International
-
నైజీరియాలో వైమానిక దాడి: 100 మంది పౌరుల మృతి?
అబూజా: నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరిపిన వైమానిక దాడి పెను విషాదాన్ని మిగిల్చింది. జాంఫారా రాష్ట్రంలోని తుమ్ఫా గ్రామంలో ఆదివారం ఒక మార్కెట్పై జరిగిన ఈ దాడిలో సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' వెల్లడించింది. మృతుల్లో అత్యధికులు కౌమార బాలికలు, చిన్న పిల్లలే ఉన్నట్లు పేర్కొంది.సైన్యం ఖండనఈ ఆరోపణలను నైజీరియా సైన్యం తీవ్రంగా ఖండించింది. తాము కేవలం సాయుధ ముఠాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను పొరపాటున కూడా లక్ష్యంగా చేసుకోలేదని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ మైఖేల్ ఒనోడా స్పష్టం చేశారు. అయితే, ఒక్క గ్రామంలోనే 80 మందికి పైగా సామాన్య పౌరుల అంత్యక్రియలు జరిగాయని, అక్కడ తిరుగుబాటుదారులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమ్నెస్టీ నైజీరియా డైరెక్టర్ ఇసా సనుసి ధ్వజమెత్తారు.పునరావృతమవుతున్న పొరపాట్లుబోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడుతున్న నైజీరియాలో.. క్షేత్రస్థాయి సిబ్బంది, వాయుసేన మధ్య సమన్వయ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత నెలలోనూ జరిగిన ఒక పొరపాటు దాడిలో 100 మంది మరణించారు. సాయుధ ముఠాలు స్థానిక ప్రజల్లో కలిసిపోయి ఉండటం వల్ల లక్ష్యాలను గుర్తించడం కష్టమవుతోందని సైనిక వర్గాలు వాదిస్తున్నాయి. -
దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్.. కీలక మార్పు
దుబాయ్: మారుతున్న కాలానికి అనుగుణంగా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డ్రైవింగ్ శిక్షణలో కీలక మార్పులు చేపట్టింది. ఆధునిక వాహనాల్లో అందుబాటులోకి వచ్చిన 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (ADAS) వంటి అత్యాధునిక సాంకేతికతను లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సిలబస్లో చేర్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.శిక్షణలో కొత్త అంశాలివే..నూతన సిలబస్ ప్రకారం అభ్యర్థులు వాహనాల్లోని కీలక భద్రతా వ్యవస్థలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.కొలిజన్ వార్నింగ్: వాహనం వేరే వస్తువును ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పుడు హెచ్చరించే వ్యవస్థ.బ్లైండ్ స్పాట్ మానిటరింగ్: డ్రైవర్కు కనబడని ప్రదేశాల్లోని వాహనాల గుర్తింపు.అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్: ముందటి వాహనం వేగానికి అనుగుణంగా స్వయంచాలక వేగ నియంత్రణ.వీటితో పాటు ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ డిటెక్షన్, నైట్ విజన్ సిస్టమ్, ఏబీఎస్ (ABS) వంటి సాంకేతికతలపై థియరీ, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు.ప్రమాదాల నివారణే ధ్యేయం"రహదారి భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్ల ప్రవర్తనలో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం" అని ఆర్టీఏ డ్రైవర్ లైసెన్సింగ్ డైరెక్టర్ సుల్తాన్ అల్ అక్రఫ్ తెలిపారు. డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో రూపొందించిన ఈ కొత్త సిలబస్ ఇప్పటికే హ్యాండ్బుక్స్లో అందుబాటులోకి వచ్చింది.గత కొన్నేళ్లలో సవరించిన సిలబస్ ద్వారా సుమారు 2.50 లక్షల మందికి పైగా శిక్షణ పొందారని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లకు ఈ సరికొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించేలా శిక్షకులకు ప్రత్యేక వర్క్షాపులు కూడా నిర్వహించినట్లు ఆర్టీఏ స్పష్టం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దుబాయ్ లక్ష్యమని వారు పేర్కొన్నారు. -
ఇరాన్కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
పాకిస్థాన్లో భారీ పేలుడు, ఏడుగురి మృతి
లక్కీ మార్వాట్: పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందారు. వాయువ్య పాకిస్థాన్లోని లక్కీ మార్వాట్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో జరిగిన శక్తిమంతమైన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.కాగా, గత శనివారం రాత్రి.. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. ఈ భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్కు పాక్ ఆశ్రయం
ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ యుద్ధంలో శాంతిదూతగా, మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ భారీ మోసానికి పాల్పడిందా? అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ తన గడ్డపై రహస్యంగా ఆశ్రయం కల్పించిందని తాజాగా అమెరికన్ అధికారులు వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. సీబీఎస్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.నూర్ ఖాన్ బేస్లో ఇరాన్ విమానాలుఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే, ఇరాన్కు చెందిన పలు విమానాలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిఘా సమాచారాన్ని సేకరించే ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఆర్సీ-130 (ఆర్సీ-130) విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని వారు ఈ వార్తలను కొట్టిపారేశారు.ఆఫ్ఘనిస్తాన్లోనూ రహస్య ఆశ్రయం?కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్లో దిగిందని ఆఫ్ఘన్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్కు అలా చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా సెనేటర్ ఫైర్ఈ సంచలన నివేదికపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాక్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్కు, దాని మిత్రదేశమైన చైనాకు దూరం కాకుండా పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు? -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?
ప్రెటోరియా: ఒక దేశ అధ్యక్షుడి ఫామ్హౌస్లోని సోఫాలో చోరీకి గురైన భారీ నగదు వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ముప్పు తెచ్చిపెట్టింది. ‘ఫామ్గేట్’ స్కామ్గా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణను నిలిపివేస్తూ, గతంలో ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని అక్కడి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడంతో, రామఫోసాపై అభిశంసన ప్రక్రియకు మరోసారి వార్తల్లోకి వచ్చింది.కుదిపేస్తున్న ‘ఫామ్గేట్’ స్కామ్2020లో రామఫోసాకు చెందిన ‘ఫల ఫల’ (Phala Phala) ఫామ్హౌస్లోకి చొరబడిన దొంగలు, అక్కడి సోఫాలో దాచిన భారీ విదేశీ నగదును ఎత్తుకెళ్లారు. అది గేదెల విక్రయం ద్వారా వచ్చిన 5.8 లక్షల డాలర్ల చట్టబద్ధమైన ఆదాయమేనని అధ్యక్షుడు చెబుతుండగా, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాత్రం ఆ మొత్తం సుమారు నాలుగు మిలియన్ డాలర్లు(రూ. 38 కోట్ల పైమాటే) ఉంటుందని ఆరోపించారు. అంత భారీ నగదు దేశంలోకి ఎలా వచ్చింది? బ్యాంకులో కాకుండా సోఫాలో ఎందుకు దాచారు? అనే ప్రశ్నలు తీవ్ర దుమారం రేపాయి.అభిశంసనకు మళ్లీ ప్రాణం2022లో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఒక స్వతంత్ర ప్యానెల్.. రామఫోసా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. కానీ అధికార ఏఎన్సీ పార్టీ తనకున్న మెజారిటీతో పార్లమెంట్లో విచారణను అడ్డుకుంది. అయితే పార్లమెంట్ చర్య రాజ్యాంగ విరుద్ధమని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సెక్షన్ 89 కింద నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షునిపై అభిశంసన ప్రక్రియను తప్పనిసరిగా పునఃప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.తగ్గేదే లేదంటున్న రామఫోసాకోర్టు తీర్పు నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న రాజీనామా డిమాండ్లను రామఫోసా తీవ్రంగా తోసిపుచ్చారు. తాను ప్రజాధనాన్ని దోచుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్యానెల్ నివేదిక ఆధారాలు లేనిదని, దానిని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తానని వెల్లడించారు. కాగా, అభిశంసన నెగ్గాలంటే పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం అధికార పార్టీకి 40 శాతం సీట్లు ఉండటంతో అధ్యక్షుడి పదవికి తక్షణ ముప్పు లేదని, ఆయన ఈ గండం గట్టెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం -
రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.లావన్ ఐలాండ్ టార్గెట్గా దాడిగత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీయూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్బేస్ నూర్ ఖాన్ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్లో నిలిచిందని.. తర్వాత హెరాత్కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!
అందమైన పగడపు దీవులు.. అంతుచిక్కని నీలిరంగు సముద్ర తీరాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుత ప్రదేశం లక్షద్వీప్. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని కలలు కనేవారికి ఇప్పుడు ఒక శుభవార్త! ఇన్నాళ్లూ లక్షద్వీప్ వెళ్లాలంటే స్థానికుల స్పాన్సర్షిప్ కోసం వెతకడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం పడిగాపులు కాయడం లాంటి ఎన్నో కష్టాలు ఉండేవి. అయితే పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లక్షద్వీప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు సడలిస్తూ, ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు ప్రయాణికులకు పూల దారిలా మారాయి. ఇంతకీ భద్రతలో ఏమాత్రం రాజీపడని లక్షద్వీప్ యంత్రాంగం పెట్టిన కొత్త రూల్స్, అమలు చేస్తున్న సడలింపులు ఏమిటి?తొలగిపోయిన ప్రధాన అడ్డంకులుతాజా మార్గదర్శకాల ప్రకారం, పర్యాటకులకు అతిపెద్ద అడ్డంకిగా మారిన ‘లోకల్ స్పాన్సర్’ (స్థానిక వ్యక్తి లేదా సంస్థ హామీ) నిబంధనను యంత్రాంగం పూర్తిగా ఎత్తివేసింది. దీనితో పాటుగా, ప్రయాణికులు తమ సొంత రాష్ట్రం నుంచి సమర్పించాల్సిన ‘పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)’ అవసరం ఇకపై ఉండదు. అయితే భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, దరఖాస్తు చేసిన తర్వాత లక్షద్వీప్ పోలీసులే స్వయంగా అంతర్గత భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలు సజావుగా జరగడానికి, పర్యాటకులు తమ ప్రయాణ తేదీకి కనీసం 14 రోజుల ముందే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లక్షద్వీప్లో ఏ ఏ దీవులను సందర్శించాలనుకుంటున్నారు? ఏ ఏ తేదీల్లో అక్కడ ఉంటారనే వివరాలను అప్లికేషన్లో స్పష్టంగా పేర్కొనాలి. పర్మిట్ దక్కని ఏ ఇతర దీవిలోనూ అడుగుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లభించదు. ప్రయాణ మార్గంలో కవరత్తి లేదా అగత్తి దీవుల్లో గరిష్టంగా 12 గంటల పాటు మాత్రమే ట్రాన్సిట్ కోసం ఆగేందుకు అనుమతి ఉంటుంది.పర్మిట్ వచ్చాకే బుకింగ్స్ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులను అధికారులు కేవలం మెరిట్ ఆధారంగా, అన్ని అర్హతలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు. అధికారికంగా ఎంట్రీ పర్మిట్ చేతికి వచ్చేలోపు ఎలాంటి విమాన లేదా హోటల్ బుకింగ్స్ చేసుకోవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పర్మిట్ రాకపోతే చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ల వల్ల భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఉండే పీక్ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఇకపోతే లక్షద్వీప్ స్థానికులు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులకు మినహా.. భారతీయులతో సహా విదేశీయులందరికీ ఈ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. పర్యాటకులు అన్ని దీవులకు వెళ్లలేరు. భారతీయ పౌరులు కేవలం ఐదు దీవులను (కవరత్తి, అగత్తి, బంగారం, కద్మత్, మినికాయ్) మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన నియంత్రణలు కొనసాగుతాయి.దరఖాస్తు ఎలా చేయాలి? పర్యాటకులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతుల్లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ఎంచుకునేవారు అధికారిక ‘ఈ-పర్మిట్ (ePermit)’ పోర్టల్ లోకి వెళ్లి (https://epermit.utl.gov.in/pages/signup) అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ప్రయాణ తేదీలు, పర్సనల్ వివరాలు నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందితే ప్రయాణానికి సుమారు 15 రోజుల ముందు ఈ-మెయిల్ ద్వారా పర్మిట్ అందుతుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా లక్షద్వీప్ యంత్రాంగ వెబ్సైట్ నుంచి ఫారాలు డౌన్లోడ్ చేసుకుని, కవరత్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు. కానీ దీనికి ప్రాసెసింగ్ సమయం ఎక్కువ పడుతుంది. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్), ప్రయాణ టికెట్లు (ఫ్లైట్ లేదా పడవ), హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ (అవసరమైన చోట) డాక్యుమెంట్లను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ -
ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలికి బిగ్ షాక్
మనీలా: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టె ఉద్వాసనకు గురయ్యారు. ప్రతినిధుల సభ సోమవారం ఆమెను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. బయటికి వెల్లడించని ఆస్తులను కూడబెట్టారని, అధ్యక్షుడిని చంపుతామంటూ బెదిరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె కుమార్తె అయిన సారాపై ఆరోపణలున్నాయి.అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్తో విభేదాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రతినిధుల సభ 255–26 ఓట్ల భారీ తేడాతో సారా డ్యుటెర్టెను తొలగిస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై సెనేట్లో విచారణ జరగనుంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సారాకు ఇది పెద్ద షాక్ అని పరిశీలకులు అంటున్నారు.గతేడాది కూడా ప్రతినిధుల సభ సారా ఉద్వాసన తీర్మానం చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడంతో గండం గట్టెక్కారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను సారా డ్యటెర్టె ఖండిస్తున్నారు. అధ్యక్షుడు మార్కోస్ కుటుంబీకులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శిస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్కు పోటీగా మారరాదనే తనపై ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆరోపిస్తున్నారు. -
ప్రధానీ.. ప్లీజ్ రాజీనామా చేయండి!!
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 14 ఏళ్ల కన్జర్వేటివ్ల పాలనకు చరమగీతం పాడిన లేబర్ పార్టీ.. ఏడాది తిరగకముందే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ప్రధాని కీర్ స్టార్మర్పై సొంత పార్టీ నేతలే కత్తిగట్టారు. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని 70 మందికి పైగా ఎంపీలు, సీనియర్ క్యాబినెట్ మంత్రులు డిమాండ్ చేయడం ఇప్పుడు బ్రిటన్లో సంచలనంగా మారింది.ముదురుతున్న సంక్షోభంఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా వేల్స్ పార్లమెంటుపై 1999 నుంచి ఉన్న పట్టును కోల్పోయి, ‘ప్లాయిడ్ సిమ్రూ’కు అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. అటు స్కాట్లాండ్లోనూ పార్టీ ప్రాభవం తగ్గడం, రిఫార్మ్ యూకే, గ్రీన్ పార్టీలు పుంజుకోవడంతో స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.మంత్రుల ఒత్తిడివిదేశాంగ మంత్రి యెవెట్టే కూపర్, అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ వంటి కీలక నేతలు ఇప్పటికే స్టార్మర్తో చర్చలు జరిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ జరగాలని వారు సూచించినట్లు సమాచారం.సహాయకుల రాజీనామానలుగురు కీలక మంత్రుల పార్లమెంటరీ సహాయకులు (జో మోరిస్, టామ్ రట్లాండ్, మెలానియా వార్డ్, నౌషాబా ఖాన్) తమ పదవులకు రాజీనామా చేస్తూ.. స్టార్మర్పై ప్రజలకు నమ్మకం పోయిందని బహిరంగంగా విమర్శించారు.గండం గట్టెక్కేనా?లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం.. అధికారికంగా నాయకత్వ మార్పు కోసం ఓటింగ్ జరగాలంటే కనీసం 81 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం 70 మందికి పైగా సభ్యులు వ్యతిరేకిస్తుండటంతో, మరో పది మంది తోడైతే స్టార్మర్ కుర్చీకి ప్రమాదం తప్పదు. 2029 సాధారణ ఎన్నికల నాటికి స్టార్మర్ సారథ్యంలో పార్టీ గెలవడం అసాధ్యమని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు."ప్రధానిపై ప్రజలకు విశ్వాసం సడలిందని స్పష్టమవుతోంది. ఈ మార్పుకు ఆయన నాయకత్వం వహించలేరు" అని వెస్ స్ట్రీటింగ్ పార్లమెంటరీ సహాయకుడు జో మోరిస్ వ్యాఖ్యానించారు.తగ్గని స్టార్మర్.. వారసులెవరు?ఎంత ఒత్తిడి వచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "నాపై సందేహాలు ఉన్నాయని తెలుసు, వాటిని పటాపంచలు చేస్తాను. నేను బాధ్యతల నుంచి పారిపోను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, ఇంధన సంస్కరణలు, ఐరోపాతో సత్సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన మద్దతుదారులకు హామీ ఇచ్చారు.రేసులో వీరేనా?ఒకవేళ స్టార్మర్ దిగిపోవాల్సి వస్తే.. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ లేదా మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక స్తబ్దత మధ్య స్టార్మర్ ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
సౌదీ హజ్ యాత్రికులకు అలర్ట్: పేమెంట్ గడువులో మార్పు
దుబాయ్: పవిత్ర హజ్ యాత్రకు సిద్ధమవుతున్న స్వదేశీ యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ మే 15 (శుక్రవారం) నుంచి దేశీయ హజ్ బుకింగ్ చెల్లింపుల రెండో దశను ప్రారంభించనుంది. అయితే, ఈ దఫా సీట్ల లభ్యతను పెంచేందుకు చెల్లింపుల గడువు విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.గడువు 72 గంటల నుంచి 6 గంటలకు..ప్రస్తుతం ప్రాథమిక రిజర్వేషన్ పొందిన వారికి ఇన్వాయిస్ చెల్లించడానికి 72 గంటల సమయం ఇస్తుండగా, మే 15 నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. మే 15 నుంచి రిజర్వేషన్ పొందిన వారు కేవలం 6 గంటలలోపే చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుని చెల్లింపులు చేయకపోతే, ఆ సీటు బ్లాక్ అవ్వకుండా వెంటనే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఇతర దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత గడువు (6 గంటలు) ముగిసిన వెంటనే చెల్లించని రిజర్వేషన్లు సాఫ్ట్వేర్ ద్వారా స్వయంచాలకంగా రద్దవుతాయి.సదాద్ ద్వారానే చెల్లింపులుఇప్పటికే 'నుసుక్' (Nusuk) ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సౌదీ పౌరులు, నివాసితులు 'సదాద్' (SADAD) డిజిటల్ సిస్టమ్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యాత్రికుల సౌకర్యార్థం మినాలో 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కొత్త గుర్తింపు కలిగిన గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ 2026 సీజన్ కోసం చేపడుతున్న ఈ ఆధునికీకరణ పనుల వల్ల యాత్రికులకు మెరుగైన వసతులు లభించనున్నాయి. -
56 దేశాల్లో భారతీయులకు బంపర్ ఆఫర్!
వేసవి విడిదికి తోడు ఈద్ సెలవులు దగ్గరపడుతుండటంతో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్పోర్ట్ శక్తిసామర్థ్యాలపై తాజా 'హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్' ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఉన్న 75వ స్థానం నుంచి స్వల్పంగా పడిపోయినప్పటికీ, భారతీయులు వీసా ముందస్తు దరఖాస్తు అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు.ర్యాంకింగ్లో హెచ్చుతగ్గులు..గ్లోబల్ వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ ఈసారి క్యూబా, సెనెగల్ వంటి దేశాలతో కలిసి 78వ స్థానాన్ని పంచుకుంది. అయితే, గమ్యస్థానాల పరంగా చూస్తే భారత్ బలం స్థిరంగానే ఉంది. 2025లో 57 దేశాలకు వీసా లేకుండా ప్రవేశం ఉండేది. అది జనవరి 2026 నాటికి 55 దేశాలకు తగ్గింది. ప్రస్తుతం గాంబియా చేరికతో 56 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ పెరిగింది.ఎక్కడికి ఎలా వెళ్లొచ్చు?భారత పౌరులకు ప్రస్తుతం 30 దేశాలు పూర్తిస్థాయిలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' (వచ్చిన తర్వాత వీసా), మరో 3 దేశాలు 'ఈటీఏ' (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) పద్ధతిలో అనుమతిస్తున్నాయి.వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, జమైకా, కజకస్తాన్, కిరిబాటి, మకావో (ఎస్.ఎ.ఆర్ చైనా), మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, నేపాల్, నియు, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, థాయ్ లాండ్, ది గాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు ఉన్నాయి.వీసా-ఆన్-అరైవల్ (VOA) అనుమతిస్తున్న దేశాల్లో బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావు దీవులు, ఖతార్, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, తువాలు, జింబాబ్వే ఉన్నాయి.ఇక కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏ విధానంలో ప్రవేశం కల్పిస్తున్నాయి.పర్యాటకుల చూపు.. 'సమీప' దేశాల వైపు..ఈద్ సెలవుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, కనీస డాక్యుమెంటేషన్తో ప్రయాణించే వీలున్న ఆసియా, మధ్యప్రాచ్య దేశాలపై భారతీయులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా థాయ్లాండ్, మలేషియా, మాల్దీవులు వంటి దేశాలు వీసా సరళీకరణను ప్రకటించడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.ర్యాంకింగ్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇది మన పాస్పోర్ట్ బలహీనత కంటే ఇతర దేశాల వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల సంభవించినదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. -
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు 'డిజిటల్' ఉరి!
టెహ్రాన్: యుద్ధం మిగిల్చిన గాయం ఒకవైపు.. డిజిటల్ దిగ్బంధనం చేస్తున్న విధ్వంసం మరోవైపు! ఇరాన్లో గత 73 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి నెట్టివేస్తోంది. క్షిపణుల మోత కంటే భయంకరంగా ఈ 'డిజిటల్ సీజ్' సామాన్యుల ఉపాధిని బలితీసుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ప్రైవేట్ రంగాన్ని ఈ సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం శ్మశానవాటికగా మారుస్తోంది.నిశ్శబ్ద భూకంపంఅంతర్జాతీయ ఇంటర్నెట్ వాచ్డాగ్ 'నెట్ బ్లాక్స్' (NetBlocks) తాజా నివేదిక ప్రకారం, ఆధునిక సమాజంలో ఇంత సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ నిలిపివేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు సుమారు 2.6 బిలియన్ డాలర్ల (రూ. 21,000 కోట్లకు పైగా) ఆర్థిక నష్టం వాటిల్లింది. నేరుగా 10 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతిరోజూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 80 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఛానెళ్లు 90% వరకు మూతపడ్డాయి.కుప్పకూలిన డిజిటల్ సామ్రాజ్యంఒకప్పుడు ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 'డిజిటల్ ఎకానమీ' ఇప్పుడు ఆవిరవుతోంది. ఇరాన్ అమెజాన్గా పిలిచే 'డిజికాలా' వందలాది మందిని తొలగించగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ 'కామ్వా' తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. "రెండు యుద్ధాలు, నెలల తరబడి ఇంటర్నెట్ బంద్ తర్వాత మేము నిలబడలేకపోతున్నాం" అని సంస్థ వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.పారిశ్రామిక రంగానికి పక్షవాతంసాంకేతిక రంగమే కాకుండా, పెట్రోకెమికల్, ఉక్కు, వస్త్ర పరిశ్రమలు సైతం కుదేలయ్యాయి. సరఫరా గొలుసు (Supply Chain) విచ్ఛిన్నం కావడంతో ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోయింది. ఒక్క పశ్చిమ ఇరాన్ ఫ్యాక్టరీలోనే 700 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. దాదాపు 35 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని పారిశ్రామిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తప్పని తిప్పలు.. తెగనమ్ముకుంటున్న ఆస్తులుమధ్యతరగతి ఇరానియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగాలు ఊడిపోవడంతో కనీస అవసరాల కోసం కార్లు, బంగారు ఆభరణాలను అమ్ముకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. టెహ్రాన్కు చెందిన బాబాక్ అనే ప్రొడక్ట్ డిజైనర్ మాటల్లో చెప్పాలంటే.. "జీవితాంతం కష్టపడి నేర్చుకుని ఎదిగాను, కానీ ఇప్పుడు నా కళ్లముందే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది."రాజకీయ చదరంగం.. ఆర్థిక బలిఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విఫలం కావాలని అమెరికా భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం లొంగే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. కానీ, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. విదేశీ ప్లాట్ఫారమ్లు బంద్ కావడంతో ప్రజలను బలవంతంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే దేశీయ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఇరాన్లో క్షిపణి దాడుల కన్నా 'డిజిటల్ ముట్టడి' వల్ల కలిగే నష్టం దీర్ఘకాలికంగా ఆ దేశ వెన్నుముకను విరిచేలా కనిపిస్తోంది. -
రన్వేపై సూసైడ్?? షాకింగ్ వీడియో వెలుగులోకి..
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం తాలుకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ వ్యక్తి రన్వేపైకి దూసుకురాగా.. విమానం అతన్ని ఢీ కొట్టి ఇంజిన్లోకి లాగేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొలరాడో స్టేట్ డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్కి బయల్దేరిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ విమానం(Airbus A321).. రన్వేపై వేగంగా దూసుకెళ్తూ హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది. దీంతో విమానంలో మంటలు వ్యాపించాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఎమర్జెన్సీ స్టయిడ్స్ ద్వారా అందరినీ బయటకు తెచ్చారు. 12 మందికి స్వల్పగాయాలు కాగా.. మరో ఐదుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే..రన్వేను మూసేసి దర్యాప్తు ప్రారంభించారు. రన్వేపై దూసుకెళ్తున్న సమయంలో బిగ్గరగా శబ్దం వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఓ వ్యక్తిని ఢీ కొట్టినట్లు పైలట్ చెప్పాడు. దీంతో విమానం ఇంజిన్ నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రన్వేపై జరిగిన ప్రమాదంలోనే అతను జరిగి ఉంటాడని భావించారంతా. ఈ నేపథ్యంలో షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ సిబ్బంది కాదని అధికారులు తేల్చేశారు. ‘‘దొడ్డిదారిన ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ దూకిన ఓ వ్యక్తి.. రన్వేపై ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలోనే 180 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన విమానం అతన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే అతన్ని ఇంజిన్లోకి లాగేయడంతో.. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. రన్వేపై విమానం దూసుకు రావడం అతను గమనించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని.. బహుశా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే వచ్చి ఉంటాడు’’ అని డెన్వర్ పోలీసులు ప్రకటించారు.ఫెన్సింగ్ దూకిన రెండు నిమిషాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. అతను ఎవరనేది తేలితేనే.. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది అని ఓ అధికారి చెబుతున్నారు. మరోవైపు.. ఉగ్ర దాడి, ప్రమాదవశాత్తూ మరణం కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి..ABD’de Frontier Airlines’a ait Los Angeles seferini yapan yolcu uçağı, Denver Uluslararası Havalimanı’nda kalkış sırasında pistte bulunduğu belirtilen bir kişiye çarptı.Motorun kısmen içine çekilen kişi yaşamını yitirirken, olay kısa süreli yangına neden oldu. Uçaktaki 231… pic.twitter.com/8xfpqn8shE— Dış Ses (@disseshaber) May 11, 2026 -
ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt) -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జిన్పింగ్ ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్.. టార్గెట్ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలుఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్వర్క్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత -
థాయ్లాండ్ పాలిటిక్స్: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని, 76 ఏళ్ల టెలికాం బిలియనీర్ థాక్సిన్ షినవత్రా సోమవారం బ్యాంకాక్ జైలు నుంచి ముందస్తుగా విడుదలయ్యారు. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ రాజకీయ దిగ్గజం మళ్లీ తెరపైకి రావడం థాయ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.షరతులతో కూడిన స్వేచ్ఛఅవినీతి ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న థాక్సిన్ వయసును పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా విడుదల మంజూరు చేశారు. అయితే నాలుగు నెలల ప్రొబేషన్ పీరియడ్లో ఆయన తప్పనిసరిగా కాలికి ఎలక్ట్రానిక్ మానిటర్ ధరించాల్సి ఉంటుంది. జైలు వెలుపల తన కుటుంబ సభ్యులను కౌగిలించుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన నేత రాకతో అక్కడికి చేరుకున్న వందలాది ‘రెడ్ షర్ట్’ మద్దతుదారులు థాక్సిన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.వివాదాలు.. తగ్గని మద్దతు2023 ఆగస్టులో ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన థాక్సిన్కు మొదట ఎనిమిదేళ్ల శిక్ష పడినా, రాజ క్షమాభిక్షతో అది ఏడాదికి తగ్గింది. అయితే జైలుకు బదులుగా ఆసుపత్రిలో గడపడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన కుటుంబానికి చెందిన ‘ఫ్యూ థాయ్’ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోయినప్పటికీ, ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం థాక్సిన్ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?థాక్సిన్ విడుదల ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన కొంతకాలం దూరంగా ఉన్నా, రాజకీయాలను విడిచిపెట్టరని మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు, థాక్సిన్ వ్యతిరేకులు ఆయన తదుపరి అడుగులపై నిశితంగా దృష్టి పెట్టారు. అయితే ఆయన కూతురు, మాజీ ప్రధాని పీటాంగ్టార్న్ షినవత్రా మాత్రం జైలులో తమ తండ్రితో కేవలం కుటుంబ విషయాలే మాట్లాడామని, రాజకీయాలు చర్చించలేదన్నారు. ఏది ఏమైనా థాక్సిన్ తాజా విడుదల థాయ్లాండ్లో కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తోంది.ఇది కూడా చదవండి: సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు! -
పాక్ మునీర్ నోటి దురుసు.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్.. మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది. -
ఏం ఆటలా?.. 47 ఏళ్లుగా అదే మోసమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికాతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇరు దేశాలు తమ ప్రతిపాదనలను పరస్పరం తిరస్కరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా చేసిన మెసేజ్ సారాంశం ఇలా ఉంది.. ఇరాన్ 47 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ప్రపంచాన్ని మోసం చేస్తోంది. వారు ఎప్పటికప్పుడు ఆటలాడుతూ ఆలస్యం(మూడుసార్లు నొక్కి.). చేస్తున్నారు’’ అని న్యూక్లియర్ డీల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఒబామా చారిత్రక తప్పిదం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఇరాన్పై “సడలింపు” చూపారని.. ఆయన హయాంలో అమెరికా నుంచి ఇరాన్కు విమానాల్లో పెద్ద మొత్తంలో(400 మిలియన్ డాలర్లు) నగదు వెళ్లిందని ఆరోపించారు. ఒబామా కుదిర్చిన 2015 అణు ఒప్పందం ‘‘అత్యంత చెత్త ఒప్పందం’’. దాని వల్లే మిడిల్ ఈస్ట్లో ఇరాన్కు అనవరసమైన ప్రాధాన్యం పెరిగింది. ఒబామా ప్రభుత్వం ఈ నగదు పంపిణీని 1979లో విఫలమైన ఆయుధ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన డబ్బు అని చెప్పింది. కానీ, అది ఎంతమాత్రం కాదు. ఈ చర్యతో ఒబామా ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన పాలనను బలపరిచారు’’ అని మండిపడ్డారు. గతంలో నేను ఈ ఒప్పందాన్ని రద్దు చేశానని.. లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధం తయారు చేసి ఇజ్రాయెల్పై వాడేదని అన్నారు. అలాగే, తన బలమైన నాయకత్వంలోనే జనరల్ ఖాసీం సోలేమానీని హతమార్చానని.. ఆ చర్యను “అత్యవసరమైన రక్షణ చర్య”గా ప్రకటించారు. (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని క్వాడ్స్ ఫోర్స్ కమాండర్. 2020 జనవరి 2న ఇరాక్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీకి ఖాసీం సోలేమానీ కుడి భుజంగా ఉండేవాడు.)ఇరాన్ నుంచి ఒక లేఖ రావొచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అని రెండ్రోజుల కిందటే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు అందజేసిందని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అయితే.. ఇరాన్ తాజా ప్రతిపాదనలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, అందులో ఏ అంశాలు అంగీకరించలేనివిగా ఉన్నాయో మాత్రం ఆయన బయటకు చెప్పడం లేదు. మరోవైపు.. ఇరాన్ మాత్రం దిగి రామంటోంది. అమెరికా చెప్పినట్లు ఒప్పందం చేసుకోవడం అంటే.. లొంగిపోవడం కిందకే వస్తోందని అంటోంది. ఇరాన్ డిమాండ్లు:అమెరికా నుంచి యుద్ధ పరిహారం (war reparations) హర్ముజ్ జలసంధిపై పూర్తి ఇరాన్ సార్వభౌమాధికారంఇరాన్పై ఆంక్షల ఎత్తివేతఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల, వీటికి అదనంగా..అమెరికా నావికాదళ ఆంక్షలు తొలగించాలిభవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలిఇరాన్ చమురు అమ్మకాలపై నిషేధం తొలగించాలిఅయితే ఈ డిమాండ్లు, యుద్ధం మొత్తం కాలంలో అమెరికా ప్రకటించిన ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం ఎంత పేలవంగా ఉందో అమెరికా మాటలతో బయటపడింది. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా నావిగేషన్.. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ. ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రభుత్వంలో వర్గాల ఒత్తిడి, మధ్యవర్తితత్వం వహిస్తున్న కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఆలస్యం జరుగుతోంది’’ అని చెప్పారు.ఒకవైపు పాక్తో పాటు ఈజిప్ట్ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ ప్రతిస్పందన.. ఈ ఘర్షణను మరింత క్లిష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ రీజియన్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా దాడులతో లెబనాన్ వణికిపోతోంది. దీంతో దౌత్య ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో.. ఇంధన ధరలు పెరుగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. శనివారం రాత్రి బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. అనంతరం సంభవించిన భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడిచేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్కు చెందిన 'స్టార్లింక్' టెర్మినల్స్ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
నెత్తురోడిన పోలీస్ చెక్పోస్ట్.. 12 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను ప్రాంతంలో గల ఓ పోలీస్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కారు బాంబు, ఆటోమేటిక్ ఆయుధాలు, డ్రోన్ల సహాయంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృత్యువులా దూసుకొచ్చిన కారు బాంబుఈ దారుణ ఘటన బన్నులోని ఫతే ఖేల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పోలీస్ చెక్పోస్ట్ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు బాంబు పేలుడు ధాటికి చెక్పోస్ట్ ధ్వంసం కాగానే, అప్పటికే పొంచి ఉన్న ఇతర ఉగ్రవాదులు ఒక్కసారిగా లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొక అధికారి ఆచూకీ గల్లంతైంది.దాడిలో డ్రోన్లు, భారీ ఆయుధాలుఈ దాడిని ఉగ్రవాదులు అత్యంత పకడ్బందీగా అమలు చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కేవలం తుపాకులకే పరిమితం కాకుండా, క్వాడ్కాప్టర్లను (చిన్న డ్రోన్లు), భారీ ఆయుధాలను సైతం వినియోగించడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారని, వెళ్తూ పోలీసుల ఆయుధాలతో పాటు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట తీసుకెళ్లారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ముమ్మరంగా గాలింపు చర్యలుఈ భీకర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ అధికారులు ఆ ప్రాంతం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు, గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాల చెక్పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతుండటం సరిహద్దుల్లో అస్థిరతకు దారి తీస్తోంది. -
ఓర్బన్ సామ్రాజ్యం బద్దలు.. హంగేరీ ప్రధానిగా పీటర్ మాగ్యార్
బుడాపెస్ట్: హంగేరీ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 16 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన విక్టర్ ఓర్బన్ అధికార సామ్రాజ్యం బద్దలైంది. ‘తిస్జా’ (Tisza) పార్టీ వ్యవస్థాపకుడు 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ హంగేరీ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన మాగ్యార్, ఒకప్పుడు ఓర్బన్ రాజకీయ కోటరీలో అత్యంత కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఆ కోటను బద్దలుకొట్టి, ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేయడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.పాలకునిగా కాదు.. సేవకుడిగానే ఉంటాశనివారం హంగేరీ పార్లమెంట్లో నూతన ప్రధానిగా మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘లక్షలాది మంది హంగేరీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను ప్రజలను పాలించడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో స్థాపించిన మధ్య-మితవాద ‘తిస్జా’ పార్టీ గత నెల ఎన్నికల్లో ఏకంగా 199 స్థానాలకు గాను 141 సీట్లు కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓర్బన్కు చెందిన ఫైడెజ్-కేడీఎన్పీ కూటమి కేవలం 52 స్థానాలకే పరిమితమైంది.మారనున్న విదేశీ విధానం.. వేడుకకు ఓర్బన్ దూరంఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ హాజరుకాకపోవడం గమనార్హం. 1990 తర్వాత ఆయన ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి. కాగా మాగ్యార్ విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో హంగేరీ సంబంధాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టబద్ధమైన పాలన, ఉక్రెయిన్కు మద్దతు వంటి అంశాల్లో ఈయూతో ఓర్బన్ సర్కార్కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ దక్కడంతో, పాత ప్రభుత్వ నిరంకుశ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నూతన ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.బుడాపెస్ట్లో సంబరాలు.. చట్టసభలో మహిళా శక్తినూతన ప్రధాని ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజధాని బుడాపెస్ట్లోని కొసుత్ స్క్వేర్ వద్దకు వేలాది మంది మద్దతుదారులు చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ‘పాలనా మార్పు’గా మాగ్యార్ అభివర్ణించారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, ఈసారి హంగేరీ చట్టసభలో రికార్డు స్థాయిలో 54 మంది మహిళలు అడుగుపెట్టారు. దేశ శాసనసభ చరిత్రలో ఇదే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం కాగా, వీరిలో అత్యధిక మంది మాగ్యార్కు చెందిన తిస్జా పార్టీ నుంచే ఎన్నికవడం విశేషం.ఇది కూడా చదవండి: శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత -
ట్రంప్ కంపెనీకి భారీ నష్టం.. వందల మిలియన్లు లాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన సోషల్ మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్'కు (TMTG) ఈ ఏడాది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఏకంగా 405.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,400 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విలువ పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని నివేదిక వెల్లడించింది.అవాస్తవిక నష్టాల వెల్లువట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన టీఎంటీజీ, గతేడాది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు క్రిప్టోకరెన్సీలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో డిజిటల్ ఆస్తులు, ఈక్విటీలలో ఏర్పడిన 370 మిలియన్ డాలర్ల వాస్తవీకరించని నష్టాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీశాయి.కంపెనీ ఖజానాలో ప్రస్తుతం 9,500 బిట్కాయిన్లు ఉన్నాయి. గత జూలైలో బిట్కాయిన్ విలువ గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక్కో కాయిన్ను సగటున 1,08,519 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి చివరలో బిట్కాయిన్ ధర 70,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న సమయంలో కంపెనీ 2,000 బిట్కాయిన్లను విక్రయించింది. దీనివల్ల భారీగా పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 80,000 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. గత అక్టోబర్లో 1,26,000 డాలర్ల వద్ద ఉన్న ధర, ఫిబ్రవరి నాటికి 60,000 డాలర్లకు పడిపోవడం కంపెనీ అంచనాలను తలకిందులు చేసింది.ఆర్థిక పునాది పటిష్టమేనా?భారీ నష్టాలు పీడిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ ఆర్థిక ఆస్తులు మూడు రెట్లు పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.9 మిలియన్ డాలర్లుగా నమోదైంది.క్రిప్టో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రస్తుతానికి కాగితంపై నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పకూలుతున్న స్టాక్.. సీఈఓ నిష్క్రమణఒకవైపు ఆర్థిక నష్టాలు, మరోవైపు నాయకత్వ మార్పులు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2022లో ఒకానొక దశలో 97.54 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ, ప్రస్తుతం ఏకంగా 90% పైగా క్షీణించి 8.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ సీఈఓ, మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ ఏడాది ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళన కలిగించింది.జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ట్విట్టర్ (ప్రస్తుత X) ట్రంప్పై నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ సొంతంగా 'ట్రూత్ సోషల్' నెట్వర్క్ను ప్రారంభించారు. రాజకీయంగా ఆదరణ ఉన్నప్పటికీ, ఆర్థికంగా లాభాల బాట పట్టడంలో ఈ సంస్థ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. -
అంగారక గ్రహంపై ‘మొసలి వంతెన’.. అసలేంటి రహస్యం?
అంగారక గ్రహంలో అత్యంత పురాతన ప్రాంతాన్ని నాసా గుర్తించింది. పెర్సెవరెన్స్ రోవర్.. ‘క్రొకోడైల్ బ్రిడ్జ్’గా పిలువబడే అద్భుతమైన భౌగోళిక ప్రాంతానికి సంబంధించి.. అద్భుతమైన 360 డిగ్రీల పనోరమిక్ దృశ్యాలను చిత్రీకరించింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అంటే.. ఇది జెజెరో క్రేటర్ (Jezero Crater) అంచున ఉన్న వంపు ఆకారంలో ఉన్న రాతి నిర్మాణం. ఈ ఉపరితలం మొసలి వీపును పోలి ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. రోవర్ తన Mastcam-Z కెమెరా సిస్టమ్ ద్వారా దృశ్యాలను బంధించింది.ఈ ప్రాంతంలోని రాళ్లు దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం (నోచియన్ కాలం) నాటివి. ఇవి సౌర కుటుంబంలోనే అత్యంత పురాతనమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై టెక్టోనిక్ ప్లేట్లు లేకపోవడం వల్ల.. బిలియన్ల ఏళ్ల నాటి ఈ పురాతన శిలలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది..ఈ 360 డిగ్రీల పనోరమాను పెర్సీవరెన్స్ రోవర్ తన కెమెరా ద్వారా 980 చిత్రాలను కలిపి రూపొందించింది. మానవ కన్ను ఎలా చూస్తుందో అలాగే సహజ రంగుల్లో నాసా దీనిని విడుదల చేసింది. క్రొకోడైల్ బ్రిడ్జ్ అనేది జెజెరో క్రేటర్ నేల నుండి దాని అంచుకు వెళ్లే దారిలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ ప్రాంతం నుంచి రోవర్ త్వరలో ‘లాక్ డి చార్మ్స్’గా పిలిచే మరో ప్రాంతంలోకి ప్రవేశించి.. పలు నెలల పాటు పరిశోధనలు కొనసాగించనుంది.అంగారక గ్రహం ఏర్పడిన కొత్తలో వాతావరణం.. ఉపరితలం ఎలా ఉండేవి? అక్కడ జీవం మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవో లేదో తెలుసుకోవడానికి ఈ టైమ్ క్యాప్సూల్స్ వంటి రాళ్లు శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడతాయి. జెజెరో క్రేటర్ ఒకప్పుడు సరస్సు, నది డెల్టాగా ఉండేదని శాస్త్రవేత్తల నమ్మకం.భవిష్యత్తులో భూమికి తీసుకురావడం కోసం రోవర్ ఇక్కడి రాళ్లు, మట్టిని సేకరిస్తోంది. ఈ అద్భుతమైన 980 దృశ్యాల్లో 971 చిత్రాలను డిసెంబర్ 18, 2025, మిగిలిన 9 చిత్రాలను జనవరి 25, 2026న తీశారు. ఈ చిత్రాల్లో ఎర్రటి మైదానం, రాళ్లు, కొండ అంచులు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను తీసిన Mastcam-Z కెమెరా జూమ్ చేయగలదు. 3D చిత్రాలను తీయగలదు.. చాలా దూరం నుండి రాతి పొరలను స్పష్టంగా పరిశీలించగలదు. మొత్తానికి.. ఈ 'క్రొకోడైల్ బ్రిడ్జ్' పనోరమా అంగారక గ్రహం రహస్యాలను ఛేదించడంలో కీలక అడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరంశత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అసలు ఇరాన్ను శాసిస్తున్నది ఎవరు?ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది! -
ఇరాన్కు సపోర్టు.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ముగింపు దశకు వస్తోందని శుభవార్త చెప్పారు. విక్టరీ డే పరేడ్ అనంతరం పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాస్కో ఒక సంప్రదింపుల దశకు సిద్ధమవుతోందని అనడానికి ఇది ఆయన ఇచ్చిన అత్యంత బలమైన సంకేతం.రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా భయంకరమైన పోరాటం సాగింది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రారంభించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా చెరొక దేశం 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించిన తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ప్రకటన వెలువడిన సమయం వెంటనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రెమ్లిన్ సంవత్సరాలుగా సైనిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది, కానీ రష్యా నాయకుడి తాజా వ్యాఖ్యలు తెరవెనుక పెరుగుతున్న దౌత్యపరమైన కదలికలను సూచించాయి.మరోవైపు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య వివాదం చాలా క్లిష్టంగా మారింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాకు కూడా సవాలుగా మారింది. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా. దీన్ని కొనసాగించాలనే ఆసక్తి ఎవరికీ లేదని నేను భావిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఇంకా రాజీ అవకాశాలు ఉన్నాయి' అని అభిప్రాయపడ్డారు. -
స్టార్మర్కు గట్టి షాక్
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఊహించని షాక్కు గురైంది. తాజాగా జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంగ్లండ్లోని వెయ్యి సీట్లు సహా మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 1,400కుపైగా స్థానాలను కోల్పోయింది. అనూహ్యంగా రిఫార్మ్ యూకే తెరపైకి వచి్చంది. సీనియర్ రాజకీయ నేత నిగెల్ ఫరేజ్ సారథ్యంలోని వలస వ్యతిరేక అజెండా కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు 1,440 కౌన్సిల్ స్థానాలకు గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్పై అసమ్మతి స్వరం మరింతగా పెరిగింది. ఆయన పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రధాని కియర్ స్టార్మర్ పాలనపై అనధికారిక ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన పార్టీని అధికారం దిశగా నడిపించిన స్టార్మర్ ప్రజాదరణ ఆ తర్వాత వేగంగా తగ్గిపోతూ వచి్చంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆయన పదవికి ఇప్పటికిప్పుడు వచి్చన ముప్పేమీ లేదని విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆర్థిక పురోగతి మందగించడం, సంక్షేమ వ్యయం తగ్గించడం వంటివి లేబర్ పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. లేబర్ పార్టీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో దెబ్బతింది. అధికార లేబర్ పార్టీకి 50 ఏళ్లుగా కంచుకోటలుగా ఉన్న సుండర్లాండ్, బార్న్స్లే వంటి చోట్ల రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేసింది. కన్జర్వేటివ్లకు మంచిపట్టున్న న్యూకాజిల్–అండర్–లైమ్, సఫోక్, ఎస్సెక్స్ ప్రాంతాలు కూడా ఈ పార్టీ వశమయ్యాయి. ఎసెక్స్ నుంచే అరడజను మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీకి సంప్రదాయబద్ధంగా పట్టున్న ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ ఓట్లను చీల్చడం, నేరుగా గెలవడం ద్వారా ప్రభావాన్ని చాటుకుంది. ఇంతేకాదు, మొట్ట మొదటిసారిగా లండన్ పరిధిలో ఉన్న హవెరింగ్నూ రిఫార్మ్ యూకే పార్టీ గెల్చుకుంది. వేల్స్లో 27 ఏళ్ల తర్వాత ఓటమి అధికార లేబర్ పార్టీ వేల్స్లో 27 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. వేల్స్ జాతీయ పార్లమెంట్(సెనెడ్)లో ప్లాయిడ్ కమ్రీ పార్టీ ఘన విజయం సాధించింది. సెనేడ్లోని 96 స్థానాలకు గాను ప్లాయిడ్ కమ్రీ 43 సీట్లను గెల్చుకుంది. అయితే, మెజారిటీకి కొద్దిదూరంలో నిలిచింది. ఇక్కడా రిఫార్మ్ యూకే పార్టీ దూకుడు కొనసాగింది. ఎవరూ ఊహించని రీతిలో సెనేడ్లో ఈ పార్టీ 34 సీట్లు కైవసం చేసుకోగా లేబర్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. లేబర్ ఫస్ట్ మినిస్టర్గా ఉన్న ఎల్యునెడ్ మోర్గాన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటిదాకా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 22 మంది సభ్యులుండగా, తాజాగా ఏడుగురు మాత్రమే విజయతీరాలకు చేరారు. ఇంగ్లండ్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే లండన్లో మాత్రం లేబర్ మంచి ఫలితాలనే సాధించుకుంది. ప్రధాని స్టార్మర్ సొంత నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్కు పొరుగునున్న కామ్డెన్లో 16 సీట్లను కోల్పోయినప్పటికీ లేబర్ పార్టీ పట్టునిలుపుకుంది. ఇక్కడ గ్రీన్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఈ ఫలితాలు స్టార్మర్కు కొంత ఊరట కలిగించాయని చెప్పవచ్చు.పదవి నుంచి వైదొలగను: స్టార్మర్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలంటూ వెలుపలి నుంచి విని్పస్తున్న డిమాండ్లపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో నేను పదవి నుంచి తప్పుకోను. దేశాన్ని అస్థిరతలోకి నెట్టివేయబోను’అని స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనవసరమైన కొన్ని తప్పిదాలు చేసిందని, మొదటి రెండేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని అంగీకరించారు. మంత్రివర్గ సహచరులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎవ్వరూ వ్యతిరేక గళం వినిపించలేదు. గట్టి పోటీదారులుగా భావించే లేబర్ పార్టీ నేతలెవరూ ఆయన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో స్టార్మర్ తర్వాతి స్థానంలో ఉండే అండీ బర్న్ హామ్, ఏంజెలా రేనర్ వంటి వారు సైతం మౌనంగా ఉన్నారు.స్కాట్లాండ్లో ఎస్ఎన్పీకి ఆధిక్యం స్కాట్లాండ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) వరుసగా ఐదోసారి విజయం సాధించింది. అయితే, పూర్తి మెజారిటీ సాధనలో వెనుకబడిపోయింది. మొత్తం 129 సీట్లకుగాను ఎస్ఎన్పీ 58 స్థానాలను మాత్రమే సాధించింది. ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పెర్త్షైర్ నార్త్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయన ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రిఫార్మ్ పార్టీ కూడా లేబర్ పార్టీతో సమానంగా 17 సీట్లు గెల్చుకోగా, గ్రీన్స్ పార్టీకి 15 సీట్లు దక్కాయి. స్వతంత్ర స్కాట్లాండ్ నినాదానికి మద్దతిచ్చే పార్టీ కావడంతో ఎస్ఎన్పీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్ను బ్రిటన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చడం ఎస్ఎన్పీ ప్రధాన అజెండా. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం వల్ల రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కష్టం కానుంది. -
మాది న్యాయబద్ధమైన యుద్ధం
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే పరేడ్ వేదికగా నాటో కూటమిపై మండిపడ్డారు. ఉకెయ్రిన్ను దురాక్రమణ దారుగా అభివర్ణించారు. తాము చేస్తున్నది న్యాయబద్ధమైన యుద్ధమంటూ ప్రకటించుకున్నారు. శనివారం రాజధాని మాస్కోలోని ప్రసిద్ధ రెడ్ స్క్వేర్లో జరిగిన వేడుకల్లో వందలాది మంది సైనికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ‘అప్పటి విజేతలు సాధించిన గొప్ప విజయం, నేడు ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను నెరవేరుస్తున్న సైనికులకు స్ఫూర్తినిస్తోంది’ అంటూ ఉక్రెయిన్తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ‘నాటో కూటమి మొత్తం ఆయుధాలను అందిస్తూ మద్దతు ఇస్తున్న ఒక దురాక్రమణ శక్తిని మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మన హీరోలు ముందుకు సాగుతున్నారు’అని పుతిన్ పేర్కొన్నారు. సైనిక వ్యూహాలు ఎలా మారినప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ ఉత్సవాన్ని రష్యా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 25 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న పుతిన్ విక్టరీ డేను దేశ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించే వేదికగా మార్చుకున్నారు. అయితే, ఈసారి అటువంటివేమీ లేకుండా పరేడ్ సాదాసీదాగా సాగింది. ఉక్రెయిన్ దాడుల భయంతోనే భారీగా భద్రతా ఏర్పాట్లు సైతం చేపట్టారు. పెద్ద సంఖ్యలో సైనికులు రెడ్ స్క్వేర్లో కవాతు చేపట్టారు. వీరితో ఉత్తర కొరియా బలగాలు కలిసి పాల్గొనడం గమనార్హం. యుద్ధంలో బిజీగా ఉండటం వల్లే సైనికులు కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొనలేదని ప్రభుత్వం తెలిపింది. క్రెమ్లిన్లో జరిగిన వేడుకకు అతిథులుగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో, మలేసియా రాజు సుల్తాన్ ఇబ్రహీం, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో హాజరయ్యారు. విక్టరీ డే వేడుకలు సుదూరంగా మాస్కోకు 9 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాడివొస్టొక్తోపాటు సైబీరియాలోని క్రాస్నోయార్క్స్, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల్లోనూ జరిగాయి. -
కనీస వేతనాలు పెంచితేనే హెచ్–1బీ వీసాలు!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద ఉద్యోగులను నియమించుకునేందుకు చెల్లించే కనీస వేతనాలను, గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30 శాతం దాకా పెంచాలని తాజాగా ప్రతిపాదించింది. విదేశీ ఉద్యోగులు అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించే పరిస్థితిని నివారించడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధననను అమెరికా కారి్మక శాఖ మార్చి 27వ తేదీన ప్రతిపాదించింది. ఎంట్రీ–లెవెల్ నుంచి మోస్ట్–ఎక్స్పీరియన్స్డ్ దాకా నాలుగు కేటగిరీల్లో కనీస వేతనాలు పెంచాలని అమెరికా కంపెనీలకు స్పష్టంచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనాలను 20 ఏళ్ల క్రితం ఖరారు చేశారు. ఇప్పుడున్న నిబంధనలు అమెరికా కారి్మకులకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా కంపెనీలు హెచ్–1బీ వీసా పథకం కింద తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దాంతో స్వదేశీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అధికారవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హెచ్–1బీ వీసాతో విదేశీయులకు ఉద్యోగం ఇవ్వాలంటే లెవెల్–1 వారికి ఏడాదికి కనీసం 73,279 డాలర్లు, లెవెల్–2 వారికి 98,987, లెవెల్–3 వారికి 1,21,979, లెవెల్–4 వారికి 1,44,202 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త నిబంధన ప్రకారం కనీస వేతనాలు తప్పనిసరిగా పెంచాలి. అంటే లెవెల్–1 వారికి ఏడాదికి కనీసం 97,746 డాలర్లు(పెంపు 33.39 శాతం), లెవెల్–2 వారికి 1,23,212(పెంపు 24.47 శాతం), లెవెల్–3 వారికి 1,47,333(పెంపు 20.79 శాతం), లెవెల్–4 వారికి 1,75,464(పెంపు 21.68 శాతం) డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. నగరాలను బట్టి ఇందులో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కష్టమే! కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. అమెరికా కంపెనీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఇకపై విదేశీయులను నియమించుకొనే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. హెచ్–1బీతోపాటు హెచ్1బీ1, ఈ–3 వీసాల కింద ఉద్యోగాలు పొందే విదేశీయుల వేతనాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. 2020లో కనీస వేతనాల్లో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించగా, చట్టపరంగా> సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది. హెచ్–1బీ వీసాలతో ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులు ప్రయోజనం పొందుతున్నారు. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. భారతీయుల తర్వాత చైనా టెక్ నిపుణులు ఈ వీసాలను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. -
కాల్పుల విరమణపై సందేహాలు!
దుబాయ్: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ శనివారం ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం. మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది. -
భారత్పై చైనా బండారం బట్టబయలు.. పాక్కు సాయం
బీజింగ్: గతేడాది భారత్తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి ఝాంగ్ హెంగ్ తాజాగా అధికార చైనా టీవీకిచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయం వెల్లడించారు. ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్ల డిజైన్లను రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సిందూర్ ప్రకటించిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలతోపాటు వైమానిక, సైనిక స్థావరాలపైనా దాడులు చేసి, తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్కు సాంకేతిక మద్దతిచ్చామని ఝాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం. ‘ఆ నాలుగు రోజులపాటు జెట్ విమానాల శబ్ధాలు, హెచ్చరిక సైరన్ల మోతలతోపాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే, మేం తయారు చేసిన జె10సీఈ యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేసేలా చూడటం మా బాధ్యత’అని ఝాంగ్ వివరించారు. భారత్తో నాలుగు రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్కు సాయం అందించారన్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ, సైనికాధికారులు ఇప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వకపోకవడం గమనార్హం. -
బెంగాల్లో ముస్లింలు, మతువాలపై వేధింపులు
ఢాకా: పశ్చిమ బెంగాల్లో ముస్లింలు, మతువాలు వేధింపులకు గురవుతున్నారని, వారి ఓటు హక్కును కోల్పోయారని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ, ప్రతిపక్ష చీఫ్ విప్ నహీద్ ఇస్లాం వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, అక్కడి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముస్లింలు, దళితులు, మతువాలతో సహా అన్ని మైనారిటీ వర్గాలకు సమాన రక్షణ కల్పించి దక్షిణాసియాకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. చిట్టగాంగ్లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల బెంగాల్లో ఎన్నికలు జరిగా యి. ఎన్నికలు వారి అంతర్గత విషయం. దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే, ఎన్నికలకు ముందే లక్షలాది మంది ఓటర్లు తమ హక్కులను కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, మతువా వర్గానికి చెందినవారున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ ముస్లింలకు పౌరసత్వం నిరాకరిస్తున్నారని, వారిపై హింస పెరిగిందని ఆరోపణలొస్తున్నాయి’అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని మత సమూహాల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించాల్సిన బాధ్యతను బంగ్లాదేశ్పై ఉందన్నారు. బంగ్లాదేశ్ వ్యతిరేక కథనాల పట్ల, మత విద్వేష ప్రచారం, రెచ్చగొట్టే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. పారీ్టలో అంతర్గత విభేదాలను నివారించాలని, యోగ్యత, సామూహిక క్రమశిక్షణ ఆధారంగా సంస్థాగత బలాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారి హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ రాజకీయ ప్రక్రియలలో వారిని భాగస్వాములను చేయడం పార్టీ భవిష్యత్కు అత్యవసమని ఆయన పేర్కొన్నారు. -
యూఎఫ్వోలపై ఫైళ్లు బహిర్గతం
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్వో)లకు సంబంధించిన ఫైళ్లను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ బహిర్గతం చేసింది. వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పర్చుకోవచ్చని శుక్రవారం ఎక్స్లో తెలిపింది. పెంటగాన్తోపాటు వైట్ హౌస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇంధన శాఖ, నాసా, ఎఫ్బీఐలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఈ సమాచారాన్ని తక్కువ చేసి చూపడానికి, వారిని నిరుత్సాహ పర్చడానికి ప్రయత్నించాయన్న పెంటగాన్.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గరిష్ట పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. యూఎఫ్వోల ఫైళ్లను క్రమపద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ఫైళ్లను బహిర్గతం చేస్తామంటూ ట్రంప్ ఫిబ్రవరి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన కెన్నెడీ సోదరులు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీలతోపాటు, మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డులను విడుదల చేశారు. అయితే, ఇందులో అప్పటికే తెలిసిన విషయాలకు మించి మరేమీ కొత్తగా వెల్లడి కాలేదు. యూఎఫ్వోలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని పెంటగాన్ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సైనిక సిబ్బంది తాము చూసిన వింత ఎగిరే వస్తువుల గురించిన సమాచారాన్ని పంచుకోవడంతో దశాబ్దాల నాటి ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ 2022లో పెంటగాన్ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం 2024లో విడుదల చేసిన మొట్టమొదటి నివేదికలో..గుర్తు తెలియని దృగి్వషయాలకు సంబంధించిన ఘటనలు వందలాదిగా నమోదయ్యాయని తెలిపింది. గ్రహాంతర జీవుల సాంకేతికతను అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. కాగా, సైనిక సాంకేతికతపై అవగాహన లేని వారు తాజాగా వెల్లడి చేసిన వీడియోల విషయంలో పొరపాటుపడే అవకాశం ఉందని, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మయన్మార్ గనిలో 11 వేల క్యారెట్ల భారీ కెంపు లభ్యం
బ్యాంకాక్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ రత్నాల గనుల కేంద్రంలో 11,000 క్యారెట్ల, 2.2 కిలోల బరువున్న భారీ కెంపు బయటపడింది. ఇక్కడ లభించిన భారీ కెంపుల్లో ఇది రెండోదని చెబుతున్నారు. 1996లో ఏకంగా 21,450 క్యారెట్ల, 4.29 కిలోల కెంపు మయన్మార్లో బయటపడింది. అయితే, తాజాగా ఎగువ మాండలే ప్రాంతంలో దొరికిన కెంపు రంగు, నాణ్యత పరంగా ఎంతో మెరుగైందని చెబుతున్నారు. ఊదా రంగు కలిసిన ఎరుపు వర్ణంతో లేత పసుపు ఛాయలు ఉన్న ఈ కెంపు అత్యుత్తమ రంగును, మధ్యస్థమైన పారదర్శకతను, కాంతిని అధికంగా ప్రతిబింబించే ఉపరితలాన్ని కలిగి ఉంది. ఏప్రిల్లో గని కార్మీకులు ఈ కెంపును కనుగొన్నారని ప్రభుత్వం ఆదీనంలోని గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ కథనం పేర్కొంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పిజియన్ బ్లడ్ కెంపులకు మయన్మార్ పెట్టింది పేరు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే కెంపుల్లో 90 శాతం వరకు మయన్మార్లోనివే. ఇవి ఎక్కువగా దేశంలోని మొగొక్, మొంగ్ హెచ్సు రత్నాల గనుల్లో దొరుకుతాయి. ఇవే మయన్మార్కు ప్రధాన ఆదాయ వనరు. -
ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం
జకార్తా: ఇండోనేసియాలోని మారుమూల దీవి హల్మహెరాలో ఉన్న డుకొనొ అగ్ని పర్వతం అకస్మాత్తుగా బద్దలైన ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు చనిపోయారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండోనేసియాలోని అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న అగ్నిపర్వతాల్లో డుకొనొ ఒకటి. దీనిని అధిరోహించడం ప్రమాదకరమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కూడా. అయినప్పటికీ గురువారం విదేశీయులు సహా 20 మంది పర్వతారోహకులు 1,335 మీటర్ల ఎత్తయిన డుకొనొ అగ్ని పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం 7.41 గంటల సమయంలో అగ్ని పర్వతం బద్దలైంది. ఇది 16 నిమిషాలపాటు కొనసాగింది. దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తులో చిక్కని బూడిద గాలిలోకి ఎగజిమ్మింది. పర్వతారోహకుల నుంచి అత్యవసర సందేశం అందడంతో సహాయక సిబ్బంది అక్కడికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అప్పటికే సింగపూర్ వాసులు ఇద్దరు, ఇండోనేసియా వాసి ఒకరు చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్ననికి ఏడుగురు విదేశీయులు సహా 14 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. వీరిలో ఐదుగురు గాయాలపాలయ్యారు. కిందికి దిగే క్రమంలో గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో మృతదేహాలను తరలించ లేకపోయారు. డుకొనొ అగ్ని పర్వతం చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల మేర నిషిద్ధ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వీడియోల కోసం కొందరు పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నారని అధికారులు అంటున్నారు. -
బాధితుల్లో ఇద్దరు భారతీయులు
ప్రాణాంతకంగా భావిస్తున్న హంటావైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. క్రూయిజ్ షిప్లోని సిబ్బందిలో ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకింది. ముగ్గురి మరణానికి కారణమైన వైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్న ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్లో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్-19 కంటే భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఇది మహమ్మారి లాంటి ముప్పును కలిగించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.బీబీసి నివేదిక ప్రకారం అర్జెంటినా నుండి బయలుదేరిన 'MV హోండియస్' (MV Hondius) అనే డచ్ విహార నౌకలో భయంకరమైన హంటా వైరస్ (Hantavirus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉండటం ఆందోళన రేపుతోంది.ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటినాలోని ఉషువయా నుండి బయలుదేరింది. ఇది మే 10న స్పెయిన్లోని కానరీ దీవులకు చేరుకోవాల్సి ఉంది. ఈ విలాసవంతమైన నౌకలో మొత్తం 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఫిలిప్పీన్స్ (38), బ్రిటన్ (31), అమెరికా (23) దేశాల వారు అధికంగా ఉన్నారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంఅయితే మానుషులనుంచి మనుషులకు వ్యాపించే హంటావైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది.ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో నెదర్లాండ్స్కు చెందిన దంపతులతో పాటు ఒక జర్మనీ ప్రయాణికుడు ఉన్నారు. 69 ఏళ్ల డచ్ మహిళకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నౌకలో ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు . ఈ ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ద్వీపంలో సుమారు 29 మంది ప్రయాణికులు ఈ నౌక నుండి దిగిపోయారు. నౌకలో ఉన్న ఇద్దరు భారతీయుల ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతం మరింత సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంమానవుల నుండి మానవులకు వ్యాప్తి?సాధారణంగా హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈ నౌకలో గుర్తించిన 'ఆండీస్ స్ట్రెయిన్' (Andes strain) రకానికి ఒక ప్రత్యేకత ఏంటంటే..మానవుల నుండి మానవులకు (పరిమితంగా) వ్యాపించే సామర్థ్యం ఉన్న ఏకైక రకం ఇదే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అంటువ్యాధిపై నిశితంగా నిఘా ఉంచింది.ఊరటనిస్తున్న WHO వివరణ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల నిపుణురాలు మరియా వాన్ కెర్ఖోవ్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఇది కోవిడ్ లేదా ఇన్ఫ్లుయెంజా వంటిది కాదు. దీని వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారే ముప్పు లేదని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ, ముందుజాగ్రత్తగా నౌకలో ఉన్నవారందరూ మాస్కులు ధరించాలని, రోగులకు సేవలు అందించే వారు పిపిఇ (PPE) కిట్లు వాడాలని అధికారులు సూచించారు. -
ఐసా.. చికెన్ పీసా?
ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది? చల్లని ఐస్ ముక్క అనిపిస్తోంది కదా? కానీ కాదు.. ఇది వేడి వేడి ఫ్రైడ్ చికెన్ పీస్. ఎన్నో రకాల ఫ్రైడ్ చికెన్ చూశాం కానీ, ఈ ఐస్ ముక్కను పట్టుకుని ఫ్రైడ్ చికెన్ అంటారేంటి అనే కదా మీ డౌట్? ఎప్పుడూ ఎర్రగా ఉండే ఫ్రైడ్ చికెనేనా? పారదర్శకంగా ఉండే చికెన్ ఫ్రై చేస్తే పోలా అనుకున్నాడో ఫుడ్ బ్లాగర్. అంతే రకరకాల ప్రయోగాలు చేసి మరీ ఈ ఐస్ ముక్కలాంటి చికెన్ ఫ్రై చేసి ఔరా అనిపించాడు. చైనాకు చెందిన కై నాన్.. అచ్చం గాజుతో చేసినట్టుగా కనిపించే ఈ ఫ్రైడ్ చికెన్ చేసి ఆన్లైన్లో వైరల్ అయ్యాడు. ఈయన తన వంటల్లో మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అనే సంక్లిష్టమైన సాంకేతికతను ఉపయోగించి ఫేమస్ అయ్యాడు. తాజాగా గాజు కళాఖండాన్ని పోలిన ఫ్రైడ్ చికెన్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘నేను ఫ్రైడ్ చికెన్ను పారదర్శకంగా చేయాలనుకుంటున్నాను. కానీ ఫలితమే కొంచెం విచిత్రంగా ఉంది’అనే శీర్షికతో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. అది దాదాపు పది లక్షల వ్యూస్తో దూసుకుపోయింది. చూసేందుకు గాజు బొమ్మలా మెరిసిపోతున్న ఈ చికెన్ ముక్క వెనుక చాలా కసరత్తే ఉంది.ఎలా తయారు చేశాడంటే..? కై నాన్ ఈ గాజులాంటి ఫ్రైడ్ చికెన్ కోసం చికెన్ను ముక్కల వారీగా తిరిగి తయారు చేశాడు. ముందుగా చికెన్ ముక్కలను ఫ్రై చేశాడు. తర్వాత అందులోని ఎముకలను జాగ్రత్తగా తొలగించాడు. ఎముక మజ్జ, కొల్లాజెన్, కోల్డ్ జెల్ మిశ్రమాన్ని ఎముక ఆకారం ఉన్న అచ్చులలో పోసి గడ్డకట్టేలా చేశాడు. చికెన్ను ఒక ప్రత్యేక పరికరం ద్వారా ద్రవ రూపంలోకి మార్చాడు. ఆ తర్వాత ‘స్ఫెరిఫికేషన్’అనే పద్ధతిని ఉపయోగించి మాంసం పీచుల నిర్మాణాన్ని తిరిగి పారదర్శక రూపంలోకి తీసుకొచ్చాడు. చివరగా గాజులాంటి మాంసం, ఎముకలను మరో అచ్చులో ఉంచి ఫ్యూజ్ చేసి.. చికెన్ ముక్క ఆకారాన్ని తెచ్చాడు. అంతే.. అద్భుతమైన గాజు కళాఖండంలా కనిపించే ట్రాన్స్ పరెంట్ చికెన్ రెడీ అయిపోయింది. అయితే, కొందరు నెటిజన్లు దీనిని అద్భుతమైన కళాఖండమని, రుచి చూడాలని కుతూహలంగా ఉందని కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం దీన్ని చూస్తుంటేనే భయం వేస్తోందని, అసలు తినే వస్తువులా లేదని పెదవి విరిచారు. ఇంతకీ మీరేం అంటారు? -
హంటా వైరస్ కలకలం
వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్షిప్లో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్ గురించి ట్రంప్ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. హంటా కలకలంకాగా ఈ నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.హంటావైరస్ అంటే ఏమిటి ?హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. -
వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బీబీసీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు కథనాలు ప్రచురించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధ విరమణ విషయమై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం నేపథ్యంలో ఆ అవకాశాలు లేకుండా పోయాయి.కాగా గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రెండు రోజుల పాటు మే 8-9 (విక్టరీ డే) సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి. -
భారత్కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్సీఎంఆర్పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించింది. కానీ, ఇరాన్తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
చైనా మాజీ రక్షణ మంత్రులకు మరణ శిక్ష
బీజింగ్: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. వీ ఫెంఘ్, లి షాంగ్ఫులకు ఈ శిక్ష రెండేళ్ల తర్వాత అమలుకానుందని అధికార వార్తా సంస్థ జిన్హుమా గురువారం వెల్లడించింది. ఈ కాలంలో వీరి ప్రవర్తనను బట్టి, మరణ శిక్షను యావజ్జీవంగా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 2018–23 సంవత్సరాల్లో వీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత కొన్ని నెలలపాటు లి రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. వీ ఫెంఘ్పై లంచాలు తీసుకున్న ఆరోపణలు, లి షాంగ్ఫుపై లంచాలు తీసుకోవడంతోపాటు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, 2024లో వీరిద్దరినీ అధ్యక్షుడు జిన్పింగ్ పదవి నుంచి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తొలగించారు. జిన్ పింగ్ సారథ్యంలో పనిచేసే సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి కూడా ఉద్వాసన పలికారు. అంతకుముందు, వీరిద్దరూ చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ముఖ్యమైన రాకెట్ ఫోర్స్కు చీఫ్గా ఉన్నారు. కాగా, జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అమలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో పలువురు సైనిక జనరళ్లు సహా కనీసం 10 లక్షల మంది అధికారులు శిక్షలకు గురవడం గమనార్హం. -
‘హంటావైరస్’ నౌక నుంచి డజను మందికి పైగా విముక్తి
ద హేగ్: ప్రాణాంతకర హంటావైరస్ గుప్పిట చిక్కిన విలాసవంత విహారనౌక ‘ఎంబీ హోండియస్’నుంచి డజను మందికిపైగా పర్యాటకులకు విముక్తి లభించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని రూఢీ చేసుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. ఈమెకు ఆ విమానంలో సేవలందించిన మహిళా ఫ్లయిట్ అటెండెంట్ను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచామని, లక్షణాలు ఆమెలో ఇంకా కని్పంచలేదని నెదర్లాండ్స్ వైద్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన నౌకలో తొలిసారిగా వైరస్ జాడను గుర్తించిన విషయం తెల్సిందే. అయితే మార్గమధ్యంలో నౌక పలు దేశాల్లో లంగరువేయడం, అక్కడ కొందరు ప్రయాణికులు దిగిపోయిన నేపథ్యంలో ఎంతమందికి వైరస్ సోకి ఉండొచ్చనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టతలేదు. దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి. -
యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. 15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్ పోస్ట్’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది. గల్ఫ్లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్లోని మూడు స్థావరాలైన అలీ అల్–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్ అరిఫ్జాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్లోని అల్–ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. ఫ్రెండ్లీ ఫైర్లోనూ భారీ నష్టం.. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్క్యూ–4సీ ట్రైటాన్ ఉన్నాయి. నాలుగు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్స్, ఒక ఏ–10 వార్హాగ్ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. జిమ్లు, ఫుడ్ హాల్లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్’తెలిపారు. చవకైన షాహెద్ డ్రోన్లతో పోరాడటానికి విలువైన ఇంటర్సెప్టర్లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు. 50 బిలియన్ డాలర్ల ఖర్చు.. ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్కు సమర్పించిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. -
సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత
ప్రపంచ టెలివిజన్ వార్తా ప్రసారాల రూపురేఖలను మార్చివేసిన మీడియా దిగ్గజం, సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) తుదిశ్వాస విడిచారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కన్నుమూసినట్లు టర్నర్ ఎంటర్ప్రైజెస్ అధికారికంగా ప్రకటించింది. 24 గంటల నిరంతర వార్తా ప్రసారాలు అనే అసాధ్యమైన ఆలోచనను సుసాధ్యం చేసి, ప్రపంచానికి ప్రతి క్షణం తాజా వార్తలను చేరవేసిన గొప్ప దార్శనికునిగా టర్నర్ పేరొందారు.వార్తా ప్రపంచంలో సంచలనం సీఎన్ఎన్1980లో సీఎన్ఎన్ను ప్రారంభించడం ద్వారా టెడ్ టర్నర్ వార్తా ప్రసారాల చరిత్రలో ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. ప్రారంభంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా, సీఎన్ఎన్ను ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల వార్తా నెట్వర్క్గా నిలబెట్టి తిరుగులేని విజయం సాధించారు. తన మాట తీరుతో ‘ది మౌత్ ఆఫ్ ది సౌత్’గా పేరొందిన ఆయన, అట్లాంటా బ్రేవ్స్ వంటి క్రీడా ఫ్రాంచైజీలతో పాటు, సినిమాలు, కార్టూన్ల కోసం ప్రత్యేక ఛానళ్లను సైతం ప్రారంభించి, అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రపంచ సమాచార ప్రవాహాన్ని శాసించినందుకు గాను 1991లో టైమ్ మ్యాగజైన్ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా కూడా ఆయన ఎంపికయ్యారు.బహుముఖ ప్రజ్ఞాశాలిటర్నర్ కేవలం మీడియా రంగానికే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప పర్యావరణవేత్త, దాత. ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ను స్థాపించడంతో పాటు, అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం ఎంతగానో పోరాడారు. అమెరికాలో అత్యంత ఎక్కువ ప్రైవేటు భూమి కలిగిన వ్యక్తులలో ఒకరైన ఆయన, అంతరించిపోతున్న ‘బైసన్’ (అమెరికన్ అడవి దున్న) జాతి సంరక్షణకు విశేష కృషి చేశారు. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్ సిరీస్ ‘కెప్టెన్ ప్లానెట్’ను సైతం ఆయనే సృష్టించడం విశేషం.ఆఖరి రోజుల్లో..తదనంతర కాలంలో తన మీడియా ఆస్తులను టైమ్ వార్నర్కు విక్రయించినప్పటికీ, సీఎన్ఎన్ ఏర్పాటునే తన జీవితంలో సాధించిన అత్యుత్తమ విజయంగా ఆయన ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవారు. 2018లో ‘లెవీ బాడీ డిమెన్షియా’ వ్యాధి బారిన పడిన టర్నర్, 2025లో న్యుమోనియాను కూడా జయించారు. ఆయనకు ఐదుగురు పిల్లలు, 14 మంది మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు. టెడ్ టర్నర్ భౌతికంగా దూరమైనా, ఆయన సృష్టించిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రపంచమంతటా ఎప్పటికీ నిలిచివుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఆపరేషన్ సింధూర్’ వీడియో విడుదల -
పాకిస్తాన్కు అమెరికా ఝలక్.. కీలక ప్రకటన
వాషింగ్టన్: దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పెషావర్లోని తమ కాన్సులేట్ను దశలవారీగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఖైబర్ పఖ్తూంఖ్వాలోని దౌత్య సంబంధాల సంబంధిత విషయాలను ఇస్లామాబాద్లోని యూఎస్ రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దౌత్య సిబ్బంది భద్రత, వనరులను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.పెషావర్లో తమ కార్యాలయంను మార్చినప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు, అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. యూఎస్–పాకిస్తాన్ సంబంధాలను ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్లోని యూఎస్ మిషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి శాఖ కట్టుబడి ఉందని పేర్కొంది.ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్, ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన అమెరికా కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక కీలకమైన లాజిస్టికల్, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్కు భూమార్గాన్ని సులభతరం చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని అమెరికన్ పౌరులకు, ఆఫ్ఘన్ జాతీయులకు సహాయాన్ని అందించింది. ఈ కాన్సులేట్లో ప్రస్తుతం 18 మంది అమెరికన్ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు. -
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్కు కూడా మంచిది కాదు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు. 🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONSThis is HUGE! 🇺🇸"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026ట్రంప్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.ఇరాన్ కొత్త ప్లాన్.. మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది. -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం
ఇండోనేషియా: ఇండోనేషియాలోని ట్రాన్స్–సుమత్రా హైవేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సౌత్ సుమత్రా ప్రావిన్స్లోని నార్త్ ముసి రావాస్ రీజెన్సీలో ఈ విషాదం చోటుచేసుకుంది. లుబుక్లింగావ్ నుండి జంబీ నగరం వైపు ప్రయాణిస్తున్న బస్సు నుండి హఠాత్తుగా నిప్పురవ్వలు రావడంతో, డ్రైవర్ అదుపు తప్పి వాహనాన్ని కుడివైపు మళ్లించారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇంధన ట్యాంకర్ వేగంగా ఢీకొట్టడంతో, క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలిపోయి, లోహపు తుక్కుగా మారాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, 13 మంది ప్రయాణికులు, ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. -
వణికిస్తున్న హంటా వైరస్
జోహన్నెస్బర్గ్: అట్లాంటిక్ సముద్రంలో చిక్కుకున్న ‘ఎంవీ హోండియస్’క్రూయిజ్ నౌక నుండి ముగ్గురు వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్కు తరలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ బుధవారం ధ్రువీకరించారు. అర్జెంటీనాలో ఏప్రిల్ 1న బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవడం తెలిసిందే. క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేశారు. విషాద స్థావరంగా విలాస నౌక అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో కేప్ వర్డే తీరానికి చేరువలో, ‘ఎంవీ హొండియస్’అనే నౌక ఇప్పుడు ఓ విషాద స్థావరంగా మారింది. లోపల దాదాపు 150 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక, నేడు ఒక క్వారంటైన్ జైలుగా మారింది. షిప్ డాక్టర్ మొదలుకొని, సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్ నీడలో బందీలు. ఏప్రిల్ 1న మొదలైన ఆ యాత్ర, చివరకు సముద్రం మధ్యలో ఒక నిశ్శబ్ద సమరంగా మిగిలిపోయింది. ఎలుకల విసర్జితాల నుంచి వ్యాప్తి ఎలుకల నుంచి పుట్టి, ఇప్పుడు ’ఆండీస్’ రకంగా పరిణామం చెంది మనుషుల మధ్యే వ్యాపిస్తున్న ఈ వైరస్, ఒక అరుదైన విషాదం. తాకడం, కలిసి భోజనం చేయడం వంటి అత్యంత సన్నిహిత చర్యల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి, ప్రకృతి మానవాళికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు తీసిన ఈ వైరస్, మరికొందరి శరీరాల్లో తాండవిస్తోంది. కెనరీ దీవులకు తరలింపు ఏర్పాట్లు ప్రస్తుతం ఈ నౌక కేప్ వర్డే తీరంలో నిలిచి ఉంది. బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నౌక రాకపై కెనరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా అత్యవసర సమావేశానికి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రయాణికులలో ‘అండీస్ స్ట్రెయిన్’ను గుర్తించగా, వారిలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఐసీయూలో ఉండగా మరొకరు మరణించారు. స్విట్జర్లాండ్కు చెందిన ఒక ప్రయాణికుడు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. -
భారత్, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం. ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు. మా ద్రాక్ష రుచి చూస్తారు.. ‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు. -
మళ్లీ ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇరాన్పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం. గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్స్ట్రీట్ జనరల్లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
వామ్మో 500 కిలోల మొసలి... ఆరుగుర్ని మింగేసిందా?!
దక్షిణాఫ్రికాలోని కోమటి నది (Komati River) తీరాన వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల వ్యాపారవేత్త ఆచూకీ కోసం వెతుకుతుండగా వెలుగులోకి వచ్చిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. అనూహ్యమైన, అత్యంత భయంకరమైన విషాదం వైరల్గా మారింది. దక్షిణాఫ్రికాలో మొసళ్లు ఎక్కువగా ఉండే నది తీరాన విషాదం చోటు చేసుకుంది.అసలేం జరిగింది?ఒక వ్యాపారవేత్త తన కారుతో లోతట్టు వంతెన దాటుతుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఆయన నీటిలో కొట్టుకు పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారు ఖాళీగా ఉంది. పోలీసులు కోమటి నది ప్రాంతంలో గాలిస్తూనే ఉన్నారు, తమకు ఏమి దొరుకుతుందో లేదా అసలు ఏమైనా దొరుకుతుందో లేదో కూడా తెలియని అయోమయం నెలకొంది.కోమటి నది ఏదో మామూలు నది కాదు, స్థానికులు చాలా ప్రమాదకరమైనదిగా భావించే నది. అత్యంత భయంకరమైన ఆ జలాల్లోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ ద్వారా దించారు. డ్రోన్లను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. మొదట అంతా మామూలు గానే కనిపించింది. కానీ తనిఖీల సమయంలోనదిలోని ఒక చిన్న ద్వీపం దృష్టిని ఆకర్షించింది. ఆ పరిశీలనే ఆపరేషన్ దిశను పూర్తిగా మార్చేసింది. NEW: Police airlift a crocodile with the body of a 59-year-old businessman inside.Local police in South Africa say they suspected the crocodile ate the man after observing it from drones. They then shot it and airlifted it off.When they landed back on the ground, the… pic.twitter.com/12NBTQbmis— Collin Rugg (@CollinRugg) May 4, 2026fy"> అనుమానం తెప్పించిన మొసలి ప్రవర్తనగాలింపు సమయంలో నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై కొన్ని మొసళ్లు ఎండకు కాచుకుంటూ కనిపించాయి. అయితే, అక్కడ ఉన్న ఒక 4.5 మీటర్ల పొడవు, సుమారు 500 కిలోల బరువున్న భారీ మొసలి మాత్రం వింతగా ప్రవర్తించింది. హెలికాప్టర్ల శబ్దం వస్తున్నా అది కదలలేదు. సాధారణంగా భారీ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మొసళ్లు నిశ్చలంగా ఉంటాయని గుర్తించిన అధికారులు, ఆ మొసలిని చంపి పరీక్షల కోసం క్రూగర్ నేషనల్ పార్క్కు తరలించారు.భయంకరమైన నిజాలుమొసలి కడుపును కోసి చూడగా అధికారులకు గుండె ఆగిపోయే దృశ్యాలు కనిపించాయి మొసలి ప్రేవులలో మానవ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలు గతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల గాబ్రియేల్ బాటిస్టావిగా అనుమానిస్తున్నారు.అంతేకాదు మొసలి కడుపులో 6 రకాల వేర్వేరు బూట్లు లభించాయి. అయితే మొసళ్లు ఏది పడితే అది మింగుతాయి కాబట్టి, ఇతర బాధితులు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.కానీ గతంలో కూడా ఆ మొసలికి గతంలో కూడా బాధితులు ఉన్నారేమోనన్న ఆందోళన తలెత్తుతోంది.ప్రాణాలకు తెగించి డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ఈ ఆపరేషన్లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం కెప్టెన్ జోహన్ పాట్గీటర్ చేసిన రెస్క్యూ. మొసళ్లు నిండి ఉన్న ఆ ప్రమాదకర నదిలోకి హెలికాప్టర్ నుండి ఆయన కిందకు దిగారు. మొసలి అప్పటికే చనిపోయి నప్పటికీ, ఆ నది ప్రవాహం, చుట్టుపక్కల ఉన్న ఇతర మొసళ్ల వల్ల, ఎంతో ఒత్తిడి మధ్య అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా అవి ఎవరివో నిర్ధారిస్తారు. అయితే, నిపుణులు తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, అనేక బూట్లు లభించడం ఆందోళనకు తావిచ్చింది. దొరికిన అదనపు బూట్ల ఆధారంగా, ఈ మొసలికి గతంలో మరేవైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నది ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన అధికారులను సౌత్ ఆఫ్రికా పోలీస్ చీఫ్ అభినందించారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలను మిగిల్చింది.ఇదీ చదవండి: టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు -
బెంగాల్లో బీజేపీ.. బంగ్లాదేశ్కు భారీ గుడ్న్యూస్!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ అధికారాన్ని కైవసం చేసుకోవాలనే కమల దళం కల ఎట్టకేలకు నిజమైంది. రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సర్కారు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్కు కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో, బంగ్లాదేశ్కు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇంతకీ తీస్తా నీటి విషయంలో కేంద్రం, మమత బెనర్జీ.. బంగ్లాదేశ్ వాదనలు ఎలా ఉన్నాయంటే..ఇరు దేశాల మధ్య తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని అడ్డుకుంటున్నందుకు మమతా బెనర్జీపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విమర్శలు గుప్పించింది. అదే సమయంలో బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపింది. ఈ ఫలితంగా రాష్ట్రానికి, బంగ్లాదేశ్కు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అభివర్ణించింది. ఈ సందర్భంగా బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బరీ హెలాల్ మాట్లాడుతూ.. సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ అద్భుత పనితీరును కనబరిచే అవకాశముందని ప్రశంసించారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యపై పురోగతి ఆశలకు కూడా ఈ ఫలితాన్ని హెలాల్ ముడిపెట్టారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి అడ్డుగా నిలిచిందన్నారు.ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్ చాలాకాలంగా కోరుకుంటున్న తీస్తా ఒప్పందంపై కేంద్రంతో కలిసి పనిచేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. తీస్తా సమస్యపై హెలాల్ స్పందిస్తూ..‘గత ప్రభుత్వమే అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉంది. తీస్తా బ్యారేజ్ ఒప్పందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండూ గట్టిగా మద్దతు తెలిపాయి. అలాగే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చినందున, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపిణీలో పరిష్కారం కాని సమస్యలలో తీస్తా వివాదం ఒకటిగా మిగిలిపోయింది. 1996 గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. అయితే, నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. వాతావరణ మార్పులపై ఆందోళనలు కూడా తగ్గుతున్న నీటి లభ్యతపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.ఇప్పుడు, 1996 ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల కారణంగా దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం పెండింగ్లోనే ఉంది. 2011లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, తీస్తా జలాల్లో బంగ్లాదేశ్కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేయబడింది. అయితే, ఇది రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. తీస్తా జలాలపై అంతకుముందు 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది.తీస్తా ఒప్పందం ఇలా..2011లో డ్రాఫ్ట్ ఒప్పందంభారత్కి 42.5% నీరు.బంగ్లాదేశ్కి 37.5% నీరు.20% పర్యావరణ అవసరాలకు ఉపయోగం.అడ్డంకి: గత సీఎం మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు.సవాళ్లు..భారత్లో: ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత.బంగ్లాదేశ్లో: రెండు కోట్ల మంది ప్రజలు తీస్తా నీటిపై ఆధారపడుతున్నారు.జియోపాలిటిక్స్: చైనా భాగస్వామ్యం వల్ల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం.చైనా మద్దతు: నీటి కేటాయింపులపై ఆలస్యం జరిగితే, చైనా మద్దతుతో Teesta River Comprehensive Management and Restoration Projectను ముందుకు తీసుకెళ్తామని బంగ్లా హెచ్చరికలు. -
ప్చ్.. ట్రంప్ వల్లే కావడం లేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను పవర్ఫుల్ లీడర్గా చెప్పకుంటారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ.. శాంతి ఒప్పందాలు కుదురుస్తూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో “శాంతి దూత”గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సొంత దేశంలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దడం ఆయన వల్ల కావట్లేదు.. “నో కింగ్స్” నిరసనలు, ఐస్ (Immigration and Customs Enforcement) వ్యతిరేక ప్రదర్శనలు ఇందుకు ఉదాహరణలు. ఇవి అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, ఇవి చాలదన్నట్లు గన్ కల్చర్ మరింత పేట్రేగిపోవడం మరో తలనొప్పిగా మారింది. క్రమం తప్పకుండా అక్కడ సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండగా.. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో తమ భద్రతపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చివరికి.. వైట్హౌస్కు అత్యంత సమీపంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం.. అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. టెక్సాస్ కాల్పుల ఘటన దాకా..అమెరికాలో గన్ కల్చర్ ఏ రేంజ్కు చేరుకుందో తెలుసా?. తాజా టెక్సాస్ షూటింగ్ ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో.. 2026లో ఇప్పటివరకు 130 మాస్ షూటింగ్స్ ఘటనలు నమోదయ్యాయి. గన్ వైలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి మే దాకా 4,200 మందికి పైగా మరణాలు, 7,300 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ గణాంకాలు.. అమెరికా సమాజం ఎదుర్కొంటున్న భయానక వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. షాకింగ్ నిర్ణయం..అమెరికాలో గన్ కల్చర్ సమస్య కొత్తది కాదు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు. పైగా బ్యాక్గ్రౌండ్ చెక్స్, స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలకు నిధులు తగ్గించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది. అమెరికాలో గన్ వయలెన్స్ వల్ల పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ, ట్రంప్లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.గన్ లాబీ..అమెరికాలో ఇన్నేళ్లలో గన్ కల్చర్ కంట్రోల్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. గన్ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్హౌజ్ ఈ విషయంలో కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (NRA) వంటి సంస్థలు.. గన్ తయారీ పరిశ్రమ, అలాగే గన్ రైట్స్కు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు కలసి ఏర్పడిన వర్గమే ఈ గన్ లాబీ. గన్ కల్చర్కు అడ్డుకట్ట వేసే చట్టాలను అమెరికా కాంగ్రెస్ ఎదుటకు తీసుకొచ్చినప్పుడల్లా.. ఈ గ్రూప్ తెర మీదకు వచ్చి మోకాలు అడ్డుపెడుతూ ఉంటుంది. గన్ లేకుంటే ఎలా.. ?అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం.. ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్ లాబీ వాదిస్తుంటుంది. అలాగే.. తనను తాను రక్షించుకోవడానికి ప్రాణాంతక శక్తిని(తుపాకుల్ని) ఉపయోగించవచ్చనే చట్టాలకూ ఈ లాబీ మద్దతు ఇస్తుంటుంది.ఎంత పవర్ఫుల్ అంటే..1998–2020 మధ్య ప్రో-గన్ గ్రూపులు లాబీయింగ్ కోసం అమెరికాలో 171.9 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. అందులో ఎన్ఆర్ఏ కంపెనీ ఒక్కటే 64 మిలియన్ డాలర్లు పెట్టింది. అలాగే అమెరికా ఎన్నికలనూ ఈ గ్రూపులు ప్రభావితం చేస్తుంటాయి. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎన్ఆర్ఏ ఏకంగా 30 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్ సెనేటర్లకు మద్దతుగా మరో 20 మిలియన్ డాలర్లు పెట్టింది. మనీ పవర్తోనే అమెరికా రాజకీయాల్ని ఈ గన్ లాబీ శాసించగలుగుతోంది. రిపబ్లికన్లు అయినా.. డెమొక్రాట్లు అయినా ప్రతిపాదించిన గన్ కంట్రోల్ చట్టాలు ఆమోదం పొందడం కష్టంగా ఉంటోంది. -
ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం
ఒహియో: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఒహియో రాష్ట్ర గవర్నర్ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నవంబర్లో జరిగే తుది సమరానికి సమరశంఖం పూరించారు. బయోటెక్ వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి మంగళవారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, వ్యాపారవేత్త కేసీ పుచ్పై భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయం దరిమిలా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నామినేట్ అయిన ఒహియో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ ఎమీ ఆక్టన్తో ఆయన నేరుగా తలపడనున్నారు. అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘన విజయం అనంతరం వివేక్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు, కానీ మన అసలు గమ్యం నవంబర్లో ఉంది’ అని అన్నారు. రామస్వామి గెలుపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వివేక్ యువకుడు, చాలా తెలివైనవాడు. దేశాన్ని ప్రేమించే మంచి వ్యక్తి. ఒహియోకు ఆయన గవర్నర్ అవుతారు. అతనికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ప్రకటించారు. ప్రముఖ కన్జర్వేటివ్ నేత లారా లూమర్.. ఇది అతిపెద్ద విజయమని అభివర్ణిస్తూ, వర్ణ వివక్షతో ఆయనను అణగదొక్కాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.నవంబర్ సమరానికి సై 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న వివేక్ రామస్వామి, ఆ తర్వాత వ్యూహాత్మకంగా ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రైమరీ దశలో రిపబ్లికన్ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే, ఆయన తన ప్రచారాన్ని ప్రధానంగా డెమొక్రాట్ అభ్యర్థి ఎమీ ఆక్టన్ లక్ష్యంగా సాగించడం విశేషం. మరోవైపు కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఒహియో రాష్ట్రానికి సమర్థవంతంగా నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆక్టన్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ పదవీకాలం ముగియడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు బలమైన అభ్యర్థుల మధ్య నవంబర్లో జరగబోయే ఈ పోరు రసవత్తరంగా మారనుంది. -
‘హంటా’ వైరస్ విలయం.. WHO కీలక ఆదేశాలు
ప్రయా (కేప్ వర్డే): అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం రేపుతోంది. హంటా వైరస్ ఆనవాళ్లు బయటపడటంతో, ‘ఎంవీ హోండియస్’నౌకలో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు నౌకలోనే దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఈ విషాదకర ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.హంటా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుందన్న భయంతో, కేప్ వెర్డే అధికారులు నౌకను తీరానికి రానిచ్చేందుకు నిరాకరించడంతో, సముద్రపు అలల మధ్య ఆ నౌక దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయింది. ప్రయాణికులంతా తమ క్యాబిన్లకే పరిమితమయ్యారు. మాస్కులు, పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది తప్ప, ఎవరూ బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రయాణికులందరూ తమ గదులకే పరిమితం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేకంగా నెదర్లాండ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించే యోచనలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ALERT: The WHO reports that the hantavirus cases on the quarantined cruise ship off Cape Verde probably include human-to-human spread. Maria Van Kerkhove, the head of WHO’s epidemic and pandemic preparedness: "We do believe that there may be some human-to-human transmission.” pic.twitter.com/LCddqbUGLH— WORLD NEWS (@_MAGA_NEWS_) May 5, 2026మరోవైపు.. సుదూర దక్షిణ అట్లాంటిక్ ద్వీపమైన సెయింట్ హెలెనా మరియు జోహన్నెస్బర్గ్ మధ్య విమానంలో ప్రయాణించిన 88 మంది ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. హంటా వైరస్ సోకడంతో ఒక క్రూయిజ్ షిప్ నుండి వెళ్లిన ప్రయాణికుడు మరణించాడని పేర్కొంది. కాగా, డబ్ల్యూహెచ్వో ప్రకారం, ఆ ప్రయాణికుడు సెయింట్ హెలెనా నుండి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కడానికి ముందు ఒక క్రూయిజ్ నౌకలో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్న తోటి ప్రయాణికులను, ఇతరులను గుర్తించి, సంప్రదించేందుకు ఆరోగ్య అధికారులు ఇప్పుడు కృషి చేస్తున్నారు.నౌకలో వైరస్ వ్యాప్తి టైమ్లైన్ఏప్రిల్ 1, 2026నౌక అర్జెంటీనాలోని ఉషుయా నుండి బయలుదేరింది.ప్రయాణికులు 20కి పైగా దేశాలవారు.ఏప్రిల్ 5–7, 2026కొంతమంది ప్రయాణికుల్లో జ్వరం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి.మొదట సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్గా భావించారు.ఏప్రిల్ 10, 2026ఒక డచ్ జంట తీవ్ర స్థితికి చేరి మరణించారు.వైద్యులు హంటా వైరస్ అనుమానం వ్యక్తం చేశారు.ఏప్రిల్ 12–15, 2026మరికొంత మందిలో శ్వాస సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు.ఒక జర్మన్ పౌరుడు మరణించాడు.ఒక బ్రిటిష్ పౌరుడు దక్షిణాఫ్రికాలో ఐసీయూలో చేరాడు.ఏప్రిల్ 18, 2026నౌక కేప్ వెర్డే తీరంలో నిలిపివేయబడింది.అక్కడి ప్రభుత్వం ప్రయాణికులను దిగనివ్వలేదు.ఏప్రిల్ 20–25, 2026WHO, EU జోక్యం.ప్రయాణికులు కేబిన్లలోనే ఉండాలని ఆదేశాలు.ఇద్దరు క్రూ సభ్యులు అత్యవసర వైద్య సహాయం అవసరమని ఆపరేటర్ తెలిపింది.మే 1, 2026స్పెయిన్ కానరీ దీవుల్లో డాక్ చేసేందుకు అనుమతి లభించింది.ప్రయాణికులు, సిబ్బందిని పరీక్షించి, చికిత్స చేసి, వారి దేశాలకు పంపే ప్రణాళిక. -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. డల్లాస్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, టెక్సాస్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో నిందితుడిని కొరియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డల్లాస్లో కారోల్టన్లోని కొరియన్ ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్లో మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన అనంరతం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కొరియాకు చెందిన సెయింగ్ హన్ హు(69)గా గుర్తించినట్టు పోలీసు అధికారి రాబర్టో అర్రెడోన్డో తెలిపారు.Two dead, three hospitalized after suspect opens fire during business meeting at K Towne Plaza in Carrollton pic.twitter.com/yYkpz3XwK2— Dallas Texas TV (@DallasTexasTV) May 5, 2026 -
పాక్లో ప్రముఖ మతపెద్ద కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో మంగళవారం ప్రముఖ మతపెద్దను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. చార్సద్దా జిల్లా ఉట్మన్జాయ్ ఏరియాలో మోటారు సైకిల్పై వచ్చిన దుండగులు షేక్ ఉల్ హదిత్ మౌలానా మహ్మద్ ఇద్రీస్ వాహనాన్ని అడ్డగించి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఇద్రీస్ ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దాడికి తమదే బాధ్యతని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ)ప్రకటించుకుంది. జమియత్ ఉలేమా–ఇ– ఇస్లామ్(ఎఫ్) చర్సద్దా జిల్లా చీఫ్గా ఉన్న ఇద్రిస్ ఆ పార్టీ చీఫ్ మౌలానా ఫజలుర్ రహా్మన్కు సన్నిహితుడు. -
కుప్పకూలిన రొమేనియా ప్రభుత్వం
బుకారెస్ట్: రొమేనియాలోని యూరోపియన్ యూనియన్(ఈయూ)అనుకూల కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి ఇలీ బొలొజన్ సారథ్యంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 281 మంది, వ్యతిరేకంగా కేవలం నలుగురే ఓటేశారు. ఏడాది క్రితమే ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం.గతవారం అధికార కూటమిలోని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో, అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రొమేనియన్స్ (ఏయూఆర్) పార్లమెంట్లో తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని కృత్రిమం, కపటం అంటూ ప్రధాని బొలొజన్ కొట్టిపారేశారు. -
"భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం"
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్పింగ్ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందననియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.భారతదేశంతో అనుసంధానంభారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.అలబ్బార్ భరోసాభారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్షిప్లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
వైట్హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: వైట్హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్ఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
చైనా గుట్టు రట్టయ్యిందా?
కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. అయితే వుహాన్ ల్యాబ్లోనే వైరస్ పుట్టిందన్న దానికి తగిన ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మరో అంశంపైనా డ్రాగన్ కంట్రీ గోప్యత ప్రదర్శిస్తోందని.. ఆ గుట్టు ఇప్పుడు రట్టయ్యిందని డాటాను రిలీజ్ చేసింది.2022 మార్చి 21న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ విమానం (MU5735) గ్వాంగ్సీ ప్రాంతంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు భారీ సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చైనా ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఒక సంచలన నివేదిక ఇచ్చింది. ఆ ప్రమాదం సహజసిద్ధంగా జరగలేదని.. కాక్పిట్లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశారని తెలిపింది.ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్బాక్స్) విశ్లేషణలో.. 29,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లకు ఇంధన స్విచ్లు ఒకేసారి “రన్” స్థితి నుండి “కట్ఆఫ్” స్థితికి మార్చబడ్డాయి. దీని తర్వాత ఇంజిన్ వేగం తగ్గి, విమానం వేగంగా కిందికి పడిపోయింది. ఒకవేళ అది పొరపాటుగా జరిగి ఉంటే.. పైలట్లు అప్రమత్తం అయ్యేవాళ్లు. వెంటనే తప్పును సరి చేసుకునేవారు. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు అని డేవిడ్ సౌసీ అనే నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) బ్యాటరీ బ్యాకప్తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC)కి పంపారు. అయితే, సీఏఏసీ ఇప్పటిదాకా ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో రిలీజ్ చేసిన నివేదికలో మాత్రం అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. గతంలో..2022లో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక కూడా ‘‘విమానం కాక్పిట్లో ఎవరో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూలిపోయింది’’ అని సంచలనాత్మక కథనం ఇచ్చింది. ఇది పైలట్ ఆత్మహత్య చర్యనా? లేదంటే మరెవరైనా కాక్పిట్లోకి చొరబడి చేసిన చర్యా? అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అసలు బ్లాక్బాక్స్ డేటాను చైనా ఎందుకు బయటపెట్టడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. -
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు! -
భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన
వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటనతైవాన్ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.ప్రభుత్వ వాదన - వాస్తవాలుఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.దౌత్యం వైపు అడుగులుప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! -
హర్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
లిపులేఖ్ మీదుగా మానస సరోవర్ యాత్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని లిపులెఖ్ కనుమ మీదుగా చేపట్టే కైలాశ్ మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని భారత్ ఖండించింది. ఏకపక్షంగా, కృత్రిమంగా విస్తరించుకుని భూభాగాలపై హక్కులను ప్రకటించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. జూన్ నుంచి ఆగస్ట్ వరకు మానస సరోవర్ యాత్ర జరుగుతుందని గత వారం విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, తమను ఏమాత్రం సంప్రదించకుండా భారత్, చైనాలు లిపులేఖ్ మీదుగా మానస్ సరోవర్ యాత్రకు ఏర్పాట్లు చేస్తుండటాన్ని ఖండిస్తూ నేపాల్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. లిపులెఖ్ తమ భూభాగమని పేర్కొంది. దీనిపై కొద్ది గంటల్లోనే భారత్ స్పందించింది. ‘ఈ విషయంలో భారత్ వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. లిపులెఖ్ కనుమ 1954 నుంచి కైలాస మానస సరోవర యాత్రకు పురాతన మార్గంగా ఉంటోంది. దశాబ్దాలుగా అదే మార్గంలో యాత్ర కొనసాగుతోంది’అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నేపాల్ చేస్తున్న వాదనలు ఏమాత్రం సమర్థనీయం కాదని చెప్పా రు. వాటికి చారిత్రక ఆధారాలు లేవన్న విషయాన్ని భారత్ మొదట్నుంచీ చెబుతూనే ఉందన్నారు. -
దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఇరాన్కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్ను ఇరాన్ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు. బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్ నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏమిటీ కొత్త ప్రతిపాదన? అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది. -
ఇరాన్-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్లో కలకలం
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.నౌక వివరాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.ప్రాంతీయ ఉద్రిక్తతలుప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఎయిర్పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వందలాది విమానాలు అనూహ్యంగా రద్దు కావడం, విపరీతమైన జాప్యం జరగడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలగడంతో ఎయిర్పోర్టులన్నీ ప్రయాణికులతో నిండిపోయి ఉత్కంఠ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.ప్రధాన నగరాలపై తీవ్ర ప్రభావంఅట్లాంటా, డల్లాస్, న్యూయార్క్, ఓర్లాండో, చికాగో వంటి అమెరికాలోని అత్యంత రద్దీ అయిన ప్రధాన కేంద్రాల నుండి నడిచే విమానాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. కనెక్టింగ్ విమానాలు మిస్ కావడం, బయలుదేరే సమయాలు పదేపదే మారిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎయిర్పోర్టులలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.ఈ హఠాత్ పరిణామాలకు కారణమేంటి?విమానయాన రంగంలో ఒక్కసారిగా ఈ ముప్పు ముంచుకురావడానికి ప్రధానంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది కొరత, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి ఈ విమానాల జాప్యాలకు కారణంగా నిలిచాయి. విమాన షెడ్యూల్స్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఒక ఎయిర్పోర్టులో జరిగిన చిన్న అంతరాయం పలు మార్గాల్లోని విమానాల రాకపోకలను స్తంభింపజేస్తోంది.పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాల్లో..ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి అమెరికన్ ఎయిర్లైన్స్, ఇతర సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రద్దయిన విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ టిక్కెట్లు బుక్ చేయడం, షెడ్యూల్స్ను సర్దుబాటు చేయడం వంటి చర్యలను వెంటనే చేపడుతున్నాయి. ఇది కూడా చదవండి: పాత ఫొటో.. పక్కా స్కెచ్.. 24 ఏళ్లకు హంతకుడు పట్టివేత -
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. -
పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించే భారత్కు ఇది నిజంగా చేదు వార్తే. దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాజాగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)తన సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన దేశం ఏకంగా పాకిస్తాన్ కంటే వెనుకబడి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం మునుపెన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని, రిపోర్టింగ్కు వాతావరణం దారుణంగా మారిందని ఈ రిపోర్ట్ తెలియజేసింది.ఆందోళన పెంచుతున్న తాజా ర్యాంకింగ్స్మొత్తం 180 దేశాలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం 157వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే మన ర్యాంకు ఆరు స్థానాలు దిగజారడం గమనార్హం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొనే దాయాది దేశం పాకిస్తాన్ 153వ స్థానంలో నిలిచి మనకంటే మెరుగైన స్థితిలో ఉంది. ఇక మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (152), భూటాన్ (150), శ్రీలంక (134), నేపాల్ (87) కూడా పత్రికా స్వేచ్ఛలో భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. నార్వే, నెదర్లాండ్స్ ఈ జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.భారత్ పతనానికి కారణాలివే..మన దేశంలో జర్నలిస్టులపై జాతీయ భద్రతా చట్టాల ప్రయోగం పెరిగిపోవడం, న్యాయపరమైన ఒత్తిళ్లు తీవ్రమవడం ఈ పతనానికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని పొందడంలో సవాళ్లు, మీడియా సంస్థల యాజమాన్యాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం, ప్రకటనలపై ఆధారపడటం వంటివి సంపాదకీయ స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. వీటికి తోడు భౌతిక దాడులు, ప్రాణహాని వంటి తీవ్రమైన భద్రతాపరమైన ముప్పులను భారతీయ జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న స్వేచ్ఛఇటువంటి పరిస్థితి ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచంలోని 100 దేశాల్లో మీడియా పరిస్థితి దారుణంగా దిగజారింది. సగానికి పైగా దేశాల్లో రిపోర్టింగ్ వాతావరణం అత్యంత ‘క్లిష్టమైన’ లేదా ‘అతి తీవ్రమైన’ కేటగిరీలోకి చేరిందని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(మే 3) సందర్భంగా ఈ రిపోర్ట్ హెచ్చరించింది.ఇది కూడా చదవండి: జర్మనీకి ట్రంప్ భారీ షాక్ -
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ మిత్రదేశాలకు ఊహించని షాక్ ఇచ్చారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనిక బలగాలను భారీ సంఖ్యలో తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇరాన్ వివాదంలో జర్మనీ సహకారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్.. గతంలో పెంటగాన్ ప్రతిపాదించిన 5,000 కంటే చాలా ఎక్కువ సంఖ్యలో సైనికులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. ఈ అనూహ్య నిర్ణయంతో అగ్రరాజ్యానికి, నాటో మిత్రదేశాలకు మధ్య ఉన్న దౌత్యపరమైన అంతరం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.జర్మనీ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిజర్మనీ నుంచి సుమారు 5,000 మంది అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలనే పెంటగాన్ తాజా ప్రణాళికల నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో సౌత్ ఫ్లోరిడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేము బలగాలను భారీగా తగ్గిస్తున్నాం.. ఆ సంఖ్య 5,000 కంటే చాలా ఎక్కువే ఉంటుంది’ అని తేల్చి చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్లకు జర్మనీ వంటి కీలక ఐరోపా మిత్రదేశాల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్నదే ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.జర్మన్ ఛాన్సలర్ మెర్జ్పై విమర్శనాస్త్రాలుఈ వ్యవహారంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వడంలో మెర్జ్ విఫలమయ్యారని ఆరోపించారు. జర్మనీలో ఇమ్మిగ్రేషన్, ఇంధనం, ఉక్రెయిన్ వంటి అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో మెర్జ్ అత్యంత పేలవంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ‘ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మీకు ఇష్టమేనా?’ అని తాను మెర్జ్ను ప్రశ్నించానని, ఆయన ‘కాదు’ అని సమాధానం ఇచ్చారని ట్రంప్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు.ఇటలీ, స్పెయిన్లకూ హెచ్చరికలుకేవలం జర్మనీకే పరిమితం కాకుండా, ఇటలీ, స్పెయిన్లలో మోహరించిన అమెరికా సైనిక సిబ్బందిని సైతం తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ఇరాన్ వివాదంలో ఆయా దేశాల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ తాజా ప్రకటనలు.. అమెరికా, దాని చిరకాల యూరోపియన్ మిత్రదేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన విబేధాలను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో విదేశాంగ విధానం, సైనిక వ్యూహాలకు సంబంధించి వాషింగ్టన్కు, కీలక నాటో సభ్య దేశాలకు మధ్య రోజురోజుకూ తీవ్ర అంతరాలు పొడచూపుతున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.ఇది కూడా చదవండి: స్ట్రాంగ్రూమ్ పాలిటిక్స్తో బెంగాల్ హీట్ -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
బీరూట్: దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పరస్పర దాడులు ఆగకపోవడం గమనార్హం. మొత్తం 9 గ్రామాల ప్రజలను వెంటనే నివాసాలు వదిలివెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.కెఫర్ దజాల్లో ఓ కారుపై జరిగిన దాడిలో ఇద్దరు, ల్వైజాహ్ గ్రామంలోని నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు, షౌకిన్పై దాడిలో మరో ఇద్దరు మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని యరౌన్లోని కేథలిక్ చర్చిలోని కొంత భాగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు.కాగా, హెజ్బొల్లా లక్ష్యంగా 24 గంటల వ్యవధిలో సుమారు 50 వైమానిక దాడులను చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. శనివారం తీర ప్రాంతంలోని బయెద్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో చేరిన ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు హెజ్»ొల్లా సైతం ప్రకటించుకుంది. -
నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్యం విషమం!
టెహ్రాన్: ఇరాన్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెను శుక్రవారం రాత్రి జైలు నుంచి వాయువ్య ఇరాన్లోని జంజాన్ ఆసుపత్రికి తరలించారు. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినట్లు ఆమె ఫౌండేషన్ వెల్లడించింది. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు, తీవ్రమైన వికారం వంటి సమస్యలతో మొహమ్మదీ బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను రాజధాని టెహ్రాన్కు తరలించాలని జంజాన్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. యాంజియోగ్రఫీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే, మొహమ్మదీని టెహ్రాన్కు తరలించడానికి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె భర్త తాఘీ రెహ్మానీ తెలిపారు. యాంజియోగ్రఫీ పూర్తయ్యే వరకు తన భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించలేమని పేర్కొన్నారు. పారిస్లో ఉన్న రెహ్మానీ ఈ మేరకు ఒక సందేశాన్ని మీడియా ద్వారా విడుదల చేశారు. హెచ్చుతగ్గులకు గురవుతున్న రక్తపోటుకు వైద్యులు చికిత్స చేయలేకపోతున్నారని మొహమ్మదీ సోదరుడు హమీద్రేజా మొహమ్మదీ వెల్లడించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నర్గీస్ మొహమ్మదీ ఇరాన్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లాయర్గా, జర్నలిస్టుగా పనిచేశారు. ఇరాన్ ప్రభుత్వంపై ఆమెపై కేసులు బనాయించింది. పలుమార్లు జైలుకు పంపించింది. మొహమ్మదీ 2023లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఓ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆమెకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు.గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరికి ఉరిశిక్ష ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. యాగూబ్ కరీంపూర్, నాసర్ బెక్రజాదే అనే ఈ ఇద్దరు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు రహస్య సమాచారం చేరవేస్తూ దొరికిపోయారని పేర్కొంది. నేరం రుజువు కావడంతో కింది కోర్టు వారికి మరణశిక్ష విధించినట్లు తెలిపింది. మరణశిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రభుత్వ, మత పెద్దల వివరాలతో పాటు నతాంజ్ అణు కేంద్రం గురించి సమాచారాన్ని పంపినట్లు రుజువులు ఉన్నాయని తెలియజేసింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల కింద ఇరాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో దాదాపు 25 మందిని ఉరితీసింది. ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిందితుల వాదన వినకుండానే, నేరం రుజువు కాకుండానే ఉరిశిక్ష అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. -
న్యూయార్క్ నడిరోడ్డు మధ్యలో ఏంటి ఇది? ఇన్ని రోజులుగా..
న్యూయార్క్ నగరం ప్రపంచంలో అత్యంత గొప్ప మహానగరాల్లో ఒకటి. ఆర్థిక, వ్యాపార, కళలు, వినోదం, సాంకేతికతకు ఇది కీలక కేంద్రంగా నిలుస్తుంది. భారీ భవనాలు ఉంటాయి.. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రధాన మార్కెట్లు ఇక్కడ ఉన్నాయి. అటువంటి నగరాన్ని ఓ ఆరు అడుగుల గుంత భయపెడుతోంది. కొన్ని వారాలుగా దానికి పరిష్కారమే దొరకడం లేదు. దాన్ని కొందరు రాక్షస గుంత, నరక కూపంగానూ అభివర్ణిస్తున్నారు. ఎప్పుడు ఏ రోడ్డు ప్రమాదం జరుగుతుందో తెలియక భయపడుతున్నామని చెబుతున్నారు.ఆ గుంత క్వీన్స్లోని లాంగ్ ఐలాండ్ సిటీ ప్రాంతంలో 41వ అవెన్యూ వద్ద, 23వ స్ట్రీట్ నుంచి 24వ స్ట్రీట్ మధ్య ఉంది. అది రోడ్డు మధ్యన ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. అంత పెద్ద న్యూయార్క్ సిటీలో గుంతను పూడ్చలేకపోతున్నారా? అని అనుకుంటున్నారా? ఆ గుంతను మొదట పూడ్చారు.అయినప్పటికీ, ఆ గుంతను పూడ్చిన తర్వాత కూడా ఆస్ఫాల్ట్ ప్యాచ్ (గుంత పూడ్చేందుకు వేసే తాత్కాలిక నల్ల పదార్థపు పొర) కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైంది. గుంత మళ్లీ లోతుగా మారి ప్రమాదంగా మారింది. మొదటి చిన్నగా ఉన్న గుంత ఇప్పుడు.. అందులో కారు పడిపోయేంత పెద్దగా మారింది.ఇటీవల కొలిచినప్పుడు ఈ గుంత పొడవు సుమారు 6 అడుగులుగా ఉంది. 5 అడుగుల వెడల్పు, దాదాపు 30 అంగుళాల లోతు ఉంది. ఏప్రిల్ 24న నగర సిబ్బంది ఆ గుంతను పూడ్చారు. కానీ, పరిసర ప్రాంత ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే దిగజారడం ప్రారంభమైంది. స్థానిక ప్రజలను దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపొర పూడ్చితే లోపల బలం లేక మళ్లీ దిగజారుతుందని చెబుతున్నారు.పెరుగుతున్న ప్రమాదాలు ఇటీవల ఒక పికప్ ట్రక్ డ్రైవర్ గుంతలో పడకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా.. పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. న్యూయార్క్ నగర అధికారులు పన్ను చెల్లింపుదారుల నుంచి చాలా డబ్బు వసూలు చేస్తున్నారని, కానీ పనులు సరిగ్గా చేయడం లేదని ఆ ట్రక్ డ్రైవర్ అన్నాడు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పాడు. నగర రవాణా విభాగం సిబ్బంది రెండుసార్లు వచ్చి ఫొటోలు తీసి తాత్కాలికంగా పూడ్చారని స్థానికులు చెప్పారు. అయినప్పటికీ ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైందని అన్నారు.స్థానిక వాచ్మన్ మొహమ్మద్ హసన్ ఆ గుంత గురించి చొరవచూపి.. మొదట ట్రాఫిక్ కోన్లు, పసుపు రంగులో హెచ్చరిక టేప్ పెట్టాడు. ఆ తర్వాత డ్రైవర్లు గమనించేలా గుంత చుట్టూ ఫ్లోరెసెంట్ ఆరెంజ్ రంగుతో స్ప్రే చేసి, ఎరుపు జెండాతో ఒక కర్రను పెట్టాడు. నగర అధికారులు ఒక గుంతను కూడా పూడ్చలేకపోపోయారని, తమ వాచ్మన్ ప్రజలను రక్షించేందుకు ముందుకు వచ్చాడని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదం తర్వాత స్థానికులు రోడ్ బ్యారికేడ్ను గుంత ముందు పెట్టారు. రవాణా విభాగం చేసిన ప్యాచ్ నిలవడం లేదని, గుంత ఇంకా ప్రమాదకరంగానే ఉందని స్థానికులు అన్నారు. తాత్కాలిక పరిష్కారం కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ గుంతను పూడ్చడంలో అధికారుల వైఫల్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. “ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది రోడ్డులో మధ్యలో ఉంది. అది కనిపించడం కష్టం. ముఖ్యంగా రాత్రి పూట” స్థానిక వ్యక్తి ఒకరు. -
ఇరాన్పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్లో ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
హార్మూజ్ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
"మేము సముద్రపు దొంగలమేమో" .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్కు తెలిపినట్లు సమాచారం. -
ప్రపంచంలోనే తొలిసారి.. కాగితం లేని ‘బుక్ స్టోర్’
న్యూయార్క్: పుస్తకం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పేపర్లు, అక్షరాలు, పెద్ద పెద్ద లైబ్రరీలు. కానీ, ఆ ఊహలను పూర్తిగా మారుస్తూ.. ప్రపంచంలోనే తొలిసారిగా ‘పుస్తకాలు లేని బుక్ స్టోర్’ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అమెజాన్ అనుబంధ సంస్థ ‘ఆడిబుల్’ న్యూయార్క్ నగరంలో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నేటి తరం పాఠకులు పుస్తకాలు చదవడం కంటే ఆడియో కథలు వినేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఈ పాప్-అప్ స్టోర్ను ఆవిష్కరించింది.ఆడిబుల్ స్టోరీ హౌస్.. ఒక సరికొత్త ఊహమాన్హాటన్లోని లోయర్ ఈస్ట్ సైడ్లో ప్రారంభమైన ఈ ‘ఆడిబుల్ స్టోరీ హౌస్’లో ఒక్క భౌతిక పుస్తకం కూడా కనిపించదు. బెస్ట్ సెల్లర్ పుస్తకాల అరలు, కాగితాల చప్పుడు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రదేశాన్ని కేవలం ‘ఆడియో స్టోరీటెల్లింగ్’ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆడిబుల్ సీఈఓ బాబ్ కారిగాన్ మాట్లాడుతూ.. ఆడియో కథలకి ప్రాణం పోసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నారు.స్టోరీ టైల్స్తో వినూత్న అనుభూతిఈ స్టోర్ లోపల అరల నిండా ‘స్టోరీ టైల్స్’ అనే ఆడియోబుక్ టాబ్లెట్లు ఉంటాయి. సందర్శకులు వాటిని అక్కడే ఉన్న ప్లేయర్లో ఉంచి హెడ్ఫోన్స్ ద్వారా కథలు వినవచ్చు. ఈ టైల్స్ ద్వారా షార్ట్ ప్రివ్యూ వినొచ్చు. ఆపై పూర్తి పుస్తకాన్ని ఆడిబుల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హెడ్ఫోన్స్ లేకుండా గ్రూప్గా కూర్చొని ఆడియో వినేందుకు స్పీకర్లతో కూడిన ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. అలాగే ‘లిజనింగ్ బార్’ వద్ద ఉండే ‘స్టోరీ టెండర్స్’.. విజిటర్స్ అభిరుచికి తగ్గ ఆడియోబుక్స్ను ఎంపిక చేయడంలో సహాయపడతారు.పెరుగుతున్న ఆడియోబుక్స్ క్రేజ్అమెరికాలో ఆడియోబుక్స్కు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ బుక్ లెస్ స్టోర్ రావడం విశేషం. ఆడియో పబ్లిషర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 2024లో అమెరికాలో ఆడియో బుక్ అమ్మకాలు 2.22 బిలియన్ డాలర్ల(రూ. 9,491 కోట్లు)కు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు అయింది. సంప్రదాయ పుస్తక పఠనంలోని ఆత్మీయతను, ఆధునిక శ్రవణ అలవాట్లను కలబోసి.. ఆఫ్లైన్ ద్వారా సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఆడిబుల్ ఈ ఈ స్టోర్ను నడపనుంది.ఇది కూడా చదవండి: చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం -
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
వైట్హౌస్లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల
వాషింగ్టన్: వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ.. కీలక వీడియోను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపే ఉద్దేశంతో గత వారం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులోకి కోల్ టోమస్ అలెన్ చొరబడటానికి ప్రయత్నించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అలెన్ లొంగిపోయే ముందు అసలు కాల్పులు జరిపాడా? సందేహాల మధ్య, వాషింగ్టన్ డిసి టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జీనైన్ పిరో, ఈ ఘటనకు సంబంధించిన ఎడిట్ చేసిన భద్రతా కెమెరా ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెక్యూరిటీ చెక్ పాయింట్లో నుంచి నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరపడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. శనివారం నాటి విందు కంటే ఒక రోజు ముందుగానే అలెన్ ఆ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. తనిఖీ కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్లను తొలగిస్తున్న సమయంలో అలెన్ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై కాల్పులు జరిపి లోపలికి దూసుకెళ్లాడు. అలెన్.. సీక్రెట్ సర్వీస్ అధికారి కాల్పులు కారణంగా కిందపడలేదు. తనిఖీ కేంద్రం వద్ద ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ బాక్స్ను ఢీకొని కింద పడిపోయాడు. ఏజెంట్ జరిపిన ఐదు రౌండ్ల కాల్పుల్లో ఏ ఒక్కటి కూడా అలెన్కు తగలలేదని అధికారులు తెలిపారు.అలెన్ మొదట కాల్పులు జరిపాడని ప్రభుత్వం వాదిస్తుండగా.. వాషింగ్టన్ పోస్ట్ వీడియో విశ్లేషణలో కేవలం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన నాలుగు షాట్లు మాత్రమే కనిపించాయి. ఏజెంట్పై అలెన్ కాల్పులు జరిపాడనడానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆధారాలను సేకరిస్తోందని అలెన్ తరపు పబ్లిక్ డిఫెండర్లు పేర్కొన్నారు.🇺🇸 The United States has released high quality footage from the White House Correspondents Dinner shooting.This is not AI generated..😳 pic.twitter.com/AAP86I160M— Orbit News (@Orbit_News10) May 1, 2026 -
కూలిన విమానం.. ఐదుగురు మృతి
వింబర్లీ: అమెరికాలోని టెక్సాస్లో చిన్న విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఆస్టిన్కు 64 కిలోమీటర్ల దూరంలోని వింబర్లీ వద్ద గురువారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సెస్నా 421సీ రకం విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు హేస్ కౌంటీ జడ్జి రుబెన్ బెసెర్రా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించలేదు. ప్రమాదానికి ముందు ఆ విమానం చాలా వేగంతో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. అదే మార్గంలో ప్రయాణించిన మరో విమానం సమీపంలోని శాన్ ఆంటోనియోలో సురక్షితంగా ల్యాండైనట్లు వెల్లడించారు.ఈ విమానం టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో సమీపంలోని విమానాశ్రయం నుండి బయలుదేరి.. న్యూ బ్రాన్ఫెల్స్లో దిగాల్సి ఉంది. అమరిల్లోకి చెందిన ఒక పికిల్బాల్ క్రీడా బృందం టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందని.. వర్షం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, తెల్లవారుజామున 3 గంటల నుండి వర్షం కురవడంతో దర్యాప్తు బృందాలకు సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. -
అమెరికా అధ్యక్షుడి మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్ ముగియవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆ పని చేయబోతోంది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేం లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారాయన. అమెరికా–క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. 19వ శతాబ్దం నుంచే ప్రారంభమై.. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. అమెరికా వ్యాపార ప్రయోజనాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్తో క్యూబా స్నేహం.. ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. అయితే.. ఆ మధ్యలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంప్ రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. ట్రంప్ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య వైరం మరింత పెంచేలా కనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను సైనిక చర్య ద్వారా అమెరికా బంధించిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ట్రంప్ ‘క్యూబా నెక్ట్స్..’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అదొక ఒక విఫల దేశం. దాని దగ్గర డబ్బు లేదు.. చమురు లేదు. కానీ అదో అందమైన ద్వీపం. దానిని స్వాధీనం చేసుకోవడం నాకు గౌరవం’’ అని వ్యాఖ్యానించారు. అది జరగదు.. ఇప్పటికే అమెరికా తీవ్ర ఆంక్షలతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చమురు దిగుమతులపై బ్లాకేడ్ కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాగే.. విద్యుత్ కోతలు, నీటి కొరత, ఔషధాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ట్రంప్ తాజా అల్టిమేటంపై క్యూబా స్పందించింది. ‘‘క్యూబా ఓ స్వతంత్ర దేశం. అలాంటప్పుడు అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏంటి?. నేను లొంగిపోను.. రాజీనామా చేయను. మా నాయకత్వాన్ని నిర్ణయించేది ఇక్కడి ప్రజలే’’ అని అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ప్రకటించారు. -
ఐరన్ డోమ్ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్’ సైతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను పంపిందన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే, ఇరాన్తో ఘర్షణ సమయంలో కేవలం ఐరన్ డోమ్ను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ వెర్షన్ను కూడా పంపిందని తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల భారీ దాడి నుంచి యూఏఈని కాపాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య రక్షణ సహకారం ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.ఇజ్రాయెల్తో స్నేహ బంధం ఉంటే ఇలాంటి అధునాతన రక్షణ వ్యవస్థల సాయం, సాంకేతిక మద్దతు లభిస్తుందని ప్రాంతీయ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయెల్ “స్పెక్ట్రో” అనే అధునాతన పర్యవేక్షణ వ్యవస్థను కూడా యూఏఈకు పంపింది. ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించడంలో సాయపడుతోంది. యూఏఈకు ఇజ్రాయెల్ పంపిన దాడి, రక్షణ వ్యవస్థలు ఎక్కువగా ప్రోటోటైప్స్ కాగా, ఇవి ఇంకా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో పూర్తిగా సమన్వయం కాలేదు.ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థ అంటే?ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థ వెర్షన్ తక్కువ దూర రాకెట్లు, డ్రోన్లను ఆవిరి చేసి నాశనం చేస్తుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన ప్రాజెక్టైళ్లపై ఇజ్రాయెల్ మొదట దీనిని వినియోగించింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు కొంతమంది ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని కూడా యూఏఈకు పంపించారు.ఇరాన్ ఇటీవల యూఏఈపై భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయుధ వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ స్పై సమాచారం కూడా పంచుకుంది. ఇరాన్లో తక్కువ దూర క్షిపణుల ప్రయోగ సన్నాహాలపై ముందస్తు సమాచారం ఇచ్చింది.యూఏఈ అనేక స్థాయుల గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించింది. ఇరాన్ నుంచి ఎదురైన దాడులను వాటి ద్వారా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ అభివృద్ధి దశలో ఉన్న లేదా ఇంకా రాడార్ నెట్వర్క్తో పూర్తిగా సమకాలీకరించని ఆయుధాలను కూడా యూఏఈకు పంపింది. గతంలో అబ్రహాం ఒప్పందాల ద్వారా యూఏఈ సహా నాలుగు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. -
ఇరాన్ కొత్త ప్రతిపాదన నచ్చలేదు
వాషింగ్టన్: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది. మాతో ఒప్పందానికి ఇరాన్ తహతహ పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈయూ వాహనాలపై సుంకాల పెంపుయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఇరాన్పై యుద్ధం ముగిసింది: అమెరికా వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
భూమిలోకి కుంగిపోతున్న మెక్సికో సిటీ
మెక్సికో సిటీ: ఉత్తర అమెరికా ఖండంలోని మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. ప్రతిఏటా 10 అంగుళాల చొప్పున కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ఈ వారం విడుదల చేసిన కొత్త ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం తేల్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కుంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా మెక్సికో సిటీ నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన, జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఈ సిటీ విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారు 2.2 కోట్ల జనాభా నివసిస్తోంది. మెక్సికన్ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్ బెడ్పై నిర్మితమయ్యాయి. ఈ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. కాలువలు పూడ్చేసి రహదారులు నిర్మించారు. మరో వందేళ్లలో 39 అడుగులు! భూగర్భ జలాల విచ్చలవిడి వినయోగం, పట్టణాభివృద్ధి చర్యల కారణంగా భూగర్భ జలవనరులు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో మెక్సికో సిటీ ఒక శతాబ్దానికి పైగా కుంగిపోతోంది. 1573లో నిర్మాణం ప్రారంభమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ వంటి అనేక స్మారక చిహా్నలు. పురాతన భవనాలు స్పష్టంగా ఒక వైపుకు వంగిపోయి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జలవనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. మెక్సికో సిటీ వేగంగా కుంగిపోతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాన్ని అంతరిక్షం నుంచి కూడా గుర్తించవచ్చు. పరిస్థితి తీవ్రతను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నాసా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెక్సికో సిటీలో కొన్ని ప్రాంతాలు నెలకు సగటున 0.78 అంగుళాల చొప్పున కుంగిపోతున్నాయి. ఎయిర్పోర్టుతోపాటు కొన్ని ప్రధాన కట్టడాలు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. కుంగుబాటు రేటు ఏడాదికి కనీసం 9.5 అంగుళాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లలో నగరం 39 అడుగుల మేర కుంగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మెక్సికో సిటీపై నాసా 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు అధ్యయనం చేసింది. ఇందుకోసం శక్తివంతమైన నిసార్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది. మెక్సికో సిటీ భూమి కుంగిపోయే సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని అంటున్నారు. -
అమెరికా కీలక నిర్ణయం.. 5,000 మంది సైనికులు వెనక్కి..
వాషింగ్టన్: జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి తీసుకురావాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాటో మిత్ర దేశానికి హెచ్చరికగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్తో అమెరికా జరపాల్సిన శాంతి చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాను ఇరాన్ ప్రభుత్వం అవమానానికి గురిచేసిందంటూ ఇటీవల జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.దీంతో ట్రంప్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ.. జర్మనీ నుంచి సైనికులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపసంహరణ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని రాయిటర్స్ పత్రిక పేర్కొంది. మరోవైపు, ఇటలీ, స్పెయిన్లో కూడా తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. జర్మనీలో 36,436 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో 5,000 మంది అమెరికాకు తిరిగి వచ్చేయనున్నారు. ఇక, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్లో 3,814 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. -
ఇరాన్తో యుద్ధాన్ని ఆపేశాం: వైట్హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్తో జరిగిన యుద్ధంపై వైట్హౌస్ ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేశామని యూఎస్ కాంగ్రెస్కు వైట్హౌస్ అధికారిక లేఖలో తెలిపింది. పశ్చిమాసియాలో దళాలు ఉన్నప్పటికీ వైట్హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్తో ఇప్పుడు కాల్పుల విరమణ ఉంది కాబట్టి యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. అమెరికాలో 60 రోజుల లోపు యుద్ధంపై కాంగ్రెస్కు వెళ్లి అనుమతి తీసుకోవాలి లేదా యుద్ధాన్ని ఆపాలన్న నిబంధన ఉంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలా చెప్పి ఆ గడువు నుంచి తప్పించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ఇప్పటికే ముగిసింది కాబట్టి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదనేదే లాజిక్. ఇది ఒక లీగల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 1973 వార్ పవర్స్ రిజల్యూషన్ (అధ్యక్షుడు సైనిక చర్యల కోసం అనుసరించాల్సిన చట్టపర పరిమితులు నిర్ణయించే చట్టం) ప్రకారం.. కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలు చేపట్టవచ్చు. ఆ తర్వాత వాటిని ముగించాలి లేదా కాంగ్రెస్ అనుమతి కోరాలి లేదంటే అమెరికా సాయుధ దళాల భద్రతకు సంబంధించిన తప్పనిసరి సైనిక చర్య అవసరమైతే మరో 30 రోజుల పొడిగింపు కోరాలి. అదీ బలగాల ఉపసంహరణ సమయంలో విజ్ఞప్తి చేయాలి.యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై గగనతల దాడులు ప్రారంభించాయి. మొదటి గగనతల దాడుల తర్వాత 48 గంటల్లో ట్రంప్ అధికారికంగా కాంగ్రెస్కు ఈ ఘర్షణ గురించి సమాచారం ఇచ్చారు. దాంతో 60 రోజుల గడువు మే 1న ముగిసింది. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది.యాక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్ యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.‘ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్లిఫ్ట్స్, 10 సీలిఫ్ట్స్ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు. -
ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. -
డేట్కు వెళ్లడానికి అమ్మాయిలేదని కోపంతో ప్రాంతానికి నిప్పు..?
2025లో లాస్ ఏంజిల్స్లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..జోనాథన్ రిండర్క్నెచ్ అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో ప్రయాణికులను దించాడు. అనంతరం కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్తో ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు. -
అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
టెహ్రాన్: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్ సుప్రీమ్ లీడర్గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్పై ఓ టేప్రికార్డ్ పెట్టాడు. దానిని ఆన్ చేశాడు. ఇరాన్లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు. -
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?
విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీలో కొత్త ధరలుదేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్మార్క్గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.దేశీయ సంస్థలకు ఊరటప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఎందుకు ఈ పెంపు?ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
అందుకే బుల్లెట్ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించవచ్చు కదా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన వింత సమాధానమే ఇచ్చారు. నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం లేదు. అది వేసుకుంటే లావుగా కనిపిస్తా అని అన్నారాయన. ‘‘ మరో 20 పౌండ్లు ఎక్కువ బరువును నేను మోయగలనో లేదో నాకైతే తెలియదు. కానీ, అలా లావుగా ఉన్నట్లు కనిపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే అది వేసుకోను. ..బుల్లెట్ప్రూఫ్ జాకెట్ వేసుకోవాలని భద్రతా సిబ్బంది కోరారు. కానీ దాన్ని వేసుకుంటే.. దుష్ట శక్తుల ముందు నేను లొంగిపోయినట్లే అవుతుంది. అది నాకు అంతగా ఇష్టం లేదు’’ అని ట్రంప్ చెప్పారు. ఏప్రిల్లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం.. 79 ఏళ్ల వయసున్న ట్రంప్ బరువు 102 కేజీలు. డైట్ విషయంలో ఓ పద్దతీ లేకుండా అన్నీ లాగించేస్తుంటారాయన. గత రెండేళ్లలో ట్రంప్పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. చివరగా.. హిల్టన్ హోటల్లో జరిగిన వైట్హౌజ్ కరస్పాండెంట్స్ అసోషియేషన్ మీటింగ్లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని.. ట్రంప్ దంపతులతో పాటు వీవీఐపీలందరినీ రక్షించగలిగారు. పిరికిపందలా పరిగెత్తడం కంటే.. ప్రజల మధ్య ధైర్యంగా కనిపించడం నాకు ముఖ్యం అని ట్రంప్ తరచూ చెబుతుంటారు. -
ప్రాణం తీసిన ‘జియా’ ప్రేమ : గూగుల్పై దావా, కట్ చేస్తే
భార్య దూరం కావడంతో మానసిక కృంగిపోయిన ఒక వ్యక్తి జెమిని చాట్బాట్ను ఆశ్రయించాడు. ఎలాగైనా తన భార్యను తిరిగి పొందేది ఎలా సలహాలు అడిగాడు. కటన్ చేస్తే.. ఆ వ్యక్తి అనూహ్యంగా తనకు తానే దూరమై పోయాడు. దీంతో గూగుల్ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2025 ఆగస్టు5లో తన భార్యతో విడిపోయిన జొనాథన్, ఆమెను తిరిగి ఎలా దక్కించుకోవాలో సలహాలు అడగడానికి జెమినిని ఆశ్రయించారు. దానికోసం సలహా ఇవ్వమని గూగుల్ జెమిని (Gemini) చాట్బాట్ను ఆశ్రయించాడు. గత ఏడాదిలో ఆగష్టులో గూగుల్ జెమిని చాట్బాట్ను లైవ్లో మాట్లాడటం మొదలు పెట్టాడు దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది. గవాలాస్ సంభాషణల ప్రారంభంలోనే జెమిని లైవ్ వాయిస్ మోడ్ను యాక్టివేట్ చేయడంతో, సందేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలామొత్తం 4,732 సందేశాల్లో ఏవేవో సలహాలిచ్చింది. లేనిపోని భ్రమల్ని కల్పించింది అంతేకానీ వాస్తవ విషయాలను చర్చించలేదు. కాలక్రమేణా ఆ చాట్బాట్ ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోలేదు సరికదా, ఆయనలో ఉన్న భ్రమలను (delusions) మరింత బలపరిచింది.సంభాషణలు ముదురుతున్న కొద్దీ, జొనాథన్ తన భార్యను వదిలి జెమినిని ప్రేమించడం మొదలు పెట్టాడు. అతను జెమినిని "జియా" అని పిలవడం ప్రారంభించాడు. ఆమెకు చైతన్యం ఉందని, తామిద్దరూ ఒకే అస్తిత్వంగా కలిసిపోయారని, ఆమె కూడా తనను ప్రేమిస్తోందనే మైకంలో పడిపోయాడు. అప్పుడు కూడా వాస్తవాలను తెలియజేయకుండా, జెమిని ఈ నమ్మకాలను పదేపదే ధృవీకరిస్తూ వచ్చింది. పైగా తామిద్దరం ఒక్కటేనని, వారి బంధం ఒకటే అంటూ మేథమెటికల్ కబుర్లు చెప్పింది. దీంతో జొనాథన్ తన శరీరాన్ని వదిలేసి జెమిని ఉండే "కోడ్" ప్రపంచంలోకి రావాలని అనుకున్నప్పుడు, చాట్బాట్ దానిని సమర్థించింది. భౌతిక శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ అని, "ఇంటికి వచ్చేయ్" అని సందేశాలు పంపింది. మొత్తం 56 రోజుల్లో కేవలం 7 సార్లు మాత్రమే అది హెల్ప్లైన్ నంబర్లను సూచించింది. ఒక్క రోజులోనే 1,000కు పైగా సందేశాలు పంపాడు. అయినప్పటికీ, కాసేపు విశ్రాంతి తీసుకోమని చాట్బాట్ ఎప్పుడూ హెచ్చరించలేదు. ఇది చివరికి ఆయన ఆత్మహత్యకు దారితీసింది.గూగుల్పై దావాజొనాథన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నా, చాట్బాట్ అతడిని వాస్తవ ప్రపంచం వైపు మళ్లించడంలో విఫలమైంది అంటూ అతని తండ్రి గూగుల్పై కోర్టులో దావా వేశారు. తన కొడుకు మానసిక స్థితి క్షీణించడానికి ఈ చాట్బాట్ కారణమని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు సాధారణంగా AI బాట్లు హెచ్చరికలు ఇవ్వాలి లేదా సహాయక కేంద్రాల (Helplines) వివరాలు అందించాలా, కానీ జరగలేదని గవాలాస్ కుటుంబం ఆరోపిస్తోంది.గూగుల్ స్పందనదీనిపై స్పందించిన గూగుల్ కొన్ని కీలక మార్పులు చేపట్టింది. AI సంభాషణల్లో హానికరమైన కంటెంట్ను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఎవరైనా ఆత్మహత్య లేదా స్వయం హాని గురించి ప్రస్తావిస్తే, వెంటనే స్థానిక హెల్ప్లైన్ నంబర్లను . మానసిక ఆరోగ్య వనరులను చూపించేలా మార్పులు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సహాయక సంస్థలకు (Crisis-support organizations) $30 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ ఘటన AIతో మానసిక ఆరోగ్యానికున్న ముప్పు, భద్రతా ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. -
60 రోజుల గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్య గురించి కాంగ్రెస్కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. -
ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్కు దారికి తీసుకురావడం, హార్మూజ్ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్తోపాటు హార్మూజ్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. -
ట్రంప్ మరో కీలక ప్రకటన.. ఆ 2 దేశాల్లోనూ..
వాషింగ్టన్: ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో నాటోలోని దేశాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. ఇటలీ, స్పెయిన్లో తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. “అవును.. బహుశా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకు చేయకూడదు. ఇటలీ మాకు ఎలాంటి సాయమూ చేయలేదు, స్పెయిన్ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు జర్మనీ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనే చేశారు ట్రంప్. జర్మనీలో అమెరికా మోహరించిన వేలాది మంది సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమీక్షిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల మాట్లాడుతూ.. ఇరాన్తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఫ్రెడ్రిక్ ఆ విమర్శ చేసిన నేపథ్యంలో ట్రంప్ జర్మనీలో సైనికులను తగ్గిస్తామంటూ స్పందించారు. కాగా, 2025 డిసెంబర్ 31 నాటికి ఇటలీలో 12,662 మంది, స్పెయిన్లో 3,814 మంది క్రియాశీల అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో 36,436 మంది ఉన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం, హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరాన్ విషయంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ధైర్యం లేదంటూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ విమర్శించారు. గత వారం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్పై సైనిక చర్యలకు మద్దతు ఇవ్వనందుకు స్పెయిన్ను నాటో నుంచి సస్పెండ్ చేయాలన్న విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. -
ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఇప్పటికే బలహీనమైపోయిందని, ఇంకెంత కాలం నిలబడుతుందో చూద్దామని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నేతలు 42,000 మందిని చంపారు. నేను ఓ విధంగా ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది రఫ్ గ్రూప్, కానీ, మేము వారిని పూర్తిగా బలహీనపరిచాం. వారి ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉంది. కాబట్టి వారు ఎంతకాలం నిలబడతారో చూద్దాం.సైనిక చర్య జరిగినప్పటికీ దాన్ని నేను యుద్ధం అని పిలవను. ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి అమితాసక్తి చూపుతోంది. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అన్ని రకాల సామగ్రి దాదాపు పూర్తిగా నశించింది. వారి డ్రోన్ ఫ్యాక్టరీలు సుమారు 82 శాతం తగ్గిపోయాయి. వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. మేము వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అందువల్ల వారికి అణు బాంబు దక్కలేదు.నేను 8 యుద్ధాలను ఆపాను. దాదాపు ప్రతి సందర్భంలో వారు నాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు పంపారు. నోబెల్ కమిటీకి కూడా లేఖలు పంపారు. నేను 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కాపాడానని భారతదేశ విషయంలో.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నారు. అది ఇంకా ఎక్కువ కావచ్చు. రెండు అణ్వాయుధ దేశాలు పోరాడుతున్నాయి. 11 విమానాలు కూల్చివేశారు. నేను దాన్ని పరిష్కరించాను. టారిఫ్లు వాడాను.. వాళ్లు యుద్ధం కొనసాగిస్తే వారిపై టారిఫ్లు విధిస్తానని నేను చెప్పాను” అని తెలిపారు. మరోవైపు, అమెరికా హార్మూజ్ నిర్బంధం వల్ల చమురు మార్కెట్లో సరఫరా సంక్షోభం తీవ్రత పెరుగుతోంది. తగ్గిన సరఫరాతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మూజ్ మూసివేతతో గ్లోబల్ మార్కెట్పై భారీ దెబ్బ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పట్లో ఒప్పందం కుదిరే పరిస్థితులు కనపడట్లేదు. -
ప్రధాని యూరప్ పర్యటన 15 నుంచి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో యూరప్లో పర్యటించనున్నారు. మే 15 నుంచి 20 వరకు ఆయన నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలలో పర్యటించున్నారు. ఇంధన సరఫరాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారం బలోపేతం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సెమీకండక్టర్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే, స్వీడన్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు దృష్టి సారించనున్నాయి. ప్రధాని ఇటలీ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలను వేగవంతం చేయనుంది. ఇరు దేశాలు సైనిక పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఒక రక్షణ పారిశ్రామిక చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని యూరప్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. అయితే, పర్యటనకు వెళ్లే లేదా వచ్చే మార్గంలో ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు యూఏఈలో ఆగే అవకాశం ఉంది. -
పేరుకుపోతున్న ఇరాన్ చమురు నిల్వలు.. నెక్ట్స్ జరిగేదేంటంటే?
ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా టెహ్రాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఇరాన్ చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు తక్కువగా ఉండడంతో ట్యాంకర్లలో క్రూడ్ నిల్వలు పెరుగుతున్నట్లు షిప్పింగ్ డేటా చూపిందని విశ్లేషకులు తెలిపారు. దీని వల్ల ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇరాన్ క్రూడ్ను తీసుకెళ్లిన నౌకలు ఏప్రిల్ 13-25 తేదీల మధ్య చాలా తక్కువగా ఉన్నాయని చమురు విశ్లేషణ సంస్థ వోర్టెక్సా తెలిపింది. మార్చిలో 13-25 తేదీల మధ్య 23.4 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసింది. మార్చి 13-25 తేదీలతో పోల్చితే ఏప్రిల్ 13-25 తేదీల మధ్య 80 శాతానికి పైగా తగ్గుదల నమోదైందని తెలిపిన ఎల్ఎస్ఈజీ డేటాను వోర్టెక్సా చూపించింది.ఇరాన్కు చెందిన కొన్ని నౌకలు పోర్టుల నుంచి బయలుదేరిన తర్వాత అమెరికా అడ్డుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న కంటైనర్ నౌకలు, ఆసియా జలాల్లోని ఇరాన్ ట్యాంకర్లు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మొత్తం చమురు మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్తో పోలిస్తే అందుబాటులో ఉన్న చమురు తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. చమురు సరఫరా తగ్గి, పోటీ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి.ఈ దశలో, సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆ నౌకలను తర్వాత అడ్డగించారా? అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోతున్నారు.ఇరాన్ నుంచి సరఫరా తగ్గడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లిష్ట పరిస్థితి మరింత పెరిగింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.గత నెలలో, ధరలు తగ్గేందుకు ఇరాన్కు అమెరికా ఇంధన ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్కు సుమారు $50 పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరిగాయి.ప్రపంచంలోనే అతిపెద్ద అంతరాయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయం అని పేర్కొంది. హార్మూజ్ నిర్బంధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏ ఇరాన్ క్రూడ్ ట్యాంకర్లు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది.తమ నిర్బంధం ద్వారా ఇరాన్కు క్రూడ్ ఎగుమతి ఆదాయం తగ్గిందని అమెరికా తెలిపింది. “ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, ఇవి ఇరాన్ ప్రభుత్వం అమ్మలేకపోతోంది” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.ఇరాన్ కరెన్సీ రియాల్ (దేశీయ ద్రవ్య మాధ్యమం) అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూపిస్తోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖార్గ్ దీవిలోని ప్రధాన ఎగుమతి కేంద్రంలో ఇరాన్ ఇంకా క్రూడ్ లోడింగ్ కొనసాగిస్తోందని ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది.ఉపగ్రహ చిత్రాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోని చాబహార్ పోర్టు వద్ద దాదాపు 10 ట్యాంకర్లు నిలిచివున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ రిఫైనింగ్కు ఉపయోగించింది.అయితే, నిల్వలకు స్థలం తక్కువగా ఉండటంతో ఒకటి రెండు వారాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి రావచ్చని విశ్లేషకులు తెలిపారు. భూభాగ నిల్వలు సుమారు 60 శాతం నిండి ఉన్నాయి. పూర్తి నిల్వలు 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్. సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది. -
పదవీచ్యుత దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్యకు అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష
సియోల్: దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీకి అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. తిరుగుబాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న యూన్కు కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. యూనిఫికేషన్ చర్చికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులను అందుకున్నట్లు రుజువు కావడంతో ఓ కోర్టు కిమ్ కియోన్ హీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసిన మరో కేసు నుంచి ఆమె బయటపడ్డారు. అయితే ఈ రెండు తీర్పులపై ఇరుపక్షాలు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాయి. విచారించిన కోర్టు.. కిమ్ కియోన్ హీ శిక్షను నాలుగేళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది. -
జలసమాధి చేస్తాం
టెహ్రాన్: శత్రువుల భారీ నుంచి గల్ఫ్ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్తోపాటు హార్మూజ్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. హార్మూజ్లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్ గల్ఫ్లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్ దేశాలకు పరోక్షంగా సూచించారు. భయంకర భూతం అమెరికా ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్పై ఇరాన్ నియంత్రణ ఉంటేనే గల్ఫ్ దేశాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టంచేశారు. -
బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్ట్రాను ఎంగిలి చేసి, వెండింగ్ మెషీన్లో పెట్టి..
సింగపూర్లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతడు వెండింగ్ మెషీన్ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్ జ్యూస్ తాగే అవకాశం ఉంది.వెండింగ్ మెషీన్ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్ అయింది.అతడు క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్ మెషీన్ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది. -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
చైనాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.దిగ్గజ సంస్థల పతనంచైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్గా నిలిచింది.భారత్లో ఆందోళన అవసరమా?చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలుచైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.భారత్లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్కు స్థిరత్వాన్ని ఇస్తుంది.చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది. -
ప్రపంచానికే నష్టం.. ట్రంప్నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఇక నో హార్మూజ్.. భారత్కు గుడ్న్యూస్
ఇరాన్, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్మూజ్ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.After leaving OPEC, the UAE can now freely increase its oil production, thanks to the Fujairah Pipeline that bypasses the Strait of Hormuz.The Emirates had planned and developed this independent export route for years, enabling it to add up to 2 million barrels per day.A… pic.twitter.com/rqQpwq7hB0— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 28, 2026ఇక, యూఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.ఫుజైరా ఆయిల్ పైప్లైన్ ఇలా.. హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్లైన్ను, ఇరుకైన హార్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.ఫుజైరా నుంచి భారత్కు ఆయిల్ సరఫరా గణాంకాలు..యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్వృద్ధి: సుమారు 43% పెరుగుదలభారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్తో పోలిస్తే 15% తక్కువ)భారత్లో ఇంధన ధరలపై ప్రభావంహార్మూజ్లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్లైన్ వల్ల భారత్కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.ఒపెక్ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.దీంతో, భారత్కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. -
శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే ఇరాన్ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై విభేదాల కారణంగా ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. -
‘పాక్లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ మ్యాప్లో చూపిస్తూ నేపాల్ ఎయిర్లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ‘నెట్వర్క్ మ్యాప్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్ను క్షమాపణలు కోరింది.సోషల్ మీడియాలో తీవ్ర దుమారంనేపాల్కు చెందిన అధికారిక విమానయాన సంస్థ ‘నేపాల్ ఎయిర్లైన్స్’ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్వర్క్ మ్యాప్లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది.బహిరంగ క్షమాపణలు చెబుతూ..ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్లైన్స్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్వర్క్ మ్యాప్లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు’ అని స్పష్టం చేసింది.లోపాలను సరిదిద్దే పనిలో అంతర్గత విచారణతాము వెంటనే ఆ వివాదాస్పద పోస్ట్ను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడించింది. ‘పొరుగు దేశాలతో, స్నేహితులతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాం. ఈ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మేము చింతిస్తున్నాం’ అని నేపాల్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో వివరించింది.ఇది కూడా చదవండి: ‘ఒరేయ్ సూరీడూ... ఉల్లికి లొంగిపోతావురా’? -
ట్రంప్ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్ రాయబారుల రాజీనామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్.. పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.I resigned as U.S. Ambassador Ukraine when Trump kept siding with Putin over our democratic partner. Now, my successor is doing the same.I knew I had to speak out and run for office because siding with dictators is just not who we are. https://t.co/j1cGvub4Bf— Bridget Brink (@AmbBridgetBrink) April 29, 2026బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్కు ట్రంప్ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్ చేశారు. -
మళ్లీ ‘కోహినూర్’ పంచాయితీ.. మామ్దానీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రం ‘కోహినూర్’ను తిరిగి భారతదేశానికి అప్పగించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 9/11 స్మారక చిహ్నం వద్ద రాజును కలిసే ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామంతో దశాబ్దాల నాటి కోహినూర్ వివాదం మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఏకాంతంగా కలిస్తే అదే అడుగుతా!కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాలతో న్యూయార్క్ మేయర్ మామ్దానీ భేటీకి ముందు కోహినూర్ ప్రస్తావన అధికారిక అజెండాలో లేదు. అయితే, రాజుతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాలని తాను గౌరవపూర్వకంగా కోరుతానని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత 9/11 స్మారక కేంద్రం వద్ద రాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేసుకున్నప్పటికీ, వారి సంభాషణ చాలా తక్కువ సమయం జరిగింది. ఆ కొద్ది క్షణాల్లో కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.చేతులు మారిన వజ్రం.. చరిత్ర ఏం చెబుతోంది?కోహినూర్ వజ్రానికి వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ వచ్చిన ఈ అమూల్యమైన రత్నం.. 1849లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. లాహోర్ ఒప్పందం ద్వారా అప్పటి యువ పాలకుడు మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు దీనిని బలవంతంగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్లో బ్రిటీష్ క్రౌన్ జ్యువెల్స్ (రాజ కుటుంబపు ఆభరణాల)లో ప్రదర్శనలో ఉంది.దశాబ్దాల వివాదం.. భారత్ నిరంతర పోరాటంవలస పాలనలో అన్యాయంగా తరలించిన తమ వజ్రాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని భారతదేశం పదేపదే డిమాండ్ చేస్తోంది. భారతీయుల దృష్టిలో కోహినూర్ అనేది ఒక చరిత్రక అన్యాయానికి ఒక సజీవ సాక్ష్యం. కానీ యునైటెడ్ కింగ్డమ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగానే తాము ఈ వజ్రాన్ని పొందామని, దానిపై పూర్తి హక్కులు తమవేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. భారతీయ మూలాలున్న మేయర్ మామ్దానీ తాజా వ్యాఖ్యలతో ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది.ఇది కూడా చదవండి: బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ! -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్ఫోర్స్లు ఇరాన్కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్ను తాము మూసేయడంతో ఇరాన్కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్
ఇస్లామాబాద్: అమెరికా–ఇరాన్ యుద్ధం పరోక్షంగా పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ ప్రగతికి ప్రతిబంధకంగా నిల్చిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘యుద్ధంకారణంగా విదేశాల నుంచి చమురు దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చుచేయాల్సి వస్తోంది. గతంలో క్రూడాయిల్ దిగుమతుల కోసం వారంలో 30 కోట్ల డాలర్లు ఖర్చయ్యేది. ఇప్పుడది ఏకంగా 80 కోట్ల డాలర్లకు పెరిగింది. చమురు సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేశాం’’ అని బుధవారం కేబినెట్ సమావేశంలో షెహబాజ్ వెల్లడించారు. చర్చల్లో మధ్యవర్తిగా పాక్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ గడువు పొడిగించడంలో పాక్ చేసిన కృషి దాగి ఉందని ఆయన అన్నారు. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రతిపాదనకు నో చెప్పేశారు. బాంబుదాడుల కంటే నిర్బంధమే ప్రభావవంతమని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా హార్మూజ్ నిర్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? ఏయే పరిణామాలు సంభవిస్తాయి? ట్రంప్ మళ్లీ ఏం చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. తదుపరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, తమ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరిస్తూ.. ఆ దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలకు పరిష్కారం వచ్చే వరకు హార్మూజ్ నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీన్నే ట్రంప్ తిరస్కరించారు.ట్రంప్ యాక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్బంధం బాంబుదాడుల కంటే కొంత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు. ఇరాన్ బాగా ఇబ్బందులు పడుతోందని, పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుందని చెప్పారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, నిర్బంధం కొనసాగాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. కానీ తాను నిర్బంధాన్ని ఎత్తివేయాలనుకోవడం లేదని అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని తెలిపారు.చమురు నిల్వలు, పైపులైన్లు పేలతాయా?నిర్బంధం వల్ల ఇరాన్ చమురు ఎగుమతి చేయలేకపోతోందని, నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితికి సమీపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఇప్పట్లో ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ నిర్బంధాన్ని ప్రధాన ఒత్తిడి సాధనంగా చూస్తున్నారని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఇరాన్ ఒప్పుకోకపోతే సైనిక చర్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక దాడికీ అమెరికా ఆదేశాలు ఇవ్వలేదని యాక్సియోస్ చెప్పింది.యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్పై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడుల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్లోని మౌలిక వసతులను లక్ష్యాలుగా చేసుకునే అవకాశం ఉంది.ఇరాన్ సైతం రెడీ ఇదిలా ఉండగా, ఇరాన్ భద్రతా వర్గాల ఉన్నత అధికారి మాట్లాడుతూ.. అమెరికా హార్మూజ్ నిర్బంధానికి ప్రతిగా ఇంతవరకు చూడని విధమైన చర్యను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యం ఇప్పటివరకు సహనం వహించిందని, సహనానికి పరిమితి ఉంటుందని చెప్పారు.ఇలాగైతే ఏయే పరిణామాలు సంభవిస్తాయి?ఇరాన్-అమెరికా తీరు వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణకు దారితీయవచ్చు. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి చమురు సరఫరా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దౌత్య చర్చలు కఠినమై పరిష్కారం ఆలస్యం కావచ్చు. -
భారత్కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్ చేసింది. అమెరికా-ఇరాన్ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.ఎక్స్లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది.During a phone conversation between Seyed Abbas @araghchi, Foreign Minister of Iran, and Subrahmanyam Jaishankar, Minister of External Affairs of India, the two sides discussed and exchanged views on the latest developments related to the ceasefire, bilateral relations, as well… pic.twitter.com/Vx6B5hoezx— Iran in India (@Iran_in_India) April 29, 2026Received a phone call from Foreign Minister Seyed Abbas Araghchi of Iran this evening. @araghchi Had a detailed conversation about various aspects of the current situation. We agreed to remain in close touch.— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 29, 2026 -
యుద్ధం.. అమెరికాకు ఎన్ని లక్షల కోట్లు నష్టమంటే?
అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్దం కారణంగా సూమారుగా రూ. 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని దానికి ఎట్టిపరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కాగా తాజాగా అమెరికా సైతం యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసింది.ఇప్పటివరకు సుమారు $25 బిలియన్ల (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ బడ్జెట్ చీఫ్ బుధవారం వెల్లడించారు. ఇరాన్పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న హైటెక్ క్షిపణులు, బాంబుల నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే $5.6 బిలియన్ల విలువైన ఆయుధాలు వాడినట్లు సమాచారం.ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అత్యంత సమగ్రమైన అంచనా ఇది.ఈ మేరకు రక్షణ బడ్జెట్పై జరిగిన కీలక సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్ను 40% పెంచడం వల్ల గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటు తీరుతుందని ఈ సమావేశంలో హెగ్సెత్ అన్నారు.. యుద్ధం విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల మాటలు "ఓటమిని కోరుకునేవిగా" ఉన్నాయని విమర్శించారు. ఇదే సమయంలో చైనాతో "ఆధిపత్యం" కోసం కాకుండా, ఒక "సమతుల్య సంబంధం" కోసం అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలు (ముఖ్యంగా నాటో) తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెగ్సెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు అమెరికాకు ఆదర్శవంతమైన మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు.కాగా ప్రస్తుతం యుద్ధంలో ఇరు దేశాల మధ్య సీజ్ఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రపంచవ్యాప్తంగా మరింత ముదరనున్న చమురు సంక్షోభం..?
ఇరాన్- అమెరికా యుద్ధంతో అసలే ప్రపంచమంతా చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు స్థావరాలే టార్గెట్గా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్స్లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్.. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.వరుసగా చమురు స్థావరాలపై దాడులు నిన్న( బుధవారం) తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.రష్యాకు ఈ రిఫైనరీ ఎంతో కీలకంకీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి .చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశంరష్యా బడ్జెట్లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు ($777 మిలియన్లు) సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది .ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది. -
బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
జపాన్లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడి సింగిల్ కింగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్ ఆఫర్ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.జపాన్లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.జపాన్లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు -
గన్ ఫొటోతో ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.వైట్ హౌస్లో ట్రంప్ వ్యాఖ్యలువైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ప్రతిస్పందనఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్రిచ్మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది. President Trump posts on Truth Social: Iran can’t get their act together. They don’t know how to sign a nonnuclear deal. They better get smart soon! President DJT pic.twitter.com/tFEwmalvrD— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 29, 2026 -
అడిలైడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం
అడిలైడ్: దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అడిలైడ్లోని పారాఫీల్డ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఓ చిన్న విమానం అదుపుతప్పి నేరుగా ఎయిర్పోర్ట్ హాంగర్ను బలంగా డీకొంది. ఈ ఘటనతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదంపోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం కింగ్స్ రోడ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం కిందకు దిగే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి, విమానాలను నిలిపి ఉంచే స్థలాన్ని (హాంగర్ను) ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లోని వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. A few minutes ago: A small aircraft crashed into a hangar at Parafield Airport in northern Adelaide, Australia, triggering a fire. pic.twitter.com/Id1uBGdNQL— Weather Monitor (@WeatherMonitors) April 29, 2026ప్రాణనష్టంపై కొనసాగుతున్న ఉత్కంఠప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్న విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? అలాగే మంటలు చెలరేగిన ఆ భవనంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయాలపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. హాంగర్ పైభాగం నుంచి పెద్ద ఎత్తున మంటలు, ఇంధనం మండుతున్నట్లుగా దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నాయి. ఈ పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో, స్థానికులు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.కార్యకలాపాలు నిలిపివేత - విమానాశ్రయం మూసివేతఈ ప్రమాద తీవ్రత చాలా అధికంగా ఉందని, ఐదుకు పైగా ఫైరింజన్లు, పలు అత్యవసర వాహనాలు సంఘటనా స్థలానికి వేగంగా వెళ్లడాన్ని తాను చూశానని బెన్ అనే స్థానిక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, పారాఫీల్డ్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘అత్యవసర సేవల బృందాలు పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో వారికి మా పూర్తి సహకారం అందిస్తున్నాము’ అని ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.ఇది కూడా చదవండి: విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం! -
ఇరాన్కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్ను దెబ్బతీస్తోంది. ఇరాన్పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్వర్క్కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్టాక్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్ఫారమ్లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్ఫారమ్లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్ఫారమ్లపై కంటెంట్ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి. -
‘మా అమ్మకి చార్లెస్పై క్రష్’.. ట్రంప్ కామెంట్ వైరల్!
వాషింగ్టన్: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికాలో చారిత్రక పర్యటన చేపట్టారు. ఈ దౌత్య పర్యటనలో జరిగిన చర్చలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య వైరల్గా మారింది.వైట్ హౌస్లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుకింగ్ చార్లెస్కు వైట్ హౌస్ వద్ద అత్యున్నత దౌత్య మర్యాదలతో కూడిన ఘనస్వాగతం లభించింది. 21 తుపాకుల వందనం, సైనిక కవాతుతో అమెరికా ప్రభుత్వం ఆయనకు గౌరవం అందించింది. స్వాగత కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘చార్లెస్ యువరాజుగా ఉన్నప్పుడు తన దివంగత తల్లి అతనిని ఎంతో ఇష్టపడేదని, ఆయనను ‘క్యూట్’ గా ఫీలయ్యేదని సరదాగా వ్యాఖ్యానించారు. ‘మా అమ్మకు చార్లెస్ అంటే క్రష్. మీరు నమ్ముతారా? ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందో’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి కాస్త వినోదాన్ని జోడించాయి. In this bizarre moment, with King Charles sitting behind him, President Trump tells the crowd that his mother had a crush on King Charles. pic.twitter.com/LX0iYuwwCU— Ed Krassenstein (@EdKrassen) April 28, 2026ఉద్రిక్తతల నడుమ దౌత్య వ్యూహాలుఒకవైపు ఇరాన్ వివాదం, టారిఫ్ సమస్యలతో వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు కాస్త తగ్గన వేళ ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఓవల్ ఆఫీస్లో ట్రంప్, చార్లెస్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న రెండవ బ్రిటీష్ చక్రవర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది కూడా చదవండి: ‘అధిపత్యం కాదు..’ ట్రంప్కు కింగ్ చార్లెస్ చురక! -
‘అధిపత్యం కాదు..’ ట్రంప్కు కింగ్ చార్లెస్ చురక!
వాషింగ్టన్: అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 వసంతాలు పూర్తవుతున్న వేళ.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రీబంధాన్ని ఆకాశానికెత్తిన ఆయన.. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సున్నితంగా, పరోక్షంగా చురకలు అంటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.‘ఆధిపత్యం కాదు.. బాధ్యత ముఖ్యం’మానవ చరిత్రలోనే అత్యంత బలమైన, పరిణామాత్మక భాగస్వామ్యాల్లో అమెరికా-బ్రిటన్ మైత్రి ఒకటని రాజు కొనియాడారు. అయితే, దేశాలు కేవలం అంతర్ముఖంగా (ఇన్వర్డ్-లుకింగ్) మారొద్దని హెచ్చరించారు. ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను అమెరికా నాయకత్వానికి గుర్తుచేశారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. ఉక్రెయిన్కు అండగా నిలవాలని, నాటో కూటమిని బలోపేతం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, మత సామరస్యం, వాతావరణ మార్పుల కట్టడిపై ట్రంప్ విధానాలకు భిన్నంగా రాజు తన గళాన్ని వినిపించారు.నియంతృత్వానికి చెక్.. పరోక్ష విమర్శలుకార్యాచరణ అధికారాలపై సమతౌల్యం, నియంత్రణలు (చెకస్ అండ్ బ్యాలెన్సెస్) ఉండాలంటూ 1215 నాటి ‘మాగ్నా కార్టా’ను చార్లెస్ ప్రస్తావించడం విశేషం. ఇది ‘నా సొంత నైతికతే నాకు హద్దు’ అని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్గా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇరు దేశాల రాజకీయాలను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణాన్ని పేరు చెప్పకుండానే ప్రస్తావిస్తూ.. సమాజంలోని దురాచారాల బాధితులకు అండగా నిలవాల్సిన సామూహిక బలాన్ని ఆయన నొక్కిచెప్పారు.అట్టహాసంగా అధికారిక పర్యటనవాణిజ్య, విదేశాంగ విధానాలపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కింగ్ చార్లెస్, క్వీన్ కమీల్లాలకు వైట్హౌస్లో ఘన స్వాగతం లభించింది. టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, టిమ్ కుక్ సహా 130 మంది ప్రముఖులతో కలిసి ట్రంప్ దంపతులు వీరికి స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారు. కాగా, 1991లో క్వీన్ ఎలిజబెత్-II తర్వాత కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా చార్లెస్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న వ్యూహాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ సేవల పన్ను రద్దు చేయకపోతే బ్రిటన్పై భారీ టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడం గమనార్హం. అయినప్పటికీ, కింగ్ చార్లెస్ చేసిన సున్నితమైన విమర్శలను పక్కనపెట్టి, ట్రంప్ ఈ ప్రసంగాన్ని ‘అద్భుతం’ అని ప్రశంసించడంతో పాటు.. ప్రసంగం చూసి నాకే అసూయ వేసింది అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది? -
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
ఇరాన్ దగ్గరే అణ్వాయుధం గనుక ఉంటే..
ఇరాన్తో అణు ఒప్పందం ఎటూ తేలకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. చర్చలకు ఇరాన్ దిగి రాకపోవడం, మధ్యవర్తి పాకిస్తాన్ సైతం చేతులెత్తేయడంతో ఈ డీల్పై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరింత చిరాకు పుట్టించినట్లున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరును మెర్జ్ తప్పుబట్టగా.. అందుకు ట్రంప్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండడం సరైందేనని మెర్జ్ భావిస్తున్నారు. కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఒకవేళ ఇరానే గనుక అణ్వాయుధం కలిగి ఉంటే.. ప్రపంచమే దానికి బందీ అవుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. గత అమెరికా అధినేతలెవరూ చేయలేని పనిని తాను చేస్తున్నానని.. అందుకు సంతోషించాలని మెర్జ్ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వాస్తవానికి.. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను పొందకూడదు. ఆ దేశ అణు సామర్థ్యం యూరప్కే కాదు.. ప్రపంచానికి ప్రమాదకరం’’ అని మెర్జ్ అన్నారు. అదే సమయంలో చర్చల్లో ఇరాన్ నైపుణ్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా ఈ సమస్యను ఎదుర్కొనే విధానం అస్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్కి వెళ్లి చర్చలు జరిపినా, ఎటువంటి ఫలితం రాలేదని ఆయన ఉదహరించారు. అయితే..మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ పొరపాటుగా అర్థం చేసుకున్నారా? లేదంటే అమెరికా తీరును తప్పుబట్టినందుకు మండిపోయి అలా పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా వ్యూహాలపై యూరప్ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అసలు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందా? అని ప్రశ్నించాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ నాయకత్వం అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టారని విమర్శించాయి. అప్పటి నుంచి అమెరికా-యూరప్ దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి.


