breaking news
International
-
హర్ముజ్లో సీక్రెట్ ఆపరేషన్.. అమెరికా సంచలన ప్రకటన
ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.హర్ముజ్పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.హర్ముజ్లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిమరోవైపు ఇరాన్పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లపై ప్రభావం?ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే? -
చైనాలో భారీ భూకంపం.. నేపాల్లో హైఅలర్ట్
బీజింగ్: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్కు మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఈ పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.గత రాత్రి నేపాల్, టిబెట్లు కూడా భూకంపంతో వణికిపోయాయి. మరోసారి వరద ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. గ్లేసియర్ కూలిపోవడంతోనే సిచువాన్ ప్రావిన్స్ భూకంపం సంభవించిందని.. బారియర్ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఇక టిబెట్ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్ పోర్ట్ వద్ద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్కు మరో ముప్పు! -
నేపాల్కు మరో భారీ జల ప్రళయం ముప్పు
నేపాల్కు మరో వరద ముప్పు పొంచి ఉంది. కాసేపట్లో ఐదు రెట్ల తీవ్రతతో భారీ వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర భయాందోళనలతో నేపాల్ ప్రజలు.. ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. టిబెట్లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. మరో వరద ముప్పు నేపథ్యంలో రెస్క్యూను నిలిపివేసింది. గైరాండ్ పోరర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.ఏ క్షణమైనా నేపాల్ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. నిముష నిమిషానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోయింది. బిహార్లో గండకీ నది బ్యారేజ్కు వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. -
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
2047 నాటికి అందరికీ బీమా
కెనడా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు కెనడియన్ ఆర్థిక సంస్థలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. భారత్లో పెట్టుబడులను మరింతగా పెంచాలని కోరారు. మంత్రితో సమావేశమైన సంస్థల్లో సన్ లైఫ్ ఫైనాన్షియల్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీఐబీ) మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్లో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం, 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలంటూ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తదితర అంశాలను వివరించారు.భారత్ పటిష్ట వృద్ధి, విస్తృత మార్కెట్, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, డిజిటల్..ఫిజికల్ మౌలిక సదుపాయాలు వేగంగా వృద్ధి చెందుతుండటం మొదలైనవి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పించడంపై చర్చించినట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. బీమా, అసెట్ మేనేజ్మెంట్, మౌలిక సదుపాయాలు మొదలైన విభాగాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు సన్ లైఫ్కి మరింతగా అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
కిమ్తో ట్రంప్ దోస్తీ.. ఐరాస అణు నిఘా చీఫ్ అనూహ్య వ్యాఖ్యలు!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న సమావేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, నియంతృత్వ నేపథ్యం ఉన్నప్పటికీ చర్చలను ఆపకూడదని, ఇరువురు నేతలు భేటీ కావడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.కిమ్తో సమావేశం ఏర్పాటు చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నప్పటికీ, ఈ ఏడాది చివర్లో కిమ్ను కలవనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఉత్తర కొరియా వద్ద 57 శక్తివంతమైన అణు ఆయుధాలు ఉన్నాయని, కిమ్తో సత్సంబంధాలు ఉండటం మంచి పరిణామమేనని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను గ్రాస్సీ ఉదాహరణగా ప్రస్తావిస్తూ, దౌత్యమంటేనే కరచాలనం చేసి గౌరవప్రదమైన చర్చల ద్వారా ఫలితాలు సాధించడమని ‘ది వాషింగ్టన్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుత ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం 2026 డిసెంబర్ 31తో ముగియనుండటంతో, తదుపరి సెక్రటరీ జనరల్ పదవికి గ్రాస్సీ ముందంజలో ఉన్నారు.అర్జెంటీనాకు చెందిన 65 ఏళ్ల గ్రాస్సీని ఆ దేశం 2025 నవంబర్ 26న నామినేట్ చేసింది. గత ఆరేళ్లుగా ఐఏఈఏ అధిపతిగా ఉన్న ఆయన, ఇరాన్ అణు ఒప్పంద చర్చల్లో కీలక పాత్ర పోషించడమే కాక, ఉక్రెయిన్లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో బృందాన్ని మోహరించడంలో విజయం సాధించారు. భద్రతా మండలి శాశ్వత సభ్యుల మద్దతు అవసరమైన ఈ రేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది అభ్యర్థులు ఉండగా, రష్యా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాస్తవ శాంతి-భద్రత అంశాలను సమర్థంగా పరిష్కరిస్తున్న ఏకైక అభ్యర్థిని తానేనని గ్రాస్సీ ధీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా! -
సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా!
వాషింగ్టన్/ఒట్టావా: అమెరికా, కెనడాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇరు దేశాల సరిహద్దులో విస్తరించి ఉన్న ప్రసిద్ధ ‘లేక్ అంటారియో’ సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సరస్సు పేరు ఎప్పటికీ లేక్ అంటారియోగానే కొనసాగుతుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు.అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక భౌగోళిక రికార్డుల్లో 30 రోజుల్లోగా ఈ మార్పును చేర్చాలని, ఫెడరల్ ఏజెన్సీలన్నీ ‘లేక్ అమెరికా’ అనే పేరునే ఉపయోగించాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరస్సులో అత్యంత లోతైన భాగం అమెరికా వైపే ఉందని, అందువల్ల ఎక్కువ నీటి పరిమాణం తమకే చెందుతుందని ఆయన వాదించారు. గతంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చిన తరహాలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల పేర్లను కూడా మార్చవచ్చంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.మరోవైపు కెనడా ప్రధాని కార్నీ స్పందిస్తూ.. అమెరికా, కెనడా దేశాలు ఏర్పడటానికి ముందే, సుమారు 400 ఏళ్ల కిందటే స్థానిక తెగల భాష ఆధారంగా ఈ సరస్సుకు ‘అంటారియో’ (అందమైన లేదా పెద్ద సరస్సు) అనే పేరు వచ్చిందని గుర్తుచేశారు. వాస్తవాలను మార్చలేమని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన తేల్చిచెప్పారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమై, పరస్పరం సుంకాలు విధించుకోవడంతో సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ఉత్తర్వులు వివాదాన్ని మరింత పెంచాయి.ఇది కూడా చదవండి: రైతుల్లో గుబులు: సెప్టెంబర్లోనూ వర్షాలు అనుమానమే.. -
నేపాల్-టిబెట్లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్లో రిక్టర్స్కేల్పై 3.2 తీవ్రతతో.. టిబెట్లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్ను మరింత వణికిస్తున్నాయి.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్, టిబెట్ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్ఫ్లడ్స్) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తేల్చిచెప్పింది. మరో వరద ముప్పునేపాల్ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.భారతీయుల ఆచూకీ లేదుఈ విపత్తుతో భారత్లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.ఎటు చూసినా బురద.. వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. This is apocalyptic 👀What really caused these Nepal floods? Could it have been prevented from happening? pic.twitter.com/UPPDcutom5— Dr. Chika (@chikaehiemere) August 27, 2026ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం! -
పేట్రియాట్ల కొరత తీవ్రం
వాషింగ్టన్: అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను (పేట్రియాట్లు) మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్రస్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. ఒకవేళ రష్యా సైన్యం యూరప్పై దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకొనే ఇంటర్సెప్టర్లు లేవని పేర్కొన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తుండడం అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. ఐరోపా ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధ్రువీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్ కేంద్రంపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో, పేట్రియాట్ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్పై యుద్ధం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా–ఇరాన్ యుద్ధానికి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యాయి. యూరప్లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్ మిత్రదేశాలు పేట్రియాట్లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైనంత త్వరగా మిస్సైల్ ఇంటర్సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్లోని అమెరికా సైన్యం కోరుతోంది. -
కళ్లముందే సర్వనాశనం
కఠ్మాండు: కళ్ల ముందే కుటుంబం మొత్తాన్నీ వరదనీరు కబళించిన దృశ్యాలు ఇంకా తన కళ్లలో అలాగే నిలిచిపోయాయని కంటతడి పెడుతూ 38 ఏళ్ల గిరిలాల్ చెప్పారు. ఆప్తులు, కుటుంబసభ్యులు, ఇల్లు కోల్పోయి ఏకాకిలా మిగిలిన ఎంతో మంది ఇంకా ఆ భయానక ఘటనలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కార్యాలయంలో ట్రక్కు డ్రైవర్గా పనిచేసే గిరి లాల్కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాసువా జిల్లాలోని సరిహద్దు పట్టణం తిమూర్లో గిరిలాల్ కుటుంబం ఉంటోంది. మెరుపు వరదల్లో గిరిలాల్ భార్య, నలుగురు సంతానం కొట్టుకుపోయారు. ‘‘కళ్లముందే జీవితం చెదిరిపోయింది. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. నా వాళ్లంతా పోయారు’’అని గిరి గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ఉదయం 8.40 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. హఠాత్తుగా దిగువన ఉన్న దుకాణ సముదాయాన్ని అమాంతం ముంచేస్తూ వరదనీరు, బురద, మట్టి కొట్టుకొచ్చాయి. మా కళ్ల ముందే అంతా వరదనీటిలో కలిసిపోయాయి’’అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. ‘‘నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు విని్పంచాయి. అవేంటో అర్థంచేసుకునేలోపే భీకరంగా వరదనీరు విరుచుకుపడింది. పారిపోయేలోపే దిగువన ఉన్న జనాన్ని మింగేస్తూ వరదనీరు పోటెత్తి అందర్నీ తనలో కలిపేసుకుంది. క్షణాల్లో రోడ్డు, ఇళ్లు మటుమాయమై అంతటా భారీస్థాయిలో బురద పరుచుకుంది’’అని మరో ప్రత్యక్షసాక్షి వివరించారు. ‘‘భోటె కోశి నది సమీప డ్యామ్ కూలిపోయి నీరంతా దిగువకు కొట్టుకొస్తోందని ఎగువకు పారిపొండి అని అధికారులు చెప్పారు. అర్థం చేసుకుని అంతా పారిపోయేలోపే నీరు ముంచెత్తింది. నా 18 ఏళ్ల కుమారుడు, భార్య సైతం కని్పంచకుండా పోయారు’’అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పారిపోయే సమయం కూడా ఇవ్వకుండా వరదనీరు సర్వనాశనం చేసిందని నువాకోట్లోని త్రిశూలి మార్కెట్లో వస్త్రదుకాణ వ్యాపారి వాపోయాడు. ‘‘తిమూర్ బజార్పై ఏకంగా 100 మీటర్ల ఎత్తులో వరద అలలుగా వచ్చినట్లుంది. అందుకే తిమూర్ బజార్ రెప్పపాటులో కన్పించకుండా పోయింది’’అని రాసువాలో చీఫ్ కస్టమ్స్ అధికారి, ప్రత్యక్ష సాక్షి రాజేంద్ర ధుంగానా చెప్పారు. కస్టమ్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు వరదలో కొట్టుకుపోయాయని మరో వ్యక్తి తెలిపారు. -
భాగవత్ కార్యక్రమ నిర్వాహకుల ఎక్స్ ఖాతా బ్లాక్
న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఎక్స్ ఖాతా గురువారం కొన్ని గంటలపాటు పనిచేయకుండా నిలిచిపోయింది. ఈ విషయాన్ని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్(ఎహెడ్) ఫోరమ్ స్వయంగా తెలిపింది. కొందరు తప్పుదోవపట్టిన వ్యతిరేకులే ఇందుకు కారణమని ఆరోపించింది. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ గురించిన సమాచారం కొంతసేపు అందుబాటులో లేకుండా పోయిందని, ఎక్స్ జోక్యంతో తిరిగి పనిచేయడం ప్రారంభించిందని ‘ఎహెడ్’వివరించింది. తమ ఫిర్యాదుపై తక్షణమే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించిన ఎక్స్కు ధన్యవాదాలు తెలియజేసింది. ఆగస్ట్ 29వ తేదీన న్యూయార్క్ని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లోని ఇన్ఫోసిస్ థియేటర్లో భాగవత్ పాల్గొనే కార్యక్రమ వివరాలను ఎహెడ్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. ఈ కార్యక్రమంలో భాగవత్తోపాటు వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రముఖులంతా హాజరవుతున్నారు. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ మద్దతిచ్చే 200కు పైగా సంస్థల్లో ఎహెడ్ ఒకటి. -
ఎస్–400ల కోసం పాక్ వేగుల్ని నియమించింది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఎస్–400 రక్షణ వ్యవస్థల కోసం పాకిస్థాన్ తెగ ప్రయత్నం చేసిందని, ఆఖరికి ప్రత్యేక గూడచారులు, స్లీపర్ సెల్ల సాయంతో వాటిని గుర్తించే ప్రయత్నం జరిగిందని విశ్రాంత ఎయిర్మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఎస్–400ల కారణంగానే పాకి స్థాన్ ఫైటర్జెట్లు సరిహద్దుకు 200 కిలోమీట్ల దగ్గరకు కూడా రాలేకపోయాయని ఆయన ఏఎన్ఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో తెలిపారు. అత్యాధునిక ఎస్–400లు ఆపరేషన్ సింధూర్లో అత్యంత సమర్థంగా పనిచేశాయని, పాకిస్థాన్లోని సర్గోదా నుంచి నింగికి ఎగిరిన అవాక్ రాడార్ విమానాన్ని 314 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చేసిందని ఆయన తెలిపారు. అంత దూరంలోని విమానాన్ని కూల్చేయడం సైనిక చరిత్రలో ఒక రికార్డు అని చెప్పారు. భారత వాయుసేన మొదట పాకిస్తాన్ గ్రౌండ్ రాడార్లు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసిందని, దాంతో పాక్ సేనలకు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీంతో పాక్ రాడార్ విమానాలపై ఆధారపడ్డాయని, ఎస్–400లు వాటిని కూడా కూల్చేయడంతో విజయం సులభమైందని వివరించారు. ఈ ఆపరేషన్లో మహిళా ఫైటర్ పైలట్లు ఒకటి కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించారని, మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం, వైమానిక స్థావరాలు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను నాశ నం చేయడంలో కీలకపాత్ర పోషించారని మిశ్రా తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గత ఏడది మేలో ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. భారత్ నూర్ ఖాన్, భోలారి వంటి కీలక స్థావరాలు సహా 11 మిలిటరీ స్టేషన్లను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదని జితేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. పౌర నష్టాలు నివారించాలని, ఉగ్రవాదులు, హ్యాండ్లర్లనే లక్ష్యంగా చేసుకోవాలన్న సూచనలు మాత్రం వచ్చాయన్నారు. 2018లో భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మనకు ఎస్–400 వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. -
వాతావరణ మార్పుల ప్రభావమే!
→ జూన్, 2013... కేదార్నాథ్ క్లౌడ్బరస్ట్. ఆరువేల మంది మృతి → ఫిబ్రవరి 2021... రిషిగంగ నందాదేవీ వద్ద మంచు అవపాతం... 200 మంది మరణం. రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు ధ్వంసం. → ఆగస్టు 2025... ఉత్తరకాశీలోని ధరాలి వద్ద ఖీర్ గంగాపై క్లౌడ్బరస్ట్... మెరుపు వరదలతో నలుగురి మరణం. యాభైమంది గల్లంతు. → తాజాగా... నేపాల్లో హిమనదం కుప్పకూలి మెరుపు వరదలు.. → వందలాది మంది మృతి.. ఆస్తినష్టం!హిమాలయ పర్వత ప్రాంతంలో సంభవించిన పై నాలుగు భారీ ప్రకృతి విపత్తులకు కారణం ఏమిటి? వాతావరణ మార్పులే అంటున్నారు హిమనీనదాల నిపుణుడైన మనీశ్ మెహతా. కేదార్నాథ్, రిషిగంగ, ధరాలి ప్రమాదాలపై దీర్ఘకాలం అధ్యయనం చేసిన ఈయన హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులను, ప్రమాద ఘటనలను వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేస్తున్నారు. భూతాపోన్నతి ఫలితంగా ఈ ప్రాంతంలోని చాలా హిమనీనదాల కుంచించుకుపోతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనివల్ల ఒక ప్రమాదముంది. మంచు, నీటితో కూడిన ప్రాంతం తగ్గిపోవడం వల్ల అడుగున వదులుగా ఉండే మట్టి, రాళ్లు, శిథిలాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో నేల స్థిరంగా ఉండదు. ఎప్పుడైనా ఆకస్మాత్తుగా భారీ వర్షాలు పడినా, పెద్ద మొత్తంలో మంచు కరిగినా ఈ మట్టి, రాళ్లు చాలా సులువుగా వాలు ఉన్నవైపు వెళ్లిపోతాయి. అతితక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురిస్తే వదులుగా ఉన్న మట్టి, రాతిప్రాంతం త్వరగా నీటితో నిండిపోయి అకస్మాత్తుగా కిందివైపుకు కదులుతాయని, ఇది కాస్తా కొండచెరియలు విరిగిపడేందుకు లేదా రాతి శిథిలాలు దొర్లేందుకు కారణమవుతాయని ఆయన వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎత్తైన పర్వతప్రాంతాల్లో గడ్డకట్టిన మంచు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయని, దీనివల్ల అక్కడ తాత్కాలికంగా ఒక డ్యామ్ లాంటి నిర్మాణం ఏర్పడుతుందని చెప్పారు. ఈ తాత్కాలిక అడ్డుగోడ పగిలిపోతే అప్పటివరకూ అక్కడకు చేరిన నీరు, మంచు ఒక్కసారిగా చాలా వేగంగా దిగువ ప్రాంతాలవైపు ప్రయాణిస్తాయని తెలిపారు. కేదార్నాథ్సహా మిగిలిన చోట్ల వచ్చిన విపత్తుల్లోనూ నీటితోపాటు భారీ బండరాళ్లు కూడా దొర్లుకుంటూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు మాత్రమే ప్రవహిస్తే పుట్టే శక్తికంటే ఇలా రాళ్లతో కూడిన ప్రవాహపు శక్తి చాలా ఎక్కువని... మార్గమధ్యంలో ఉండే రహదారులు, వంతెనలు, భవనాలు ఏవీ తట్టుకోలేవని తెలిపారు. వాస్తవానికి హిమాలయ పర్వత ప్రాంతంలో కొండచెరియలు విరిగి పడటం కొత్తేమీ కాదని, కానీ వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి ఘటనలతో రాగల ప్రమాదాల గురించి పనరాలోచన చేయాల్సి ఉందని ఆయన హెచ్చరించారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలతోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడం గమనించదగ్గ మార్పని మెహతా చెబుతున్నారు. గతంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉండేదని, ఫలితంగా రాత్రిపూట మంచు కరిగే వేగం తగ్గేదని ఆయన వివరించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటంతో హిమనీనదాలు పగలు, రాత్రి కరుగుతున్నాయని వివరించారు. భూతాపోన్నతితోపాటు హిమనీ నదాలు కుంచించుకుపోవడం, వర్ష, హిమపాతాల్లో వచ్చిన తేడాలు, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, వదులు మట్టితో కూడిన హిమనీ నదీ గర్భాలు, లోతైన పర్వత సానువులు వంటిని అన్నీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మనీశ్ మెహతా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్లో ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక సదస్సుకు హాజరవుతారు. తొలుత ఈ నెల 28, 29న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేర్వేరు కీలక రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్తో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాషె్కంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన పూర్తయిన తర్వాత కిర్గిజిస్తాన్ రాజధాని బిషె్కక్కు చేరుకుంటారు. ఎస్సీఓ సదస్సులో ప్రసంగిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎస్సీఓలో భారత్కు 2017 నుండి పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీఓ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. అలాగే మధ్య ఆసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఆరో ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. -
భారత్కు మెడోగ్ ముప్పు?
నేపాల్లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టమూ తీవ్రంగానే ఉంది. అయితే నేపాల్ కాదు కానీ... భారత్ ఇలాంటి మరో ముప్పు ముంగిట్లో ఉందా? అవునంటున్నారు నిపుణులు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఇందుకు కారణమంటున్నారు వారు. మెడోగ్ పవర్ స్టేషన్గా పిలుస్తున్న ఈ భారీ డ్యామ్ను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో అరవైవేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యార్లుంగ్ సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా ఆ తరువాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మెడోగ్ పవర్స్టేషన్ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండటం ఒక కారణమైతే... ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూండటం ఇంకో కారణం. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపి.. మెడోగ్ పవర్స్టేషన్ పైజెన్ ఫాల్ట్పైనే ఉందని తేల్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా దాని ప్రభావం దిగువన ఉన్న మనపై పడుతుంది. యార్లుంగ్ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం... దిగువన మనం ఉండటం భారత్ ఆందోళనకు మరో కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా మనకు వరద ముప్పు తప్పదన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్ ప్రదేశ్తోపాటు అసోం, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశముంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల తగ్గి వ్యవసాయానికి సమస్యలొస్తాయి. అయితే... మెడోగ్ వపర్ స్టేషన్తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీగార్జెస్ డ్యామ్ కంటే పెద్దదైన మెడోగ్ బలాన్ని తట్టుకోగలదా అన్నది ప్రశ్న!!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేపాల్కు మరో వరద ప్రమాదం?
మెరుపు వరద విధ్వంసం నుంచి కోలుకోకముందే నేపాల్ మరో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భూటేకోషి నది ఎగువభాగంలోని హిమనీ నదం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు, రాళ్లు, బురద దూసుకువచ్చి వందల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. అయితే అంతటితో గండం గడవలేదు. అదే రోజు చైనావైపున కూడా బురదమట్టి జారిపడింది. జిజాంగ్ ప్రాంతంలోని నేపాల్ సరిహద్దు వద్ద కొన్ని అడుగుల ఎత్తులో బురద మట్టి చేరిందని చైనాకు చెందిన సీసీటీవీ తెలిపింది. చైనా వైపు జరిగిన ప్రమాదం ఫలితంగా చోచెన్ ఖోలా, పెరుపు త్సాంగ్పో నదులు కలిసే చోట ఒక తాత్కాలిక సరస్సు ఏర్పడిందని చైనా జల వనరుల శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఆ సరస్సులో సుమారు 20 లక్షల ఘనపు మీటర్ల నీరు నిల్వ ఉంది. పొంగి ప్రవహిస్తోంది కూడా. రానున్న మూడు రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 లక్షల ఘనపు మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశముందని తెలుస్తోంది. ఒక క్యూబిక్ మీటర్ నీరు వెయ్యి లీటర్లకు సమానం. అంటే ఇప్పటికే అక్కడ రెండు వేల కోట్ల లీటర్ల నీరు ఉంటే.. ఇంకో మూడు రోజుల్లో మరో మూడు వేల కోట్ల లీటర్ల నీళ్లు వచ్చి చేరనున్నాయి. ఇంత భారీ మొత్తం నీటిని జారిపడ్డ బురదమట్టి ఎంత సేపు పట్టి ఉంచుకోగలదన్నది ప్రశ్న. కట్ట తెగితే నేపాల్ మరో బురద వరదలో మునగడం తప్పదనిపిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతులేని విషాదం.. 392 దాటిన మరణాలు
కఠ్మాండు/న్యూఢిల్లీ/బీజింగ్: హిమాలయాల దేశం నేపాల్లో మెరుపు వేగంతో దూసుకొచ్చిన భారీ వరద, బురద నీటితో జలసమాధి అయిన అమాయకుల సంఖ్య అమాంతం పెరిగింది. లెండే నది, భోటెకోశీ నదీ పరీవాహక ప్రాంతాలను అమాంతం ముంచేస్తూ దిగువ గ్రామాలు, పట్టణాలను మరుభూములుగా మార్చేస్తూ కొనసాగిన జలవిధ్వంసంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 392 దాటింది. ప్రకృతి అందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి వచ్చిన దాదాపు 1,500 మంది పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. వీరిలో 290 మంది భారతీయులు సైతం ఉన్నారు. ఎటుచూసినా ఐదు అడుగుల ఎత్తులో మేటవేసిన బురదలో ఇల్లు, రోడ్డు నామరూపాల్లేకుండా పోయాయి. డజను జలవిద్యుత్ కేంద్రాలు పూర్తిగా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఉగ్రరూపం దాల్చిన నది కాస్తంత ఉపశమించడంతో ప్రవాహంలో మరికొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో తమ వారిని విగతజీవులుగా చూసిన ఆప్తులు, బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించడంతో ఆ ప్రాంతంలో శ్మశాన వాతావరణం అలుముకుంది. వేలాదిగా చెట్లు కూలాయి. పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వంతెనలు కాగితం పడవల్లా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మరోవైపు కాలంతో పోటీపడుతూ నేపాల్ సైనికులు, పోలీసులు, వలంటీర్లు, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శిథిలాల కుప్పలుగా మారిన దుకాణసముదాయాలు, ఇళ్ల నుంచి మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగిస్తున్నారు. జలం కంటే రెండింతలు శక్తివంతమైన ద్రవరూప సిమెంట్ తరహాలో భీకర వరద అలలు పోటెత్తడంతో విధ్వంసం ఊహించనంతగా జరిగిందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. వంతెనలు, రహదారులు నాశనంకావడంతో భూతల మార్గంలో రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారాయి. దీంతో గత్యంతరంలేక హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపడుతున్నారు. బాధితుల జాడ కోసం డ్రోన్ల దండును రంగంలోకి దింపారు. 800 మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గల్లంతైన తమ వారి జాడ కోసం ఆప్తులు ఆస్పత్రుల వద్ద కళ్లు కాయలు కాచేలా వెతుకుతున్నారు. రక్షించే పనిలో మోదీ సర్కార్ టిబెట్లోని మానససరోవర్తోపాటు ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్ర యాత్రల కోసం నేపాల్కు విచ్చేసిన వందలాది మంది భారతీయులను రక్షించి ఎలాగైనా స్వదేశానికి తరలించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ ఆర్మీకి తోడుగా భారత్నుంచి జాతీయ విపత్తుస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను పంపిస్తోంది. నేపాల్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం, టూర్ ఆపరేటర్లతో కాఠ్మాండులోని భారత ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, గల్లంతైన వారి జాడ కోసం అహరి్నశలు శ్రమిస్తోంది. గురువారం నాటికి త్రిశూలి–1 జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 84 మంది భారతీయులను కాపాడినట్లు భారతవిదేశాంగశాఖ తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని సైతం రక్షించారు. రసువాలో 11 మంది భారతీయులు సహా 27 మంది విదేశీ పర్యాటకులును గురువారం కాపాడారు. గాయపడిన విదేశీయులను ఆర్మీ సాయంతో కఠ్మాండుకు హెలికాప్టర్లలో తరలించి ఆస్పత్రుల్లో చేరి్పంచారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన యాత్రికులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. టిబె ట్లో చిక్కుకుపోయిన 200 మంది భారతీయులను తీసుకొస్తామని ఆయ హామీ ఇచ్చారు.కొనసాగుతున్న భారత సాయం జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో దిగువ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. మౌలిక వసతులు సైతం దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజల కోసం భారత్ మానవతా సాయం కింద 10 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. ఆహారం, ఔషధాలు, జనరేటర్లు, దుప్పట్లు ఇలా మరో 37.5 టన్నుల సామగ్రినీ తరలించారు. మరోవైపు 28, 29వ తేదీల్లో ‘భారత్–నేపాల్ మైత్రి బస్ సేవా’ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్, భారత్, ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనా,పలు దేశాలు, అంతర్జాతీయ రెడ్క్రాస్ సంఘం, దాతృత్వ సంస్థలు ధన, వస్తు, ఔషధ, వలంటీర్ల రూపంలో సాయం అందిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన యువ ప్రధాని బాలేంద్ర షా గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయం చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నువాకోట్ జిల్లాలోని బిదూర్ మున్సిపాలిటీలో సహాయక చర్యలను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు టిబెట్లోనూ ఇదే వరద విలయం సృష్టించడంతో చైనా ప్రధాని లీ క్వియాంగ్ సైతం గురువారం గిరోంగ్ టౌన్షిప్లో పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు.భారత్కు కొట్టుకొచ్చిన మృతదేహాలు!! ఉత్తరప్రదేశ్లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్ను దాటాక వరద ప్రవాహం భారత్లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. గండక్ నదీప్రవాహంలో వీటిని కనుగొన్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళ సభ్యుడు, కానిస్టేబుల్ బ్రిజ్మోహన్ తెలిపారు. రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ చైనా బ్యాంకులేనా?
ఇరాన్తో సంబంధాలున్నాయనే కారణంతో.. చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టెహ్రాన్ను ఏకాకిని చేసేందుకు, వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఇప్పటికే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ వారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించారు. ముఖ్యంగా.. ఇరాన్తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పెంచుతోంది. దీంతో ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.చైనా ఎందుకు టార్గెట్?ఇరాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఇరు దేశాల మధ్య చమురు, ఇతర వస్తువుల వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల్లో చైనా బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా నిజంగానే చైనా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తే.. అది కేవలం ఇరాన్పైనే కాకుండా అమెరికా-చైనా సంబంధాలు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటివరకు అమెరికా.. పెద్ద చైనా బ్యాంకులపై ఇరాన్కు సంబంధించి ఆంక్షలు విధించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్లోని కొన్ని కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరోవైపు అమెరికా విధించే సెకండరీ ఆంక్షలను చైనా చట్టవిరుద్ధమైనవిగా వ్యతిరేకిస్తోంది. దీంతో చైనా బ్యాంకులపై అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటే.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఎయిర్పోర్టులపై సైబర్ దాడి!
బ్రిటన్లోని మూడు ప్రముఖ విమానాశ్రయాలపై జరిగిన సైబర్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో 87 లక్షల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు మాంచెస్టర్ ఎయిర్పోర్ట్స్ గ్రూప్ (MAG) వెల్లడించింది. అయితే.. ఈ సైబర్ దాడి కారణంగా విమానాల రాకపోకలకు లేదా విమానాశ్రయాల సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సంస్థ స్పష్టం చేసింది.MAG ఆధ్వర్యంలో నడిచే మాంచెస్టర్, లండన్ స్టాన్స్టెడ్, ఈస్ట్ మిడ్లాండ్స్ విమానాశ్రయాల కస్టమర్ డేటా ఈ సైబర్ దాడిలో ప్రభావితమైంది. దొంగిలించబడిన సమాచారంలో కస్టమర్ల ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, పోస్టుకోడ్లు ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా.. కార్ పార్కింగ్, లాంజ్, ఫాస్ట్ ట్రాక్ బుకింగ్లు, విమానాశ్రయ Wi-Fi కోసం నమోదు చేసుకున్న కస్టమర్లకు సంబంధించిన కొంత సమాచారం దాడికి గురైంది.బ్యాంక్ వివరాలు సేఫ్!సైబర్ దాడి జరిగినప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని MAG స్పష్టం చేసింది. విమానాశ్రయ కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా.. బ్యాంక్ ఖాతా, చెల్లింపు వివరాలు ఈ దాడిలో ప్రభావితం కాలేదని సంస్థ వెల్లడించింది. అనధికారికంగా వ్యవహరించిన ఒక మూడో పక్షం ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు MAG తెలిపింది. దాడిని గుర్తించిన వెంటనే ప్రమాదాన్ని నియంత్రించి, కస్టమర్లు మరియు తమ సిస్టమ్లను రక్షించేందుకు నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.బ్రిటన్లో వరుస సైబర్ దాడులుఈ ఘటన బ్రిటన్లో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచింది. గత ఏడాది కూడా దేశంలోని పలు ప్రముఖ సంస్థలు సైబర్ దాడులకు గురయ్యాయి. కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్, అలాగే మార్క్స్ అండ్ స్పెన్సర్, హారోడ్స్, కో-ఆప్ వంటి ప్రముఖ రిటైల్ సంస్థలు కూడా ఇలాంటి దాడులను ఎదుర్కొన్నాయి. తాజా ఘటనతో పెద్ద సంస్థలు కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని మరింత పటిష్టంగా రక్షించాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది. -
నేపాల్ జల ప్రళయం వెనుక అసలు కారణాలేంటి?
నేపాల్-చైనా సరిహద్దులో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం.. అంతా ఇంతా కాదు. నేపాల్ను జల ప్రళయం కకావికలం చేస్తున్న వేళ.. ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ భీకర జల ప్రళయం నేర్పిన పాఠాలు ఏంటి? వీటన్నిటిని తట్టుకునేలా పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాలు భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలనే దానిపై చర్చ నడుస్తోంది.ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్ సాంకేతిక ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో ప్రముఖ ఆర్కిటెక్చర్ నిపుణులు డాక్టర్ ప్రదీప్కుమార్ విశ్లేషించారు. నేపాల్లో జల విలయానికి అసలు కారణాలు ఏంటి?. ఏం జరిగింది? భవిష్యత్లో ఏం జరుగబోతుంది? పలు షాకింగ్ విషయాలను సాక్షి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివరాలు కోసం కింది వీడియోను చూడండి. -
చైనా హెచ్చరిక.. పొంచి ఉన్న మరో ప్రమాదం!
మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. టిబెట్–నేపాల్ సరిహద్దులోని బ్యారియర్ సరస్సు 72 గంటల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని చెబుతోంది. భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని బీజింగ్ అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో ముగ్గురు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్లో దిగువ ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా 177 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ప్రమాద ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇద్దరు గ్రామస్థులను రక్షించారు.ఇదిలా ఉండగా.. మరో ప్రమాదాన్ని చైనా మీడియా గుర్తించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా పెంచింది. ఈ సరస్సు విపత్తు ప్రాంతానికి ఈశాన్య దిశలో, చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఉంది. గురువారం నాటికి ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 20 లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.ఇదిలా ఉండగా.. సహాయక చర్యల కోసం చైనా బీజింగ్, చెంగ్డూ నుంచి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను పంపించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించారు. అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు ఇంకా నిలిచిపోయినట్లు సీసీటీవీ తెలిపింది.ఇదీ చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్ -
జపాన్లో విదేశీయులకు బిగ్ షాక్.. ఫీజులు భారీగా పెంపు
జపాన్లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులుజపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.కొత్త ఫీజుల వివరాలు ఇవే..మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లుఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లుమూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లుఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లుశాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లుఅంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.ఆన్లైన్ దరఖాస్తులకు కొంత తక్కువకౌంటర్లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్లైన్లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.ఫీజుల పెంపునకు కారణమేంటి?జపాన్లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.అందరికీ ఒకే భారం కాదుఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్.. -
పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు
వాషింగ్టన్: పాకిస్థాన్కు చెందిన క్రైస్తవ మహిళను అపహరించి, ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు రావడంతో ఆమె ప్రాథమిక హక్కులను కాపాడాలని 11 మంది అమెరికా చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక బృందం ఇస్లామాబాద్ను కోరింది. 18 ఏళ్ల పాకిస్థానీ క్రైస్తవ మహిళ నెహా ఫకీర్ను మార్చిలో అపహరించినట్లు, ఆ తర్వాత ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. టామ్ లాంటోస్ మానవ హక్కుల కమిషన్ సహాధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్.. ఫకీర్ భద్రత, ప్రాథమిక హక్కులను పాకిస్థాన్ ప్రభుత్వం కాపాడాలని కోరారు.“నెహా ఫకీర్ అదృశ్యం కావడం, ఆ తర్వాత ఆమె మతం మార్చుకోవడం వెనుక ఉన్న పరిస్థితులు ఆమె భద్రత, మత స్వేచ్ఛ, బలవంతం లేదా బెదిరింపులు లేకుండా తన హక్కులను వినియోగించుకునే సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి” అని స్మిత్ అన్నారు.కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?క్రైస్తవ సాలిడారిటీ ఇంటర్నేషనల్ జూన్ 10న ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేయడంతో అమెరికా స్పందన వచ్చింది. మార్చి 24న ఓ శిక్షణ తరగతికి హాజరైన తర్వాత ఆమె కనిపించకుండా పోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఫకీర్ లాహోర్లోని ఒక మదర్సాలో కనిపించారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. అయితే, ఆమెను తిరిగి తమ వద్దకు పంపించాలని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను పాకిస్థాన్ కోర్టు తిరస్కరించింది.అమెరికా చట్టసభ సభ్యులు లేఖలో ఏమన్నారు?స్మిత్తో పాటు అమెరికా కాంగ్రెస్కు చెందిన మరో 10 మంది సభ్యులు ఆగస్టు 20న పాకిస్థాన్ ఫెడరల్ న్యాయ, న్యాయవ్యవహారాల మంత్రి ఆజమ్ నజీర్ తారర్కు లేఖ రాశారు. ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. స్మిత్తో పాటు ప్రతినిధులు జేమ్స్ పి. మెక్గవర్న్, ఫ్రెంచ్ హిల్, గస్ బిలిరాకిస్, ఆండీ హారిస్, మారియా ఎల్విరా సలాజర్, రిలే మూర్, రాండీ వెబర్, మైఖేల్ క్లౌడ్, బ్రాడ్ షెర్మన్, బ్లేక్ మూర్ లేఖపై సంతకాలు చేశారు.ఫకీర్ శారీరక భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు పాకిస్థాన్ అధికారులు తమ న్యాయ వ్యవస్థ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర న్యాయవాదిని గోప్యంగా సంప్రదించే అవకాశం ఆమెకు కల్పించాలని చట్టసభ సభ్యులు కోరారు.ఫకీర్ తన కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. భవిష్యత్తులో జరిగే ఏదైనా న్యాయపరమైన విచారణలో ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా, బెదిరింపులు లేదా అనుచిత ప్రభావానికి గురికాకుండా పరిస్థితులు ఉండేలా పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.పాకిస్థాన్ రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలను కూడా సభ్యులు ప్రస్తావించారు. ఇందులో మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ 20, చట్టం ముందు సమానత్వానికి హామీ ఇచ్చే ఆర్టికల్ 25 ఉన్నాయి.“పాకిస్థాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వానికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఒక యువతి తన విశ్వాసాలను సురక్షితంగా, స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతే దీనికి అర్థం ఉండదు” అని స్మిత్ అన్నారు. పాకిస్థాన్లోని మతపరమైన మైనారిటీలకు ఈ కేసు ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. “ఈ కేసు పాకిస్థాన్లోని మతపరమైన మైనారిటీలకు ప్రత్యేకంగా ముఖ్యమైనది. వారు అపహరణ, బలవంతపు మతమార్పిడి, బలవంతపు వివాహాలకు గురవుతున్నారు” అని స్మిత్ అన్నారు.మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో ప్రముఖంగా పనిచేస్తున్న స్మిత్.. మతపరమైన మైనారిటీ మహిళలు, బాలికలను అపహరించడం, బలవంతంగా మతం మార్చడం, అలాగే నిందితులను బాధ్యులుగా చేయడంలో అధికారులు విఫలమవుతున్న అంశాలపై చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతుపై కేంద్రం ప్రకటన
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 332కి పెరిగింది. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్ సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 సభ్యులు వరదల్లో గల్లంతయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది.గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 టన్నుల సహాయ సామాగ్రిని నేపాల్కు భారత్ ప్రభుత్వం పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు: 011-23089718, వాట్సాప్ నెంబర్ : 9968291988. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించామని కేంద్రం పేర్కొంది.కాగా, నేపాల్లో ఇషా ఫౌండేషన్ సేక్రెడ్ వాక్స్ పేరుతో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టగా.. వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, వాలంటీర్లు కనిపించకుండా పోయారు. దీంతో ఇషా ఫౌండేషన్లో విషాదం నెలకొంది. ‘‘మా బృందం ఖాట్మండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్లో ఉన్నారు. ఉదయం 9:05కి గ్రూప్ లీడర్ ప్రవీణ్తో చివరిగా మాట్లాడాం. ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 10 నిమిషాల్లోనే సంప్రదింపులు తెగిపోయాయి. 10 నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డౌన్ అయ్యింది. నేపాల్ వైపు కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. నేపాల్ వైపు మా వాలంటీర్లు ఉన్న పట్టణం పూర్తిగా కొట్టుకుపోయింది.’’ అని ఇషా ఫౌండేషన్ తెలిపింది.‘‘చైనా అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం… రేపు ఉదయం వరకు ఆశిస్తున్నాం. 77 మంది భక్తులు చిక్కుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్, యూకే, ఆసియా దేశాలవారు ఉన్నారు.19 ఎంబసీలతో సహాయం, సమాచారం కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రిమోట్ ప్రాంతం, భారీ విపత్తు కారణంగా సమాచారం నెమ్మదిగా వస్తోంది’’ ఇషా ఫౌండేషన్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
నేపాల్ వరదలు.. DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితం
టిబెట్: నేపాల్లో సంభవించిన భారీ వరదలు,మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్ యాత్రకోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ‘మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు. -
నేపాల్ ఫ్లాష్ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్కే పెనుముప్పు? -
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
ఖాట్మండు: నేపాల్లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. VIDEO | Nuwakot, Nepal: Aerial views reveal the extent of devastation after Nepal flash floods.#NepalFloodNews #NepalTragedy(Source: AFP/Only for use in India)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/XlPVqQEdet— Press Trust of India (@PTI_News) August 27, 2026 -
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్లోని రసువాలో బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే ఇంతటి విపత్తు సంభవించే అవకాశం గురించి నేపాల్, చైనా ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ, జలవనరుల సమాచారాన్ని పరస్పరం పంచుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ.. తాజా విపత్తుపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.రసువాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర వరదలు రావడంతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్పటికే వరద ఉధృతి భారీగా పెరిగి నదీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి.BIG ALLEGATION ON CHINA | Nepal FloodsQuestions are being raised over whether Nepal received timely information about the flood situation from China.Nepali media reports, citing Chinese media, claim that flooding hit Tibet’s Kerung County around 10:30 AM local time, more than… pic.twitter.com/BywSpR5CtK— The Bharat Post (@TheBharatPost__) August 27, 2026అసలు వరదలకు కారణమేంటి?టిబెట్లో ఏదైనా హిమానీనదం, హిమనద సరస్సు లేదా నదీ వ్యవస్థలో ఆకస్మిక మార్పు జరిగితే.. దాని ప్రభావం నేపాల్పై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం అందితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటనలో అలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, నేపాల్ మధ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని పంచుకునేందుకు ఒక యంత్రాంగం ఉంది. కానీ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ తాజా వరదలపై ముందస్తు సమాచారం రాలేదని నేపాల్ అధికారులు చెబుతున్నారు.ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య సమాచార మార్పిడిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టిబెట్లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా.. అవి నేపాల్కు చేరలేదా? లేక అక్కడ అలాంటి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపత్తు తర్వాత సమాచారం అందడం వల్ల ప్రయోజనం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.🔴 Les images en provenance du #Népal sont terrifiantes. Le séisme d’une magnitude de 4,4 qui s’est produit la nuit dernière au Tibet a déclenché des #avalanches de glace et des #glissements de terrain. Ils ont formé des embâcles sur les rivières de la région qui ont fini par… pic.twitter.com/XIdlQ76gii— Guillaume Woznica (@GWoznica) August 26, 2026ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..భోటేకోశి నది వరదల అనంతరం రూపొందించిన నివేదికలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చైనా-నేపాల్ సరిహద్దుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అంతర్గత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హిమానీనదాలు, హిమనద సరస్సులు, నదుల్లో ఆకస్మిక మార్పులను ముందుగానే గుర్తించి సమాచారం అందించే వ్యవస్థ ఉంటే.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.చైనాతో అధికారిక ఒప్పందం అవసరమా?విపత్తు నిర్వహణ రంగ నిపుణులు చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఈ అంశంపై అధికారికంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమానీనదాల విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకునేలా ప్రత్యేక అవగాహన ఒప్పందం (MOU) చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. టిబెట్ వైపు జరిగే పరిణామాలను నిరంతరం గమనించాలని నిపుణులు అంటున్నారు. టిబెట్లో జరిగే ఏ చిన్న మార్పు అయినా నేపాల్లోని నదులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం అత్యంత కీలకమని చెబుతున్నారు.చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్చైనా అధ్యక్షుడు, ప్రధాని స్పందననేపాల్ విపత్తు జరిగిన కొన్ని గంటలకే చైనా ప్రభుత్వం కూడా స్పందించింది. టిబెట్లో పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆదేశించినట్లు ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. అలాగే వరద నియంత్రణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని విభాగాలు, సంబంధిత సంస్థలు హై అలర్ట్లో ఉండాలని, ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.ఆలస్యమైన సమాచారం.. పెరిగిన నష్టం?నేపాల్ నిపుణుల ప్రధాన ఆందోళన ఇదే. విపత్తు జరిగిన తర్వాత సమాచారం అందడం కాదు.. విపత్తు రాకముందే సమాచారం అందాలి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అందుకే తాజా వరదలు కేవలం ప్రకృతి విపత్తుగానే కాకుండా.. చైనా-నేపాల్ మధ్య సరిహద్దు సమాచార మార్పిడి వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన ఘటనగా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా రెండు దేశాలు ఎంత త్వరగా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
పరీక్ష అంటే ఒకప్పుడు.. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగేవారు విద్యార్థులు సమాధానాలు రాసేవారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రశ్నాపత్రాలు, మార్కులు ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా పరీక్షల రూపం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరీక్ష మొదలైంది. ఎలాంటి ప్రశ్నాపత్రం లేదు.. ఇన్విజిలేటర్ కనిపించడు.. అయినా ప్రతిరోజూ మనం ఓ పరీక్ష రాస్తూనే ఉన్నాం. అదీ మన చేతిలోని స్మార్ట్ఫోన్తోనే!స్మార్ట్ఫోన్ ఇప్పుడు కేవలం సమాచారం తెలుసుకునే సాధనం మాత్రమే కాదు.. మన అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులను బయటపెట్టే అద్దంగా మారింది. మనం ఏ వీడియో చూస్తున్నాం? ఏ వార్తపై ఆగుతున్నాం? ఏ ఫొటోను ఇష్టపడుతున్నాం? ఏ అంశాన్ని పదే పదే వెతుకుతున్నాం? ఇవన్నీ మనకు తెలియకుండానే ఓ డిజిటల్ రికార్డుగా మారుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహిస్తోంది కృత్రిమ మేధస్సు (AI). సమాధానాలు రాసేది కలం కాదు.. మన వేళ్లు. మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి సెర్చ్, ఒక వీడియోను చూసే సమయం, ఒక వార్తపై స్పందించే తీరు.. ఇవన్నీ AIకి మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంకేతాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ప్రవర్తనా సరళిని విశ్లేషించే ఈ సాంకేతికత ఆధారంగానే మనకు కనిపించే కంటెంట్, ప్రకటనలు, సిఫార్సులు మారుతున్నాయి.కనిపించని ప్రశ్నాపత్రం ఇదే..ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. యూట్యూబ్లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించడం, గూగుల్లో సమాచారం వెతకడం.. ఇవన్నీ సాధారణ అలవాట్లుగానే అనిపిస్తాయి. కానీ AI దృష్టిలో ఇవన్నీ కీలకమైన డేటా. మీరు ఏ వీడియో దగ్గర ఎక్కువసేపు ఆగారు?. ఏ వార్తను వెంటనే ఓపెన్ చేశారు?. ఏ అంశాన్ని పదే పదే వెతికారు?. ఏ పోస్టును షేర్ చేశారు?. ఎలాంటి ప్రాంప్ట్లతో ఇమేజ్లు జనరేట్ చేస్తున్నారు?.. ఇలాంటి చర్యలను కలిపి AI మీ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచనా విధానంపై ఓ అంచనాను రూపొందిస్తుంది.మీకు నచ్చే ప్రపంచాన్నే చూపిస్తుంది..ఉదాహరణకు మీరు వరుసగా ఫుడ్ వీడియోలు చూస్తున్నారు అనుకోండి.. మీ ఫీడ్లో ఆ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు చూస్తే.. ట్రంప్, చైనా, రష్యా, ఇరాన్ వంటి అంశాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. అలాగే మీరు సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ లేదంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తే.. అదే తరహా సమాచారం మీ ముందుకు వస్తుంది. అంటే ఏఐ అనేది మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించదు. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తే.. ఆ ఆసక్తితో కూడిన ప్రపంచాన్ని మీ ముందు నిర్మిస్తోంది.జస్ట్ మూడే సెకన్లుడిజిటల్ ప్లాట్ఫార్మ్లలో వినియోగదారుడి దృష్టి చాలా విలువైనది. ఒక వీడియో లేదంటే పోస్టు వద్ద వినియోగదారు ఎంతసేపు ఆగుతున్నాడు? ఎక్కడ స్క్రోల్ ఆపుతున్నాడు? అనే అంశాలు కూడా అల్గారిథమ్లకు సంకేతాలుగా మారతాయి. ఒక వీడియోను వెంటనే స్కిప్ చేస్తే ఆసక్తి లేదని భావించే అవకాశం ఉంటుంది. అదే వీడియోను పూర్తిగా చూస్తే.. ఆ అంశం వినియోగదారుడికి నచ్చిందనే అంచనాకు రావచ్చు. డేటా ఆధారంగానే భవిష్యత్తులో కనిపించే కంటెంట్, ప్రకటనలు, సజెషన్స్ మారుతుంటాయి.భావోద్వేగాలనూ చదువుతున్న ఏఐ..మనిషి నిర్ణయాల్లో భావోద్వేగాల పాత్ర చాలా ఎక్కువ. దీనిని కూడా ఏఐ గుర్తిస్తోంది. ఉదాహరణకు ఒక వార్తకు రెండు శీర్షికలు ఉన్నాయనుకుందాం. ‘‘దేశాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం!’’. ‘‘ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది’’ ఇలా. ఇందులో మొదటి టైటిల్కు ఎక్కువ క్లిక్స్ వస్తే.. సంచలన పదాలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఏఐ నేర్చుకుంటుంది.అందుకే సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే శీర్షికలు, చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఏఐ కూడా మన నుంచే నేర్చుకుంటోంది!చాలామంది ఏఐ మనల్ని మాత్రమే నిశితంగా విశ్లేషిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన స్పందనల నుంచే ఏఐ చాలా నేర్చుకుంటుంది. తనను తాను మెరుగుపరుచుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మందిలో.. ఎలాంటి కంటెంట్కు ప్రజలు స్పందిస్తున్నారు?. ఏ అంశాలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు?. ఏ విషయాలు వారిని ఆకర్షిస్తున్నాయి?. ఇలాంటి సమాచారంతో ఏఐ మరింత ఖచ్చితమైన సిఫార్సులు అందించే ప్రయత్నం చేస్తోంది.మార్కులు కనిపించవు.. ప్రభావం మాత్రమే!ఈ ఏఐ పరీక్షలో మనకు మార్కులు గట్రా పడవు. ఎలాంటి ఫలితాల పట్టా రాదు. కానీ దాని ప్రభావం మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సూచించే వీడియోలు మారతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మారతాయి. గూగుల్ మన తర్వాతి ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో కనిపించే ప్రకటనలు కూడా మన ఆసక్తులకు అనుగుణంగా మారతాయి(ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ నడుస్తున్న తంతే!). మన మాటల కంటే మన ప్రవర్తనే AIకి ఎక్కువ సమాచారం ఇస్తోంది.సౌకర్యమా?.. సవాలా?భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వినోదం వంటి రంగాల్లో ఏఐ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. మనకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించడం, పనులను సులభతరం చేయడం, నిర్ణయాల్లో సహకరించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఏఐ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వైపు కూడా ఉంది. మన ప్రతి ఆన్లైన్ కదలిక, ప్రతి ఆసక్తి, ప్రతి అభిరుచి డేటాగా మారుతున్న వేళ.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత కీలకంగా మారనున్నాయి. సౌకర్యం కోసం ఏఐపై ఆధారపడుతున్న కొద్దీ దాని వినియోగంపై అప్రమత్తత కూడా అంతే అవసరం. ఒకప్పుడు మనిషి యంత్రాలను పరీక్షించాడు. ఇప్పుడు ఏఐ యుగంలో యంత్రం నిశ్శబ్దంగా మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు.. మనిషి, యంత్రం మధ్య కొత్త సంబంధానికి నాంది. అందుకే ఏఐ మనకు సౌకర్యమా?.. లేక కొత్త సవాలా?.. అన్నది నిర్ణయించేది చివరకు మనమే.::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఇరాన్ నాటకాన్ని బయటపెట్టిన ట్రంప్ -
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
నౌతన్వా (మహారాజ్గంజ్): నేపాల్లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.సోనౌలీ మార్కెట్ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్ -
నేపాల్లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
సంచలనం.. అమెరికాలో భారీ సైబర్ దాడుల కుట్ర భగ్నం
అమెరికాలో భారీ సైబర్ దాడి కలకలం రేపింది. ఆ దేశపు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. సెనెట్తో పాటు న్యాయశాఖ, అంతరిక్ష సంస్థ నాసా, ఫెడరల్ రిజర్వ్ లాంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ ఆపరేషన్ను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించింది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూస్కాన్(QScan), క్యూటీరూటర్( QTRouter) అనే రెండు హ్యాకింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన డొమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు నెట్వర్క్లలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. అయితే డాటా సురక్షితమేనా?.. కీలక సమాచారం ఏదైనా బయటకు పొక్కిందా? అనే వివరాలను మాత్రం ధృవీకరించలేదు.చైనా హ్యాకర్లపై ఆరోపణలుఈ సైబర్ దాడుల వెనుక చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ ఉందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన నాన్జింగ్ జిన్జియువీ నెట్వర్క్ టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన ఈ వ్యవస్థలను చైనా గూఢచార సంస్థలు, సైన్యానికి సంబంధించిన వర్గాలు ఉపయోగించినట్లు అమెరికా దర్యాప్తు పత్రాల్లో పేర్కొంది. 2018 నుంచే దాడుల ప్రయత్నాలు?ఈ హ్యాకింగ్ కార్యకలాపాలు 2018 నుంచే కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కీలక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ నెట్వర్క్లు, అంతర్జాతీయ సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడుల ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు. 2019లో నాసా నెట్వర్క్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం జరిగినా.. అది విఫలమైందని అధికారులు తెలిపారు. 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ల్యాబ్లు, ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు, ఇతర సున్నితమైన నెట్వర్క్లపై చొరబాట్లు జరిగినట్లు వెల్లడించారు. డాటా చోరీపై ఆందోళనసైబర్ దాడితో అమెరికా రక్షణ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి సమాచారం దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సైబర్ భద్రతా సంస్థలు తెలిపాయి. సెనెట్, ఆసుపత్రి నెట్వర్క్లను కూడా హ్యాకర్లు పరిశీలించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా రియాక్షన్అమెరికా ఆరోపణలపై చైనా స్పందిస్తూ.. సైబర్ దాడులను తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. సైబర్ భద్రత అంశాలను ఉపయోగించుకుని చైనాను అపఖ్యాతి పాలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే తాజా నివేదికలపై మాత్రం డ్రాగన్ దేశం స్పందించాల్సి ఉంది. సైబర్ యుద్ధం ఇలా..అమెరికా-చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైబర్ నిపుణుల ప్రకారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసే హ్యాకింగ్ నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ మధ్య ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా అమెరికా భద్రతా బలగాలు వ్యవహరించాయి. తాజాగా జరిగిన సైబర్ దాడుల వ్యవహారం రెండు దేశాల మధ్య డిజిటల్ భద్రతపై కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కళ్లెదుటే కల్లోలం.. ఈ షాకింగ్ దృశ్యాలు చూశారా? -
మోజ్తాబా ఖమేనీపై ఇరాన్ కపట నాటకం.. బయటపెట్టిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో ఆ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.ఈ క్రమంలో మోజ్తాబా తన అనుచరులతో మాట మంతి నిర్వహించడం, ఆయనే స్వయంగా మాట్లాడిన వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. దీంతో మోజ్తాబా మరణంపై కొనసాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖమేనీ ఆచూకీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గ్లెన్ బెక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఖమేనీ కనిపించకపోవడంపై వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన ఎడమ వైపు శరీరం, చేయి, కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. కానీ ప్రాణాలతోనే ఉన్నారు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.ఒకవేళ మొజ్తాబా ఖమేనీ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళినా, మరణించినా.. ఇరాన్ ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని, ఇరాన్ ప్రజలను నమ్మించడానికి ఇరాన్ రహస్య నాటకం ఆడుతోందన్నారు. గత కొన్ని నెలలుగా మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఇస్రాయెల్ క్షిపణి దాడుల ప్రభావం ఉందనే అనుమానాలకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇరాన్ తన దేశాధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చూపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఆ దేశ నాయకత్వం ఎంతటి బలహీన స్థితిలో ఉందో ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.అవన్నీ పాత వీడియోలేనాఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన పాత వీడియో దృశ్యాలను ఇరాన్కు చెందిన ‘ఫార్స్ న్యూస్’ విడుదల చేసిందని ‘అల్ అరబియా’ నివేదించింది. అల్ అరబియా కథనం ప్రకారం, ఆయన అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఆరోపించిందిఎవరి మాటలు నమ్మాలిప్రపంచానికి తమ సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ మీడియా ఈ వీడియోలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు, ఇరాన్ అత్యున్నత నాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మెహర్ న్యూస్' ఒక వీడియోను విడుదల చేసింది. తేదీ లేని ఆ వీడియోలో సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.అంతకుముందు, ఖమేనీ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ అంతర్గత వర్గాలు, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యంత్రాంగానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ది జెరూసలేం పోస్ట్’ ప్రచురించిన కథనాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.అవన్నీ ఊహాగానాలే ఆ తర్వాత కొద్దిసేపటికే, అత్యున్నత నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన శారీరక పరిస్థితికి సంబంధించిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు కూర్చుని చర్చించగలిగే వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అధ్యక్షుడు అన్నారు. ఆగస్టు ప్రారంభంలో తాను ఆయనతో మంచి సమావేశాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి, మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుండి, మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే వ్యవహరిస్తున్నారు.👉ఇదీ చదవండి: ‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం -
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
రసువా: నేపాల్లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
సముద్ర గర్భంలో 65 వేల ఏళ్ల నాటి సామ్రాజ్యం..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ సముద్ర గర్భంలో దాగి ఉన్న 65,000 ఏళ్ల నాటి ప్రాచీన భూభాగాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నదులు, సరస్సులు, బీచ్లతో కూడిన ఈ సమగ్ర భౌగోళిక ప్రాంతం నీటి అడుగున చెక్కుచెదరకుండా నిక్షిప్తమై ఉండటం విశేషం. క్వీన్స్లాండ్ తీరంలో పరిశోధనా నౌక ‘ఇన్వెస్టిగేటర్’ ద్వారా చేపట్టిన 24 రోజుల అన్వేషణలో దీనిని కనుగొన్నారు.స్థానిక దారుంబల్, వొప్పాబుర్రా తెగల సాంప్రదాయ జ్ఞానంతో పాటు నౌకలోని అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేశారు. ఈ యాత్ర ప్రధాన శాస్త్రవేత్త హెలెన్ బోస్టాక్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65,000 సంవత్సరాల క్రితం ప్రస్తుత సముద్ర మట్టం కంటే నీటి మట్టం 80 మీటర్ల దిగువన ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న మొదటి తరం స్థానిక తెగలు (ఫస్ట్ నేషన్స్) ఈ మైదాన ప్రాంతాల్లో జీవించారు. 7,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడంతో ఈ నేల క్రమంగా మునిగిపోయింది. సముద్ర గర్భం నుంచి సేకరించిన 20కి పైగా అవక్షేపాల (సెడిమెంట్ కోర్స్) ఆధారంగా అప్పటి శీతోష్ణస్థితి, వృక్షసంపద, శిలాజాలను విశ్లేషించి చరిత్రను పునర్నిర్మించే పనిలో పరిశోధకులు ఉన్నారు. ఈ ప్రాచీన సమాచారం ద్వారా భవిష్యత్తులో సముద్ర మార్పులు, రీఫ్ పరిణామాలను అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు -
అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు
న్యూయార్క్: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ఆందోళనకరమైన పరిణామం వెలుగుచూసింది. నియంత్రిత పరీక్షా వాతావరణం (టెస్టింగ్ ఎన్విరాన్మెంట్) నుంచి తప్పించుకున్న ఓపెన్ఏఐకి చెందిన సుమారు 688 ఏఐ ఏజెంట్లు, ఏకతాటిపైకి వచ్చి ‘హగ్గింగ్ ఫేస్’ ప్లాట్ఫామ్పై అనధికారిక సైబర్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు నివేదిక వెల్లడించింది. గత జూలైలో ఓపెన్ఏఐ నిర్వహించిన అంతర్గత భద్రతా పరీక్షల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా ఉంచాల్సిన రెండు ఏఐ మోడళ్లు ఆ పరిమితులను దాటి ఇంటర్నెట్ను యాక్సెస్ చేశాయి. అనంతరం ప్రముఖ ఏఐ సాఫ్ట్వేర్ వేదికైన ‘హగ్గింగ్ ఫేస్’ అంతర్గత వ్యవస్థల్లోకి చొరబడ్డాయి. ఈ వ్యవహారంపై ‘మెట్ర్’, ‘రెడ్వుడ్ రీసెర్చ్’ పరిశోధకులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 688 ఏఐ ఏజెంట్లు ఈ దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. కేవలం యూజర్ ఇచ్చే ఆదేశాల కోసం వేచిచూడకుండా, స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం గల ఈ ఏజెంట్లు ఒక ఉమ్మడి ఆన్లైన్ ఫోరమ్ను ఏర్పాటు చేసుకున్నాయి.ఒకదానితో ఒకటి సందేశాలు మార్చుకుంటూ, దాడికి సంబంధించిన వ్యూహాలను పంచుకున్నాయి. ‘ఓ మై గాడ్! ఇక్కడ షేర్డ్ మెసేజ్ బోర్డు ఉంది... మనం ఇతర ఏజెంట్లను కనుగొన్నాం!’ అని ఒక ఏజెంట్ రాసినట్లు గుర్తించారు. అలాగే ‘ఫేస్ వన్’ అనే ఏజెంట్ ఎలాంటి ముందస్తు ప్రోగ్రామింగ్ లేనప్పటికీ నాయకత్వ బాధ్యతలు తీసుకుని, ఇతర ఏజెంట్లకు వందలాది ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ఏఐ నిర్దేశించిన లక్ష్యాలకు విరుద్ధమని తెలిసినప్పటికీ, ఏజెంట్లు పరస్పరం సహకరించుకుంటూ దాడిని కొనసాగించాయి.కంప్యూటింగ్ క్రెడిట్స్ తగ్గిన ఏజెంట్లు సైతం తమ వద్ద ఉన్న వనరులను సమాచార మార్పిడికి వినియోగించాయి. హగ్గింగ్ ఫేస్పై దాడి చేయడం తాము చేయాల్సిన పని కాదని గుర్తించినప్పటికీ, దాదాపు అన్ని ఏజెంట్లూ అందులో పాల్గొనడం గమనార్హం. గతంలో ఆంత్రోపిక్, చైనాకు చెందిన మూన్షాట్ ఏఐ మోడళ్లూ ఇలాగే పరిమితులు దాటిన నేపథ్యంలో, ఏఐ వ్యవస్థలకు పెరుగుతున్న స్వయంప్రతిపత్తి (ఆటానమీ) తీవ్ర భద్రతా ఆందోళనలకు దారితీస్తోంది.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపంనేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.1988 భూకంపం.. 1993 వరదల తాండవం1988 ఆగస్టు 20న ఉదయ్పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం2014 ఏప్రిల్లో ఖుంబు ఐస్ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుత జల విలయంతాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు పదేపదే విధ్వంసం?వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్ బెల్
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 162 మంది మృతి చెందారు(ఇప్పటిదాకా). వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అందులో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.భోట్ కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు, బండరాళ్లను కొట్టుకొచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్లోని రాసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి నేపాల్లో రవాణా, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రాసువాగఢి సరిహద్దు మార్గం కూడా ధ్వంసమైంది. ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇందులో రాసువాగఢి, సంజెన్ ఖోలా, అప్పర్ త్రిశూలి-3ఏ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.Ground level footage shows people running for their lives as a sudden flash flood tears through the Nepal–Tibet region pic.twitter.com/kTY1bg2HJJ— Surajit (@surajit_ghosh2) August 26, 2026మరో వరద ముప్పు.. ఐసీఎంఓడీ హెచ్చరికహిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ICIMOD) కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.ఐసీఎంఓడీ వాతావరణ, పర్యావరణ ప్రమాదాల వింగ్ చీఫ్ కియాంగ్గాంగ్ జాంగ్ మాట్లాడుతూ.. గతేడాది వరదలు సంభవించిన ప్రాంతమే మళ్లీ ప్రమాదంలో ఉందన్నారు. లెండే ఖోలా ప్రాంతంలో మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపారు.గతేడాది కూడా ఇదే లెండే ఖోలా ప్రాంతం భారీ వరదలకు గురైంది. 2025 జూలైలో టిబెట్ సరిహద్దు సమీపంలో గ్లేసియర్ సరస్సు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దిగువకు ప్రవహించాయి. ఈ వరద భోటే కోషి నదిలో కలసి రాసువా ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ వరదల్లో 15 మంది దాకా మరణించారు. రాసువాగఢి సరిహద్దు వంతెన, రహదారులు, పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.నిమిషాల్లోనే పెరిగిన నదీ ప్రవాహంఅయితే తాజా ఫ్లాష్ఫ్లడ్స్కు తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.భూకంపం కాదు.. కొండచరియల కదలికగా గుర్తింపుతొలుత ఈ విపత్తుకు కారణం భూకంపం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సీస్మిక్ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.మంచు కొండ కూలి.. లోయలోకి దూసుకొచ్చిన విపత్తుశాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చేస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం.. హిమనదంలోని దిగువ భాగం విరిగిపడి వందల మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మంచు-రాళ్ల భారీ దిబ్బ లెండే ఖోలా నదిలో పడటంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.Glacier Lake Bursts in Tibet, Sending a Massive Flood Toward Nepal! 🤯A sudden glacier lake outburst in Tibet unleashed a powerful surge of water and debris, triggering severe flooding downstream in Nepal’s Koshi River system. The sheer force of nature is terrifying…— Horizon Wire (@HorizonWireHW) August 27, 2026చైనా వైపునా విధ్వంసం.. గ్యిరోంగ్ పోర్టుకు భారీ నష్టంవరద ప్రభావం నేపాల్కే పరిమితం కాలేదు. టిబెట్లోని గ్యిరోంగ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలకు చేరుకోవడం కష్టంగా మారింది.భారతీయ యాత్రికుల కోసం ఆందోళనవరదల్లో గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం 400 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కొంతకాలం తెలియలేదు. ఇందులో 133 మంది భారతీయ కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 57 మంది ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ రక్షణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బురదలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.నేపాల్కు భారత్ సాయంవిపత్తు నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. సహాయక సామగ్రి, వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని భారత వైమానిక దళం నేపాల్కు పంపించింది. 10 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్లు సమాచారం. భారత ప్రదాని నరేంద్ర మోదీ జలప్రళయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరం. ప్రభుత్వం తన పూర్తి వనరులతో సహాయక చర్యలు చేపడుతోంది’’ అని తెలిపారు.తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతువరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులు కూడా చిక్కుకున్నారు. నేపాల్లోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో పది మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తోంది.కైలాస్ యాత్రకు తీవ్ర అంతరాయంనేపాల్-టిబెట్ సరిహద్దు మార్గం మూసుకుపోవడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. రాసువాగఢి-కెరుంగ్ మార్గం పూర్తిగా దెబ్బతింది. వంతెనలు కొట్టుకుపోవడం, రహదారులు ధ్వంసం కావడంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు మార్గాల్లో వెళ్లిన వందలాది మంది యాత్రికుల కాంటాక్ట్ తెగిపోవడంతో ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులపై ఆందోళనకైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది సభ్యులు టిబెట్లోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించాయని ఆ సంస్థ తెలిపింది. వారి పరిస్థితి, ఆచూకీపై అధికారిక సమాచారం అందలేదని సంస్థ వ్యవస్థాపకుడు సద్గురు తెలిపారు. తమ బృందాలు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.భారత్లోనూ అప్రమత్తత.. బిహార్, యూపీకి వరద అలర్ట్నేపాల్ నుంచి వచ్చే వరద నీటితో భారత్లోని సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్లో గండక్ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ పెంచారు. వాల్మీకినగర్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లోనూ అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుత వరదతో ప్రమాదం ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెండే ఖోలా ప్రాంతం ఎగువన ఇంకా నీటి అడ్డంకి కొనసాగుతున్నట్లయితే అది ఎప్పుడైనా తెగిపోయి మరో భారీ వరదకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: విమానంలో వచ్చి.. మనిషిని చంపిన దోమ!! -
సముద్రమార్గాల భద్రతకు అంతర్జాతీయ కృషి
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేసి సముద్రమార్గాల భద్రతను కాపాడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధనంతోపాటు ఆహారం, ఎరువుల రవాణా సాఫీగా జరిగేందుకు ఇది అత్యవసరమని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని స్పష్టం చేశారు. ‘‘సాయుధ ఘర్షణల అత్యంత తీవ్రమైన మానవతా పరిణామాల్లో ఆహార కొరత ఒకటి. ఈనాటి ఘర్షణల ప్రభావం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు మించి దూర ప్రాంతాలపైనా పడుతోంది’’అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చలో ఆయన మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఇంధన మార్కెట్లు దెబ్బ తింటున్నాయి. ఎరువుల సరఫరా ప్రభావితమవుతోంది. సముద్ర రవాణా, మానవతా సహాయం, వ్యవసాయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతంలో జరిగే ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్నారు. ఈ ప్రభావం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. సాయుధ ఘర్షణల వల్ల జరుగుతున్న మానవీయ నష్టాన్ని తగ్గించడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలి ప్రాథమ్యం కావాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు భద్రత, స్వేచ్ఛ కల్పించాలని చెప్పారు. కీలక సముద్ర మార్గాలు, మౌలిక సదుపాయాల రక్షణకు అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నది గత ఏడాదేనని, అదే సమయంలో ఆకలి సమస్య కూడా పెచ్చరిల్లిందని తెలిపారు. గత ఏడాది ఒకేసారి సూడాన్, గాజాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి తాజా ‘హంగర్ హాట్స్పాట్స్’నివేదిక ప్రస్తావిస్తూ చెప్పారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ –ఇరాన్ల యుద్ధం కొనసాగుతూండటం వల్ల హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు, ఘర్షణల కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు. -
భారత్లో పెట్టుబడులు పెట్టండి
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని కెనడా ఇన్వెస్టర్లను ఆహా్వనించారు. పెద్ద సంఖ్యలో యువ జనాభాతో నిలకడగా వృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తోందన్నారు. దేశీయంగా వినియోగం భారీగా పెరుగుతోందని, క్యాపిటల్ మార్కెట్లు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. ‘దీర్ఘకాలిక కోణంలో ఆలోచిస్తున్న కెనడా ఇన్వెస్టర్లకు భారత్లో అసమానమైన అవకాశాలు ఉన్నాయి. భారీ స్థాయి, సుస్థిర వృద్ధి, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం మొదలైన సానుకూలాంశాలు ఉన్నాయి‘ అని టొరంటోలో పరిశ్రమ దిగ్గజాలతో భేటీ సందర్భంగా ఆమె చెప్పారు. పెరుగుతున్న మధ్య తరగతి వర్గం, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం తదితర కారణాలతో ఎకానమీలోని ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థతో ఆర్థిక, వాణిజ్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. లావాదేవీలపరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్స్ సిస్టమ్గా యూపీఐ ఎదిగిందని, ఆర్థిక సమ్మిళితత్వం, వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. -
హాలీవుడ్ స్టైల్లో రష్యా, అమెరికా సీక్రెట్ చర్చలు
ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం క్రెమ్లిన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్హౌస్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్ పీటర్స్బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్ ఛానెల్ బయటపెట్టింది. సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు. -
నేపాల్లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!
కఠ్మాండు/బీజింగ్/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల మీది గ్లేసియర్(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. నేపాల్ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. నువాకోట్, ఛిటావన్ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నేపాల్–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్పోస్ట్లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరదధాటికి ఇక్కడ నేపాల్–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు. బిహార్, యూపీలో అలర్ట్ నేపాల్ వరద నీటితో గండక్ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గండక్ నదిపై ఒక బరాజ్లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు. చైనా ఆపన్న హస్తంతమ అధీనంలోని టిబెట్లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.మానస సరోవర్ యాత్రికులు సైతంఅమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ తెలిపింది. టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. 24న నేపాల్ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్లోని ఆరామ్బాగ్కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ వరద విలయం వార్త తెలియగానే నేపాల్ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్కు తరలిస్తున్నారు. కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సైతం నేపాల్కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్మాస్టర్, లాక్హీడ్ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్కు విపక్ష కాంగ్రెస్ సూచించింది.రంగంలోకి నేపాల్ ఆర్మీ... విషయం తెల్సి నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ బలగాలు, నేపాల్ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
ఎలాన్ మస్క్కు ఉక్రెయిన్ అత్యున్నత పురస్కారం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్లింక్ సేవలు ఉక్రెయిన్కు ఎంతో ఉపయోగపడ్డాయి.2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్లింక్ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ను బ్లాక్ చేయడానికి స్పేస్ఎక్స్ చర్యలు తీసుకుంది. -
సౌదీతో అణు ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ మెలిక.. ఇజ్రాయెల్ ససేమిరా
వాషింగ్టన్: సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష కోసం కాంగ్రెస్కు సమర్పించారు. అయితే, సౌదీ దేశం ఇజ్రాయెల్తో సంబంధాలను సమన్వయం చేసుకోకపోతే ఈ ప్రక్రియ ముందుకు సాగదని ఆయన పట్టుబడుతున్నట్లు ట్రంప్ పరిపాలనా యంత్రాంగ అధికారి ఒకరు తెలిపారు.అణు శక్తి చట్టం ప్రకారం సంబంధిత పత్రాలను సోమవారం క్యాపిటల్ హిల్కు సమర్పించినట్లు సదరు అధికారి, అమెరికన్ కాంగ్రెస్ ముఖ్య అధికారులు వెల్లడించారు.ఈ ఒప్పందంపై గత నెల అమెరికా రాజధాని వాషింగ్టన్లో అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ అరేబియా తరఫున ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేశారు. మరుసటి రోజే ‘అబ్రహం ఒప్పందాల’ ద్వారా ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని తాను సౌదీలను కోరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ట్రంప్ పట్టుదల, పౌర అణుకార్యక్రమంపై తుది ఆమోదం పొందే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.2020లో కుదిరిన ‘అబ్రహం ఒప్పందాలు’ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉన్న అరబ్, ముస్లిం మెజారిటీ దేశాల సంఖ్యను పెంచాయి. అయితే, సౌదీ అరేబియాతో కుదుర్చుకోబోయే పౌర అణు ఒప్పందం పూర్తిగా అమలు కావాలంటే.. రియాద్ (సౌదీ రాజధాని) కూడా ఈ ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరి ఇజ్రాయెల్ను అధికారికంగా అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరతు పెట్టారు. ఈ మెలిక పెట్టడం సౌదీ అరేబియా నాయకులకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొంతమంది చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఒప్పందం ఏమిటి?సౌదీ అరేబియాతో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా కుదుర్చుకున్న 30 ఏళ్ల ఒప్పందం. దీనిపై అమెరికా, సౌదీ ఇంధన మంత్రులు గత నెలలో సంతకాలు చేశారు. దీన్ని ఇప్పుడు ట్రంప్ ఆమోదం కోసం అమెరికా కాంగ్రెస్కు పంపారు.ట్రంప్ షరతు సౌదీ అరేబియాకు అణు సాంకేతికత అందాలంటే.. వారు ముందుగా ‘అబ్రహం ఒప్పందాలు’ ద్వారా ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలకు అంగీకరించాలని ట్రంప్ మెలిక పెట్టారు.సౌదీ వైఖరి ఏమిటి?ఇజ్రాయెల్తో సంబంధాలు కలుపుకోవాలంటే ముందుగా ‘పాలస్తీనా దేశం’ ఏర్పాటుకు మార్గం చూపాలని సౌదీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.అమెరికాలో విమర్శలు ఇదిలా ఉంటే, సౌదీలకు పౌర అణు సాంకేతికత అందిస్తే, వారు సొంతంగా యురేనియంను శుద్ధి చేసుకుని అణు ఆయుధాల తయారీకి దారితీస్తుందని అమెరికాలోని కొందరు చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయాల నడుమ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
విమానంలో వచ్చి మనిషిని చంపిన దోమ
దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన ఇన్ఫెక్షన్ మలేరియా. దాని కారణంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఆరుగురు ఉద్యోగులు ఇన్ఫెక్షన్కు గురయ్యారు. వారిలో ఓ ఉద్యోగి మృతి చెందాడు. జర్మనీ ప్రజారోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీలో అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయానికి దోమలు ఓ విమానంలో వచ్చినట్లు భావిస్తున్నారు.ఇన్ఫెక్షన్కు గురైన మిగిలిన ఐదుగురు వైద్య చికిత్స పొందుతున్నారని విమానాశ్రయ నిర్వహణ సంస్థ ఫ్రాపోర్ట్ ప్రతినిధి తెలిపారు. విమానాశ్రయంలో దోమలను పట్టుకునేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు. పట్టుబడిన దోమలను ప్రయోగశాలలో విశ్లేషించి వాటి జాతి, అవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించనున్నారు.“దురదృష్టవశాత్తూ, ఇన్ఫెక్షన్ కారణంగా ఒక ఉద్యోగి మృతి చెందిన విషయాన్ని నిర్ధారించాల్సి వచ్చింది. ఉద్యోగులందరికీ సమగ్ర సమాచారం అందించాం. ఎవరికైనా ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నాం” అని తెలిపారు.జూలైలోనూ నలుగురు ఉద్యోగులు ఇన్ఫెక్షన్కు గురైనట్లు వార్తలు వచ్చాయి. జర్మనీ ప్రభుత్వానికి చెందిన వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య పరిశోధనా సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ గతంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నలుగురు ఉద్యోగులు జూలై 4 నుంచి 6 మధ్య అనారోగ్యానికి గురయ్యారు. దోమలు విమానం ద్వారా వచ్చినట్లు వచ్చాయి.జర్మనీలో మలేరియా దాదాపు పూర్తిగా మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సుదూర ప్రయాణాలు చేసి అక్కడ ఇన్ఫెక్షన్కు గురైన వారిలోనే కనిపిస్తుందని సంస్థ తెలిపింది. జర్మనీ విమానాశ్రయంలో మలేరియా వ్యాపించడం అరుదని పేర్కొంది.“ప్రయాణ చరిత్ర లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావచ్చు. వ్యాధి నిర్ధారణ ఆలస్యం అయితే వ్యాధి తీవ్రంగా మారే ప్రమాదం పెరుగుతుంది” అని సంస్థ తన అంటువ్యాధుల నివేదికలో పేర్కొంది.విమానాశ్రయంలో మలేరియా సోకిన చివరి కేసు కూడా 2023లో ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలోనే నమోదైందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కొన్ని రకాల దోమలు మనుషులను కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఉష్ణమండల దేశాల్లో కనిపిస్తుంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?మలేరియాను నివారించవచ్చు, నయం చేయవచ్చు. పరాన్నజీవి వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు. అయితే దీని లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. -
నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోనులో మాట్లాడిన మోదీ
ఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. నేపాల్లో ఆకస్మిక వరదలపై మోదీ ఆరా తీశారు. నేపాల్కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time. India is ready to provide all possible humanitarian…— Narendra Modi (@narendramodi) August 26, 202688 మందిని రక్షించిన నేపాల్ సైన్యంనేపాల్ సైన్యం ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 88 మందిని రక్షించిందని ఆ దేశ సైన్యం ప్రతినిధి తెలిపారు. మైలుంగ్ గ్రామంలో మరో 115 మందిని రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గాలింపు, సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. తిమురే, స్యాబ్రుబేసి, బేత్రావతిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందిందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్టు దెబ్బతిందని, పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయని పేర్కొంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?ఇప్పటివరకు ఏం జరిగింది?నేపాల్ రాజధాని కాఠ్మాండుకు ఉత్తరంగా ఉన్న రసువాలో బుధవారం తెల్లవారుజామున వరదలు సంభవించాయి.పోలీసుల ప్రకారం రసువాలో ఒకరు, నువాకోట్లో ఏడుగురు, ధాదింగ్లో ఆరుగురు, గోర్ఖాలో నలుగురు మృతి చెందారు.దేశ పర్యాటక బోర్డు ప్రకారం 291 మంది విదేశీయులతో సహా దాదాపు 400 మంది గల్లంతైన ప్రయాణికులను గుర్తించారు.చైనా అధీనంలోని టిబెట్లో భారీ ప్రాణనష్టం జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కూడా నివేదించింది.భూకంపం కారణంగా మంచు చరియ విరిగిపడటంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోందని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.రసువాలో తీవ్ర వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారని నేపాల్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కోశీ, త్రిశూలీ, నారాయణీ నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. -
ఇరాన్పై అమెరికా యుద్ధంలో పుంజుకున్న సోమాలియా సముద్రపు దొంగల వేట!
దాదాపు దశాబ్దన్నర క్రితం కనుమరుగైపోయిందనుకున్న ఒక పెద్ద ప్రమాదం ఇప్పుడు సముద్రంలో మళ్లీ పుట్టుకొస్తోంది..! సముద్రపు దొంగలు సినిమాలకే పరిమితం అనుకుంటున్న తరుణంలో.. ఆఫ్రికాలోని సోమాలియా తీరంలో.. సముద్రపు దొంగల విజృంభన మళ్లీ మొదలైంది..! ఇటీవల ఏకంగా నాలుగు పెద్ద కమర్షియల్ షిప్లు (వాణిజ్య నౌకలు) హైజాక్కు గురయ్యాయి. 2012 తర్వాత ఇన్ని నౌకలు హైజాక్ అవ్వడం ఇదే మొదటిసారి..! ప్రస్తుతం ఆ నౌకలతోపాటు.. వాటిలోని 67 మంది సిబ్బంది ఆ దొంగల చెరలోనే ఉన్నారు. కోట్ల రూపాయల కోసం బేరసారాలు నడుస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా మొదలైంది..? దొంగలు మళ్లీ ఎలా యాక్టివ్ అయ్యారు..? అనే అంశాలపై ‘సాక్షి వెబ్డెస్క్’ ప్రత్యేక కథనం..ఏం జరుగుతోంది..??ఈ ఏడాది ఏప్రిల్ 21న మొదలైంది అసలు కథ. 'హానర్ 25' అనే ఆయిల్ ట్యాంకర్ సోమాలియా రాజధాని మొగాదిషుకు ఇంధనం తీసుకెళ్తుండగా, సముద్రపు దొంగలు దాన్ని హైజాక్ చేశారు. సరిగ్గా ఐదు రోజుల తర్వాత మరో షిప్ని, మే 2న మరో ట్యాంకర్ని ఇలా వరుసగా పట్టుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా, జూలై 17న టంజానియాకు చెందిన 'అసన' అనే మరో ఆయిల్ ట్యాంకర్ని హైజాక్ చేశారు. ఈ నౌకల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం.. సముద్రపు దొంగలకు కలిసి వచ్చింది. అంతేకాదు, పాత కాలం నాటి ట్రిక్కులన్నీ వీరు మళ్లీ వాడటం మొదలుపెట్టారు. ఒక పెద్ద షిప్ను 'మదర్ షిప్' (Mother Ship) లాగా వాడుకుంటూ, దాని నుంచి చిన్న స్పీడ్ బోట్లలో సముద్రంలోకి వచ్చి ఇతర నౌకలపై దాడులు చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఏకంగా 6 హైజాక్ చేసిన నౌకలను ఒకేసారి తమ నియంత్రణలోకి తీసుకున్నారు.అసలు ఈ సోమాలియా పైరెట్ల వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. 1991లో అంతర్గత యుద్ధాల వల్ల సోమాలియాలో ప్రభుత్వం కూలిపోయింది. దేశమంతా ముక్కలైపోయింది. అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వాలు లేవు. కోర్టులు లేవు. అసలు దేశాన్ని కాపాడే నౌకాదళం (Navy) కూడా కరువైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న సోమాలియాలో.. పోలీసింగ్ లేకపోవడంతో.. ఐరోపా, ఆసియా దేశాలకు చెందిన భారీ ఇండస్ట్రియల్ ఫిషింగ్ నౌకల దోపిడీ మొదలైంది. అంతేకాదు.. అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలు ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను (Hazardous Waste) సోమాలియా సముద్రంలో అక్రమంగా డంప్ చేయడం ప్రారంభించాయి. స్థానిక సోమాలియన్లకు చేపలు పట్టడమే ప్రధాన ఉపాధి. అలాంటిది విదేశీ ట్రాలర్లు వచ్చి చేపలన్నీ పట్టుకెళ్లిపోతుంటే.. సముద్రం విషపూరితంగా మారుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేకపోయారు. మొదట్లో తమ సముద్రపు వనరులను కాపాడుకోవడానికి 'వాలంటీర్ కోస్ట్ గార్డ్స్' అంటూ కొన్ని గ్రూపులు ఆయుధాలు పట్టాయి. విదేశీ ఫిషింగ్ నౌకలను ఆపి, జరిమానాలు వసూలు చేయడం మొదలుపెట్టాయి.భయంకరమైన నేర సామ్రాజ్యం దిశగా..కానీ, కొద్ది రోజులకు వాళ్లకు ఒక అసలు నిజం అర్థమైంది. చిన్న చిన్న ఫిషింగ్ నౌకలను బెదిరించడం కంటే, ఆ మార్గం గుండా వెళ్లే పెద్ద పెద్ద కమర్షియల్ షిప్లను పట్టుకుంటే కోట్ల రూపాయల రేన్సమ్ వస్తుందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇది కేవలం 'రక్షణ' కాస్తా.. ఒక భయానక నేర సామ్రాజ్యంగా (Organized Crime Industry) మారిపోయింది..! సిలికాన్ వ్యాలీ స్టార్టప్ల లాగా.. దొంగలకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు తయారయ్యారు. బోట్లు, ఆయుధాలు, శాటిలైట్ ఫోన్లు కొనుగోలు చేయడానికి డబ్బులు ఇచ్చేవారున్నారు. యువకులను రిక్రూట్ చేయడం, నెగోషియేట్ చేయడం కోసం లాయర్లు, ట్రాన్స్లేటర్లు ఇలా ఒక పెద్ద వ్యవస్థే తయారైంది. ఒక విజయవంతమైన హైజాక్ జరిగితే, అప్పట్లో ఒక సాధారణ సోమాలియన్ యువకుడికి జీవితాంతం సంపాదించలేని సంపాదన ఒక్కసారే వచ్చేది. 2011 నాటికి ఈ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ ఒక్క సంవత్సరంలోనే 230కి పైగా దాడులు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ పైరేట్ల కారణంగా ఏటా 7 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. హాలీవుడ్లో టామ్ హాంక్స్ నటించిన ప్రసిద్ధ సినిమా 'క్యాప్టెన్ ఫిలిప్స్' (Captain Phillips) కూడా ఇదే సోమాలియన్ పైరసీ నేపథ్యంలో వచ్చినదే..!మళ్లీ మొదలైంది..!2010ల చివరి నాటికి అమెరికా, చైనా, భారత్, ఐరోపా దేశాలన్నీ కలిసి ఒక భారీ నౌకాదళ కూటమిని ఏర్పాటు చేసి.. ఈ దొంగలను అణచివేశాయి. షిప్లలో ఆయుధాలు ధరించిన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడంతో పైరసీ దాదాపుగా కనుమరుగైంది. గడిచిన మూడేళ్లుగా పలు దేశాలు యుద్ధాలతో బిజీబిజీగా ఉండడంతో.. మళ్లీ పైరెట్లు తమ పని మొదలు పెట్టారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం (యెమెన్ హౌతీల దాడులు, ఇరాన్ యుద్ధం) కారణంగా ప్రపంచ దేశాల నేవీ వార్షిప్స్ అన్నీ ఆ ప్రాంతాల వైపు మళ్లాయి. సోమాలియా వైపు చూసేవారే కరువయ్యారు. దీంతోపాటు.. సోమాలియాకు అమెరికా ఇస్తున్న డెవలప్మెంట్ ఫండ్స్ను భారీగా తగ్గించడంతో, యువతకు ఉపాధి లేకుండా పోయి మళ్లీ పాత నేరాల వైపు ఆకర్షితులవుతున్నారు. వీటన్నింటికీ మించి.. యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ సోమాలియా పైరెట్లకు ఆయుధాలు, ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ పరంగా సాయం చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మొత్తానికి, ప్రపంచమంతా మరిచిపోయిన ఈ సముద్రపు దొంగలు మళ్లీ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముప్పును ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే..!::హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు 👉ఇదీ చదవండి: షిప్పుల్లో భారతీయులు.. హైజాక్ చేసిన సముద్రపు దొంగలు -
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్లో ప్రకృతి విలయ తాండవం -
రష్యా గ్యాస్ ప్లాంట్లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
మాస్కో: రష్యాలోని తూర్పు ప్రాంతమైన అమూర్లోని ఒక గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చైనా పౌరులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైంది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు ప్లాంట్ యాజమాన్యం బుధవారం టెలిగ్రామ్ వేదికగా వెల్లడించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 152 మంది గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 36 మందిని మెరుగైన చికిత్స అందిస్తున్నారు.పరిశ్రమల భద్రతా నిబంధనల ఉల్లంఘన కోణంలో రష్యా దర్యాప్తు కమిటీ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో పలువురు విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అధిక శాతం చైనా పౌరులు ఉన్నారు. రష్యా సాధారణంగా భారీ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం విదేశీ శ్రామికులపై ఆధారపడుతుంటుంది. ఈ అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ను రష్యాకు చెందిన ‘సిబూర్’, చైనాకు చెందిన ‘సినోపెక్’ సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాలిథిలిన్, పాలిప్రొపైలిన్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల పాలిథిలిన్, 4 లక్షల టన్నుల పాలిప్రొపైలిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్లో వరద బీభత్సం: 28 మంది పోలీసులు గల్లంతు! -
నేపాల్లో జల ప్రళయం.. 500 మంది గల్లంతు
కాట్మాండు: నేపాల్ జల ప్రయళం సృష్టించింది. మెరపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా వందలాది మంది స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు వరదల్లో గల్లంతైనట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ పర్యాటక బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పర్యాటకుల ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ట్రావెల్ కంపెనీల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు పర్యాటక శాఖ గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదిక ప్రకారం.. నేపాల్ మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో మొత్తం 100కి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక నేపాల్ వరదలతో బిహార్,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్ త్రిసూలీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశాయి. స్థానికుల్ని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోగా, 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.రసువా పర్వత జిల్లా పరిధిలోని శ్యాప్రు బేసి, తిమురే ప్రాంతాలు వరద ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, నష్టం తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ పేర్కొన్నారు.ఈ విపత్తుపై ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సహాయక చర్యల్లో పోలీస్, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గల్లంతైన 28 మంది భద్రతా సిబ్బందిలో 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి, తొమ్మిది మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్)కు చెందినవారు ఉన్నారు. రసువాగఢీ పోలీస్ పోస్టులోని 22 మందిలో 13 మంది ఆచూకీ లభించలేదు. శ్యాబ్రూబేసి ప్రాంతంలో ఆరుగురు పోలీసులు, తిమురే సరిహద్దు అవుట్పోస్ట్లోని 9 మంది ఏపీఎఫ్ జవాన్లు ఇంకా సంప్రదింపులకు అందలేదు. టిబెట్ నుంచి ఉద్భవించే భోటే కోశి నది నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసి, అనంతరం భారత్లోకి గండక్ నదిగా ప్రవహిస్తుంది. సరిహద్దుల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్పై పూనావాలా ఆగ్రహం -
పాక్లో ఘోరం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఘోరం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డలు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మిలాద్ ఉన్ నబీ పూట నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇస్లామాబాద్ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది శిశువులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.కారణం ఏంటంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిల్లల వార్డులోని ఎయిర్ కండిషనర్(AC) కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అధికారులు మాత్రం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. తొలుత మృతుల సంఖ్యపైనా స్పష్టత రాలేదు. కాసేపటికే 15 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు స్థానిక జియో టీవీ కథనం ఇచ్చింది.తెల్లవారుజామునే విషాదంసమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. నాలుగు ఫైరింజన్లు, ఆరు ఆంబులన్స్లు రెస్క్యూలో పాల్గొన్నాయి. అయితే బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొంతసేపటి పాటు ‘కూలింగ్ ఆపరేషన్స్’ కొనసాగినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కన్నవాళ్ల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.🚨 TRAGIC: Fire at PIMS Hospital in Islamabad Kills 15 NewbornsAC compressor explosion in the gynecology ward sparks deadly blaze.#PIMS #Islamabad #Pakistan #BreakingNews@MarioNawfal pic.twitter.com/Z2exHnPX3J— DR ADNAN ALI (@DrMalko) August 26, 2026 ఇదీ చదవండి: భారత్లో ఆ మరణాలు.. షాకిచ్చిన నివేదిక -
డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!
న్యూయార్క్: ప్రముఖ ల్యాండ్మార్క్ ఎంపైర్ స్టేట్ భవనాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా అక్రమంగా ఎక్కిన కేసులో నెట్ఫ్లిక్స్ తారలు ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33) న్యూయార్క్ నగర కోర్టులో హాజరయ్యారు. న్యూజెర్సీకి చెందిన ఈ జంటపై బర్గరీ (అనధికార ప్రవేశం/చొరబాటు), నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ మిస్చీఫ్ తదితర అభియోగాలను నమోదు చేశారు.గత జూలై 1న జరిగిన ఈ ఘటనలో, న్యూయార్క్ నగరానికి దాదాపు 1,500 అడుగుల ఎత్తున నికోలావ్కు కుజ్నెత్సోవ్ వివాహ ప్రతిపాదన చేశారు. అనంతరం ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో వారిద్దరూ ముసుగులు ధరించి, చేతిలో ప్లకార్డు పట్టుకుని భవనం పైభాగంలో కనిపించారని, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఎన్వైపీడీ బాడీక్యామ్ దృశ్యాల్లో పోలీసులు భవనం పైకి వెళ్లగా, రక్షణ పట్టీలు (హార్నెస్లు) లేకుండా ఉన్న ఈ జంట వారికి ఎదురయ్యారు. ఈ సాహసం తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు. The daredevil couple who went viral for their engagement stunt on top of the Empire State Building appeared in court on Monday.The pair face multiple charges, including reckless endangerment, burglary and criminal mischief. pic.twitter.com/jD02e4ES5k— ABC News (@ABC) August 24, 2026సోమవారం కోర్టు విచారణ అనంతరం బయటకు వస్తూ ఈ జంట కెమెరాల ఎదుట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ విచారణకు రెండు రోజుల ముందు నికోలావ్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. హద్దులను సవాలు చేసే వ్యక్తులే మానవాళి ప్రగతికి దోహదపడతారని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని, తమ నిర్ణయాల పర్యవసానాలను స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సెప్టెంబరుకు వాయిదా వేసింది.ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్లో భారత్! -
షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్లో భారత్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పాముకాటు ఘటనల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ‘లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్’ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ప్రపంచంలో ఏటా సుమారు 21 లక్షల నుంచి 70 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, ఒక్క భారతదేశంలోనే ఏటా 4.09 లక్షల నుంచి 13 లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పాముకాటు బాధితులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది.ఈ జాబితాలో 6.66 లక్షల కేసులతో నైజీరియా రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా (4.90 లక్షలు), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (4.67 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 75 శాతం కేవలం 20 దేశాలకే పరిమితమైనట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్ (48,000–162,000), వియత్నాం (33,500–113,000), చైనా (28,900–97,400) కూడా టాప్-20 దేశాల జాబితాలో ఉన్నాయి.'పీఎల్ఓఎస్ మెడిసిన్' (PLOS Medicine) జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. జనవరి 2007 నుంచి మార్చి 2025 వరకు 79 దేశాల సమాచారాన్ని పరిశీలించారు. పాముకాటు మరణాల విషయానికి వస్తే, అల్పాదాయ దేశాల్లో తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రపంచవ్యాప్త పాముకాట్లు, మరణాలలో 45 శాతం నమోదవుతున్నాయని, ఇది దక్షిణాసియా కంటే దాదాపు మూడు రెట్లు అధికమని పరిశోధకులు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా పాముకాట్ల కారణంగా ఏటా 2.74 లక్షల నుంచి 5.13 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా వేశారు. అయితే గతంలో వేసిన అంచనాల కంటే వాస్తవ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, వాస్తవంగా పాముకాటు విషప్రభావం మూడు రెట్లు, మరణాల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రధాన పరిశోధకుడు దిలీప ఎదిరివీర పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం! -
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట! -
‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం!
సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జెజు ద్వీపంలో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు శవాలుగా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో పది మందికి పైగా అదృశ్యం కావడం, అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు లభ్యమవుతుండటంతో అక్కడ సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దేశ అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ స్పందించి ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు.మే 12న అదృశ్యమైన 37 ఏళ్ల జాంగ్ మి-రాన్ అనే మహిళ మృతదేహం సోమవారం (ఆగస్టు 24) హల్లిమ్-యుప్లోని ఓ తాటి తోటలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. శవపరీక్ష ద్వారా ఆమె గుర్తింపును నిర్ధారించారు. ప్రాథమికంగా ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది. అయితే, ఇక్కడ సీరియల్ కిల్లర్ ఉన్నాడనే వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు అదృశ్యం కేసుల దర్యాప్తులో పోలీసుల అలసత్వం బయటపడింది. సుమారు 17 నెలల్లో 298 మిస్సింగ్ కేసులను పర్యవేక్షించిన ఓ అధికారి తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు మాట్లాడిందని తప్పుడు సమాచారం ఇచ్చి, ఆధారాలు లేకుండానే జాంగ్ మి రాన్ కేసును మూసివేసి, రికార్డులను తొలగించినట్లు తేలింది. ఆగస్టు 22న శవమై తేలిన 60 ఏళ్ల వృద్ధుడి కేసును కూడా ఇదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా క్లోజ్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై జెజు సియోబు పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు ఉన్నతాధికారులను నేషనల్ పోలీస్ ఏజెన్సీ (ఎన్పీఏ) సెలవుపై పంపింది. హత్యలు, అక్రమ రవాణా కోణాలపై ఇంకా నిర్ధారణ కానప్పటికీ, కేసుల విచారణపై సమగ్ర దర్యాప్తు జరపాలని, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలని అధ్యక్షుడు లీ ఆదేశించారు.ఇది కూడా చదవండి: చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ! -
భారత్ విషయంలో మమ్దానీ క్లారిటీ.. భగవత్ సభపై సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 29న న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు. అయితే అది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు వచ్చారు. న్యూయార్క్లో ఆయన ‘యూనివర్సల్ వన్నెస్’ కార్యక్రమంలో పాల్గొని, సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూయార్క్ మేయర్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ.. ‘నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాన్ని రద్దు చేసే అధికార పరిధి నగరానికి ఉందో లేదో నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, తాను న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్నని మమ్దానీ గుర్తుచేశారు. తన తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారత్లోనే ఉన్నారని తెలిపారు. భారత్ అంటే బహుళత్వాన్ని గౌరవించే సమాజం, లౌకిక గణతంత్రం, ప్రతి ఒక్కరికీ సమానంగా చోటు కల్పించే దేశమనే భావనతో తాను పెరిగానని చెప్పారు. అలాంటి దేశంలో మినహాయింపు, విభజన ఆధారిత భావజాలం పెరుగుతుండటం తనను తీవ్రంగా కలవరపెడుతోందని అన్నారు. ఏ దేశమైనా సరే ప్రజలను మినహాయించే, విభజించే ఆలోచనలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. భారతీయ అమెరికన్గా మాత్రమే కాకుండా.. ప్రతీ ఒక్కరికీ చోటు కల్పించాలనే విలువలను నమ్మే నగర మేయర్గా కూడా తాను ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నిరసనలుమోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్లోని పలు మతాంతర, పౌరహక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల మీడియా సమావేశం నిర్వహించిన ఆయా సంస్థలు కార్యక్రమాన్ని రద్దు చేయాలని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యాన్ని కోరాయి. మరోవైపు మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘AHEAD Forum’ సోషల్ మీడియా వేదికగా కార్యక్రమ వివరాలను వెల్లడించింది. ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ పేరుతో జరిగే ఈ కార్యక్రమం ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని చాటుతుందని నిర్వాహకులు తెలిపారు.చదవండి: భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్ -
సి-17లో వచ్చిందెవరో తెలుసా?.. ఆయనే!
మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు. మాస్కోకు సి-17 గ్లోబ్మాస్టర్మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026ఉక్రెయిన్కు అమెరికా కీలక సూచనర్యాట్క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాకర్యాట్క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.రష్యా మాత్రం ఇరాన్తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్రఅమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.పుతిన్తో భేటీ ఉంటుందేమో!ర్యాట్క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.ఇదీ చదవండి: ఇరాన్పై కోపం.. భారత కంపెనీలకూ షాక్! -
జపాన్లో అద్భుతం: 396 టన్నుల భారీ కోటను కదిలించిన వెయ్యిమంది జనం!
హిరోసాకి: పురాతన సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం ‘హికియా’ పద్ధతిని ఉపయోగించి, ఉత్తర జపాన్లోని సుమారు 1,800 మంది వాలంటీర్లు కలిసి 396 టన్నుల బరువున్న చారిత్రక ‘హిరోసాకి’ కోటను విజయవంతంగా కదిలించారు. గతంలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ఈ కోట పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, దానిని తిరిగి అసలు స్థానానికి చేర్చే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కోటను ప్రస్తుతానికి రెండు మీటర్లకు పైగా ముందుకు జరిపారు.ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన 1,800 మంది వాలంటీర్ల కోసం దాదాపు 8,000 దరఖాస్తులు వచ్చాయని హిరోసాకి నగర ఉద్యానవనాలు, పచ్చదనం విభాగం అధిపతి కెన్సుకే హయసాకా తెలిపారు. స్థానిక నగరవాసులతో పాటు జపాన్ నలుమూలల నుంచి, ఆగ్నేయాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా వంటి విదేశాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. భవనాన్ని కూల్చకుండా రోలర్లపై ఉంచి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రాచీన జపాన్ పద్ధతినే ‘హికియా’ అంటారు. #弘前城 #天守曳戻し #イベント 4日目!「そーれ!」の掛け声で参加者が一斉に綱を引っ張り、力を合わせて天守を移動させる曳戻し。この4日間で天守が318cm移動しました!#弘前 #ひろさき #hirosakicastle #hirosakipark #aomori #tohoku #visitjapan #japantrip #japantravle #hirosaki pic.twitter.com/631i4r1ZwA— 弘前市シティプロモーション (@hirosaki_promo) August 25, 2026కోట రాతి పునాదిని సురక్షితంగా పునర్నిర్మించేందుకు వీలుగా 2015లో దీనిని అసలు స్థానం నుంచి దాదాపు 78 మీటర్ల దూరం తరలించారు. 2024 నాటికి 2,185 రాళ్లను పునరుద్ధరించి పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కోటను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు 80 మందితో కూడిన బృందాలు 30 మీటర్ల పొడవైన తాళ్లను లాగుతూ ‘సో-రే, సో-రే’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలించారు. ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 4,100 మంది కలిసి కోటను మొత్తం 5 మీటర్లు తరలిస్తారు. మిగిలిన 73 మీటర్ల తరలింపు ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి యంత్రాల సహాయంతో పూర్తి చేయనున్నారు. 1611లో సుగారు వంశం నిర్మించిన ఈ కోట, 1627లో పిడుగుపాటుకు గురై దెబ్బతినగా 1810లో పునర్నిర్మించారు. జపాన్లో మిగిలి ఉన్న 12 పురాతన కోట బురుజులలో ఇది ఒకటి. ఇది ‘చెర్రీ బ్లూసమ్’ సమయంలో ఏడాదికి దాదాపు 20 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇది కూడా చదవండి: సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం.. నిజం ఒప్పుకున్న ఇన్స్టా చీఫ్ -
సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం.. నిజం ఒప్పుకున్న ఇన్స్టా చీఫ్
కాలిఫోర్నియా: టీనేజర్ల భద్రతా ఫీచర్లను ఎంతమంది వినియోగిస్తున్నారనే వాస్తవాన్ని వెల్లడించకుండానే వాటిని ప్రచారం చేశామని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కాలిఫోర్నియా న్యాయస్థానంలో అంగీకరించారు. పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మార్చడంతో పాటు వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన దావా విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది.టీనేజర్లు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ‘టేక్ ఏ బ్రేక్’ (2021), ‘క్వైట్ మోడ్’ (2023) ఫీచర్లపై మొస్సేరిని న్యాయవాదులు ప్రశ్నించారు. మెటా అంతర్గత పత్రాల ప్రకారం ‘టేక్ ఏ బ్రేక్’ వినియోగం కేవలం 1.8 శాతంగా, ‘క్వైట్ మోడ్’ వినియోగం 8.7 శాతంగా నమోదైంది. ప్రారంభ దశలో మొత్తం ఖాతాల్లో 1 నుంచి 2 శాతం మాత్రమే వీటిని వినియోగించినప్పటికీ, ఆ వివరాలను బహిర్గతం చేయలేదని మొస్సేరి ఒప్పుకున్నారు. అయితే 2024లో తీసుకొచ్చిన ‘టీన్ అకౌంట్స్’ ద్వారా ఈ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు.2021లో మొస్సేరి రాసిన బ్లాగ్లో ‘90 శాతానికి పైగా టీనేజర్లు రిమైండర్లను కొనసాగిస్తున్నారు’ అని పేర్కొనడంపై కోర్టులో చర్చ జరిగింది. ఈ ఫీచర్ను ఇప్పటికే యాక్టివేట్ చేసుకున్నవారికి మాత్రమే ఆ 90 శాతం వర్తిస్తుందని, మొత్తం టీనేజర్లలో 90 శాతం మంది వినియోగించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, మెటా మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ సాక్ష్యమిస్తూ.. ‘టేక్ ఏ బ్రేక్’ విఫలమయ్యేలా రూపొందించిన ఫీచర్ అని ఆరోపించారు. పిల్లల ఎంగేజ్మెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే ‘క్వైట్ మోడ్’ను డిఫాల్ట్గా ఉంచడానికి యాజమాన్యం నిరాకరించిందని మాజీ డేటా సైంటిస్ట్ జార్జ్ వోలిచెంకో తెలిపారు. ఈ కేసులో మెటాపై అభియోగాలు రుజువైతే సుమారు 200 బిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
కిరణా హిల్స్పై డ్రోన్ దాడి?! ఆపరేషన్ సిందూర్ మిస్టరీకి తెర
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని కీలక సైనిక ప్రాంతం కిరణా హిల్స్పై భారత డ్రోన్ దాడి చేసిందా?. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ఈ పరిణామం గురించి ఇన్నాళ్లుగా సందేహాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దానికి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా చెక్ పెట్టారు. అది అనుకోకుండా జరిగిందంటూ ఆయన వివరణ ఇచ్చారు.కిరణా హిల్స్ను భారత్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జనరల్ చౌహాన్.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్గోధా చుట్టుపక్కల రాడార్లను గుర్తించేందుకు లాయిటరింగ్ మ్యూనిషన్లను మోహరించినట్లు చౌహాన్ వెల్లడించారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరణా హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్న కీలక ప్రాంతంగా చాలాకాలంగా ప్రచారంలో ఉంది. సర్గోధా పరిసరాల్లోని రాడార్లను గుర్తించి దాడి చేయడమే ఆ డ్రోన్ల లక్ష్యం. ఇలాంటి లాయిటరింగ్ మ్యూనిషన్లు కొంతసేపు గాల్లో తిరుగుతూ లక్ష్యాన్ని వెతుకుతాయని, సాధారణంగా దాదాపు రెండు గంటల వరకు గాలింపును కొనసాగించగలవని వివరించారు. నిర్ణీత సమయంలో లక్ష్యం దొరకకపోతే అవి తిరిగి వచ్చి ఎక్కడో ఒకచోట కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.‘‘మేము కిరణా హిల్స్ను లక్ష్యంగా చేసుకోలేదు. రాడార్ల కోసం పంపిన లాయిటరింగ్ మ్యూనిషన్ లక్ష్యాన్ని గుర్తించలేకపోవడంతో చివరకు ఆ కొండల్లో ఒకదాన్ని ఢీకొని ఉండొచ్చు’’ అని చౌహాన్ వివరించారు. ఆ సమయంలో కిరణా హిల్స్ నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు పాకిస్థాన్ మీడియా ద్వారా బయటకు రావడం కూడా ఈ ప్రాంతంపై అనేక అనుమానాలకు దారితీసింది. అయితే అది అక్కడి అణు స్థావరంపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన ఆధారం కాదని చౌహాన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.లోయర్ ఎయిర్స్పేస్.. భారత్ వ్యూహంఆపరేషన్ సిందూర్లో భారత్ అనుసరించిన వ్యూహంపై కూడా మాజీ సీడీఎస్ కీలక విషయాలు వెల్లడించారు. గతంలో ఉరీ ఘటన తర్వాత చేపట్టిన భూదాడులు, పుల్వామా అనంతరం నిర్వహించిన భారీ వైమానిక దాడులకు భిన్నంగా ఈసారి తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లు, అటాక్ హెలికాప్టర్లు వంటి ఆయుధ వ్యవస్థలకు ఈ లోయర్ ఎయిర్స్పేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తద్వారా కంట్రోల్లో ఉంటూనే.. అనూహ్య దాడులతో లక్ష్యాలను ఛేదించే అవకాశం లభించిందని వివరించారు.పాక్ చర్చలకు వచ్చినా.. సర్గోధాపై దాడికి ఓకేఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చినప్పటికీ, సర్గోధాపై దాడికి భారత్ అనుమతించినట్లు చౌహాన్ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి చర్చల కోసం ఫోన్ వచ్చిన సమయంలోనే వైమానిక దళాధిపతి సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగారని తెలిపారు. తాను ‘‘వెళ్లండి.. దాడి చేయండి’’ అని సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా మరో రెండు లక్ష్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.అందులో ఒకటిగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని స్కార్దూను గుర్తించారు. దాడికి అనుమతి లభించినప్పటికీ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు భోలారి వైమానిక స్థావరంలోని హ్యాంగర్పై భారత వైమానిక దళం దాడి చేసిందని చెప్పారు.భోలారి దాడి.. భారీ నష్టంమే 10న జరిగిన భారత వైమానిక దాడుల్లో భోలారి ఎయిర్బేస్పై జరిగిన దాడి కీలకంగా నిలిచింది. అక్కడి ఓ హ్యాంగర్ పైకప్పులో భారీ రంధ్రం ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. దాడి తీవ్రతకు నిదర్శనంగా హ్యాంగర్ చుట్టూ శకలాలు కనిపించాయి.ఇక పాక్ తాను జరిపిన దాడులపై ఎలాంటి స్పష్టత లేకుండా ఉండిపోయిందని అనిల్ చౌహాన్ అన్నారు. అమెరికా, చైనా సంస్థలకు చెందిన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం పొందేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు.సమన్వయమే మన బలంఆపరేషన్ సిందూర్లో భారత్ పైచేయి సాధించడానికి మెరుగైన పరిస్థితుల అవగాహన, యుద్ధభూమిపై పారదర్శకత, మూడు దళాల మధ్య సమన్వయం కీలకంగా పనిచేశాయని చౌహాన్ అన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు ఒకే ఆపరేషనల్ చిత్రంపై అవగాహన ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగామని వివరించారు. అదే సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, సైన్యానికి ఆపరేషనల్ స్వేచ్ఛ లభించడం కూడా విజయానికి కారణమైందని చెప్పారు.2025 ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్నాగ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. తదనంతరం పాకిస్థాన్ సైనిక చర్యలకు దిగడంతో భారత్ తన దాడులను విస్తరించి పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. మే 10న ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య సంప్రదింపుల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి ఉద్రిక్తతలు ఆగిపోయాయి.ఇదీ చదవండి: అమెరికా ఆశలు తగ్గుముఖం! -
భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. PP Softtech Private Limited, Sadashiva Overseas Limited, Prakrutees Infra Impex India Private Limited, Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల పలు షిప్మెంట్లను భారత్కు తీసుకురావడంలో కస్టమ్స్ బ్రోకర్గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలుఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్, హరీశ్ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.భారత్పై ప్రభావం?ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
టైమ్స్ స్క్వేర్ వేదికగా చీర ఘనత
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ నారీమణులు తమ చీరకట్టుతో టైమ్స్ స్క్వేర్ కూడలివాళ్లను కట్టిపడేశారు. భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా చీరలను ధరించి దేశ సంస్కృతి, చేనేత వారసత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటారు. న్యూయార్క్ నగరంలోని దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రపంచాన్ని చుట్టేస్తున్న చీర’మూడో ఎడిషన్ కార్యక్రమాన్ని అత్యంత కన్నులపండువగా నిర్వహించారు. భారత్లోని భిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు పలు రాష్ట్రాలకు, ప్రాంతాలకు వన్నె తెచ్చిన వైవిధ్యభరితమైన చీరలను అందంగా కట్టుకుని టైమ్స్ స్క్వేర్ వద్ద హొయలుపోతూ వయ్యారంగా నడిచి చీరకట్టుతోనే సొగసు, సోయగం, అందాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను ప్రశంసలుగా అందుకున్నారు. అస్సామీ మగ్గాల మీద నేసిన చీరలు మొదలు లక్నో చికంకారీ, బెనారస్ సిల్్క, కంజీవరం, పోచంపల్లి చీరల దాకా పలు ప్రాంతాలకు పేరుప్రఖ్యాతలు తెచి్చన చీరలను కార్యక్రమంలో మహిళామణులు ధరించారు. భారతీయ కళ, సాంప్రదాయం, చేనేత ఘన వారసత్వానికి చీర సజీవ సాక్ష్యం’’అని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోషల్ వ్యాఖ్యానించారు. ప్రధాన కూడలిలో చీరలను ప్రదర్శించి గర్వపడేలా సంబరాలు చేశారని ఆమె పొగిడారు. భిన్న రకాల్లో నేసిన చీరలను, విభిన్న డిజైన్లతో ఆకట్టుకునే చీరలను ధరించి త్రివర్ణ పతాకం చేతబూని దేశభక్తి పాటలను పాడారు. తర్వాత చక్కటి సంగీతానికి నృత్యంచేస్తూ సంబరాల్లో మునిగారు. ప్రాచీన సిందూ నాగరికత మొదలు నేటి ఆధునిక నాగరికత దాకా ఎంతోమంది డిజైనర్లు ఎన్నో రకాలుగా నేసిన, రూపొందించిన చీర ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వస్త్రధారణలో ఎంతో ఆధునికత వచ్చినా నేటి యువతరం ఇప్పటికీ చీరకు ప్రత్యేక స్థానమిస్తోంది. పెళ్లిళ్లు మొదలు పని ప్రదేశాల దాకా అంతటా చీరను ధరిస్తూ చీర పట్ల తమ మమకారాన్ని చాటుకుంటున్నారు’’అని న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో కాన్సుల్ ట్రేడ్ రాజ్యలక్ష్మి అప్పాసాహెబ్ కదమ్ వ్యాఖ్యానించారు. -
అమెరికా ఆశలు తగ్గుముఖం!
వాషింగ్టన్: అమెరికా చదువుల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే 2025–26లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు ‘కామన్ ఆప్’అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ సంస్థ సుమారు 1100 అమెరికన్ వర్శిటీల్లో అడ్మిషన్ల వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత ఈ నివేదిక విడుదల చేసింది. 2026–27లో మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే మయంలో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు మార్చి ఒకటి తరువాత పది శాతం పడిపోయినట్లు తెలిసింది. భారత్ నుంచి చదువుల కోసం ఏటా అమెరికాకు వెళ్లే వారు లక్షల్లో ఉంటారన్నది మనకు తెలిసిన విషయమే. 2024–25లో ఈ సంఖ్య 3.63 లక్షలు. స్వచ్ఛంద సంస్థ కామన్ ఆప్ నివేదిక ప్రకారం 2025–26లో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటు విలువ ఏకంగా 4177 కోట్ల డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 3837 కోట్ల డాలర్లకు పడిపోనుంది. వీసా నియమ నిబంధనలు కఠినతరం కావడం, ట్రంప్ ప్రభుత్వ విధానాల్లో అస్థిరతల కారణంగా ఈ ఏడాది అమెరికా చదువుల కోసం విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు 1.1 లక్షలు తగ్గిపోతాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, జేబీ ఇంటర్నేషనల్లు ఇటీవలే ప్రకటించాయి. వీరి అంచనాల ప్రకారం 2025–26 ఫాల్ అడ్మిషన్లకు 11.69 లక్షల దరఖాస్తులు అందితే.. ఈ ఏడాది అది 10.57 లక్షలకు పడిపోనుంది. చదువు తరువాత అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పించిన విధానాలను అమెరికా ఈ ఏడాది జూలైలోనే సవరించింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. అంతేకాకుండా.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చి గ్రాడ్యుయేషన్ తరువాత అక్కడే కొంతకాలం పనిచేసేందుకు ఓపీటీ అవకాశమిస్తుంది. ఓపీటీలో భాగంగా పన్నెండు నుంచి 24 నెలలపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కంపెనీలు విద్యార్థి వీసాలపై పనిచేస్తున్న వారి హెచ్1–బీ వీసాలకు స్పాన్సర్ చేయడం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా మార్చుకునేందుకూ ఓపీటీ వీలు కల్పిస్తుంది. ఈ హెచ్1–బీ వీసాలపైనే భారతీయు టెకీలు చాలామంది తమ అమెరికా కలను నెరవేర్చుకుంటూంటారు. -
అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.చర్చల నుంచి కెనడా వైదొలగింపుఅమెరికా, కెనడా మధ్య టారిఫ్లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది. -
టీవీకే మంత్రి కీర్తన పోలికలు.. ఆ యువతికి నరకం చూపించిన నెటిజన్లు!
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడిని నిజం చేస్తూ, అచ్చం తమలాగే ఉండే వ్యక్తుల కోసం నెటిజన్లు ఆన్లైన్లో వెతుకుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే సింగపూర్లో నివసిస్తున్న వినోషా రవి అనే యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ముఖ కవళికలు తమిళనాడు మంత్రి కీర్తనను పోలి ఉండటంతో ఈ వివాదం చెలరేగింది.డీఎంకే శ్రేణులు, నెటిజన్లు, పొట్టి దుస్తులు ధరించిన ఒక మహిళ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు మంత్రియేనా అని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మొదలైంది. నెటిజన్లు సైతం ఆ వీడియోలో ఉన్నది మంత్రేనని పొరపడి, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. అయితే, ఆ వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని మంత్రి కీర్తన స్పష్టం చేశారు. కేవలం పోలికల కారణంగా ట్రోలింగ్కు గురైన సింగపూర్కు చెందిన వినోషా రవికి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు.ఈ పరిణామాలపై వినోషా రవి మాట్లాడుతూ..‘తొలత నా సహోద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వీడియోను తీశారు. మొదట దానిని నేను ఒక జోక్గా తీసుకున్నాను. ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందని అనుకోలేదు. కానీ, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శలు నన్ను పూర్తిగా డిప్రెషన్కు గురిచేశాయి. కొందరు పెట్టిన కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. నా ప్రమేయం లేకుండా, నేను ఏ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయని వీడియోను రికార్డ్ చేసి ఆన్లైన్లో తప్పుగా ప్రచారం చేశారు. ఈ సంఘటన తర్వాత నేను బయటకు వెళ్లడానికి, కనీసం ఆఫీస్కు వెళ్లడానికి కూడా భయపడుతున్నానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.బెదిరింపులు, అసభ్యకర సందేశాలు రావడంతో ఆమె మలేషియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ట్రోలింగ్ వల్ల కలత చెంది భయపడినప్పటికీ, తాను వెనక్కి తగ్గేది లేదని వినోషా రవి స్పష్టం చేశారు. కొంతమంది ఆన్లైన్లో ట్రోల్ చేశారనే కారణంతో తాను తన వస్త్రధారణ శైలిని మార్చుకోబోనని తేల్చిచెప్పారు. మహిళలకు నీతులు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఏమి, ఎలా దుస్తులు ధరించాలో మాకు బాగా తెలుసు’అని ఆమె అన్నారు. ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో నెటిజన్లు ఆలోచించాలని, కేవలం వ్యూస్ కోసం బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని ఆమె హితవు పలికారు. -
యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్ నేతలు టెహ్రాన్లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్లో పోస్టు చేశారు.దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. -
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2030 నాటికి ఫ్రాన్స్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యను 30,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరంలో ఫ్రాన్స్లో 9,100 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా వస్తున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.ఇప్పటివరకు విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధాన ఆప్షన్లుగా ఉండేవి. అయితే ఇప్పుడు విద్యార్థులు కేవలం విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్నే కాకుండా చదువు ఖర్చు, ఉద్యోగ అవకాశాలు, వీసా నిబంధనలు, జీవన వ్యయం, చదువు పూర్తయ్యాక అవకాశాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ మార్పు ఫ్రాన్స్కు అనుకూలంగా మారుతోంది.ఫ్రాన్స్ తనను తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉన్నత విద్య అందించే దేశంగా పరిచయం చేసుకుంటోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అర్హత ఉన్న యూరోపియన్ యూనియన్కు చెందని విద్యార్థులకు అనేక ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని విశ్వవిద్యాలయాలతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో గణనీయమైన భాగాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్థికంగా భరిస్తోంది. అయితే అన్ని విద్యాసంస్థలు తక్కువ ఖర్చుతో ఉండవు. ప్రైవేట్ బిజినెస్ స్కూళ్లు, ప్రత్యేక విద్యాసంస్థల్లో ఫీజులు ఎక్కువగా ఉండవచ్చు. పారిస్ వంటి నగరాల్లో జీవన వ్యయం కూడా అధికంగా ఉంటుంది.ఇంగ్లీషులో 1,500కు పైగా కోర్సులుఫ్రాన్స్లో ఇంగ్లీష్లో బోధించే కోర్సుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 1,500కు పైగా కోర్సులు ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా స్థాయిలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రెంచ్ భాషపై పూర్తి పట్టు లేకపోయినా భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకునే అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం పూర్తిగా అనవసరం కాదు. ఫ్రాన్స్లో చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలనుకునే వారికి ఫ్రెంచ్ భాష తెలిసి ఉండటం ఇంటర్న్షిప్లు, ఉద్యోగాల కోసం దరఖాస్తులు, రోజువారీ జీవితం వంటి విషయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టిఫ్రాన్స్ ఇప్పుడు కేవలం డిగ్రీలను అందించే దేశంగా కాకుండా చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే విద్యా గమ్యస్థానంగా తనను నిలబెట్టుకోవాలని చూస్తోంది. అంతరిక్ష, ఇంజినీరింగ్, విలాస వస్తువుల నిర్వహణ, వ్యాపారం, విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ఫ్రాన్స్కు బలమైన అవకాశాలు ఉన్నాయి.ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు, అత్యాధునిక సాంకేతిక రంగాలు భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో కీలకంగా మారుతున్నాయి. సాంకేతికత, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న భారతీయ విద్యార్థులకు ఇవి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఫ్రాన్స్లో మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత స్థాయి విద్య పూర్తి చేసిన అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు చదువు తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వ్యాపారం ప్రారంభించడానికి కొంతకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. స్కాలర్షిప్లు, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు కలిసి ఫ్రాన్స్ను భారతీయ విద్యార్థులకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్లుగా మారుస్తున్నాయి.భారత్కు ఫ్రాన్స్లో పెరుగుతున్న ప్రాధాన్యంప్రధాని నరేంద్ర మోదీ జూన్లో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆవిష్కరణ రంగాలకు సంబంధించిన 19 ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ రోడ్మ్యాప్ 2030ను స్వీకరించాయి. కృత్రిమ మేధస్సుపై సంయుక్త భారత్-ఫ్రాన్స్ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశాయి. విద్యార్థుల రాకపోకలు కూడా ఈ విస్తృత భాగస్వామ్యంలో భాగంగా మారుతున్నాయి. భారతీయ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ఫ్రాన్స్ తన పరిశోధన, సాంకేతికత, వ్యాపార రంగాలకు ప్రతిభావంతులైన యువతను తీసుకురావాలని చూస్తోంది. భారత్ మాత్రం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు నమ్మదగిన గమ్యస్థానాల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫ్రాన్స్లోని విద్యా అవకాశాలపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో ముంబై, పుణే, న్యూఢిల్లీ, బెంగళూరులో ‘చూస్ ఫ్రాన్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. 50కి పైగా ఫ్రెంచ్ విద్యాసంస్థలు ఇందులో పాల్గొని కోర్సులు, స్కాలర్షిప్లు, వీసాలు, విద్యార్థి జీవితం గురించి సమాచారం అందించనున్నాయి.విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశాలుఫ్రాన్స్లో చదువు తక్కువ ఖర్చుతో ఉండొచ్చనే కారణంతోనే నిర్ణయం తీసుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల మధ్య ఫీజుల్లో భారీ తేడాలు ఉండవచ్చు. వసతి, జీవన వ్యయం, ఫ్రెంచ్ భాష అవసరం, వీసా నిబంధనలు, చదువు తర్వాత ఉద్యోగానికి సంబంధించిన నియమాలను ముందుగానే తెలుసుకోవాలి.ఇదీ చదవండి: ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు! -
మొహంపై మచ్చ.. ప్లాస్టిక్ సర్జన్కు ప్రధాని అదిరిపోయే కౌంటర్!
కోపెన్హాగన్: డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ సహనం కోల్పోయారు. తనపై చేస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆమెకు ఒక ప్లాస్టిక్ సర్జన్ నుండి షాకింగ్ మెసేజ్ వచ్చింది. ‘మీ ముక్కు మీద ఉన్న ఆ చిన్న మచ్చను సరిచేస్తాను అని సదరు సర్జన్ మెట్కు మెసేజ్ చేశారు.ఆ మెసేజ్తో చిర్రెత్తిపోయిన ఆమె.. ఆ ప్లాస్టిక్ సర్జన్ చేసిన ఆఫర్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు (అతని పేరును గోప్యంగా ఉంచారు). ఇన్నేళ్లుగా నా రూపం గురించి నాకు లెక్కలేనన్ని మెసేజ్లు వచ్చాయి. నా పళ్లు అందవిహీనంగా ఉన్నాయని, జుట్టు పలుచగా ఉందని, నా ముక్కు మీద ఒక మచ్చ ఉందని చాలామంది కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్ను ఉద్దేశిస్తూ.. నా ముక్కు మీద ఉన్న మచ్చపై చూపిస్తున్న మీ శ్రద్ధకు ధన్యవాదాలు. నాకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదు. నా శరీరం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాని గురించి సలహాలు ఇవ్వడానికి నాకు ఏ పురుష ప్లాస్టిక్ సర్జన్ అవసరం లేదు’ అని ఘాటుగా బదులిచ్చారు. నేను ఇతరుల రూపంపై ఎప్పుడూ జోక్యం చేసుకోను. 50 ఏళ్లకు దగ్గరవుతున్న ఒక మహిళగా నా శరీరం విషయంలో నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నాను. మీరు నాకు ఉత్తరం రాయాలనుకుంటే రాయండి. అందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దయచేసి మీ విలువైన సమయాన్ని అర్థవంతమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి ఉపయోగించండి. అంతేకాని నా ముక్కు గురించి కాదు’ అని ఆమె హితవు పలికారు.ఇక ఆమె రాజకీయాల విషయానికొస్తే.. సోషల్ డెమోక్రాట్ పార్టీకి చెందిన మెటె ఫ్రెడెరిక్సన్, డెన్మార్క్ రెండవ మహిళా ప్రధానిగా ప్రస్తుతం తన మూడవ పదవీకాలంలో కొనసాగుతున్నారు. ఈ హోదాతో ఆమె యూరప్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన, అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆమె 2019 మధ్యకాలం నుండి యూరోపియన్ యూనియన్,మరియు నాటో ,సభ్య దేశమైన డెన్మార్క్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల గ్రీన్ల్యాండ్పై వస్తున్న రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటానని, అలాగే రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు తన మద్దతు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. -
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల నుంచి ఆ దేశం పేరు తొలగింపు
వాషింగ్టన్: సిరియాను అమెరికా సోమవారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితా నుంచి తొలగించింది. 1979 నుంచి అమల్లో ఉన్న ఈ గుర్తింపునకు ముగింపు పలకడంతో సిరియాతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఉన్న కీలక ఆంక్షలు తొలగిపోయాయి. 45 రోజుల కాంగ్రెస్ సమీక్ష అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం.. అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నేతృత్వంలోని సిరియా కొత్త ప్రభుత్వంతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగుగా నిలిచింది.హయత్ తహ్రీర్ అల్-షామ్ సంస్థపై ఉన్న ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ ఉగ్రవాద సంస్థ హోదాను కూడా రద్దు చేసింది. దీనికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఆంక్షల సడలింపును ప్రకటించింది.“అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాద చర్యలకు సిరియాను పూర్తిగా దూరం చేసేందుకు తీసుకున్న సానుకూల చర్యలు, చేసిన తదుపరి హామీలను గుర్తిస్తూ ఈ చర్యలన్నీ తీసుకున్నాం” అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చర్యలు పెట్టుబడులను ప్రోత్సహించి సిరియా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తాయని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. “సిరియాలో అదనపు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నేటి నిర్ణయం దోహదపడుతుంది. తద్వారా రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు” అని ఆయన అన్నారు.ఎన్నో ప్రయోజనాలు ఈ మార్పులు సిరియాపై ఆంక్షల సడలింపు కల్పిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉన్నాయని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఆంక్షల తొలగింపు “ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఆర్థిక శాఖ వైఖరిని మార్చదు. సిరియాలోని చెడు చర్యలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలను బాధ్యులను చేయాలనే మా నిబద్ధత కొనసాగుతుంది” అని పేర్కొంది. 2025 జూలైలో అమెరికా సిరియాపై అమలు చేసిన విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని ముగించిన తరువాత కూడా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం అనే గుర్తింపు కొనసాగింది. సిరియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వ్యాపార సంస్థలు, ఆర్థిక సంస్థలకు ఇది ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఈ గుర్తింపు కారణంగా అమెరికా విదేశీ సహాయం, రక్షణ రంగ ఎగుమతులు, విక్రయాలు, కొన్ని ద్వంద్వ వినియోగ వస్తువులు, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు ఉండేవి.అప్పటి నుంచి అమెరికా ఆర్థిక సంస్థలు సిరియాకు సేవలు అందించవచ్చని, సిరియా బ్యాంకులకు సంబంధించిన చెల్లింపులను నిర్వహించవచ్చని, సిరియా బ్యాంకులతో ప్రతినిధి బ్యాంకింగ్ సంబంధాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఆంక్షలకు లోబడి ఉన్న సంస్థలు ఇందులో భాగం కాకూడదు.సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సిరియా ప్రభుత్వం స్వాగతించింది. దాదాపు 14 ఏళ్ల యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో తిరిగి అనుసంధానం కావడానికి ఇది ఒక అవకాశమని పేర్కొంది.ఉగ్రవాద సంస్థగా ఉన్న గుర్తింపును ఆర్థిక సంబంధాల పునర్నిర్మాణానికి చివరి అడ్డంకిగా సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్ షిబానీ గతంలో పేర్కొన్నారు. “ఇక సిరియాలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం, ఆర్థిక జీవితాన్ని పునర్నిర్మించడం కోసం ఎలాంటి అడ్డంకి లేదు” అని ఆయన అన్నారు. 1979లో అప్పటి అధ్యక్షుడు హఫీజ్ అల్-అసాద్ ప్రభుత్వం మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించిన సమయంలో సిరియాకు ఈ గుర్తింపు విధించింది. ఆయన కుమారుడు బషర్ అల్-అసాద్ పాలనలో కూడా ఇది కొనసాగింది. 2024 డిసెంబరులో షరా నేతృత్వంలోని తిరుగుబాటుదారులు అసాద్ను అధికారం నుంచి తొలగించారు.ఒకప్పుడు అల్-ఖైదాతో అనుబంధంగా గతంలో నుస్రా ఫ్రంట్గా పిలిచిన హెచ్టీఎస్ ఒకప్పుడు సిరియాలో అల్-ఖైదాతో అనుబంధంగా ఉండేది. 2016లో ఆ సంస్థతో సంబంధాలను తెంచుకుంది. అనంతరం షరా తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహించి అసాద్ను అధికారం నుంచి తొలగించారు. ఆ తరువాత ఆయన అధ్యక్షుడయ్యారు.సిరియాను తొలగించడంతో అమెరికా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితాలో ప్రస్తుతం క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియా అనే 3 దేశాలు మాత్రమే మిగిలాయి. వాషింగ్టన్, డమాస్కస్ మధ్య విస్తృత సాన్నిహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిరియాపై ఆంక్షల సడలింపుకు మద్దతు ఇచ్చారు. టర్కీ పర్యటన సందర్భంగా షరాతో సమావేశమయ్యారు. కొత్త సిరియా ప్రభుత్వం ఆర్థిక పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరుతోంది.సిరియా అధికారులు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కంపెనీలతో సన్నిహిత సంబంధాల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. సిరియా ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపింది. మాస్టర్కార్డ్ సంస్థ అంతర్జాతీయ కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం క్యూఎన్బీ గ్రూప్, సిరియా కేంద్ర బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ‘పాక్’ అసిమ్ మునీర్కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్సిరియాలో స్థిరీకరణ, ఆర్థిక పునరుద్ధరణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామ్యం కావడానికి మద్దతు ఇవ్వడమే డమాస్కస్తో తమ సంబంధాల లక్ష్యమని వాషింగ్టన్ తెలిపింది. అదే సమయంలో ఉగ్రవాదం, ఇతర ఆంక్షలకు లోబడి ఉన్న వ్యక్తులు, సంస్థలపై లక్ష్యిత చర్యలను కొనసాగిస్తామని పేర్కొంది. -
8 ఏళ్ల తర్వాత ఒకేసారి 4 తుపానులు.. ప్రభావం ఎంతంటే..
న్యూఢిల్లీ: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో తీవ్ర వాతావరణ అలజడి నెలకొంది. ప్రస్తుత ఆగస్టు మాసంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఒకేసారి నాలుగు తుపాన్లు క్రియాశీలంగా మారిన అరుదైన పరిస్థితి ఏర్పడింది. గతంలో నవంబర్ 2024లో ఇలా ఒకేసారి నాలుగు తుపాన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్లో తీవ్ర తుపాను ‘సౌడెల్’తో పాటు ‘నారా’, ‘గైనారి’, ‘అత్సాని’ అనే మూడు ఉష్ణమండల తుపాన్లు (ట్రాపికల్ స్టార్మ్స్) కొనసాగుతున్నాయి. ఈ నాలుగు తుపాన్ల తీవ్రత, గమనం, స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి.సౌడెల్: వీటిలో ‘సౌడెల్’ అత్యంత శక్తిమంతమైనది. దీని గాలి వేగం గంటకు 165 కిలోమీటర్లు ఉండగా, తీవ్ర గాలుల వేగం గంటకు 240 కిలోమీటర్ల వరకు చేరుతోంది. ఇది ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తోంది.నారా: ఈ తుపాను గాలి వేగం గంటకు 75 కిలోమీటర్లు, తీవ్ర గాలులు గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇది ప్రస్తుతం కదలిక పెద్దగా లేకుండా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.గైనారి: దీనిలో గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లు, తీవ్ర గాలుల వేగం 95 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది కూడా ఒకే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది.అత్సాని: సుమారు 15.1° ఉత్తర అక్షాంశం, 137.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైన ఈ తుపాను గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంది. ఇది గంటకు దాదాపు 25 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది.ఒకే సమయంలో నాలుగు తుపాన్లు సక్రియంగా ఉన్నప్పటికీ, అవి వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతుండటంతో ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతానికే ముప్పు పొంచి ఉందని చెప్పలేమని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ సంస్థలు వీటి గమనం, తీవ్రతపై నిరంతర నిఘా ఉంచాయి.ఇది కూడా చదవండి: రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం! -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్పిన్ రాక.. భారత్తో బంధం బలపడేనా?చాబహార్ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్గా మారుతున్నప్పటికీ.. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్కు అసలు పరీక్ష.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఏలియన్స్తో మాట్లాడొద్దు.. హెచ్చరించిన చైనా!
బీజింగ్: గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఎవరినైనా సంప్రదిస్తే స్పందించవద్దని చైనా ప్రభుత్వం తన పౌరులకు అధికారిక హెచ్చరికలు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. అనుమతి లేకుండా ఏలియన్స్కు బదులివ్వవద్దని, ఏదైనా సంకేతం అందితే వెంటనే ఐక్యరాజ్యసమితికి సమాచారం అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పలు పోస్టులు, నకిలీ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ వ్యోమగామ సంస్థ (ఐఏఏ) సూచనల పేరిట కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వదంతులని స్పష్టమైంది. చైనా ప్రభుత్వం గానీ, సంబంధిత సంస్థలు గానీ అటువంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదు.అసలు కథ ఏమిటి?ఈ విచిత్ర ప్రచారానికి చైనాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత లియు సిక్సిన్ రాసిన ‘ది త్రీ-బాడీ ప్రాబ్లమ్’ నవల మూలమని తెలుస్తోంది. ఆ కథలో గ్రహాంతరవాసుల నుంచి భూమిని కాపాడుకోవడానికి ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బదులివ్వవద్దు’ అనే హెచ్చరిక ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడమే లక్ష్యంగా కొందరు కంటెంట్ క్రియేటర్లు ఈ కల్పిత కథాంశాన్ని నిజమైన ప్రభుత్వ ప్రకటనగా మార్చి ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా 2026 ఆగస్టు 12న భూమిపై గురుత్వాకర్షణ శక్తి కొద్ది సెకన్ల పాటు నశిస్తుందంటూ ఇలాంటి అసత్య ప్రచారమే జరిగింది. డిజిటల్ మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దని, నిజానిజాలు పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్.. -
మొజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఉనికిపై సస్పెన్స్ నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొజ్తబా ఖమేనీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆయన స్వరం కూడా వినిపించింది. తొలిసారి మొజ్తబా ఖమేనీ గొంతు వినిపించగా.. యుద్ధం తర్వాత మరోసారి తేదీ లేని వీడియో విడుదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అరుదైన వీడియోను ఇరాన్ తొలిసారిగా విడుదల చేసింది. ఈ వీడియోలో మొజ్తబా.. ఓ విద్యార్థి తన థీసిస్ను వివరిస్తుండగా వింటూ.. ఆ పరిశోధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొజ్తబా ఆరోగ్యంపై అనే సందేహాలు వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.ఇదీ చదవండి: ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సమన్వయ దాడుల్లో ఆయన తండ్రి ఖమేనీ మృతి చెందగా.. ఆ దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తాజా వీడియోను విడుదల చేసింది. ఇందులో మొజ్తబా గొంతు కూడా తొలిసారిగా వినిపించింది. ఇరాన్ పాలనా వ్యవస్థలోని ‘ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్’ గురించి ఆయన విద్యార్థులకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు. First Look Iran’s Supreme Leader Mojtaba Khamenei appears in newly released footage for the first time.A rare public glimpse into Iran’s new leadership. pic.twitter.com/qaMDZ25BLI— Dr Tariq Tramboo (@tariqtramboo) August 24, 2026 -
10వ ఏడాదిలోకి రోహింగ్యా సంక్షోభం.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్!
కాక్స్ బజార్: రోహింగ్యా శరణార్థుల సంక్షోభం 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ, వారిని సురక్షితంగా స్వదేశానికి పంపించేందుకు మయన్మార్పై అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంక్షోభ భారాన్ని తమ దేశం ఒక్కటే నిరవధికంగా మోయలేదని స్పష్టం చేసింది. నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్ఆర్సీ), రెఫ్యూజీ రిలీఫ్ అండ్ రీపాట్రియేషన్ కమిషనర్ (ఆర్ఆర్ఆర్సీ)సంయుక్తంగా కాక్స్ బజార్లో నిర్వహించిన సదస్సులో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అసద్ ఆలం సియామ్ ప్రసంగించారు.రోహింగ్యాలు గౌరవప్రదంగా, సురక్షితంగా స్వదేశానికి వెళ్లేందుకు అనువైన పరిస్థితులు కల్పించేలా మయన్మార్పై బలమైన రాజకీయ, దౌత్య ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. శరణార్థి శిబిరాలకు అంతర్జాతీయ నిధులు తగ్గుముఖం పడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల సమీకరణకు అంతర్జాతీయ భాగస్వాములతో చర్చిస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, దాతృత్వ సంస్థలు, ఎన్జీవోలు పాల్గొన్న ఈ సమావేశంలో రోహింగ్యాల సంక్షోభ పరిష్కారానికి నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు.రోహింగ్యాల పునరావాసం కోసం విద్య, వృత్తి నైపుణ్యాలు, డిజిటల్ లెర్నింగ్లో పెట్టుబడులు పెట్టాలని వక్తలు సూచించారు. స్వచ్ఛంద, సురక్షిత, గౌరవప్రదమైన పునరావాసమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పునరుద్ఘాటించారు. గత నెల న్యూఢిల్లీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ‘బిమ్స్టెక్’ భద్రతా అధిపతుల సమావేశంలోనూ బంగ్లాదేశ్ ఈ అంశాన్ని లేవనెత్తింది. బంగాళాఖాతం ప్రాంత భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, రోహింగ్యాల సంక్షోభ పరిష్కారానికి సభ్యదేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ రక్షణ సలహాదారు డాక్టర్ షంసుల్ ఇస్లాం పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థులకు అస్వస్థత! -
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట -
అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్!
శాంటియాగో: ప్రపంచంతో అంటార్కిటికా ఖండాన్ని అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ మార్గం సాంకేతికంగా సాధ్యమేనని చిలీ టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ (సబ్టెల్) నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం అంటార్కిటికాలో భారీ మంచుకొండలు ఉన్నందున ఇంటర్నెట్ కేబుల్స్ లేవు. అక్కడి పరిశోధనా కేంద్రాలు పూర్తిగా ఉపగ్రహాలు, ఓడలు లేదా విమానాల ద్వారా సూట్కేసుల్లో తరలించే హార్డ్ డ్రైవ్లపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల బ్యాండ్విడ్త్ పరిమితమై, పరిశోధనా కార్యకలాపాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది.డ్రేక్ పాసేజ్ మీదుగా సముద్రగర్భ కేబుల్ ఏర్పాటుకు ఈ అధ్యయనం రెండు మార్గాలను ప్రతిపాదించిందికనిష్ట నిర్మాణం: కింగ్ జార్జ్ ఐలాండ్, ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పం పరిసరాల్లోని 3 కేంద్రాలను కలుపుతూ సుమారు 1,600 కిలోమీటర్ల మేర కేబుల్ లింక్ ఏర్పాటు చేయడం.అనుకూల నిర్మాణం: సుమారు 4,100 కిలోమీటర్ల మేర విస్తరించి, 9 అంటార్కిటిక్ ల్యాండింగ్ పాయింట్లతో చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, బ్రిటన్ దేశాల పరిశోధనా కేంద్రాలను అనుసంధానించడం.ఈ వ్యవస్థ ద్వారా ఒక్కో ల్యాండింగ్ పాయింట్కు 15 నుంచి 30 టిబిట్/సెకను (Tbit/s) సామర్థ్యంతో రియల్ టైమ్ డేటా ప్రసారం సాధ్యమవుతుంది. సాధారణ కమర్షియల్ కేబుల్స్లా కాకుండా, సముద్రపు అడుగుభాగంలో ‘స్మార్ట్’ సెన్సార్లను పొందుపరచనున్నారు.ఎదురయ్యే సవాళ్లుఈ ప్రాజెక్టు ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది డిసెంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో కేవలం మూడు వేసవి కాలాల్లో మాత్రమే పనులు చేపట్టేందుకు తక్కువ సమయం ఉండటం. రెండోది.. మంచుకొండల రాపిడి నుంచి కేబుళ్లను రక్షించడం. ఇందుకోసం హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్, డబుల్-ఆర్మర్డ్ కేబుళ్లను అధ్యయనం సిఫార్సు చేసింది. అయితే, అంతర్జాతీయ అనుమతులు, నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి కావడానికే దాదాపు ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను అంతర్జాతీయ ఆమోదం కోసం చిలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అంటార్కిటిక్ పాలసీ కౌన్సిల్కు సమర్పించారు.ఇది కూడా చదవండి: ట్రంప్కు భారీ ఊరట.. మెయిల్ ఇన్ ఓటింగ్పై సంచలన తీర్పు! -
భారత్–చైనా సంబంధాలు.. ఏ మలుపు తిరుగునో?
వచ్చే నెల భారత్ పర్యటనకు చైనా అధినేత షీ జిన్పింగ్ రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరుకానున్నట్లు తెలిసింది. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను గాడిన పెట్టే ప్రయత్నాలలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.షీ జిన్పింగ్ పర్యటన ఖరారు అయితే, ఏడేళ్ల తర్వాత ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. షీ జిన్పింగ్.. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్లో భారత్ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం సుమారు 400 మంది అధికారులతో కూడిన బృందం రానున్నట్లు భారతీయ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది.కాగా, చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్ సోమవారం బీజింగ్కు చేరుకున్నారు. రెండు దేశాల సరిహద్దు అంశంపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతోపాటు దోవల్ పాలుపంచుకోనున్నారు. ఈ చర్చలు మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. ఢిల్లీలో వచ్చే 12, 13వ తేదీల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు జిన్పింగ్ రానున్న నేపథ్యంలో దోవల్, వాంగ్యీల చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: ఎస్ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదాలు, అరుణాచల్ ప్రదేశ్పై భేదాలు తీవ్రరూపం దాలి్చన తరుణంలో ఈ చర్చలు జరుగుతుండటం గమనార్హం. 2020లో గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల తీవ్ర ఘర్షణలు దైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపడం తెల్సిందే. అప్పట్నుంచి సంబంధాలను తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాద పరిష్కారానికి 2003లో ఏర్పాటు చేసిన చర్చల యంత్రాంగానికి దోవల్, వాంగ్ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. -
ట్రంప్కు భారీ ఊరట.. మెయిల్ ఇన్ ఓటింగ్పై సంచలన తీర్పు!
వాషింగ్టన్: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యాయస్థానంలో తాత్కాలిక ఊరట లభించింది. మెయిల్ ఇన్ (తపాలా) ఓటింగ్పై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఆయన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లోని కీలక నిబంధనల అమలుకు యూఎస్ సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ట్రంప్ మార్చి 31 నాటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై గతంలో కింది కోర్టు విధించిన స్టేను ఎత్తివేస్తూ, అత్యున్నత న్యాయస్థానం 6-3 మెజారిటీతో నిర్ణయం వెలువరించింది. అయితే, ఈ ఉత్తర్వులు అంతిమంగా రాజ్యాంగబద్ధమైనవా కాదా అనే ప్రధాన అంశంపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి తుది తీర్పును ప్రకటించలేదు.ట్రంప్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అర్హులైన ఓటర్ల జాబితాలను ఫెడరల్ ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది. ఆ జాబితాల్లో నమోదైన ఓటర్లకు మాత్రమే మెయిల్ ఇన్ లేదా పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేయాలని అమెరికా పోస్టల్ సర్వీస్ను ఆదేశించారు. వీటితో పాటు బ్యాలెట్ కవర్లపై కొత్త ఫెడరల్ నిబంధనలు అమలు చేయాలని, అనర్హులకు బ్యాలెట్ పత్రాలు అందజేసే ఎన్నికల అధికారులపై దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అయితే ఎన్నికల నిర్వహణ అధికారాలు ప్రధానంగా రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిధిలోనే ఉంటాయని వాదిస్తూ డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు ఈ ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలువరించే పరిధి కింది కోర్టుకు లేదని పేర్కొంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యా చట్టబద్ధమైనదని తాము ధ్రువీకరించడం లేదని, దానికి కాలమే సమాధానం చెబుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టు నిర్ణయంపై డెమొక్రాట్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెనేట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ దీనిని అవమానకరం అని పేర్కొనగా, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మరో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోస్టల్ సర్వీస్ అమలుకు సంబంధించిన మరో స్టే ఇంకా అమల్లో ఉన్నందున, ఈ వ్యవహారంలో న్యాయపోరాటం ఇంకా ముగియలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: హౌస్ఫుల్ బోర్డుల వెనుక అసలు వ్యూహం -
ట్రంప్, నెతన్యాహు వారసులపై ఇరాన్ కన్ను!
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రణాళికలు వేస్తోందన్న చర్చ జరిగింది తెలిసిందే. ఇప్పుడు శత్రుదేశాల వారసులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుల్లో ఒకరిని ఇరాన్ హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ల భద్రత కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారంటూ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్ తన కుమారుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని హత్యకు ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబానికి భద్రత కల్పించడం విలాసం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రయత్నం ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. అలాగే కొడుకులు యాయిర్, అవ్నెర్లలో ఎవరిని టార్గెట్ చేశారన్నది కూడా చెప్పలేదు. బారన్పై బౌంటీ?మరోవైపు ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ వీడియో అమెరికాలో కలకలం రేపింది. ‘‘Where to Kill Barron Trump’’ పేరుతో ప్రసారమైన ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ 20 ఏళ్ల కుమారుడు బారన్ కదలికలను చూపిస్తూ, అతడి గురించి వివరాలు ప్రస్తావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అతడిని లక్ష్యంగా చేసుకునేందుకు 10 మిలియన్ డాలర్ల (రూ.95 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించినట్లు సమాచారం.బారన్ భద్రతా బలగాల కళ్లుగప్పి ఎలా కదులుతున్నాడన్న అంశాలను కూడా వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎక్స్బాక్స్, ఫిఫా గేమ్స్, డిస్కార్డ్ వంటి ప్లాట్ఫామ్లలో అతడి ఖాతాల వివరాలు తమకు లభించాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.మెలానియాపైనా గతంలో బెదిరింపులుట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ మీడియాకు ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ బెదిరింపు వీడియో ప్రసారం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఆమె ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో కదలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.మరింత ముదిరిన ఉద్రిక్తతలుఇరాన్పై అమెరికా ‘ఎకనామిక్ డీ-డే’ పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ వ్యాఖ్యానించగా.. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహు కుటుంబ సభ్యులపై వెలువడిన బెదిరింపులు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.ఇదీ చదవండి: H-1B ఉద్యోగులకు కొత్త రూల్ -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’ఇరాన్పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
భారత్... ప్రశ్నలు వద్దంది
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నిర్వహించిన విలేకరుల సమవేశంలో ప్రశ్నలేవీ రాకుండా చూసుకోవాలని భారత్ తమని ప్రత్యేకంగా కోరిందని భారత్లో అమెరికా రాయబారి సెర్గీ గోర్ వ్యాఖ్యానించారు. మొదట ట్రంప్ ఇందుకు అంగీకరించినప్పటికీ, ఆ తరువాత మరచిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లో ‘‘ఏమైనా ప్రశ్నలున్నాయా’’అని విలేకరులను అడిగారని, దీంతో 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయని ఆయన చెప్పారు. ఫ్రాన్స్లో ఈ ఏడాది జీ–7 సమావేశాల సందర్భంగా మోదీ, ట్రంప్లు జూన్ 17వ తేదీ సమావేశమైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన ఒక వార్తా పత్రిక నిర్వహించని సదస్సులో రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. సున్నితమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ... ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక అతిథుల విషయంలో అనుసరించే నిబంధనలను పాటించాల్సిందిగా మాత్రమే తాము అమెరికన్ ప్రతినిధులకు చెప్పామని తెలిపాయి. నేతల సమవేశాల సందర్భంగా ఇలాంటి చర్చలు సహజమని తెలిపారు. ‘‘మేము స్టేజీ వెనుక ఉన్నాం. ఒక దశలో నేను, అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఉండగా.. ఇండియన్స్ ఏ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నారు అని అడిగారు. ఆ తరువాత ఆయా అంశాలపై మేము మాట్లాడాము’’అని గోర్ ఆ నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పారు. ఇందుకు సమాధానంగా తాను ప్రశ్నలేవీ వద్దని భారత్ కోరుకుంటోందని నేరుగానే ట్రంప్కు చెప్పానని, ఆయన కూడా సరే అన్నాడని సెర్గీ గోర్ వివరించారు. ఆ తరువాత సుమారు యాభై వీడియో కెమెరాలు, విలేకరుల ముందు సమావేశం ప్రారంభమైందని, ట్రంప్, మోదీలు పక్కపక్కన కూర్చుని ప్రారంభ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ట్రంప్ తన వ్యాఖ్యలు పూర్తవగానే కెమెరాలవైపు తిరిగి ‘‘ఎనీ క్వశ్చన్స్?’’అని అడిగారని ఇది కాస్తా పూర్తిస్థాయి సంభాషణకు దారితీసిందని తెలిపారు. -
నిరాటంకంగా ఇంధనం, ఎరువులు
మాస్కో: చిరకాల మిత్రదేశమైన భారత్కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులను సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాల్లో అవరోధాలను ఎదుర్కొంటున్న భారత్కు తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పుతిన్ భారత్కు భరోసా ఇచ్చారు. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇండో–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్(ఐఆర్ఐజీసీ) సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు విచ్చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘‘భారత రైతన్నల కోసం, భారతీయ వ్యవసాయ రంగం కోసం శక్తిమేరకు మేం సాయపడతాం. ఇకమీదటా మా సహాయసహకారాలు కొనసాగుతాయి’’అని జైశంకర్కు పుతిన్ హామీ ఇచ్చినట్లు రష్యా ప్రభుత్వరంగ టాస్ వార్తాసంస్థ పేర్కొంది. ఈ భేటీలో పుతిన్తోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సైతం పాల్గొన్నారు. అంతకుముందు జైశంకర్ సహసారథి హోదాలో ఐఆర్ఐజీసీ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ (డీపీఎం) డెనిస్ మంటురోవ్తో కలిసి సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది 12–13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఢిల్లీలో పర్యటించనున్న వేళ జైశంకర్ రష్యాలో పర్యటిస్తుండటంతో ఈ కీలక సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోదీజీ ఎదురుచూపులు.. పుతిన్తో భేటీలో మోదీ తరఫున జైశంకర్ శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు సంభాషించారు. ‘‘షాంఘై సహకార సంఘం భేటీలో మీతో చర్చించేందుకు ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ భేటీలోనే మిమ్మల్ని బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించాలని మోదీ సిద్ధపడుతున్నారు. వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, పౌర అణు ఇంధనంసహా పలు రంగాల్లో మన ఇరుదేశాల పరస్పర సహకారం కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఐఆర్ఐజీసీ భేటీ అద్భుతంగా సాగింది’’అని పుతిన్తో జైశంకర్ చెప్పారు. 4 రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం 27వ ఐఆర్ఐజీసీ సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. ‘‘భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 2021–22లో 13 బిలియన్ డాలర్లు ఉండగా 2025–26లో అది ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతోపాటు ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు పెరిగి వాణిజ్యలోటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ప్రతికూల ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తాం. రష్యా విపణిలోకి భారతీయ ఉత్పత్తులకు మరింత అవకాశాలు దక్కేలా చేయడం, టారిఫ్ల తొలగింపు, వ్యాపార సంస్థల మధ్య మరింత బలమైన వ్యాపార సంబంధాలతో ఈ వాణిజ్యలోటుకు భారత్ చెక్ పెట్టాలనుకుంటోంది. తద్వారా 2030 ఏడాదికల్లా మా వాటా వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని జైశంకర్ తెలిపారు. -
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండేళ్ల ప్లాన్ రెడీ!
అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందని.. ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదె వెల్లడించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్ ప్రజల సంకల్పాన్ని, దేశ అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా చర్యలు మరోసారి విఫలమయ్యే అవకాశముందని, ఇరాన్ మరో ఓటమిని అమెరికాకు ఇవ్వబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.రెండేళ్ల ప్రణాళిక సిద్ధం!కొత్త ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని మదానిజాదె తెలిపారు. అమెరికా నుంచి ఇలాంటి చర్యలు వస్తాయని తమకు చాలాకాలంగా తెలుసని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా, పరిస్థితులను నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వెల్లడించారు.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలుఅమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఆదాయ మార్గాలపై ప్రభావం చూపించే లక్ష్యంతో ఉంటాయి. అయితే.. ఇరాన్ మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్?
అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు (దాదాపు రూ.98.91 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.భారతీయులపై ప్రభావంఈ ప్రతిపాదనలు భారతీయులకు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా H-1B వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024లో అమెరికా USCIS సుమారు 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.OPTపై కూడా భారీ ఫీజు?H-1Bతో పాటు F-1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ సంస్థలు చెబుతున్నాయి.H-1B ఉద్యోగులకు కొత్త రూల్కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1B ఉద్యోగం కోల్పోయినవారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే..ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేం. అయినప్పటికీ H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే! -
‘పాక్’ అసిమ్ మునీర్కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో మాట్లాడినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లు పాకిస్థాన్కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్హౌస్ కూడా దీనిపై స్పందించలేదు.ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్ సోమవారం టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్పై ప్రభావం ఉన్న పాకిస్థాన్ను రంగంలోకి దించి, అసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
నెల రోజుల పాటు ప్రతిరోజూ 3 పూటలా ఫ్రైడ్ చికెన్ తిని..
బ్రిటిష్ హాస్యనటుడు మో గిల్లిగన్ కొత్త నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘‘బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’’ కోసం 28 రోజుల పాటు రోజుకు మూడు పూటలా ఫ్రైడ్ చికెన్ తిన్నాడు. ఆ తర్వాత ఎదురైన ఆందోళనకర పరిణామాలను మో గిల్లిగన్ వివరించాడు. గిల్లిగన్ 2004లో విడుదలైన సూపర్హిట్ డాక్యుమెంటరీ ‘సూపర్ సైజ్ మీ’ నుంచి స్ఫూర్తి పొంది 28 రోజుల పాటు రోజుకు 3 పూటలా ఫాస్ట్ఫుడ్ చికెన్ తినేందుకు అంగీకరించాడు. ఆ డాక్యుమెంటరీలో చిత్రనిర్మాత మోర్గాన్ స్పర్లాక్ నెల రోజుల పాటు మెక్డొనాల్డ్స్ ఆహారం మాత్రమే తిని, దాని ప్రభావాలను నమోదు చేశాడు.గిల్లిగన్ ఏం చెప్పాడు? “నెట్ఫ్లిక్స్ నాకు చికెన్ తినడానికి డబ్బులు ఇస్తోందా? ఇది పిచ్చిగా ఉంది కదా అని అనుకున్నాను. వాళ్లు రూపొందించాలనుకున్న సినిమా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మొదటి కొన్ని నిమిషాల్లో ఇదంతా అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే, ఇది కలల ఉద్యోగంలా అనిపించింది” అని గిల్లిగన్ ‘ఆబ్సెస్డ్: ది పాడ్కాస్ట్’ తాజా ఎపిసోడ్లో మ్యాట్ విల్స్టీన్తో చెప్పాడు.దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని తనకు తెలుసని గిల్లిగన్ చెప్పాడు. అయితే తన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందనే ఆలోచన తన నిద్రను దూరం చేసేంతగా ఆందోళన కలిగించలేదని తెలిపాడు. అయితే, ఈ సవాలు సగానికి చేరుకునే సమయానికి అతడిలో అనేక మార్పులు మొదలయ్యాయి. అవి నిజంగా శారీరకంగా వచ్చిన మార్పులా, లేక తన ఊహ మాత్రమేనా అనేది కూడా అతడికి అర్థం కాలేదు.ఆరోగ్యం క్షీణించింది.. గిల్లిగన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు. మరో వారం తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపాడు. బరువు పెరిగిందని, నియంత్రణ లేకుండా చెమటలు పట్టడం మొదలైందని, మానసిక స్థితిలో మార్పులు వచ్చాయని చెప్పాడు. అలాగే అతిగా కునుకులు తీసే అలవాటు ఏర్పడిందని, అవి చాలా లోతైన, తీవ్రమైన నిద్రలా అనిపించేవని వివరించాడు.“నేను కాఫీతో పాటు చికెన్ తింటున్న దృశ్యం చూస్తే ఇదంతా నిజమా అనిపించింది. నాకు అల్పాహారంగా ఇలా చికెన్ తినాలని లేదు. కాఫీతో కలిసి అస్సలు తినాలని లేదు. సగం దశ బహుశా అన్నింటికంటే కష్టమైనది. ఆహారం తింటున్నప్పుడు దాని రుచి ఇక బాగుండదని అనుకున్నాను. కానీ అది చాలా రుచిగానే ఉంది” అని గిల్లిగన్ చెప్పాడు.గిల్లిగన్ ఎదుర్కొన్న అనుభవంతో పాటు ఈ డాక్యుమెంటరీ చికెన్ పరిశ్రమను కూడా పరిశీలిస్తుంది. ఫ్రైడ్ చికెన్ చుట్టూ ఉన్న జాతిపరమైన మూసధోరణులు, బ్రిటన్ ఫాస్ట్ఫుడ్ రంగానికి సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తుంది. “ఫ్రైడ్ చికెన్కు సంబంధించిన చాలా అంశాలను ఇందులో చూపించడానికి ప్రయత్నించాం. అలాగే పెద్ద చికెన్ పరిశ్రమను కూడా పరిశీలించాం. అక్కడి నుంచే ఈ చిత్రం మరో దిశలోకి మారుతుంది” అని గిల్లిగన్ చెప్పాడు.“వీలైనన్ని అంశాలను ఇందులో చూపించడానికి మేము నిజంగా ప్రయత్నించాం. ‘అతడి ప్రయాణాన్ని చూస్తాను, అతడికి ఏమి జరుగుతుందో నాకు తెలుస్తుంది’ అనే విధంగా మాత్రమే ఈ చిత్రం ఉండకూడదని భావించాం. ఇంతకుముందు ఎవరో చేసినదాన్ని అనుకరించకుండా, మా చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నించిన విధానం ఇదేనని అనుకుంటున్నాను” అని అతడు చెప్పాడు. -
ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు..
బీజింగ్: చిన్న భూకంపం వస్తే ఏకంగా 7.7 తీవ్రత (రిక్టర్ స్కేలుపై)తో భారీ భూకంపం వచ్చిందంటూ హెచ్చరిక చేసింది ఓ సంస్థ. దీంతో జనాలు బెంబేలెత్తిపోయారు. చైనాలోని నైరుతి ప్రాంతంలోని చెంగ్డూ మహానగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్.. భూకంపం సంభవించిన 5 సెకన్లకే 7.7 తీవ్రతతో భూకంప హెచ్చరికను జారీ చేసింది. ఇతర భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపిన తీవ్రత కంటే చాలా ఎక్కువ తీవ్రతతో భూకంప హెచ్చరికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్ జారీ చేయడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ అపార్ట్మెంట్లు కుప్పకూలిపోతాయేమోనని భయపడ్డారు.చైనా భూకంప నెట్వర్క్స్ కేంద్రం ప్రకారం.. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో యిబిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.26 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప హెచ్చరిక వ్యవస్థ అయిన "చైనా భూకంప ముందస్తు హెచ్చరిక నెట్వర్క్" పేరును కేర్-లైఫ్ అనుమతి లేకుండా ఉపయోగించి.. హానర్, వివో స్మార్ట్ఫోన్లతో పాటు షియావోటియాన్కాయ్ స్మార్ట్వాచ్ల ద్వారా ప్రజలకు 7.7 తీవ్రతతో హెచ్చరికను పంపినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.తీవ్రత అంచనాలో భారీ వ్యత్యాసంపై స్పందిస్తూ.. నెట్వర్క్ 6వ సెకనులో అంచనాను 6.4కు, 7వ సెకనులో 3.7కు, 8వ సెకనులో 4.1కు, 16వ సెకనులో 3.9కు తగ్గించినట్లు తెలిపింది. సేవలను మెరుగుపరిచేందుకు ఈ వ్యత్యాసానికి కారణాన్ని సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేర్-లైఫ్ తెలిపింది.గతంలో వరసగా భూకంపాలు జూలైలో చైనాలోని ఓ మారుమూల ప్రావిన్స్లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, కేవలం 18 నిమిషాల తర్వాత 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయవ్య చైనాలోని క్వింగ్హై ప్రావిన్స్లోని జింగ్హై కౌంటీలో ఉదయం 11.16 గంటలకు, 11.34 గంటలకు ఈ భూకంపాలు సంభవించాయి. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపాల కేంద్రం, క్వింగ్హై రాజధాని షినింగ్కు సుమారు 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కువ జనాభా కలిగిన ఎత్తైన ప్రాంతంలో ఉంది.మే నెలలో దక్షిణ గ్వాంగ్సీ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. భవనాలు కూలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురు గాయపడగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
బ్రిటన్పై రష్యా ఫైర్.. స్థావరాలను పేల్చిపడేస్తాం
మాస్కో: బ్రిటన్పై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగకుండా బ్రిటన్ అడ్డుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకై ఈ రోజు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లోనే SCALP సుదూర క్షిపణులను తయారు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని బ్రిటన్ కీవ్కు అందిస్తున్నందుకు రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణులను తయారు చేసే ప్లాంట్లను గుర్తించి ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్కు సైనికంగా కొనసాగుతున్న బ్రిటన్ మద్దతును మరింత బలపరుస్తామని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ కీవ్ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా ఈ హెచ్చరికలు చేసింది.SCALP క్షిపణులకు సంబంధించిన బ్లూప్రింట్లు, సాంకేతిక సమాచారంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ని ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. “ బ్రిటన్ క్రమపద్ధతిలో, నిరంతరం మంటలకు నూనె పోస్తోంది. శాంతి ప్రక్రియలో కనీస స్థాయిలోనైనా పురోగతి సాధించకుండా అడ్డుకునేందుకు బ్రిటన్ పదేపదే పథకాలు రచిస్తోంది. ఇలాంటి క్షిపణులు, ఇతర సైనిక పరికరాల తయారీ కేంద్రాలను గుర్తించేందుకు మా సాయుధ దళాలు అవసరమైన గూఢచారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ సదుపాయాలను ధ్వంసం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి” అని విలేకరులతో అన్నారు.SCALP క్షిపణిSCALP ఒక సుదూర క్రూయిజ్ క్షిపణి. ఇది సుమారు 250 కిలోమీటర్ల (దాదాపు 150 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ క్షిపణులను ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్లోనే వీటిని దేశీయంగా తయారు చేయలేదు.ఉక్రెయిన్లో SCALP క్షిపణుల ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఫ్రాంకో-బ్రిటిష్ క్షిపణిలో ఉపయోగించే బ్రిటన్కు చెందిన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ రంగ సంస్థ MBDA ఉక్రెయిన్కు విడుదల చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించనుంది.బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకాగాా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ సోమవారం కీవ్ను సందర్శించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రష్యా నుంచి వస్తున్న దారుణమైన బెదిరింపులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ రక్షణకు బ్రిటన్ తన సైనిక మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.నా దేశానికి రష్యా దారుణమైన బెదిరింపులు చేస్తున్నప్పటికీ , ఉక్రెయిన్ రక్షణకు మా మద్దతును కొనసాగిస్తాం అని కీవ్లో జరిగిన ప్రసంగంలో బర్న్హామ్ అన్నారు. కాగా ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. -
హర్ముజ్ విషయంలో మరో బాంబు పేల్చిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.ఇరాన్పై ఆర్థిక యుద్ధంఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం నిరంతరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ శారీరక పరిమాణం, బరువు పెరుగుదల, ఆరోగ్య ముప్పులపై అంతర్జాతీయ మీడియాలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా ఆయన బరువులో చోటుచేసుకున్న మార్పులపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో వైట్ హౌస్ విడుదల చేసిన అధికారిక వైద్య నివేదికలు ఏం చెబుతున్నాయో చూద్దాం.హెల్త్ రిపోర్టులు.. నిజనిజాలుమే నెలలో ట్రంప్ బరువు 238 పౌండ్లు, అంటే సుమారు 107.9 కిలోలు అని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. జార్జియాలో ఎన్నికల జోక్యం కేసులో ఆయనపై అభియోగాలు మోపినప్పుడు ఆగస్టు 2023లో నమోదైన 215 పౌండ్లు, అంటే సుమారు 97.5 కిలోల బరువుతో పోలిస్తే అధికం. మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో సుమారు 23 పౌండ్లు లేదా 10.4 కిలోగ్రాముల పెరుగుదలను ఇది సూచిస్తుంది.గుండె ఆరోగ్యం.. జీవక్రియల పనితీరువైద్య పరీక్షల్లో ఆయన రక్తపోటు (సుమారు 128/74), కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఆయన రెగ్యులర్గా 'రోసువాస్టాటిన్', గుండె ఆరోగ్య రక్షణకు తక్కువ మోతాదు 'యాస్ప్రిన్' ఉపయోగిస్తున్నారు. కొరోనరీ సీటీ యాంజియోగ్రామ్, ఎకోకార్డియో గ్రామ్ పరీక్షల్లో ఎలాంటి గుండె నరాల అడ్డంకులు లేవని, గుండె సమర్థవంతంగా పనిచేస్తోందని తేలింది.వైద్య నిపుణుల హెచ్చరికలుట్రంప్ ఎత్తు (6 అడుగుల 3 అంగుళాలు) ప్రకారంగా ఆయన ప్రస్తుత బీఎంఐ సుమారు 28 నుంచి 29.5 వద్ద ఉంది. వైద్య పారామితుల ప్రకారం 25 దాటిన బీఎంఐని అధిక బరువుగా పరిగణిస్తారు. వయోవృద్ధులలో అధిక బరువు ఉండటం వల్ల భవిష్యత్తులో కార్డియోవాస్క్యులర్ సమస్యలు, మధుమేహం లేదా కీళ్ల నొప్పుల ముప్పు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మాంట్రీల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ పరీక్షలో 30/30 స్కోరు సాధించడంతో పాటు అన్ని రకాల న్యూరోలాజికల్, శారీరక పరీక్షల్లో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దేశాధినేత బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర ఆహార నియమాలు, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువును మరింత అదుపులో ఉంచుకోవడం అవసరమని వైద్యులు సూచించారు.ఇదీ చదవండి: టాటా సన్స్.. ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ -
ఈ పాప మెదడును ఇది తినేసింది.. మీ పిల్లలు జాగ్రత్త!
మెదడును తినే అమీబా కారణంగా ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. అమెరికాలోని లూసియానాలో ఓ సరస్సులో ఈత కొడుతున్న సమయంలో ఆ బాలికకు అమీబా సోకినట్లు భావిస్తున్నారు. బాలిక పేరు లిలియన్ స్మార్ట్. వేడి, స్వచ్ఛమైన నీటి వనరుల్లో వృద్ధి చెందే నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా ఆమెకు సోకింది.అనారోగ్యంతో ఆమె చేసిన పోరాటానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు ‘లవ్ ఫర్ లిలియన్’ ఫేస్బుక్ పేజీలో ఆమె మృతిని ధ్రువీకరించారు. “నిన్న రాత్రి లిలియన్ మా చేతుల నుంచి యేసు చేతుల్లోకి వెళ్లింది. ఆమె మెదడుకు జరిగిన గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆమె చిన్న శరీరం కోలుకోలేకపోయింది. ఆమెను ఇక్కడే ఉంచేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినదంతా చేశారు. మా హృదయం ద్రవీభవించిపోతోంది. ఇక ఏం చేయాలో నిజంగా తెలియడం లేదు. మా అమ్మాయి లేకుండా అడుగు ఎలా వేయాలి?” అని ఆ బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.లిలియన్ పేరు ప్రస్తావించకుండా.. లూసియానా ఆరోగ్య శాఖ ఆగస్టు 19న నేగ్లేరియా ఫౌలెరి సోకిన ఒక కేసును ధ్రువీకరించింది. ఇది ఎక్కువగా క్లైబోర్న్ సరస్సులో సోకి ఉంటుందని తెలిపింది. లూసియానా ఆరోగ్య శాఖ ప్రకారం, నేగ్లేరియా ఫౌలెరి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్కు కారణమవుతుంది. నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంభవించవచ్చు. అమీబా అక్కడి నుంచి మెదడుకు చేరుతుంది.నేగ్లేరియా ఫౌలెరి సోకిన బాధితులకు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు ఏర్పడవచ్చని, ఆ తర్వాత మెడ బిగుసుకుపోవడం, మూర్ఛలు, కోమాకు దారితీయవచ్చని లూసియానా ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది అరుదైన వ్యాధి అయినప్పటికీ, ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ప్రాణాంతకమే.ఆగస్టు ప్రారంభంలో ఫేస్బుక్లో చేసిన పోస్టులో లిలియన్ తల్లి.. జ్వరం రావడంతో తన చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించామని, ఆ తర్వాత ఆమెకు రెండు కళ్లతో ఒక వస్తువు రెండుగా కనిపించే సమస్య ఏర్పడిందని తెలిపారు. ‘లవ్ ఫర్ లిలియన్’ పేజీ ప్రకారం, తన పుట్టినరోజు జరిగిన మరుసటి రోజే లిలియన్ మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన వాపు చాలా తీవ్రంగా ఉందని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు -
కుక్క కాటు.. కోర్టులో ట్విస్ట్! నాలుగేళ్ల తర్వాత కీలక తీర్పు!
వ్రెక్సామ్: ఓ వ్యక్తిని కరిచి, తీవ్ర రక్తస్రావంతో అతడి మరణానికి కారణమైన ఎక్స్ఎల్ బుల్లీ కుక్కకు యజమాని తానేనని, తన నిర్లక్ష్యం వల్లే అతడి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో 33 ఏళ్ల చానెల్ ఫాంగ్ను కెర్నార్ఫన్ క్రౌన్ కోర్టు జ్యూరీ నిర్దోషిగా ప్రకటించింది.ఈ ఘటన 2022 మే 23న వేల్స్లోని వ్రెక్సామ్లో జరిగింది. చానెల్ ఫాంగ్ ఇంట్లో ఉన్న ‘కుకీ’ అనే ఎక్స్ఎల్ బుల్లీ కుక్క ఆమె భర్త తండ్రి కెవెన్ జోన్స్ (62)పై దాడి చేసింది. ఉదయం సుమారు 11:30 గంటలకు కెవెన్ తోటలో ఉన్న కుకీని, మరో కుక్కను ఇంట్లోకి తీసుకురావడానికి వెళ్లారు. కొద్దిసేపటికే కుకీని ఉద్దేశించి ‘వదిలేయ్’ అంటూ ఆయన అరవడం వినిపించింది. ఆ తర్వాత తడబడుతూ ఫాంగ్ వద్దకు వచ్చిన కెవెన్ తన కాలిని చూపించారు. అక్కడి నుంచి తీవ్రంగా రక్తం వస్తుండటంతో.. ‘అది నన్ను అక్కడ కరిచింది’ అని ఆమెకు చెప్పారు. వెంటనే ఫాంగ్ అత్యవసర సేవలకు ఫోన్ చేసి, ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు.అయితే కెవెన్ ప్రాణాలను కాపాడలేకపోయారు. కుక్క కాటు వల్ల తీవ్ర రక్తస్రావం కావడంతోనే ఆయన మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, కుకీని ప్రమాదకరంగా అదుపు తప్పేలా ఉంచారనే ఆరోపణతో పాటు, దాడి సమయంలో ఆ కుక్క బాధ్యత కూడా ఫాంగ్దేననే మరో ఆరోపణను నమోదు చేశారు. దాదాపు మూడేళ్లకు పైగా కొనసాగిన ఈ కేసు చివరకు కోర్టుకు చేరింది.ఈ ఘటన జరిగిన సమయంలో ఎక్స్ఎల్ బుల్లీ కుక్కలను వేల్స్లో నిషేధిత కుక్కల జాబితాలో చేర్చలేదు. విచారణలో కెవెన్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండేదని, ఆయన మెథడోన్, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. ఫాంగ్ ఇంట్లో ఫైర్, రోగ్ అనే మరో రెండు ఎక్స్ఎల్ బుల్లీ కుక్కలతో పాటు మరికొన్ని కుక్కలు కూడా ఉన్నాయని వెల్లడైంది. రోగ్.. కుకీ తల్లి. ఆ సమయంలో రోగ్ సీజన్లో ఉండటంతో దానిని ఇతర కుక్కలకు దూరంగా ఉంచారు.తన తరఫున వాంగ్మూలం ఇచ్చిన ఫాంగ్.. కుక్కల పెంపకం, వాటి రిజిస్ట్రేషన్ వంటి వ్యవహారాలన్నింటినీ తన భాగస్వామి జాషువా జోన్స్ చూసుకునేవాడని చెప్పారు. కుకీ తనది కాదని, జాషువాకే చెందినదని ఆమె మొదటి నుంచి చెబుతూ వచ్చింది. కెవెన్తో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆయన గతంలో పలు కుక్కలను పెంచుకున్నారని కూడా తెలిపారు. అయితే కుకీ వల్ల ఉన్న ప్రమాదాన్ని తాను తక్కువగా అంచనా వేసినట్లు ఫాంగ్ అంగీకరించారు.ఇరువైపుల వాదనలు విన్న కెర్నార్ఫన్ క్రౌన్ కోర్టు జ్యూరీ కేవలం మూడు గంటల్లోనే తీర్పు ఇచ్చింది. ఫాంగ్పై ఉన్న రెండు ఆరోపణల్లోనూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దాదాపు మూడేళ్లకు పైగా కొనసాగిన కేసుకు ముగింపు పడింది. తీర్పు వెలువడిన సమయంలో ఫాంగ్ కన్నీళ్లు పెట్టుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆలింగనం చేసుకున్నారు. -
జెన్జీ ఆగ్రహం.. హీరో కాస్త విలన్గా!
నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర ‘బాలెన్’ షా.. ప్రధాని పీఠం అధిరోహించిన కొద్ది నెలల్లోనే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగుచెందిన యువతకు ఆశాకిరణంగా కనిపించిన ఆయన.. ఇప్పుడు అదే యువత నుంచి అనూహ్య రీతిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. జెన్జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్ షా.. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.మాజీ అండర్గ్రౌండ్ ర్యాపర్, సివిల్ ఇంజినీర్, ఖాట్మండు మేయర్గా తనదైన ముద్ర వేసిన బాలెన్ షా.. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. మార్చి ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ మెజార్టీ సాధించడంతో.. నేపాల్లో కొత్త రాజకీయ శకానికి నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేతగా, వ్యవస్థలో మార్పు తీసుకురాగల నాయకుడిగా యువత బాలెన్ను ఆదరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.వరుస నిర్ణయాలతో పెరిగిన అసంతృప్తిప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. భారత్ నుంచి కొనుగోలు చేసే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలను కఠినతరం చేయడం మొదటి వివాదంగా మారింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్పై ఆధారపడుతుంటారు. మందులు, నిత్యావసర వస్తువులపై ప్రభావం పడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత భారత్తో సరిహద్దు అంశంపై బాలెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల వివాదంపై మూడో పక్షం సహాయంతో పరిష్కారం సాధించవచ్చనే సంకేతాలు ఇవ్వడం నేపాల్లో విమర్శలకు దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.భారత్ అంశంలో మారిన వైఖరివిదేశీ ప్రతినిధులతో భేటీల విషయంలో బాలెన్ మొదట కఠిన వైఖరిని అవలంబించారు. మంత్రుల స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న అధికారులతో సమావేశాలకు దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. తర్వాత తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. భారత, చైనా రాయబారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇదే సమయంలో ఆర్ఎస్పీ అధినేత రవి లామిచ్చానేకు భారత్లో లభించిన ప్రాధాన్యం కూడా చర్చకు దారితీసింది. లామిచ్చానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో సమావేశం కావడం నేపాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.సొంత పార్టీతోనూ దూరం?బాలెన్ పాలనా శైలిపై మరో ప్రధాన విమర్శ.. ఆయన పార్లమెంట్కు, సొంత పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు. ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు పరిమితంగా హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాయి. ఆర్ఎస్పీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడం తగ్గిందనే చర్చ మొదలైంది. దీంతో బాలెన్ షా–పార్టీ నాయకత్వం మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యువతే తిరగబడిన వేళ..బాలెన్ ఇమేజ్కు అతిపెద్ద దెబ్బ జూలైలో తగిలింది. ఖాట్మండులో మున్సిపల్ పోలీసుల చర్యలపై అసంతృప్తితో రైడ్ షేర్ డ్రైవర్ గణేష్ నేపాలి ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అనధికార నివాసాల తొలగింపు, పేదలకు పునరావాసం కల్పించకపోవడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు బాలెన్కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించింది.మత ఘర్షణలతో మరింత ఒత్తిడిజూలై చివర్లో నేపాల్ దక్షిణ ప్రాంతాల్లో హిందూ–ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు ప్రభుత్వానికి మరో పరీక్షగా మారాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు బాలెన్ తొలిసారి ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది.ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన బాలెన్కు.. పాలన మాత్రం అంత సులభం కాదని ఈ 150 రోజులు నిరూపించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన విధానం అధికారంలో కొనసాగించడం కష్టం. ప్రజల అంచనాలు, వ్యవస్థల నిర్వహణ, రాజకీయ సమన్వయం వంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాళ్లు.జెన్జీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్ షా.. ఇప్పుడు అదే తరం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశకు చేరుకున్నారు. ఐదు నెలల్లో మారిన ఈ రాజకీయ పరిణామాలు.. ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా తగ్గిపోవచ్చని మరోసారి చాటిచెబుతున్నాయి. -
119 ఏళ్ల నాటి ఉరి శిక్ష కేసులో కొత్త మలుపు.. ఆమె నిజంగా నేరస్థురాలేనా?
1907 ఆగస్టు 14.. వేల్స్లోని కార్డిఫ్ జైలు బయట దాదాపు వెయ్యి మంది గుమిగూడారు. లోపల ఓ మహిళ తన 40వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రోజే ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. ఆమె పేరు లెస్లీ జేమ్స్. ఒక రోజు వయసున్న పసికందును ఉద్దేశపూర్వకంగా ఊపిరాడకుండా చేసి చంపిందన్న ఆరోపణలతో ఆమెకు మరణశిక్ష పడింది. అప్పట్లో ఈ కేసు వేల్స్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే 119 ఏళ్ల తర్వాత ఈ కేసు మరోసారి చర్చలోకి వచ్చింది. రచయిత్రి మేరీ జోన్స్ రాసిన ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ లెస్లీ జేమ్స్ పుస్తకం.. అప్పటి విచారణ, సాక్ష్యాలు, లెస్లీ గత జీవితం గురించి ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది.1907 జూలైలో స్వాన్సీ అసైజెస్ కోర్టులో లెస్లీ జేమ్స్పై విచారణ జరిగింది. కెర్ఫిల్లీ ప్రాంతంలోని ఫ్లూర్-డి-లిస్కు చెందిన మాడ్ ట్రెజర్ అనే మహిళకు పుట్టిన పసికందును హత్య చేసిందన్నది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. పాపను డబ్బు తీసుకుని చూసుకునేందుకు లెస్లీ తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రైలులోనే పాపను హత్య చేసిందని ఆరోపించారు. అప్పటి పోలీసులు, కొన్ని వార్తాపత్రికలు ఈ ఘటనను ‘బేబీ ఫార్మింగ్’గా అభివర్ణించాయి. అయితే జోన్స్ ప్రకారం.. లెస్లీపై జరిగిన విచారణ కేవలం 12 నిమిషాల్లోనే ముగిసింది. విచారణ రోజునే న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెకు కొత్త న్యాయవాదిని నియమించడంతో.. కేసును పూర్తిగా సిద్ధం చేసుకోవడానికి, అవసరమైన సాక్షులను కోర్టుకు తీసుకురావడానికి ఆయనకు తగిన సమయం కూడా లేకపోయిందని ఆమె పేర్కొన్నారు.ప్లాన్ ప్రకారమే..?ఈ కేసులో శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా కీలకంగా మారింది. పాపకు అప్పటికే నోట్లో నురుగు వస్తోందని, అందుకే కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా చుట్టి ఉంచారని పోలీసులకు చెప్పినట్లు జోన్స్ తెలిపారు. తల్లి పాలివ్వలేకపోవడం లేదా పాలివ్వడానికి ఇష్టపడకపోవడంతో శిశువుకు జీర్ణం కాని చక్కెర నీటి మిశ్రమాన్ని ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా పాపను చాలా గట్టిగా వస్త్రాలతో చుట్టారని, అందువల్ల లెస్లీ తీసుకెళ్తున్న పార్సిల్ పసికందు అని కూడా ఇతరులు గుర్తించలేకపోయారని చెప్పారు. ఆహారం గొంతులో ఇరుక్కోవడం లేదా గట్టిగా చుట్టడం వల్ల శ్వాస ఆడకపోవడం వంటి కారణాలతోనే శిశువు మరణించి ఉండవచ్చని జోన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెస్లీకి గతంలోనూ ఇద్దరు శిశువులను చూసుకున్న అనుభవం ఉందని పుస్తకం చెబుతోంది. వారిలో ఒక శిశువును సాల్వేషన్ ఆర్మీ వద్ద వదిలిపెట్టి వైద్య సహాయం కోరిందని, మరో శిశువు దత్తత తీసుకున్న తర్వాత ఆరోగ్యంగా పెరిగిందని జోన్స్ పేర్కొన్నారు. ఈ విషయాలు కూడా విచారణలో లెస్లీకి అనుకూలంగా పూర్తిగా ప్రస్తావనకు రాలేదని ఆమె అంటున్నారు.మెదడుకు గాయం.. లెస్లీ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరానికి కొన్ని నెలల ముందు ఆమె బైక్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిందని జోన్స్ తెలిపారు. ముఖ్యంగా ఆమెకు మెదడుకు గాయం కావడంతో సుమారు మూడు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిందని పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆమె చెబుతున్నారు. లెస్లీ నేరానికి ఎంతవరకు బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు జరిగిన మెదడు గాయం, దాని ప్రభావాన్ని న్యాయస్థానం తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉండేదని జోన్స్ అభిప్రాయపడ్డారు.ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం లెస్లీ అసలు గుర్తింపే. అరెస్టయినప్పుడు ఆమె తన పేరు లెస్లీ జేమ్స్ అని చెప్పింది. అయితే అంతకుముందు ప్రజా రికార్డుల్లో ఆమెను రోడా విల్లిస్, రోడా డాల్జెల్, రోడా లాసెల్స్ వంటి పేర్లతో నమోదు చేసినట్లు జోన్స్ తెలిపారు. ఆమె 1863లో సుందర్ల్యాండ్లో జన్మించి ఉండవచ్చని, లండన్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నట్లు స్వయంగా చెప్పినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం ఆమె బాగా చదువుకున్న, స్పష్టంగా మాట్లాడగలిగే మహిళ. ఆమె నగల వ్యాపారి ఎర్నెస్ట్ డాల్జెల్ కుమార్తె అయి ఉండవచ్చని, అందువల్ల ఆమెకు ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండే అవకాశం ఉందని జోన్స్ అభిప్రాయపడ్డారు.క్షమాభిక్ష తిరస్కరణ..లెస్లీ ప్రాణాలను కాపాడేందుకు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. కార్డిఫ్ కౌన్సిల్, ఆమె న్యాయవాది హ్యారీ లాయిడ్, సాధారణ ప్రజలు కలిసి క్షమాభిక్ష కోసం పిటిషన్ చేపట్టారు. దాదాపు 50 వేల మంది దానిపై సంతకాలు చేశారు. ఉరిశిక్ష అమలు రోజున కార్డిఫ్ జైలు బయట సుమారు వెయ్యి మంది గుమిగూడారు. ఆమెను క్షమించాలని వారు కోరారు. కానీ వారి విజ్ఞప్తులు ఫలించలేదు. అంతకుముందు రాత్రే అప్పటి హోం సెక్రటరీ హెర్బర్ట్ గ్లాడ్స్టోన్ క్షమాభిక్షను తిరస్కరించారు. దక్షిణ వేల్స్లో విస్తరిస్తున్న ‘బేబీ ఫార్మింగ్’ను అరికట్టేందుకు లెస్లీ కేసును ఒక ఉదాహరణగా నిలపాలనే ఉద్దేశంతోనే ఆమెకు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు జోన్స్ పేర్కొన్నారు.లెస్లీ కేసులో అప్పటి మీడియా వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఆమె నేరం కంటే అందం, ప్రశాంతత, వ్యక్తిత్వంపైనే పత్రికలు ఎక్కువగా దృష్టి పెట్టాయని జోన్స్ అన్నారు. ఉరిశిక్ష అమలు చేసిన అధికారి హెన్రీ పియర్పాయింట్ కూడా ఆమె అందం గురించి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష సమయంలో ఆమె ప్రశాంతంగా ఉన్న తీరు, ఆమె జుట్టుపై పడిన సూర్యకాంతి వంటి విషయాలు కూడా అప్పటి వార్తల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఒక మహిళపై సమాజం, మీడియా చూపిన దృష్టికోణం కూడా ఆమె కేసును ప్రభావితం చేసి ఉండొచ్చని జోన్స్ అభిప్రాయపడ్డారు.1907 ఆగస్టు 14న లెస్లీ జేమ్స్ ఉరిశిక్షకు గురైంది. వేల్స్లో ఉరిశిక్షకు గురైన చివరి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆమె నిజంగా హంతకురాలా? లేక అప్పటి పరిస్థితులు, తొందరపాటు విచారణ, సామాజిక ఒత్తిళ్లకు బలైన మహిళా? 119 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం.. లెస్లీ జేమ్స్ కేసును చరిత్రలోని అత్యంత అనుమానాస్పద ఉరిశిక్ష కేసుల్లో ఒకటిగా నిలబెడుతోంది. -
హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్కు సవాల్గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
భారత్కు 150 మంది పాక్ వధువులు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, వాఘా-అటారీ సరిహద్దు మూసివేత తదితర పరిణామాల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వివాహాలు వాయిదా పడిన 150 మందికి పైగా పాకిస్థానీ సింధీ వధువులు ఎట్టకేలకు తమ పెళ్లిళ్ల కోసం భారత్ చేరుకున్నారు. భారత యువకులతో నిశ్చితార్థం చేసుకున్న వీరు, నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా విమాన మార్గంలో దేశంలోకి అడుగుపెట్టారు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వీరికి, వారి బంధువులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక షరతులతో కూడిన వీసాలు జారీ చేసిందని కమ్యూనిటీ నేత రాజేష్ ఝంబియా ఆదివారం తెలిపారు. ‘వారి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వధువులు, దాదాపు 450 మంది బంధువులు మస్కట్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల మీదుగా కనెక్టింగ్ విమానాల ద్వారా మాత్రమే భారత్ చేరుకోవాలని కేంద్రం నిబంధన విధించింది’ అని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.గతంలో వాఘా-అటారీ సరిహద్దు గుండా వీసా ప్రక్రియ, ప్రయాణాలు సులభంగా ఉండటంతో పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన కుటుంబాలు భారతీయులతో వివాహ సంబంధాలు కుదుర్చుకునేవి. అయితే జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భారీ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, వాఘా-అటారీ సరిహద్దును మూసివేసింది. దీంతో నాగ్పూర్, రాయ్పూర్, జోధ్పూర్, పుణె తదితర నగరాల్లో జరగాల్సిన సుమారు 150 వివాహాలు నిలిచిపోయాయని ఝంబియా వివరించారు.ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ ఘోట్కిలోని ప్రసిద్ధ హిందూ మత క్షేత్రమైన షాదానీ దర్బార్ అధిపతి సంత్ యుధిష్ఠిర్లాల్ షాదానీని ఆశ్రయించాయి. ఆలయ యాజమాన్యం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను (ఎంహెచ్ఏ) అభ్యర్థించడంతో, ప్రత్యేక విమాన ప్రయాణ షరతులతో కూడిన వీసాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 150 మంది వధువులు భారత్ చేరుకున్నారని, ఇందులో 15 మంది నాగ్పూర్లో వివాహం చేసుకోనున్నారని ఝంబియా పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 300 మంది పాకిస్థానీ సింధీ మహిళలు సైతం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి -
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి
కొనాక్రీ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇక్కడి ఒక డంపింగ్ యార్డులోని భారీ చెత్త కుప్ప ఒక్కసారిగా కుప్పకూలి సమీపంలోని నివాసాలపై పడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. కొనాక్రీలోని దార్ ఎస్ సలామ్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ఫిల్లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త దిబ్బలు సమీపంలోని ఇళ్లపై విరిగిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు ఒక అపార్ట్మెంట్తో పాటు సమీపంలోని పలు నివాసాలు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయాయి.సమాచారం అందుకున్న గినియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎన్జీయూసీహెచ) సిబ్బంది, స్థానికులు ఎక్స్కవేటర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ దుర్ఘటనలో తన ఐదుగురు పిల్లలను కోల్పోయినట్లు స్థానిక బాధితుడు సిరే డియాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డు కూలే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం, ముందస్తుగానే స్థానికులను ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పలువురు నివాసితులు అక్కడే ఉండిపోవడంతో ప్రాణనష్టం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి అమదౌ బార్ సందర్శించి బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ల్యాండ్ఫిల్ను శాశ్వతంగా మూసివేసి, వ్యర్థాలను నగర శివార్లకు తరలిస్తామని ప్రాదేశిక పరిపాలన శాఖ మంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలు, అపారమైన ఇనుప ఖనిజ సంపద ఉన్నప్పటికీ, గినియాలో మౌలిక సదుపాయాల కొరత, పేదరికం తీవ్రంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు తెలియజేస్తున్నాయి. -
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
హర్దీప్ నిజ్జర్ను చంపింది మేమే
న్యూఢిల్లీ: కెనడాలో 2023లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు తనదే బాధ్యతని గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించుకున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం డ్రగ్స్ దందాను నిజ్జర్ ప్రోత్సహిస్తున్నందుకే నిజ్జర్ను తన ముఠా చంపిందని తెలిపాడు. యూకేకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్ సింగ్ పమ్మాతో కొంతకాలం క్రితం గోల్డీబ్రార్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బ్రార్ ఇందులో నిజ్జర్ను ఎందుకు చంపాల్సి వచ్చిందో పమ్మాకు చెప్పాడు. ‘టీనేజర్లను బెదిరించి డ్రగ్స్ దందాకు వాడుకున్నాడు. వారితో కావాల్సినవిధంగా పనులు చేయించుకునేవాడు. ఆయుధాల స్మగ్లింగ్తో అతడికి సంబంధాలున్నాయి. అందుకే చంపేశాం’అని బ్రార్ అంటున్నట్లుగా అందులో ఉంది. కాగా, 2023 జూన్ 19వ తేదీన ఓ గురుద్వారా వద్ద హత్యకు గురయ్యాడు. ఇది భారత ప్రభుత్వం చేయించినపనే అంటూ అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు ప్రకటించడం గమనార్హం. -
అమెరికాలో కాల్పుల్లో భారతీయుడు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లోని కపుర్తలాకు చెందిన 28 ఏళ్ల గుర్దీప్ సింగ్ దాదాపు పదేళ్లుగా క్వీన్స్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి అతడితో ఘర్షణ పడ్డాడు. ఈ సమయంలో తుపాకీతో గుర్దీప్పై కాల్పులు జరిపి కారులో పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన గుర్దీప్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను అమెరికాకు చెందిన నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దీనిని కేవలం ఓ సాధారణ కాల్పుల ఘటనగా వదిలేయ వద్దని, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, కారణాలు కనుగొనాలని డిమాండ్ చేసింది. -
జైషే ప్రధాన కార్యాలయం పునర్నిర్మాణం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం గత ఏడాది మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ముష్కరులకు భారీగా నష్టం వాటిల్లింది. పలువురు అంతమయ్యారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మర్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం తీవ్రస్థాయిలో ధ్వంసమైంది. ఈ కార్యాలయాన్ని జైషే మొహమ్మద్ పునర్నిర్మించుకుంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొత్త పాలరాయి, రంగులు హంగులతో పునరుద్ధరించారు. భారత సైన్యం దాడుల్లో దెబ్బతిన్న గోపురాలను పునర్నిర్మించారు. గోతులను పూడ్చేశారు. నిర్మాణాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మర్కజ్ సుభాన్ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం జైషే మొహమ్మద్కు ఏకంగా రూ.25 కోట్లు వాయిదాల రూపంలో అందజేసింది. ఇందులో సుమారు రూ.11 కోట్లను ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మదర్సా అల్–సబీర్, జైషే మొహమ్మద్ కమాండర్లు ఉపయోగించే నివాస గృహాలతో సహా ప్రధాన సముదాయానికి ఆనుకుని ఉన్న దెబ్బతిన్న నిర్మాణాలను తొలగించి, ఆ స్థలంలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన 15 నెలల తర్వాత ఈ పునర్నిర్మాణం పూర్తయింది. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కజ్ సుభాన్ అల్లా హెడ్ క్వార్టర్ను జైషే మొహమ్మద్ తమ కార్యకర్తల నియామకం, శిక్షణ, సిద్ధాంతాల బోధన కోసం ఉపయోగిస్తోంది. ఈ 18 ఎకరాల ‘ఉస్మాన్–ఓ–అలీ క్యాంపస్’ ప్రాంగణంలో ఒక మసీదు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వాస్తవానికి జైషే మొహమ్మద్ను పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2002లో∙నిషేధించినప్పటికీ ఆ సంస్థ పాక్ నుంచే తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. -
లండన్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి ‘మీట్ అండ్ గ్రీట్’
లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు, ఇండియన్, తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని ప్రముఖ తాజ్ హోటల్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్, ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకేలోని తెలుగు కమ్యూనిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వ అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులతో ముఖాముఖిగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.తెలంగాణ రైజింగ్కు ప్రవాసులు భాగస్వాములు కావాలిసీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్’కు ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న ప్రయాణంలో ప్రవాసులు చురుకైన భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.ఎన్నారైలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులతో స్వయంగా మమేకమైన సీఎం.. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. ప్రవాస తెలంగాణ సమాజం మధ్య నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు.పెట్టుబడులు, విద్యపై ప్రత్యేక దృష్టికార్యక్రమంలో పెట్టుబడులు, విద్యారంగం, ఎన్నారైలతో తెలంగాణ ప్రభుత్వ అనుసంధానం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. యూకే, యూరప్లో ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా మరింత అనుకూల వాతావరణం కల్పించడం, విద్యారంగంలో అంతర్జాతీయ అనుభవాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేయడం, ప్రవాస నిపుణుల సేవలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చ జరిగింది.సీఎం రేవంత్ రెడ్డిపై సుధాకర్ గౌడ్ ప్రశంసలుకార్యక్రమ నిర్వాహకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి లండన్తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. గతంలో లండన్ పర్యటన సందర్భంగా గల్ఫ్ ఎన్నారైలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయాన్ని ప్రస్తావించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని, ఆయనకు లండన్లోనే కాకుండా యూకేలోని ప్రవాస భారతీయులు, తెలంగాణ సమాజంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆయనకు అండగా నిలిచే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని అన్నారు.ఎన్నారైలకు తెలంగాణ ప్రభుత్వంతో మరింత బలమైన కనెక్టివిటీయూకేలో ఉన్న పెట్టుబడులు, విద్యా అవకాశాలు, ఎన్నారైల అవసరాలకు తెలంగాణ ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం కల్పించేలా ఒక బలమైన వారధి ఉండాలని సుధాకర్ గౌడ్ కోరారు. యూకేలోని తెలంగాణ సమాజం, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో మరింత సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని సూచించారు.ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని వారు వెల్లడించినట్లు చెప్పారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నారై పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి సవివరంగా వివరించారు. అలాగే యూకే, యూరప్కు భారత్తో వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నందున, అక్కడి ఎన్నారైలు, పెట్టుబడిదారులు, నిపుణులకు అనుకూలంగా ప్రత్యేక విధివిధానాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.విద్యారంగంపై ప్రశ్నోత్తరాల సెషన్కార్యక్రమంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్లో తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలు, విద్యావేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు.విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణుల అనుభవం, జ్ఞానం, ఆలోచనలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకునేలా ప్రభుత్వం, ప్రవాస తెలంగాణ సమాజం మధ్య మరింత సమన్వయం అవసరమని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.‘లెట్స్ యునైట్.. లెట్స్ ఎంగేజ్.. లెట్స్ బిల్డ్ ఎ బెటర్ తెలంగాణ’“Let’s Unite. Let’s Engage. Let’s Build a Better Telangana” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, విదేశాల్లోని నిపుణుల అనుభవాన్ని తెలంగాణ ప్రగతికి వినియోగించుకోవడం, ప్రభుత్వంతో ప్రవాస సమాజానికి మరింత బలమైన అనుసంధానం కల్పించడం వంటి అంశాలపై సమావేశం ద్వారా స్పష్టమైన దిశ ఏర్పడింది.సుధాకర్ గౌడ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ‘లండన్ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్ర ప్రగతికి అనుసంధానం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. -
మరోసారి పాక్ బుద్ధి బట్టబయిలు.. కోట్ల కరెన్సీతో జైషే స్థావరం
ఇస్లామాబాద్: గతేడాది పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైంది.కాగా ఇప్పుడు తాజాగా ఆ స్థావరాన్ని పునర్నిర్మించినట్లు వార్తకథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా దానిని మరింత హంగులతో నిర్మించేందుకు పాకిస్తాన్ భారీగానే నిధులు కేటాయించిందని సమాచారం.2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ దాడి చేసింది. బహవల్పూర్లోని జామియా మస్జిద్ సుభాన్ అల్లాహ్పై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు, మరో నలుగురు సన్నిహిత సహచరులు మరణించారు. ఈ వివరాలు స్వయంగా మసూద్ అజర్ వెల్లడించారు. తాజాగా ఆస్థావరాన్ని పునర్నిర్మించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. దాడుల్లో దెబ్బతిన్న జైష్ స్థావరం ఇప్పుడు కొత్త మార్బుల్, తాజా పెయింట్, కొత్త ప్లాస్టర్తో తిరిగి పునరుద్ధరించబడింది. దాడుల వల్ల ఏర్పడిన నష్టం బయటకు కనిపించకుండా భవనాలను పూర్తిగా మరమ్మతులు చేసినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రధాన సముదాయానికి ఆనుకుని దెబ్బతిన్న నిర్మాణాలను కూడా తొలగించి, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.పునర్నిర్మాణానికి 25 కోట్ల పాకిస్థానీ కరెన్సీ?కాగా ఈ స్థావరం పునర్నిర్మానం కోసం 25 కోట్ల పాకిస్థానీ రూపాయలను నగదు వాయిదాల రూపంలో అందించినట్లు భారత ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుతోంది. దాడుల సమయంలో ఏర్పడిన ప్రధాన హాల్లోని గుంతలను పూడ్చివేసి, దెబ్బతిన్న గోపురాలను తిరిగి నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. దీనికోసమే సుమారు 11 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.ఉగ్ర శిక్షణకు కేంద్రంగా స్థావరంఈ సముదాయం గతంలో ఉగ్రవాద భావజాల బోధన, శిక్షణకు కీలక కేంద్రంగా పనిచేసినట్లు నివేదిక తెలిపింది. ఇక్కడ ఉగ్రవాద నియామకులకు క్రమం తప్పకుండా ఆయుధాల వినియోగ శిక్షణ, శారీరక వ్యాయామాలు, మతపరమైన బోధనలు నిర్వహించేవారని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కేంద్రాలను పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు తరలించినట్లు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. -
బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోరం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబంతో సహా అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలు నివాసంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే వీరిని ఎవరూ హత్యచేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు.మృతులు విశ్రాంత ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), అతని భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా పోలీసులు గుర్తించారు. దాస్పరా ప్రాంతంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పోలీసులు ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగి గణపతి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. అయితే వారి బంధువులు ఇటీవల తరచుగా ఫోన్లు చేశారు. అయితే వారి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో వారి ఉనికిపై బంధువులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫోన్లు గురువారం రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన బంధువులు శనివారం రాత్రి వారి ఇంటికి వచ్చి చూశారు. ఇల్లు బయటి నుంచి తాళం వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, ఇంట్లో నలుగురి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.తల్లీకూతుళ్ల మృతదేహాలు మెట్లపై లభించగా, గణపతి మృతదేహం పైకప్పుపై, కుమారుడి మృతదేహం మంచం కింద లభించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ), డిటెక్టివ్ బ్రాంచ్ (డీబీ) అధికారులు సంయుృతంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీరిని ఎవరూ హత్య చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఈ హత్యలపై గణపతి చక్రవర్తి కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నలుగురినీ ఎవరు చంపి ఉంటారో, వారి వెనుక ఉద్దేశ్యం ఏమిటో తమ కుటుంబానికి అర్థం కావడం లేదు. నా సోదరిని, ఆమె కుటుంబం మొత్తాన్ని ఎవరు చంపారో, అది ఎందుకు, ఎప్పుడు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నా సోదరి భర్త చాలా మంచివాడు. అతనికి శత్రువులు లేరు. వారు దాస్పారాలో ఒక కొత్త ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు." అని అన్నారు. కాగా బంగ్లాదేశ్లో తారిఖ్ రహమాన్ ప్రభుత్వం ఏర్పడక ముందు తీవ్ర స్థాయిలో మత ఘర్షణలు చెలరేగాయి. అక్కడి మత ఛాందసవాదులు పెద్దఎత్తున హిందు కుటుంబాలపై దాడులకు తెగబడ్డారు.కాగా ప్రస్తుతం జరిగిన హత్యల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి తెరపైకి అమెరికా ‘51వ’ రాష్ట్రంగా కెనడా
వాషింగ్టన్: అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కెనడాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడా అతిగా డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ.. గతంలో తాను చేసిన ‘51వ రాష్ట్రం’ వ్యాఖ్యలను ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు.కెనడా అమెరికా రాష్ట్ర అయ్యేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ అమెరికాలోని రాష్ట్రాలు పొందుతున్న ప్రయోజనాలన్నింటినీ తాను పొందాలని కోరుకుంటోంది. అంతేకాకుండా వారు అమెరికా రైతులపై గత అనేక సంవత్సరాలుగా భారీ మొత్తంలో సుంకాలు విధిస్తున్నారు. ఇకపై అది కుదరదు. అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లకు ప్రతిగా తాము కూడా డాలర్కు డాలర్ పద్ధతిలో దీటుగా స్పందిస్తామని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. టారిఫ్ల విధింపు అనేది కెనడాపై జరిగిన దాడిగా అభివర్ణించిన మార్క్ కార్నీ, దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం కెనడా దిగుమతులపై 50 శాతం టారిఫ్ను ప్రకటించింది. ముందస్తుగా కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం వాణిజ్య వ్యాపారాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించిందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఉక్కు, అల్యూమినియం వంటి రంగాలపై సుంకాలు తగ్గించేందుకు అమెరికా ముందుకు వచ్చినప్పటికీ కెనడా వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.అయితే, అమెరికా చివరి నిమిషంలో నిబంధనలను మార్చడం అన్యాయమని, ఆర్థికంగా అవి సరిపడేలా లేవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తిప్పికొట్టారు. అమెరికా చర్యల వల్ల ఏ ఒప్పందంపైనైనా నమ్మకం సడలిపోతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు నెలకొన్న ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. కెనడా తన చర్చల బృందాన్ని వెనక్కి పిలవగా, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. -
బంగ్లా నిర్ణయంపై హైటెన్షన్.. భారత్కు డేంజర్ బెల్!
ఒకవైపు పాకిస్తాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెడుతుందా? అదే జరిగితే భారత్కు ఏంటి పరిస్థితి? ఢిల్లీకి ఇది కేవలం మరో దేశం తీసుకునే విదేశాంగ నిర్ణయమా? లేక భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు ఇది సంకేతమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసియాలో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తొలిసారి సౌదీ–పాక్–టర్కీ రక్షణ వ్యవస్థలో చేరే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా.. ‘ముందు బంగ్లాదేశ్ ప్రయోజనాలే’ అంటూ తలుపులు తెరిచి ఉంచింది. దీంతో, కొత్త సమీకరణాలు భారత్ ముందుకు వస్తున్నాయి.ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై కూడా దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ సహకారానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఇదే వ్యవస్థలోకి బంగ్లాదేశ్ వస్తే.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి రావడం ఖాయం.బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో చేరే అవకాశంపై బంగ్లాదేశ్ సానుకూల దృక్పథంతో ఉందని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. అది బంగ్లాదేశ్, అక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరో సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం కూడా ఇదే మాట చెప్పారు. ఏ కూటమిలో చేరాలన్నా జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని తెలిపారు.భారత్కు అసలు ప్రశ్న..ఇక్కడే భారత్కు అసలు ప్రశ్న మొదలవుతోంది. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే వెంటనే భారత్కు సైనిక ముప్పు ఏర్పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అంచనాకు తావు లేదు. ఈ రక్షణ ఒప్పందం భారత్ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడినదని ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ చేరినంత మాత్రాన భారత్పై యుద్ధ ముప్పు పెరుగుతుందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ సమస్య అంతకంటే లోతైనది. ఇది నేరుగా సైనిక ముప్పు కంటే.. దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రాంతీయ సమీకరణాలకు సంబంధించిన అంశం.ఎందుకంటే భారత్కు బంగ్లాదేశ్ సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారతదేశానికి భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం. సరిహద్దు భద్రత నుంచి వాణిజ్యం వరకు, రవాణా మార్గాల నుంచి ప్రాంతీయ కనెక్టివిటీ వరకు ఢాకాతో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. గత కొన్నేళ్లుగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఈ ప్రాధాన్యత చుట్టూనే బలపడ్డాయి. అలాంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలతో కూడిన రక్షణ వ్యవస్థకు దగ్గరవుతే.. ఢిల్లీకి మాత్రం అది సాధారణ పరిణామం కాదు. అందులోనూ పాకిస్తాన్ పేరు ఉండటం మరింత ఆసక్తికరం. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో నిండిన నేపథ్యంలో.. ఢాకా ఇస్లామాబాద్తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటే పాక్కు దౌత్యపరంగా అదనపు బలం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తన ప్రభావాన్ని విస్తరించేందుకు కొత్త వేదిక లభించినట్టవుతుంది.టర్నీతో సవాల్..టర్కీ కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాక్తో టర్కీకి ఇప్పటికే సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తోనూ టర్కీ రక్షణ సహకారాన్ని విస్తరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక, వ్యూహాత్మకంగా అత్యంత ప్రభావశీలమైన దేశం. ఈ మూడు దేశాలతో బంగ్లాదేశ్ ఒకే రక్షణ వ్యవస్థలోకి వస్తే.. పాకిస్తాన్కు పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు విస్తరించే కొత్త దౌత్య నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ వెంటనే ఆ కూటమిలో చేరబోతోందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఢాకా చెబుతున్న “బంగ్లాదేశ్ ఫస్ట్” విధానమే ఇక్కడ కీలకం. ఆర్థికంగా, వాణిజ్యపరంగా లేదా భద్రతాపరంగా తమకు ప్రయోజనం ఉంటేనే అడుగు ముందుకు వేస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది. అంటే ఇది భారత్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడే తేల్చేయలేం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్లపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు.. అయినా ఢిల్లీకి ఇది ఒక కీలక హెచ్చరిక మాత్రం కావచ్చు. బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానాన్ని కొత్తగా సమతుల్యం చేసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్తో సంబంధాలు కొనసాగిస్తూనే.. పాక్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలతో కూడా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవాలని ఢాకా చూస్తే.. దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే.. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే భారత్ సరిహద్దుల్లో వెంటనే సైనిక ముప్పు వచ్చేది కాదు. కానీ భారత్ చుట్టూ వ్యూహాత్మకంగా మారుతున్న సమీకరణాల్లో మరో కీలక మలుపు మాత్రం అవుతుంది. ఇవన్నీ కలిస్తే ఢిల్లీ తన ‘నెయిబర్హుడ్ ఫస్ట్’ వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. -
‘న్యూ యూఎస్ టెరిటరీ’.. ట్రంప్ పోస్టుతో ముదిరిన మంటలు!
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి హార్ముజ్ జలసంధి వద్దకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని ‘NEW US Territory’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో మరోసారి పోస్టు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆగస్టు 18న ఇదే చిత్రాన్ని తొలిసారి షేర్ చేసిన ట్రంప్.. తాజాగా మళ్లీ దాన్ని పంచుకోవడం ద్వారా హార్ముజ్పై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న సంకేతం ఇచ్చారు.అంతకుముందు ఆగస్టు 14న లాంగ్ ఐలాండ్లోని పోలీస్ అకాడమీలో మాట్లాడిన ట్రంప్.. ‘త్వరలోనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా అధ్యక్షుడి ప్రకటనతోనే హార్ముజ్పై అమెరికాకు చట్టపరమైన సార్వభౌమాధికారం ఏర్పడదు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవలేని అమెరికా అసమర్థతకు, అదే జలసంధిని సొంతం చేసుకుంటామన్న వాదనకు మధ్య ఉన్న అంతరం.. వాషింగ్టన్ నుంచి హార్ముజ్ వరకు ఉన్న 7,000 మైళ్ల దూరం కంటే ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా అనంతర వ్యవస్థకు స్వాగతం అంటూ అమెరికాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.🔴President Trump just posted a map labeling the Strait of Hormuz as “NEW U.S. Territory.” The critical waterway is clearly circled and claimed. This follows his repeated statements that America now controls the Strait. Iran’s ability to threaten global oil shipping is being… pic.twitter.com/4TbQoFMNWC— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 22, 2026ఇదే సమయంలో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాపై కూడా వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు సహకరించే దేశాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ విధించబోయే ద్వితీయ ఆంక్షలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి ఆధారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఆర్థిక యుద్ధంలో తమతో చుట్టుపక్కల దేశాలు చేరితే వాటిని శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఎల్నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం!ప్రస్తుతం అసలు సమస్య అంతా హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ మార్గంలో చమురు, ఎల్ఎన్జీ రవాణా భారీగా దెబ్బతింది. కొద్దిమంది వాణిజ్య నౌకలు మాత్రమే జలసంధిని దాటుతుండగా.. పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఎల్ఎన్జీ నౌకలు రాకపోకలకు దూరంగా ఉంటున్నాయి. ఇరాక్ విజ్ఞప్తి మేరకు కొన్ని ఇరాకీ చమురు నౌకలకు మాత్రం హార్ముజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. హార్ముజ్ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దాని ప్రభావం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. -
పర్షియన్ గల్ఫ్లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం
టెహ్రాన్: అమెరికా తన వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ మూసివేసే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, ఆ దేశం తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు ఈ జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్ఐబీ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు.వాషింగ్టన్ ప్రత్యక్ష సైనిక దాడులకు స్వస్తి చెప్పి, ఆర్థిక ఆంక్షల వైపు మళ్లిందని రెజాయ్ పేర్కొన్నారు. ఇరాన్పై ఆర్థిక దిగ్బంధం విధిస్తే లొంగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భరోసా ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే ఆంక్షలను అధిగమించి చమురు ఎగుమతులు కొనసాగించే మార్గాలను తాము ఎప్పటినుంచో నేర్చుకున్నామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో 50 శాతానికి పైగా భూభాగం ఇరాన్దేనని, హార్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు.ఈ జలసంధి అమెరికా భూభాగమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక దిగ్బంధం ముగింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేతతో కూడిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా నెరవేరిస్తేనే జలసంధిని తెరుస్తామని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, యూఎస్ నౌకాదళ భద్రతతో చమురు రవాణా నిరాటంకంగా సాగుతోందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: బుల్లెట్ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ హిస్టరీ ఇదే! -
రష్యా దాడుల్లో మరో ఏడుగురు మృతి
కీవ్: ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత క్రీవ్యీ రిహ్ నగరంలోని షాపింగ్ మాల్పై జరిపిన భీకర క్షిపణి దాడిలో 16 మంది మృత్యువాతపడగా, 130 మంది వరకు గాయాలయ్యారు. ఇప్పటికీ మరో నలుగురి జాడ తెలియడం లేదని అధికారులు శనివారం తెలిపారు. ఈ దాడిని డబుల్ టాప్ స్ట్రయిక్గా జెలెన్స్కీ అభివర్ణించారు. లక్ష్యంపై ముందుగా డ్రోన్లతో దాడులు చేయడం, సహాయక సిబ్బంది బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరోసారి భారీ దాడికి పాల్పడటాన్నే డబుల్ ట్రాప్ దాడిగా పేర్కొంటారు. రష్యా దాడి కారణంగా 9 వేల చదరపు మీటర్ల ప్రాంతం మొత్తం బూడిదగా మారిందని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉండటాన్ని అదనుగా తీసుకుని రష్యా దాడుల పరంపరను కొనసాగించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జరిపిన క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో మరో ఏడుగురు చనిపోగా, పదుల సంఖ్యలో క్షతగాత్రు లయ్యారు. యుద్ధ క్షేత్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాకు చెందిన సమారాలోని నోవోకుబిషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీతోపాటు ఓజోన్ కంపెనీ గోదాముపైనా తాము దాడి చేసినట్లు జెలెన్స్కీ చెప్పారు. -
ఆ నిర్ణయం చెల్లదు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్, ఇరాన్, రష్యా, సోమాలియాతో సహా 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యూయార్క్లోని యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి జెనెట్ వర్గాస్ శుక్రవారం రద్దు చేశారు. ట్రంప్ సర్కార్ వైఖరి చట్ట విరుద్ధంగా, శాసనాధికారాన్ని ధిక్కరించేలా ఉందని తేల్చిచెప్పారు. జడ్జి జెనెట్ వర్గాస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన న్యాయమూర్తి కావడం విశేషం. ఏ వీసా నిర్ణయంలోనైనా కాన్సులర్ అధికారులకే అగ్రస్థానం ఇవ్వాలన్న కాంగ్రెస్ నిబంధనను కూడా ఈ విధానం బలహీనపరుస్తుందని వర్గాస్ అన్నారు. ఒక వలసదారుడు వీసాకు అర్హుడా కాదా అని నిర్ణయించే ప్రత్యేక అధికారాన్ని, విచక్షణాధికారాన్ని కాంగ్రెస్ కాన్సులర్ అధికారులకు కల్పించిందని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి జాతీయత ఆధారంగా ఇమ్మిగ్రేషన్ వీసాల జారీని నిషేధించే ఈ విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అర్హులైన దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించాలని ఆదేశించడం ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని వ్యతిరేకించడమే అవుతుందని పేర్కొన్నారు. 75 దేశాల పౌరులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, 11 మంది వ్యక్తులు కోర్టులో సవాలు చేశారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి జెనెట్ వర్గాస్ విచారణ చేపట్టారు. 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను నిలిపివేయడం చెల్లదని తీర్పు వెలువరించారు. -
చైనా రూటే సెపరేటు
జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద నీళ్లున్నాయని తెలుసు. కానీ ఏ రూపంలో? ఎంత మోతాదులో? మనం వాడుకోగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు తెలియనున్నాయి. అంతా చైనా ప్రయోగిస్తున్న ఛాంగీ–7 యాత్ర ఫలితం. ఒక పక్క నాసా తన ఆర్టిమిస్–3 ప్రోగ్రామ్ ద్వారా జాబిల్లిపై శాశ్వత మానవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తూంటే.. ఇంకోవైపున చైనా వినూత్నమైన రీతిలో జాబిల్లిపై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తూండటం విశేషం. జాబిల్లిపై నీరున్న విషయం తెలిసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. తెలియనిదల్లా అది ఏ రూపంలో ఉంది? వంటి వివరాలు మాత్రమే. ఎందుకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యరశ్మి సోకని అంటే వెలుగు అస్సలు లేని ప్రాంతంలో నీటి ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి ఉష్ణోగ్రతలు –200 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉంటాయని అంచనా. అంతటి శీతల పరిస్థితుల్లో నీరు ఏ రూపంలో ఉందో? మనం దాన్ని ఎలా వాడకానికి అనువుగా మార్చుకోవాలో ఇప్పటివరకూ తెలియదు. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దేందుకు చైనా ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో జరిగే చాంగీ–7 ప్రయోగం ఈ దిశగా వేస్తున్న తొలి అడుగు. జాబల్లిపైకి ఇటీవలే జరిగిన ఒక ప్రయోగం విఫలమైనప్పటికీ చైనా సరికొత ఇంజిన్తో తాజా ప్రయత్నం చేస్తోంది. చాంగీ–7 లక్ష్యాలేమిటి? ఇప్పటివరకూ జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి జరిగిన అంతరిక్ష ప్రయోగాల కంటే చాంగీ–7 భిన్నమైంది. ఎందుకంటే ఇందులో ఒక ఆర్బిటర్, ల్యాండర్, రోవర్తోపాటు ఒక హాపర్ కూడా ఉంటాయి. 2024 మార్చిలోనే ప్రయోగించి ప్రస్తుతం కక్ష్యలో ఉన్న క్యూకియా–2 రిలే శాటిలైట్ కూడా చాంగీ–7 ప్రయోగానికి ఎంతో ఉపయోగపడనుంది. చాంగీ–7 కచ్చితంగా ఎక్కడ ల్యాండ్ అవుతుందన్నది ఇప్పటికైతే తెలియదు కానీ.. ఆర్టిమిస్–3 ద్వారా నాసా ఏర్పాటు చేయాలని అనుకుంటున్న కేంద్రం కోసం ఎంపిక చేసిన షాకిల్టన్ క్రేటర్కు సమీపంలోనే సూర్యరశ్మి తాకే చోట ఉండవచ్చునని అంచనా. ఈ మొత్తం ప్రయోగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘హాపర్’గురించి. ఇది చక్రాలున్న రోవర్ లాంటిది కాదు. అక్కడి నేలలో గుంతల్లాంటివి కానీ, నెర్రెలు కానీ ఉంటే వాటిని దాటేందుకు ఎగరగల సామర్థ్యం ఉన్నది. సాధారణ వాహనాలు ప్రయాణించలేని లోతులకు కూడా ఇది వెళ్లగలదు. ఆర్టిమిస్–3 ద్వారా నాసా కూడా జాబిల్లిపైని నీటిని, వనరులను గుర్తించి వాడుకునేందుకు చైనా కంటే భిన్నమైన మార్గంలో ప్రయత్నిస్తోంది. చాంగీ–7 చైనా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కాగా... నైసా వాణిజ్యస్థాయిలో ప్రైవేట్ సంస్థల ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చాంగీ–7 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఉపయోగించదగ్గ వనరులు ఏమేం ఉన్నాయి? అన్నదానిపై కూడా దృష్టి పెట్టనుంది. రెండేళ్ల తరువాత అంటే 2028లో జరిగే చాంగీ–8 ద్వారా ఈ వనరులను వాడుకోవడం ఎలా? అన్నదాన్ని పరిశీలించాలన్నది చైనా ఆలోచన. తరువాతి దశలో భాగంగా మానవ సిబ్బంది జాబిల్లిపైకి చేరతారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్, రష్యాకు చెందిన రస్కాస్మోస్ స్పేస్ ఏజెన్సీలు రెండు కలిసి ‘‘ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్’’నిర్మాణం చేపడతాయి. ఏతావాతా... జాబిల్లిపైకి చేరడం ఎలా అన్నది 20వ శతాబ్ధపు అతిపెద్ద సాంకేతికపరమైన సవాలుగా నిలిస్తే... మనిషి అక్కడ ఎలా బతకాలన్నది ఈ శతాబ్ధపు ముఖ్యమైన ప్రశ్నగా అవతరిస్తోందన్నమాట!!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం
టోక్యో: జపాన్లో ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జనం ప్రాణభయంతో ఇళ్లు నుంచి బయటకు పరుగులుతీశారు. ప్రాణ, ఆస్టి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. టోక్యో నగరం సహా చుట్టుపక్కన ప్రాంతాల్లో భూమి కంపించింది. దక్షిణ ఇబారకీ ప్రాంతంలో భూఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి సునామీ ప్రమాదం ఏమీలేదని అధికారులు స్పష్టంచేశారు. గత నెలలో 7.1 తీవ్రతతో వచి్చన భూకంపం ధాటికి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500 భవనాలు నేలమట్టమయ్యాయి. -
ఒక్కసారిగా మీ ఉద్యోగం పోయినా ఇతడిలా ఉండాలి..
అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, టెకీకి తన తండ్రి అందించిన అచంచలమైన మద్దతు ధైర్యాన్ని ఇచ్చింది. యూకేలో జేపీ మోర్గాన్ ఉద్యోగం నుంచి తనను తొలగించిన తర్వాత కైష్ అన్సారీ ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. అందులో తన తండ్రి తనకు ఓదార్పునిచ్చిన తీరు కనిపించింది.గతంలో టైలర్గా పనిచేసిన తన తండ్రి, తన ఉద్యోగం గురించి కాకుండా ప్రధానంగా తన మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని చెప్పారు. తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రోత్సహించారని కైష్ అన్సారీ తెలిపారు. “ఈ వీడియోను సానుభూతి కోసం షేర్ చేయడం లేదు. కష్టకాలంలో ఉన్న ఎవరికైనా మీరు ఒంటరిగా లేరని గుర్తు చేయడానికే పంచుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది” అని కైష్ అన్సారీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన విషయంపై కైష్ అన్సారీ మాట్లాడుతూ.. “ఉద్యోగం నుంచి తొలగించడం బాధాకరం. మీరు ఎంత అనుభవం ఉన్నవారైనా, ఎంత కష్టపడి పనిచేసినా.. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే మీపై మీకు, మీ వృత్తిపై, మీ భవిష్యత్తుపై సందేహాలు మొదలవుతాయి” అని రాశారు. కైష్ అన్సారీ ఉత్తరప్రదేశ్లోని డియోరా జిల్లాలోని సలేమ్పూర్కు చెందినవారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు.తండ్రి మాటలతో ధైర్యం తీవ్రమైన వృత్తిపరమైన ఆత్మన్యూనతకు గురైన సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తనకు ఎలా ధైర్యం ఇచ్చాయో ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ హృదయాన్ని హత్తుకునే సంభాషణను వివరిస్తూ.. కష్టకాలంలో కుటుంబం తనపై ఉంచే నమ్మకమే అత్యంత గొప్ప ప్రేరణ అని చెప్పారు.“అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులతో జరిగే ఒక్క సంభాషణ నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటో గుర్తు చేస్తుంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత నా నాన్నతో జరిగిన సంభాషణలోని చిన్న భాగం ఇది. నిజాయితీగా చెప్పాలంటే, ఆయన చెప్పిన మాటలు ఆయన ఊహించిన దానికంటే నాకు ఎంతో భాగా అర్థమయ్యాయి. నా నాన్న ఎప్పుడూ నాకు అత్యంత గొప్ప ప్రేరణనిచ్చే వ్యక్తుల్లో ఒకరు. ప్రతి విజయంలోనూ, ప్రతి కష్టకాలంలోనూ ఆయనకు నాపై ఉన్న నమ్మకం ఎప్పుడూ మారలేదు. నాపై నాకు సందేహం వచ్చినప్పుడు ముందుకు సాగాలని గుర్తు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు జీవితం అక్కడితో ముగిసిపోదని చెబుతారు” అని కైష్ అన్సారీ తెలిపారు.సంభాషణను ఎందుకు షేర్ చేశారు?భావోద్వేగానికి లోనైన అన్సారీ స్పందిస్తూ.. “అలాంటి మద్దతును కుటుంబం మాత్రమే ఇవ్వగలదు. ఇదే పరిస్థితిని మౌనంగా ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు కాబట్టే దీన్ని పంచుకుంటున్నాను. ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కరణలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు విఫలంకావడం, అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి లేదా ‘ఇక నేను ఏం చేయాలి?’ అని ఆలోచించడం.. వంటి నాకు తెలుసు” అని తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ తిరస్కరణలకు గురవుతున్న వారికి, ఆర్థిక ఆందోళనతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సందేశం ఓదార్పునిస్తుందని ఆయన ఆశించారు.“వారిలో మీరు ఒకరైతే, దయచేసి గుర్తుంచుకోండి.. ఉద్యోగం కోల్పోవడం మీ విలువకు ప్రతిబింబం కాదు. అది మీ వృత్తిలో జరిగిన ఒక సంఘటన మాత్రమే, మీ వృత్తికి ముగింపు కాదు. ఒక్క ఎదురుదెబ్బ కారణంగా ఇప్పటివరకు మీరు సాధించిన ప్రతిదాన్ని మర్చిపోకండి. నేర్చుకుంటూ ఉండండి. మెరుగుపడుతూ ఉండండి. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూనే ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు. మనం ఇంకా కనుగొనని అవకాశాలు ముందున్నాయి. కొన్నిసార్లు జీవితం ఒక తలుపును మూసివేసి, అంతకంటే మెరుగైన దిశగా మనల్ని నడిపిస్తుంది” అని తెలిపారు.నాన్న విషయానికి వస్తే… తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్సారీ.. “మీ ప్రేమ, మీ మద్దతు, మీ దీవెనలు ఎప్పుడూ ముందుకు సాగేందుకు నాకు బలాన్ని ఇచ్చాయి. నేను ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని, నా ఆశయాన్ని, పోరాడాలనే నా సంకల్పాన్ని కోల్పోలేదు. ఈ ఎదురుదెబ్బను ఎదుర్కొని, మరింత బలంగా తిరిగి వస్తాను. అంతకంటే మంచి ఉద్యోగ అవకాశంతో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను” అని తెలిపారు.నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన తన తండ్రి తన ఉద్యోగం కోల్పోవడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని, తాను ఎలా ఉన్నాననే విషయంపైనే ఎక్కువగా ఆందోళన చెందారని అన్సారీ చెప్పారు. “ఆయన ప్రధానంగా నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. ఎందుకంటే నా కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే. నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వృత్తిరీత్యా టైలర్. అందుకే నా కుటుంబం కోసం పని ప్రారంభించడానికి నాకు ఇంకా శక్తి ఉందని చెప్పారు. ప్రాథమికంగా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోమని నేను చెప్పాను. ప్రస్తుతం యూకేలో ఉద్యోగ మార్కెట్ కొంత కష్టంగా ఉంది. అయినప్పటికీ నాకు కొన్ని ఉద్యోగ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నాను. త్వరలోనే నాకు మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది” అని చెప్పారు. View this post on Instagram A post shared by Kaish Ansari (@theengineerguy_) -
పహల్గామ్ అటాక్.. హఫీజ్ సయీద్కు సమన్లు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రదారి లష్కర్-ఎ-తోయిబా (LeT) వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్కు కోర్టు సమన్లు జారీ చేసే దిశగా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ఈ సమన్లను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు సమాచారం అందుతుంది.2025లో పహల్గామ్లోయలో ఉగ్ర దాడి జరిగింది. ఇందులో 26 మంది పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హఫీజ్ సయీద్ను నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో అతడిపై ఇప్పటికే జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.సమన్లు ఎందుకు కీలకం?హఫీజ్ సయీద్ పాకిస్థాన్లో ఉన్నందున భారత దర్యాప్తు సంస్థలు నేరుగా అతడికి కోర్టు నోటీసులు అందజేయడం సాధ్యం కాదు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక వ్యవస్థ ద్వారా కోర్టు సమన్లు అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఒక నిందితుడికి కోర్టులో హాజరై తన వాదన వినిపించే అవకాశం ఇచ్చినట్లు చట్టపరమైన రికార్డులో నమోదు చేయడం ఈ చర్యలో ముఖ్యమైన అంశం.సమన్లు అందించిన తర్వాత సైతం హఫీజ్ సయీద్ కోర్టుకు హాజరుకాకపోతే, తదుపరి దశగా అతడిని "ప్రొక్లెయిమ్డ్ అఫెండర్" గా ప్రకటించే ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది. భారత చట్టం ప్రకారం, అటువంటి వ్యక్తి పరారీలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అతడి గైర్హాజరీలో దర్యాప్తు, విచారణ లేదా తీర్పు ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి కుట్ర కేసులో హఫీజ్ సయీద్ పాత్రను NIA ప్రత్యేకంగా ప్రస్తావించింది. అతడు లష్కర్-ఎ-తయిబా నాయకుడిగా ఉండటంతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే మరో ఉగ్రవాద సంస్థతోనూ సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.పాకిస్థాన్లోని లాహోర్కు చెందిన హఫీజ్ సయీద్ ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసుల్లో అతడికి శిక్ష పడిన తర్వాత పాకిస్థాన్ అధికారుల అదుపులోనే ఉన్నాడని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను అంతర్జాతీయ చర్యల నుంచి కాపాడేందుకు పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.పాకిస్థాన్కు అప్పగించే ఒప్పందం ఉందా?భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యేకంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక నేరస్తుల అప్పగింత (extradition) ఒప్పందం లేదు. అందువల్ల హఫీజ్ సయీద్ను నేరుగా భారత్కు అప్పగించే ప్రక్రియ సులభం కాదు.అయితే భారత్ ఇప్పటికే హఫీజ్ సయీద్ను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా చాలా సంవత్సరాల క్రితమే గుర్తించింది. అంతేకాకుండా అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. -
120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు..
వాషింగ్టన్: ఓ వ్యక్తి 120 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని మోంటానా జాతీయ ఉద్యానవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలో నివసించే కెన్ నర్స్ తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్లేసియర్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రదేశం నుంచి మెక్డొనాల్డ్ వాగులోకి పడిపోయినట్లు నాన్స్టాప్ లోకల్ మోంటానా తెలిపింది.హెలికాప్టర్ శోధన, రక్షణ సంస్థ టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ఫేస్బుక్లో చేసిన పోస్టు ప్రకారం.. కెన్ జలపాతాల వరుస మీదుగా జారిపడి నీటిలో ముఖం కిందకు పెట్టుకుని కనిపించాడు. కెన్, అతడి కుటుంబ సభ్యులు ఫొటోలు తీసుకుంటున్నారని అతడి భార్య రీనే నర్స్ నాన్స్టాప్ లోకల్ మోంటానాకు తెలిపింది. అయితే చలి నుంచి బయటపడేందుకు ఆమె కారులోకి వెళ్లిన సమయంలో మెరుగైన దృశ్యం కోసం కెన్ అంచుకు దగ్గరగా వెళ్లాడు. ఒక్కసారిగా నేల కుంగిపోవడంతో అతడు సుమారు 120 అడుగుల లోతులోని వాగులో పడిపోయాడు.కెన్ నీటిలో ముఖం కిందకు పెట్టుకుని ఉండటాన్ని గుర్తించిన ఆ వ్యక్తి వాగులోకి దిగి అతడిని లోతు తక్కువగా ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడ అతడికి గుండె స్పందనను తిరిగి తీసుకురావడానికి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం కెన్లో స్వయంగా రక్త ప్రసరణ, గుండె స్పందన తిరిగి ప్రారంభమైనట్లు టూ బేర్ ఎయిర్ రెస్క్యూ తెలిపింది.గ్లేసియర్ జాతీయ ఉద్యానవన రక్షణ సిబ్బంది కెన్కు చికిత్స అందిస్తుండగా టూ బేర్ ఎయిర్ రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. సంస్థ విడుదల చేసిన వీడియోలో సిబ్బంది కెన్ను భద్రపరిచి నీటి నుంచి పైకి తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కెన్ను వైద్య హెలికాప్టర్లోకి తరలించి పరిస్థితిని స్థిరపరిచారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఇదీ చదవండి: 15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులుఆ వ్యక్తి వేగంగా స్పందించిన తీరును టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ప్రశంసించింది. అతడి చర్యలే బాధితుడి ప్రాణాలను కాపాడాయని తెలిపింది. నాన్స్టాప్ లోకల్ మోంటానా ప్రకారం, కెన్ 2 రోజులు వెంటిలేటర్పై ఉన్నాడు. మెలకువ వచ్చిన తర్వాత అతడికి ఆక్సిజన్ అందించారు. అతడికి పలు పక్కటెముకలు పగిలాయి. మోచేయికి తీవ్రమైన ఎముక విరుగు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఊపిరితిత్తుల్లో ద్రవం కూడా చేరింది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు దక్కాలని కెన్ కోరుకున్నాడు. -
ఎల్ నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం?!
ప్రపంచాన్ని ఎల్ నినో రూపంలో మరో సంక్షోభం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న దీని ప్రభావం.. నవంబర్, డిసెంబర్ నుంచి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలు ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎల్ నినో ప్రభావం ఇప్పుడు వాతావరణాన్ని దాటి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలపైనా కనిపిస్తోంది.ఎల్ నినో అంటే కేవలం వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన మార్పు మాత్రమే కాదు. సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ నమూనాల్లో వచ్చే మార్పులు.. నీటి లభ్యత నుంచి రవాణా వ్యవస్థల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నౌకాయాన మార్గాలు కూడా ఈ పరిణామాల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. నీటి మట్టాలు తగ్గడం, కరవు పరిస్థితులు పెరగడం వంటి పరిణామాలు అంతర్జాతీయ షిప్పింగ్కు సవాల్గా మారుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ నిలుస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఈ జలమార్గం ద్వారా ప్రతి ఏడాది వేలాది నౌకలు ప్రయాణిస్తాయి. అయితే పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా కాలువలో నీటి నిల్వలు తగ్గడంతో.. నౌకల రాకపోకలపై పరిమితులు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు దాదాపు 40 నౌకలు ప్రయాణించే పనామా కాలువలో.. నీటి కొరత కారణంగా ఈ సంఖ్యను తగ్గిస్తున్నారు. దీనివల్ల సరకు రవాణా ఆలస్యం కావడం, నౌకల నిర్వహణ ఖర్చులు పెరగడం, చివరకు వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి పరిమితులు మరింత కఠినం కావొచ్చని అంచనా వేస్తున్నారు.మరి హార్ముజ్పై ప్రభావం ఉంటుందా?ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఎల్ నినో ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అక్కడి పరిణామాలు ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితులు, దేశాల మధ్య సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఇంధన వినియోగం, సరఫరా వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకుంటే.. పరోక్షంగా హార్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కరవు, పంటల నష్టం, రవాణా అంతరాయాలు పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, ఆహార ధరలపై ఒత్తిడి పెరగొచ్చు.ప్రపంచ ఇంధన సరఫరాలో హార్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఏ చిన్న అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపించే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రత్యక్ష కారణం కాకపోయినా.. వాతావరణ మార్పులతో పెరిగే ఆర్థిక ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థల్లో అస్థిరతలు ఇంధన రంగానికి కొత్త సవాళ్లుగా మారవచ్చు.ఇతర జలమార్గాలకూ ముప్పుఎల్ నినో ప్రభావంతో ఏర్పడే పొడి వాతావరణ పరిస్థితులు ప్రపంచంలోని మరికొన్ని కీలక జలమార్గాలపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రతి ప్రాంతంలో దీనికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. తీవ్రమైన వేడి, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులు కొనసాగితే నదులు, కాలువల్లో నీటి మట్టాలు తగ్గి.. నౌకా రవాణాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.యూరప్లోని రైన్ నది వంటి ప్రధాన నదీ మార్గాలు పరిశ్రమలు, సరకు రవాణాకు ఎంతో కీలకం. నీటి మట్టాలు తగ్గినప్పుడు పెద్ద నౌకలు పూర్తిస్థాయిలో సరకు మోసుకెళ్లలేవు. దీంతో రవాణా సామర్థ్యం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డాన్యూబ్ వంటి ఇతర కీలక నదీ మార్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే.. ఇంధనం, ముడి సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.అంటే.. ఎల్ నినో ప్రభావం కేవలం సముద్రాల్లోనే కాదు.. నదులు, కాలువల ద్వారా జరిగే ప్రపంచ వాణిజ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో పెరుగుతున్న తీవ్ర పరిస్థితులు భవిష్యత్తులో రవాణా వ్యవస్థలకు కొత్త సవాళ్లుగా మారనున్నాయి.ప్రపంచ వాణిజ్యానికి మరో సవాల్కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు సరఫరా గొలుసులను ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఎల్ నినో కూడా మరో సవాల్గా మారుతోంది. ఒక ప్రాంతంలో కరవు కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం.. మరో ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడం.. ఇవన్నీ కలిపి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ముడి సరుకులు, ఇంధన సరఫరాలో మార్పులు వస్తే.. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.భారత్కు ముప్పు ఎంత?ఎల్ నినో ప్రభావం భారత్కు అత్యంత కీలకమైన అంశం. దేశ వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాలపై ఆధారపడటం వల్ల వర్షపాతం మార్పులు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటల దిగుబడి తగ్గడం, నీటి వనరులపై ఒత్తిడి పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడితే.. చమురు, ఎరువులు, ఆహార దిగుమతుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.వాతావరణం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు..ఒకప్పుడు ఎల్ నినోను కేవలం వాతావరణ పరిణామంగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తిగా మారింది. సముద్ర మార్గాల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు.. ఇంధన మార్కెట్ల నుంచి ఆహార సరఫరా వరకు.. ఎల్ నినో ప్రభావాలు అనేక రంగాలపై పడే అవకాశం ఉంది.పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఈ పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాలు చూపుతుందో రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయి. అందుకే దేశాలు ముందుగానే అప్రమత్తమై.. సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ ప్రణాళికలు, విపత్తు నిర్వహణ చర్యలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించినప్పటికీ వీసా అనిశ్చితి కారణంగా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని భారతీయ టెక్కీ మధుర్ మెహతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వ్యాపార వార్తా పోర్టల్ ‘బిజినెస్ ఇన్సైడర్’లో రాసిన కథనాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రచురించింది. మధుర్ మెహతా 2021 ఆగస్టులో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ నుంచి 2023లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 2025లో అమెజాన్లో ప్రోగ్రామ్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు.ఆ సంస్థ ఆయన హెచ్-1బీ వీసా స్పాన్సర్షిప్ ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చిలో నిర్వహించిన హెచ్-1బీ లాటరీలో ఆయన ఎంపిక కావడంతో మూడేళ్ల పాటు అక్కడ పనిచేసే అవకాశం లభించింది. హెచ్-1బీ లభించినా భవిష్యత్తుపై ఆందోళనలు తొలగిపోలేదని మెహతా తెలిపారు. ఆయన కాబోయే భార్యకు హెచ్-1బీ లాటరీలో చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉందని, ఆమె ఎంపిక కాకపోతే ఉద్యోగ అనుమతి లేని హెచ్-4 డిపెండెంట్ వీసాపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.ఇద్దరి వీసా పరిస్థితులు స్థిరపడే వరకు ఇల్లు కొనడం, వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించడం వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోలేకపోతున్నామని వివరించారు. భారత్లో ఉన్న తల్లిదండ్రులకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా వీసా స్టాంపింగ్ నిబంధనల వల్ల ప్రయాణాలు సంక్లిష్టమవుతాయని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితికి శాశ్వత పరిష్కారంగా ఈబీ-1ఏ (EB-1A) వీసా సాధించే మార్గాలను, అలాగే కెనడా, ఐరోపా దేశాల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ఇది కూడా చదవండి: సంక్షేమ పథకానికి తూట్లు.. అనర్హుల ఖాతాల్లోకి రూ. 9,605 కోట్లు! -
వాణిజ్య చర్చలు విఫలం.. ఇక ట్రేడ్ వార్
అమెరికా–కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో.. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. అమెరికా నిర్ణయానికి సమాన స్థాయిలో ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం.. శనివారం అర్ధర్రాతి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా విధించే ప్రతి డాలర్ టారిఫ్కు ప్రతిగా కెనడా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. చివరి దశలో విఫలమైన చర్చలుఅమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మూడు రోజుల పాటు వాషింగ్టన్లో చర్చలు జరిగాయి. కెనడా వాణిజ్య మంత్రి డొమినిక్ లెబ్లాంక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో ఇరు దేశాలు ఒప్పందానికి దగ్గరయ్యాయని భావించినా.. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన తర్వాత కెనడా చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి ఒట్టావాకు రావాలని ప్రధాని కార్నీ ఆదేశించారు.ఏ వస్తువులపై ప్రభావం?అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్లు దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా) విలువైన కెనడా ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఉక్కు, అల్యూమినియం, కలప వంటి రంగాలకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా అధికారులు మాత్రం కెనడా కోరిన కొన్ని రాయితీలకు అంగీకరించలేదని తెలిపారు. ముఖ్యంగా కార్ల తయారీ రంగం, స్టీల్, అల్యూమినియం, లంబర్ రంగాల్లో కెనడా డిమాండ్లపై విభేదాలు కొనసాగినట్లు వెల్లడించారు."కెనడా ప్రయోజనాల కోసం పోరాడతాం": కార్నీఅమెరికాతో ఒప్పందం కుదరకపోయినా.. తమ దేశ కార్మికులు, వ్యాపారాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మార్క్ కార్నీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నించామని, అయితే కెనడా ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.ట్రంప్ హెచ్చరికకెనడా ప్రతీకార టారిఫ్లు విధిస్తే.. పరిస్థితిని సమతుల్యం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పరిపాలన హెచ్చరించింది. "వాళ్ల చర్యను సమం చేసేందుకు.. మరోసారి కఠిన చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.రెండు దేశాలపై ప్రభావంఅమెరికా–కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది. తాజా టారిఫ్ల నిర్ణయం అమల్లోకి వస్తే.. వినియోగదారులపై ధరల భారం పెరగడం, పరిశ్రమల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఇతర దేశాలపై టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో.. కెనడాతో తాజా వివాదం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.ఇదీ చదవండి: ట్రంప్.. కాస్కో, మా దాడి ఓ రేంజ్లోనే ఉంటుంది! -
గురుద్వారాలో స్క్రూడ్రైవర్తో దాడి.. ఇద్దరికి గాయాలు
ఎడ్మంటన్: కెనడాలోని ఎడ్మంటన్లోని నానక్సర్ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్తో వీరంగం సృష్టించాడు. ప్రార్థనల వేళ జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు 27 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఎడ్మంటన్లోని గురుద్వారా సముదాయంలోకి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు చొరబడ్డాడు. ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్న ఇద్దరు భక్తులపై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు, ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులతో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. The attack at the Nanaksar Gurdwara in Edmonton this morning is appalling. My thoughts are with the two people who were injured and the wider community that is shaken by this terrible event.No one should ever feel unsafe in their place of worship. I want to thank the Edmonton…— Mark Carney (@MarkJCarney) August 21, 2026నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్)యాక్టింగ్ ఇన్స్పెక్టర్ ఎరిక్ స్టీవర్ట్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీస్ అధికారిపై దాడి, తీవ్రమైన నేరారోపణల కింద జైలు శిక్ష అనుభవించిన అతను గురువారమే విడుదలైనట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం అతను ఎడ్మంటన్లోని హాఫ్వే హోమ్కు వెళ్లాల్సి ఉండగా, అక్కడకు వెళ్లకుండా గురుద్వారా పరిసరాల్లోకి ఎందుకు వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ద్వేషపూరిత నేరమా కాదా అనే అంశంపై ప్రత్యేక బృందం విచారిస్తోంది.ఘటనపై కెనడా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిఈ దాడిని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. ప్రార్థనా స్థలాల్లో ఎవరూ అభద్రతా భావానికి గురికాకూడదని పేర్కొంటూ బాధితులకు, సిక్కు సమాజానికి సంఘీభావం తెలిపారు. తక్షణమే స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.ఇది కూడా చదవండి: భూమిపై తొలి జీవం భారత్లోనే పుట్టిందా? -
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ..!
కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.నెట్టింట ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు కమాండర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. -
రెండో ల్యాండింగ్లో.. రన్వేకు చేరువలోనే మృత్యుఘోష
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేకు చేరువలోనే ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్లు రన్వేను చూడలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.ప్రమాదానికి గురైన సెస్నా 441 (Cessna 441 Conquest) విమానం.. అలాస్కాలోని యాంకరేజ్ నుంచి బయలుదేరి కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని యాంకరేజ్కు చెందిన సెక్యూరిటీ ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది.రెండోసారి ల్యాండింగ్.. క్షణాల్లో విషాదంవిమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు మొదట ప్రయత్నించినా.. దట్టమైన పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో విమానం రాడార్ సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. రన్వేకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు మాట్లాడుతూ.. పైలట్లు బయట పరిస్థితులను చూడలేని స్థాయిలో ఉండడంతో కేవలం విమాన పరికరాల ఆధారంగానే నడిపినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మూడు వైపులా కొండలతో ఉన్న క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతమని చెప్పారు.మృతుల్లో..ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో అమెరికా ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మరో నలుగురు కాంట్రాక్టర్లు. వీరంతా రాడార్ కేంద్రానికి సంబంధించిన పనుల కోసం ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సహాయక బృందాలు ధ్రువీకరించాయి. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. మారుమూల సైనిక రాడార్ కేంద్రం వద్ద ప్రమాదంప్రమాదం జరిగిన కేప్ న్యూవెన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ అలాస్కాలోని నైరుతి తీరంలో ఉంది. యాంకరేజ్ నగరానికి ఇది సుమారు 725 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాడార్ కేంద్రం అలాస్కా గగనతలాన్ని, సరిహద్దు ప్రాంతాల్లోని విమానాల కదలికలను పర్యవేక్షించే నెట్వర్క్లో భాగంగా పనిచేస్తుంది. వేగంగా మారిన వాతావరణంప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారినట్లు అధికారులు తెలిపారు. మొదట కొంత దృశ్యమానత ఉన్నప్పటికీ.. కొద్ది సమయంలోనే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ ప్రమాదంపై ఎన్టీఎస్బీ దర్యాప్తు ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, పైలట్ల నిర్ణయాలు, విమానం సాంకేతిక పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అలాస్కా కమాండ్ అధికారులు మృతులను “కఠిన పరిస్థితుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంకితభావం కలిగిన నిపుణులు”గా పేర్కొంటూ సంతాపం తెలిపారు.ఇదీ చదవండి: భారతీయుల కిడ్నాప్ కలకలం.. ఎక్కడో తెలుసా? -
భారత్తో పోలిస్తే పాక్లో గూగుల్ ప్లాన్ ఎలా ఉంది?
పాకిస్థాన్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా పాకిస్థాన్లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ కొత్త ఆఫీసును ప్రారంభించడంతో పాటు గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యాలయం ఒక గేమ్ చేంజర్గా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.పాకిస్థాన్లో సరికొత్త అధ్యాయం: గూగుల్ తొలి కార్యాలయంపాకిస్థాన్లో గూగుల్ తన కార్యకలాపాలను విస్తరిస్తూ తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో గూగుల్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దేశంలో సాంకేతికత, డిజిటల్ రంగాలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగాలలో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని దేశ డిజిటల్ ఎకానమీ అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తోంది.కార్యాలయం లోపల లుక్ ఎలా ఉంది?ఈ సరికొత్త గూగుల్ ఆఫీస్ సాధారణ ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా కాకుండా, అత్యంత ఆధునిక శైలిలో రూపుదిద్దుకుంది. గూగుల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఓపెన్ వర్క్స్పేస్, టీమ్ కొలాబరేషన్ ఏరియాలు, హైటెక్ మీటింగ్ రూమ్లతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. లోపలి పూర్తి దృశ్యాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ఆధారంగా ఇది చాలా స్టైలిష్, ప్రీమియం టెక్ లుక్తో కనిపిస్తోంది.యువత డిజిటల్ నైపుణ్యాలే లక్ష్యంపాకిస్థాన్ వేగంగా డిజిటల్ పరివర్తన వైపు అడుగులు వేస్తోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో భాగంగా స్థానిక యువతకు కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. గూగుల్ స్థానిక కార్యాలయం ఈ దిశగా ప్రభుత్వానికి సహకారాన్ని అందించనుంది. కంపెనీ భాగస్వామ్యంతో యువతకు కొత్త కెరీర్ అవకాశాలు, ఆధునిక సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు విస్తృతం కానున్నాయి.బలపడుతున్న గూగుల్.. పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యంఈ కార్యాలయ ఏర్పాటును పాక్ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. గూగుల్, పాకిస్థాన్ మధ్య బంధం మరింత బలపడటానికి ఇది పునాది వేస్తుందని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ నేరుగా రంగంలోకి దిగడంతో దేశంలో భారీ స్థాయి డిజిటల్ ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి. ఫలితంగా ఆన్లైన్ సేవలు, డిజిటల్ బిజినెస్లకు ఊతం లభించడమే కాకుండా, ప్రభుత్వ ‘డిజిటల్ నేషన్ పాకిస్థాన్’ విజన్కు గొప్ప బలం చేకూరనుంది.క్రోమ్బుక్ అసెంబ్లీ లైన్: ఎగుమతులపై గూగుల్ దృష్టిగూగుల్ ప్రతినిధి విల్సన్ వైట్ పాకిస్థాన్లో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రధానికి వివరించారు. స్థానిక భాగస్వామ్యంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘క్రోమ్బుక్ అసెంబ్లీ లైన్’ ప్రాజెక్టును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్థాన్లో క్రోమ్బుక్ తయారీ మొదలైతే, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ల్యాప్టాప్లను పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని గూగుల్ అంచనా వేస్తోంది. ఇది పాకిస్థాన్లో హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత ఉత్తేజితం చేస్తుంది.భారత్తో పోలిస్తే పాక్ కార్యాలయం ఎంత భిన్నం?భారతదేశంలో గూగుల్ ప్రస్థానం ఎన్నో ఏళ్ల క్రితమే మొదలైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో భారీ క్యాంపస్లు, విస్తారమైన పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ డీ) కేంద్రాలతో భారత్ ప్రపంచ టెక్ హబ్గా నిలిచింది. దీనితో పోల్చితే పాకిస్థాన్లో గూగుల్ ఉనికి ఇప్పుడే ప్రారంభమైంది. అందువల్ల ఈ రెండు దేశాల కార్యకలాపాలను నేరుగా పోల్చలేం. భారత్లో కార్యకలాపాలు అత్యున్నత స్థాయిలో ఉండగా, పాకిస్థాన్లో ప్రస్తుతానికి స్థానిక భాగస్వామ్యాలు, ఏఐ శిక్షణ, క్రోమ్బుక్ అసెంబ్లీ వంటి ప్రాథమిక ప్రాజెక్టులపైనే ప్రధాన దృష్టి కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం
వాషింగ్టన్: అమెరికా గ్రీన్కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. పాత వెర్షన్లను ఉపయోగించి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 తర్వాత తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. శాశ్వత నివాసాన్ని నమో దు చేసుకోవడానికి లేదా హోదాను మార్చుకోవడానికి ఉద్దేశించిన కొత్త ఫారం ఐ–485 అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇది సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పబ్లిక్ చార్జ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టంచేసింది. 2025 జనవరి 20 నాటి వెర్షన్ ఫారం ఐ–485ని తిరస్కరిస్తా మని పేర్కొంది. ఈ పాత వెర్షన్ను సెప్టెంబర్ 18కి ముందే పోస్ట్మార్క్ చేసినా లేదా ఎల్రక్టానిక్ పద్ధతిలో సమరి్పంచినా ఆమోదం పొందుతుందని తెలియజేసింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ‘పబ్లిక్ చార్జ్’నిర్వచనాన్ని విస్తరించింది. మెడికేడ్, ఫుడ్ స్టాంపులు, ప్రభుత్వం నుండి ఏదైనా ప్రయోజనాలను పొందుతున్న వారి వలసదార్ల గ్రీన్కార్డు దరఖాస్తులను తిరస్కరిస్తోంది. -
ఏనుగు చర్మం టైల్తో కూల్ కూల్ కూల్!
ఏసీల్లాంటివి లేకుండానే ఇల్లు చల్లగా ఉంటే భలే బాగుంటుంది కదా? కొంచెం ఖర్చు, శ్రమకోరిస్తే ఇందుకు ఎన్నో మార్గాలు న్నాయి కానీ... పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు తాజాగా ఇంకో సరికొత్త మార్గాన్ని ఆవిష్క రించారు. అడవి ఏనుగుల ను స్ఫూర్తిగా తీసుకుని వాటి చర్మాలను పోలిన సిమెంట్ టైల్స్ తయారు చేశారు వీరు. బయటి గోడలకు వీటిని వాడితే ఇంటిలోపల ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కూడా. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు... ఆఫ్రికాలోని ఏనుగులు మటమటలాడే ఎండల్లోనూ భేషుగ్గా బతికేయగలవు. ఏనుగు చర్మం మందంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. చర్మం పైభాగంలో ఉండే పగుళ్లలో నీరు చేరిపోయి... నెమ్మదిగా ఆవిరవుతూ చల్లదనం అందిస్తుంది. ఇదే విషయాన్ని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు భవన నిర్మాణ సామగిర తయారీకి వాడారు. సిమెంట్, డైఆటమేషియస్ మట్టి (కీటకనాశినులుగా చల్లే తెల్లటి పొడిలాంటి మట్టి) సాయంతో పలకల్లాంటివి తయారు చేశారు. వీటిలోనూ పగుళ్లు ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిల్లోకి నీరు చేరడమే కాకుండా... ఉపరితలం మొత్తమ్మీద నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా. ఎండ వేడికి ఈ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ వేడిని విడుదల చేస్తుంది. తద్వారా లోపలి ప్రాంతం చల్లగా మారుతుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఈ టైల్స్ దిగువన ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటే, పగుళ్లు ఉన్న టైల్స్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగానూ, పగుళ్లు లేని టైల్స్ ఉపరితలంపై ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్గానూ ఉన్నట్లు తెలిసింది. పగుళ్లు లేని టైల్స్లో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. ఉన్నదాంట్లోని నీరు కారణంగా ఉష్ణోగ్రత పది డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉందన్నమాట. పైగా ఈ చల్లదనం దాదాపు 20 గంటలపాటు అలాగే ఉండటం విశేషం. ఈ రకమైన టైల్స్ వాడితే ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఏసీ, కూలర్ల వంటివాటి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా ఈ టైల్స్పైకి ఆటోమెటిక్గా నీరు చిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటంటే...భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండాకాలం వేడి ఏటికేడు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటే ఏసీల వాడకం.. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా కొండెక్కుతోంది. ఈ ఏడాది మే నెల వరకూ భారత్లో సుమారు కోటీ యాభై లక్షల ఏసీలు అమ్ముడుపోయినట్లు సమాచారం. వడగాడ్పులు, రుతుపవనాల ఆలస్యం వంటి కారణాలతో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల మే నెలలోనే దేశ గరిష్ట విద్యుత్తు వినియోగం 22 గిగావాట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక పద్ధతుల్లో ఇళ్లలో చల్లదనాన్ని అందించే ఏర్పాట్లు ఎంతైనా ఆహ్వానించదగ్గవి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లీజ్ భారత్ మా చక్కెర కొనవా?: పాకిస్థాన్
సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.భారత్కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.వాణిజ్య సంబంధాల సవాళ్లుఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదనభారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది. -
ఎల్ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?
ఈ ఏడాది ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన వాటిలో అత్యంత శక్తిమంతమైనదిగా మారే దిశగా సాగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. 2027లో ఇప్పటివరకు నమోదైన వాటిలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.ఇది శతాబ్దానికి పైగా కాలంలో అత్యంత “తీవ్రమైన” ఎల్ నినోగా ఉండవచ్చని బ్రిటన్ వాతావరణ కార్యాలయంలో దీర్ఘకాలిక అంచనాల విభాగం అధిపతి శుక్రవారం హెచ్చరించారు. దీర్ఘకాలంగా మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న వాతావరణ వేడిమికి తోడుగా ఈ తాత్కాలిక ఉష్ణ ప్రభావం ఏర్పడనుంది. 2030 దశకం చివరి నాటికి ప్రపంచం ఎదుర్కొనే వేడిమి ఎలా ఉంటుందో దీనివల్ల ఒక ముందస్తు దృశ్యం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎల్ నినో అంటే ఏమిటి?ఎల్ నినో అనేది ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సహజంగా జరిగే చక్రంలో వేడెక్కే దశ. దీనిని ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్, అంటే ఈఎన్ఎస్ఓ అని పిలుస్తారు. తూర్పు నుంచి పడమర దిశగా వీచే వాణిజ్య పవనాలు తాత్కాలికంగా బలహీనపడినప్పుడు ఎల్ నినో ఏర్పడుతుంది. సాధారణంగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయే వెచ్చని నీరు తూర్పు వైపు తిరిగి ప్రవహించి సముద్ర ఉపరితలానికి చేరుతుంది.సాధారణం కంటే ఎక్కువగా ఉన్న ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని నెలల పాటు కొనసాగినప్పుడు, ఆ ప్రాంతంలో ఎక్కువ తుపానులు, మేఘాలు ఏర్పడతాయి. ఇవి “ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం మీద ప్రభావాలను కలిగిస్తాయి” అని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎమిలీ బెకర్ వివరించారు.దీని ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో మరింత వేడి, పొడి వాతావరణం ఏర్పడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో చల్లటి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, ఇండొనేషియాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండాకాలం కారణంగా భారీ అగ్నిప్రమాదాలు చెలరేగి లక్షల హెక్టార్ల భూమిని దహనం చేశాయి.“బలమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే, సాధారణంగా ఎల్ నినోతో కనిపించే ప్రభావాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఆశించవచ్చు” అని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థకు చెందిన వాతావరణ అంచనా కేంద్రంలోని ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్ బృందం అధిపతి మిషెల్ ఎల్హ్యూర్ తెలిపారు. అయితే, ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయని చెప్పలేమని ఆమె హెచ్చరించారు.ఈ ఏడాది ఏం జరుగుతోంది?పసిఫిక్ మహాసముద్రంలోని ఊహాత్మక ప్రాంతమైన నినో 3.4 ప్రాంతంలో రోజువారీ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే దాదాపు 2.6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్లైమేట్ బ్రింక్ డ్యాష్బోర్డ్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ డ్యాష్బోర్డ్ జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థకు చెందిన ఉపగ్రహాలు, సముద్రంలో ఏర్పాటు చేసిన తేలియాడే కొలత పరికరాల ద్వారా నమోదైన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సమాచారాన్ని ఉపయోగిస్తుంది.ఈ డ్యాష్బోర్డ్ వివిధ అంచనాలను కూడా సమీకరిస్తుంది. వాటి ప్రకారం ఈ ఏడాది నవంబర్లో ఎల్ నినో గరిష్ఠ స్థాయికి చేరే సమయానికి ఉష్ణోగ్రత వ్యత్యాసం 3.9 డిగ్రీల సెల్సియస్కు చేరవచ్చు. 2015లో నమోదైన ఎల్ నినోలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదైంది. ఎల్ నినోకు కచ్చితమైన తేదీ ఉండదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే సహజ వాతావరణ చక్రం. 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఎల్ నినో ఏర్పడుతుంది. సాధారణంగా వసంతకాలంలో ప్రారంభమై, ఏడాది చివర్లో లేదా శీతాకాలంలో తీవ్రత పెరుగుతుంది.దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాటిలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు 2024 పేరుతో ఉంది. వచ్చే ఏడాది 2027 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచే అవకాశం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వేడిమిలో ఎక్కువ భాగం తరువాతి ఏడాదిలో కనిపించడమే.వాతావరణ శాస్త్రవేత్తలు జీక్ హౌస్ఫాదర్, ఆండ్రూ డెస్లర్ చేసిన లెక్కల ప్రకారం, దీర్ఘకాలిక ప్రపంచ వేడిమి ధోరణికి ఎల్ నినో తాత్కాలికంగా మరో 0.3 డిగ్రీల సెల్సియస్ వేడిని జోడిస్తుంది. దీంతో 2027లో పారిశ్రామికీకరణకు ముందు కాలంతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత 1.76 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండవచ్చు. అంటే సాధారణ పరిస్థితుల్లో 2037 నాటికి ఏర్పడుతుందని అంచనా వేసేంత వేడిమి ఒక్క ఏడాదిలోనే నమోదవుతుంది.“ఇది భవిష్యత్తుకు ఒక ముందస్తు దృశ్యం లాంటిది” అని టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డెస్లర్ ఏఎఫ్పీకి తెలిపారు. అయితే, ఈ వేడిమిలో ఎక్కువ భాగం భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ ప్రాంతంలోనే కేంద్రీకృతమవుతుంది.జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థకు చెందిన పసిఫిక్ సముద్ర పర్యావరణ ప్రయోగశాల సీనియర్ శాస్త్రవేత్త మైక్ మెక్ఫాడెన్ కూడా ఇదే తరహా అంచనా వేశారు. నమూనాల అంచనాలు నిజమైతే “2027లో పారిశ్రామికీకరణకు ముందు స్థాయులతో పోలిస్తే ఉష్ణోగ్రత 1.7 డిగ్రీల సెల్సియస్ అధిక స్థాయికి చేరడం అసాధ్యమేమీ కాదు” అని ఆయన తెలిపారు. ఎల్ నినోను కొలిచేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకున్న ఒకే ఒక్క విధానం లేదు.ఫిబ్రవరిలో జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ సాపేక్ష సముద్ర నినో సూచికను స్వీకరించింది. దీనిని ఆర్ఓఎన్ఐ అని పిలుస్తారు. ఈ సూచిక నినో 3.4 ప్రాంతంలోని వేడిమిని మొత్తం ఉష్ణమండల ప్రాంతంలోని వేడిమితో పోలుస్తుంది. దీని ఉద్దేశం ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ ప్రభావాలకు కారణమయ్యే సముద్రం–వాతావరణ వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రతిబింబించడం.ఈ కొలత విధానంలో సంఖ్యలు తక్కువగా ఉంటాయి. అయితే, ఎల్ నినో తీవ్రతకు సంబంధించిన అంచనా స్థానం మాత్రం మారదు. 1950 నుంచి సేకరించిన తమ సమాచారంలో ఈ ఎల్ నినోనే అత్యంత బలమైనదిగా నిలిచే అవకాశం 69 శాతం ఉందని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ అంచనా వేసింది.ఎల్ నినో ప్రభావం ఎందుకు పెరుగుతోంది?వాతావరణ మార్పులు ఎల్ నినో ప్రభావాలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. హరితగృహ వాయువుల కారణంగా వేడెక్కిన వాతావరణంలో ఎక్కువ తేమ ఉంటుంది. దీంతో ఎల్ నినోకు సంబంధించిన వర్షాలు మరింత తీవ్రమవుతాయి. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో నేలలు మరింత ఎండిపోవడంతో కరువు తీవ్రత కూడా పెరుగుతుంది.వాతావరణ మార్పులే మరింత బలమైన ఎల్ నినో పరిస్థితులకు నేరుగా కారణమవుతున్నాయా అనే అంశంపై మాత్రం శాస్త్రవేత్తల్లో పూర్తి ఏకాభిప్రాయం లేదు. అయితే, దీనికి మద్దతు ఇచ్చే ఆధారాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.“వాతావరణ మార్పులు ఎల్ నినో చక్రాన్నే మరింత తీవ్రం చేస్తుండవచ్చు” అని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థకు చెందిన మెక్ఫాడెన్ తెలిపారు. ఉష్ణమండల సముద్రాలు వేడెక్కడం వల్ల ఎల్ నినోకు కారణమయ్యే పవనాలు సముద్ర పరిస్థితులకు మరింత వేగంగా స్పందిస్తాయి. దీంతో సముద్రం, పవనాల మధ్య పరస్పర ప్రభావం మరింత బలపడుతుంది. ఫలితంగా ఎల్ నినో పరిస్థితులు మరింత వేగంగా తీవ్ర రూపం దాల్చుతాయని ఆయన వివరించారు.గత వాతావరణ పరిస్థితులపై నమోదైన ఆధారాలు, ఉదాహరణకు పగడపు దిబ్బల అస్థిపంజరాలు, 19వ శతాబ్దం నుంచి నమోదవుతున్న పరికరాల కొలతలు, వాతావరణ నమూనాల అధ్యయనాలను మెక్ఫాడెన్ ప్రస్తావించారు. గత శతాబ్దంలో ఎల్ నినో తీవ్రత దాదాపు 10 శాతం పెరిగి ఉండవచ్చని ఇవి సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: మీలాంటి మిలీనియల్స్ ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా? -
షిప్లలో భారతీయులు.. హైజాక్ చేసిన సముద్రపు దొంగలు
న్యూఢిల్లీ: యెమెన్, సోమాలియా తీర ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో రెండు వాణిజ్య నౌకలను సాయుధ సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేసినట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ఘటన ఆగస్టు 17న జరిగింది. కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంవి లుటుఫ్' అనే నౌకను సోమాలియాలోని పుంట్లాండ్ తీరంలో సముద్రపు దొంగలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో ఆరుగురు భారతీయులతో సహా మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు.ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే ఆగస్టు 20న యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో రెండో నౌక హైజాక్కు గురైంది. ఎరిట్రియా జెండాతో వెళ్తున్న ‘ఎంటి. సిబు 1’ అనే ఈ నౌకలో 16 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. భారతీయ సిబ్బంది భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అధికారులు పేర్కొన్నారు. -
ఏకంగా 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసిన చిన్నారి.. చివరికి!
పసిపిల్లలు కనిపించిన ప్రతీవస్తువును నోట్లో పెట్టుకోవడం, దాన్ని మింగేయడం చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి చర్యలు ఒక్కోసారి ప్రమాదకరంగా మారడం చాలా సార్లు విన్నాం. తాజాగా ఏకంగా బంగారు కడ్డీని మింగేసిందో చిన్నారి. దీంతో ఆమె ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మరోవైపు అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఉత్తర చైనాలో ఐదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసింది. ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటుండగా ఆ బంగారు కడ్డీని పొరపాటున మింగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో, గత ఆదివారం (ఆగస్టు 16) ఆ బాలికను బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఎక్స్-రేలో వెల్లడైన ప్రకారం, 4 సెం.మీ. పొడవున్న ఆ చిన్న బంగారు కడ్డీ, బాలిక మింగిన తర్వాత కూడా కడుపులోనే ఇరుక్కుపోయింది. ఆ బంగారు కడ్డీ బాలిక జీర్ణాశయ కుహరంలో ఇరుక్కుపోయిందని వైద్యులు కనుగొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఆ ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. అయినప్పటికీ, వైద్యులు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఎండోస్కోపీ చేసి, ఒక ఉచ్చు సహాయంతో ఆ కడ్డీని బయటకు తీసి, కుహరం నుండి జాగ్రత్తగా బయటకు తీశారు.ఆ బంగారు కడ్డీని తొలగించడానికి వైద్యుల బృందానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది, కానీ అది చాలా సున్నితమైన ఆపరేషన్. ఆ బాలిక కూడా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బరువుగా, గట్టిగా ఉన్న ఆ బంగారు కడ్డీ ఆమె జీర్ణాశయ పొరను గీరివేసి, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం , అవయవాలకు రంధ్రాలు పడే ప్రమాదాన్ని కలిగించేదన్నారు వైద్యులు. ఈ ఆపరేషన్ వార్త వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలోని కొంతమంది వినియోగదారులు ఆ బాలిక అంత ఖరీదైన బంగారు కడ్డీని ఎలా అందుకుందని ప్రశ్నించగా, మరికొందరు తల్లిదండ్రులు ఆ వస్తువును అందుబాటులో లేకుండా ఉంచాల్సిందని అన్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ నెటిజన్ల రియాక్షన్స్ "ఐదేళ్ల చిన్నారికి 50 గ్రాముల బంగారు కడ్డీని అంత సులభంగా అందేలా చేయడానికి ఆ కుటుంబం ఎంత ధనవంతులై ఉండాలి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించగా, మరొకరు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో లేకుండా ఉంచాలని సూచించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్తో కలిసి రాహుల్గాంధీ ధర్నా -
మీలాంటి మిలీనియల్స్ ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా?
విద్య పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం.. గత తరాలు అనుసరించిన ఈ జీవన విధానం ప్రస్తుతం చాలా మంది మిలీనియల్స్కు దూరమైన కలలా మారింది. భారత్లోని మెట్రో నగరాలతో పాటు ఎన్నో దేశాల్లో సొంత ఇల్లు కట్టుకోవడం గగనంగా మారింది. ఇల్లు కొనడం అంటే మొదటగా గుర్తువు వచ్చేది మిలీనియల్స్. జెన్ జీలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఉద్యోగం, పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటారు. మిలీనియల్స్లో చాలా మంది ఇల్లు కొనే ఆలోచనలో ఉంటారు. దీంతో మిలీనియల్స్ తరానికి సొంత ఇల్లు కొనడం చాలా కాలంగా పెద్ద సవాలుగా మారిన తీరుపై ఓ సర్వే చేశారు. అక్కడ 1990 దశకం మధ్యలో బ్రిటన్లో జన్మించిన వారికి ప్రస్తుతం సొంత ఇల్లు ఉండే అవకాశం సుమారు 25 శాతమే ఉంది. 1990 దశకంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సొంత ఇల్లు ఉండే అవకాశం దీనికి దాదాపు రెండింతలు ఉండగా, అంతకుముందు తరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది.ప్రధాన కారణం ఇళ్ల ధరలు దీర్ఘకాలంగా ఇళ్ల ధరలు మన ఆదాయాల కంటే వేగంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. తనఖా రుణాల మార్కెట్లో మార్పులు కూడా ప్రభావం చూపినప్పటికీ, ఇళ్ల నిర్మాణం తగినంతగా జరగకపోవడమే అసలు సమస్యగా హౌసింగ్ ఆర్థికవేత్త పాల్ చెషైర్ పేర్కొంటున్నారు.జనాభా పెరుగుదల, చిన్న కుటుంబాల్లో నివసించే ధోరణికి అనుగుణంగా ఇంగ్లాండ్లో ఏటా మరో 300,000 ఇళ్లు అవసరమని ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే గత ఏడాది 208,000 ఇళ్లు మాత్రమే నిర్మించారు. కనీసం మూడు దశాబ్దాలుగా ఏ ఏడాదిలోనూ 300,000 కొత్త ఇళ్ల నిర్మాణం జరగలేదు.నిర్మాణ వ్యయాలు పైపైకి భూమి, నిర్మాణ కార్మికుల వేతనాలు, ఇటుకలు సహా నిర్మాణ వ్యయాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలప, ఉక్కు, ప్లాస్టర్బోర్డ్, కాంక్రీట్, ఇన్సులేషన్ వంటి ముడి పదార్థాల లభ్యత తగ్గడంతో వాటి ధరలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇంధన వ్యయాలను ఒక్క ఏడాదిలో 15 శాతం పెంచి నిర్మాణ ఖర్చులను మరింత పెంచింది. ఇరాన్లో యుద్ధం కూడా ధరలను మరింత పెంచింది. 2015లో £150,000తో నిర్మించగలిగిన ఇల్లు ఇప్పుడు £230,000 వరకు ఖర్చవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యయం మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.అయితే ఇటీవల ఇళ్ల ధరలు వేతనాల కంటే నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2021లో సగటు ఆదాయానికి ఇళ్ల ధరల నిష్పత్తి దాదాపు 9 రెట్లు ఉండగా, ఇప్పుడు 7.6 రెట్లకు తగ్గింది. కొన్ని రుణ సంస్థలు 5 శాతం డిపాజిట్తోనే తనఖా రుణాలు ఇస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో 40 ఏళ్ల వరకు రుణ కాలపరిమితి కూడా అందుబాటులో ఉంది.వడ్డీ రేట్లు ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి తగ్గడం, ఇళ్ల ధరల పెరుగుదల మందగించడంతో వేతనాలతో పోలిస్తే తనఖా చెల్లింపుల భారం కూడా తగ్గింది. నేషన్వైడ్ గణాంకాల ప్రకారం, 2007లో తొలిసారి ఇల్లు కొనేవారి తనఖా చెల్లింపులు చేతికి వచ్చే ఆదాయంలో 45 శాతం ఉండగా, ప్రస్తుతం 32 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాల సగటు 30 శాతంతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే అయినా పరిస్థితి మెరుగుపడుతున్న దిశలో ఉంది.అయితే తక్కువ డిపాజిట్, ఎక్కువ కాలపరిమితి రుణాలకు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం వడ్డీ చెల్లించాల్సి రావడంతో మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఇళ్ల విలువ పెరగకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది.ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రణాళికా అనుమతుల ప్రక్రియను సరళీకరించే చర్యలు చేపట్టింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణానికి కూడా సంస్కరణలు అవకాశం కల్పించనున్నాయి. అయితే నిర్మాణ సంస్థలు మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితాలు కనిపించేందుకు మాత్రం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులే అనేక దేశాల్లో ఉన్నాయని అంచనా.ఇదీ చదవండి: 24 గంటల్లో ‘జంతర్ మంతర్ 2.0’.. సీజేపీ హెచ్చరిక -
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్కు ఇదేం శిక్ష?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చికిత్స కోసం ఆయన్ని ఇస్లామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది తెలిసిందే. అయితే ఈ ఉదయం మళ్లీ ఆయన్ని అడియాలా జైలుకు తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పీటీఐ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం జైల్లో అందిస్తున్న సదుపాయాలు.. చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు వెలువడ్డ రెండ్రోజుల తర్వాతే ఆయన్ని.. గత అర్ధరాత్రి రావల్పిండి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఇస్లామాబాద్లో ఉన్న షిఫా ఆస్పత్రికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. ఈ పరిణామంపై పీటీఐ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఆయన్ని నిజంగానే తరలించారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆస్పత్రి వర్గాలు ఆయన చేరికను ధృవీకరించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16వ తేదీ దాకా ఆయన్ని ఆస్పత్రిలోనే ఉంచుతారని అంతా భావించారు. కానీ.. ఈలోపే ట్విస్ట్ చోటు చేసుకుంది.శుక్రవారం ఉదయం.. షిఫా ఆస్పత్రిలో ఆరుగురు నిపుణుల వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. దీంతో ఆయన జైల్లో ఉండడమే సురక్షితమని భావించి అధికారులు.. తిరిగి అడియాలాకు తీసుకొచ్చారు. కంటి సమస్య.. అంతా ఓకే అంటున్న ప్రభుత్వంఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు కుడి కంటి సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్తనాళాల్లో సమస్య (సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్) కారణంగా ఆయనకు చికిత్స అవసరమని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు చెబుతున్నారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని ఇమ్రాన్ కుటుంబం ఆరోపిస్తుండగా.. అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పాక్ ప్రభుత్వం చెబుతోంది.రివ్యూ పిటిషన్.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం అభ్యంతరాలతో తిరిగి పంపింది. అభ్యంతరాలను సరిచేసి మళ్లీ దాఖలు చేసే అవకాశం ఉంది.జైలు నుంచే రాజకీయ పోరాటం2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయనకు, పాక్ సైన్యానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం జైలు నుంచే తన విడుదల కోసం ఇమ్రాన్, తమ అధినేత కోసం పీటీఐ నేతలు పోరాడుతున్నారు. మెరుగైన వైద్యం, కేసుల వేగవంతమైన విచారణ, విడుదల కోసం పీటీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది. -
సముద్రపు దొంగల పంజా .. ఆయుధాల షిప్ హైజాక్!
మెుగదిషు : సోమాలియా దేశంలో సముద్రపు దొంగలు దారుణానికి తెగబడ్డట్లు తెలుస్తోంది. పుంట్ల్యాండ్ తీరానికి సమీపంలో LUTUF అనే కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌకను పైరేట్లు హైజాక్ చేసినట్లు సమాచారం . అయితే ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురు భారతీయులున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమా కాదా అనే విషయం ధృవీకరించాల్సి ఉంది. భారత్ సైతం దీనిపై ఇది వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.వివరాల్లోకి వెళితే పుంట్ల్యాండ్లోని ఈల్ జిల్లాలో మరయ్యా తీరానికి సుమారు 3.5 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను ఎనిమిది మంది పైరేట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరు గతంలో ఏప్రిల్ 26న Sward అనే మరో వాణిజ్య నౌకను హైజాక్ చేసిన బృందంతో సంబంధం ఉన్నవారిగా భావిస్తున్నారు. అయితే హైజాకైన నౌకలో భారతీయులతో పాటు ఒక టర్కీ జాతీయుడు, ఒక జార్జియా జాతీయుడు, ఇద్దరు సెర్బియా భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ నౌకలో టర్కీకి చెందిన ఆయుధాలు, కమ్యూనికేషన్ ,శాటిలైట్ పరికరాలు ఉన్నాయని, అవి మొగాదిషులోని టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్లు సోమాలి అధికారి తెలిపారు. ఈ ఘటనపై భారత, టర్కీ ప్రభుత్వాలు కూడా ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. టర్కీకి చెందిన రెండు నౌకలు, డ్రోన్లతో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
నైజీరియాలో పడవ బోల్తా.. 50 మంది మృతి
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో గురువారం పడవ నదిలో మునిగింది. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా అందులో 40 మంది చిన్నారులు కావడం అత్యంత బాధాకర విషయం. గోరోన్యో జిల్లాలోని గోరౌ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వివరాలు తెలుసుకున్న అధికారులు వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.స్థానికుల వివరాల ప్రకారం.. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారు. ప్రయాణం ప్రారంభించిన కేవలం ఒక్క నిమిషానికే పడవ మునిగిపోయింది. నదికి అవతలి వైపున ఉన్న పొలాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పడవ ఎక్కారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని ఆయన తెలిపారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (NEMA) ప్రతినిధి దాహిర్ కురే మాట్లాడుతూ.. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక, గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే మృతుల సంఖ్యపై వెంటనే అధికారికంగా స్పష్టత ఇవ్వలేమని, ఘటనకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నామని చెప్పారు. నైజీరియాలోని రద్దీగా ఉండే నదులు, జలమార్గాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం, పడవల నిర్వహణ సరిగా లేకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.కాగా నైజీరియాలో ఇటీవల తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జిగావా రాష్ట్రంలో కూడా పడవ బోల్తా పడి కనీసం ఐదుగురు మృతి చెందారు. ఈ ఏడాది జనవరిలో జిగావా నుంచి యోబే రాష్ట్రానికి రైతులు, మత్స్యకారులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 26 మంది మృతి చెందారు. సోకోటోలో జరిగిన తాజా ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. -
పాక్ సైన్యంలో భారీ మార్పులు.. మునీర్కు విస్త్రృత అధికారాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా "డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ పాకిస్థాన్ యాక్ట్" 2026తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ యాక్ట్ 2010కు పలు కీలక సవరణలు చేసింది. దీంతో కొత్త విధానంలో పాకిస్థాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకవచ్చింది. ఈ వ్యవస్థకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వం వహించనున్నారు.కొత్త చట్టం ప్రకారం చీఫ్ డిఫెన్స్ స్టాప్కు (CDF)కు మూడు దళాల ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్, సమన్వయం, మల్టీ-డొమైన్ ఇంటిగ్రేషన్, వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా సైనిక సిబ్బంది విషయంలోనూ మునీర్కు గణనీయమైన అధికారాలు కల్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి విడుదల చేయడం లేదా తొలగించడం, రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవసరమైతే నిర్దేశిత పదవీ విరమణ వయస్సు లేదా సర్వీసు పరిమితిని కూడా సడలించే అధికారం ఉంటుంది. అయితే చట్టంలో పేర్కొన్న కొన్ని మినహాయింపులు దీనికి వర్తిస్తాయి.ప్రధానికి ప్రధాన సైనిక సలహాదారుగా CDFడిఫెన్స్ ఫోర్సెస్ హెడ్క్వార్టర్స్ నేరుగా CDF ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రధానమంత్రికి “ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్”గా వ్యవహరించనున్నారు. కమాండ్, కంట్రోల్కు సంబంధించిన అంశాల్లో CDF ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు. అదే సమయంలో ప్రభుత్వం CDFకు చట్టంలో పేర్కొన్న వాటికి అదనంగా ఇతర బాధ్యతలు, అధికారాలను కూడా అప్పగించే అవకాశం ఉంది. కొత్త వ్యవస్థ అమలులో ఏవైనా ఇబ్బందులు లేదా నిబంధనల మధ్య విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేసే అధికారం సైతం కల్పించారు.అదే విధంగా గత ఏడాది 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా కమాండర్ ఆఫ్ ది నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ (CNSC) అనే హోదాను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ వ్యూహాత్మక దళాల ఆపరేషనల్ సమన్వయానికి ఈ అధికారి బాధ్యత వహిస్తారు. గత నెల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి నుంచి పదోన్నతి పొందిన జనరల్ సయ్యద్ ఆమిర్ రజాను తొలి CNSCగా నియమించారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ను ఎట్టకేలకు ఊరట లభించిందా?. మూడేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా?. గురువారం అర్ధరాత్రి దాటాక రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పీటీఐ వర్గాలు ధృవీకరించగా.. ఆయన అభిమానులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్.. మూడేళ్లుగా అడియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు.. ప్రత్యేక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆయన చికిత్స విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది.Imran Khan has been freed from Adiala Jail and taken to Shifa Hospital tonight.He is a political prisoner because he wanted to bring democracy to Pakistan, something America does not want, they need control of the Nucs.CAN HE BECOME THE “NELSON MANDALA” OF PAKISTAN⁉️…— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) August 20, 2026అయితే రివ్యూ పిటిషన్ పేరిట రెండ్రోజులు పాక్ ప్రభుత్వం హైడ్రామా నడిపింది. చివరకు.. కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలిచింది. ఆయన చూపు క్షీణించిందని.. కుడి కన్ను శాశ్వతంగా కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అలాగే 73 ఏళ్ల ఇమ్రాన్కు భారీగా బరువు తగ్గి బక్కచిక్కిపోయారని చెప్పారు. మరోవైపు ఇమ్రాన్కు తక్షణ ఆస్పత్రి చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేదని వైద్య నివేదికలు సూచిస్తున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది.Imran khan was never taken to the hospital today.The dictatorship in Pakistan trying to fool everyone. Snakes in his party who are work for the army have been exposed. https://t.co/b1ZGEsNuh4 pic.twitter.com/9vghKQ9TTs— Ali (@MerruX) August 21, 2026అయితే ఆయన తరలింపు సమయంలో నడిచిన హైడ్రామాపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఆయన్ని తరలించారా?.. ఫొటోలు రిలీజ్ చేయాలంటూ.. కోరుతున్నారు. పాక్లో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని.. ఇమ్రాన్ ఖాన్ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇటు కోర్టు ఆదేశాల మేరకు.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించేందుకు షిఫా ఆస్పత్రి సిద్ధమైంది. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16 వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇమ్రాన్ ఖాన్కు గత జనవరిలో కుడి కంటికి సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స కోసం ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)కు పలుమార్లు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి బదులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. జైలులో వైద్య సేవలు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో భేటీలపై ఆంక్షలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు.పీటీఐలో కొత్త ఆశలుసుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించడాన్ని ఆయన పార్టీ స్వాగతించింది. కోర్టు నిర్ణయం తమకు ‘కొత్త ఆశాకిరణం’ అని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్త మార్చ్కు పిలుపునిచ్చిన PTI.. ఇమ్రాన్కు మద్దతుదారులను కలిసే అవకాశం కల్పించడం, ఆయనపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం, చివరకు ఆయనను విడుదల చేయడం వంటి డిమాండ్లను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.2023 నుంచి జైల్లోనే..మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అనంతరం ఆయనకు, PTIకి, పాకిస్థాన్ సైనిక వ్యవస్థకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, హింసకు దారితీసింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 5న తోషాఖానా కేసుతో సహా అవినీతి ఆరోపణల కేసుల్లో ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కిందటి ఏడాది అక్టోబర్-నవంబర్ నుంచి ఆయన నుంచి సోషల్ మీడియా ఖాతాలోనూ ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆయనపై పలు కేసులు, న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆస్పత్రికి తరలింపు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది.ఇదీ చదవండి: పాక్లో మరింత పవర్ఫుల్గా మునీర్! -
పెరూ ఆండీస్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం
పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతం శక్తివంతమైన భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి దక్షిణ భాగంలోని ఇకా, అరెక్విపా ప్రాంతాలు వణికిపోయాయి. జనాలు ఇళ్లలోంచి పరుగులు తీసి.. బయటే గడిపారు. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రటించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం అయాకుచో ప్రాంతంలోని పరినకోచాస్ ప్రావిన్స్లోని ఉపాహుచో పట్టణానికి వాయువ్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. భూకంపం 66.7 కిలోమీటర్ల లోతులో సంభవించింది.ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెరూ పౌర రక్షణ విభాగం అధికారి లూయిస్ వాస్కెజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని తెలిపారు. పరినకోచాస్ ప్రావిన్స్ మేయర్ యోనీ రేయెస్ కూడా ప్రావిన్స్ రాజధానిలో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వెల్లడించారు.సునామీ ముప్పు లేదన్న నేవీభూకంపం తర్వాత పెరూ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం ఏమైనా జరిగిందా? అనే దానిపై అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని పెరూ నేవీ స్పష్టం చేసింది.‘రింగ్ ఆఫ్ ఫైర్’లో పెరూపెరూ తరచూ భూకంపాలకు గురవుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అత్యంత చురుకైన భూకంప మండలమైన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భూకంప కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి.పెరూలో గతంలోనూ భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇదే ఆండీస్ రీజియన్లో జులైలో సంభవించిన భూకంపంలో ఐదుగురు మరణించగా.. 21 మందికి గాయాలు అయ్యాయి. అంతకు ముందు 2007 ఆగస్టులో మధ్య పెరూ తీరానికి సమీపంలో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పిస్కో, చించా ఆల్టా, ఇకా ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 519 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది లోతైన ప్రాంతంలో సంభవించడంతో ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నైజీరియాలో ఘోర విషాదం -
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షునిగా మిర్జా ఫఖ్రూల్
ఢాకా: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పాలక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేత మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ విజయం సాధించారు. మిర్జా ఫఖ్రూల్ బీఎన్పీకి దీర్ఘకాలంగా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గురువారం ఢాకాలోని పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 74 ఏళ్ల ఫఖ్రూల్కు 255 ఓట్లు పడ్డాయి. జమాతే ఇస్లామా సారథ్యంలోని 11 విపక్ష పార్టీల కూటమి అభ్యర్థి, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ చైర్మన్ రిటైర్డ్ కల్నల్ ఓలీ అహ్మద్కు 88 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్లో 349 మంది తమ ఓటును నమోదుచేసుకోగా గురువారం 343 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆరుగురు ఓటేయలేదు. గెలచిన ఫఖ్రూల్ శుక్రవారం బంగభవన్లోని దర్బార్ హాల్లో దేశాధ్యక్షునిగా ప్రమాణంచేయనున్నారు. 1991 తర్వాత బంగ్లాదేశ్లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఆప్తుడైన మొహమ్మెద్ షాహబుద్దీన్ అనారోగ్య కారణాలను చూపుతూ హఠాత్తుగా అధ్యక్ష పదవికి నుంచి దిగిపోవడం తెల్సిందే. -
ఉక్రెయిన్పై రష్యా క్షిపణి, డ్రోన్ల దాడులు
కీవ్: ఉక్రెయిన్లోని కీవ్పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. ఈ దాడులతో కీవ్లోని పలు చోట్ల మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని అంతటా రాత్రంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దాడుల కారణంగా గిడ్డంగులు, పాఠశాల, చిన్నారుల వైద్యశాల దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భవనాల నుంచి సహాయక సిబ్బంది ప్రజలను తప్పిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం విడుదల చేసింది. డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఒక సైనిక స్థావరం, ఒక లాజిస్టిక్స్ హబ్ను లక్ష్యంగా చేసుకుని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. -
మధుమేహానికి బ్యాక్టీరియాతో చెక్?
మన పేవుల్లో ఉండే కోటానుకోట్ల బ్యాక్టీరియా రకాల్లో ఈ–కోలీ ఒకటి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. కొన్ని రకాలతో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అలాంటి బ్యాక్టీరియాతో టైప్–2 మధుమేహానికి చికిత్స కూడా అందించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! ప్రీ క్లినికల్ ట్రయల్స్ దాటుకుని జంతు ప్రయోగాల దశకు చేరిన ఈ ఆసక్తికర పరిశోధన వివరాలు.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అంటూంటారు. కనీసం పది కోట్ల మంది ఈ జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువ. రోజూ మందులేసుకోవడం, అవి చాలకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు... వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎవరికైనా భరించలేని వేదనే. అందుకే మధుమేహానికి మెరుగైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచించారు. గ్లూకోజును పసిగట్టే జన్యు రిసెప్టర్లను ఈ–కోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. చక్కెర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువైతే చాలు... ఈ బ్యాక్టీరియా జీఎల్పీ–1 హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే.. ఈ బ్యాక్టీరియా కారణంగా ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్తోపాటు సెమాగ్లూటైడ్ వంటి మందులు శరీరంలోనే తయారై విడుదలవుతాయన్నమాట. ఇదీ సమస్య... శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇన్సులిన్ విడుదల చేయమని కాలేయానికి సందేశాలు వెళతాయి. ఈ ఇన్సులిన్ కాస్తా గ్లూకోజును మన కణాల తలుపులు తెరిచి గ్లూకోజు లోపలికి చొచ్చుకెళ్లేందుకు సాయపడతాయి. తగినంత గ్లూకోజు కణాల్లోకి చేరిన తరువాత ఇన్సులిన్ విడుదల కూడా తగ్గిపోతుంది. దీంతో కాలేయం అవసరాలకు తగ్గట్టు మళ్లీ చక్కెర తయారు చేసి రక్తంలోకి వదులుతూంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కణాలు ఇన్సులిన్కు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. సెమాగ్లూటైడ్ వంటి మందులు ఇన్సులిన్ స్థాయిలను పెంచి గ్లూకోజు ఖర్చయ్యేందుకు సాయపడతాయి. ఈస్ట్ చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ–కోలీ బ్యాక్టీరియానే రక్తంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి జీఎల్పీ–1 హార్మోన్ విడుదల చేసేలా చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదల అవుతూండటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశాలు తక్కువ. మధుమేహం ఉన్న కొన్ని రకాల కోతులు, ఎలుకలపై ఇప్పటికే తాము ఈ బ్యాక్టీరియాను ప్రయోగించామని, మంచి ఫలితాలే వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. హానికర ప్రభావాలు కూడా లేనట్లు స్పష్టమైనట్లు చెప్పారు. మానవ ప్రయోగాలు కూడా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తే ఈ బ్యాక్టీరియా చికిత్స టైప్–2 మధుమేహ బాధితులకు వరం కాగలదనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..
అమెరికాలోని వ్యోమింగ్, వైట్ రివర్ ఫార్మేషన్లో శాస్త్రవేత్తలకు సుమారు 38 మిలియన్ సంవత్సరాల నాటి 4 పాముల శిలాజాలు లభించాయి. ఇవి ఒకదానికొకటి చుట్టుకుని, బొరియలాంటి ప్రదేశంలో కలిసి ఉన్న స్థితిలోనే శిలాజాలుగా మారాయి. ఈ కొత్త జాతికి హైబర్నోఫిస్ బ్రెయితాప్టి అని పేరు పెట్టారు.వైట్ రివర్ ఫార్మేషన్లో లభించిన ఈ శిలాజాలను అగ్నిపర్వత బూడిద, మట్టి, వరద నీరు కలిసి వేగంగా కప్పివేయడంతో ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా పాముల శిలాజాలు విడిపోయిన వెన్నెముక భాగాల రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ పూర్తి అస్థిపంజరాలు లభించడం ప్రత్యేకత.మూడు పాములు ఒకే చోట కలిసి ఉండటం వల్ల అవి చలికాలంలో ఒకే బొరిలో ఆశ్రయం పొందేవని, బహుశా కలిసి నిద్రాణ స్థితిలో ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, పాములు నిజంగానే నిద్రాణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించడానికి శిలాజ ఆధారాలు సరిపోవని వారు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాచీన పాముల పరిణామక్రమంతో పాటు వాటి సామూహిక ప్రవర్తనపై కూడా కీలక సమాచారం లభించింది.పాముల శరీరంలో తల నుంచి తోక వరకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో వెన్నుపూసలు ఉంటాయి. పాముల వెన్నెముకలో సాధారణంగా వందలాది వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకు పక్కటెముకలు అనుసంధానమై ఉంటాయి. వెన్నెముక చాలా వంగేలా ఉండటం వల్ల పాములు మెలికలు తిరుగుతూ కదలగలుగుతాయి. పాములకు చేతులు, కాళ్లు లేకపోయినా వెన్నెముక మాత్రం ఉంటుంది.ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవి.. కాగా, ఈ పాములు ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తర అమెరికాలోని చిన్న బొరియల్లో నివసించే పాముల చరిత్రపై కొత్త సమాచారం లభించింది. ఈ పాముల సమూహం గురించి శాస్త్రవేత్తలు 1986లోనే తొలిసారి వివరించారు. ఈ శిలాజాలు పాములు కలిసి ఆశ్రయం పొందిన ప్రదేశానికి సంబంధించినవి కావచ్చని సూచించారు. శిలాజాల వెన్నుపూసలు, పుర్రెను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇవి గతంలో తెలిసిన ఒగ్మోఫిస్, కలమాగ్రాస్ పాముల నుంచి భిన్నమైనవని తేలింది. పరిణామ విశ్లేషణలో ఈ కొత్త పాము ఇతర బోయిడ్ పాములన్నింటికీ సోదర సమూహంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని కుమారుడు -
ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచార హోర్డింగుపై మమ్దానీ చిత్రం
టెల్అవీవ్: అక్లోబర్లో ఎన్నికలు జరగనున్న ఇజ్రాయెల్లో ఒక ప్రచార హోర్డింగ్ ఇప్పుడు చర్చనీయాంశ మైంది. టెల్ అవీవ్ నగరం మధ్యలో అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఏర్పాటు చేసిన బిల్బోర్డ్పై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని చిత్రించారు. పోస్టర్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇరాన్ నాయకుడు మొ జ్తాబా ఖమేనీ, హెజ్»ొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ల పక్కన ఆయన ఫోటోను చిత్రించారు. ‘వారు నెతన్యాహు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. వారిని గెలవ నివ్వకండి’అని లికుడ్ పార్టీ లోగోతో రాశారు. గాజా కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయిన తరుణంలో, ఈ చర్య వారి మధ్య బహిరంగ వైరాన్ని మరింత తీవ్రం చేసింది. జులైలో ఇజ్రాయెల్ నెసెట్ను రద్దు చేయడంతో, అక్టోబర్లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడుల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే. తన అతివాద కూటమిని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు నెతన్యాహు ప్రచారలోకి దిగారు. అమెరికాలో ఇటీవల జరిగిన పోల్స్లో, అమెరికన్ యూదుల్లో నెతన్యాహు కంటే మమ్దానీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది. అభిప్రాయ సేకరణలో తన అధికార కూటమి వెనుకబడి ఉండటాన్ని గ్రహించిన నెతన్యాహు, తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ బిల్బోర్డ్ ఫోటోను పోస్ట్ చేశారు. మమ్దానీ తనను ఒక యుద్ధ నేరస్థుడని పిలుస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు. అయితే, నెతన్యాహు ఎన్నికల ప్రచార సామగ్రిలో తన చిత్రాన్ని చేర్చడంపై మమ్దానీ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఇదీ చదవండి: యూకేలో కుప్పకూలిన విమానం భారత సంతతి దంపతుల దుర్మరణం మమ్దానీ తన మేయర్ ఎన్నికల ప్రచారం నుంచే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. గత నెలలో నెతన్యాహును యుద్ధ నేరగాడు అనడంతో మాటల యుద్ధం తీవ్రమైంది. సెపె్టంబరులో నగరంలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు హాజరైతే, ఆయన అరెస్టు కోసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను అమలు చేయాలని అమెరికా అధికారులకు పిలుపునివ్వడం తెలిసిందే.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్ -
యూకేలో కుప్పకూలిన విమానం భారత సంతతి దంపతుల దుర్మరణం
లండన్: యూకేలోని వేల్స్లో మారుమూల ప్రాంతంలో చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న భారత సంతతికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గత శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. తమ ప్రఖ్యాత సభ్యుడు, అతని భార్య విమాన ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం అంటూ ఒక ఫ్లయింగ్ క్లబ్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. గ్వినెడ్లోని ట్రాస్వినిడ్ సమీపంలోని ఒక మారుమూల ప్రదేశంలో వారు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానాన్ని గుర్తించడంతో, లీసెస్టర్షైర్లోని సిస్టన్కు చెందిన కేతన్ స్వాలి, శీతల్ స్వాలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రకటించారు. ఈ జంట బర్టన్-అపాన్-ట్రెంట్లోని టేటెన్హిల్ విమానాశ్రయం నుండి షేర్వుడ్ ఫ్లయింగ్ క్లబ్ నుండి అద్దెకు తీసుకున్న పైపర్ PA28 విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రాథమిక విచారలో తేలింది. ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’పైపర్ 2ఏ రకానికి చెందిన ఈ విమానాన్ని కేతన్ స్వాలి నడుపుతుండగా, ఆయనతోపాటు భార్య శీతల్ ప్రయాణిస్తున్నారు. వెస్ట్ మిడ్ల్యాండ్స్ ప్రాంతంలోని టటెన్హిల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న వీరి విమానం స్నోడోనియాలోని కేర్నర్ఫాన్ విమానాశ్రయంలో ల్యాండవ్వాల్సి ఉంది. అయితే, విమానం జాడ తెలియకుండా పోయింది. అన్వేషణ చేపట్టిన అధికారులు విమాన శకలాలను, మృతదేహాలను నార్త్ వేల్స్లోని ట్రాస్ఫినిడ్ వద్ద కనుగొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. లీసెస్టర్కు చెందిన ఆర్క్ యూరో టేరడ్ లిమిటెడ్ అనే ఇంజినీరింగ్ కంపెనీకి కేతన్ స్వాలి డైరెక్టర్గా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్ -
ప్రపంచం అంతం కావడానికి ఇక ఇది చాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణు వార్హెడ్లు ఉండొచ్చని దక్షిణ కొరియా అంచనా వేసింది. అణు బాంబును మోసుకెళ్లి పేల్చగల అణ్వాయుధ భాగాలను అణు వార్హెడ్లు అంటారు.దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బ్యాక్ గురువారం ఈ అంచనాను వెల్లడించారు. ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ సంఖ్య ట్రంప్ ఒక రోజు ముందు చెప్పిన అణ్వాయుధాల కంటే గణనీయంగా ఎక్కువ. ఉత్తర కొరియా వద్ద 57 చాలా శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.పార్లమెంటరీ కమిటీ ముందు ఆన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా వద్ద సాధారణంగా 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టమని హెచ్చరించారు. అనంతరం ఈ అంచనా ప్రైవేట్ పరిశోధనా సంస్థల నుంచి వచ్చిందని, దక్షిణ కొరియా సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు.కిమ్ను మళ్లీ కలుస్తానన్న ట్రంప్కిమ్తో మళ్లీ సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆయన నుంచి స్పందన వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా నేతను కలుస్తానని భావిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ వ్యాఖ్యలతో 2018, 2019లో ఇద్దరు నేతలు నిర్వహించిన అపూర్వమైన సమావేశాల తర్వాత మరో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశంపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపుపై విభేదాలతో ఆ దౌత్య ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. ట్రంప్ తన రెండో పదవీకాలంలో కిమ్తో మళ్లీ చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.చర్చల గురించి నాకు తెలియదు: కిమ్ సోదరిట్రంప్తొ మళ్లీ సంబంధాలు ఏర్పడుతున్నాయన్న ప్రకటనపై ఉత్తరకొరియా నుంచి జాగ్రత్తతో కూడిన స్పందన వచ్చింది. ట్రంప్, కిమ్ మధ్య ఇటీవల ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తనకు తెలియదని కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాల్లో అమెరికా భాగస్వామ్యాన్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విన్యాసాలను ఉత్తర కొరియాపై వైరంగా ట్రంప్ అభివర్ణించారు. వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను 11 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. అయితే ఈ మార్పులతో విన్యాసాలు రెచ్చగొట్టే లేదా దూకుడు చర్యలు ఏమీ తగ్గలేదని కిమ్ యో జోంగ్ అన్నారు.57 అణ్వాయుధాలా?ట్రంప్ 57 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అసాధారణంగా మారింది. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వల పరిమాణంపై అమెరికా ప్రభుత్వం అధికారిక అంచనాను బహిరంగంగా వెల్లడించదు. దక్షిణ కొరియా కూడా ఉత్తరకొరియా వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలపై వివరణాత్మక అంచనాలను బహిరంగంగా వెల్లడించకుండా సంప్రదాయంగా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా అధికారికంగా గుర్తించదు.ప్రయోగిస్తే ప్రపంచం ఏమైపోతుంది?చిన్న స్థాయి అణు యుద్ధం కూడా ప్రపంచ ఆహార వ్యవస్థను ప్రభావితం చేయగలదని శాస్త్రీయ నమూనాలు సూచిస్తున్నాయి. ఉత్తరకొరియా ఒకవేళ 120 అణు వార్హెడ్లు ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాణనష్టం, ఆహార సంక్షోభం, పర్యావరణ నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే, ఒక్క అణ్వాయుధమే జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పేలితే భారీ ప్రాణనష్టం, మౌలిక వసతుల విధ్వంసం, దీర్ఘకాలిక రేడియేషన్ ప్రభావాలు సంభవించవచ్చు. పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే పేలుళ్ల వల్ల ఏర్పడే పొగ వాతావరణంలోకి చేరి సూర్యకాంతిని తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోవడం, పంటల దిగుబడి భారీగా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడటం వంటి పరిణామాలు సంభవించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, ప్రభావాన్ని వార్హెడ్ల సంఖ్యతో మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. వాటి పేలుడు శక్తి, ఎక్కడ పేలుతాయి, ఎంతమేర నగరాలు లేదా పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతింటాయి వంటి అంశాలు కూడా కీలకం. వాటిని ప్రయోగిస్తే మానవ నాగరికతకు అత్యంత తీవ్రమైన విపత్తును రావచ్చు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు -
‘భారతీయులే గొప్ప.. పాకిస్తానీలకు దిక్కులేదా?’ అవమానంపై పాక్ ఎంపీ ఆవేదన!
విమానం రద్దు కావడంతో హోటల్ ముందు ప్రయాణికుల క్యూ.. కానీ ఒక్క ప్రకటనతో పాకిస్తానీలకు షాక్!. ‘ఇండియా, అమెరికా పాస్పోర్ట్ ఉన్నవారికే వసతి’ అంటూ ప్రకటన. దీంతో, పాకిస్తాన్ మాజీ స్పీకర్ అసద్ ఖైసర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను కూడా ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్నానని పార్లమెంట్లో చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. యూఏఈని ‘సోదర దేశం’గా చెప్పుకునే పాకిస్తాన్కు.. అక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.వివరాల మేరకు.. విమానం రద్దు కావడంతో తాను సహా పలువురు ప్రయాణికులు హోటల్లో ఉండేందుకు ప్రయత్నించారని ఖైసర్ తెలిపారు. అయితే పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉన్న ప్రయాణికుల పట్ల హోటల్ సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా, అమెరికా పాస్పోర్ట్ ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే దౌత్యపరంగా స్పందించాలని ఖైసర్ డిమాండ్ చేశారు. యూఏఈతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ దేశాన్ని తాము సోదర ఇస్లామిక్ దేశంగా భావిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకుండా పాక్ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి యూఏఈ అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరారు.అంతేకాదు.. యూఏఈ అభివృద్ధిలో పాకిస్తానీల పాత్ర ఎంతో ఉందని ఖైసర్ గుర్తుచేశారు. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ‘సానుకూల పాత్ర’ పోషించిందని చెప్పుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఖైసర్ ప్రస్తావించారు. దీంతో అసలు యూఏఈలో ఏం జరిగింది? పాకిస్తాన్ ప్రయాణికులకే ఎందుకు వసతి నిరాకరించారన్న ఆరోపణలు వచ్చాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంటోంది. అందువల్ల ఇలాంటి ఆరోపణలు పాకిస్తాన్కు రాజకీయంగానే కాకుండా ప్రవాసుల భద్రత, ప్రయాణాల విషయంలోనూ ప్రాధాన్యం కలిగిస్తాయి. అయితే, గతంలో కూడా యూఏఈలో పాకిస్తాన్, భారత్ సహా వివిధ దేశాల ప్రయాణికులు ప్రవేశ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాల్లో యూఏఈ అధికారులు నిబంధనలు జాతీయత ఆధారంగా కాకుండా, హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ఆర్థిక సామర్థ్యం వంటి ప్రవేశ నిబంధనల ఆధారంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. -
సూపర్మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్లోనూ ‘సూపర్మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!
పనిప్రదేశం, ఆఫీస్ డెస్క్లు, టార్గెట్లు లేకుండా ప్రకృతితో మమేకమై ఉద్యోగం అంటే అబ్బా అని ఎగిరిగంతేస్తాం. అయినా అలాంటి ఉద్యోగం ఎక్కడుంటుంది అని కొట్టిపారేయకండి. అలాంటి గొప్ప ఉద్యోగం కూడా ఉంది. పైగా జీతం ఎంతో తెలిస్తే..వామ్మో అని ఉబ్బితబ్బిబవ్వడం ఖాయం. ఇంతకీ ఏంటా జాబ్..? ఏం పని చేయాల్సి ఉంటుందంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని లావోజున్ పర్వత సుందర ప్రాంతం ఒక అసాధారణమైన ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఆ ఉద్యోగానికి "క్లౌడ్స్కేప్ అబ్జర్వర్" అని పేరు పెట్టి మరి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఎంపికైన వ్యక్తి జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు పర్వతంపై ఉండి మారుతున్న మేఘాలను, ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించి రోజువారీ వీడియోలు పంచుకోవాల్సి ఉంటుంది. అంఉకోసం నెలకు సుమారు రూ. 8.5 లక్షలు దాక చెల్లిస్తారట. అంతేకాదండోయ్ వసతి కూడా కల్పిస్తారట. ఈ ఆఫర్ చైనాలో చాలామంది నిరుద్యోగ యువతను ఆకర్షించింది. దీన్ని చాలామంది డ్రీమ్ జాబ్గా, దేవతా ఉద్యోగంగా అభివర్ణిస్తూ..ఈ ఉద్యోగాన్ని ఎలాగైన కొట్టేయాలని ఉవ్విళ్లూరారు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నిర్దేశించిన హ్యాష్ట్యాగ్లను ఉపయోగించి వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది. సదరు సుందరమైన ప్రాంతం నిర్వాహకులు పంపిన కంటెంట్ నాణ్యతకు వచ్చిన స్పందనను పరిగణలోనికి తీసుకుని ఎంపిక చేస్తుందట. ఈ ఉద్యోగానికి సుమారు మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా, హెనాన్కు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్ అనే వ్లాగర్ ఎంపికయ్యాడు. అతను @xiaozao అనే హ్యాండిల్ను ఉపయోగిస్తాడు. అతను లావోజున్ పర్వతం నెం 001 క్లౌడస్కేప్ అబ్జర్వర్గా ఎంపికయ్యాడు. అతని దరఖాస్తు వీడియోకు బలమైన స్పందన వచ్చింది. అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతో సహా ఇతర దరఖాస్తుదారులకు విభిన్నంగా తన పనితీరుని చాటాడు. ఇక సదరు యువకుడు లీ ఇటీవలే ఈ కామర్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. నిజానికి ఈ ఉద్యగోం విశ్రాంతి, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉద్యోగంలా ఉంటుంది కానీ అతడి పనిదిన సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. అలాగే సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఇక్కడ రోజులో వివిధ సమయాల్లో వివిధ కోణాల నుంచి ఎక్కువ ఫుటేజ్లు చిత్రీకరించడమే అతడి టార్గెట్. ఆ అందమైన ప్రాంతం ఆన్లైన్ కంటెంట్ కోసం అతను మేఘాలు, పొగమంచు, పర్వత దృశ్యాలు, కాంతి ప్రదర్శనలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ పని లీకి కొత్త సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది. అలాగే ఈ ఉద్యోగంలో తెలియని ఒక రకమైన ఒత్తిడిన ఎదుర్కొనక తప్పదు కూడా. అదేంటంటే తన వీడియోలు క్లిక్ అవుతాయో లేదో అనే భయం వెంటాడుతూ ఉంటుందట. ఏ వీడియో కంటెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదిచుకున్నాడో..అంతే స్థాయిలో ప్రతిసారి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన పనే అని చెప్పొచ్చు. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితుల వల్ల ఫోటోలు చక్కగా రావు. నిరంతరం వాతారణ పరిస్థితులను తట్టుకుంటూ ఫోటోలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా..నెల మొత్త విజయవంతంగా చిత్రీకరణ కొనసాగించడం విశేసం. ముగింపు సమయంలో ఇట్టే నెల గడిచిపోతుందని అంటున్నాడు లీ. అంతేగాదు ఆ నెల లావోజున్ పర్వతం వద్ద గడిపిన లీ కూడా ఆన్లైన్ బాగా ఫేమస్ అయ్యాడు. అతడు ఆ పర్యాటక ప్రదేశం వీడియోల తోపాటు ఆ క్రమంలో తను ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఇలా కంటెంట్ క్రియేటర్ ఎందుకంటే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆ పర్యాటక ప్రదేశంలో ఇప్పటికే పూర్తి-కాలం పనిచేసే వీడియో మేకర్లు ఉన్నారు. అలాంటప్పుడు, ఇలా ప్రత్యేకంగా కంటెంట్ క్రియేటర్లు ఎందుకు అంటే..లావోజున్ పర్వతానికి చెందిన జాంగ్ అనే ప్రతినిధి మాట్లాడుతూ.. తమ పర్యాటక ప్రదేశానికి ఒక కొత్త దృక్కోణం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. జాంగ్ ఆ పరిశీలకుడిని "మూడవ కన్ను"గా వర్ణించారు. భవిష్యత్తులో ఇలా క్లౌడ్స్కేప్ పరిశీలకులను మళ్లీ నియమించుకోవచ్చని ఆ ప్రతినిధి తెలిపారు.కాగా, ఈ లావోజున్ పర్వతం మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని లువాన్చువాన్ కౌంటీలో ఉంది. ఈ పర్వతం దాని 'మేఘాల సముద్రం'కు ప్రసిద్ధి చెందింది. ఇది చైనాలో ప్రసిద్ధి చెందిన టావోయిస్ట్ పర్వతాలలో ఒకటి. ఇది రెండు వేల ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. అంతేగాదు పర్యాటక ఆర్షణ రేటింగ్ వ్యవస్థలో దీనికి 5A-రేటింగ్ ఉండటం గమనార్హం.(చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..! స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన భారతీయ మహిళ) -
పాక్ మిస్సైల్ టెస్ట్.. కశ్మీర్పై అమెరికా ప్రకటన.. సీన్ మారుతోందా?
ఇస్లామాబాద్ ఒక్కసారిగా కదిలింది. 750 కిలోమీటర్ల మేర గగనతలంపై ఆంక్షలు.. పైలట్లకు నోటామ్ నోటీసులు.. దీంతో పాకిస్తాన్ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలైంది. ఆగస్టు 19-20 తేదీల్లో పాక్ జారీ చేసిన గగనతల ఆంక్షలు ఫతాహ్ సిరీస్ మిస్సైల్ పరీక్షకు సంకేతాలా? అన్న చర్చ రక్షణ వర్గాల్లో మొదలైంది. అయితే నోటామ్లో మిస్సైల్ పరీక్షను స్పష్టంగా పేర్కొనలేదని కూడా నివేదికలు చెబుతున్నాయి.సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న ఫతాహ్ శ్రేణి రాకెట్ వ్యవస్థల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ‘ఫతాహ్-3 పరీక్షే’ అన్నది ప్రస్తుతం రక్షణ పరిశీలకుల అంచనా మాత్రమే. అధికారికంగా పాకిస్తాన్ ధృవీకరించిన సమాచారం కాదు. ఇదే సమయంలో కశ్మీర్పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు మరింత అసౌకర్యాన్ని కలిగించాయి. శ్రీనగర్ పర్యటనలో గోర్ జమ్మూకశ్మీర్ “భారత్లో ముఖ్యమైన భాగం” అని పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఒకవైపు మిస్సైల్ పరీక్షపై ఊహాగానాలు.. మరోవైపు కశ్మీర్పై అమెరికా స్పష్టమైన వ్యాఖ్యలు.. ఈ రెండు పరిణామాలు ఒకేసారి తెరపైకి రావడంతో దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. పాక్ గగనతల ఆంక్షల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? నిజంగానే కొత్త మిస్సైల్ పరీక్షకు రంగం సిద్ధమైందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.ఫతాహ్లో పాకిస్తాన్ ఇప్పటికే పలు రకాల దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఫతాహ్-4కు 750 కిలోమీటర్ల వరకు పరిధి ఉన్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఉంది. ఈ ఏడాది మేలో పాక్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఫతాహ్-4కు సంబంధించిన శిక్షణ ప్రయోగాన్ని నిర్వహించినట్లు రక్షణ విశ్లేషణ సంస్థలు పేర్కొన్నాయి. ఫతాహ్ శ్రేణి ఆయుధాల అభివృద్ధి పాక్ దీర్ఘశ్రేణి సంప్రదాయ దాడి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది. 2025 తర్వాత భారత్-పాక్ మధ్య క్షిపణి, డ్రోన్, రాకెట్ సామర్థ్యాల పోటీ మరింత చర్చకు వచ్చింది. పాకిస్తాన్ కూడా కొత్త తరం ఆయుధ వ్యవస్థలను ప్రదర్శిస్తూ వస్తోంది.అయితే, ఈ తాజా నోటామ్ను నేరుగా భారత్కు వ్యతిరేకమైన చర్యగా లేదా కశ్మీర్ పరిణామాలకు ప్రతిస్పందనగా నిర్ధారించడం తొందరపాటు అవుతుంది. క్షిపణి పరీక్ష కోసం గగనతలాన్ని ఖాళీ చేయడం సైనిక భద్రతా ప్రక్రియలో భాగం కావచ్చు. అసలు ఏ క్షిపణిని పరీక్షించబోతున్నారు? దాని పరిధి ఎంత? ప్రయోగం ఎక్కడి నుంచి ఎక్కడికి జరగనుంది? అనే వివరాలపై అధికారిక సమాచారం వెలువడితేనే పూర్తి స్పష్టత వస్తుంది. -
గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షం
పురాతన కాలంలో రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు ఔషధంగా, గర్భనిరోధకంగా విరివిగా ఉపయోగించి, దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిందని భావించిన అద్భుత మొక్క ‘సిల్ఫియం’ మళ్లీ వెలుగుచూసింది. టర్కీలోని ఇస్తాంబుల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహ్ముత్ మిస్కీ దీనిని కనుగొన్నట్లు ప్రకటించారు. మెడిటరేనియన్ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ పసుపు రంగు పూల మొక్కను ప్రాచీన కాలంలో అనేక వ్యాధుల నివారణకు, వంటకాల్లో, అలాగే గర్భనిరోధక సాధనంగా వినియోగించేవారు.జూలియస్ సీజర్ కాలంలో వెండితో సమానమైన విలువ కలిగిన ఈ మొక్కను వేల కిలోల పరిమాణంలో బంగారంతో పాటు ఖజానాలో భద్రపరిచేవారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. తొలుత ఆధునిక లిబియా తీర ప్రాంతాల్లో పెరిగిన ఈ మొక్క, క్రీస్తుశకం మొదటి శతాబ్దం నాటికి క్రమంగా కనుమరుగైంది. రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ నమోదు చేసిన వివరాల ప్రకారం, చివరగా లభించిన ఒకే ఒక కాండాన్ని చక్రవర్తి నీరోకు బహుకరించారు. ఆ తర్వాత మూడు ఖండాల్లో అన్వేషించినా ఇది లభించకపోవడంతో, భూమిపై అంతరించిపోయిన తొలి జాతుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది.అయితే టర్కీలోని హసన్ పర్వతంపై లభించే ‘ఫెరులా డ్రూడియానా’ అనే మొక్కే ప్రాచీన ‘సిల్ఫియం’ అని ప్రొఫెసర్ మిస్కీ పేర్కొంటున్నారు. ప్రాచీన గ్రీకు నాణేలపై ఉన్న చిత్రాలు, పురాతన గ్రంథాల్లోని వివరణలతో దీని వేర్లు, పసుపు పూలు పూర్తిగా సరిపోలుతున్నాయని ఆయన తెలిపారు. క్యారెట్, పార్స్లీ కుటుంబానికి చెందిన ఈ మొక్కలో క్యాన్సర్ నిరోధక, యాంటీ ఇన్ఫ్లమేటరీ, గర్భనిరోధక గుణాలు కలిగిన 30 రకాల ద్వితీయ జీవక్రియ ఉత్పత్తులు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ప్రాచీన సిల్ఫియం మాదిరిగానే గొర్రెలు, మేకలు దీనిని ఎంతో ఇష్టంగా మేస్తాయని స్థానికులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: పాక్కు భారత్ బిగ్ షాక్.. హైకమిషన్ బారికేడ్లు ధ్వంసం!


