములపై వివాదం కొనసాగుతోంది. దళితుల అసైన్డ్ భూముల రెవెన్యూ ట్యాంపరింగ్, ఆన్లైన్ మార్పులు, ఆక్రమణలు శ్మశాన వాటిక ఆక్రమణ ఇలాంటి ఎన్నో విషయాలపై సామాజిక కార్యకర్త బెలగాం ప్రవీణ్ కుమార్ అనేకమార్లు ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎస్ శ్యాం సుందర్ జయరాజు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. దళితులకు జరిగిన అన్యాయంపై ఆయన విచారణ చేసి ఇదే గ్రామంలో దళిత మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేస్తే స్థానికులు ఆ భూమిని ఆక్రమించి పాతిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయిటకు తీయించి వేరే చోటకు మార్పించిన ఘటన పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని స్థానిక రిటైర్డ్ వీఆర్ఓ తన కుమార్తె పేరున పాస్బుక్ ఎలా చేయించుకున్నారో చెప్పాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని తక్షణమే అసైన్డ్ భూమిని దళితులకు విడిచిపెట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు దళితులకు శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ పరిశీలించి అప్పగించాలని కోరారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో నిజానిజాలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. కాదని స్థానిక నాయకులు అడ్డుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై దళితులకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్న ప్రవీణ్ను బెదిరింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా చింతల బెలగాంలో దళితుల శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను దళితుల వైపు బడుగు బలహీన వర్గాల వైపు పని చేస్తూ వారికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. -
ఎడారిలా నాగావళి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న నాగావళి నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. వేసవి ఎండల ప్రభావంతో నదిలో గతంలో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా పూర్తిగారాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీపరీవాహక గ్రామాలైన సంకిలి, బొడ్డవలస, పుర్లి, కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన చెందుతున్నారు. బాలేరులో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని బాలేరులో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం విధ్వంసం సృష్టించింది. కోత దశలో ఉన్న వరిచేను పొలాల్లో తిరుగాడుతూ పంటను నాశనం వేశాయి. రైతుల పొలాల్లోని బోర్వెల్స్ పైపులను విరగ్గొట్టి వాటిలోని నీటిని తాగాయి. బాలేరుకు చెందిన ఎర్నాగుల అప్పారావు 5 హెచ్పీ బోరును పాడు చేశాయి. పొలాల్లో తిరుగాడుతూ వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల ప్రయాణం మారడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలను లెక్కించాలని కోరుతున్నారు. న్యాయమూర్తుల గృహ సముదాయనికి భూమి పూజవిజయనగరం లీగల్: జిల్లా కేంద్ర న్యాయమూర్తుల గృహ సముదాయనికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో శిథిలావస్థలో వున్న భవన సముదాయాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్లతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో 80 వాహనాలు సీజ్ విజయనగరం క్రైమ్: స్థానిక డబుల్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని 120 ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, సారా, అక్రమ మద్యం నిల్వలు, మాదకద్రవ్యాలు, నాటు తుపాకులు, అక్రమ వాహనాలు ఉన్నవీ లేనివీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరంతో తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వాహన ధ్రువపత్రాలు సక్రమంగా లేని 80 వాహనాలను సీజ్ చేసి, స్టేషన్కు తరలించినట్లు విజయనగరం రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రామారావు, కృష్ణమూర్తి, కనకరాజు, కానిస్టేబుళ్లు నాగమణి, సంధ్య, రజియా తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరం టౌన్: స్థానిక కేఎల్ పురం గురుద్వార వద్ద జై జులేలాల్ సింద్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా లక్ష్మీచంద్ లాల్వానీ, ఉపాధ్యక్షుడిగా శశి కుక్రేజా, కార్యదర్శిగా హరేష్ లాల్వానీ, సహాయ కార్యదర్శిగా రామ్లాల్ లాల్వానీ, కోశాధికారిగా కె.రాజేంద్ర ఎన్నికయ్యారు. -
50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 95 పాఠశాలల బస్సుల్లో ఫిట్నెస్, బస్సుల రికార్డులను ఇప్పటివరకు 50 బస్సులకు జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, సాంకేతిక పరిస్థితులు పరిశీలించి, మిగిలిన 45 బస్సులను కూడా త్వరలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సులు సురక్షితంగా నడవడం లక్ష్యమని డీటీఓ తెలిపారు. బస్సులను తనిఖీ చేయించుకోకపోతే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. -
తల్లికి వందనం ఎందరికో?
పాలకొండ రూరల్: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి ఏడాది తల్లికి వందనం పథకం అమలు ఎగ్గొట్టారు. గతేడాది జిల్లాలో వేల మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా నేటికి పలురువురు తల్లుల ఖాతాల్లో లబ్ధి జమ చేయకుండా ఎగనామం పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు ఈ ఏడాది తల్లుల ఖాతాల్లో జమ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టత లేదు.. కూటమి సర్కారు తల్లికి వందనం పథకం ప్రకటించిన తొలి ఏడాది 2024లో అమలుకు నోచుకోలేదు. అర్హత ఉన్నప్పటికీ గతేడాది అనేక కారణాలు చూపుతూ జిల్లాలో వందల మందికి కోత పెట్టింది. దీంతో అప్పట్లో తల్లులంతా స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధిక విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, లెక్కకు మించి భూములు ఉన్నాయని కారణాలు చూపించారు. అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారిలో పిల్లల తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ అనే మహిళ పేరు అనేక మంది పిల్లలకు నమోదైంది. ఆమె పేరిట ఉన్న ఆస్తులను చూపించి పలువురికి తల్లికి వందనం నిలిపివేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, నమస్యలు పరిష్కరించుకోవాలని, అర్హత ఉండి లబ్ధి కోల్పోయినట్లు ఏ ఒక్కరు చూపించినా లబ్ధి చేకూరుస్తామని సంబంధిత మంత్రి చెప్పినా అంతా బూటకంగానే సాగింది. తొలివిడత జాబితాలో సొమ్ములు జమకాని విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల నుంచి పరిష్కార పత్రాలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు తల్లులంతా అందించారు. ఈ క్రమంలో వారికి ఎలిజిబల్ లిస్టుల్లో పేర్లు వచ్చాయి అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఇంకెన్ని కొర్రీలు పెడతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సరైన వ్యవస్థ లేదు.. ప్రస్తుత సర్కారు జిల్లాలో1,584 పాఠశాలల్లో ద్వారా బోధన పొందుతున్న ప్రతి విద్యార్ధికి రూ.15వేలు అందిస్తామని నమ్మబలికింది. ఈ క్రమంలో 2025 జూన్లో 69,600 మంది తల్లులకు సంబంఽధించి లక్షా 8,951 మంది పిల్లలను అర్హులుగా ప్రకటించారు. వారిలో ఒకరికి మించి బిడ్డలున్న తల్లులు 39వేలుగా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో వారికి లబ్ధి చేకూర్చలేకపోయారు. పథకం వర్తింపులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ లేకుండా పోయింది. పాఠశాలల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో పిల్లల వివరాలు నమోదు చేయటం వరకే తమ పని అని, సమస్య పరిష్కారం కావడం తమ చేతుల్లో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో ఇంట్లో ఒకరికి ఈ పథకం వర్తింప చేసినప్పుడు జిల్లాలో దాదాపు 85 వేల మందికి లబ్ధి అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో పథకం అందలేదన్న సమస్య తలెత్తకపోవడం పారదర్శకతకు నిదర్శనం. తాజా ఏడాది 2026కి సంబంధించి 15 మండలాల పరిధిలో లక్షా 18వేల పై చిలుకు విద్యార్థులు బోధన పొందుతున్నట్లు విద్యా శాఖ పేర్కొంటోంది. వారి పూర్తి వివరాలను ఈ నెల 15 నాటికి యూడైస్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్లో అందించనున్న లబ్ధితో పాటు గతంలో అర్హత కోల్పోయి, శాంక్షన్ లిస్టులో తమ పేర్లు ఉన్నందున బకాయి మొత్తం కలిపి నగదు జమ చేయాలంటూ పలువురు తల్లులు కోరుతున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అందుతుందా..? లేక గతంలో మాదిరి కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అనే చర్చ జరుగుతోంది. గతంలో ఏర్పడ్డ లోపాలు, సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ధి అందించాలని పిల్లల తల్లులు కోరుతున్నారు. గత ఏడాది వేలమందికి ఎగనామం నేటికీ కొంతమంది తల్లులకు జమకాని లబ్ధి నాడు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం వచ్చే నెలలో మలివిడత తల్లికి వందన కార్యక్రమం శతశాతం అర్హులకు నిధుల జమపై తొలగని సందేహాలు ఈనెల 15 నాటికి పిల్లల వివరాల నమోదుకు ఆదేశాలు -
తల్లిని మించిన దైవం లేదు
● ఘనంగా మాతృభాషా దినోత్సవం ● తల్లులకు సత్కారం విజయనగరం టౌన్: బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. నడక, నడత నేర్పే గురువు తల్లి, ఆమెను మించిన దైవం లేదని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గీతాంజలి పాఠశాలలో శనివారం పలువురు మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి మాట్లాడుతూ అమ్మ అంటే దైవసమానమని, అమ్మప్రేమకు ప్రత్యామ్నాయం లేదన్నారు. న్యాయవాది నాలుగెస్సుల రాజు, వస్త్ర వ్యాపారవేత్త పులిపాటి రామారావు, జెడ్పీహైస్కూల్ తెలుగు పండిట్ దశగ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యంలు మాతృమూర్తి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం రచయిత శ్రీనివాసరావు రచించిన పైడితల్లి పదాలు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బి.రమేష్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవి, విశ్వసాహితీవేదిక అధ్యక్షురాలు భోగరాజు సూర్యలక్ష్మి, న్యాయవాది దాసరి పద్మ, తదితరులు పాల్గొన్నారు. డీఎఫ్ఓగా సోమసుందరం విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు. జిల్లా సర్వే అధికారి బదిలీ ● ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి (ఏడీ) ఎం.శ్రీనివాసరావుకు బదిలీ అయ్యింది. జిల్లాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయనను ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పార్వతీపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో ఐఓఎస్గా పనిచేస్తున్న ఎ.మన్మథరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పలు ఆరోపణల నేపథ్యంలో వేటు వేశారా? జిల్లా సర్వే అధికారిగా ఎం.శ్రీనివాసరావు బదిలీపై వచ్చి కొద్ది నెలలే అయ్యింది. మొదటి నుంచి ఆయన వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వచ్చా యి. ప్రధానంగా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నట్లు, కార్యాలయంలో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు వారిని ఉంచేస్తున్నట్లు, అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే విషయమై ఓ మహిళా ఉద్యోగిని ఇటీవల నాలుగు పేజీల ఫిర్యాదును సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ విషయంలో గతంలో ఒకసారి కలెక్టర్, జేసీ కూడా ఆయనను పిలిచి మందలించారు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని తెలిసింది. మరోసారి జేసీకి నేరుగా ఫిర్యాదు వెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏడీకి బదిలీ కావడం గమనార్హం. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం వెనుక ఆయన మీద వచ్చిన ఆరోపణలే కారణంగా తెలుస్తోంది. సెల్ఫోన్ల రికవరీ పూసపాటిరేగ: మండలంలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి వారికి శనివారం అందజేశారు. ఎవరి ఫోన్లు పోయినా ఐఎంఐ నంబర్తో వచ్చి ఫిర్యాదు చేయాలని, రికవరీ సాధ్యమవుతుందన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది...
● విడుదలైన నోటిఫికేషన్ ● ఈ నెల 30 వరకు గడువుపాలకొండ రూరల్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల కిందట వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలో టెన్త్ మార్కులు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ సీటు లభిస్తే ఇంటర్ రెండేళ్లతో పాటు సమీకృత కోర్సుగా ఇంజినీరింగ్ విద్య కూడా అందుతుంది. ఇది మరో నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరేళ్లు ఇక్కడే చదువుకోవచ్చు. దీంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలువురు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ఫలితాల్లోనే కాకుండా మార్కుల సాధనలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో తమ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సదరు కళాశాలలు అండగా ఉంటాయని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్రాంచ్ల్లో అవకాశం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో మన రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. అర్హత మేరకు విద్యార్థులు ఈ కళాశాలల్లో సీటు పొందవచ్చు. ఏటా ఒక్కో కళాశాలలో వెయ్యి మంది వంతున 4 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇంటర్తో పాటు ఇంజినీరింగ్ తరగతులు ఉచితంగా కొనసాగిస్తారు. సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సుల్లో తర్ఫీదు అందిస్తారు. ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్ల్లో మెటీరియల్ కోర్సులతో పాటు మెటలర్జికల్, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు అదనంగా నిర్వహిస్తారు. చదువుల కాలంలో విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం లభిస్తుంది. అప్లోడ్ చేద్దామిలా... అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకెటి.ఇన్ (ఠీఠీఠీ.టజ ఠజ్టు.జీ ుఽ) వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉటుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి ఆధార్, ఫోన్ నంబర్, పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 4 శాతం మార్కులు అదనంగా కలిపి అర్హుల జాబితాల్లో చేరుస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓబీసీ విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 12న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనున్నారు. అవకాశం లభించిన విద్యార్థులు జూలై 1న నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. -
రైతన్నకు ధరల సంకటం..!
గజపతినగరం మండలంలో పొలాల్లోనే ఉన్న మొక్కజొన్న బస్తాలు అనుమతులు రాలేదు.. మొక్కజొన్న పంట కొనుగోలుకు వీలుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎటువంటి అనుమతులు రాలేదు. రబీలో వరి పంట తక్కువ విస్తీర్ణంలో సాగైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. – ఎన్. వెంకటేష్, మార్కెఫెడ్జిల్లా మేనేజర్ – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనగరం ఫోర్ట్: రైతు సంక్షేమమే లక్ష్యమంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను కొనుగోలుచేసే వారే కరువయ్యారు. పంట చేతికొచ్చి నూర్పిడిలు సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కానరావడం లేదు. రైతులకు మద్దతుధర లభించడం లేదు. వరి, మొక్కజొన్న పంటలను అతి తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంట దళారుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవీ? జిల్లాలో రబీలో 4,642 హెక్టార్లలో వరి, 45,590 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. వరి పంట 23,290 మెట్రిక్ టన్నుల వరకు, మొక్కజొన్న 3,28,248 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంటలను కొనుగోలుచేసేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారులు ప్రతిపాదనలను కనీసం పట్టించుకోవడంలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నా కనికరించని పరిస్థితి. గత్యంతరంలేని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటను విక్రయించేస్తున్నారు. ఇప్పటకే చాలా వరకు పంటను దళారులకు విక్రయించేశారు. మెంటాడ మండలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రోడ్డుపైనే నిల్వ చేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలు లేక దళారులు కొనుగోలుచేస్తున్న ధర రూ.800-700 రూ.2,400నష్టపోతున్న రైతులు వరి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.2,369 కాగా దళారులు రూ.1900కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు క్వింటాకు రూ.469 నష్టపోతున్నారు. మొక్కజొన్న పంట క్వింటాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400. కానీ దళారులు కొనుగోలు చేస్తున్నది రూ.1600 నుంచి రూ.1700కు మాత్రమే. దీనివల్ల రైతులు రూ.800 నుంచి రూ.700వరకు నష్టపోతున్నారు. రూ. 1600-1700 మధ్యన -
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
● శాసన మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. ముందుగా చీపరుపల్లి మండల నాయకులతో బొత్స కుమార్తె అనూష సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
విజయనగరం
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది... పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026జిల్లాలో రబీలో సాగుచేసిన వరి పంట విస్తీర్ణం వరి పంటకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు మద్దతు ధర రూ.1900 4,643 హెక్టార్లు రూ.2,369 -
రెండు చోట్లా ఒక్కరే...
సాక్షి ప్రతినిధి విజయనగరం: రెవెన్యూ శాఖలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. విజయనగరం నియోజకవర్గ జనాభా పెరగడంతో రెవెన్యూ సేవలు సకాలంలో అందడంలేదన్న ఉద్దేశంతో విజయనగరం రెవెన్యూ కార్యాలయాన్ని అర్బన్, మండల తహసీల్దార్ కార్యాలయాలుగా ఇటీవల విభజించారు. దీంతో ప్రజలు కూడా సంతోషించారు. ఇద్దరు అధికారులు ఉంటారని, చకచకా పనులు జరుగుతాయని, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు కార్యాలయాలకు ఒకే తహసీల్దార్ను నియమించడంతో ఉసూరుమంటున్నారు. విభజించడం వల్ల ప్రయోజనం ఏముందని నిట్టూర్చుతున్నారు. చెప్పుకునేందుకే రూరల్, అర్బన్ అంటూ రెండు తహసీల్దార్ కార్యాలయాలని, ఇద్దరు తహసీల్దార్లను నియమించాల్సిన చోట ఒక్కరినే నియమించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మీద గతంలో ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్నాళ్లు సెలవుపై పంపేశారని, అంతా సద్దుమణిగాక మళ్లీ ఆయనను రెండు కార్యాలయాల బాధ్యతలు అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక అవినీతి కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుడిచేత్తో అర్బన్ ఫైళ్ళు, ఎడమచేత్తో రూరల్ ఫైళ్ళు క్లియర్ చేస్తూ రెండు చేతులా ప్రజలకు సేవలు అందిస్తారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. -
స్కూల్ మైదానం ఆక్రమణపై నిరసన
రాజాం : మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని రాజాం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన పి.వెంటరమణ అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడంటూ స్థానికులు శనివారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. సర్వే నంబరు 59లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 196 అడుగుల వెడల్పు, 216అడుగుల పొడవుల విస్తీర్ణంపై మైదానం ఉందని తెలిపారు. ఈ మైదానాన్ని ఎటువంటి హక్కులు లేకుండా వెంకటరమణ ఆక్రమణ చేస్తూ, ప్రహరీ నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. కమలనాయుడు ఆధ్వర్యంలో వంద మందికి పైగా కాలనీ వాసులు ఆక్రమణలపై మండిపడ్డారు. తహసీల్దార్, ఎంఈఓకు ఫిర్యాదు చేశామని, సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమణదారుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ దర్యాప్తు వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణలపై ఎంఈఓ యాగాటి దుర్గారావు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. 5 నుంచి ఆరు అడుగుల వెడల్పు మేర పాఠశాల మైదానంలోకి ఆక్రమణదారుడు వచ్చినట్టుగా గుర్తించారు. పాఠశాల హెచ్ఎం రాజుతో పాటు తహసీల్దార్కు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం
చికెన్ రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్.. జామి: మండల కేంద్రమైన జామిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జామి గ్రామానికి చెందిన బీల అచ్చన్న(54) పొలం పని చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్థానిక వినాయక గుడి వద్ద ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ సైక్లిస్ట్ను ఢీకొనడంతో లారీ వెనుక భాగాన టైర్లు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీర జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, ఒక కుమార్తె ఉన్నారు. భామిని: మండలంలోని బత్తిలికి చెందిన యువకుడు కోట చంటి (29) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బత్తిలికి చెందిన మీసాల సమీర్తో కలిసి బుల్లెట్ బైక్పై కోట చంటి కొత్తూరు వైపు వెళ్తుండగా ఘనసర వద్ద ఏబీ రోడ్డుపై ప్రమాదానికి గురై మృతి చెందాడని బత్తిలి ఎస్ఐ కె.రవీంద్ర తెలిపారు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమీర్ ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. బైక్పై వెళ్తున్న వీరికి ఘనసర వద్ద ఎదురుగా వ్యాన్ వచ్చింది. వ్యాన్కు దారిచ్చేందుకు బైక్ను సడన్ బ్రేక్ వేయగా చంటి తుళ్లి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంటి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలంలోనే చంటి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బత్తిలి ఎస్ఐ రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాలకొండ రూరల్: సీతంపేట రహదారిలో పట్టణ శివారున ప్రధాన రహదారికి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఒంటిపై పూర్తి స్థాయి బట్టలు లేకుండా ఉండటంతో తొలిత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో అతను పట్టణంలో గల ఎన్ఎస్ఎన్ కాలనీకి చెందిన బుడ్డి(55)గా గుర్తించారు. ఈయన గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలో మరణించి ఉంటారని భావించి స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన గుణుపూరు అచ్చుతరావు(26) సత్తెనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అచ్చుతరావు డిప్లమా ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం నిమిత్తం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి చూసుకున్నాడు. హైదరాబాద్లోని బొల్లారంలో నివాసం ఉంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి మోటారుసైకిల్పై కాకినాడ వస్తుండగా సత్తెనపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అచ్చుతరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగమ్మ, భాస్కరరావు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులకు అవగాహన
ఈ ఏడాది అధిక శాతం మంది ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించే అవకాశం జిల్లా నుంచి లభించనుంది. 15 మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబెట్టారు. ఈ క్రమంలో వారు ట్రిపుల్ ఐటీలో చేరే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మా పరిధిలో ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామాల్లో ప్రచారం చేయటంతో పాటు అర్హత గల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. – పర్రి కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ, పాలకొండ -
నాటుబాంబు కలకలం
కొత్తవలస: మండలంలోఓని కంటకాపల్లి పంచాయతీ పరిధి భామసాగర్ చెరువు వద్ద శనివారం నాటుబాంబు కలకలం రేపింది. ఈ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటుబాంబులను ఉపయోగిస్తుంటారు. రాత్రి సమయల్లో అడవి పందులు తిరిగే దారుల్లో వేటగాళ్లు నాటుబాంబులను అమర్చి తెల్లవారుజామున తీసేసి భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వేటగాళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే చెరువులో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి పనులు నిర్వహిస్తుండగా నాటుబాంబు పేలి గ్రామానికి చెందిన కక్కల అప్పారావు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. ఇంతలోనే మళ్లీ నాటుబాంబు కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. -
కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి
సంతకవిటి: మండలంలోని కృష్ణంవలస గ్రామంలో వంకల పాపయ్యకు చెందిన నాలుగు గొర్రె పిల్లలు, రెండు మేక పిల్లలు కుక్కల దాడిలో శనివారం మృతి చెందాయి. పాపయ్య మధ్యాహ్న సమయంలో గొర్రె, మేక పిల్లలను పాకలో పెట్టి, ఇంటికి భోజనానికి రాగా ఇంతలో కుక్కలు చొరబడి వాటిపై దాడి చేసి చంపేశాయి. దీనితో పాపయ్య బోరున విలపించారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలను గ్రామం నుంచి బయటకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదతో చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. -
రజిత పతకం సాధించిన రష్మిత
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి రష్మిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఈమె ముంబాయిలోని మార్వే బీచ్లో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వైఏఐ యూత్ అండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ – 2026లో అండర్ – 17 విండ్ సర్ఫింగ్ విభాగంలో రజిత పతకం కై వసం చేసుకొంది. పోటీలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు అద్భుతమైన నౌక నైపుణ్యం, పట్టుదల, సమర్ధవంతమైన రేసింగ్ వ్యూహలను ప్రదర్శించి రష్మిత విజయం సాధించింది. రష్మిత తండ్రి శ్రీకాంత్ చతుర్వేది వృత్తి రీత్యా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో ముంబయిలోనే స్థిరపడ్డారు. రష్మిత ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఈమె ప్రతిభపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత సాధించిన పతకం జిల్లాకే గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు పేర్కొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్ తీసుకొని భవానిపట్నం పాసింజర్లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బండారు ఈశ్వరరావు తెలిపారు. -
బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
లక్కవరపుకోట: మండలంలోని గనివాడ గ్రామంలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జె.రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంటిలో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులతో కలిసి రంగాపురం, లక్కవరపుకోట, గనివాడ గ్రామాలకు చెందిన ఒకొక్కరు టీవీలో క్రికెట్ ప్రచారం జరుగుతుండగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. దీంతో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. రంగాపురం, గనివాడ, లక్కవరపుకోట గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల పట్టుబడగా వారి నుంచి రూ. 47వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసు నమోదు విజయనగరం క్రైమ్: స్థానిక మహిళ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారి శిరీష శుక్రవారం తెలిపిన వివరాలు.. గత నెల ఏప్రిల్ 22న చిన్నపల్లి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనికి వచ్చిన గుర్లకు చెందిన అబద్దం అక్కడ మహిళా వాచ్మన్ కుమార్తె(8)ని మాయమాటలు చెప్పి అత్యాచారం చేయబో యాడు. బాలిక కేకలు వేయడంతో మిగిలిన కూలీలు వచ్చి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ది చేశారు. బాలిక తల్లి టు టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహిళ పోలీస్స్టేషన్కు రిఫర్ చేశారు. సీఐ నరసింహమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ శిరీష తెలిపారు. వృద్ధురాలి అదృశ్యం గజపతినగరం: మండలంలోని జిన్నాం గ్రామానికి చెందిన యజ్జిరోతు పోలమ్మ (75) ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్ నాయుడు శుక్రవారం తెలిపారు. పోలమ్మ తన భర్త లక్ష్మునాయుడుతో కలిసి గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి స్వగ్రామం జిన్నాం వెళ్లేందుకు స్థానిక భైరిపురం జంక్షన్ వద్దకు వచ్చింది. తరువాత గజపతినగరం నుంచి మధుపాడ, మరుపల్లి గ్రామాల వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. దీన్ని భర్త గమనించలేదు. పోలమ్మ కుమారుడు ఇజ్జిరోతు సూరినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే గజపతినగరం పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
ఆలోచనల మార్పిడికి ఇదో అద్భుత వేదిక
రాజాం సిటీ: అధ్యాపకుల ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు ఎంతో అవసరమని గువహటి ఐఐటీ కన్వీనర్, ప్రొఫెసర్ పి.పాము అన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 4 నుంచి నిర్వహించిన ‘ఫ్రంటియర్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, ఇన్నోవేషన్స్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్’ అనే అంశంపై నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రొగ్రాం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నానో పదార్థాలు, శక్తి నిల్వ వ్యవస్థలు, కాటలీటిక్ పదార్థాలు, హైడ్రోజన్ నిల్వ, కార్బన్ సంగ్రహణ, థిన్ఫిల్మ్, తదితర అంశాలపై జరిగిన పరిశోధనలు సమాజానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జ్ఞానం, ఆలోచనలు, వినూత్న పరిశోధనా దృక్కోణాల పరస్పర మార్పిడికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డీన్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎం.వి.సుబ్బారావు, ఆర్.ఎల్.నాయుడు, కె.కోటేశ్వరరావు, బి.విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి
● రెడ్క్రాస్ చైర్మన్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు కోరారు. రెడ్క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ఎన్సీపీ కెప్టెన్ సత్యవేణి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ ఉదయ్కిరణ్, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
కొమరాడ: రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతున్న ఓ వృద్ధుడిపై మృత్యువు దూసుకొచ్చింది. బొలేరో వాహనం రూపంలో కనురెప్పవేసిన పాటులో ప్రాణాలను హరించింది. వ్యవసాయ పనులపై వెళ్తూ ఆగిన మరో ఇద్దరు.. కూరగాయలు విక్రయిస్తున్న మరో మహిళను క్షతగాత్రులుగా మార్చింది. దుకాణాలపైకి దూసుకొచ్చిన బొలేరోవాహనాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం నుంచి రాయగడ వైపు అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పి కొమరాడ మండల కేంద్రంలోని రోడ్డుపక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ తాగేందుకు వచ్చిన కొమరాడ గ్రామానికి చెందిన మరడాన చిన్నంనాయుడు(75) దుర్మరణం చెందారు. పొరుగు జిల్లా నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ముద్దురు గోపాల్కృష్ణ, కూనేరు రామభభద్రపురం గ్రామానికి చెందిన మోయి జాషువ, అక్కడే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న బొత్స మహలక్ష్మి గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం కొమరాడ పీహెచ్సీకి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కొమరాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. గాయాలతో పడిఉన్న ముద్దురు గోపాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందిన మరడాన చిన్నంనాయుడు కొమరాడలో రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ఒకరు మృతి, ముగ్గురికి త్రీవగాయాలు -
పిల్లలపై ఓ కన్నేయండి..!
విజయనగరం గంటస్తంభం: వేసవి సెలవులొచ్చాయంటే పిల్లలకి పండగే. పుస్తకాల భారముండదు.. ఉదయం లేచిందే మొదలు ఆటలు.. మధ్యాహ్నం మొబైల్.. సాయంత్రం స్నేహితుల వెంట ఊరు చుట్టేయడం. కానీ అదే ఆనందం కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుస్తోందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు మొదలైనప్పటి నుంచి పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ మోజు... మెల్లగా మింగేస్తోంది డిజిటల్ కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు గేమ్స్, రీల్స్, సోషల్ మీడియాతో గడుపుతున్నారు. బయట ఆటలు తగ్గిపోవడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా తగ్గుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొంత మంది పిల్లలు అనవసర యాప్లు, చెడు స్నేహాల ప్రభావానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. చెడు సావాసాలు జీవితాలను నాశనం చేసేస్తున్నాయి.. సెలవుల సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్ధాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం. సరదాగా మొదలైన అలవాటు తర్వాత కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు...? ఎవరితో తిరుగుతున్నారు..? ఏమి చూసున్నారు..? అన్నది తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపెట్టకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు తమ విషయాలు చెప్పుకుంటారని చెబుతున్నారు. సెలవుల సమయంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. స్నేహితుల్లా మాట్లాడితేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. – వై.సతీష్కుమార్, కెమిస్ట్రీ లెక్చరర్, మానసిక వికాస నిపుణులు, విజయనగరం తల్లిదండ్రులూ.. బిడ్డలూ పదిలం.. సుమీ! మృత్యువుతో చెలగాటమొద్దు ఆటల మాటున ఆపదలు ఆన్లైన్లో మునిగితే భవిష్యత్తుకే ముప్పు చెరువులు, రోడ్లు, మొబైళ్లతో పెరుగుతున్న ప్రమాదాలు సరదా.. వ్యవనం కాకముందే మేల్కొనండి మత్తు పదార్ధాలు, డిజటల్ బానిసత్వంపై నిఘా ఉంచండి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక -
గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
పార్వతీపురం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి అన్నారు. శుక్రవారం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 19 వినతులను స్వీకరించి, సంబంధిత శాఖాధికారులతో వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
● పాలకొండ – వీరఘట్టం రహదారిలో ఘటన ● పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు పలువురికి గాయాలుపాలకొండ రూరల్: పాలకొండ – వీరఘట్టం ప్రధాన రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం సభ్యులు గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డుపై ఆగి ఉన్న మరో వివాహానికి సారె సామగ్రిని తీసుకువెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు... రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఐ.సత్యనారాయణ, పద్మ దంపతులు తమ కుమార్తె వివాహ నిమిత్తం ఆటోలో వీరఘట్టం మండలం పాలమెట్టకు బంధువులతో కలిసి ప్రయాణమయ్యారు. అప్పటికే పెళ్లి కుమార్తె మరో వాహనంలో వెళ్లింది. ఇదే సమయంలో సీతంపేట మండలానికి చెందిన మరో వివాహ బృందానికి చెందిన వారు తన చెల్లెలు పెళ్లికి సంబంధించిన సారె సామగ్రి తీసుకుని అన్నయ్య బొలెరో వాహనంతో కురుపాం బయలుదేరాడు. బొలెరో వాహనం నడుపుతున్న పెళ్లి కుమార్తె అన్న వీరఘట్టం రహదారిలోని టీ అడ్డా దాటిన తరువాత తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేరే పెళ్లి బృందం సభ్యులతో వస్తున్న ఆటో వీరఘట్టం నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి పద్మకు తీవ్ర గాయాలు కాగా.. తండ్రి సత్యనారాయణకు చేయి నుజ్జయ్యి అపస్మారక స్థితికి చేరారు. వీరి బంధువులైన ఐ.సూర్యనారాయణకు నడుము, కె.రాజేశ్వరికి కాళ్లు విరిగాయి. తీవ్రంగా గాయపడిన వీరిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. తీవ్ర గాయాలైన వారిని వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేశారు. ఇదే ఘటనలో గాయాల పాలైన కె.లక్ష్మి, ఐ.ఆదిలక్ష్మి, కె.రమణమ్మ, కె.రాజ్కుమార్, కె.అచ్చెయ్యకు స్థానిక వైద్యులు తక్షణ చికిత్స అందించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పెళ్లి బృందం సభ్యులు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కన్నీటి పర్యంతమయ్యారు. అయినవారి యోగక్షేమాల కోసం ఆరా తీశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ డోల వెంకన్న ప్రమాదానికి గల కారణాలు తెలసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
17న టాలెంట్ టెస్టు
విజయనగరం టౌన్: ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ ఇంటర్ విద్యను వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా అందించేందుకు ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్టు ఖాదర్బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎం.డి. ఖలీలుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12లోపు విద్యార్థులు ఏపీ వక్ఫ్బోర్డు లింక్ను ఓపెన్చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి ఇంటర్ రెసిడెన్షియల్ విద్యతో పాటు, ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈ సెట్లో ‘రమ్య’మైన ప్రతిభ సంతకవిటి: మండలంలోని వాల్తేరు గ్రామానికి చెందిన గురుగుబెల్లి రమ్య శుక్రవారం విడుదలైన ఈసెట్ ఫలితాల్లో సత్తాచూపింది. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఆమె సిరిపురం జెడ్పీహెచ్ఎస్లో చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది. పాలిసెట్లో ర్యాంకు సాధించి అనకాపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఈసెట్కు సిద్ధమై మంచి ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రాము, రాజు వ్యవసాయ కూలీలు. కుమార్తె చదువులో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. బాలికకు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు. -
ఇదే మంచి తరుణం
ధ్రువపత్రాలు పొందేందుకు..రామభద్రపురం: ఇటీవల పదో తరగతి, ఇంటర్ తదితర తరగతుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ధ్రువపత్రాలు పొందేందుకు ఇదే మంచి తరుణం. వేల సంఖ్యల్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి ధ్రువపత్రాలు జారీ చేయడం అధికారులకు కష్టతరమవుతోంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. నమోదు చేసుకోవడం ఇలా.. కులం, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్, కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు ఇతర పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. స్వర్ణ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఇంటర్నెట్లో నమోదు చేసి సంబంధిత వీఆర్ఓలు పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి రిపోర్ట్ రాసి ఆర్ఐకు పంపుతారు. ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్కు పంపగా అన్ని పత్రాలు పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం మండల తహసీల్దార్ చేస్తారు. సంబంధిత విద్యార్థి సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కేంద్రాలకు వెళ్లి ఆయా ధ్రువపత్రాలు తీసుకోవచ్చు. సర్వేల్లో సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలోని సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ల పంపిణీతో పాటు రకరకాల సర్వేలు వారితో చేయిస్తోంది. జాబ్ చార్ట్కు విరుద్ధంగా వారికి సంబంధించిన శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు చెందిన పనులు కూడా అప్పగించడంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులు చేయడం వల్ల వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్రామాలలో జనగణన సర్వే ఇంటింటికీ వెళ్లి చేస్తున్నారు. పనుల కోసం సచివాలయాలకు వెళ్లిన వారికి అందుబాటులో లేక సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలకు రోజు రోజుకు సేవలు సన్నగిల్లుతున్నాయి. జనగణన సర్వేలో డిజిటల్ అసిస్టెంట్లు కూడా ఉండడంతో ధ్రువపత్రాల కోసం చేసిన దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఆలస్యం అవుతోంది. సర్వే చేసిన తర్వాతగాని సచివాలయాలకు చేరకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సకాలంలో సేవలు అందిచలేని పరిస్థితి ఉంది. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం కాకుండా జారీ చేస్తాం.. ధ్రువపత్రాల కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన పత్రాలు జారీ అవుతాయి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉంటే మంజూరు చేస్తాం. ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే మండల స్థాయి అధికారులతో చర్చించాం. ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నాం. – జేవీఎస్ఎస్ రామమోహనరావు, ఆర్డీఓ, బొబ్బిలి దరఖాస్తు చేసుకోండి.. ధ్రువపత్రం పొందండి విద్యార్థులకు రెవెన్యూ అధికారుల సూచన -
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో శుక్రవారం బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వన్టౌన్ ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం రాకోడుకు చెందిన బోదంకి నారాయణమ్మ(76) బస్సు కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చింది. ఆ సమయంలో బస్టాండ్లో డ్రైవర్ లక్ష్మునాయుడు బస్సు తీసే క్రమంలో వెనుకాలే ఉన్న నారాయణమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో ట్రాఫిక్ అవుట్పోస్టులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్.పాల్ ప్రమాద సమాచారాన్ని మ్యాన్ ప్యాక్ ద్వారా వన్టౌన్ పోలీసులకు ఇచ్చాడు. వన్ టౌన్ ఎస్ఐ రవి ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మనవడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఆరుగురు ఎంపిక
విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా క్రీడాకారులు రాణించి విజయనగరం పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ● అండర్–13 విభాగంలో ప్రతిభ చాటిన క్రీడాకారులు ● ఓపెన్ విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ఇద్దరు అర్హత -
మూగబోయిన జానపద స్వరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కణపాకలో ఓ చిన్న ఇల్లు..ఆ ఇంటి నుంచి ఒకప్పుడు వినిపించిన గాత్రం ఉత్తరాంధ్ర పల్లెల్ని ఉర్రూతలూగించింది. ఆ గాత్రం దంపుడు లక్ష్మిది. బుర్రకథ అంటే ఏమిటో..జానపద కళలో భావోద్వేగం ఎలా ఉంటుందో? ఒక మహిళ వేదికపై నిలబడి వేల మందిని ఎలా కట్టిపడేస్తుందో తన జీవితంతో చూపించిన కళాకారిణి ఆమె. కానీ జనాలను నవ్వించిన ఆ కళాకారిణి జీవితం మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్ల మధ్య ముగిసింది. ˘õ³§ýl-ÇMýS… Ð]l$«§ýlÅ ç³#sìæt¯]l MýSâê{ç³-Ý릯]l… చిన్నప్పటి నుంచే లక్ష్మికి కళలంటే ప్రాణం. అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ లేదు..టీవీలు లేవు..వినోదానికి జాతరలు, బుర్రకథలే ప్రధాన ఆధారం. గ్రామంలో ఎక్కడ బుర్రకథ వినిపించినా చిన్నారి లక్ష్మి అక్కడికెళ్లి గంటల తరబడి చూసేది. కథ చెబుతున్న వాళ్ల హావభావాలు, పాటలు, సంభాషణలు ఆమెను ఆకట్టుకునేవి. ఆ ఆసక్తే తర్వాత ఆమె జీవితాన్ని బుర్రకథ వైపు నడిపించింది. ఆ రోజుల్లో మహిళలు వేదికపైకి రావడం చాలా అరుదు. అయినా భయపడకుండా బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టిన లక్ష్మి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ˘§ýl…ç³#yýl$ ÌS„ìSà Ð]lçÜ$¢…-§ýl…sôæ FÆý‡…™é ^ólÆó‡¨ ఒకప్పుడు ఉత్తరాంధ్ర గ్రామాల్లో జాతరలో బుర్రకథ తప్పనిసరి. సాయంత్రం కాగానే గ్రామం మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేసేవారు. నేలమీదే పిల్లలు, పెద్దలు కూర్చుని కథ మొదలయ్యే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు దంపుడు లక్ష్మి బుర్రకథ మొదలైతే చాలు..జనాలు మైమరచిపోయేవారు. బాలనాగమ్మ, సీతారామ కల్యాణం, నలదమయంతి, మహాభారతం, రామాయణం..ఏ కథ చెప్పినా తన గాత్రంతో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగేది. హాస్యం చెప్పి నవ్వించేది.. విషాదం చెప్పి ఏడిపించేది. అంతటి మంత్రముగ్థత ఆమె కళలో ఉండేది. ˘MýSâýæ™ø ´ër$ {ç³fÌZÏ O^ðl™èl-¯]lÅ….. దంపుడు లక్ష్మి కేవలం వినోదం కోసం మాత్రమే కథలు చెప్పలేదు. బాల్య విహహాలు, అక్షరాస్యత, మహిళా హక్కులు, ఎయిడ్స్ నియంత్రణ, పొదుపు సంఘాలు, పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఊరూరా తిరిగి బుర్రకథల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కూడా దంపుడు లక్ష్మి బృందం వస్తే ప్రజలకు విషయం త్వరగా చేరుతుందని ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టేవారు. విజయనగరం మాత్రమే కాదు..ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ˘f¯éÌS ^èlç³µsôæÏ M>± yýlº$¾ Æ>Ìôæ§ýl$ వేదికలపై చప్పట్లు కొట్టిన జనాలు వేలమంది. కానీ ఆ చప్పట్లు ఆమె జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. కళను నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి పోరాటం..అన్నింటినీ భరించింది. ఒక కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కళాకారిణిగా ఆమెకు పేరు వచ్చినా..జీవితంలో మాత్రం స్థిరత్వం రాలేదు. ˘yìlhrÌŒæ Ķæ¬VýS….. MýS¯]l$-Ð]l$-Æý‡$-OVðS¯]l º${Æý‡MýS£ýl కాలం మారింది. టెలివిజన్ వచ్చింది. తర్వాత సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాయి. గ్రామాల్లో జాతరల వేదికలపై బుర్రకథల స్ధానంలో రికార్డింగ్ డ్యాన్సులు వచ్చాయి. ఒకప్పుడు రాత్రంతా కూర్చుని బుర్రకథలు విన్న ప్రజలు.. ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్పై వినోదం వెతుక్కుంటున్నారు. కొత్త తరం జానపద కళల వైపు చూడకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల బుర్రకథలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ కళను నమ్ముకున్న కళాకారులు బతుకు కోసం ఇతర పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ˘_Ð]l-ÇMìS MýS*Æý‡V>-Ķæ$ÌS §ýl$M>-׿Ðól$ B«§éÆý‡… ఒకప్పుడు వేదికలపై వేలాది మందిని అలరించిన దంపుడు లక్ష్మి... చివరికి కలెక్టర్ కార్యాలయం పక్కన చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగించింది. అది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన మలుపు. కళతో గౌరవం వచ్చింది. కానీ బతుకు రాలేదు. అనారోగ్యం వెంటాడినా.. మందులకు డబ్బు లేకపోయినా..అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రాములు చేస్తూనే ఉండేది. కళను వదిలేస్తే నేను బతకలేను అని చెప్పేదామె. ˘MóS¯]lÞ-ÆŠ‡™ø ´ùÆ>-yìl¯]l MýSâê-iÑ™èl… కేన్సర్ బారిన పడిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ప్రభుత్వ సహాయం అందలేదు. కళాకారుల పెన్షన్ కూడా ఆమెకు దక్కలేదు. జీవితాంతం ప్రజలకు సందేశాలు చెప్పిన కళాకారిణి.. చివరికి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. ఈ నెల 5 మంగళవారం ఆకస్మాత్తుగా ఆయాసానికి గురై ఆమె తుదిశ్వాస విడిచింది. బుర్రకథ కళాకారిణి దంపుడు లక్ష్మి మృతి ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందున్న కళాకారిణి బాల్య వివాహాలపై బుర్రకథలతో పోరాడిన మహిళ కళను నమ్ముకున్న జీవితం..ఆదుకోని సమాజం డిజిటల్ యుగం దెబ్బకు కనుమరుగైన జీవితం -
స్వచ్ఛ సర్వేక్షణ్పై సమీక్ష
పార్వతీపురం: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలుపై జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఇంటింటి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరుచేయడం, ప్లాస్టిక్ నియంత్రణ, డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రదేశాల్లో ప్రతిరోజూ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానం సాధించేందుకు ప్రతి మున్సిపాల్టీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. 40 లీటర్ల సారా పట్టివేతసీతంపేట: మండలంలోని మండ గ్రామంలో 40 లీటర్ల సారా పట్టుకున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. సారాతో పాటు సవర జగ్గయ్య అనే పేర్లు గల ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిగజపతినగరం/దత్తిరాజేరు: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన మజ్జి ఈశ్వరరావు వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడని గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఈశ్వర రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పులు చేసి నష్టాల బాట పట్టడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఈనెల 5వ తేదీన సాయంత్రం గజపతినగరం మండలం దావాలపేట రోడ్డు మహంకాళి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో పురుగు మందు తాగాడన్నారు. అనంతరం తన స్నేహితుడు రామకృష్ణ గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. రైలు నుంచి జారిపడి యువకుడి మృతిగరుగుబిల్లి: మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. బతుకు తెరువు నిమిత్తం విశాఖపట్నంలో వెల్డర్గా పనిచేస్తున్న అప్పలనాయుడు బుధవారం విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తున్న రైలులో అమ్మను చూసేందుకు వస్తున్న తరుణంలో మానాపురం–గజపతినగరం మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అప్పలనాయుడు మృతితో రావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్ల క్రితం తండ్రి పరిసనాయుడు అనారోగ్యంతో మృతిచెందగా, ప్రస్తుతం తల్లి సావిత్రమ్మకు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడి మృతివార్త తెలుసుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుడికి విజయనగరంలోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి రావుపల్లిలో అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. -
ఆపత్కాలంలో అండగా..
● మానవత్వం చాటుకున్న జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి శృంగవరపుకోట: ‘బడిఈడు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, మెరుగైన సమాజానికి ఊతమివ్వండి’ అంటూ మండల విద్యాశాఖాధికారి–2 గణపతి లక్ష్మి నేతృత్వంలో గురువారం ఎస్.కోట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అన్ని వసతులు, ప్రమాణాలతో కూడిన విద్యను బోధించే ఉపాధ్యాయులున్న ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల హెచ్ఎం శైలజారాణి, కె.బంగారునాయుడు, టి.అప్పారావు, జి.వి.రమణ, చిప్పాడ సూరిబాబు, గొల్లు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం లోడు లారీ బోల్తా వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకుగా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించ లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ బాడంగి: మండల కేంద్రంలోని సీహెచ్సీని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జీవనరాణి, జిల్లా ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రాల కోఆర్డినేటర్ (డీసీహెచ్ఓ) రఘువంశీ గురువారం సందర్శించారు. సీహెచ్సీకి డయేరియా రోగుల తాకిడి ఎక్కువ కావడంతో సాక్షిలో ‘భయపెడుతున్న డయేరియా’ శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. సీహెచ్సీలోని ప్రతి వార్డుకీ వెళ్లి రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యసేవలు బాగానే ఉన్నాయని రోగులు, సహాయకులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్సీ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు, వైద్యులు వంశీ, ఇమ్రాన్, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఎంపీడీఓకు ఫోన్ చేసి డయేరియా వ్యాప్తిపై ఆరా తీశారు. -
విజయ ధరహాసం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో అతిథ్య విజయనగరం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పోటీల్లో 394 పాయింట్లు దక్కించుకున్న విజయనగరం క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. 350 పాయింట్లు సాధించిన విశాఖ జట్టు రెండవ స్థానంలో నిలవగా..మూడవ స్థానాన్ని 259 పాయింట్లతో తూర్పుగోదావరి జట్టు దక్కించుకుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. దీంతో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిం నాయుడు, కోశాధికారి నాయబ్ రసూల్, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో విద్యల నగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. పోటీల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 7గురు క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకోవడం విశేషం. షాట్పుట్లో జి.వెంకటనాయుడు, 400 మీటర్ల పరుగు పోటీలో పి.ప్రవీణ్కుమార్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాకుండా లాంగ్జంప్లో జి.లక్ష్మి స్విలర్, డెకాతలీన్లో కె.సాయితేజ సిల్వర్, పోల్వాల్ట్ విభాగంలో కె.సాయితేజ సిల్వర్ మెడల్స్ చేజిక్కించుకున్నారు. అలాగే జావెలిన్త్రోలో డి.ఉదయ్, 100 మీటర్ల పరుగు పోటీలో ఎ.దివ్యవాణిలు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్, ట్రెజరర్ వి.ఆనంద్ కిషోర్లు అభినందించారు. తైక్వాండో ఓవరాల్ చాంపియన్ విజయనగరం రెండవ స్థానంలో నిలిచిన విశాఖ క్రీడాకారులు మూడవ స్థానాన్ని దక్కించుకున్న తూ.గో జట్టు ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు -
ప్రభుత్వాల తీరు దారుణం
బొబ్బిలి: విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా కిరండోల్ రైల్వేలైన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం దారుణమని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్నే విశాఖ డివిజన్ అనిపేరు పెట్టారు తప్ప అధికాదాయం ఉన్నప్రాంతాలను మాత్రం ఎక్కడో దూరాన ఉన్న రాయగడ డివిజన్లో కలపడం అన్యాయమన్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్ వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అటువంటి ఆదాయ వనరును ఏపీకి అన్వయించాలే తప్ప వేరే రాష్ట్రానికి బదలాయించి ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నోరు విప్పకవడం విచారకరమన్నారు. ఇది రాష్ట్రప్రజలను మోసం చేయడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు జరిగిన నాటి నుంచి రైల్వే ఉద్యోగులు, ప్రజానీకం కేకే లైన్ను విశాఖ జోన్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ను తప్పించి విశాఖనుజోన్గా ప్రకటించడం ఏపీపై కేంద్రానికి ఉన్న ఆలోచన ఎలాంటిదో తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, తమ్మిరెడ్డి కృష్ణ, చుక్క కూర్మినాయుడు పాల్గొన్నారు. -
● సరదా సరదాగా...
● శ్రద్ధగా నీతికథల బోధన శృంగవరపుకోట పట్టణంలోని శాఖాగ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వర్ధమాన కవయిత్రి కటకం పావని విద్యార్థినీ విద్యార్థులతో గురువారం నీతి కథలు చదివించారు. కథల్లోని నీతిని విద్యార్థులకు వివరించారు. అనంతరం చిన్నారులకు వివిధ ఆటల్లో తర్ఫీదునిచ్చారు. – ఎస్.కోట క్రికెట్ ఆడుతున్న చిన్నారులు వేసవి సెలవుల్లో పిల్లలు సరదాసరదాగా గడుపుతున్నారు. నచ్చిన ఆటల్లో శిక్షణ పొందుతున్నారు. పల్లెల్లో గ్రామీణ క్రీడల్లో మునిగితేలుతున్నారు. ఏ వీధిన చూసినా చిన్నారులు సందడే కనిపిప్తోంది. క్రికెట్, గోలీపిక్కలు, క్యారెమ్స్, చెస్ తదితర ఆటల్లో నిమగ్నమవుతున్నారు. రామభద్రపురంలో పలువురు విద్యార్థులు చెస్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. తోటి చిన్నారులతో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మెదడుకు పదును పెడుతున్నారు. ఆటలో రాటుదేరుతున్నారు. వేసవిలో పిల్లలను ఆటల్లో ప్రోత్సహించాలని, ప్రమాదకర ఆటలవైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి భోజనం చేసేలా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్మార్ట్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండేలా చూడాలని సూచనలు ఇస్తున్నారు. – రామభద్రపురం -
హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం టౌన్: స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 12న మంగళవారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆలయం ఆవరణలో గురువారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వేడుకలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ చైర్మన్ గ్రంధి గుప్తా మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108సార్లు మన్యసూక్తం పారాయణం, లక్ష తమలపాకులతో అభిషేకాలు చేస్తామన్నారు. గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి సలహా, సూచనలతో ఆ రోజు మధాహ్నం ఐదువేల మందికి మహాఅన్నప్రసాద వితరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో పెంటపాటి ముత్యాలు, బాబ్జీ, బ్రహ్మనాథం తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
నెల్లిమర్ల: పట్టణంలోని గంజాయి ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి రాయగడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లిమర్లలోని యువకులకు అమ్ముతున్నాడన్నారు. గంజాయి సమాచారం రావడంతో చంపావతి నదీతీరంలో గ్యాస్ గొడౌన్ వెనక భాగంలో గల తుప్పల్లో సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి దగ్గర నెల్లిమర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్, సత్య దివాకర్, నవీన్, లోకేష్ అనే నలుగురు వ్యక్తులు 100 గ్రాములు గంజాయి కొనుగోలు చేసి కాల్చడానికి వెళ్తుండగా ఈ దాడిలో పోలీసులకు పట్టుబడ్డారని, గంజాయిని అమ్మడానికి వచ్చిన మనోహర్ దగ్గర 1.2 కిలోలు గంజాయిని సీజ్ చేశామన్నారు. నెల్లిమర్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయిపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా గంజాయి పీల్చినా, అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 9121109444 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై గణేష్ కోరారు. -
15న మహా పాదయాత్ర
● ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖా మంత్రి నారాలోకేశ్ ఇంటివరకు పాదయాత్ర విజయనగరం గంటస్తంభం: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాన్ని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) నాయకులు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్స్కేల్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెడికల్ లీవులు, మహిళలకు చైల్డ్కేర్ లీవులు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని కోరారు. ఈ నెల 15న ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, నాని, జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కృష్ణంనాయుడు, మండల అకౌంటెంట్ రామకృష్ణ, సీఆర్ఎంటీ నాయకులు ఎం.అప్పలనాయుడు, అప్పలనాయు డు, పైడిరాజు, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
గజపతినగరం: స్థానిక పైడితల్లమ్మ వారి గుడి సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు గురువారం ఉదయం గ్రామంలో తన తాతయ్యను బైక్ ఎక్కించుకుని లింగాలవలస గ్రామంలో దించి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో బొండపల్లి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బి.సింహాద్రి, ఈశ్వరమ్మలు ఓ తోటలో సపోటా పళ్లు ఏరేందుకు గజపతినగరం నుంచి బైపాస్ రోడ్డు గుండా బైక్పై వెళ్తున్నారు. ఆ సమయంలో గుడి సమీపంలో ఆ రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. బి.సింహాద్రికి ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో పాటు తలకు కుట్లు పడ్డాయి. అలాగే సింహాద్రి భార్య ఈశ్వరమ్మకు స్పల్ప గాయమైంది. వారిని బంధువులు గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం చందును గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, సింహాద్రిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.పోలీసులు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్రగాయాలుబొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్ డౌన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పక్కి గ్రామానికి చెందిన శంబంగి శంకర రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఐ కె.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం తాహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న శంకర్ విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో బైక్పై తిరిగి వస్తుండగా ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ సంఽఘటనలో శంకర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ిసీహెచ్సీలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బంధువులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, కోమాలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.సీతంపేట: మండలంలోని పుట్టిగాంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా సవరపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బెన్నరాయి వాసులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 18 మంది గాయపడగా వారిలో మెరుగైన వైద్యం కోసం పదిమందిని శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. మిగతా 8 మందికి ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్ పర్యవేక్షణలో వైద్యసేవలు అందుతున్నాయి. మరో మహిళకు స్వల్ప గాయం -
రాయితీపై వ్యవసాయ పరికరాలు
● జేసీ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: రాయితీపై అందించే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం వ్యవసాయ యాంత్రీకరణ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 1160 వ్యవసాయ యంత్రాలు, పరికరాల పంపిణీకోసం రూ.422.43 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. అర్హులైన రైతులు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, స్వయం చోదిత యంత్రాలు, కోత, త్రైషింగ్ యంత్రాలకు ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, ఉద్యానశాఖ ఉప సంచాలకులు చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
నాకు చావే శరణ్యం..!
● మెడికల్ విద్యార్థి ఆవేదన ● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులువిజయనగరం క్రైమ్: నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థి క్యాష్కో యాప్కు దాసోహమై అప్పుల పాలై చివరకు ఆత్మ హత్యే శరణ్యమనుకున్నాడు. కానీ కన్నవారి ఆశయాలు ఆ విద్యార్థిని అల్లంత వరకు లాక్కెళ్లి వెనక్కు రప్పించాయి. తనకున్న ఆగమ్య గోచర పరిస్థితికి పోలీసులు సమాధానం చెబుతారేమోనని సరాసరి విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆడారి చాతుర్య విజయనగరం మిమ్స్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫోన్లో క్యాష్యో బెట్టింగ్ యాప్లో పూర్తిగా మునిగిన చాతుర్య దాదాపు రూ. 6లక్షల వరకు అప్పులు చేశాడు. చాతుర్య తండ్రి ఒక సాదాసీదా లైన్మన్. కొడుకు చదువుకోసం ప్రతినెలా దాదాపు రూ. 20వేల వరకు డబ్బులు పంపుతూనే ఉన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న కొడుకు చదివి వృద్ధిలోకి వచ్చి తమను చరమాంకంలో ఆదుకుంటాడనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ చదువు కోసం దూరాభారం వచ్చి విజయనగరంలోని పూల్బాగ్లో రూమ్ తీసుకుని మిమ్స్లో చదువుతున్న చాతుర్య క్యాష్యో యాప్కు బానిసై దాదాపు రూ.6లక్షల వరకు అప్పులు చేశాడు. చివరకు యాప్ ద్వారా రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని నెల్లిమర్ల రైల్వేస్టేషన్ వరకు వెళ్లాడు. అక్కడ ఎందుకో ఓ క్షణం ఆగి మనస్సు చంపుకుని పోలీసులను ఆశ్రయిస్తే తన సమస్యకు పరిష్కారం చెబుతారని అనుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చాతుర్య పరిస్థితిని గుర్తించిన సీఐ శ్రీనివాస్ రెండు రోజుల పాటు తనతో పాటు ఉంచి విద్యార్థి బాగోగులు చూసి కేసుల విషయంలో, పనివిషయంలో తమ సిబ్బంది చేస్తున్న, పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూసేలా చేశారు. చివరకు తాను చదువుకుంటానని, పరీక్షలో ఉత్తీర్ణుడినై కన్నవారి ఆశలను నెరవేరుస్తానని ఆ విద్యార్థి చెప్పడం విశేషం.మిమ్స్ స్టూడెంట్కు కౌన్సెలింగ్ ఇచ్చాం ఆన్లైన్ యాప్లకు ఏ ఒక్కరూ బలికావద్దని విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిమ్స్ విద్యార్థి చాతుర్య క్యాష్యో యాప్ ద్వారా డబ్బులు కట్టి ఆపై అప్పులు చేసి రాబడి రాకపోవడంతో చావే శరణ్యమనుకుని పరిష్కారం చూపాలంటూ తన వద్దకు వచ్చాడన్నారు. రెండు రోజులపాటు తన సిబ్బందితోనే ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగా ఉన్నాడని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
టాప్ ‘టెన్’ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
● డీఈఓ మాణిక్యం నాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీవిజయనగరం గంటస్తంభం: ప్రభ్వుత పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా టాప్ టెన్ విద్యార్థులకు వీకే(వసుధైక కుటుంబం) ఫ్యామిలీ ఫౌండేషన్, క్రెడిట్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యం నాయుడు విద్యార్ధులకు చెక్కులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్షిప్లు అందించడంతో పాటు టాప్ టెన్ విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం మంచి కార్యక్రమమన్నారు. 594 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన ఇ.ఉమాపార్వతి, జి.సాద్వికలకు రూ.14 వేలు చొప్పున, 593 మార్కులతో ద్వితీయ స్ధానం పొందిన ఎస్.గుణశేఖర్, జె.పవన్కుమార్లకు రూ.10 వేలు చొప్పున, 591 మార్కులతో తృతీయ స్థానం సాధించిన కె.కీర్తనకు రూ.7వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే 590 మార్కులు సాధించిన మరో ఏడుగురు విద్యార్థులకు రూ.3 వేలు చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మోహనరావు, వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తాగుబోతుల నిర్వాకం..!
● అంగన్వాడీ కేంద్రం వద్ద తాగి విడిచిపెట్టిన అవశేషాలుగంట్యాడ: మాంసం తిన్నానని అందరికీ తెలియాలని వెనకటికొకడు బొమికెలు మెడలో వేసుకుని తిరిగాడన్నట్లుంది కొందరు తాగుబోతుల నిర్వాకం. మండలంలోని నరవ గ్రామంలో అంగన్వాడీ–2 కేంద్రం వద్ద తాగుబోతుల చేసిన నిర్వాకం చిన్నారులు, అంగన్వాడీ సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాత్రి సమయంలో కొంతమంది అసాంఘిక వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద మద్యం తాగి, ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేయడంతో గురువారం ఉదయం స్కూల్కు వచ్చిన చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు చదువుకునే ప్రదేశమని తెలిసినా నిర్లక్ష్యంగా మద్యం తాగడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిసరాల్లో పగిలిన సీసాలు, మద్యం అవశేషాలు ఉండడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానిక పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
భోజనానికి టెండర్..!
ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే రోగులకు భోజనం వడ్డింపుకోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. గడువుముగిసి నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు. తప్పుడు ధ్రువపత్రాలతో భోజనానికి ‘టెండర్’పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుపై నిజనిర్ధారణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వాస్తవికత నిర్ధారణలో జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం సరఫరా చేసేందుకు రెండు నెలలు కిందట నోటిఫికేషన్ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులకు ఇప్పటివరకు టెండర్లు ఖరారుకాని పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, టీడీపీ సర్కారు హయాంలో టెండర్ల ఖారారులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి కట్టబెట్టి, భోజనంలో ‘టెండర్’పెట్టేందుకే జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల పక్రియ గందరగోళానికి దారితీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ఇదీ పరిస్థితి... ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్యవిధాన్ పరిషత్లోని ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రులు, నెల్లిమర్ల సీహెచ్సీ, బొబ్బిలి, బాడంగి, భోగాపురం, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ (భోజనం) అందించేందుకు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 13వ తేదీన జేసీ సమక్షంలో టెండర్లు తెరిచారు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి ఆస్పత్రులకు టెండర్లు ఖరారయ్యాయి. నెల్లిమర్ల సీహెచ్సీకి ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులైన ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసేందుకు తక్కువ ధరకు కోడ్ చేసిన వ్యక్తులకు అధికారులు డైట్ కాంట్రాక్ట్ను కేటాయించారు. దీనిపై టెండర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రోగులకు డైట్ సరఫరాలో అనుభవం ఉన్నట్టు టెండర్ ఖరారు అయిన వ్యక్తులు సమర్పించినవి తప్పుడు ధ్రువపత్రాలని ఆరోపించారు. వాస్తవికతను నిర్ధారించాలని కోరారు. దీంతో టెండర్ ఖరారైన వారు సమర్పించిన ధ్రువపత్రాల వాస్తవికత నిర్ధారణ కోసం ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సరఫరా చేసినట్టు తెలిపారో ఆ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఇది కొలిక్కిరాకపోవడంతో టెంటర్ ప్రక్రియ అసంపూర్తిగా మారింది. నిజనిర్ధారణ జరుగుతోంది.. సర్వజన ఆస్పత్రి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం ఏరియా ఆస్పత్రులకు సంబంధించి డైట్ టెండర్లు తక్కువ ధరకు టెండర్ వేసిన వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలతో వారు టెండర్ వేశారని ఫిర్యాదులు అందాయి. నిజనిర్ధారణ కోసం సంబంధిత ఆస్పత్రులకు పంపించాం. అక్కడ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. అప్పటివరకు పాతకాంట్రాక్టరే భోజనం సరఫరా చేస్తారు. – డాక్టర్ పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి – డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ పెద్దాస్పత్రులే టార్గెట్... టెండర్లు ఖరారు కాని నాలుగు ఆస్పత్రులు కూడ పెద్దాస్పత్రులే. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సగటున రోజుకి 400 నుంచి 500 మంది వరకు రోగులు చికిత్స పొందుతారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో 100 మంది, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో 90 నుంచి 100 మంది, రాజాం ఏరియా ఆస్పత్రిలో 100 మంది వరకు రోగులు ఇన్పేషేంట్లుగా చికిత్స పొందుతారు. డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ప్రతిరోజు మూడు పూటలా రోగులకు నిబంధన ప్రకారం భోజనం అందించాలి. పెద్దాస్పత్రుల్లో భోజనం సరఫరా టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలైనా ఖరారుకాని టెండర్లు టెండర్లు దక్కించుకున్న వారు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ఫిర్యాదు పూర్తికాని నిజనిర్ధారణ పాతకాంట్రాక్టర్తోనే భోజనం వడ్డింపు నిబంధనలివీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్ వేసేవారు ఇదివరకే ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి డైట్ సరఫరా చేసి ఉండాలి. ఆదాయపన్ను వివరాలు సమర్పించాలి. ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సమర్పించారో సంబంధిత ఆస్పత్రి వారి నుంచి అనుభవ ధ్రువపత్రం సమర్పించాలి.


