breaking news
International
-
పాకిస్థాన్ను వీడుతున్న మేథోసంపత్తి
పాకిస్థాన్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.గడిచిన 24 నెలలో పాకిస్థాన్లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది. -
భారత్-కెనడా మధ్య చిగురిస్తున్న వాణిజ్య బంధం
భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.కీలక పర్యటనలు - సన్నాహక చర్చలుకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు2023 సెప్టెంబర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.50 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?
ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్లో హాట్ టాపిక్గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి సంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు. -
పని చెప్పలేదని యజమానిపై కోర్టుకు..
ఇది కూడా లారెన్స్ తరహా అంశమే. తనకు పనేమీ చెప్పకుండా బోర్ కొట్టించారని పేర్కొంటూ ఓ వ్యక్తి యజమానిపై కోర్టుకెళ్లాడు. ఫ్రాన్స్కు చెందిన ఫెడ్రిక్ డెస్నార్డ్ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ తయారీ కేంద్రంలో మేనేజర్గా పనిచేశాడు. అయితే, తనకు చిన్నచిన్న పనులు తప్ప కీలకమైన విధులేమీ అప్పగించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని యజమానిపై దావా వేశాడు. నాలుగేళ్లు తనది అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పని చెప్పకుండా ఇలా ఇబ్బందులకు గురి చేసినందుకు కంపెనీ 4 లక్షల డాలర్ల (రూ.3.6కోట్లు) పరిహారం ఇవ్వాలని కోరాడు. ఏమీ పనిచేయకుండా జీతం తీసుకున్నందుకు సిగ్గుగా ఉందని.. పైగా దానివల్ల మూర్ఛవ్యాధి కూడా వచి్చందని వివరించాడు. వాదనలు విన్న న్యాయస్థానం ఫెడ్రిక్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అధిక పనిఒత్తిడితో బాధపడే ఉద్యోగికి ఈ వ్యవహారం భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఫెడ్రిక్కు 45వేల(రూ.40 లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. 20 ఏళ్లు ఉత్తినే జీతమిచ్చారని కంపెనీపై దావా పని చేయకపోయినా జీతం ఇచ్చేస్తాం అంటే.. ఇలాంటి డీల్ ఉంటే ఎలా వదులుకుంటాం అనే కదా అంటారు. కానీ ఆమె అలా అనలేదు. తనకు ఎలాంటి పనీ అప్పజెప్పకుండా 20 ఏళ్ల పాటు వేతనం ఇచి్చన కంపెనీపై కోర్టుకెక్కారు. లారెన్స్ వాన్ వాసెన్హోవ్ అనే మహిళ 1993లో ఫ్రాన్స్ టెలికాం కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారు. అయితే, పుట్టుకతోనే హెమిప్లెజియా (ముఖం, అవయవాలలో పాక్షిక పక్షవాతం) ఉండటంతో ఆమెకు అందుకు అనుగుణమైన పనులే అప్పగించారు. ఆ తర్వాత ఆ కంపెనీని ఆరెంజ్ సంస్థ స్వా«దీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్వీయ అభ్యర్థనపై ఆమెను ఫ్రాన్స్లోని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. కానీ అక్కడ కొత్త కార్యాలయం ఆమె అవసరాలకు అనుగుణంగా లేదు. దీంతో కంపెనీ ఎలాంటి పనులూ అప్పజెప్పకుండా వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, వాసెన్ దీనిని వివక్షగా భావించి.. పోరు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది.16 ఏళ్లుగా సిక్ లీవ్.. తిరిగి యజమానిపైనే కేసు జర్మనీకి చెందిన ఓ టీచరమ్మ కూడా ఇదే బాపతు. కాకుంటే కాస్త పద్ధతిగా సిక్ లీవ్ పెట్టింది. సిక్ లీవ్ అంటే వారాలు, నెలలు కాదు.. ఏకంగా 16 సంవత్సరాలు. అవాక్కయ్యారా? కాస్త ఆగండి. ఇంకా ఉంది. అనారోగ్యానికి సంబంధించిన రుజువులు చూపించండి అని అడిగినందుకు యాజమాన్యంపైనే కేసు పెట్టింది. జర్మనీలోని నార్త్ రైన్–వెస్ట్ఫాలియాకు చెందిన ఓ మహిళ వెసెల్లోని ఓ వృత్తి విద్య కాలేజీలో ఉపాధ్యాయురాలు. అనారోగ్యం సాకుతో 16 ఏళ్లు సిక్ లీవ్లోనే ఉండి 11.66 లక్షల డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు) వేతనం తీసుకుంది. జర్మనీ చట్టాల ప్రకారం ఉపాధ్యాయులు అనారోగ్య సెలవులో ఉన్నప్పుడు పూర్తి జీతం తీసుకోవడంతో సహా కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. దీనినే ఆమె క్యాష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీకి కొత్త యాజమాన్యం వచ్చి.. ఆమె అనారోగ్యానికి రుజువు అడగడంతో వారిపై దావా వేసింది. అయితే, న్యాయస్థానం ఆమెనే చీవాట్టు పెట్టింది. అనారోగ్యానికి సంబంధించి రుజువును అడిగే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పింది. పని చేయకుండానే పదేళ్లుగా జీతం తీసుకుని.. ఇతడు ఎలాంటి విధులూ నిర్వర్తించలేదు.. ఇంకా చెప్పాలంటే అసలు ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా జీతం మాత్రం తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేళ్ల పాటు దర్జాగా వేతనం పొందాడు. ఎట్టకేలకు అతడి బాగోతం బయట పడటంతో కటకటాలపాలయ్యాడు. కువైట్ లోని పౌర సేవల విభాగంలో ఉద్యోగిగా ఉన్న ఓ వ్యక్తి గత దశాబ్దకాలంగా ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా అతడి ఖాతాలో జీతం జమైంది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. రెండు కోర్టుల్లో తీర్పు అతడి పక్షాన రాగా.. కోర్ట్ ఆఫ్ క్యాసేషన్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పదేళ్లుగా తీసుకున్న వేతనం మొత్తం 1,04,000 కువైట్ దీనార్లను (దాదాపు రూ.3 కోట్ల పైనే) రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిధుల నుంచి అక్రమంగా వేతనం పొందినందుకు 3,12,000 కువైట్ దీనార్ల (దాదాపు రూ.9 కోట్ల పైనే) జరిమానా విధించింది. -
చైనాలో మరో అద్భుతం..
బీజింగ్: చైనా మరో అడుగు ముందుకేసి అద్భుతం సృష్టించింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగాన్ని ప్రజా రవాణా కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం ద్వారా 7 గంటల ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.డ్రాగన్ దేశం చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ డిసెంబర్ 26 శుక్రవారం అధికారికంగా ట్రాఫిక్కు ప్రారంభించారు. ఇది వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాలను దాటి, గతంలో కొన్ని గంటలు పట్టే పర్వత ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.22.13 kilometers! China just opened the world’s longest highway tunnel across a mountain range to traffic in Xinjiang.China named the tunnel Tianshan Victory. Why? Because it cuts through 16 geofracture zones and is without doubt a world marvel of engineering. pic.twitter.com/FGM34fyqia— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 26, 2025 ఇదిలా ఉండగా.. చైనా శుక్రవారమే మరో ఎక్స్ప్రెస్వేను కూడా ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే మరొక ముఖ్యమైన సహాయక సొరంగం G0711 ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సొరంగం చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లోని టియాన్షాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది రెండు సమాంతర గొట్టాలుగా రూపొందించబడింది. ఒక్కొక్కటి రెండు లేన్ల ట్రాఫిక్ను కలిగి ఉంటాయి. ఇది ఉత్తర జిన్జియాంగ్లోని ఉరుంకిని దక్షిణాన యులికి కలిపే ఉరుంకి-యులి ఎక్స్ప్రెస్వేలో భాగం. ఈ సొరంగం 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించబడింది. సొరంగం ప్రారంభంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. The Urumqi-Yuli Expressway officially opens to traffic!At its heart lies the world’s longest expressway tunnel. At 22 kilometers, it turns a 3-hour mountain drive into 20 minutes.A major leap in connectivity for Xinjiang.🛣 pic.twitter.com/jNMoRm2qvU— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) December 26, 2025The Tianshan Victory Tunnel opened to full traffic today. Spanning 22.13 km, it is the world's longest highway tunnel. The driving time from Ürümqi to Korla has been reduced from seven hours to 3.5 hours. Traveling in #Xinjiang has become significantly more convenient.#China… pic.twitter.com/fUWIHPZNRC— China Bro (@chinalittlebro6) December 26, 2025 -
మక్కాలో కలకలం.. వీడియో వైరల్
మక్కా: ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కాలో కలకలం చెలరేగింది. మసీదు అల్-హరమ్ (గ్రాండ్ మసీదు)లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్నకు గురిచేసింది. మసీదు పైఅంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించాలని ఆ వ్యక్తి ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అతనిని కాపాడారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మసీదు పై అంతస్తు రెయిలింగ్ దాటి, ఒక వ్యక్తి కిందకు దూకబోతుండగా, స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆ భద్రతా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🕋🚨 A security guard at the Masjid al-Haram rushed to intervene after a person tried to take their own life by jumping off the upper floors of the masjid.The security guard was injured while trying to prevent the person from hitting the ground. Both individuals were… pic.twitter.com/NnpveIE8wf— • (@Alhamdhulillaah) December 25, 2025ఈ ఉదంతంపై మక్కా ప్రాంతీయ ఎమిరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని నివారించిందని దానిలో కొనియాడింది. అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భద్రతా అధికారికి ఫ్రాక్చర్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితునిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం విచారణ చేపడుతున్నామని మక్కా భద్రతా దళాలు వెల్లడించాయి.ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తితో పాటు, గాయపడిన భద్రతా అధికారిని కూడా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ వ్యక్తిని కాపాడటంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు -
థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు
బ్యాంకాక్: ఆగ్నేయాసియా దేశాలు థాయ్లాండ్- కంబోడియా మధ్య కొద్దివారాలుగా కొనసాగుతున్న భీకర పోరుకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఉభయ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించాయి. కొన్ని గంటలకే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో జరిగిన ఈ కీలక భేటీలో ‘ఇకపై ఇరు దేశాల మధ్య ఎటువంటి సైనిక కదలికలు ఉండకూడదని, ప్రస్తుతం ఎక్కడి సైన్యాలు అక్కడే ఉండి, శాంతిని కాపాడాలంటూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీంతో గత 20 రోజులుగా వినిపిస్తున్న బాంబుల మోత ఆగిపోయి, సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో తిరిగి ముదిరింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం ఈ నెలలో విచ్ఛిన్నం కావడంతో, యుద్ధం తీవ్రతరమయ్యింది. థాయ్లాండ్ తన ఎఫ్-16 యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేయగా, కంబోడియా రాకెట్ లాంచర్లతో దీటుగా బదులిచ్చింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు సుమారు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా జనం తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.చారిత్రక దేవాలయాలు ఉన్న భూభాగం కోసం జరిగిన ఈ పోరు అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది. శాంతి పునరుద్ధరణ కోసం రెండు దేశాల రక్షణ మంత్రులు.. నాత్థాఫోన్ నాక్ఫానిత్ (థాయ్లాండ్), టీ సీహా (కాంబోడియా) సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ఆసియాన్ (ఆసియాన్) పరిశీలకులు సాక్ష్యంగా నిలిచారు. తాజా ఒప్పందం ప్రకారం, సరిహద్దుల్లో ఎటువంటి అదనపు బలగాలను మోహరించకూడదని, పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయకూడదని నిర్ణయించారు. వచ్చే 72 గంటల పాటు కాల్పుల విరమణ సజావుగా సాగితే, తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా సైనికులను విడుదల చేస్తామని థాయ్లాండ్ హామీ ఇచ్చింది. ఇరుపక్షాలు ఈ మేరకు అంగీకారం కుదుర్చుకున్నాయి.ప్రస్తుతానికి ఇరు దేశాల సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయినప్పటికీ, ఇది ఎంతకాలం నిలుస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా నిర్వాసితులైన లక్షలాది మందిని తిరిగి వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగిన కొద్ది రోజులకే విచ్ఛిన్నం కావడంతో, అంతర్జాతీయ సమాజం పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. తాత్కాలికంగా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పటికీ, శాశ్వత సరిహద్దు పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలు జరగాల్సి ఉంది.ఇది కూడా చదవండి: భారత్తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’ -
బంగ్లాదేశ్లో మరో దారుణం.. సింగర్ షోపై మూక దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. వరుస దాడి ఘటనల కారణంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో ప్రముఖ రాక్స్టార్ కాన్సర్ట్పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్లోని ఫరీదాపూర్లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాల పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది అక్కడికి వచ్చారు. అయితే, ఈ కాన్సర్ట్ ప్రారంభానికి ముందు(రాత్రి తొమ్మిది గంటల సమయంలో).. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో, వారిని భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కాన్సర్ట్కు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.Once again, a concert by Bangladesh’s leading band music artist James has been shut down.In Faridpur, just before the concert was set to begin, extremist groups stormed the stage and carried out an attack. Following intervention by law enforcement agencies, the organizers were… pic.twitter.com/NfmLRjL2OF— Sahidul Hasan Khokon (@SahidulKhokonbd) December 26, 2025కాగా, ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. ఉద్రిక్తతలు మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను అక్కడినుంచి తరలించారు. కానీ, మూక దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం, భద్రతా కారణాల రీత్యా కాన్సర్ట్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
భారత్తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో న్యూజిలాండ్ మద్దతుతో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విజయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఒప్పందంపై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని లక్సన్ భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపిన వివరాల ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను మరింతగా పెంపొందించనుంది. భారత్లోని 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్ను న్యూజిలాండ్కు చేరువ చేయనుంది. ప్రధాని మోదీ- లక్సన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావడమే కాకుండా, వచ్చే 15 ఏళ్లలో భారత్లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడనుంది. భారత్ నుండి ఔషధ ఉత్పత్తులు, న్యూజిలాండ్ నుండి అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి.కాగా న్యూజిలాండ్ అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఈ భారత్తో ఒప్పందం చిచ్చు రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఈ డీల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అశాస్త్రీయమైనదని విమర్శించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ పాడి పరిశ్రమ (డైరీ సెక్టార్) ప్రయోజనాలను ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టారన్నారు. పాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించలేదని పీటర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే భారతీయులకు ఉపాధి వీసాల విషయంలో సులభతర నిబంధనలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని కారణంగా స్థానిక న్యూజిలాండ్ ప్రజల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై తమ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని లక్సన్ దీని అమలుకు మొగ్గుచూపారు. కాగా 2024 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 2.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, అందులో భారత్ ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్కు న్యూజిలాండ్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.ఇది కూడా చదవండి: Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు.. -
Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక అణచివేత, ఇప్పుడు ఎన్నికల పేరుతో మరింత శక్తిని పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ తతంగం వెనుక దాగిన వాస్తవాలను తెలియజెప్పడమే ఈ కథనం ఉద్దేశం.అంతులేని ‘జుంటా’ అరాచకాలుమయన్మార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ సైనిక నియంతృత్వానికీ మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూ వస్తోంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ‘జుంటా’ దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ‘జుంటా’ అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది.40కి పైగా పార్టీలను నిషేధించి..ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికలు, క్రూరమైన ‘జుంటా’ సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ‘ది గార్డియన్’ తన కథనంలో పేర్కొంది. మయన్మార్లో ప్రస్తుతం మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ 2025, డిసెంబర్ 28న, రెండవ దశ 2026, జనవరి 11న, చివరి దశ పోలింగ్ జనవరి 25న జరగనుంది. అంగ్ సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలులోనే మగ్గుతుండగా, ‘జుంటా’ 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి, కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేననే వాదన వినిపిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప, ప్రజల అభీష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.‘జుంటా’ సైన్యానికి ఎదురు దెబ్బలుఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటినే విషయానికొస్తే.. దేశంలోని సగం కంటే ఎక్కువ భూభాగం ప్రస్తుతం సైనిక నియంతృత్వం చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్.. జుంటా సైన్యాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నాయి. దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సానేగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్నీ బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమ పరుస్తూ, ఎన్నికల దిశగా ముందుకు వెళుతోందనే మాట వినిపిస్తోంది. మయన్మార్ సైన్యాన్ని జుంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనికి ‘జుంటా’ అనే పేరు వచ్చింది. జుంటా అంటే ‘కమిటీ’ లేదా ‘సమావేశం’ అని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ‘జుంటా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం.. అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం చేపట్టినప్పటి నుండి ‘జుంటా’ సైన్యం పాలన అని అంటున్నారు.కత్తి పెట్టి ఓటు అడుగుతారా?ఇటువంటి తరుణంలో సైన్యం విడుదల చేసిన కొత్త ఎన్నికల నిబంధనలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులను కలిగి ఉండాలి. ఈ నిబంధన చిన్న రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై నీళ్లు చల్లేదిగా మారింది. దీనివల్ల రేపు ఎన్నికల్లో గెలిచేది ఎవరో ముందే అంచనా వేయవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో మయన్మార్ సామాన్య ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ‘మాకు ఓటు వేసే హక్కు కావాలి.. అయితే అది మా గొంతు మీద కత్తి పెట్టి అడిగేదిగా కాకూడదు’ అని వారంటున్నారు. భయం నీడన జరిగే ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేవు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక దేశంలో హింస మరింతగా పెరుగుతుందని, సాయుధ తిరుగుబాటుదారుల పోరాటం ఉధృతం అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.చైనా మద్దతు వెనుక ఏముంది?మయన్మార్ ‘జుంటా’ నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశంలోని 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచదేశాల సాయం వైపు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ -
ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. జెలెన్స్కీకి కొత్త టెన్షన్?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉపయోగమేమీ ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రతిపాదనల విషయమై తాను.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడనున్నట్టు తెలిపారుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జెలెన్ స్కీ ఫ్లోరిడాలో చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య శాంతి ప్రతిపాదనలను నేను ఆమోదించే వరకు ఏమీ ఉండదు. జెలెన్ స్కీ వద్ద ఎలాంటి సమాచారం ఉందో చూద్దాం. చర్చలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా చర్చలు జరుపుతాం. సమావేశం అంతా బాగానే జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
పాక్లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇప్పటికీ 20 లక్షల మందికి పైగా అఫ్గాన్లు నివసిస్తున్నారని ఐరాస శరణార్ధి విభాగం తెలిపింది. 2025లో 10 లక్షల మంది వరకు ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారంది. ఒక్క నవంబర్లోనే 1.71 లక్షల మంది అఫ్గానిస్తాన్కు వచ్చారని తెలిపింది.పాక్ అధికారులు చమన్, తోర్ఖామ్, బారాబ్చా బోర్డర్ పాయింట్ల మీదుగా మరో 37, 899 మందిని వెనక్కి పంపించి వేశారని పేర్కొంది. నవంబర్లో రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మానవతా సాయం పంపిణీపై ప్రభావం చూపాయని తెలిపింది. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటున్న అఫ్గాన్లను పంపించి వేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2023 సెపె్టంబర్ నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. స్వదేశంలో అస్థిర పరిస్థితులు, అణచివేత చర్యల కారణంగా వీరంతా పొరుగుదేశంలో తలదాచుకుంటున్నారు. -
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
డెవిన్ మంచు తుపాను ధాటికి అమెరికాలో గగనతల ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇయర్ ఎండ్ సెలవులు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యాలతో ప్రయాణాలకు సిద్ధపడినవాళ్లకు అమెరికన్ ఎయిర్లైన్స్లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,800 విమానాలు రద్దు చేశాయి. వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ గణాంకాల ప్రకారం.. వివిధ ఎయిర్లైన్స్లకు చెందిన 1,802 విమానాలను శుక్రవారం రద్దు చేశారు. మరో 22,349 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, డెట్రాయిట్ మెటరోపాలిటిన్ లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఎయిర్లైన్స్ కంపెనీలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. డెవిన్ తీవ్ర మంచు తుపాను(తుపానుకు పెట్టిన పేరు) గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలను ప్రభావితం చేసింది. సుమారు 4-8 ఇంచుల మేర మంచు కురిసింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికల నేపథ్యంలో.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో.. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు. వింటర్ స్ట్రోమ్ డెవిన్.. ఈ క్రిస్మస్, న్యూఇయర్ సీజన్కు లక్షల మందిపై ప్రభావం చూపెడుతోంది. స్వస్థలాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. మంచు కరిగి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం నుంచి మంచు కురిసే తీవ్రత తగ్గొచ్చని.. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడొచ్చని నేషనల్ వెదర్ సర్వీసెస్ అంటోంది. -
అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 15 ఏళ్ల జైలు
పుత్రజయ: ప్రభుత్వ నిధుల దురి్వనియోగం కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్(72)కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు రూ.2,500 కోట్ల భారీ జరిమానా విధిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పెట్టుబడి నిధి 1ఎంబీడీ నుంచి కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టిన అతిపెద్ద అవినీతి కేసులో ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. 1 ఎంబీడీ నిధి నుంచి తన సొంత ఖాతాకు రూ.6,500 కోట్లను మళ్లించారంటూ దాఖలైన కేసులో అధికార దురి్వనియోగం, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆయనపై 25 ఆరోపణలున్నాయి. ప్రస్తుతం 1ఎంబీడీ అవినీతి కేసులోనే నజీబ్ రజాక్ జైలులో ఉన్నారు. ఈ శిక్షాకాలం ముగిశాక, తాజా తీర్పు ప్రకారం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ప్రకటించారు. జరిమానా చెల్లింపులో విఫలమైన పక్షంలో ఆయన మరో 10 ఏళ్లు జైలులోనే గడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని రజాక్ అంటున్నారు. ఈ నిధులన్నీ సౌదీ అరేబియా నుంచి అందిన రాజకీయ విరాళాలని అంటున్నారు. లౌ టెక్ ఝో అనే ఫైనాన్షియర్ వల్లే కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వచి్చందంటున్నారు. లౌ టెక్ ఝొ మాత్రం ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద 1 ఎంబీడీ ఆర్థిక కుంభకోణంలో ఈ తీర్పును మైలురాయిగా భావిస్తున్నారు. -
ఆదివారం ట్రంప్తో భేటీ: జెలెన్స్కీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
‘హెచ్–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. మైమన్సింగ్ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై ఆచితూచి స్పందించింది. ఆ దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల కోణంలోనే దీనిని చూడాలని పేర్కొంది. బంగ్లా విముక్తి పోరాటం దగ్గర్నుంచి ఆ దేశంతో సన్నిహిత, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పింది. ఫ్యాక్టరీ కారి్మకుడు దీపు చంద్ర దాస్ను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులతోపాటు క్రైస్తవులు, బౌద్ధులపైనా అతివాదులు పాల్పడుతున్న దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళన కరమైన అంశమన్నారు. మధ్యంతర ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా మైనారిటీల హత్యలు, భూ ఆక్రమణలు, దాడులకు సంబంధించిన ఘటనలు 2,900కు పైగా నమోదయ్యాయన్నారు. వీటిని మీడియా చేస్తున్న అతి ప్రచారంగానో లేదా రాజకీయ హింసగానో చూడరాదని జైశ్వాల్ తెలిపారు. -
ఐఎస్ స్థావరాలపై దాడులు
వెస్ట్ పామ్ బీచ్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా వాయవ్య నైజీరియాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. నైగర్–నైజీరియా సరిహద్దుల్లో ఉన్న సొకొటొ రాష్ట్రంలో ఐఎస్ నడుపుతున్న క్యాంపులపై ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ప్రాబల్యం కోసం ఐఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. నైజీరియా యంత్రాంగం వినతి మేరకు గురువారం తమ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారముందని అమెరికా మిలటరీ ప్రకటించింది. అమాయక క్రైస్తవులను అమానుషంగా చంపుతున్నందుకే ఐఎస్ శిబిరాలపై భీకర, శక్తివంతమైన దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇది అమెరికా బలగాలతో కలిసి చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్ అని, నైజీరియా ప్రజలను చంపుతున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమని నైజీరియా విదేశాంగ మంత్రి యూసుఫ్ మైతామాని అన్నారు. అదేవిధంగా, దాడులకు మతం ప్రాతిపదిక కాదని, క్రిస్మస్తో సంబంధం లేదని యూసుఫ్ స్పష్టం చేశారు. నైజీరియా నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్నారు. మరిన్ని దాడులకు అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అయితే, జిహాదీ గ్రూపుల దాడుల నుంచి క్రైస్తవులను కాపాడటంలో నైజీరియా ప్రభుత్వం విఫలమైందంటూ కొంతకాలంగా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ‘ప్రత్యేకంగా ఆందోళనకరంగా మారిన దేశం’గా నైజీరియాపై అమెరికా ప్రభుత్వం ముద్ర వేసింది. దీని ప్రకారం.. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఇలాంటి దేశాలపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మిలటరీ నవంబర్ నుంచే నైజీరియాలోని ఐఎస్ గ్రూపు స్థావరాలపై దాడులకు పథకం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఐఎస్ అనుబంధ గ్రూపుల హింస నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలోని రెండు రాష్ట్రాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐఎస్కు సంబంధించిన ఓ గ్రూపు ఇప్పటికే బోర్నో రాష్ట్రంలో గట్టి పట్టు సాధించింది. ఈశాన్య నైజీరియాలో బోకోహరామ్, ఐఎస్ అనుబంధ గ్రూపులు గత పదేళ్లుగా వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని ఆక్లెడ్ అనే మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరమైన హింసను విశ్లేíÙస్తుంది. ఐఎస్ అనుబంధ ‘నైజీరియా–ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ఈశాన్య ప్రాంతంలో నడుస్తున్న అతిపెద్ద గ్రూపని విశ్లేషకుడు బులామా బుకాటి చెప్పారు. అదే వాయవ్య సొకొటొ, కెబ్బి రాష్ట్రాల్లో ప్రాబల్యం కోసం స్థానికంగా లకురమా అని పిలిచే గ్రూపు ప్రయతి్నస్తోందన్నారు. ఈ గ్రూపునే తాజాగా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ గ్రూపు సొకొటొలోని ప్రజలపై సామాజిక ఆంక్షలను అమలు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో, సెంట్రల్ నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులైన రైతులు, ముస్లింలైన పశువుల కాపరుల మధ్య నీళ్లు, పచి్చక బయళ్ల విషయమై తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని బుకాటి వివరించారు.ట్రంప్ ఆరోపణల్లో నిజముందా?నైజీరియాలోని వివిధ జిహాదీ గ్రూపులు జరుపుతున్న దాడుల్లో ముస్లింల కంటే క్రైస్తవులే ఎక్కువ మంది చనిపోయారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మానవ హక్కుల సంస్థలంటున్నాయి. బాధితుల్లో రెండు మతాల వారూ దాదాపు సమానంగానే ఉంటున్నారన్నాయి. క్రిస్మస్ రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా..‘నైజీరియాలో రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చుమీరడాన్ని మేం జరగనీయం. హ్యాపీ క్రిస్మస్’అంటూ వ్యాఖ్యానించారు. దాడులకు మద్దతు, సహకారం అందించిన నైజీరియా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఓ యుద్ధ నౌక నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న ఫొటోను రక్షణ శాఖ విడుదల చేసింది. నైజీరియా జనాభా 22 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉన్నారు. -
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్లోని పూంచ్ సెక్టార్కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు, భింబర్లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. -
మన బ్రాండ్.. స్విచ్ ఆఫ్!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మొబైల్ ఫోన్ల తయారీలో చైనా తర్వాతి స్థానం భారత్దే. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, ఆ్రస్టియా, ఇటలీ వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో ఐఫోన్లూ ఎగుమతి అవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏటా 15 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నా ఇండియన్ బ్రాండ్స్ కనిపించకపోవడం గమనార్హం. మైక్రోమ్యాక్స్ వంటి దేశీ బ్రాండ్స్ వచ్చినా.. భారత మొబైల్ ఫోన్ల విపణిలో 2010కి ముందు వరకు నోకియా (ఫిన్లాండ్), మోటరోలా (యూఎస్), ఎరిక్సన్ (స్వీడన్), సీమెన్స్ (జర్మనీ), సామ్సంగ్ (దక్షిణ కొరియా), సోనీ ఎరిక్సన్ (జపాన్/స్వీడన్), బ్లాక్బెర్రీ (కెనడా), ఎల్జీ (దక్షిణ కొరియా) కంపెనీలు రాజ్యమేలాయి. 2003లో చెన్నైకి చెందిన వీకే మునోత్తోపాటు పలు కంపెనీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ 2008లో మైక్రోమ్యాక్స్ రాకతో భారతీయ చవక హ్యాండ్సెట్స్ యుద్ధం మొదలైంది. క్రమంగా కార్బన్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్ల రాకతో 2010–12 మధ్య మొబైల్ ఫోన్ల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశీయ మొబైల్ కంపెనీల దెబ్బకు ఒక దశలో నోకియా, సామ్సంగ్ మార్కెట్ వాటా తగ్గింది. ఏకంగా 230 బ్రాండ్స్.. భారత మొబైల్స్ రంగంలో ఒకానొక దశలో 50%పైగా వాటాను దేశీయ కంపెనీలు చేజిక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 230 దాకా భారతీయ బ్రాండ్స్ అమ్మకాలు సాగించాయి. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీల తయారీలోకి సైతం ప్రవేశించాయి. 2010లో చైనా కంపెనీ హువావే భారత్లో అడుగుపెట్టగా షావొమీ, వివో, ఒప్పో ప్రవేశంతో 2014 నుంచి అసలైన యుద్ధం మొదలైంది. చైనా బ్రాండ్ల ముందు మన కంపెనీలు నిలవలేకపోయాయి. కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫీచర్ ఫోన్లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా స్మార్ట్ఫోన్ల విభాగం పోటీలో మాత్రం విదేశీ కంపెనీల దరిదాపుల్లో కూడా లేవు. ఎలా సాధ్యమైందంటే..చవక ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో ప్రవేశించిన దేశీయ బ్రాండ్స్ రిటైలర్ల మార్జిన్లపై దృష్టిపెట్టలేదనేది మార్కెట్ వర్గాల మాట. పైగా రూ. 10 వేలలోపు ధరల విభాగంలోనే ఇవి ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక్కడే చైనా కంపెనీలు చక్రం తిప్పాయి. అధిక ఫీచర్లు, నాణ్యతకుతోడు రిటైలర్లకు అధిక లాభాలను అందించాయి. పైగా సొంత పరిశోధన, అభివృద్ధి విభాగాలతోపాటు స్మార్ట్ఫోన్ల తయారీ సైతం వాటి చేతుల్లోనే ఉండటంతో ధరలను శాసించాయి. విక్రయానంతర సేవలను చిన్న పట్టణాలకూ విస్తరించాయి. క్రమంగా చైనా బ్రాండ్లు భారతీయ మార్కెట్ను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిమాణం పరంగా దాదాపు 70% వాటా చైనా కంపెనీలదే. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్లకు అవకాశమే లేదన్నది నిపుణుల మాట.ఇదీ భారత మార్కెట్..» 2025 జూలై–సెప్టెంబర్ మధ్య 4.8 కోట్లస్మార్ట్ఫోన్లుఅమ్ముడయ్యాయి. » టాప్–10లోని సామ్సంగ్, యాపిల్, మోటరోలా మినహా మిగిలినవన్నీ చైనావే. » మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్సగటు ధర రూ. 26,400పైమాటే. » రూ.72 వేలు, ఆపై ఖరీదు చేసేమోడళ్ల అమ్మకాలు ఏడాదిలో53 శాతం పెరిగాయి. » విక్రయాల్లో ఆఫ్లైన్ వాటా48.3 నుంచి 56.4 శాతానికిదూసుకెళ్లగా ఆన్లైన్ విభాగం 51.7నుంచి 43.6 శాతానికి తగ్గింది.» ఈ ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ రూ. 4.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతంస్మార్ట్ఫోన్లనువినియోగిస్తున్నవారి సంఖ్య70కోట్లు -
పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే ప్రారంభం
బీజింగ్: చైనా మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ రంగాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టును పూర్తి చేసింది. షింజియాంగ్ ప్రావిన్స్లోని తియాన్షాన్ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన 22.13 కిలోమీటర్ల పొడవైన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే టన్నెల్గా గుర్తింపు పొందింది.ఈ టన్నెల్ ద్వారా గతంలో పర్వత మార్గం గుండా ప్రయాణించడానికి గంటల తరబడి పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది. షింజియాంగ్ ఉత్తర భాగంలోని ఉరుమ్చీ నగరాన్ని, దక్షిణ భాగంలోని యులీ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన G0711 ఉరుమ్చీ–యులీ ఎక్స్ప్రెస్వేలో ఇది కీలక భాగంగా నిలిచింది.తీవ్ర చలిలో, మైనస్ 43 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో, 9,842 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనా మరోసారి తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది.తియాన్షాన్ పర్వతాలు షింజియాంగ్ను ఉత్తర–దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ టన్నెల్ ప్రారంభం వల్ల రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరంగా కొత్త అవకాశాలను ఆహ్వానించినట్లు అవుతుంది. -
ఘోరం.. మసీదులో బాంబు పేలుళ్లు 8మంది మృతి
సిరియాలో దారుణం జరిగింది. హోమ్స్ సిటీలో శుక్రవారం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల చేస్తున్న సమయంలో బాంబు పేలింది. ఈ దుర్ఘటనో ఎనిమిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మసీదులో బాంబు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా ఈ ఘటనను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇది పిరికపంద చర్యని పేర్కొంది. ఇటువంటి చర్యలు సిరియాలో ప్రభుత్వాన్ని పౌరుల భద్రతను విఫలం చేయవని పేర్కొంది. ప్రజలలో అయోమయాన్ని, భయాన్ని సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం పేర్కొంది. కాగా మసీదు బాంబు దాడి ప్రాథమిక విచారణలో బాంబులు అమర్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
వ్యాపారం అమ్మేసి, ఒక్కొక్కరికీ రూ. 4 కోట్ల బోనస్
ఒక కంపెనీ అధిపతి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా 2 వేల కోట్ల రూపాయలను బోనస్ను ప్రకటించారు. దీంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఉద్యోగుల వంతైంది. సోషల్ మీడియాలో ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఎవరా అధిపతి, ఏమా కథ నిజ జీవితంలో శాంతా క్లాజ్ గురించి తెలుసుకుందాం పదండివాల్ స్ట్రీట్ జర్నల్లోని ఒక నివేదిక ప్రకారంతన కుటుంబ కంపెనీ అమ్మకం తర్వాత ఒక వ్యాపార యజమాని తన కార్మికులకు లక్షలాది బోనస్లను బహుమతిగా ఇచ్చాడు. ఫైబర్బాండ్ సంస్థ (Fibrebond) సీఈవో 46 ఏళ్ల గ్రాహమ్ వాకర్ 540 మంది ఉద్యోగులకు సుమారు రూ.2,155 కోట్లు బోనస్ పంపిణీ చేశారు.ఈ సంవత్సరం ప్రారంభంలో తన కంపెనీని ఈటన్ కార్పొరేషన్కు (రూ.15,265 కోట్లు) విక్రయించాడు. అయితే ఉద్యోగుల కోసం ఆదాయంలో 15 శాతం కేటాయించే వరకు వాకర్ తన కంపెనీని విక్రయించడానికి అంగీకరించలేదు. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఆ సిబ్బంది ఒక్కొక్కరికీ సుమారు రూ.4 కోట్ల మేర అందుతుంది. ఉద్యోగులలో ఎవరికీ స్టాక్ లేనప్పటికీ దానిలో కొంత భాగాన్ని ఇవ్వాలను నిర్ణయించాడు. అతని దాతృత్వం విశేష ప్రశంసలను దక్కించుకుంది.ఫైబర్బాండ్ ఎలక్ట్రికల్ పరికరాల కోసం ఎన్క్లోజర్లను తయారు చేసే కంపెనీ. ఫైబర్బాండ్ఫైబర్బాండ్ను 1982లో వాకర్ తండ్రి క్లాడ్ వాకర్, మరో 11 మందితో కలిసి ప్రారంభించారు.1998లో ఫ్యాక్టరీ కాలిపోవడం నుండి డాట్-కామ్ బబుల్ సంక్షోభం వరకు, ఫైబర్బాండ్ ఉద్యోగులు ఒడిదుడుకులను ఎదుర్కొని విధేయతతో మనుగడ సాగించగలిగింది. 2020లో క్లౌడ్ కంప్యూటింగ్ కోసం డిమాండ్ పెరగడంతో 150 డాలర్లు మిలియన్ల పెట్టుబడి ఫలించింది.ఐదు సంవత్సరాలలో అమ్మకాలు దాదాపు 400శాతం పెరిగాయి.వ్యాపారం దాదాపుగా కుప్పకూలినప్పటికీ, వ్యాపారాన్నికొనసాగించడానికి ఉద్యోగులుదశాబ్దాలుగా పని చేశారని, వారి అంకితభావానికి గుర్తింపు లభించకపోతే, వారికి ప్రతిఫలం లభించకపోతే చాలా మంది వెళ్లిపోతారని తాను నమ్ముతున్నానని వాకర్ ది జర్నల్తో వాకర్ వ్యాఖ్యానించారు.ఆశ్చర్యపోయిన ఉద్యోగులుబోనస్ అందించిన రోజు ఉద్యోగులు కొంతమంది దీన్ని నమ్మలేకపోయారు. మరికొందరు ఇదేదో జోకేమో అనుకున్నారట. తీరా అసలు విషయం వారి ఆనందానికి అవధుల్లేవు. ఉద్వేగానికి గురయ్యారు. కొందరు ఆ డబ్బును అప్పు తీర్చడానికి, కార్లు కొనడానికి, కాలేజీ ట్యూషన్ ఫీజు చెల్లించడానికి లేదా పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి ఉపయోగించారు.ఉద్యోగినులలో ఒకరైన లెసియా కీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 1995లో 21 సంవత్సరాల వయస్సులో ఫైబర్బాండ్లో ఆమె కరియర్ ఆరంభమైంది. అప్పుడు ఆమె జీతం 5.35 డాలర్లు మాత్రమే. క్రమంగా ఉన్నత పదవులకు ఎగబాకింది. ఈ ఏడాది నాటికి, 18 మంది వ్యక్తుల బృందానికి నాయకత్వం వహించింది , 254 ఎకరాలలో కంపెనీ సౌకర్యాలను నిర్వహించేలా కృషి చేశారు.'క్యారెక్టర్ ఆఫ్ మ్యాన్'బోనస్ల వార్తలు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో వాకర్ , దాతృత్వాన్ని, ఉద్యోగుల పట్ల అతన ప్రేమను కొనియాడారు నెటిజన్లు. వావ్, నిజంగా దయగల, ఉదారమైన వ్యక్తి, అద్భుతం అంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. -
బంగ్లాలో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్లో ఇటీవల మైనార్టీలపై దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడి మతతత్వ వాదులు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు హిందు మతానికి చెందిన వ్యక్తులపై దాడి చేసి చంపారు. అంతే కాకుండా వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గత కొంతకాలంగా భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాలు నిరసనలు తెలిపాయి. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలను భారత్ గమనిస్తోందని తెలిపారు.రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. హిందువులపై జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదు. ఈ ఘటనలకు కారణమైన వారిని తీవ్రంగా శిక్షించాలని బంగ్లాదేశ్ను కోరుతున్నాము. హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే." అని రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఈ బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్డంగాలో 29ఏళ్ల అమృత్ మండల్ అనే యువకుడిని అక్కడి మత ఛాందస వాదులు కొట్టిచంపారు. అతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అయితే కొద్దిరోజుల క్రితం దీపు చంద్రదాస్ అనే యువకుడిని దైవదూషణ చేస్తున్నాడనే ఆరోపణలతో అక్కడి అల్లరి మూకలు విపరీతంగా కొట్టి చంపారు.అంతే కాకుండా మరో ఘటనలో ఓ హిందూ కుటుంబంపై దాడికి యత్నించగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ నెల ప్రారంభంలో అక్కడ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో ఆదేశంలో మరోసారి హింస చేలరేగింది. హిందువులే టార్గెట్గా అక్కడి మత ఛాందస వాదులు దాడులు జరుపుతున్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆపరేషన్ సిందూర్ 2.0.. వణికిపోతున్న పాక్!
ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.సరిహద్దులో ప్రత్యేక నిఘాభారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్కు రావల్కోట్ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు. -
పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?.. రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది. అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. -
ఇది భారత్తో విభేదాలు సృష్టించే ప్రయత్నమే..!
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసిన తాజా నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు శాంతియుతంగానే ఉన్నాయని.. అయితే పాత పరిస్థితులను ప్రస్తావిస్తూ భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చైనా రక్షణ విధానాన్ని వక్రీకరిస్తోంది. భారత్ సహా పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. భారత్ సంబంధాలను చైనా వ్యూహాత్మక స్థాయిలో, దీర్ఘకాల దృష్టితో చూస్తోంది. పరస్పర విశ్వాసం పెంపు, సహకారం, విభేదాల పరిష్కారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచాలని కోరుకుంటోంది అని అన్నారు. అయితే.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పై US నివేదికలో చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందని, కమ్యూనికేషన్ చానెల్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నివేదికను ఖండిస్తూ.. ఇది తప్పుడు కథనాలు, పక్షపాతాలతో కూడిందని, చైనా మిలిటరీ ముప్పు అనే అతిశయోక్తితో నిండిపోయి ఉందని విమర్శించింది. మొత్తంగా చైనా అగ్రరాజ్య నివేదికను అసంబద్ధమైనదని.. బాధ్యతారహితమైనదని పేర్కొంది.భారత అమెరికా సంబంధాలను నీరుగార్చేందుకు చైనా కృషి చేస్తోందని.. సరిహద్దు ఉద్రిక్తతలు సడలింపును ఎరగా వేసి భారత్తో సత్సంబంధాలను పునరుద్ధరించకోజూస్తున్న డ్రాగన్ కంట్రీ అదే సమయంలో పాకిస్థాన్తోనూ మైత్రిని నెరపుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నివేదిక వెలువరించింది. దీంతో చైనా పైవిధంగా స్పందించింది. -
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడా టోరంటోలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత్ విద్యార్థి ఒకరు మరణించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యంహకార హత్య.. మరేదైనా కారణమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.శివాంక అవస్థీ(20) స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. అయితే క్యాంపస్ ఆవరణలో మంగళవారం కాల్పలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకునేలోపే నిందితులు పారిపోయారు. సంఘటన హైలాండ్ క్రీక్ ట్రైల్-ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో జరిగిందని.. బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు. టోరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ మూడో ఏడాది చదువుతున్న శివాంక్ అవస్థీని పట్టపగలే కాల్చి చంపారని.. ఇది దర్మార్గమని ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్లో భద్రతా లోపాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిత్యం విద్యార్థుల సంచారం ఉంటుందని.. ఇకనైనా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చెర్లీడింగ్ టీమ్ సభ్యుడు కూడా. ఆయన మరణంపై జట్టు ఇన్స్టాగ్రామ్లో నివాళి అర్పించింది. View this post on Instagram A post shared by UTSC Cheer (@utsccheerleading)భారత కాన్సులేట్ జనరల్ (టొరంటో) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అవస్థీ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ కుర్రాడి నేపథ్యం.. ఇతర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.టోరంటోలో తాజాగా హిమాంశి ఖురానా(30) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అబ్దుల్ ఘఫూరి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇది ‘‘ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్’’ కేసు అని అధికారులు పేర్కొన్నారు. అటు హిమాంశి కుటుంబానికి కూడా భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. టొరంటోలో వరుస హింసాత్మక ఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారతీయులకు ఆ దేశాల్లో భద్రతే లేదా?.. -
మెరీ క్రిస్మస్.. నైజీరియాలో ఐసిస్ తాట తీశాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెరైటీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నైజీరియాపై అగ్రరాజ్య సైన్యం దాడులు జరిపిందని.. చచ్చిన ఉగ్రవాదులతో పాటు ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ దేశ వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తీవ్ర దాడులు జరిపిందని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని ఆ ప్రకటనలో ఆయన తెలియజేశారు. ట్రంప్ తన సోషల్ ట్రూత్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..‘‘అమెరికా సైన్యం నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో ఐసిస్(ISIS) ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ఉగ్రసంస్థ గత కొంతకాలంగా హత్యలు చేస్తోంది. ముందే హెచ్చరించినా కూడా ఆ ఊచకోత ఆగలేదు. అందుకే ఈ దాడులు జరిపాం’’ అని అన్నారాయన. అమెరికా మాత్రమే చేయగలిగే పరిపూర్ణ దాడులు జరిగాయని.. తన నాయకత్వంలో తీవ్రవాదాన్ని అణచివేస్తామని.. ఈ సందర్భంగా అమెరికా సైన్యానికి కృతజ్ఞతలంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారాయన. అయితే దాడుల తదనంతర పరిణామాలపై మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.నైజీరియా జనాభాలో ఉత్తర భాగంలో మస్లింలు, దక్షిణ భాగంలో క్రిస్టియన్లు ఎక్కువ సంఖ్యలో స్థిరపడిపోవడంతో.. మతాల మధ్య తరచూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఐసిస్ సంస్థ.. అనుబంధ గుంపులు, అలాగే బోకో హరామ్ వంటి తీవ్రవాద సంస్థలు హింస కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో.. రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు, మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరం, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యాలతో.. అమెరికా ఇటీవల నైజీరియాను ఆందోళన దేశాల జాబితాలో(country of particular concern) చేర్చింది. సీపీసీ అంటే.. కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. ప్రస్తుతం.. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.గత కొన్నేళ్లుగా క్రైస్తవులపై నిషేధిత సంస్థల హింస తీవ్రతరం అయ్యిందని ట్రంప్ ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అంతేకాదు.. క్రైస్తవులపై జరుగుతున్న హింస కారణంగా నైజీరియా పౌరులపై వీసా పరిమితులు కూడా విధించారు.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను అని తెలిపారు. చెప్పినట్లే ఇప్పుడు వైమానిక దాడులు జరిపించారు..@POTUS “Tonight, at my direction as Commander in Chief, the United States launched a powerful and deadly strike against ISIS Terrorist Scum in Northwest Nigeria, who have been targeting and viciously killing, primarily, innocent Christians, at levels not seen for many years, and… pic.twitter.com/ct7rUW128t— Department of War 🇺🇸 (@DeptofWar) December 26, 2025మరోవైపు.. అమెరికా చర్యలను నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు పరోక్షంగా ఖండించారు. క్రైస్తవులపై వ్యవస్థీకృత హింస జరుగుతోందనే ఆరోపణలను తిరస్కరించింది. ఉగ్రవాదులు ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుంటారని, సమస్య క్లిష్టమైందని పేర్కొంది. దేశంలో మత స్వేచ్ఛను కాపాడతానని.. అన్ని మతాల ప్రజలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నానని బోలా తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా-నైజీరియా మధ్య ఉగ్రవాదంపై చర్యలు, మత స్వేచ్ఛ రక్షణపై ప్రకటనలు హాట్ టాపిక్గా మారాయి. -
యూనస్ ప్రభుత్వంలోని వారే హాదీని చంపారు
ఢాకా: బంగ్లాదేశ్లో హత్యకు గురైన అతివాద విద్యార్థి నేత షరీఫ్ ఒస్మార్ హదీ సోదరుడు మహ్మద్ యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనస్ ప్రభుత్వంలోని ఒక వర్గం దేశంలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించేందుకు కుట్ర పన్నిందని, అందులో భాగంగానే హాదీని చంపించిందని ఆరోపించారు. హాదీ సోదరుడు ఒమర్ హాదీ ఇంక్విలాబ్ మంచ్ సారథ్యంలో జరిగిన ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ.. ‘హాదీ మృతికి మీరే కారణం. ఇదే సాకుతో సాధారణ ఎన్నికలను భగ్నం చేసేందుకు ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఒస్మాన్ హాదీ హత్య ఘటనపై బాధ్యత నుంచి తప్పించుకోలేరు’అంటూ ఆపద్ధర్మ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపా రు. హాదీ హత్యకు జరిగిన కుట్రను, కారకులను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘లేకుంటే దేశం నుంచి మిమ్మల్ని కూడా గెంటివేయక తప్పదు’అంటూ హెచ్చరించారు. గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలేందుకు హాదీ సారథ్యంలో జరిగిన ఇంక్విలాబ్ మంచ్ ఆందోళనలే కారణం. కాగా, ఒమర్ హాదీ ఆరోపణల నేపథ్యంలో హోం శాఖకు సంబంధించి యూనస్కు ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న మహ్మద్ ఖుదా బక్ష్ చౌదరి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు బుధవారం రాత్రి ఆమోదించారు. వారి ఆచూకీ తెలిపితే బహుమానంచిట్టోగ్రామ్లోని రావ్జాన్ ఏరియాలో మంగళవారం రాత్రి ఓ హిందువు ఇంటికి నిప్పంటించిన దుండగులు ఆచూకీ తెలిపిన వారికి బహుమానం అందజేస్తామని చిట్టోగ్రామ్ రేంజ్ పోలీస్ చీఫ్ అహ్సాన్ హబీబ్ ప్రకటించారు. ఖతార్లో ఉండే సుఖ్ షిల్, అనిల్ షిల్ల ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దుండగులు బయటి నుంచి తలుపులకు తాళాలు వేయడంతో లోపలున్న రెండు కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది పైకప్పును తొలగించుకుని, ఎలాగోలా సురక్షితంగా బయటపడ్డారు. ఇదే ప్రాంతంలోని పలు హిందువుల ఇళ్లపై దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో గత ఐదు రోజుల వ్యవధిలో హిందువులకు చెందిన ఏడిళ్లకు నిప్పుపెట్టారని మీడియా తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సురక్షిత బంగ్లా
ఢాకా: ‘బంగ్లాదేశ్ ను సురక్షిత దేశంగా మార్చుకుందాం. స్వేచ్ఛాయుత, ప్రగతికాముక ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దుదాం‘ అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎంపీ) తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవాసులంతా కలసికట్టుగా ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా యువత దేశ పునరి్నర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ 17 ఏళ్ల లండన్ ప్రవాసం నుంచి గురువారం తిరిగొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా తన రాక కోసం భారీగా గుమిగూడిన మద్దతుదారులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లారు. వారినుద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పార్టీలు, మతాల విభేదాలకు అతీతంగా దేశ వికాసానికి పనిచేద్దాం. బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అందరిదీ. మత విద్వేషానికి మన దేశంలో చోటు లేదు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా హాయిగా జీవించే సురక్షిత బంగ్లాయే మన లక్ష్యం. ఇందుకోసం నా దగ్గర ప్రణాళిక ఉంది‘ అంటూ అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ నినాదాన్ని తలపించే వ్యాఖ్యలు చేశారు. దాని అమలుకు మీ అందరి మద్దతు కావాలి‘ అన్నారు. -
అణు పాటవంలో ఉ.కొరియా ముందడుగు
సియోల్: అణు పాటవం విషయంలో ఉత్తర కొరియా కీలక ముందడుగు వేసింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చిరకాల స్వప్నమైన అణు జలాంతర్గామి నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. కొద్ది నెలల్లో అది జలప్రవేశం చేయనుందని దక్షిణ కొరియా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. కిమ్ ఇటీవలే తన కూతురితో పాటు షిప్ యార్డ్ ను సందర్శించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా గురువారం విడుదల చేసింది. అందులో ఆయన నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న జలాంతర్గామిని చూస్తూ కనిపిస్తున్నారు. ఇందుకు అవసరమైన రియాక్టర్ ను రష్యా నుంచి సంపాదించి ఉంటుందని భావిస్తున్నారు. లేదంటే రష్యా సాంకేతిక సహకారంతో ఉత్తర కొరియానే దాన్ని స్వయంగా రూపొందించుకుని ఉండొచ్చన్నది దక్షిణ కొరియా రక్షణ వర్గాల అభిప్రాయం. జలాంతర్గామి 8,700 టన్నుల బరువుంటుందని కొరియా మీడియా పేర్కొంది. పరిమాణంలో ఇది అమెరికా వద్ద ఉన్న అతి పెద్ద జలాంతర్గాములకు సమానం. -
విశ్వవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
బెత్లెహాం: కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. విశ్వవ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గాజాలో హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రెండేళ్లుగా బెత్లెహాంలో కళ తప్పిన క్రిస్మస్ వేడుకలు మళ్లీ ఈ ఏడాది ఆనాటి అద్భుతపాత శోభను సంతరించుకున్నాయి. దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో క్రైస్తవులు బెత్లెహాంలోని ప్రఖ్యాత మ్యాంగర్ కూడలికి చేరుకుని వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. పోప్గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నూతన పోప్ లియో–14 వాటికన్ సిటీలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో బుధవారం అర్ధరాత్రి మాస్ ప్రత్యేక వేడుకను నిర్వహించారు. మానవాళిని రక్షించేందుకు బాలయేసు జన్మించిన వృత్తాంతాన్ని చర్చికి వచి్చన విశ్వాసకులకు పోప్ వివరించారు. జీసస్ జని్మంచిన బెత్లెహాంలో మ్యాంగర్ స్క్వేర్లో విద్యుత్దీపాలంకరణతో ఏర్పాటుచేసిన అతిపెద్ద క్రిస్మస్ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు జెరూసలేం నుంచి బెత్లెహాంకు క్యాథలిక్ మతగురువు కార్డినల్ పెయిర్బటిస్తా పిజాబల్లా వందలాది మంది క్రైస్తవులతో ఊరేగింపుగా వచ్చి బెత్లెహాంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఐస్స్కేటింగ్ చేస్తూ కొందరు ఆనందంగా పండగ సంబరాల్లో మునిగితేలితే మరికొందరేమో ఉత్తర ఐర్లాండ్లోని గడ్డకట్టించే అతిశీతల సముద్రజలాల్లో ఈతకొడుతూ ఆనందంగా గడిపారు. ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో, ఆ్రస్టేలియా నగరాల్లో.. ఇలా పలు దేశాలు, నగరాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. శాంటాక్లాజ్ వేషంలో పలువురు.. నిరాశ్రయులు, పేదలకు నిత్యావసర సరకులు, కానుకలు బహూకరించారు. క్యాన్సర్ వంటి మహమ్మారుల బారిన పడిన రోగుల కోసం ఫ్లోరిడా సర్ఫ్ మ్యూజియం సహా పలు లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు క్రిస్మస్ వేళ విరాళాలు సేకరించాయి. -
భారత్లో రష్యా వైన్ను ఎగబడి తాగుతున్నారు!
ఢిల్లీ: ఇండియన్ మార్కెట్లో రష్యన్ వైన్కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూరోపియన్ దేశాల వైన్ను సేవించే భారతీయులు ఇప్పుడు రష్యా వైన్ కోసం క్యూకడుతున్నట్లు పలు గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విడుదలైన ఈ ఏడాది పది నెలల్లో వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. వైన్ దిగుమతులలో రష్యా వాటా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, హై-ఎండ్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లలో రష్యన్ వైన్ వినియోగం పెరుగుతోంది. భారత యువతలో వైన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త రకాల రష్యన్ బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశించడం ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన డేటా ప్రకారం, రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల వైన్లతో పోటీ పడుతూ, రష్యన్ వైన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. భారత మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో రష్యన్ వైన్కి మంచి డిమాండ్ ఉంది. ధరలు తక్కువగా ఉండటం, కొత్త రుచులు అందించడం,మార్కెటింగ్తో పాటు ఇతర కారణాల వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.రష్యన్ వైన్కి భారత మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–భారత్ మధ్య ఇప్పటికే ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో ఉన్న సహకారం ఇప్పుడు ఫుడ్ అండ్ బేవరేజీస్ రంగంలో కూడా విస్తరిస్తోంది. ఈ వృద్ధి కేవలం వాణిజ్య పరిమితి కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను కూడా బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎడ్మాంటన్లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
సంచలనం.. పుతిన్ చావును కోరుకున్న జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ క్రిస్మస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును ప్రస్తావించకుండానే ‘అతను అంతమవ్వాలి’ అని పరోక్షంగా చావు కోరుతూ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత వేడి జోడించినట్లుగా భావిస్తున్నారు.మంగళవారం ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా విధ్వంసకర మిసైల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ క్రిస్మస్ పర్వదినాన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఉక్రెయిన్ పురాణాన్ని ప్రస్తావిస్తూ ‘పురాతన కాలం నుండి, ఉక్రేనియన్లు క్రిస్మస్ రాత్రి స్వర్గం తెరుచుకుంటుందని నమ్ముతారు. మీరు మీ కలను వారికి చెబితే, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు, మనమందరం ఒకే కలను పంచుకుంటాము. అదే అతను అంతమవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.క్రిస్మస్ రోజున రష్యా 131 డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి చేసింది. అప్రమత్తమైన ఉక్రెయిన్ సైన్యం వాటిని నిర్వీర్యం చేసినప్పటికీ, ఒక ప్రాంతంలో మొహరించిన 22 డ్రోన్లలో 15 డ్రోన్లు ప్రతికూల ప్రభావం చూపినట్లు ఏబీసీ న్యూస్ నివేదించింది. పండుగ సమయంలో రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు.జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రిస్మస్ సందర్భంగా, రష్యన్లు మరోసారి తాము నిజంగా ఎవరో చూపించారు. భారీ షెల్లింగ్, వందలాది ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, కింజాల్ దాడులు జరిపారు’ అని మండిపడ్డారు. ఆయన రష్యా శాంతి ప్రయత్నాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, పండుగ సమయంలోనే ఇలాంటి దాడులు జరపడం వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని అన్నారు.Merry Christmas! pic.twitter.com/okj9Yr1bFe— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 24, 2025 -
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్సింగ్లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు. మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. -
అది తలుచుకుంటే.. ఇప్పటికీ నిద్ర రావడం లేదు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్లో హనుక్కా వేడుకలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదుల జరిపిన మారణ కాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి వార్తల్లో నిలిచారు. బాధితుల్లో ఎక్కువ మందిని కాపాడి పాషా రహమత్ హైదరాబాద్కు చెందిన వారు. పాషా ధైర్యం, తెగువ తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆరేళ్లకు పైగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషా, సిడ్నీలో జరిగిన బాండీ బీచ్ ఉగ్రవాద దాడి సందర్బంగా చూపిన ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన దాదాపు 20 మంది బాధితులను రక్షించడంలో, వారికి సహాయం చేయడంలో పాషా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అత్యంత క్లిష్ట సమయాల్లో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ యువకుడిని వీరుడిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు వెల్లువెత్తాయి. 'హైదరాబాద్కి షాన్' పాషాతో సాక్షి ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..మానవత్వమే ముఖ్యమనుకున్నా‘‘ఇండియా నుంచి వచ్చిన చాలా మంది లాగానే నేను కూడా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నా. సండే కనుక బీచ్ చాలా సందడిగా ఉంది. ఉన్నట్టుండి శబ్దం వినిపించింది. ముందు ఏవో క్రాకర్లు అనుకున్నాను. కానీ అవి తుపాకీ కాల్పుల శబ్దాలు అని తరువాత తెలిసింది. దుండగుడికి సమీపంలోనే తను వెనుకనే నేను ఉన్నా. ముందు నాకు చాలా భయమేసింది. ఎక్కడ చూసినా అరుపులు కేకలు. అందరి ఎవరికి వారు పారిపోతున్నారు. ఒక పెద్దావిడ సాయం అడుగుతున్నపుడు నేను కాదనలేకపోయాను. అపుడు ఆమెకు కాపాడటమే ముఖ్యం అనుకున్నాను. ఆమెను రక్షించడంలో సాయపడ్డాను. నా కళ్లముందే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో పడిపోయారు. దేశం, కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నింటికంటే మానవత్వం ముఖ్యం అనుకున్న. నాకు నా మతం కూడా అదే నేర్పించింది. అలా నన్ను సాయం అడిగిన మహిళతో పాటు, ఒక పోలీసు సహా 20 మంది వరకు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించాము. అర్థరాత్రి దాకా వారిని అంబులెన్స్లో తరలిస్తూనే ఉన్నాం. ఆ తరువాత ఒక్కసారిగా నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎపుడూ ఇలాంటి దుర్ఘటనలు చూడలేదు. అందుకే చెప్పలేనంత దుఃఖం పొంగుకొచ్చింది. బాధితుల ఆర్తనాదాలు,పచ్చని పరిసరాలు రక్తం మరకలతో నిండిపోయిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని విషాదంగా మిగిలిపోతుంది. నా కళ్లముందు అలా మనుషులు చనిపోవడం తట్టుకోలేనంత బాధను మిగిల్చింది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుకనిద్ర రావడంలేదుఈ దుర్ఘటనను తలచుకుంటే నా మనసంతా కకావికలమైపోతుంది. నిద్ర రావడంలేదు. మరీ ముఖ్యంగా నిందితుడు హైదరాబాద్కు చెందిన వాడు కావడంతో నా కుటుంబానికి, నా భార్య, బిడ్డకు ఏదైనా హాని చేస్తాడేమోనని చాలా భయమేస్తోంది. అందుకే మానసిక చికిత్స తీసుకుంటున్నాను. నా పాపకు స్టడీ, మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను అంటూ తన అనుభవాలను షేర్చేసుకున్నారు పాషా. 2019 నుండి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషాకు హైదరాబాద్లో కుటుంబం ఉంది. తల్లి దండ్రులు, భార్య చిన్న పాప ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత కిరాతకంమైన ఘటనగా నిలిచిన బాండీ బీచ్ కాల్పుల ఘటన నిందితుల మూలాలు హైదరాబాద్లో తేలడం కలకలం రేపింది. తండ్రీకొడుకులైన సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) పక్కా వ్యూహంతోనే ఈ మారణహోమానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. -
విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ
బ్యాంకాక్: థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్హో లోడర్తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇది కూడా చదవండి: టీచర్పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం -
Australia: బాండీ బీచ్ ఘటన మరువకముందే..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో యూదు సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆ దేశంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, మెల్బోర్న్లో మరో విద్వేషపూరిత ఘటన వెలుగుచూసింది. హనుక్కా పండుగ గుర్తు ఉన్న ఒక కారుపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఇంటి డ్రైవ్వేలో పార్క్ చేసి ఉన్న కారుపై జరిగిన ఈ దాడిని యూదు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, గత రెండేళ్లుగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.డిసెంబర్ 14న బాండీ బీచ్ సమీపంలోని యూదుల సమావేశంపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మందికి పైగా గాయపడ్డారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత భయంకరమైన కాల్పుల ఘటనగా దీనిని అధికారులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ తండ్రీకొడుకులు మారుమూల ప్రాంతాల్లో ముందస్తుగా తుపాకీ ప్రాక్టీస్ చేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఈ విపత్కర పరిస్థితులపై ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత విద్వేషాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్బోర్న్ కారు దహనం వెనుక మతపరమైన కోణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, స్థానిక యూదు సమాజం మాత్రం తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూదు వ్యతిరేక సంక్షోభం ఆస్ట్రేలియాలో ఒక సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు.కాగా ఈ దాడుల సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ఒక కొత్త ‘జాతీయ ధైర్యసాహసాల అవార్డు’ను ప్రకటించారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన పౌరులు, అత్యవసర సేవా సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి; ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక -
ప్రళయం పోస్ట్పోన్.. యుగాంతం ఇప్పట్లో లేనట్లే!
ప్రళయాన్ని మానవమాత్రులైనా అంచనా వేయగలరా?.. అదేం సినిమానా? పోస్ట్పోన్ కావడానికి అనుకుంటున్నారా?. లక్షల మందిని మోసం చేసిన ఓ వ్యక్తి మాటల గురించే ఇక్కడ చెప్పబోతున్నాం. డిసెంబర్ 25వ తేదీన పెద్ద ప్రళయం పుట్టుకొస్తుందని.. దాని ప్రభావంతో యుగాంతం తప్పదని ప్రచారం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడేమో మాట మార్చేశారు మరి!.. ఘనాకు చెందిన మత గురువు ఎబో(Eboh Noah) లెక్క తప్పింది. క్రిస్మస్ నాడే మహా జలప్రళయం మొదలుకాబోతోందని హెచ్చరికలు జారీ చేసిన ఇతగాడు.. ఇప్పుడు అబ్బే దేవుడు కొంతకాలం దానిని వాయిదా వేశాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న నోహా.. ఈ ప్రళయం పేరు చెప్పుకునే లెక్కలేనంత విరాళాలు సేకరించడం ఈ ఎపిసోడ్లో కొసమెరుపు. 30 ఏళ్ల ఎబో.. ఈ ఏడాది ఆగస్టులో ‘‘జరిగేది.. జరగక మానదు’’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ క్రిస్మస్ తేదీన ప్రపంచమంతా జోరు వాన మొదలవుతుందని.. అది మూడేళ్లపాటు ఆగకుండా కురిసి ప్రపంచం మునిగిపోతుందని, అయితే ఆ జల ప్రళయంలో మూడేళ్లపాటు తట్టుకోగలిగే పడవలను నిర్మించే బాధ్యత దేవుడు తనకు(నోహానని చెబుతూ) అప్పగించాడని అనుచరుల్ని నమ్మ బలికాడు. ఆ అనుచరులు ఆ ప్రచారం విస్తృతంగా జరపడంతో.. ఎబోకి ఎబో జీససగా, ఎబో నోహాగా పేరు దక్కింది. ఈ మాటలు నమ్మిన లక్షల మంది తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. తీరా.. ఆ తారీఖు వచ్చేసరికి.. ఆ యుగాంతం వాయిదా పడిందని చెబుతున్నాడు. దేవుడు మానవాళికి ఇంకొంత సమయం ఇచ్చాడని.. అలాగే మరింత మందిని రక్షించేలా ఆర్క్ ప్రాజెక్టు(భారీ పడవల నిర్మాణం) విస్తరించాలని ఆదేశించాడని చెబుతున్నాడు. అయితే ఎబో డూమ్స్డే హెచ్చరికలపై పలువురు మండిపడుతున్నారు. బైబిల్ ప్రకారం.. ప్రళయం ఏనాడో వచ్చిందని, మరొకటి వచ్చే ప్రసక్తే లేదని.. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను మోసం చేయడం సరికాదని ఎబోకు హితవు పలుకుతున్నారు. ఇంకోవైపు.. జనాల నుంచి సేకరించిన సొమ్ముతో ఎబో విలాసాలు అనుభవిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు. BIG UPDATE 🔴Ghanaian self styled prophet Eboh Noah said God would end the world in a new flood on December 25, 2025, urging followers to fund the construction of 8 arks. Many sold their belongings and handed over the money.He has now said the apocalypse has been postponed.… pic.twitter.com/2aX6F2FVN3— Open Source Intel (@Osint613) December 24, 2025Just after buying a new Benz pic.twitter.com/aIAq6IhDtk— Richy Rich (@richyrich) December 24, 2025 -
బంగ్లా డార్క్ ప్రిన్స్... పునరాగమనం
నానాటికీ పతనావస్థకు చేరుతున్న కల్లో ల బంగ్లాదేశ్ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యరి్థగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎనీ్ప) తాత్కాలిక చైర్మన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీఎన్పీ శ్రేణులు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికాయి. విమానాశ్రయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా పోటెత్తారు. తారిఖ్, తారిఖ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తల్లి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా అపరిమిత అధికారాలు చెలాయించిన తారిఖ్ డార్క్ ప్రిన్స్ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. తల్లి మాది రిగానే ఆయనకు కూడా భారత వ్యతిరేకిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాలో చోటుచేసుకున్న ఈ కీలక రాజకీయ పరి ణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV— Masud Rana (@MasudRana137969) December 24, 2025కాబోయే ప్రధాని! తారిఖ్ రెహా్మన్ (60). బంగ్లా అంతటా గత 17 ఏళ్లుగా ఆయన ఫోటోలు, పోస్టర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. బీఎన్పీ ర్యాలీల్లో ఆయన వీడియో సందేశాలే మాట్లాడుతూ వచ్చాయి. అవినీతి కేసులు తదితర కారణాలతో 2008 నుంచీ భార్య జుబైదా, కూతురు జైమాతో పాటు తారిఖ్ లండన్ లో తలదాచుకోవడమే ఇందుకు కారణం. గురువారం భార్య, కూతురితో కలిసి ఢాకా చేరుకున్నాక, ‘6,314 సుదీర్ఘ రోజుల అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టా. నా బంగ్లా వాసులారా! ఇకనుంచీ మీ అందరితో నేరుగానే మాట్లాడతా‘ అంటూ సోషల్ మీడియాలో తారిఖ్ పెట్టిన పోస్టు దేశమంతటా వైరల్ అయింది. ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో ఉండటంతో బీఎన్పీ పగ్గాలను తారిఖ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లాంఛనమే కానుంది. బంగ్లాలో శక్తిమంతమైన నేతగా వెలుగొందిన షేక్ హసీనా గతేడాది చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ప్రధాని పదవితో పాటు దేశాన్ని కూడా వీడి భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె అవామీ లీగ్ పార్టీపైనా ఇప్పటికే అనర్హత వేటు పడింది. ప్రభుత్వ తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కు కూడా మంచినోరే ఉన్నా ఏడాదికి పైగా అసమర్థ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. దాంతో ప్రకటించిన మేరకే వచ్చే ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగితే తారిఖ్ ప్రధాని పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమేనంటున్నారు. జమాతేకు ముకుతాడు! భారత వ్యతిరేకే అయినా, తారిఖ్ రాక మనకు ఊరటనిచ్చే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ప్రస్తుతం.నెలకొని ఉన్న తీవ్ర రాజకీయ అస్థిరతే ఇందుకు కారణం. ఏ పార్టీలోనూ పెద్దగా జనాదరణ ఉన్న నాయకుడు లేకపోవడంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలను మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ జేబు సంస్థ అయిన జమాతే ఇస్లామీ నానాటికీ కోరలు చాస్తోంది. హసీనా హయాంలో పడ్డ నిషేధాన్ని వదిలించుకుని యువత, ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. రాజకీయ శక్తిగా బలపడుతోంది. ఇటీవలి ఢాకా వర్సిటీ ఎన్నికల్లో జమాతే విద్యార్థి విభాగమే ఘనవిజయం సాధించింది. ఇతర చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపైనే జమాతే ఇప్పుడు కన్నేసింది. ఈ పరిస్థితుల్లో దానితో పోలిస్తే ఉదారవాది అయిన తారిఖ్ రాక భారత్ కు ఊరటనిచ్చే పరిణామమే. పైగా భారత్ తో సత్సంబంధాలు కోరు కుంటున్నామన్న బీఎన్పీ ప్రకటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జమాతే వంటి మతోన్మాద శక్తికి ముకుతాడు పడటం మన జాతీయ ప్రయోజనాల రీత్యా చాలా ముఖ్యమని చెబు తున్నారు. తారిఖ్ పై ఉన్న అవినీతి, హసీనా హత్యాయత్నం తదితర కేసులన్నింటినీ కోర్టులు ఇటీవలే కొట్టేశాయి. దాంతో ఆయన ఎన్నికల పోటీకి మార్గం సుగమమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘భారత్, అమెరికా ఒక్కటి కావడం చైనాకు ఇష్టం లేదు’
న్యూయార్క్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని, ఈ పరిణామాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చైనా భావిస్తున్నట్లు అమెరికాకు చెందిన ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్’ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు వార్షిక నివేదిక సమర్పించింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించుకోవాలన్నదే చైనా ప్రయత్నమని నివేదికలో ఉద్ఘాటించింది. భారత్–అమెరికా మధ్య సంబంధాలు బలపడడం, రెండు సన్నిహితంగా కలిసి పనిచేయడం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఎల్ఏసీ వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, స్నేహపూర్వక సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్, చైనాలు ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేరుగా విమానాలు నడపడం, వీసాలు జారీ చేయడం వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చాయి. మొత్తానికి భారత్, చైనా సంబంధాలు పూర్వస్థితికి రావడానికి పరిస్థితులు చాలావరకు మెరుగయ్యాయి. భారత్తో వాణిజ్యానికి చైనా ప్రాధాన్యం ఇస్తోంది. భారత ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్పింగ్ పలుమార్లు భేటీ అయ్యారు. 2020 జూన్లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్, చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యం మోహరించింది. ఇరుపక్షాల మధ్య చర్చల అనంతరం ఉద్రిక్తతలు తగ్గిపోవడం మొదలైంది. ఈ పరిణామాలను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ వార్ తన నివేదికలో విశ్లేషించింది. భారత్తో సంబంధాలకు చైనా అమితమైన ఉత్సాహం చూపిస్తోందని.. అదే సమయంలో చైనా చర్యలు, ఉద్దేశాలను భారత్ పూర్తిగా విశ్వసించడం లేదని స్పష్టంచేసింది. 2049 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలన్నదే చైనా జాతీయ వ్యూహమని వివరించింది. చైనా వ్యూహంలో తైవాన్తోపాటు భారత్లోని అరుణాచల్ప్రదేశ్ కూడా ఉన్నాయని తెలియజేసింది. -
సిగ్గు లేని దేశం...
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ డిబేట్లో భారత్, పాకిస్తాన్ విద్యార్థుల మధ్య వాడీవేడిగా సంవాదం జరిగింది. ప్రజలను మెప్పించి, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే పాకిస్తాన్పై భారత్ దాడులు చేస్తోందంటూ పాక్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని భారత విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టారు. సిగ్గులేని దేశాన్ని సిగ్గుపడేలా చేయలేమని పరోక్షంగా పాకిస్తాన్ను ఎద్దేవా చేశారు. నవంబర్ 27న ఈ డిబేట్ జరిగింది. భారత్ తరపున న్యాయ విద్యార్థి విరాన్ష్ భానుశాలీ, దేవార్చన్ బెనర్జీ, సిద్ధాంత్ నాగ్రాత్, పాకిస్తాన్ తరఫున మూసా హర్రాజ్, ఇస్రార్ ఖాన్, అహ్మద్ నవాజ్ పాల్గొన్నారు. పాకిస్తాన్ మంత్రి మొహమ్మద్ రజా హయత్ హర్రాజ్ కుమారుడే మూసా హర్రాజ్. భారత్లో ఏం జరిగినా పాకిస్తాన్పై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని మూసా హర్రాజ్ ఆక్షేపించారు. ప్రేమికులు, భార్యాభర్తలు విడిపోయినా, అల్లరి మూక దాడి చేసినా దానికి పాకిస్తానే కారణం అంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇండియా పాలకులు ఎన్నికల్లో లబ్ధి కోసం పాకులాడుతున్నారని, అందుకోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీనిపై విరాన్ష్ భానుశాలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తన వాదనతో పాక్ ప్రతినిధులను కంగు తినిపించారు. డిబేట్కు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వర్సిటీ అధికారులు అప్లోడ్ చేశారు. పాకిస్తాన్ దాషీ్టకాలపై విరాన్ష్ భానుశాలీ వాదన వైరల్గా మారింది. ఒకరకంగా పాకిస్తాన్ను ఆయన కడిగిపారేశారు. పాక్ అండతో భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు. ‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం ‘‘2008 నవంబర్ 26(26/11) దాడి నుంచి మా బంధువు తృటిలో తప్పించుకున్నారు. అప్పట్లో నేను స్కూల్లో చదువుకునేవాడిని. ముంబై నగరం మంటల్లో చిక్కుకోవడం టీవీలో చూశా. నా తల్లిదండ్రుల్లో ఆందోళలనను గమనించా. మూడు రోజులపాటు ముంబై ప్రజలకు నిద్రలేదు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికిపైగా మరణించారు. ఎన్నో విషాదాల నీడన నేను పెరగాల్సి వచి్చంది. పాకిస్తాన్ పట్ల ఇండియా వైఖరిని జనరంజకవాదం(పాపులిజం) అనడం సరైంది కాదు. ఈ డిబేట్లో మేము నెగ్గాలంటే గణాంకాలు కాదు.. క్యాలెండర్ ఉపయోగిస్తే సరిపోతుంది. 1993 మార్చి నెలలో మా ఇంటికి సమీపంలోనే దాడులు జరిగాయి. అప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. మూడేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఓట్ల అవసరం వల్ల ఈ దాడులు జరగలేదు. భారత ఆర్థిక రాజధానిని దెబ్బకొట్టాలని దావూద్ ఇబ్రహీం, ఐఎస్ఐ కుట్రలు సాగించాయి. ఇది పాపులిజం కాదు.. భారత్పై జరిగిన యుద్ధమే. 26/11 దాడుల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంయమనం పాటించింది. నిజంగా ఎన్నికల్లో నెగ్గాలనుకుంటే యుద్ధ విమానాలతో పాక్పై దాడులు చేసేది. శత్రువుకు బుద్ధిచెప్పకపోతే శాంతి సాధ్యమవుతుందా? అందుకే పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్లోని పఠాన్కోట్, ఊరీపై భారత సైన్యం దాడులకు దిగింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ను ‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం. అప్పుడు ఎన్నికలు లేవు. అలాంటప్పుడు ఎన్నికల్లో లాభపడడానికి దాడులు చేశారని ఎలా చెప్పగలరు? పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాలి్చచంపారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారని పర్యాటకులను అడగలేదు కదా! ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ భూభాగాలను భారత్ ఆక్రమించలేదు. ముష్కరులకు బుద్ధి చెప్పింది. ఇది పాపులిజం కాదు.. ప్రొఫెషనలిజం. ఉగ్రవాద దాడుల నుంచి ప్రజలను కాపాడుకోవడం పాపులిజం అవుతుందా? ప్రజలకు కనీసం తిండికూడా పెట్టలేని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ను బూచీగా చూపించి వారిని మభ్యపెడుతోంది. ప్రజల పేదరికాన్ని అధికారానికి నిచ్చెనగా వాడుకుంటోంది. భారత్ యుద్ధం కోరుకోవడం లేదు. పొరుగుదేశాలతో స్నేహాన్ని, వ్యాపారాన్ని కోరుకుంటోంది. భారతదేశ సహనాన్ని పాకిస్తాన్ పదేపదే పరీక్షిస్తోంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి’ అని భానుశాలీ తేల్చిచెప్పారు. -
రెండేళ్ల తర్వాత బెత్లెహాంకు క్రిస్మస్ శోభ
జెరూసలెం: ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర బెత్లెహాం రెండేళ్ల అనంతరం క్రిస్మస్ శోభతో మెరిసిపోతోంది. వేలాది విశ్వాసులు ఈ పవిత్ర చరిత్ర నగరానికి బారులు తీరుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రెండేళ్లుగా ఇక్కడ క్రిస్మస్ సంబరాలు పెద్దగా జరగకపోవడం తెలిసిందే. తాత్కాలిక కాల్పుల విరమణతో ప్రస్తుతానికి కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ఈ క్రిస్మస్ కు బెత్లెహాం భారీ స్థాయిలో ముస్తాబవుతోంది. చారిత్రక మాంగర్ స్క్వేర్ లో సుదూరాలకు కూడా కనిపించేంతటి భారీ క్రిస్మస్ ట్రీ అందరినీ అలరిస్తోంది. కార్డినల్ పియర్ బటిస్టా పిజాబెల్లా సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వాసులు సంప్రదాయం మేరకు ఆడుతూ పాడుతూ నృత్యగానాలు చేస్తూ జెరూసలెం నుంచి ప్రదర్శనగా బెత్లెహాం చేరుకున్నారు. అయితే ఈసారి విదేశీయులు మాత్రం అతి తక్కువగా కనిపించారు. క్రిస్మస్ సీజన్లో మామూలుగా జరిగే వ్యాపారం లేక ఈసారి స్థానిక ముస్లింల దుకాణాలు దిగాలుపడి కనిపిస్తున్నాయి. బెత్లెహాం కు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం దెబ్బకు రెండేళ్లుగా అది దాదాపుగా నిండుకుంది. యుద్ధ విరామం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం మళ్లీ కాస్త కళకళలాడుతోందని స్థానికులు అంటున్నారు. వెస్ట్ బ్యాంక్ లోని 30 లక్షల జనాభాలో క్రైస్తవులు 2 శాతం ఉండరు. -
30 మంది భారతీయుల అరెస్టు
న్యూయార్క్: అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులపై నిఘా నానాటికీ తీవ్రమవుతోంది. కాలిఫోర్నీయాలో 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు అరెస్టు చేశారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఇద్దరు ఎల్సాల్వెడార్ పౌరులతోపాటు చైనా, హైతీ, హోండూరస్, మెక్సికో, రష్యా, సోమాలియా, టర్కీ, ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు స్పష్టంచేసింది. వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లతో సెమీ ట్రక్కులు నడపడంతోపాటు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించి, అరెస్టు చేసినట్లు పేర్కొంది. కాలిఫోర్నియాలోని ఎల్సెంట్రో సెక్టార్లో ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద తనిఖీలతోపాటు ఇతర సంస్థలతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లలో వీరంతా పట్టుబడినట్లు తెలియజేసింది. తొలుత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 దాకా చేపట్టిన తనిఖీల్లో 42 మంది దొరికిపోయారు. అనంతరం డిసెంబర్ 10, 11న అంటారియో, కాలిఫోర్నీయాలో ‘హైవీ సెంటినల్’ పేరిట నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో మరో ఏడుగురు అరెస్టయ్యారు. దీంతో అరెస్టయిన అక్రమ వలసదారుల సంఖ్య 49కి చేరుకుంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. అమెరికాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అక్రమ వలసదారులు సరైన లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిని కట్టడి చేయడానికే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కమర్షియల్ లైసెన్స్ కలిగిన ఉన్నవారికి సెమీ ట్రక్కులు నడపడానికి అనుమతి లేదు. ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనలు అడ్డుకోవడం రహదారులపై ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చడం, వాణిజ్య రవాణా రంగంలో నియంత్రణ ప్రమాణాలు పటిష్టంగా పాటించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అమెరికా అధికారులు స్పష్టంచేశారు. పలువురు భారతీయులు అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి, రోడ్డు ప్రమాదాలకు కారకులైన ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. -
విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడి మృతి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్–హదద్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్ హమీద్ దిబేబాహ్ ధృవీకరించారు. మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు అంకారాలోని ఎసెన్బోగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫాల్కన్– 50 రకం ప్రైవేట్ బిజనెస్ జెట్ చిన్న విమానం టేకాఫ్ అయింది. ఇందులో లిబియా సైన్యా ధ్యక్షుడు అలీ సహా నలుగురు సైనికాధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా తుర్కియేలో పర్యటన ముగించుకుని స్వదేశం పయనమయ్యారు. అయితే గాల్లోకి లేచిన కేవలం 40 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)తో విమాన సంబంధాలు తెగిపోయాయి. వెనువెంటనే 408 మంది సిబ్బందితో సహాయక, అన్వేషణ బృందాలు గాలింపు మొదలెట్టాయి. ఎయిర్పోర్ట్కు 70 కిలోమీటర్ల దూరంలోని హేమన పరిధిలోని కెసిఖావ్ గ్రామ శివారులో విమాన శకలాలను గాలింపు బృందాలు గుర్తించాయి. విమానంలోని వారంతా చనిపోయి నట్లు నిర్ధారించాయి. -
తప్పుడు సమాచార వ్యాప్తికి భారీ శిక్షలు
సియోల్: తప్పుడు, కృత్రిమ సమాచార కట్టడికి దక్షిణ కొరియా కొత్త బిల్లు తెచ్చింది. పదేపదే హెచ్చరించినా వాటి వ్యాప్తికి పాల్పడే సంప్రదాయ, ఆన్లైన్ వార్తా మాధ్యమాలకు ఇకపై భారీ జరిమానాలు విధించనుంది. అక్కడి చట్టసభ బుధవారం ఈ మేరకు ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఆరోపణలు రుజువైతే సదరు మీడియా సంస్థలపై దేశ మీడియా నియంత్రణ సంస్థ ఏకంగా 100 కోట్ల వొన్ (7 లక్షల డాలర్ల) దాకా జరిమానా విధించవచ్చు. తప్పుడు వార్తలకు 50 లక్షల వొన్ల దాకా పరిహారం వసూలు చేయవచ్చు. మీడియా సంస్థలపై ఆరోపణలు కోర్టులో రుజువైతే బాధితులకు జరిగిన నష్టానికి హీనపక్షం ఐదు రెట్ల పరిహారం వసూలు చేయవచ్చు. అయితే ఈ బిల్లు అంతిమంగా మితిమీరిన ప్రభుత్వ సెన్సార్ షిప్ కు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును వీటో చేయాల్సిందిగా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు జర్నలిస్టు, పౌర హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ‘‘బిల్లులో వాడిన పదజాలమే చాలా అభ్యంతరకరం. పైగా మీడియాకు ఎలాంటి రక్షణ చర్యలూ పొందుపరచలేదు. ఇలాగైతే ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అవినీతి తదితరాలపై విమర్శనాత్మకంగా ఒక్క ముక్క కూడా రాసేందుకు వీలుండదు’’ అంటూ మండిపడ్డాయి. -
సునీత సాహసం
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోపల పనిచేయడమే ఎంతో సాహసంతో కూడిన పని. ఇక ఐఎస్ఎస్ ఆవల విధులు నిర్వర్తించడమంటే కత్తిమీద సామే. అలాంటి పనిని అలవోకగా చేసి భారతీయ మూలాలున్న మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఐఎస్ఎస్కు ప్రాణాధారాలైన సువిశాల సౌర ఫలకలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఒడుపుగా వాటి సమీపంలో పనిచేస్తున్న సునీత ఫొటోలను తాజాగా అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(నాసా) వ్యోమగామి డాన్ పెటిట్ విడుదలచేశారు. దీంతో వ్యోమగాములు ఎంతటి విపత్కర, అననుకూల పరిస్థితుల్లో అంతెత్తులో పనిచేస్తారనేది సాధారణ ప్రజానీకానికి సైతం మరోసారి అవగతమైంది. ఈ ఏడాది జనవరిలో ఐఎస్ఎస్లో పనిచేసినప్పటి ఫొటోలను పెటిట్ తాజాగా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘ అంతరిక్షంలో అణుమాత్రమైనా తప్పు జరక్కుండా ఎలా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది’’ అని పెటిట్ రాసుకొచ్చారు. ఐఎస్ఎస్ ఇంధన అవసరాలు తీర్చే ఒక్కో సౌర ఫలకం 35 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో ఉంటుంది. మొత్తంగా 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక్కో సోలార్ ప్యానెల్ను ఏర్పాటుచేశారు. మొత్తం సౌరఫలకాల్లో 2,62,400 సోలార్ సెల్స్ ఉన్నాయి. నిరాటంకంగా సూర్యకిరణాల నుంచి వేడిమిని సంగ్రహిస్తూ ఇవి 120 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేస్తాయి. ఐఎస్ఎస్లో కీలక మాడ్యూల్స్ అన్నింటి విద్యుత్ అవసరాలను ఈ సోలార్ ప్యానెళ్లే తీరుస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలకు కావాల్సిన అదనపు విద్యుత్నూ ఇవే సరఫరా చేస్తాయి. ఇటీవల అదనపు సెల్స్ను అమర్చి మొత్తం సామర్థ్యాన్ని 30 శాతం పెంచారు. దీంతో మరో దశాబ్దకాలంపాటు శాస్త్రీయ శోధనకు కావాల్సిన శక్తి అవసరాలు తీరినట్లేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అనుకోని స్పేస్వాక్ సునీత బృందం తిరిగిరావాల్సిన వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాళ్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె అదనపు బాధ్యతలను నెత్తినేసుకున్నారు. ఇతర వ్యోమగాముల శాస్త్రపరిశోధనలో పాలుపంచుకుంటూనే ఆవలి వైపు మరమ్మతుల బాధ్యతలనూ సునీత సక్రమంగా నిర్వర్తించారు. అందులో భాగంగా సునీత ఈ అనుకోని స్పేస్వాక్ చేయాల్సి వచ్చిందని వ్యోమగామి పెటిట్ వెల్లడించారు. జనవరి 30వ తేదీన సునీత 9వ సారి స్పేస్వాక్ చేయగా అప్పుడు తాను తీసిన ఫొటోలనే పెటిట్ బహిర్గతంచేశారు. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్లింక్ వ్యోమనౌకను పరీక్షించే ప్రయోగంలో భాగంగా అందులో బుచ్ విల్మోర్తో కలిసి 2024 జూన్ ఐదో తేదీన సునీత ఐఎస్ఎస్కు పయనమయ్యారు. కేవలం 8 రోజుల్లో వీళ్లు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ తర్వాత స్టార్లింక్లో థ్రస్ట్ వైఫల్యం, హీలియం లీకేజీలతో సునీత భూమి మీదకు తిరిగి ప్రయాణం అస్సలు సాధ్యపడలేదు. దీంతో ఏకంగా 9 నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు 2025 మార్చి 18వ తేదీన సునీత విజయవంతంగా భూమి మీదకు తిరిగొచ్చారు. -
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది. వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.ఈ ఘటన న్యూజిలాండ్లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. -
నజ్నిన్ మున్నీని ఉద్యోగం నుంచి ఊడబీకండి.. లేదంటే తగలబెట్టేస్తాం
ఢాకా: బంగ్లాదేశ్ టేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయంలో యువకుల గుంపు వీరంగం సృష్టించింది. మీ హెడ్ ఆఫ్ న్యూస్ నజ్నిన్ మున్నీని వెంటనే తొలగించకపోతే కార్యాలయాన్ని తగలబెడతాం’ అని వారు హెచ్చరించారు.సుమారు 7–8 మంది యువకులు కార్యాలయానికి వచ్చి, మున్నీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రోథోమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాల మాదిరిగానే మీ కార్యాలయాన్ని కూడా తగలబెడతాం’ అని వారు స్పష్టంగా బెదిరించారు.ఈ గుంపు తమను యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ సభ్యులమని చెప్పుకున్నప్పటికీ, ఆ సంస్థ అధ్యక్షుడు రిఫాత్ రషీద్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.గత వారం ప్రముఖ పత్రికలు ప్రోథోమ్ ఆలో మరియు డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరగడం, ఆ తరువాత గ్లోబల్ టీవీపై బెదిరింపులు రావడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నజ్నిన్ మున్నీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. 7–8 మంది నా కార్యాలయానికి వచ్చి, నేను ఉద్యోగం వదిలిపెట్టకపోతే కార్యాలయాన్ని తగలబెడతామని బెదిరించారు’అని వెల్లడించారు. ఆమె ఈ బెదిరింపులు మీడియాను భయపెట్టే ప్రయత్నంలో భాగమని పేర్కొన్నారు.ఈ ఘటన బంగ్లాదేశ్లో ప్రెస్ ఫ్రీడమ్పై ఉన్న ముప్పును మరోసారి బయటపెట్టింది. పత్రికా కార్యాలయాలపై దాడులు, టీవీ ఛానెల్లపై బెదిరింపులు జరగడం ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు పెద్ద సవాలుగా మారింది. అంతర్జాతీయ వర్గాలు ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
తైవాన్లో భారీ భూకంపం
తైపీ: భారీ భూకంపం తైవాన్ తూర్పు తీరప్రాంతాన్ని వణికించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం సముద్ర ప్రాంతంలో, సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు.భూకంపం సంభవించిన వెంటనే రాజధాని తైపే సహా అనేక ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం గురించి స్పష్టమైన సమాచారం అందలేదు. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు.తైవాన్ భూకంప కేంద్రం ప్రకారం, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తైవాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో జరిగిన భారీ భూకంపం 2,400 మందికి పైగా ప్రాణాలు తీసిన విషయం గుర్తు చేస్తూ నిపుణులు ఈసారి పెద్ద నష్టం జరగకపోవడం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. తైవాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రజల్లో ఆందోళన కలిగించినప్పటికీ, సునామీ ప్రమాదం లేకపోవడం కొంత ఊరటనిచ్చింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేస్తున్నారు. -
థాయిలాండ్-కంబోడియాల మధ్య ఉద్రిక్తతలు.. స్పందించిన భారత్
ఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేశారనే నివేదికలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నిర్మించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేసినట్లు మాదృష్టికి వచ్చింది. ఇది కొనసాగుతున్న థాయ్లాండ-కంబోడియా సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో ఉంది. ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ ప్రాంతం ఉమ్మడి సాంస్కృతిక, నాగరిక బంధాలను నొక్కి చెబుతూ.. దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా ప్రజలు హిందూ, బౌద్ధ దేవతలను ఎంతో గౌరవిస్తారని, పూజిస్తారని జైస్వాల్ పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలు, ఈ ప్రాంతం ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి నష్టం తీవ్రతరం చేస్తుందని, ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. -
రష్యా పెను సంచలనం
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాము చేపడుతోన్న లూనార్ ప్రొగ్రామ్తో పాటు రష్యా-చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావొచ్కిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రామ్కు విద్యుత్ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని పేర్కొంది. అయితే, అది అణువిద్యుత్ కేంద్రమేనని వార్తలు వస్తున్నప్పటికీ.. రష్యా సంస్థ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.అంతరిక్ష పరిశోధనల్లో ముందున్న రష్యా.. తమ వ్యోమగామి యూరి గగారిన్ను 1961లోనే అంతరిక్షంలోకి పంపించింది. కానీ, కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాల కంటే కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల (2023 ఆగస్టులో) రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 జాబిల్లిపై అడుగుపెట్టడానికి ముందే కూలిపోయింది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ కూడా తీవ్ర పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే. -
పెట్రోల్ బాంబ్ విసిరి.. ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు
క్రిస్మస్ పండుగ వేళ.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ హింస చెలరేగింది. బుధవారం స్థానిక మొఘ్బజార్ ఇంటర్సెక్షన్ వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సంగ్సాద్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన క్రూడ్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢాకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం 7:10 గంటల ప్రాంతంలో మొఘ్బజార్ ఫ్లైఓవర్ నుండి బాంబును విసిరారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. ఇంతకాలం ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకుడు తారిక్ రెహమాన్.. తాజాగా ఢాకాలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆయన రాక నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈలోపే ఆయన పర్యటనకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. మయమన్సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు మతవిద్వేష వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో మూకహత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు ఆందోళనలకు దారి తీయడంతో పాటు భారత్తో యూనస్ ప్రభుత్వానికి సంబంధాలను మరింత దెబ్బ తీసే విధంగా మార్చాయి. ఈలోపు డిసెంబర్ 22వ తేదీన మొతలేబ్ షిక్దర్ అనే మరో యువ నేతపై కాల్పులు జరిగాయి. తాజా పరిస్థితుల(ఢాకా బాంబ్ ఎటాక్) నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనా మరో దుశ్చర్య: ట్రావెల్ వ్లాగర్కి 15 గంటల నరకం, ఎందుకంటే
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అన్నందుకు ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్-కమ్-యూట్యూబర్ను చైనాలో 15 గంటల పాటు నిర్బంధించిన వైనం మరోసారి ఆందోళన రేపింది. నవంబర్ 16న జరిగిన సంఘటనను వివరిస్తూ డిసెంబర్ 23న ఇన్స్టాగ్రామ్లో రీల్ యూట్యూబ్లో బాధితుడు ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం తన బాధను పంచుకోవాలనే ఉద్దేశమే తప్ప ఇది ఎవరి ఒత్తిడిమీద పోస్ట్ చేసినవీడియో కాదనీ స్పష్టం చేశాడు. దీంతో ఇది వైరల్గామారింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో దాదాపు 18 గంటలు నిర్బంధించిన ఘటన, తీవ్ర నిరసనలువ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.ఆన్లైన్లో ఆన్ రోడ్ ఇండియన్గా ప్రసిద్ధి చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిట్టల్ చైనాలో తనకెదురైన భయానక అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేశాడు. చైనాలో గతంలో నిర్బంధించబడిన అరుణాచల్ ప్రదేశ్ పౌరుడికి సంఘీభావం తెలిపే వీడియోను పోస్ట్ చేయడంతోనే తనను చైనా అధికారులు దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారని ఆరోపించాడు. ఈ వీడియోపై యూట్యూబర్ క్షమాపణలు కూడా చెప్పాడు.నవంబర్ 16న మిట్టల్ చైనాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఎపుడు మామూలుగా ప్రశ్నలిడిగి, క్లియర్ చేసే అధికారులు ఈ సారి ఇమ్మిగ్రేషన్ వద్ద తనను ఆపివేసినట్లు మిట్టల్ చెప్పారు. పాస్పోర్ట్పై వార్నింగ్ స్టిక్కర్ అంటించి, ఆ తరువాత పలువురు విదేశీ పౌరులను ఉంచిన నిర్బంధ ప్రాంతానికి తీసుకెళ్లారని తన సుదీర్ఘ వీడియోలో ఆరోపించాడు. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్తో తనకున్న భావోద్వేగ సంబంధం మూడేళ్లు అక్కడ చదువుకోవడంతో ఏర్పడిందనీ , చైనాలో ఒక అరుణాచల్ పౌరుడిని నిర్బంధించారని విన్న తర్వాత తాను తీవ్రంగా ప్రభావితమై దాని గురించి మాట్లాడిన వీడియో తన నిర్బంధానికి కారణమైందన్నాడు.దాదాపు రెండు గంటల పాటు ఏ అధికారి కూడా అతనితో మాట్లాడలేదు. తరువాత, అతన్ని మరొక గదిలోకి తీసుకెళ్లారు, అక్కడ ఏవీ రికార్డ్ చేయకుండా ఉండటానికి ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్న అధికారులు తన ఐప్యాడ్ను పట్టించుకోలేదని తెలిపాడు. తన నిర్బంధంపై పదే పదే అడిగినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించమే కాదు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే కొద్దిగా నీళ్లిచ్చారు. అలా 12-13 గంటలయ్యేసరికి తనలో భయం మొదలైంది. దాదాపు 15 గంటల తర్వాత, ఒక చైనా అధికారి తిరిగి వచ్చి ప్రక్రియ పూర్తయిందని ,వెంటనే దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని హెచ్చరించారు. ఇక దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని అతను చెప్పాడు. ఎట్టకేలకు తాను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by On Road Indian (@onroadindian) తానొక సాధారణ ట్రావెల్ వ్లాగర్ అని, తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, చైనాలో తన స్టార్టప్ రోజుల నుండి స్నేహితులు ఉన్నారని కూడా అన్నారు. "నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నేను అందర్నీ ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని మీతో పంచుకుంటాను. నాకు ఏ రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు" అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు. తనకు ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేవని, అధికారులను రెచ్చగొట్టాలని ఎప్పుడూ ఉద్దేశించలేదని మిట్టల్ వాపోయాడు. ఇది రాస్తున్నంతసేపు కూడా తాను ఏడుస్తూనే ఉన్నాని కూడా రాసుకొచ్చాడు.భారత - చైనా రాయబార కార్యాలయాలు తాను అనుభవించిన భయాన్ని అర్థం చేసుకుంటాయని తాను ఆశిస్తున్నానని మిట్టల్ అన్నారు. ఇదీ చదవండి: చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియోకాగా గతంలో చైనాలో మహిళను నిర్బంధించిన ఘటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. భారతీయ వ్యక్తిని ఏకపక్షంగా నిర్బంధించడం తగదని హితవు చెప్పింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ "భారతదేశంలో అంతర్భాగం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. చైనా ఎంత తిరస్కరించినా ఈ సత్యాన్ని మార్చలేమని కూడా స్పష్టం చేసింది. తాజా సంఘటనపై భారత అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియో
పెట్ యానిమల్స్ని పెంచుకోవడమే కాదు.వాటిని సరియైన పద్ధతిల్లో నియంత్రించడం కూడా తెలిసి ఉండాలి యజమానులకు. మరీ ముఖ్యంగా పిట్ బుల్ లాంటి పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రమాదంలో పడతారు. ఫలితంగా యజమానులకు కూడా చట్టపరమైన తిప్పలు తప్పవు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు.న్యూయార్క్ వీధుల్లో ఒక పిట్ బుల్ ఒక పసిపిల్లవాడిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క క్షణం ఆ పసివాడి తల్లి గుండ్లో రైళ్లు పరుగెట్టిందింది. కానీ అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వారు స్పందించడంతో ఆ పసివాడికి ప్రాణా పాయం తప్పింది.A pit bull attacked a toddler on the streets of New York, but luckily a bystander was quick enough to choke the dog before it could do further harm the child.😳 pic.twitter.com/Yh6btEwVVm— Rain Drops Media (@Raindropsmedia1) December 23, 2025ట్విటర్లో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో ప్రకారం పిట్ బుల్ డాగ్ పిల్లవాడి కాలును గట్టిగా దొరకబుచ్చుకుంది. నలుగురు వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా, ఎంతకీ వదలకుండా పట్టుపట్టింది. దీంతో వారిలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ కుక్కను గొంతు పట్టుకుని గాలి ఆడకుండా చేయడంతో అది నోటి తెరిచి పట్టువీడింది. దీంతో మరింత గాయం కాకుండా పిల్లవాడి కాలును తప్పించుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కుక్క కరచినపుడు ఎలా ప్రవర్తించాలో, కచ్చితంగా అదే చేశాడు. హీరో అంటూ అతని చర్యను కొనియాడటం విశేషం. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
ఉస్మాన్ హాదీ హత్య అందుకే..?
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్ని హత్య చేయించిందని ఆరోపించారు.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్పై పగ పెంచుకున్నాయి. ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్లోని షాబాద్లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి
టొరంటో: కెనడాలోని టొరంటోలో 30 ఏళ్ల భారత యువతి హిమాన్షి ఖురానా దారుణ హత్యకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా, మరుసటి రోజు ఉదయం ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మృతురాలి భాగస్వామే ఇందుకు కారకుడని ప్రాథమికంగా నిర్ధారించారు.పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ గఫూరీ(32)ని పట్టుకునేందుకు కెనడియన్ చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త వారెంట్ జారీ చేశాయి. గఫూరీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతూ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాన్షి ఖురానా మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. టొరంటో పోలీసుల హోమిసైడ్ యూనిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. కాగా ఈ ఘటన విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన భద్రతా పరమైన ఆందోళనలను మరోసారి లేవనెత్తింది.ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్వీఎం3- ఎం6 -
ఉషపై వ్యాఖ్యలు.. జేడీ వాన్స్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత సంతతికి చెందిన తన సతీమణి ఉషా వాన్స్ను తిట్టేవారిపై జేడీ వాన్స్.. అసహనం వ్యక్తం చేశారు. ఉషను జాతిపరంగా కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వాన్స్ కౌంటరిచ్చారు. ఇటీవల తన పాడ్కాస్ట్లో ఉషను జాతిపరంగా కించపరిచేలా.. ఉపాధ్యక్షుడిని జాతి ద్రోహిగా పేర్కొంటూ నిక్ విమర్శలు చేశారు. దీనిపై వాన్స్ స్పందించారు. ఈ సందర్బంగ వాన్స్ మాట్లాడుతూ.. ‘నేను ఒకటే స్పష్టం చేయదలుచుకున్నా. నా భార్యపై విమర్శల దాడి చేసేవారు.. జెన్ సాకీగానీ, నిక్ ఫ్యూయెంటెస్గానీ.. వారు ఎవరైనాగానీ అశుద్ధం తినొచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడిగా అది నా అధికారిక విధానం. ప్రజలను జాతిపరంగా, సంస్కృతిపరంగా జడ్జ్ చేసేవారిపట్ల నా వైఖరి ఇలాగే ఉంటుంది. వారు యూదులైనా, శ్వేతజాతీయులైనా అంతే. మనం అలా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశారు.ఉద్యోగాలకు క్రైస్తవంతో లింకుపై విమర్శలు ఇక, అంతకుముందు.. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు, ఉపాధికి, మతానికి ముడిపెడుతూ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా తాలూకు నిజమైన క్రైస్తవ గుర్తింపు కేవలం వ్యక్తిగత విశ్వాసాలకే పరిమితమైనది కాదు. ఈ దేశ ఉపాధికి, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలకు కూడా సంబంధించినది. అమెరికా కంపెనీలు మూడో ప్రపంచ దేశాల నుంచి కారుచౌకగా ఉద్యోగులను దేశంలోకి గుమ్మరించడం సరికాదు. వ్యక్తి కుటుంబం ఎంత ముఖ్యమో, దేశ క్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో పూర్తి అవగాహన కలిగివుండటం కూడా అంతే ముఖ్యం. అది మన కనీస బాధ్యత అంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారు.‘ఇక్కడి ఉద్యోగాలను దేశీయులకు కట్టబెడుతున్న కంపెనీలకు జరిమానాలు విధిస్తున్నాం. ఎందుకంటే సొంత దేశంలో మంచి ఉద్యోగం చేయాలనే ఎవరికైనా ఉంటుంది. అమెరికన్ల ఆ కలలకు ఈ కంపెనీల తీరు తూట్లు పొడుస్తోంది అని వాన్స్ ఆరోపించారు. హెచ్–1బీ వీసాలకు పరిమితులు విధించేందుకు అదే కారణం. అమెరికా ఎన్నటికీ క్రైస్తవ దేశమే. ఆ విశ్వాసమే మనకు దిక్సూచి’ అన్నారు. వాన్స్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పలువురు అమెరికన్లు వారిని స్వాగతిస్తుండగా, చాలామంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. -
పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం సరైనదని పాక్ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Maulana Fazlur Rehman to Pakistan’s military regime:“If you justify attacking Afghanistan by claiming you are targeting your enemy there, then why do you object when India targets its enemy in Bahawalpur and Murid (inside Pakistan)?” pic.twitter.com/T91sdps611— Afghanistan Times (@TimesAFg1) December 23, 2025కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.ఇది కూడా చదవండి: భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే.. -
గ్రీన్కార్డులపై గూగుల్ గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాతో గూగుల్ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది. తమ ఉద్యోగుల గ్రీన్కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేయబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం చేరవేసింది.అమెరికాలో వేలాది మంది విదేశీయులు తాత్కాలిక వీసాలతో గూగుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంపెనీ స్పాన్సర్షిప్తో శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు) పొందాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వారికి గత రెండేళ్లుగా గ్రీన్కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులకు గ్రీన్కార్డులు లభించడానికి వీలుగా ప్రోగ్రామ్ ఎల్రక్టానిక్ రివ్యూ మేనేజ్మెంట్(పెర్మ్) దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వాటికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలియజేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డు పొందడంలో పెర్మ్ అనేది కీలకమైన ప్రక్రియ.అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియను విస్తృతంగా వాడుకుంటాయి. టెంపరరీ వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు పరి్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చేలా సహకరిస్తాయి. పెర్మ్కు అర్హులైన వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రీన్కార్డు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై గూగుల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా సమాచారం మాత్రం ఇచి్చంది.విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు.. ఉద్యోగులకు అమెరికా టెక్ కంపెనీల సూచన అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశాయి. విదేశీలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడే వద్దని పేర్కొన్నాయి. విదేశాల్లోని అమెరికా ఎంబీసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చాలా ఆలస్యమవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఏడాది కాలం పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిరావడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టెక్ కంపెనీలు సూచించాయి. ఈ మేరకు కొన్ని రోజులుగా తమ ఉద్యోగులకు సమాచారం అందిస్తున్నాయి. -
హెచ్–1బీ లాటరీకి చెల్లుచీటీ
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న వారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. హెచ్–1బీ వీసాల జారీని ఇకపై యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్విసెస్(యూఎస్సీఐఎస్) ద్వారా చేపట్టనుంది. ‘‘ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్ హెచ్–1బీ వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది.దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయి. విదేశీ ఉద్యోగులను కారుచవగ్గా తీసుకొచ్చి అమెరికాలో పని చేయించుకున్నాయి. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగింది. ఇకపై దీన్ని సరిదిద్దుతాం. ఇకపై నాలుగు రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికనుగుణంగా హెచ్–1బీలను జారీచేస్తాం. ఎంట్రీ లెవల్ అభ్యర్థులు(1), అర్హత సాధించిన అభ్యర్థులు(2), అనుభవం ఉన్న అభ్యర్థులు(3), అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులు(4)గా దరఖాస్తులను విభజించి ఆ మేరకే హెచ్–1బీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ)కి సమీక్ష కోసం పంపించాం. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తాం.ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’’ అని యూఎస్సీఐఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ స్పష్టం చేశారు. హెచ్–1బీ వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ముక్తాయించారు. కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లింది. -
‘మేమిద్దరమే… దేశం విడిచి పారిపోయిన అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లం’
లండన్: ఆర్థిక నేరాల కేసులో భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు మరోసారి వార్తల్లో నిలిచారు. దేశం విడిచి పారిపోయినా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వీరిద్దరూ తాజాగా లండన్లో ఎంజాయ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా భారత్పై వ్యంగ్యగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లండన్లో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బయటపడింది. ఈ వీడియోలో లలిత్ మోదీ.. ‘భారత్ నుంచి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లు మేమిద్దరమే’ అని వ్యంగ్యంగా పరిచయం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.అంతేకాదు సంబంధిత వీడియోను లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంటర్నెట్ను మరోసారి భారత్లో బ్రేక్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ విజయ్ మాల్యా లవ్వ్యూ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు, వీడియోలో కనిపించిన ధోరణిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వీరిద్ధరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 🚨 🇮🇳 UNBELIEVABLE! Embezzler of billions Lalit Modi brags on camera about being India’s top fugitive on the run!Vijay Mallya there but stays silent, skipping the shameless tirade.These audacious criminals must be extradited back to India at any cost! pic.twitter.com/ijeNYZM4wB— Uday Singh (@udaysinghkali) December 23, 2025 -
అతి పెద్దది, అత్యాధునికం అద్భుతాల యుద్ధ నౌక
వాషింగ్టన్: ప్రస్తుత యుద్ధ నౌకలన్నింటికంటే అతి పెద్దది. వేగంలో సాటి లేనిది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అణు క్షిపణులను, అత్యాధునిక హై పవర్డ్ లేజర్ క్షిపణులతో శత్రు దురి్నరీక్ష్యం. అటువంటి కనీవినీ ఎరగని యుద్ధ నౌకను ఒకదాన్ని అమెరికా తయారు చేయబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఈ మేరకు స్వయంగా ప్రకటించారు. ‘కొత్త నౌకను నేనే డిజైన్ చేస్తా. ఎందుకంటే సహజంగా నేను మంచి సౌందర్యారాధకుణ్ణి‘ అని చెప్పుకున్నారు. దానికి ముద్దుగా బ్యాటిల్ షిప్ అని పేరు కూడా వెల్లడించారు. సాగర తలంలో అమెరికా రక్షణ కోసం తాను కలలుగంటున్న గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టులో ఇది కీలక భాగం కానుందని ఆయన తెలిపారు.ఇప్పటిదాక నిర్మితమైన అన్ని యుద్ధ నౌకల కంటే కూడా ఇది కనీసం 100 రెట్లు శక్తిశాలిగా ఉండనుందంటూ ఊరించారు. గోల్డెన్ ఫ్లీట్లోని నౌకలన్నీ అంతే శక్తిమంతంగా ఉంటాయని కూడా ట్రంప్ భవిష్యద్దర్శనం చేశారు. తన ముద్దుల బ్యాటిల్ షిప్కు యూఎస్ఎస్ డిఫైంట్గా నామకరణం చేస్తామని తెలిపారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగా నౌకలపై అణు క్షిపణులను మోహరించడం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. కనుక ఇది ఎంతమేరకు ఆచరణసాధ్యం అన్నదానిపై ఎన్నో సందేహాలున్నాయి. అధ్యక్షునిగా తొలి టర్మ్లో కూడా నేవీని ఆధునీకరించేందుకు ట్రంప్ ఎన్నో పథకాలు ప్రకటించినా అవి చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి. కష్టాల్లో యూఎస్ నేవీ అమెరికా నావికా దళం కొద్ది రోజులుగా కష్టాల్లో కొనసాగుతోంది. అంచనాలు దాటి మరీ అదుపు తప్పుతున్న వ్యయం కారణంగా చిన్న తరహా యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టును ఇటీవలే అటకెక్కించాల్సి వచ్చింది. ఫోర్డ్ శ్రేణికి చెందిన విమానవాహక నౌకల తయారీ ఆలోచన కూడా చివరి నిమిషంలో వెనక్కు తీసుకుంది. కొత్త నౌకల్లో ట్రంప్ గొప్పగా చెప్పుకున్న పలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ఏర్పాటులో కూడా విఫలమే అయింది. వంద కోట్ల డాలర్లతో ఏళ్ల తరబడి చేపట్టిన నౌకలపై రైల్ గన్ టెక్నాలజీ ప్రాజెక్టుకు కూడా 2021లో నేవీ మంగళం పాడింది. ఈ ఈనేపథ్యంలో నేవీ స్థైర్యాన్ని పెంచేందుకే ట్రంప్ సరికొత్త బ్యాటిల్ షిప్ ఆర్ చేసినట్టు భావిస్తున్నారు. అన్నీ అబ్బురాలే ట్రంప్ ఊరిస్తున్న సరికొత్త అత్యాధునిక యుద్ధ నౌకలో అన్నీ అబ్బురాలేనని గోల్డెన్ ఫ్లీట్ పేరిట అమెరికా నేవీ రూపొందించిన కొత్త వెబ్ సైట్ చెబుతోంది. ‘ఇదో గైడెడ్ మిస్సైల్ యుద్ధనౌక కానుంది. తక్కువ సిబ్బంది, ఎక్కువ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు. శత్రు దుర్భేద్యంగా నిర్మాణం. ఇదే దీని మంత్రం. దీనిలో ప్రాథమిక స్థాయి ఆయుధాలే క్షిపణులు కానున్నా యి‘ అని అందులో రాసుకొచ్చారు. అయితే, దీని తయారీ బహుశా 2030 నాటికి మొదలు కావచ్చని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని నేవీ అధికారి ఒకరు చెప్పడం విశేషం! -
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ పూర్తి
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రైవేటీకరణలో విజయవంతంగా అమ్ముడుపోయింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఈ సంస్థను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 23, 2025) జాతీయ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించింది. ఈ ప్రక్రియలో మూడు సంస్థలు అరీఫ్ హబీబ్ గ్రూప్, లక్కీ సిమెంట్, ఎయిర్బ్లూ పోటీ పడ్డాయి. ప్రారంభ బిడ్డింగ్లో అరీఫ్ హబీబ్ రూ.115 బిలియన్, లక్కీ సిమెంట్ రూ.105.5 బిలియన్, ఎయిర్బ్లూ రూ.26.5 బిలియన్ ఆఫర్ చేశాయి. ప్రభుత్వ రిఫరెన్స్ ధర రూ.100 బిలియన్గా నిర్ణయించబడింది. చివరి దశలో ఓపెన్ ఆక్షన్లో అరీఫ్ హబీబ్ తన ఆఫర్ను పెంచుతూ 135 బిలియన్ రూపాయల వద్ద విజయం సాధించింది.ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం పీఐఏలోని 75శాతం షేర్లు అరీఫ్ హబీబ్ గ్రూప్కు బదిలీ అవుతాయి. మిగిలిన 25శాతం షేర్లను కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఇవ్వబడింది.గత కొన్ని ఏళ్లేగా పీఐఏ భారీ నష్టాల్లో ఉంది. మిస్మేనేజ్మెంట్, ఆర్థిక సమస్యలు, సేవా ప్రమాణాల లోపం కారణంగా ఈ సంస్థను నిలబెట్టడం కష్టమైంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ జాతీయ విమానయాన సంస్థను పునరుద్ధరించడమే ఈ ప్రైవేటీకరణ లక్ష్యంగా పాక్ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 బిలియన్ అదనపు పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా విమానయాన సేవలను మెరుగుపరచడం, ఆధునీకరణ చేయడం, అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా పీఐఏను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కాగా, పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ అమ్మకం దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక మలుపు. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఆధ్వర్యంలో పీఐఏ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. -
‘బాబ్బాబు.. టన్నుల్లో బంగారం ఇస్తాం.. ఆ దీవిని మాకిచ్చేయండి!’
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.గ్రీన్లాండ్లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్లాండ్ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్లాండ్పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది. -
హెచ్-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రద్దు చేసింది. బదులుగా వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది. వీసా పరిమితి యథాతథంఅమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం..ప్రతి సంవత్సరం 65,000 హెచ్‑1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ కార్మికులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసాల జారీకి కీలక మార్పులుహెచ్-1బీ వీసాల జారీకి అమెరికా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్దతిని పూర్తిగా మార్చింది. మొత్తం 85వేల హెచ్-1బీ వీసాల జారీకి నాలుగు నాలుగు కేటగిరీల్లో లాటరీ తీసే పద్దతి ఉండేది.ఇందులో అత్యధిక వేతనం కలిగినవారికి లెవల్ 4 కేటగిరిగా పరిగణింపు. వేతనాన్ని బట్టి లెవల్-1,లెవల్-2, లెవల్-3 కేటగిరి ఉండగా.. లెవల్-4 అర్హత సాధించిన వారికి ఈ ఏడాదిలో నాలుగు సార్లు లాటరీకి అవకాశం. లెవల్-3 అర్హత సాధించిన వారికి మూడుసార్లు, లెవల్-2 అర్హత సాధించిన వారికి 2 సార్లు లాటరీకి ఛాన్స్, ఎంట్రీలెవల్ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే లాటరీకి ఛాన్స్. ఇచ్చేది.తాజాగా, ఆ లాటరీ సిస్టంను తొలగించింది. బదులుగా వెయిటేజీ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఆధారంగా హెచ్-1బీ వీసాల జారీ ఉంటుంది. -
ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025 లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. -
అమెరికా వదిలేస్తే.. ట్రంప్ ఆపర్
అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని అక్రమ వలసదారుల కోసం క్రేజీ డీల్ ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి వెళితే వారికి మూడు వేల డాలర్లు అంటే అక్షరాల రూ. 2.68 లక్షలు ఇస్తానని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుందని కండీషన్ విధించింది.ట్రంప్ ఈ పేరు వింటే చాలు యుఎస్లో ఉంటున్న అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు. వారిపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బెంబేలిత్తిపోతారు. ఎందుకంటే అధికారం చేపట్టి నాటి నుంచి ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తరిమికొట్టడమే. వారిని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఎన్నో కఠిన చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో వారు వెళ్లకపోవడంతో ప్రస్తుతం వారి కోసం యూఎస్ గవర్నమెంట్ ఒక డీల్ తెచ్చింది.డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు క్రిస్మస్ ఆపర్ ప్రకటించింది. యూఎస్లో ఉంటున్న అక్రమ వలసదారులు ఎవరైతే తమ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటారో వారికి డిపార్ట్మెంట్ ఆప్ హోమ్లాండ్ సెక్యురిటీ మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వారిపైన ఏవైనా జరిమానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నా రద్దు చేస్తామని పేర్కొంది.దాని కోసం ఇది వరకే రూపొందించిన సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ను ఉపయోగించాలని DHS తెలిపింది. అమెరికాను వదిలి వెళ్లాలనుకునేవారు CBP యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలను అందులో నమోదు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత వారి ప్రయాణ ఖర్చులు తదితర విషయాలను డిపార్ట్మెంట్ ఆప్ హోమ్లాండ్ సెక్యురిటీ సంస్థ చూసుకుంటుందని తెలిపింది. అక్రమ వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DHS సెక్రటరీ క్రిస్టి నోయోమ్ తెలిపారు.ఒకవేళ అక్రమంగా నివాసముంటూ తమకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి బలవంతంగా వారి దేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా వదిలి అక్రమ వలసదారులకు ట్రంప్ వెయ్యి డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. -
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్లో క్రూ మెంబర్గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్ -
బంగ్లాలో మరో ఘాతుకం.. హిందూ కుటుంబంపై దాడి
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం బోండి బీచ్ ఉగ్రవాద ఘటన దరిమిలా దేశవ్యాప్తంగా తుపాకీ సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. మూడు దశాబ్దాల అనంతరం అత్యంత భారీస్థాయిలో ‘గన్ బైబ్యాక్’ పథకాన్ని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు. బోండి బీచ్లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి నేపథ్యంలో, తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసి, దేశ పౌరుల భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నాటి ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండలలో ..దేశంలో 1996లో జరిగిన ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండ తర్వాత ఆస్ట్రేలియా చేపడుతున్న అతిపెద్ద ఆయుధ సేకరణ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. నాడు టాస్మేనియాలోని పోర్ట్ ఆర్డర్ ద్వీపంలో ఒక సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 35 మంది మృతిచెందారు. ఈ ఘటన దరిమిలా ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేసింది. అప్పట్లో సుమారు ఏడు లక్షల ఆయుధాలను తొలగించగా, ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్షలాది తుపాకులను సేకరించాలని ఆస్ట్రేలియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.మూడు విధాలుగా సేకరణలైసెన్స్ కలిగిన యజమానుల వద్దనున్న మిగులు ఆయుధాలను లేదా కొత్తగా నిషేధించిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తే, వారికి తగిన పరిహారం చెల్లించనున్నారు. ఈ భారీ ఆపరేషన్ను అటు ఫెడరల్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. రాష్ట్ర పోలీసులు, అధీకృత డీలర్లు తుపాకీలను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆయుధాల నాశనాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తారు. దీనివల్ల నిధుల వినియోగం, భద్రతలో లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.40 లక్షలకు పైగా తుపాకులుబోండి బీచ్లో ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని అల్బనీస్.. ప్రస్తుతం దేశంలో 40 లక్షలకు పైగా తుపాకులు చెలామణిలో ఉన్నాయని, ఇది పోర్ట్ ఆర్థర్ సమయం కంటే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తుపాకీ నియంత్రణకు ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ‘బైబ్యాక్’లో ప్రధానంగా మూడు రకాల ఆయుధాలను సేకరించనున్నారు.తుపాకీ నియంత్రణకు సమగ్ర ప్యాకేజీకొత్తగా నిషేధించిన అత్యాధునిక ఆయుధాలు, ఇప్పటికే చట్టవిరుద్ధంగా ముద్ర వేసినవి, యజమానులు ఇకపై తమకు అవసరం లేదని భావించే అదనపు ఆయుధాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అనవసరంగా ఇళ్లలో ఉండే ఆయుధాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం బైబ్యాక్ మాత్రమే కాకుండా, తుపాకీ నియంత్రణ కోసం ఒక సమగ్ర ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని తుపాకులు కలిగి ఉండాలనే దానిపై కఠినరీతిలో పరిమితులు విధిస్తారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గల తుపాకీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘నేషనల్ గన్ రిజిస్టర్’ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది.పౌర స్వేచ్ఛావాదుల విమర్శలు2026 మధ్య నాటికి తుపాకీ నియంత్రణ కొత్త చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానాన్ని న్యాయవాదులు, కాల్పుల బాధితులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయుధాల సంఖ్య తగ్గితేనే సమాజం సురక్షితంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు తుపాకీ యజమానులు, పౌర స్వేచ్ఛావాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టబద్ధంగా ఆయుధాలు కలిగిన వారు ఈ నిర్ణయంతో ఇబ్బంది పడతారని వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశంలో భద్రతా ముప్పు దృష్ట్యా ఇది ఒక తప్పనిసరి చర్య అని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.ఇది కూడా చదవండి: ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు -
బస్సు బోల్తా.. 16 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని ప్రధాన దీవి జావాలో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున సెమరంగ్ నగరంలోని క్రప్యక్ టోల్ ప్లాజా సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..ఇండోనేషియాలో పురాతన నగరం యోగ్యకర్త నుంచి రాజధాని జకార్తాకు వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులున్నారు. వేగంగా వస్తున్న బస్సు మలుపులో అదుపుతప్పి కాంక్రీట్ గోడను ఢీకొని, పల్తీ కొట్టింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దాదాపు 40 నిమిషాలకు పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.ప్రమాద తీవ్రతకు నుజ్జయిన బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 10 మంది తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగాను, మరో 13 మంది ఆందోళనకరంగాను ఉందని పోలీసులు తెలిపారు. బస్సును నడుపుతున్న అసిస్టెంట్ డ్రైవర్ కూడా క్షతగాత్రుల్లో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🚌 At least sixteen people were killed early Monday in a #bus accident at the intersection of the Krapyak toll exit in Semarang city, #Indonesia's Central Java province, local authorities reported. #BusAccident pic.twitter.com/v6gAj2medT— A Ahmed (@_AAhmed004) December 22, 2025 -
ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు
బలూచిస్తాన్లో ఇంతవరకూ తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు.. ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్కు బలి అవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి, న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీ సంద్రంగా మార్చివేస్తున్నాయి. గతంలో బలూచ్ సంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి (హెచ్ఆర్సీబీ)నివేదిక ప్రకారం.. మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా, బలూచ్ ప్రతిఘటనను అణచివేయడమే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.హెచ్ఆర్సీబీ వెల్లడించిన కేసుల్లో కొన్ని..గుల్జాది.. ఒకే ఏడాదిలో మూడుసార్లు వేధింపులు.. మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్జాది జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025, ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటిడి బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో రెండుసార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు.. చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3-MPO (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద జైలులో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్ఆర్సీబీ పేర్కొంది.మహజబీన్ బలోచ్.. విద్యార్థిని అని కూడా చూడకుండా.. యూనివర్శిటీ ఆఫ్ బలూచిస్తాన్లో బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చదువుతున్న 24 ఏళ్ల మహజబీన్, 2025, మే 29న క్వెట్టా సివిల్ హాస్పిటల్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అర్ధరాత్రి మూడు గంటలకు హాస్టల్ గదుల్లోకి చొరబడిన బలగాలు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాయో నేటికీ వెల్లడి కాలేదు. బలూచ్లో విద్యార్థినులకు కూడా రక్షణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.రొబినా బలోచ్.. ఆరోగ్య కార్యకర్తపై అమానుషం.. 2025, జూన్ 30న టర్బత్లోని ఓవర్సీస్ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ హెల్త్ విజిటర్ రొబినా ఇంటిని ఫ్రాంటియర్ కార్ప్స్ ధ్వంసం చేసింది. ఆమెను ఎటువంటి కారణం లేకుండా అపహరించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసి విడుదల చేశారు.సఫియా బీబీ.. సామూహిక శిక్షకు బలి2025, అక్టోబర్ 5న ఖుజ్దార్లోని జెహ్రీలో భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. ఆ ఊరంతా కర్ఫ్యూ విధించి, ఇంటింటిలో సోదాలు చేసిన బలగాలు సఫియా బీబీని రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రామాన్ని మొత్తం ముట్టడించి భయాందోళనకు గురిచేయడంలో భాగంగానే ఈ అపహరణ జరిగింది.నజియా షఫీ.. కస్టడీలో మృతి..2025, అక్టోబర్ 28న పంజ్గూర్లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా నిలిచింది. తల్లి పారి బలోచ్, కుమార్తె నజియాలను పాక్ బలగాలు తుపాకీతో బెదిరించి తమతో పాటు తీసుకెళ్లాయి. మరుసటి రోజు నజియాను తీవ్ర గాయాలతో ఆసుపత్రి సమీపంలో పడేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది నేరుగా ప్రభుత్వ కస్టడీలో జరిగిన హత్యేనని హెచ్ఆర్సీబీ చెబుతోంది. మృతురాలి తల్లి పారి బలోచ్ కూడా బలగాల చేతుల్లో చిత్రహింసలకు గురైన తర్వాత విడుదలైంది.నస్రీన్.. 15 ఏళ్ల బాలిక అదృశ్యం అవరాన్కు చెందిన నస్రీన్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికను నవంబర్ 22న హబ్ చౌకీ వద్ద అపహరించారు. సిటిడి, మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు ఆమెను అపహరించాయి. చిన్నపిల్లలపై ఈ తరహా దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.ఫర్జానా జెహ్రీ.. బహిరంగంగా కిడ్నాప్ 2025, డిసెంబర్ 1న ఖుజ్దార్లో ఆసుపత్రి నుండి వస్తున్న ఫర్జానాను దారి మధ్యలో పాక్ బలగాలు అపహరించాయి. ఇది జరిగింది ఎక్కడో గదుల్లోనే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసింది.రహిమా: గృహిణులు కూడా టార్గెట్ 2025, డిసెంబర్ 9న దల్బందిన్లో 20 ఏళ్ల గృహిణి రహిమాను, ఆమె 18 ఏళ్ల తమ్ముడిని అర్ధరాత్రి దాడుల్లో భాగంగా తీసుకెళ్లారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.చట్టం కనుమరుగు.. అణచివేత రాజ్యంపాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 (వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 10 (నిర్బంధంపై రక్షణ), ఆర్టికల్ 14 (మానవ గౌరవం)లను భద్రతా సంస్థలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థల, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఏమాత్రం గౌరవించడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని, చివరకు గృహిణులను కూడా వదలని ఈ నిరంకుశ పోకడలు బలూచిస్తాన్ను ఒక బహిరంగ జైలుగా మారుస్తున్నాయి. జవాబుదారీతనం లేని బలూచ్లో న్యాయం కనుమరుగవుతోంది. ఈ దుర్భర స్థితిపై అంతర్జాతీయంగా వచ్చే స్పందన కోసం వివిధ మానవహక్కుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం -
చచ్చినా చావను..!
చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించి ఉంటుందిలెండి. మందుమాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్లూ కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన్సన్. ఎవరీ బ్రయన్? ఏమిటీ దీని వెనుక బ్రెయిన్?బ్రయన్ జాన్సన్ (Bryan Johnson) ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరక్కుండా చూసుకుంటూంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి... వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా? అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏమిటంటే...కొన్ని పద్దతులను కచ్చితంగా ఉపయోగించడం మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజూ వంద వరకూ ట్యాబ్లెట్లు. బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు మింగుతూంటాడు.వీటిల్లో మల్టీ విటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమెగా-3, కొలేజన్ మిశ్రమాలు, పాలిఫినాల్లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్, దీర్ఘాయుష్షు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా.. మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలూ రోజూ తీసుకుంటూంటాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి 20 లక్షల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు!. వీటన్నింటి కారణంగానే ఏమో... 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. వందేళ్లు కాదు.. ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు.సులువుగా సరికొత్త మందులు...ఐదేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్షు కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్షును జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్షు సాధ్యమంటాడు. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ... శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ.. మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం (Immortal) సిద్ధించినా.. అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైతేనేం.. బ్రయన్ జాన్సన్కు జై! అమరత్వం జిందాబాద్! -
బంగ్లాదేశ్లో దాస్ హత్య.. ముందే ఫోన్ చేస్తే బతికేవాడు
సాక్షి, నేషనల్ డెస్క్: బంగ్లాదేశ్లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా మూక హత్యకు గురైన హిందూ మైనారిటీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన పని చేసిన కంపెనీ వర్గాలతో పాటు సహచరులే హత్యలో పాత్రధారులుగా మారినట్టు పోలీసులు వెల్లడించారు! దాంతో బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలన్నీ మరోసారి భగ్గుమంటున్నాయి.బంగ్లాదేశ్లో మైమెన్సింగ్ పట్టణంలోని ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తున్న 27 ఏళ్ల దాస్ డిసెంబర్ 16న దారుణ హత్యకు గురవడం తెలిసిందే. కంపెనీ ఆవరణ బయటే మతోన్మాద మూక ఆయనను అతి దారుణంగా కొట్టిచంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా–మైమెన్గంజ్ హైవే మీదికి లాక్కెళ్లి బాహాటంగా తగలబెట్టింది. మత దూషణకు పాల్పడ్డాడన్నది దాస్పై ప్రధాన ఆరోపణ. అయితే అందుకు అసలు ఆధారాలే లేవని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా చెబుతున్నారు. పైగా దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) స్పష్టం చేయడం విశేషం. అంతేకాదు, దాస్ను దారుణంగా కొట్టిచంపడంలో ఏకంగా ఆయన సహోద్యోగులు కూడా మూకతో చేతులు కలిపినట్టు ఆర్ఏబీతో పాటు స్థానిక మీడియా కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్ఏబీ ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. అనంతరం పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అసలేం జరిగింది? దాస్ మతదూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుంచే జోరుగా పుకార్లు షికారు చేశాయి. విషయం తెలియని ఆయన ఎప్పట్లాగే విధులకు హాజరయ్యాడు. అదే ఆయన పాలిట మృత్యువుగా పరిణమించింది. సాయంత్రానికల్లా సహోద్యోగులే ఆయనను దూషించడం మొదలుపెట్టారు. వారించాల్సిన పై అధికారులు పట్టించుకోకపోగా, దాస్తో బలవంతంగా రాజీనామా పత్రంపై సంతకం చేయించారు.మరోవైపు మధ్యాహ్నం నుంచే కంపెనీ బయట ఉన్మాద మూక పోగడం మొదలుపెట్టింది. సాయంత్రానికల్లా దాస్పై ఫ్యాక్టరీ ఆవరణలోనే తొలి దాడి జరిగినట్టు ఆర్ఏబీ–14 క మాండర్ నయీముల్ హసన్ వెల్లడించారు! ‘‘ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్చార్జి దాస్తో బలవంతంగా రాజీనామా చేయించడమే గాక ఆవేశంతో ఉడికిపోతున్న మూకకు ఆయనను స్వయంగా అప్పగించాడు. రాత్రి 8:30 గంటల వేళ, సరిగ్గా తర్వాతి షిఫ్ట్ కార్మికులు చిన్న గేట్ గుండా లోపలికొస్తున్న సమయంలో, బయట మూగిన మూక చూస్తుండగా దాస్ను బలవంతంగా లాక్కెళ్లి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ రూములో ఉంచాడు.అంతే! ఆ వెంటనే మూక లోనికి దూసుకొచ్చి దాస్ను బయటికి లాక్కెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే విచక్షణారహితంగా కొట్టిచంపింది. దాస్ సహోద్యోగులు కూడా వారితో చేతులు కలపడం ఈ ఉదంతంలో మరో విషాదం’’అని హసన్ వివరించారు. అంతేకాదు, ‘‘ఇంత ఉద్రిక్తత నెలకొన్నా రాత్రి 8 గంటల దాకా ఫ్యాక్టరీ బాధ్యులు తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. సకాలంలో ఒక్క ఫోన్ కాల్ చేసుంటే దాస్ బతికేవాడే’’అని చెప్పుకొచ్చారు. ‘‘ఫోన్ రాగానే మేం హుటాహుటిన బయల్దేరినా కిలోమీటర్ల కొద్దీ విపరీతంగా ట్రాఫిక్ జామై సకాలంలో ఘటనా స్థలికి చేరలేకపోయాం. మేం వెళ్లేసరికే అంతా అయిపోయింది’’అన్నారు.కంపెనీ అంగీకారం! దాస్ హత్యోదంతంలో ఫ్యాక్టరీ తప్పేమీ లేదని సీనియర్ మేనేజర్ షకీబ్ మహ్మూద్ బుకాయించినా, సహోద్యోగుల్లో కొందరు సాయంత్రానికల్లా దాస్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారంటూ వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు! అంతేకాదు, దాస్ దైవదూషణకు పాల్పడ్డట్టు ఎలాంటి రుజువులూ దొరకలేదని కూడా అంగీకరించాడు. ‘‘మూకను శాంతింపజేసేందుకు దాస్తో ఉత్తుత్తి రాజీనామా చేయించాం. కానీ ఆ చర్యతో మూక కాదు కదా, సహోద్యోగులు కూడా శాంతించలేదు’’అంటూ హంతకుల్లో తమ ఉద్యోగులు కూడా ఉన్నట్టు పరోక్షంగా చెప్పాడు. -
నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆధునిక సాంకేతికతకు తోడు శతాబ్దాల క్రితం నాటి యుద్ధ వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్కు చెందిన 92వ పదాతిదళ బ్రిగేడ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రష్యన్ సైనికులు గుర్రాలపై పరుగులు తీస్తుండగా, ఉక్రెయిన్ డ్రోన్ వారిని వెంబడించి దాడి చేయడం కనిపిస్తుంది. కాగా రష్యా దళాలు తమ సైనిక పరికరాలను వేగంగా కోల్పోతుండటంతో, వారు గత్యంతరం లేక రవాణా కోసం గుర్రాలను ఆశ్రయిస్తున్నారని ఉక్రేనియన్ సైన్యం చెబుతోంది.వీడియోలో కనిపిస్తున్న దాడిలో డ్రోన్ నేరుగా గుర్రంపై ఉన్న సైనికుడిని లక్ష్యంగా చేసుకుంది. బాంబు పేలుడు తీవ్రతకు గుర్రం కిందపడిపోగా, సైనికుడు అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు. అనంతరం ఆ గుర్రం అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీయగా, సైనికుడు మాత్రం అక్కడే చిక్కుకుపోయాడు. ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. రష్యన్ స్థావరాలను ట్రాక్ చేసేందుకు, దాడులు కొనసాగించేందుకు ప్రస్తుతం మానవరహిత డ్రోన్ వ్యవస్థలపైనే పూర్తిగా ఆధారపడుతోందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. Earlier today, Ukrainian forces repelled a Russian cavalry assault in Donetsk Oblast. Cavalry, in this case, actually using horses. pic.twitter.com/WUlDyWachc— OSINTtechnical (@Osinttechnical) December 22, 2025సుమారు 600 మైళ్ల యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ తన నిఘా కోసం, బాంబులు వేసేందుకు రకరకాల డ్రోన్లను ఉపయోగిస్తోంది. రష్యా సైన్యం కూడా డ్రోన్ దాడుల నుండి తప్పించుకునేందుకు మోటార్ సైకిల్ యూనిట్లు వంటి తక్కువ సాంకేతికత కలిగిన పద్ధతులను ప్రయత్నిస్తోంది. చారిత్రాత్మకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో గుర్రాలను వాడారు. ఇప్పుడు ఈ 2025 నాటి హైటెక్ డ్రోన్ల కాలంలోనూ గుర్రాలను ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.మరోవైపు రష్యాలోని మయామీలో యుద్ధ శాంతి చర్చలు జరిగిన కొద్ది గంటలకే అక్కడి మాస్కోలో ఒక సీనియర్ రష్యన్ జనరల్ కారు బాంబు దాడిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా లోపల, ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటువంటి దాడులను కొనసాగిస్తూనే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: రష్యన్ జనరల్ హత్య.. ఉక్రెయిన్ ప్రమేయం? -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్ఫోన్కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
పాలసంద్రంలో కృష్ణశిల
తెల్లని నురగలతో నిండిన పాలసంద్రంలోకి పడిపోతున్న నల్లరాయిలా కన్పిస్తున్న ఈ శిల వాస్తవానికి ఒక ఉపగ్రహం. దీని పేరు ఫోబోస్. ఇది అంగారకుని చుట్టూ పరిభ్రమిస్తోంది. మార్స్కు అత్యంత సమీపంగా అంతర్గత కక్షలో తిరిగే ఈ ఫోబోస్ తాజా ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) ఇటీవల క్లిక్ మనిపించి విడుదలచేసింది. ఇమేజ్ స్పెషలిస్ట్ అయిన ఆండ్రియా లక్ ఈ ఫొటోలను అందరితో పంచుకున్నారు. ఈఎస్ఏ వారి ‘మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటార్’ ద్వారా ఈ ఫొటోలను తీశారు. ఓ పేద్ద బంగాళదుంపకు అతుక్కున్న రాయిలా ఈ ఉపగ్రహం భలేగా కన్పిస్తోందని ఒక నెటిజన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్పెట్టారు. సౌరవ్యవస్థలోనే అత్యంత వైవిధ్యమైన నేలలున్న గ్రహంగా మార్స్ పేరొందింది. విస్తారమైన అగ్నిపర్వత నేలలు, రుధిరవర్ణ ఉపరితలం మీదుగా గగనతలంలో నల్లటి ఫోబోస్ దూసుకుపోవడం ఫొటోల్లో మరింత అందంగా కన్పిస్తోంది. ఫోబోస్ వెడల్పు 27 కిలోమీటర్లు మాత్రమే. అత్యల్ప స్థాయి సహజ ఉపగ్రహాల తీరుతెన్నులను గమనించేందుకు ఇలాంటి ఫొటోలు అక్కరకొస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌదీపై మంచు దుప్పటి
రియాద్: ఎటుచూసినా ఇసుక తిన్నెలు, భగభగమండే భానుడి సెగలు, భరించరాని వేడి, అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు లెక్కలేనంత మంచు కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టాలకు పడిపోతున్నాయి. దీంతో తమ ఎడారుల్లో మంచు దుప్పట్లు పర్చుకోవడంతో సౌదీ స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంద గందరగోళానికి గురవుతున్నారు. వాతావరణ మార్పుల విపరిణామాల కారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈశాన్య సౌదీలో అత్యధికంగా మంచు కురుస్తోంది. తబుక్ ప్రావిన్స్లోని పర్వతాలన్నీ ఇసుకరేణువులపై పడిన మంచుతో దవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్ అల్–లావాజ్ పరిధిలో సముద్రమట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజెనా ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది. ఎడారి ఓడగా వినతికెక్కిన ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుకతిన్నెలన్నీ తెలుపురంగులో మిలమిలా మెరిసిపోవడం, ఒంటెల శరీరాల మీదుగా మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సముద్రమట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు ఏకంగా సున్నా డిగ్రీసెల్సియస్కు పడిపోవడం విశేషం. పలు రీజియన్లలో వర్షాలు పడటంతో వాటికి చల్లటిగాలులు తోడై ఉష్ణోగ్రతలను కనిష్టాలకు పరిమితంచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఇంతటి స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారికావడం గమనార్హం. -
న్యూజిలాండ్ భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారుచేసుకున్నాయి. సంబంధిత చర్చలు విజయవంతంగా ముగిశాయని ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్లు ఫోన్లో సంభాషించి ఒప్పందాన్ని ఖరారుచేశారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ఇరుదేశాలు ఉమ్మడిగా ముందుకుసాగనున్నాయి. న్యూజిలాండ్ నుంచి ఉన్ని, బొగ్గు, కలప మొదలు వైన్, అవకాడో, బ్లూబెర్రీల దాకా పలు రకాల ఉత్పత్తులపై 95 శాతం టారిఫ్ను భారత్ తొలగించనుంది. దీంతో ఇవన్నీ సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వచ్చే వీలుంది. భారతీయ ఎగుమతిదారుల నుంచి పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంటనూనెలు, రబ్బర్దాకా పలు రకాల ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లోకి ఎగుమతిచేసి లాభాలను కళ్లజూడనున్నారు. తయారీ, మౌలికరంగం, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనా రంగాల్లో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఆపిల్ ఎగుమతులపై టారిఫ్ ప్రయోజనాలు పొందనుంది. ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతోపాటు రెండు దేశాల మార్కెట్లలోకి సరు కుల అనుమతి, నూతన పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలపర్చుకోవడం, ఆవిష్కర్తలు, నూతన పరిశ్రమల స్థాపన సహా రైతులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులు, యువత ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ న్యూజిలాండ్ పాలు, పెరుగు, వెన్న, చీజ్ తదితర ఉత్పత్తులపై టారిఫ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. కృత్రిమ తేనె, ఆయుధాలు, మొక్కజొన్న, బాదం, వజ్రా భరణాలు, కాపర్, అల్యూమినియం ఉత్పత్తులపై గతంలో మాదిరే భారత్ టారిఫ్ విధించనుంది.వేల మంది భారతీయులకు ప్రయోజనంన్యూజిలాండ్లోని నైపుణ్య ఉద్యోగాల్లోకి ఏటా 5,000 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలను ఇచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకారం తెలిపింది. దీంతో ఆయుష్ వైద్యులు, యోగా నిపుణులు, పాకశాస్త్ర ప్రవీణులు, సంగీతం, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్యసంరక్షణ, విద్య, నిర్మాణ రంగాల్లో భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్లో చదువుకునేకాలంలో గరిష్టంగా వారానికి 20 గంటలపాటు పనిచేసుకునేందుకు అనుమతిస్తారు. డిగ్రీ కోర్సు అయితే రెండేళ్ల వర్క్ వీసా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఆనర్స్) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మెడిసిన్(స్టెమ్) గ్రాడ్యుయేట్ అయితే మూడేళ్ల వర్క్ వీసా, పోస్ట్గ్రాడ్యుయేషన్ అయితే నాలుగేళ్ల వర్క్ వీసా ఇస్తారు. ఈ ఏడాది మార్చినెలలో భారత్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పర్యటించిన కాలంలోనే ఈ ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్లో కివీపండు, ఆపిల్, తేనె దిగుబడి పెంపే లక్ష్యంగా ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా సాగు–సాంకేతికత చర్యా ప్రణాళికను రూపొందించనుంది. భారతీయ వైన్స్, స్పిరిట్లను న్యూజిలాండ్లోనూ రిజిస్ట్రేషన్ చేసే అక్కడి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ సంబంధ చట్టాలకు సవరణలు చేయనుంది. ఆయుష్, సంస్కృతి, మత్స్య, శ్రవణ దృశ్య పర్యాటకం, అటవీ, ఉద్యానవనాలతోపాటు వైద్యం, వ్యవసాయం వంటి సంప్రదాయ జ్ఞానపరంపరలోనూ సహకార దృక్పథంతో ముందుకుసాగుతాం’’ అని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందం ఖరారు స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది ఇరుదేశాల ప్రభుత్వాల పరిపాలనా సంకల్పానికి ప్రతీక’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి. -
స్టార్లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. దీంతో స్టార్లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది. -
పేరుకే ‘మిల్లీమీటర్’.. ఎలాన్ మస్క్ను టార్గెట్ చేస్తున్న పుతిన్
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్కు మద్దతు అందిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘జోన్ ఎఫెక్ట్’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ప్రస్తుతం లో-ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్లింక్ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్ యుద్ధంలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్లింక్ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్లింక్పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్ సూచిస్తోంది. -
ట్రంపరితనం.. 30 దేశాల్లో రాయబారుల తొలగింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 దేశాల్లోని రాయబారుల్ని, ఇతర సీనియర్ స్థాయి అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదులుగా వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నారు. తొలగించిన రాయబారులు, ఇతర రాయబార కార్యాలయం సీనియర్ స్థాయి సిబ్బందిని వేరే విభాగాల్లో విధులు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో అమెరికన్ పౌరులను రక్షించడం, విదేశీ వ్యవహారాలపై అధ్యక్షుడికి సలహా ఇవ్వడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి విభాగాల కిందకు వచ్చే స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఇది సాధారణ సిబ్బంది మార్పులలో భాగమేనని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వం దీన్ని అమెరికన్ ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ప్రయోజనాలను కాపాడేలా లక్ష్యంతో కొత్త రాయబారులను నియమించాలన్న ఉద్దేశమేని తెలిపింది.ప్రభావిత దేశాలుఆఫ్రికా: అత్యధికంగా ప్రభావితమైన ఖండం. బురుండి, కామెరూన్, కేప్ వెర్డే, గాబోన్, ఐవరీ కోస్ట్, మడగాస్కర్, మారిషస్, నైజర్, నైజీరియా, రువాండా, సెనెగల్, సోమాలియా, ఉగాండా ఇలా మొత్తం 13 దేశాల్లో రాయబారులు తొలగింపుకు గురయ్యారు. ఆసియా: ఫిజీ, లావోస్, మార్షల్ దీవులు, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, వియత్నాం -ఆరుదేశాలు యూరప్: ఆర్మేనియా, మాసిడోనియా, మోంటెనెగ్రో, స్లోవేకియా -నాలుగు దేశాలు మధ్యప్రాచ్యం: అల్జీరియా, ఈజిప్ట్ – 2 దేశాలు.ఇతర దేశాలు: నేపాల్, శ్రీలంక, గ్వాటెమాలా, సురినామ్లు ఉన్నారు. ఈ రాయబారులందరూ జో బైడెన్ పాలనలో నియమితులయ్యారు. అయితే, తాజాగా తొలగింపుల నేపథ్యంలో ట్రంప్.. వీరిందని తొలగించే లక్ష్యంగా బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న దేశాల్లో నిరాయబారుల వెనక్కి రావాలని ప్రకటించారు. సాధారణంగా రాయబారులు 3–4 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. అయితే, వారు అధ్యక్షుడి ఇష్టప్రకారం పనిచేస్తారు. తొలగింపుకు గురైన వారు తమ ఫారిన్ సర్వీస్ ఉద్యోగాలను కోల్పోవడం లేదు. అమెరికాకు తిరిగి వచ్చి ఇతర విభాగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ నిర్ణయం వల్ల అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో అమెరికా సంబంధాలు కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. బైడెన్ పాలనలో ఏర్పడిన కొన్ని ఒప్పందాలు మారే అవకాశం ఉంది. -
యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు
అబుదాబి: యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. వచ్చే ఏడాది నాటికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా 1.28 లక్షల కోట్ల దిర్హమ్ల పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుండి షార్జా, రాస్ అల్ ఖైమా వరకు మరిన్ని రన్వేలు, టెర్మినల్స్, స్మార్ట్ మౌలిక సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.షార్జా:2028 నాటికి షార్జా విమానాశ్రయం విస్తరణ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాస్ అల్ ఖైమా:2031 నాటికి కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది. 11 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో ఇది మధ్యప్రాచ్యంలో కీలక కేంద్రంగా మారనుంది.2043 నాటికి యూఏఈ మొత్తం 53 కోట్ల ప్రయాణికులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ విస్తరణ ప్రాజెక్టులు గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టనున్నాయని అంచనా. విమానాశ్రయాల విస్తరణతో పర్యాటక రంగం, వాణిజ్యం, ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. ఏఐ ఆధారిత సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ వినియోగం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. దోహా, ఒమాన్, బహ్రెయిన్ వంటి దేశాలతో యూఏఈ పోటీ పడనుంది. తద్వారా యూఏఈ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులు కేవలం గగనతల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
భారత్పై ట్రంప్ పగ?.. ఎందుకిలా..?
అమెరికా.. సగటు ఇండియన్ డాలర్ డ్రీమ్కు కేరాఫ్ అడ్రస్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కలను నిజం చేసుకునేందుకు లక్షలాది మంది భారతీయులు శ్వేతసౌధం ముందు వాలిపోయారు.. తమ కలను సాకారం చేసుకున్నారు కూడా. కాని.. ఇప్పుడా భారతీయుల ఆ కలలసౌధం ట్రంప్ రూపంలో కుప్పకూలుతోంది. నిమిషానికో నిబంధన, రోజుకో చట్టం తీసుకొస్తూ సగటు భారతీయుని ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో అమెరికా అంటేనే అమెరికానా..? అనేలా చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన డిపోర్టేషన్ల సంఖ్యే.అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటు భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు.. అక్కడుంటున్న అన్ని దేశాల వారి పరిస్థితీ ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్ణులా.. ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో.. ఏ రూలును ఝులిపిస్తాడో.. ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది అమెరికాలో నివశిస్తున్న విదేశీయుల పరిస్థితి. ఓ రోజు H1b అంటాడు.. మరో రోజు విద్యార్థులపై పడతాడు.. ఇంకో రోజు పన్నులంటాడు. ఇలా బతుకుదెరువు కోసం వెళ్లిన విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంపన్న. ఇలా ఏదో ఒక కారణ చెప్పి అక్కడ్నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడు.ఈ సందర్భంగా డిపోర్టేషన్కు సంబంధించి ఓ భయంకరమైన న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా ఉన్నారంటూ 3,258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్న వార్త కలకలం రేపుతోంది. 2025 జనవరి 1 నుండి నవంబర్ 28 వరకూ జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య ఇది.2024తో పోలిస్తే ఈ ఏడాది బహిష్కరణల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం. 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక సంఖ్య కూడా ఇదే. దీనిపై అమెరికన్లే తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అతి చేస్తోందని సగానికి పైగా అమెరికన్లు అభిప్రాయపడినట్లు Pew Research Centre సర్వేలో వెల్లడైంది.రాజ్యసభలో మంత్రి రామ్జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలను వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకారం బహిష్కరణకు గురైన వాళ్లంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవాళ్లు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయినవాళ్లు. అలాగే ఏ డాక్యుమెంట్లూ లేకుండా అమెరికాలో నివాశముంటున్న వారు, లేదా నేర నిర్ధారణ జరిగిన వాళ్లు.దీనిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది అక్టోబర్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్ పెద్దలు ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణల విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తోందని నమ్ముతున్నారట. అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలా అని అడిగినప్పుడు, కేవలం 31% మంది మాత్రమే అవును అని చెప్పారు. సగానికి పైగా ప్రజలు కేవలం కొందరిని మాత్రమే బహిష్కరించాలని నిర్భంయగా చెప్పారు. ఈ డిపోర్టేషన్లపై వ్యతిరేకత మార్చి నుండి అక్టోబర్ మధ్య 9 శాతం పెరిగడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరంగా ఈ మార్పు అటు రిపబ్లికన్లలో, ఇటు డెమొక్రాట్లలో కూడా కనిపించడం. అంటే ప్రతపక్షంలోనే కాదు.. అధికార పక్షంలోనూ ఈ అభిప్రాయం ఉందన్నమాట.ఈ సర్వేను మరింత డీటెయిల్డ్గా చూస్తే.. మార్చిలో కేవలం 13% మంది రిపబ్లికన్లు ప్రభుత్వం అతి చేస్తోందని భావించగా, అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 20 శాతానికి చేరింది. డెమొక్రాట్లలో ఈ అభిప్రాయం 86 శాతానికి పెరిగింది. రిపబ్లికన్లలో ఎక్కువ శాతం మంది ఇప్పటికీ అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు.వీరిలో వైట్ రిపబ్లికన్లు అత్యధికంగా ఉండగా, సుమారు 40 శాతం మంది ఆసియా రిపబ్లికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. డెమొక్రాట్లలో కేవలం 8 శాతం మంది మాత్రమే అందరినీ పంపించేయాలని కోరుకోగా, 16 శాతం మంది బ్లాక్ డెమొక్రాట్లు అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరారు. హిస్పానిక్ వర్గానికి చెందిన వారు అంటే రెండు పార్టీలలోనూ ఎవరినీ బహిష్కరించకూడదని కోరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు.మార్చి నుంచి అక్టోబర్ వరకు బహిష్కరణల విషయంలో ట్రంప్ అతి చేస్తున్నాడనే సాధారణ ఆందోళన రెండు పార్టీల్లోనూ పెరిగినప్పటికీ, వ్యక్తిగత ప్రభావం పట్ల ఆందోళన అంతగా పెరగలేదు. మార్చిలో 27 శాతం డెమొక్రాట్లు తమ ఇమ్మిగ్రేషన్ లేదా సిటిజన్షిప్ స్టేటస్తో సంబంధం లేకుండా తమకు, తమ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి బహిష్కరణ ముప్పు ఉందని ఆందోళన చెందారు.అక్టోబర్కు వచ్చేసరికి ఇది 40 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం. రిపబ్లికన్ రెస్పాండెంట్లు మాత్రం ఏడాది పాటు తమ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు. మార్చి, అక్టోబర్ రెండింటిలోనూ కేవలం 10శాతం మంది మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. హిస్పానిక్ వ్యక్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమ ఫ్రెండ్స్ డిపోర్టేషన్కు గురవుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే.. తమ ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు లేదా అరెస్టులు చేస్తున్నారని 60 శాతం మంది హిస్పానిక్ ప్రజలు తెలిపారు. ఆసియన్లలో ఈ సంఖ్య 47%, బ్లాక్ పీపుల్లో 39%, వైట్ పీపుల్లో 38% గా ఉంది.మా దేశంలోకి అడుగు పెట్టొద్దు..: ప్రపంచంలోని 20% దేశాలపై అమెరికా ఆంక్షలుఅమెరికాకు ఏమైంది.. ఆంక్షల పేరుతో నిత్యం ఏదోఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ఈ అగ్రరాజ్యం ప్రపంచ దేశాలపై మరో బాంబు వేసింది. గత కొన్ని రోజులుగా ట్రావెల్ బ్యాన్ పేరుతో కొత్త పేచీని తెరపైకి తీసుకొచ్చిన అమెరికా దాన్నిప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాల ప్రజలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చింది.ప్రధానంగా ఆఫ్రికా నుంచి వచ్చే దేశాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తూ యూఎస్లో ప్రవేశానికి పూర్తి లేదా పాక్షిక నిషేధం విధించింది. ఇది వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటికే ఉన్న ట్రావెల్ నిషేధాలు, పరిమితుల లిస్ట్లో మరిన్ని ఆఫ్రికన్, వెస్ట్ ఏషియన్తోపాటు మరికొన్ని ఇతర దేశాలను చేర్చినట్లైంది. మొత్తం నిషేధం, పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య 39కి చేరింది. టోటల్గా ఈ సంఖ్య ప్రపంచ దేశాల్లో దాదాపు సుమారు 20%. అంటే.. ప్రపంచంలోని దాదాపు 20శాతం దేశాల ప్రజలు అమెరికావైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నమాట.తాజా ట్రావెల్ బ్యాన్ విస్తరణలో అమెరికా ఐదు దేశాలపై పూర్తి ట్రావెల్ బ్యాన్ విధించింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించారు. దీంతోపాటు పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారిపై కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇవి కాకుండా మరో 15 దేశాలు పాక్షిక ట్రావెల్ పరిమితులు ఎదుర్కోనున్నాయి. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవోర్, డొమినికా, గాబన్, గాంబియా, మలావీ, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక ఆంక్షల ఈ జాబితాలో ఉన్నాయి.ఇది ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడి భారతీయులపైనా ప్రభావం పడనుంది. టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో సంపన్నులైన భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్నారు.. ఈ నిర్ణయం వీరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటితోపాటు యాంటిగ్వా, బార్బుడా వంటి కొన్ని కరీబియన్ దేశాలపై నిషేధం విధించడం జరిగింది. వీరు విదేశీయులకు ఇచ్చే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం ఇచ్చే పథకం అని తెలుస్తోంది.తొలుత ఈ ట్రావెల్ బ్యాన్ను ఈ ఏడాది జూన్లో ప్రకటించారు. అమెరికా జాతీయ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని 19 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటి దేశాలపై పూర్తి ప్రవేశ నిషేధం విధించగా.. లావోస్, వెనిజులా వంటి దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అవినీతి పరులు, క్రిమినల్స్, మోసగాళ్ల విషయంలో అమెరికా అధికారులకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలప్పుడు కష్టమవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.వీసా పరిమితి ముగిసినా ఉంటున్న వారు, తాము బహిష్కరించినా తమ పౌరుల్ని వెనక్కి తీసుకోడానికి కొన్ని ప్రభుత్వాలు నిరాకరించడం, బలహీనమైన భద్రతా సహకారం వంటి కారణాలను అమెరికా చూపుతోంది. వాషింగ్టన్ డీసీలో ఓ ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు అమెరికన్ నేషనల్ గార్డ్ సైనికులపై జరిపిన కాల్పుల ఘటనను ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా వైట్ హౌస్ పేర్కొంది.సదరు వ్యక్తికి అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు జరిగినప్పటికీ, భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. అమెరికా శరణార్థుల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసే కేంద్రంలో అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు కెన్యా జాతీయుల్ని దక్షిణాఫ్రికా అధికారులు అరెస్టు చేసి బహిష్కరించారు. వారంతా టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్కడ పనిచేస్తున్నట్లు గుర్తించారు.ఈ ట్రావెల్ బ్యాన్ ఎక్స్పాన్షన్ను కొందరు రిపబ్లికన్ శాసనసభ్యులు, ఇమ్మిగ్రేషన్ హార్డ్లైనర్లు గట్టిగా సమర్థించారు. ఇది దేశ భద్రతకు, అక్రమ వలసల్ని అరికట్టడానికి అవసరమైన సరైన చర్య అని వాదిస్తున్నారు. భద్రతా సహకారం, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్లకు విదేశీ ప్రభుత్వాలను జవాబుదారీగా చేయడం సరిహద్దు సమగ్రతను బలోపేతం చేస్తుందని వారు వెనకేసుకొచ్చారు.అయితే కేవలం జాతీయతను బట్టి ఒక దేశం మొత్తాన్ని ప్రమాదకరంగా చూడటం సరికాదని, నేర చరిత్ర లేని సాధారణ పౌరుల్ని ఇది ఇబ్బంది పెడుతుందని మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ గతంలో నార్వే, స్వీడన్ వంటి దేశాల నుండి వలసలను ఇష్టపడతానని, అభివృద్ధి చెందని దేశాలను కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. -
17 ఏళ్ల తర్వాత రానున్న ప్రధాని కుమారుడు
బంగ్లాదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత 17 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తరీఖ్ రహమాన్ బంగ్లాదేశ్ రానున్నట్లు ప్రకటించారు. ఆయన రాకకోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆదేశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రహమాన్ రాక పొలిటికల్ హీట్ను పెంచింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత తీవ్రంగా ఉంది. ఇటీవలే రాడికల్ నేత ఉస్మాన్ హాదీ ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు. ఆయన చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో అక్కడ హింస చేలరేగింది. అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు అధికారం చేపట్టిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ఈ సారి అక్కడ పోటీ చేయకుండా బ్యాన్ విధించారు. దీంతో అక్కడ అసలు పోటీ ఎవరి మధ్య జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆదేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు బంగ్లా రానున్నారు.తరీఖ్ రహమాన్ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. అక్కడే ఉంటూనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ ఛైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2008లో అవినీతి కారణాలతో ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెరుగైన చికిత్స కోసం లండన్ కెళ్లారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడడంతో లండన్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తిరిగి వస్తున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని జియారౌ రహమాన్ స్థాపించారు. బంగ్లాదేశ్లో ఇప్పటివరకూ ఆపార్టీ మూడుసార్లు అధికారం సాధించింది. చివరిసారిగా 2001-2006లో ఖలేదా జియా ఆపార్టీ తరపున ప్రధానిగా సేవలంధించారు. ప్రస్తుతం అవామీలీగ్ పోటీలో లేకపోవడంతో బీఎన్పీకి సరైన పోటీ ఇచ్చే పార్టీలు అక్కడ లేవు. -
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు!
కార్లూన్లతో పాపులర్ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది. తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, మత్తుమందులు, మానసిక ఆరోగ్యం సవాళ్లపై చర్చకు దారి తీసింది. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్. లాస్ ఏంజిల్స్లోని రివర్సైడ్లో సెప్టెంబర్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాలనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. వీటితోపాటు గుడ్ టైమ్ మాక్స్ (2007), ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.ఇదీ చదవండి: రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ Former Nickelodeon child stars are having a rough one pic.twitter.com/qN95SrxOmJ— 𓅃 (@FalconryFinance) December 21, 2025 -
మార్చురీలోనే సాజిద్ మృతదేహం
తోటి వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సాజిద్ను తాను క్షమించనని.. ఆ డెడ్బాడీని తాను చూడనని.. అంత్యక్రియలు చేయనని... పోలీసులకు స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ముష్కరదాడి కింగ్పిన్ సాజిద్ భార్య వెర్నా. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండీ ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.ఆ కాల్పులు జరిపి 16మందిని పొట్టన పెట్టుకున్న సాజిద్ అక్రమ్ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్ కుటుంబీకులను, భార్య వెర్నాను పోలీసులు కోరినా.. ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేయడానికి నిరాకరించింది. దీంతో సాజిద్ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు.ఏం జరిగింది ఆరోజుడిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండిలోని చనుకా బై ది సీ ఈవెంట్ పై ఒక్క సారిగా విరుచుకు పడ్డ సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ ఉగ్రదాడి కారణంగా ఒక్కసారిగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈవెంట్ ఒక్కసారిగా మారణహోమంగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో 16మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.సుమారు 100 మంది గాయాల బారిన పడ్డారు. ధైర్యం చేసిన మరో స్థానికుడు అహ్మద్ ధైర్య సాహసాలు ప్రదర్శించి... తూటాలకు భయపడకుండా సాజిద్ను ఎదుర్కొని ప్రాణనష్టాన్ని నివారించగలిగాడు. అప్పట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సాజిద్ను కాల్చి చంపేయడం.. అతని కుమారుడు నవీద్ను అదుపులోకి తీసుకోవడంతో డెత్గేమ్కు ఫుల్స్టాప్ పడింది. మారణకాండ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు తీవ్రవాద ఘటనను ఖండించాయి.నవీద్పై 59 కేసులుఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మారణహోమాన్ని సృష్టించిన సాజిద్ అదే రోజు చనిపోవడంతో అతని డెడ్బాడీని కరోనర్ కార్యాలయంలోని మార్చురీకి తరలించి తదుపరి దర్యాప్తుపై పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడి చట్ట ప్రకారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ భార్య వెర్నా మాత్రం ఆ డెడ్బాడీని తాను తీసుకెళ్లనని స్పష్టం చేసింది. ఈ తీవ్రవాద ఘటనలో ప్రధాన పాత్ర పోషించి పోలీసుల కాల్పుల్లో మరణించిన సాజిద్ కుమారుడు 24ఏళ్ల నవీద్ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.అతన్ని విచారించిన ఆస్ట్రేలియా పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. వీటిలో 16 హత్య కేసులు, ఉగ్రవాద చర్యకు పాల్పడిన కేసుతో పాటు తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర కేసులున్నాయి. విచారించగా... తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్లోని మిండనావోలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు, ఐసిస్ నుంచి ప్రేరణ పొందినట్లు నవీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో అనే ద్వీపంలో 1990 నుంచి ఐఎస్ తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం.దూరమైన బంధువులుఅంతటి ఘోరానికి పాల్పడ్డ సాజిద్ గురించి హైదరాబాద్లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్ ఇప్పుడు కాదు... 1998లోనే దూరమయ్యాడని... తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని... అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని టోలీచౌకీలో నివాసముంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు.ఆస్తులు కూడ బెట్టిన సాజిద్తీవ్రవాదం జీర్ణించుకున్న సాజిద్ గతంలోనే భార్యతో కూడా దూరమయ్యాడట. అయితే ఘటనకు ఆరు నెలల ముందు నుంచి భార్యతో తిరిగి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భార్య వెర్నా పోలీసులకు వివరించింది. అయినా భార్యతో కాకుండా కుమారుడితో కలిసి కాంప్సీ ప్రాంతంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందే భారీగా ఆస్తులు కూడబెట్టిన సాజిద్ తొలుత 7లక్షల డాలర్లకు మూడు పడకగదుల ఆస్తిని 2016లో కొనుగోలు చేసి భార్య వెర్నా పేరిట రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత 5 లక్షల డాలర్లతో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. అతను మరణించిన నాటికి అతని ఆస్తుల విలువ సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.మారణకాండకు పక్కా స్కెచ్మారణకాండ సృష్టించడానికి తండ్రీ కొడుకులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 14న సాయంత్రం7గంటల సమయంలో కాంప్సీ ప్రాపర్టీ నుండి బోండి బీచ్ కు వెళ్లారు. క్యాంప్ బెల్ పరేడ్ లో హ్యుండాయ్ ఎలాంట్రా కారును పార్క్ చేసి, వాహనం కిటికీపై ఐసిస్ జెండాను ఎగరవేశారు. బోండి బీచ్ నుండి మీటర్ల దూరంలో ఉన్న పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్నప్పుడు యూదు కుటుంబాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు చిక్కిన కొడుకు నవీద్ ఇచ్చిన ఆధారాలతో ఆ సాయంత్రం, సిడ్నీ నైరుతి ప్రాంతంలోని బోనీరిగ్ లోని ఒక ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు ఆ ఇంటిని వెర్నా, సాజిద్ లు కలిసి 2016లో కొనుగోలు చేశారని గుర్తించారు.ఇండియాలో నేర చరిత్ర లేదుహైదరాబాద్కు చెందిన సాజిద్ ఆస్ట్రేలియాకు వలస వచ్చిన తర్వాత ఆరుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లినట్లు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత అంశాలు, అతని వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించడం లాంటి కారణాలతోనే వచ్చి వెళ్లాడు. అయినప్పటికీ, అతని తండ్రి మరణించినప్పుడు అతను భారతదేశానికి రాలేదు. ఉపాధి నిమిత్తం 1998లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సాజిద్ 1999లోనే యూరప్కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.భారతీయ పాస్ పోర్ట్ కలిగి ఉన్న 50 ఏళ్ల సాజిద్కు ఇండియా నుంచి నేర చరిత్ర లేదు. అతను భారతదేశంలో రాడికలైజ్ అయ్యే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని అతని కుటుంబం కూడా అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని చెబుతున్నారు. ఇప్పటికీ మధ్యతరగతి అధికంగా ఉన్న టోలిచౌకిలోని ఓ ఇంట్లో సాజిద్ తల్లి, సోదరుడు నివాసముంటున్నారు. సాజిద్ గురించి.. అతని రాకపోకల గురించి తమకేమీ తెలియదని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడం గమనార్హం.ఫిలిప్పీన్స్లో నెల రోజులు తీవ్రవాద శిక్షణఅయితే తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్ లో తీవ్రవాద శిక్షణ పొందినట్లు సంకేతాలు స్పష్టం అయ్యాయి. గత నవంబర్లో నెల రోజల పాటు దక్షిణ ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన సాజిద్, నవీద్లో అక్కడే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మిండనోవా అనే ద్వీపంలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఫిలిప్పీన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఆస్ట్రేలియన్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో ద్వీపం.. 1990 దశకం నుంచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు షెల్టర్జోన్గా మారిందని... తీవ్రవాదులు తరచూ సందర్శించే మిండనోవా ద్వీపం వారికోసం ఓ హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.తండ్రీ కొడుకులిద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్ చేరుకున్నట్లు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. మిండనావోలోని దావావో నగరానికి వెళ్లే ముందు వారు మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఇద్దరూ దావావోను తమ తుది గమ్యస్థానంగా మార్క్ చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్లో ఏ విధమైన ఉగ్రవాద శిక్షణను పొందారనే అంశాలను రాబట్టేందుకు ఫిలిప్పీన్స్ అధికారులతో ఆస్ట్రేలియా పోలీసులు చర్చలు సాగిస్తున్నారు.అయితే ఐసిస్తో సంబంధాలున్నాయన్న వాదనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ తిరస్కరించారు. అయితే ఐసిస్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉందని ఫిలిప్పీన్స్ సైన్యాధికారి తెలిపారు. తిరిగి తండ్రీ కొడుకులు నవంబర్ 28న దావావో నుండి మనీలాకు కనెక్టింగ్ విమానంలో అక్కడి నుంచి బయలుదేరి సిడ్నీ చేరుకున్నారు. ఉగ్రవాదుల వాహనం నుండి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన రెండు జెండాలను స్వాధీనం చేసుకున్నారు, ఐసిస్తో సంబంధం కలిగి ఉన్నాయనడానికి కొన్ని ఆధారాలను ఆస్ట్రేలియా పోలీసులు సేకరించారు.- మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, సాక్షి డిజిటల్ -
బంగ్లాదేశ్లో మరో నేతపై కాల్పులు
తీవ్ర నిరసనలు, అ శాంతితో భగ్గుమంటున్న బంగ్లాదేశ్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.బంగ్లాదేశ్ ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశానికి చెందిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఉస్మాన్ మృతితో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు. ఢాకాలో మీడియా హౌజ్లపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా దైవదూషణ చేశారనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఆదేశంలో నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ అనే నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.దీంతో ఆయనను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ " మహమ్మద్ మోతేలాబ్ సికిదార్పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు" అని తెలిపారు.మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు. శ్రామిక్ శక్తి విభాగంలో ఈయన సెంట్రల్ ఆర్గనైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఖులానా మెట్రోపాలిటన్ యూనిట్లో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులపై కాల్పులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. -
కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత?
కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.వారికి మినహాయింపు 2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయులపై ప్రభావంఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్బర్డ్స్ -
రష్యన్ జనరల్ హత్య.. ఉక్రెయిన్ ప్రమేయం?
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మృతిచెందారు. రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ‘ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్’ అధిపతిగా పనిచేస్తున్న సర్వరోవ్, తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. వాహనం కింద అమర్చిన పదార్థం కారణంగానే పేలుడు సంభవించి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు కమిటీ ధృవీకరించింది.ఈ హత్య వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక నిగూఢ సేవల (Special Services) ప్రమేయం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో, ఇది ఉక్రెయిన్ గూఢచారి సంస్థల పథకమేనని రష్యా అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు.కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఫ్లోరిడాలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు నిర్మాణాత్మక రీతిలో సాగుతున్నాయని క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఒడేసాలోని ఓడరేవు లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 27 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని వాహనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం -
పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్బర్డ్స్
Kim Woo-bin, Shin Min-ah Wedding దక్షిణ కొరియాకు చెందిన నటి ,మోడల్ 41 ఏళ్ల షిన్ మిన్-ఆహ్ తన చిరకాల ప్రియుడు కిమ్ వూ-బిన్ను పెళ్లాడింది. డిసెంబర్ 20న సియోల్లోని జంగ్-గులోని ది షిల్లా హోటల్లోని రాయల్ హాల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గత పదేళ్లుగా సెలబ్రిటీ కపుల్గా పేరుతెచ్చుకున్న వీరిద్దరి వెడ్డింగ్కు దక్షిణ కొరియాలోని ఎంటర్టైన్మెంట్ రంగానికి పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరిలో BTS V , PD నాహ్ యుంగ్-సుక్, దర్శకుడు చోయ్ డాంగ్-హూన్, రచయిత కిమ్ యున్-సూక్, కో డూ-సిమ్, లీ బైయుంగ్-హున్, పార్క్ క్యుంగ్-లిమ్, ఉహ్మ్ జంగ్-హ్వా, గాంగ్ హ్యో-జిన్, కిమ్ యుయి-సుంగ్, యూన్ క్యుంగ్-హో, బే సియోంగ్-వూ, ఇమ్ జూ-హ్వాన్, కిమ్ టే-రి, ర్యు జున్-యెయోల్, అన్ బో-హ్యూన్, నామ్ జూ-హ్యూక్, బే జంగ్-నామ్ తదితరులు ఉన్నారు.షిన్ మిన్-ఆహ్ బ్రైడల్ గౌనుమిన్-ఆహ్ ఐకానిక్ లెబనీస్ ఫ్యాషన్ హౌస్ ఎల్లీ సాబ్ బ్రైడల్ గౌనును ఎంచుకుంది. స్ప్రింగ్ 2026 బ్రైడల్ కలెక్షన్లోని అందమైన తెల్లని గౌనులో అందంగా మెరిసింది. సొగసైన నెట్టెడ్ వీల్ భారీ గౌను ధర రూ. 25.6 లక్షలు. కిమ్ వూ-బిన్ రాల్ఫ్ లారెన్ పర్పుల్ లేబుల్ సూట్ను ధరించాడు. ప్రియుడికి కేన్సర్ వచ్చినపుడు మరింత ప్రేమతోషిన్ మిన్-ఆహ్, కిమ్ వూ-బిన్ మొదటిసారి 2015లో ఒక ప్రకటన వాణిజ్య ప్రకటనలో కలుసుకున్నారు. 2015 నుంచి డేటింగ్ ప్రారంభించారు. 2017లో కిమ్ వూ-బిన్కు నాసోఫారింజియల్ క్యాన్సర్ సోకినపుడు షిన్ అతనికి సపోర్ట్గా నిలిచింది.పరస్పరం గౌరవించుకుంటూ, కరియర్లో ఎంతో కీర్తిని, ప్రజాదరణ పొందారు. దాదాపు దశాబ్దం తర్వాత,వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరికి కోట్లాది మంది అభిమానులు శుభాకాంక్షలు అందించారు. -
Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత భారీ అణు విద్యుత్ ప్లాంట్ ‘కాషివాజాకి కరివా’ త్వరలో తెరుచుకోనుంది. జపాన్లోని ఈ ప్లాంట్ గత 15 ఏళ్లుగా పలు కారణాలతో మూతపడివుంది. ఇప్పుడు జపాన్ ఇంధన అవసరాలను తీర్చేందుకు సిద్ధం అవుతోంది. అణు విపత్తు మిగిల్చిన భయానక జ్ఞాపకాలు వెంటాడుతున్నా, దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు జపాన్ ఈ ప్లాంట్ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన రంగంలోనే జపాన్కు అతిపెద్ద ‘టర్నింగ్ పాయింట్’గా మారనుంది.పెను విపత్తు తర్వాత..2011లో సంభవించిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంట్లో కూలింగ్ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా రేడియోధార్మికత వెలువడింది. ఈ నేపధ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మూతపడిన జపాన్ అణు ఇంధన రంగం మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. నీగాటా ప్రాంతంలోని ‘కాషివాజాకి-కరివా’ అణు విద్యుత్ ప్లాంట్ పునఃప్రారంభంపై తాజాగా జరిగిన ప్రిఫెక్చురల్ అసెంబ్లీ ఓటింగ్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సారధ్యంలో ఈ ప్లాంట్ను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ హిడెయో హనాజుమి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇది కేవలం ఒక ప్లాంట్ ప్రారంభం మాత్రమే కాదు, జపాన్ ఇంధన విధానంలో వస్తున్న పెను మార్పుకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.విపత్తు జ్ఞాపకాలు.. నిరసనల హోరుఒకవైపు జపాన్ ప్రభుత్వం ప్లాంట్ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నీగాటా అసెంబ్లీ వెలుపల దాదాపు 300 మంది నిరసనకారులు.. ముఖ్యంగా వృద్ధులు 'నో న్యూక్స్' (అణుశక్తి వద్దు) అంటూ గొంతెత్తారు. ఫుకుషిమా ప్రమాదం కారణంగా నాడు తమ ఇళ్లను వదిలి వెళ్లిన బాధితులు ఇప్పటికీ ఆ భయానక జ్ఞాపకాలతో పోరాడుతున్నారు. 60 శాతానికి పైగా నివాసితులు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ నిర్వహణపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అణు ప్రమాదాల వల్ల కలిగే నష్టం మాకు ప్రత్యక్షంగా తెలుసు, ఇలాంటివి మరెక్కడా జరగకూడదు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్ధిక భారాన్ని మోసేందుకు..శిలాజ ఇంధనాల నుండి విముక్తి పొందేందుకే జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, ఇంధన భద్రత మొదలైనవి జపాన్కు అత్యంత భారంగా పరిణమించాయి. గత ఏడాది జపాన్ శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏకంగా 10.7 ట్రిలియన్ యెన్ల (రూ. 6,08,947 కోట్లు) భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. దేశ విద్యుత్ అవసరాలకు 60-70 శాతం మేరకు బొగ్గు, గ్యాస్ దిగుమతి చేసుకోవలసి రావడంతో ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సొంతంగా చౌకైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకునుందుకు అణుశక్తిని పునరుద్ధరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి సనే తకైచి ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీదే బాధ్యతగతంలో ఫుకుషిమా ప్లాంట్ను నిర్వహించిన ‘టెప్కో’ సంస్థే ఈ కాషివాజాకి-కరివా అణు విద్యుత్ ప్లాంట్ను నడపనుంది. ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ‘టెప్కో’ రాబోయే 10 ఏళ్లలో నీగాటా ప్రాంతంలో 100 బిలియన్ యెన్ల పెట్టుబడి పెడతామని హామీనిచ్చింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, ఫుకుషిమా వంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జనవరి 20 నాటికి ఈ ప్లాంట్లోని మొదటి రియాక్టర్ను యాక్టివ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్జపాన్ జనాభా కొంతమేరకు తగ్గుతున్నప్పటికీ, విద్యుత్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), భారీ డేటా సెంటర్ల స్థాపన వల్ల విద్యుత్ అవసరాలు మరింతగా పెరుగుతున్నాయి. 2040 నాటికి దేశ విద్యుత్ పరిశ్రమలో అణుశక్తి వాటాను 20 శాతానికి పెంచాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి 'డీకార్బనైజేషన్' లక్ష్యాలను చేరుకోవడానికి కూడా అణుశక్తి అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఈ ప్లాంట్ ప్రారంభించేందుకు జపాన్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్లాంట్లను నడపడం, రెండోది ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడం. ఈ దిశగా జపాన్ ముందుకు సాగుతోంది. ఇది కూడా చదవండి: విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు -
శెభాష్ అనాల్సింది పోయి… ఇంటికి పంపేశారు!
సమయానికి ఆఫీసుకు రాకుంటే శాలరీలో కోతో.. ఉద్యోగం నుంచి తీసేయడమో చూస్తుంటాం. కానీ సమయానికంటే ముందుగానే ఆపీసుకు వస్తే.. శెభాష్ అనాలిగా.. కాస్త ఇంక్రిమెంట్ ఎక్కువేయాలిగా.. కానీ ఆ కంపెనీ అలా చేయలేదు. ఆఫీసు టైముకంటే ముందుగానే వస్తున్న యువతిని ఇంటికి సాగనంపింది. స్పెయిన్లోని ఆలకాంటేలో ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే యువతి ప్రతిరోజూ ఉదయం 6.45 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆఫీసుకు వచ్చేది. వాస్తవానికి ఆమె షిఫ్ట్ ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. కానీ ఆమె అరగంట ముందే రావడం కంపెనీ యజమానికి నచ్చలేదు. 2023లోనే దీనిపై అతడు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె తన అలావాటు మార్చుకోలేదు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని ఆమె కోర్టులో సవాల్ చేసింది. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా యాజమాని పక్షానే నిలిచింది. యజమాని వద్దంటున్నా ముందు రావడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టంచేసింది. ఇక్కడ ఉద్యోగి ప్రవర్తన నమ్మకం, విధేయతపై ప్రభావం చూపిందని పేర్కొంది. సో.. ఆఫీసుకు ముందుగా వెళ్లినా ముప్పే.. సమయానికి వెళ్తే చాలు.. ఏమంటారు? -
అబ్బే.. అది ట్రంప్ బ్యాచ్ పనేం కాదట!
అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగిన వేళ.. ఎప్స్టీన్ సె* కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్లో మాయమైన ట్రంప్ ఫొటో తిరిగి ప్రత్యక్షం అయ్యింది. ఫోటోను తొలగించడంలో ట్రంప్ బ్యాచ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని, తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది.జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫొటోను, కీలక పత్రాలను డెమొక్రట్లతో కూడిన హౌజ్ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన వేల ఫొటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల ప్రతాలు ఉన్నాయి. అయితే.. అందులో నుంచి కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో డెమొక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ట్రంప్ తన భార్య మెలానియా.. ఎప్స్టీన్, అతని సహయకురాలు గిస్లేన్ మాక్స్వెల్తో దిగిన ఫొటో, అలాగే ట్రంప్ కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.ఈ చర్యను ట్రంప్ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపించారు. మరోవైపు.. హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ మళ్లీ పునఃప్రచురించింది.అయితే.. ఆ ఫొటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమే వాటిని తొలగించలేదు. ఆ ఫొటోల్లో ఎప్స్టీన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ చేసింది.ప్రముఖ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందిన జెఫ్ ఎప్స్టీన్కు ట్రంప్, బిల్గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్.. పలువురు సినీ ప్రముఖలతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే.. అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాక.. సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో.. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్గా మారింది.ట్రంప్ హయాంలో ఎప్స్టీన్ ఫైల్స్ విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమొక్రట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమొక్రట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరకు ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన ఫోటోలు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్టులు, కాల్ లాగ్స్, కోర్టు పత్రాలు ఉన్నాయి. అయితే, బాధితులను ఎఫ్బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అభియోగాలపై అంతర్గత న్యాయశాఖ నివేదికలు లేవంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే.. లక్షల పేజీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని.. బాధితుల గోప్యతను కాపాడేందుకు సమీక్ష ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఇందులో 200 మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని న్యాయశాఖ అంటోంది. సమీక్ష ముగిశాక.. అందులో వివరాలను యధాతథంగానే ప్రచురిస్తామని స్పష్టత ఇస్తోంది. -
ఆపరేషన్ సిందూర్పై మునీర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్కు దైవిక సహాయం లభించిందని ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే నెలలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల సమయంలో తమ సైన్యానికి ఏదో అదృశ్య శక్తి తోడు అందించిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంలో ‘జిహాద్’ అంశంపై మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇస్లామిక్ దేశంలో ప్రభుత్వం లేదా అధికారం ఉన్న పాలకుల అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా జిహాద్కు ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు తాముగా ఫత్వాలు జారీ చేయడం చెల్లదని అన్నారు. మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల రక్షకులుగా ఉండే గౌరవం దేవుడు తమకే ఇచ్చారని ఈ సందర్భంగా మునీర్ పేర్కొన్నారు.పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్కు అసిమ్ మునీర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్లోకి చొరబడి దాడులకు తెగబడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)గ్రూపుల్లో 70 శాతం మంది ఆఫ్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రజల రక్తాన్ని కోరుతున్న వారికి మద్దతు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. భారతదేశంతో జరిగిన ఆ నాలుగు రోజుల సైనిక ఘర్షణ ముగిసిన తీరును ఆయన విశ్లేషించారు. మే 10న కుదిరిన ఒప్పందంతో సైనిక చర్యలు నిలిచిపోయినప్పటికీ, నాడు పాకిస్తాన్కు ఎదురైన గడ్డు పరిస్థితుల నుండి దైవ కృపే రక్షించిందని అన్నారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ -
మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ
బెర్లిన్: చారిత్రక శత్రుత్వం నుంచి బలమైన రక్షణ బంధం వైపు జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలు అడుగు వేశాయి. హోలోకాస్ట్(రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన మానవ ఊచకోత) ముగిసిన 80 ఏళ్ల తర్వాత, జర్మనీ తన దేశ భద్రత కోసం ఇజ్రాయెల్ తయారు చేసిన ‘ఆరో 3’ (Arrow 3) క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. ఇది రెండు దేశాల మధ్య మారిన సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది.సుమారు 56 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ రక్షణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందంగా రికార్డు సృష్టించింది. దీనిలో భాగంగా మొదటి విడత రక్షణ సామగ్రిని ఇజ్రాయెల్ ఇప్పటికే జర్మనీకి అందజేసింది. దీంతో జర్మనీ ఆకాశానికి పటిష్టమైన రక్షణ కవచం లభించింది. HISTORIC: Israeli missile defense is now guarding Germany’s skies. 🇮🇱🇩🇪Less than 80 years after the Holocaust, Germany is relying on Jewish innovation to protect its people. From Auschwitz to Arrow 3, this is a moment the world should remember. pic.twitter.com/bDBTh6uXEq— Hananya Naftali (@HananyaNaftali) December 21, 2025ఈ ‘ఆరో 3’ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఇది భూ వాతావరణానికి అవతలే (అంతరిక్షంలోనే) గుర్తించి కూల్చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, జర్మనీ ప్రభుత్వం ఈ అత్యాధునిక సాంకేతికతను ఎంచుకుంది. ఇది ఇజ్రాయెల్ సాంకేతిక శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ వివరాలను ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ అందించింది. జర్మనీ పార్లమెంట్ ఇటీవల మరిన్ని నిధులను కూడా ఈ వ్యవస్థ కోసం కేటాయించింది. ఇది భవిష్యత్తులో ఐరోపా దేశాల రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్ -
బంగ్లా అశాంతి.. తీవ్రవాదానికి తలవంచిన మూర్ఖుల వల్లే!
బంగ్లాదేశ్లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మహమ్మద్ యూనస్కు ఏమాత్రం రాజకీయానుభవం లేకపోవడం బంగ్లాదేశ్కు శాపంగా మారిందని మాజీ ప్రధాని షేక్ హసీనా అంటున్నారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని.. భారత్లాంటి మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె. గతవారం బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాడికల్ యువ నేత షరీఫ్ ఉస్మాన్ హాది (32)ని ఓ దుండగుడు కాల్చి చంపాడు. తదనంతరం చెలరేగిన ఘర్షణల్లో.. దీపు చంద్ర దాస్ (27) అనే హిందూ యువకుడు అతికిరాతకంగా మూక హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు.ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వ పాలనను అత్యంత బలహీనంగా ఉందని.. అక్కడ చట్టాలేవీ అమల్లో లేవని అన్నారామె. ‘‘అల్లర్లు.. మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బ తీస్తాయి. ప్రపంచం దృష్టిలో ప్రతిష్ట దిగజారిపోతుంది. మరీ ముఖ్యంగా భారత్లాంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా బలహీనపరుస్తాయి’’ అని అభిప్రాయపడ్డారామె.గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని.. భారత్ ఈ పరిస్థితిని అల్లకల్లోలంగా చూస్తోందని అన్నారామె. అయితే.. బంగ్లాదేశ్ అన్ని మతాలను గౌరవించే దేశమని.. కానీ, కొంతమంది మూర్ఖుల వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజాస్వామ్యం తిరిగి స్థాపితమైతే, ఇలాంటి అశాంతి ముగుస్తుందని అభిప్రాయపడ్డారామె. యూనస్ ప్రభుత్వం జమాత్-ఇ-ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను కేబినెట్లో చేర్చుకోవడం. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రవాద శక్తులు యూనస్ను ఉపయోగించుకుంటన్నాయని.. ఇది భారత్ సహా ప్రతీ దక్షిణాసియా దేశానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారామె. -
ఉద్యోగులూ.. బాత్రూం బ్రేక్లో కాస్త జాగ్రత్త మరి..!
సాధారణంగా ఆఫీసుకు లేట్గా వస్తుంటేనో.. లేక ఇష్టమొచ్చినట్టు సెలవులు పెడుతుంటేనో ఉద్యోగం ఊడుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్లి.. గంటల తరబడి అక్కడే ఉండటంతో కొలువు పోగొట్టుకున్నాడు. చైనాకు చెందిన లీ అనే వ్యక్తి జియాంగ్సు ప్రావిన్స్లోని ఒక కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఆఫీసు సమయంలో పదేపదే బాత్రూమ్కి వెళ్లడం.. ఎక్కువసేపు అక్కడే ఉండటం కంపెనీ గమనించింది. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది. దీనిని లీ కోర్టులో సవాల్ చేశాడు. నెలరోజుల వ్యవధిలో లీ ఏకంగా 14 సార్లు అధికం సమయంపాటు బాత్రూమ్కి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలను కంపెనీ సమర్పించింది. అందులో అధికంగా నాలుగు గంటల సమయం ఉందని పేర్కొంది. అనారోగ్యం, ఇతరత్రా కారణాలరీత్యా ఎక్కువ సమయం బాత్రూమ్ బ్రేక్ తప్పనిసరి అని లీ తరఫు న్యాయవాదులు వాదించారు. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు 45వేల డాలర్లు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం వారి వాదనను తోసిపుచ్చింది. అనారోగ్య కారణాలను కంపెనీకి అతడు చెప్పని విషయం ప్రస్తావించింది. చివరకు కంపెనీ లీకి కొంతమొత్తం పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో కేసు పరిష్కారమైంది. -
నాకా పిల్ల నచ్చింది.. విడాకులివ్వు..
పెద్దాయన్ని చూశారా? చైనాకు చెందిన ఈయన వయసు 75 ఏళ్లు. ఈ ముదిమి వయసులో తన భార్యను విడాకులు ఇస్తావా లేదా అని పదేపదే ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటారా? ప్రేమలో పడ్డాడు మరి. ఈ వయసులో ఎవరితోనబ్బా అంటే.. ఏఐ జనరేటెడ్ ఆన్లైన్ మోడల్తో. జియాంగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐ మహిళా అవతార్ను చూశాడు. యువతకైతే అది ఏఐ సృష్టి అని తెలిసిపోతుంది. కానీ ఈయనకు ఆ విషయం తెలియక అమ్మాయి అని భ్రమపడ్డాడు. పైగా ఆమె అందమైన రూపానికి తోడు ఆకట్టుకునే గాత్రం, సంభాషణలు చూసి మరీ ఫిదా అయిపోయాడు. రోజూ గంటల తరబడి ఫోన్లోనే కాలం గడపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన జియాంగ్ భార్య.. గట్టిగా తిట్టడంతో భార్యతో విడిపోతే ఆమెతో కాలం గడపొచ్చని విడాకులు అడగడం మొదలుపెట్టాడు. చివరకు జియాంగ్ పిల్లలు అది ఏఐ సృష్టి అని.. నిజమైన మనిషి కాదని చెప్పి ఒప్పించేసరికి వారి తల ప్రాణం తోకకొచి్చంది. ఏం ఏఐనో ఏంటో.. ముందుముందు ఏమేం చిత్రవిచిత్రాలు చూడాలో అనిపిస్తోంది కదా? -
రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్
మాస్కో: చదువుకునేందుకు రష్యాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడ నరకం కనిపిస్తోంది. గుజరాత్లోని మోర్బికి చెందిన సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ అనే విద్యార్థి తనకు రష్యాలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనపై తప్పుడు డ్రగ్స్ కేసు మోపి, సైన్యంలో చేరకపోతే జైలుకు పంపుతామని అక్కడి పోలీసులు బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.సాహిల్ మొహమ్మద్ హుస్సేన్కు కేవలం 15 రోజుల శిక్షణ ఇచ్చి, నేరుగా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి తరలించడంతో మరో గత్యంతరం లేక, ప్రాణభయంతో అతను ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు. ప్రస్తుతం అక్కడ బందీగా ఉన్న సాహిల్, ఒక వీడియో సందేశం పంపి ‘నన్ను కాపాడండి మోదీ’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా ఈ ఘటనతో డ్రగ్స్ మాఫియా, రష్యన్ సైన్యం మధ్య జరుగుతున్న దారుణాలు బయటపడుతున్నాయి.'झूठे ड्रग्स केस में फंसा कर रूसी सेना में शामिल कराया'गुजरात के एक युवक का वीडियो इन दिनों सोशल मीडिया पर जमकर वायरल हो रहा है. ये वीडियो रूस-यूक्रेन युद्ध के बीच वायरल हुआ है. इस वीडियो में ये शख्स लोगों से अपील कर रहा है कि वो किसी भी परिस्थिति में रूसी सेना में ना शामिल… pic.twitter.com/yDVW2Ef1ZR— NDTV India (@ndtvindia) December 21, 2025ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ యువకులను టార్గెట్ చేస్తూ, స్కామర్లు వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని, కనీసం 700 మంది భారతీయులను ఇలాగే జైలు పాలు చేసి, సైన్యంలో చేరితేనే విడుదల చేస్తామని వేధిస్తున్నారని సాహిల్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆలివ్ గ్రీన్ జాకెట్ ధరించి ఉక్రెయిన్ కస్టడీలో ఉన్న ఈ విద్యార్థి వీడియో చూస్తుంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ హృదయ విదారక ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ రష్యన్ సైన్యంలో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రధాని మోదీ స్వయంగా పుతిన్తో చర్చలు జరిపారని తెలిపారు. ఇప్పటికే చాలా మందిని రక్షించామని, మిగిలిన వారిని కూడా స్వదేశానికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సాహిల్ తల్లి కూడా తన కొడుకు కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.కాగా విదేశాలకు వెళ్లే యువతకు సాహిల్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు వైరల్ అవుతోంది. "రష్యాలో ఉద్యోగాల పేరుతో లేదా చదువు పేరుతో వస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్కామర్లు మిమ్మల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికించి, యుద్ధంలోకి నెట్టేస్తారు" అని అతను హెచ్చరించాడు. రష్యన్ సాయుధ దళాల్లో చేరమని వచ్చే ఎటువంటి ఆఫర్లను నమ్మవద్దని ప్రభుత్వం కూడా మరోసారి స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: అందుకే.. పట్టాలపై గజరాజుల మృత్యుఘోష! -
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్బో ఏమాత్రం కాదు. ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్ జామ్ట్లాండ్లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో.. [07] A spectacular sun halo in Jämtland, Sweden.pic.twitter.com/YhLl9nF8nV— 𝘀𝗶𝘆𝗲𝗡𝗴𝗼 (@Mrsiyengo) December 21, 2025సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి. సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్(ఫిజిక్స్). అయినా కూడా నెటిజన్స్ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు. హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు. కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట. సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది. -
వెంటాడే గీతానికి ‘వంద’నం
‘భాయో ఔర్ బెహనో!’.. ఈ గంభీరమైన స్వరం వినిపించగానే భారతీయుల ఇళ్లలో సమయం స్తంభించిపోయేది. టీవీలు లేని కాలంలో.. ఇంటర్నెట్ ఊసే లేని రోజుల్లో.. సరిహద్దులు దాటి వచ్చి మన గుండె తలుపులు తట్టిన ఆ అద్భుతమే ’రేడియో సిలోన్’. ఆసియాలోనే మొదటి కమర్షియల్ షార్ట్–వేవ్ స్టేషన్గా వెలిగిన ఈ రేడియో, ఈ వారంతో విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక చరిత్ర.. ఒక ప్రస్థానం డిసెంబర్ 16, 1925న అధికారికంగా ప్రారంభమైన ఈ రేడియో సర్వీస్, ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్ సాంగ్స్ లైబ్రరీని కలిగి ఉంది. భారత్లో కూడా దొరకని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ దేశాల నేతల గొంతులు ఇక్కడ భద్రంగా ఉండటం విశేషం. 1949లో ’రేడియో సిలోన్’గా మారి, 1967లో ’శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఎస్ఎల్బీసీ)గా రూపాంతరం చెందినా, శ్రోతల మనసుల్లో మాత్రం అది ఎప్పటికీ ’రేడియో సిలోన్’ మాత్రమే.. అమీన్ సయానీ మ్యాజిక్.. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలవుతోందంటే చాలు.. రేడియో దగ్గర జనం గుమిగూడేవారు. అమీన్ సయానీ తన అద్భుత గళంతో హిందీ సినిమా పాటల ర్యాంకింగ్స్ను ప్రకటిస్తుంటే, ఆ ఉత్కంఠే వేరు. 1952 నుండి 1988 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ’బినాకా గీత్మాల’ భారతీయులను ఉర్రూతలూగించింది. నేటికీ శ్రీలంక రేడియోలో ’కోరా కాగజ్ థా యే మన్ మేరా’ వంటి పాత బాలీవుడ్ పాటలు వినిపిస్తుంటే, అదొక మధురమైన కాలయానమే.. పీవో బాక్స్ 574.. ఉత్తరాల వెల్లువ అప్పట్లో రేడియో సిలోన్కు వచ్చే ఉత్తరాల సంఖ్య చూసి శ్రీలంక తపాలా శాఖ ఆశ్చర్యపోయేదట. ముఖ్యంగా ’ఆల్ ఆసియా ఇంగ్లిష్ సర్వీస్’ కోసం భారత్ నుండి వేల సంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ‘అప్పట్లో ఉత్తరాల వెల్లువను తట్టుకోవడానికి ‘పీవో బాక్స్ 574, కొలంబో’ అనే ప్రత్యేక చిరునామాను సృష్టించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ ఉత్తరాల్లో అత్యధికం సికింద్రాబాద్ నుండే వచ్చేవి. ఆ తర్వాత ముంబై, షిల్లాంగ్ నుంచి ఉండేవి’.. అని ప్రస్తుత నిర్వాహకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ పరిణామాలకు సాక్షి ప్రస్తుతం ఎల్బీసీ సింహళ, తమిళ, ఇంగ్లిష్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సేవలు అందిస్తోంది. 70,000కు పైగా మ్యూజిక్ రికార్డులు, 78 ఆర్పీఎం నాటి పాత కాలపు రికార్డుల నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఈ రేడియో అన్నీ చూసేసింది. ఎవరెస్ట్ శిఖరారోహణ వార్త దగ్గర నుండి, మనిషి చంద్రుడిపై అడుగు పెట్టిన విశేషాల వరకు ప్రపంచ పరిణామాలన్నింటికీ సాక్షిగా నిలిచింది. తరాలు మారినా.. తరగని మమకారం ప్రైవేట్ రేడియోలు, మ్యూజిక్ యాప్లు ఎన్ని వచ్చినా.. రేడియో సిలోన్ అందించిన ఆ అనుభూతి సాటిలేనిది. క్లాసికల్ నుండి పాప్ వరకు, జాజ్ నుండి కంట్రీ మ్యూజిక్ వరకు శ్రోతలకు షడ్రసోపేతమైన విందు వడ్డించిన ఈ రేడియో సర్వీస్, మరో వందేళ్ల పాటు తన ప్రయాణాన్ని దిగి్వజయంగా కొనసాగించాలని కోరుకుందాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌదీలో ‘మధు’మాసం!
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఒకప్పుడు ’మద్యం’ మాట వినిపిస్తేనే కఠిన శిక్షలు ఉండేవి. కానీ, ఇప్పుడక్కడ క్రమేపీ వాతావరణం మారుతోంది. దశాబ్దాల నిషేధాన్ని పక్కన పెట్టి, అత్యంత రహస్యంగా మద్యం విక్రయాలను విస్తరిస్తోంది సౌదీ ప్రభుత్వం.నిశ్శబ్దంగా.. నిషా వైపు! రియాద్లోని ’డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఒక గుర్తు తెలియని దుకాణం ఉంది.. బయట బోర్డు ఉండదు. లోపలికి కెమెరాలను రానివ్వరు. 2024 జనవరిలో కేవలం ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం మొదలైన ఈ దుకాణం తలుపులు ఇప్పుడు మరికొందరికి తెరుచుకున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే, ’ప్రీమియం రెసిడెన్సీ’ ఉన్న విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. రక్షణ మామూలుగా లేదు! ఈ దుకాణంలోకి వెళ్లడం అంత సులభం కాదు. ప్రవేశ ద్వారం దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. ఆఖరికి మీరు పెట్టుకున్న కళ్లద్దాలు కూడా ’స్మార్ట్ గ్లాసెస్’ ఏమో అని సిబ్బంది తనిఖీ చేస్తారు. ధరల విషయానికి వస్తే.. దౌత్యవే త్తలకు పన్ను ఉండదు కానీ, ఈ కొత్త వినియోగదారులకు మాత్రం జేబులు ఖాళీ కావల్సిందే.ఇప్పుడిక రియాద్లోనే ‘కిక్కు’ ఇప్పటి వరకు మందు తాగాలనిపిస్తే సౌదీ వాసులు పక్కనే ఉన్న బహ్రెయిన్ ద్వీపానికో లేదా దుబాయ్కో వెళ్లేవారు. కొంతమంది స్మగ్లింగ్ చేసిన మందును భారీ ధరకు కొనేవారు. కానీ, తాజా మార్పులతో ధనవంతులైన విదేశీయులకు ఇప్పుడు రియాద్లోనే ’కిక్కు’ దొరుకుతోంది. సౌదీలో సినిమాలు వచ్చాయి, మహిళలు డ్రైవింగ్ సీట్ ఎక్కారు, ఇప్పుడు మద్యం దుకాణాలు కూడా వచ్చేశాయి. అయితే ఇది కేవలం విదేశీయులకే పరిమితమా? లేక భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తుందా?.. అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, సౌదీలో ఈ ’లిక్కర్ ఎక్స్పెరిమెంట్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దశాబ్దాల నిషేధం! సౌదీలో మద్యం ఎందుకు నిషేధించారో తెలుసా? 1951లో సౌదీ వ్యవస్థాపక రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ, మద్యం మత్తులో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ను కాల్చి చంపాడు. ఆ చేదు జ్ఞాపకంతో అప్పట్లో మద్యంపై కఠిన నిషేధం విధించారు. ఇప్పుడు విజన్ 2030లో భాగంగా మొహమ్మద్ బిన్ సల్మాన్ మళ్లీ మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజులా చమురు ట్యాంకర్ను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మడురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నారు. వెనెజులాకు చెందిన చమురు ట్యాంకర్ను శనివారం ఆ దేశ తీరానికి సమీపంలోనే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇలా అడ్డగించడం ఇది రెండోసారి. ఆంక్షలు విధించిన ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ నెల 10న అమెరికా బలగాలు మొదటిసారిగా ఓ ట్యాంకర్ను నిలువరించాయి. తాజా చర్యను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ధ్రువీకరించారు. సెంచరీస్ అనే పేరున్న ట్యాంకర్పైకి అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా దిగుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చే ఆయిల్ రవాణాను అమెరికా అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. పనామాకు చెందిన ముడిచమురు ట్యాంకర్ సెంచరీస్ ఇటీవల వెనెజులా తీరంలో కనిపించినట్లు మెరైన్ ట్రాఫిక్ అనే సంస్థ తెలిపింది. అయితే, సెంచరీస్ ట్యాంకర్ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నదీ లేనిదీ వెల్లడించలేదు. ఈ పరిణామంపై రక్షణ శాఖ గానీ, వైట్హౌస్ అధికారులు గానీ స్పందించలేదు. అయితే, అమెరికా చర్యలను నేరపూరితంగా వెనెజులా అభివర్ణించింది. ‘ఈ అంశాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం. అమెరికాను వదిలేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాం’అని స్పష్టం చేసింది. -
అంధకారంలో శాన్ఫ్రాన్సిస్కో
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో భారీ విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది. డిసెంబర్ 20న జరిగిన ఈ ఘటనలో 1,30,000 ఇళ్లకు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని రిచ్మండ్, ప్రెసిడియో, గోల్డెన్ గేట్ పార్క్ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ఈ విద్యుత్ అంతరాయం PG&E కంపెనీ వినియోగదారులలో మూడో వంతు మందిని ప్రభావితం చేసింది.రెస్టారెంట్లు, షాపులు మూతపడ్డాయి. వీధి దీపాలు, క్రిస్మస్ అలంకరణలు ఆరిపోయాయి. దీంతో తాము కరెంట్ కోతతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు,ఫొటోల్ని షేర్ చేస్తున్నారు.నగరవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్టాండ్,రైల్వేస్టేష్టన్లు కార్యకాలపాలు ఆగిపోయాయి.ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అత్యవసర ప్రయాణాలు తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు8వ స్ట్రీట్ సమీపంలో ఉన్న పీజీ అండ్ ఈ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో కొంత భాగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.సాయంత్రం 4గంటలకు సమస్యల్ని నివారించినట్లు విద్యుత్శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తామోనన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. -
తులసి గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: తులసి గబ్బార్డ్.. ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేని పేరు. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా కొనసాగుతున్న ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. తాజాగా,‘ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం’అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. AmFest 2025 పేరుతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఇటీవల పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులపై ఘాటుగా స్పందించారు. ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అందుకే చట్టపరమైన, రాజకీయ వ్యవస్థల ద్వారా ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె ఈ సందర్భంగా.. న్యూ జెర్సీ నగరాన్ని మొదటి ముస్లిం నగరంగా పేర్కొన్నారు. అక్కడ ఇస్లామిక్ సిద్ధాంతాలను చట్టాల ద్వారా,లేదంటే బలవంతంగా అమలు చేస్తున్నారు. ఇది కేవలం భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటికే అమెరికా సరిహద్దులలో జరుగుతోంది. హ్యూస్టన్ వంటి నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇస్లామిజం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించే రాజకీయ సిద్ధాంతం.ఇస్లామిజం ఉన్నచోట వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం ఉండదు. ఇది అమెరికా స్వేచ్ఛా వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం. అమెరికా వ్యవస్థ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అనే నమ్మకంపై ఆధారపడి ఉందని, ఇస్లామిక్ సిద్ధాంతాలు ఈ మూల సూత్రాన్ని విస్మరిస్తాయని పునరుద్ఘాటించారు. అయితే,ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ, మతపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించారు. -
ఢాకా యూనివర్సిటీ.. బంగబంధు పేరును తొలగించి..
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రముఖ విద్యాసంస్థ ఢాకా యూనివర్సిటీ బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హాల్కు కొత్త పేరు పెట్టారు. యూనివర్సిటీ నిర్వహించిన సమావేశంలో ఈ హాల్ను షరీఫ్ ఉస్మాన్ హాది హాల్గా పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం.బంగ బంధు అంటే బంగ్లాదేశ్ మిత్రుడు అని అర్థం. ఇది దేశ జాతిపిత, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్కు ఇచ్చిన గౌరవ బిరుదు. ఆయన బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి ప్రధాన కారకుడు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ బిరుదుతో ఆయనను గౌరవిస్తారు. తాజాగా యూనివర్సిటీ హాల్ పేరును షరీఫ్ ఉస్మాన్ హాది హాల్గా మార్చడం చర్చకు దారి తీసింది.వర్సిటీ అధికారులు ఈ మార్పు విద్యార్థుల డిమాండ్లు, చారిత్రక సందర్భాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చేశారని సమాచారం. షరీఫ్ ఉస్మాన్ హాది బంగ్లాదేశ్ విద్యా రంగంలో, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన సేవలకు గౌరవం తెలిపినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది.కొంతమంది విద్యార్థులు ఈ మార్పును స్వాగతించారు. ‘హాది త్యాగాలు, కృషి గుర్తింపు పొందడం సంతోషకరం’ అని అభిప్రాయపడ్డారు. అయితే, బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీక. ఆయన పేరును తొలగించడం సరైంది కాదని విమర్శించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ‘చరిత్రను మార్చడం కంటే, కొత్త హాళ్లకు కొత్త పేర్లు పెట్టడం మంచిది’ అని సూచించారు.ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో రాజకీయ చర్చలకు దారితీసింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక హాళ్ల పేర్ల మార్పు భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఢాకా విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన బంగ బంధు పేరు తొలగించడం వల్ల పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు కొత్త నాయకుడి సేవలకు గౌరవం, మరోవైపు దేశ స్థాపకుడి వారసత్వాన్ని తగ్గించడం అనే రెండు కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
సౌదీలో ఇక మద్యం విక్రయాలు.. వీరికి మాత్రమే
రియాద్: అరబ్ దేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ముస్లిమేతర విదేశీయులకు మద్యం విక్రయాలకు అనుమతిచ్చేలా షరియా చట్టాల్ని సడలించినట్లు తెలుస్తోంది. విజన్ 2030 సౌదీ లిబరలైజేషన్ పేరుతో ప్రస్తుతం దేశాన్ని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి విభిన్న రంగాలకు విస్తరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సౌదీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సౌదీ అరేబియా ఇప్పటివరకు షరియా చట్టం ప్రకారం మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. కానీ ఇటీవల ప్రభుత్వం ముస్లిమేతరల (Non-Muslim Expats) కోసం ప్రత్యేకంగా మద్యం విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం సౌదీ అరేబియా దేశ సామాజిక, ఆర్థిక, పర్యాటక రంగాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావించబడుతోంది.కొత్త విధానంతో ముస్లిమేతర విదేశీయులు ప్రత్యేక లైసెన్స్ పొందిన స్టోర్లలో మద్యం కొనుగోలు చేయొచ్చు. ఈ కొనుగోళ్ల విషయంలో కఠిన నిబంధనలు వర్తిస్తాయి. సౌదీ అరేబియా విజన్ 2030 ప్రణాళికలో భాగంగా పర్యాటకాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మద్యం విక్రయాలతో పాశ్చాత్య దేశాల నుండి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సౌదీ (saudi arabia) యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ఆధ్వర్యంలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఈనిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పలువురు సౌది రాజు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే మరికొందరు మాత్రం మద్యం అమ్మకాలతో షరియా చట్టాల్ని అతిక్రమించడమేనంటూ తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా రాజు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ వర్గాల నుంచి అంటే పర్యాటకరంగం మీద ఆధారపడే హోటల్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సడలించిన షరియా నిబంధనలు కారణంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు,పర్యాటక రంగానికి గణనీయంగా ఆదాయ మార్గాలు పెరగడం, కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తీరు మార్చుకోకుంటే.. బంగ్లాదేశ్కు దబిడి దిబిడే..!
బంగ్లాదేశ్.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా మహ్మద్ యూనస్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగెన ఉన్న భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. గతంలో భారత్ చేసిన త్యాగాన్ని మరిచి మరీ బంగ్లాదేశ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ది కీలక పాత్ర అనేది చరిత్రను అడిగితే చెబుతుంది,. మరి అటువంటిది బంగ్లాదేశ్ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. నిశితంగా గమినిస్తున్న భారత్..కొంతకాలం క్రితం మహ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉన్న సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్ తెగ ఆరాటపడిపోతంది. ఆ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురి నేతల వెంట కూడా వస్తుంది. ఈ వ్యవహారాల్ని గమనిస్తు ఉన్న భారత్.. వారి వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది. ఒకనాడు పాకిస్తాన్కు మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్.. బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్.. ‘వారి వెనుక ఎవరున్నారు’ అనే విషయంపై కన్నేసి ఉంచింది. గతంలోనే ప్రధాని మోదీ వార్నింగ్..!ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహ్మద్ యూనస్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ నాల్గో తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ఆనాడు యూనస్ ఏమన్నారంటే..ఏప్రిల్ మొదటి వారంలో యూనస్.. భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశారు. సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూసఫ్ తెగ తంటాలు పడిపోతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. భారత్పై మరోసారి పరోక్షంగా అక్కసు..శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నముహమ్మద్ యూనస్..హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు. అంటే భారత్పై పరోక్షంగా యూనస్ వ్యాఖ్యానించట్లైంది. భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్గా హాది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశీయుల అనుసరిస్తున్నారని యూనస్ అంటున్నారు. అంటే ఆ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరో చోటా నేత సైతం..బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.పాక్ను మోకరిల్లేలా చేసిన వేళను మరిచారా?1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. సుమారు 300,000 నుండి 3,000,000 మంది వరకు బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా. పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 200,000 నుండి 400,000 వరకూ అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు. ఆనాడు భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహోసపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్ ఆటనును 13 రోజుట్లోనే కట్టించింది. డిసెంబర్ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై సాధించిన విజయంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్గా మారింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాక్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగబాటుగా కూడా రికార్డులెక్కింది. పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్ ఇంతటి త్యాగం చేస్తే.. మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదువ్వడానికి సిద్దం కావడం. ఒకటైతే.. అప్పుడ పాకిస్తాన్కు ఎదురైన అతి పెద్ద పరాభవం.. నేటి బంగ్లాదేశ్ ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే. -
దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మళ్లీ తూటా పేలింది. జోహన్నెస్బర్గ్లో జరిగిన ఆగంతకులు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆదివారం జొహన్నెస్బర్గ్ శివారులోని బెకర్స్డాల్ టౌన్షిప్లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. 🚨🇿🇦 BREAKING - MASS SHOOTING IN SOUTH AFRICA: 10 KILLED, 10 INJUREDGunmen stormed a tavern in Bekkersdal Township and opened fire on a crowd without warning.The attackers fled before police arrived, leaving victims dead and wounded across the scene.No suspects have been… pic.twitter.com/ChXsPxgEwl— Mario Nawfal (@MarioNawfal) December 21, 2025దక్షిణాఫ్రికాలో కఠినమైన ఆయుధ చట్టం అమల్లో ఉంది. ఫైర్ఆర్మ్స్ కంట్రోల్ యాక్ట్ 2000 ప్రకారం.. గన్ లైసెన్స్ పొందడానికి కంపిటెన్సీ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీసుల అనుమతి తప్పనిసరి. అలాగే ఆయుధాన్ని భద్రంగా ఉంచే చోటును కూడా పరిశీలిస్తారు. అయినప్పటికీ గన్ కల్చర్ ఆ దేశంలో పెద్ద సమస్యగా మారింది. సామూహిక కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటన్నాయి. దక్షిణాఫ్రికాలో నెల వ్యవధిలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన ఇది (Mass Shooting In South Africa). ఈ నెల 6న ప్రిటోరియా సమీపంలో అక్రమంగా మద్యం అమ్మే చోట దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో సహా 12 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. -
రాడికల్ నేత ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో యూనస్ ప్రతిజ్ఞ
ఢాకా: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. గత వారం గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించిన హాదికి వేలాదిమంది నివాళులు అర్పించారు.అంత్యక్రియల సందర్భంగా యూనస్ మాట్లాడుతూ.. ఇది వీడ్కోలు కాదు, ఒక ప్రతిజ్ఞ. హాది మాకు చెప్పిన మాటలను మేం నెరవేరుస్తాం. మా తరాలే కాదు, రాబోయే తరాలూ ఈ వాగ్దానాన్ని కొనసాగిస్తాయి. హాది ప్రజలతో మమేకమయ్యే తీరును, రాజకీయ దృక్పథాన్ని యూనస్ ప్రశంసించారు. ఆయన మానవత్వం, జీవన విధానం, రాజకీయ ఆలోచనలను దేశం ఎప్పటికీ మర్చిపోవని పేర్కొన్నారు.ప్రపంచం ముందు తల ఎత్తుకుని నడుస్తాం. ఎవరి ముందూ తలవంచం అని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనాలన్న హాది ఆశయాన్ని యూనస్ గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందని చెప్పారు.32 ఏళ్ల హాది బంగ్లాదేశ్లో 2024 విద్యార్థి ఉద్యమ సమయంలో వెలుగులోకి వచ్చాడు. అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారం కోల్పోవడానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు. ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలతో హాది గుర్తింపు పొందాడు. ఢాకాలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో ఆయనపై జరిగిన కాల్పులకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపధ్యంలో సింగపూర్లో చికిత్స పొందుతూ హాది మృతి చెందాడు.ఈ ఘటనలో అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత్కు పారిపోయి ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. దాంతో న్యూఢిల్లీ–ఢాకా మధ్య దౌత్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హాది మరణం తర్వాత ఢాకా సహా పలు నగరాల్లో భారీ నిరసనలు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో అక్కడి సిబ్బంది చిక్కుకుపోయిన ఘటనలు కూడా జరిగాయి. -
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతోంది. డెడ్లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధిం తాజాగా.. 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్స్టీన్ క్రైమ్ పార్ట్నర్ గిస్లేన్ మ్యాక్స్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన ఫైల్స్లో ట్రంప్కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది హౌజ్ ఓవర్సైట్ కమిటీలోని డెమొక్రట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు.. ఆ ఫైల్స్ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై అధ్యక్ష భవనం వైట్హౌజ్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా?.. ఏదైనా కారణంతో చేశారా? అనేదానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో.. బాధితులను దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే.. ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్ట్ తర్వాత అతన్నొక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే.. జాప్యం చేస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.లేటెస్ట్ రిలీజ్లో.. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. అలాగే.. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఐల్యాండ్స్లోని విలాసాలు.. అలాగే కొన్ని నగ్న ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్లో, పూల్లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫొటోల్లో.. ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. -
ట్రయల్ రూమ్ @ నెక్ట్స్ లెవల్
కెమెరా క్లోజప్లో ఒక హైటెక్ టచ్ స్క్రీన్. పక్కనే కళ్లు జిగేల్మనే రంగురంగుల దీపాలు. బయట వేలాదిమంది సందడి చేసే షాపింగ్ మాల్. కానీ అందులోని ఓ చిన్న గదిలోకి వెళ్లగానే అంతా మాయా ప్రపంచం. మీరు ఎంపిక చేసే సంగీతం బీట్కు తగ్గట్టుగా గోడలు రంగులు మారిపోతాయి. అద్దం ముందు నిల్చున్నప్పుడు మీరొక సామాన్య కస్టమర్లా.. కాదుకాదు.. ఏదో గ్లామర్ వరల్డ్ సూపర్ స్టార్లా ఫీలైపోతారు..దుబాయ్లోని ప్రసిద్ధ హెచ్ అండ్ ఎం స్టోర్లో సార్థక్ సచ్దేవా అనే భారతీయ యువకుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా మనం ట్రయల్ రూమ్లోకి వెళ్తే బట్టలు వేసుకుని చూసుకుని వచ్చేస్తాం. కానీ ఈ స్టైలిష్ డ్రెస్సింగ్ రూమ్ మాత్రం వేరే లెవల్. సార్థక్ సచ్దేవా షేర్ చేసిన ఈ వీడియో, షాపింగ్ అనుభవాన్ని సాంకేతికత ఎలా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపుతోంది. నాలుగు రకాల మూడ్స్.. ఆ ట్రయల్ రూమ్ లోపల ఒక టచ్ స్క్రీన్ ప్యానెల్ ఉంటుంది. అందులో నాలుగు ఆప్ష న్లు ఉంటాయి. ఫుల్ ఎనర్జీతో కూడిన సంగీతం.. దానికి తగ్గట్టుగా వేగంగా మారే కాంతి కిరణాలు. ట్రయల్ రూమ్ లోని టచ్స్క్రీన్ ప్యానెల్ ద్వారా యూజర్లు తమకు నచి్చన సంగీతాన్ని ఎంచుకోవచ్చు. వాటిలో హైప్, వైబ్, చిల్, లోకల్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వైబ్: పార్టీ మూడ్ని సెట్ చేసే విజువల్స్. చిల్: ప్రశాంతమైన సంగీతం, ఆహ్లాదకరమైన రంగులు. లోకల్: అక్కడి నేటివిటీని ప్రతిబింబించే సంగీతం. తాకితే చాలు మతిపోతోంది సార్థక్ ఒక్కొక్క ఆప్షన్ని టచ్ చేస్తుంటే.. ఆ గది గోడలపై ఉన్న స్క్రీన్లు డైనమిక్ విజువల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సంగీతం మారిన ప్రతిసారీ లైటింగ్ సింక్ అవుతూ సెకన్లలో గది వాతావరణాన్ని మార్చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘దుబాయ్ ఎక్కడో ఉందనుకున్నాం.. ఇది నెక్సŠట్ లెవల్‘ అని ఒకరంటే.. ‘నాకు ఇలాంటి ట్రయల్ రూమ్ దొరికితే అసలు బయటికే రాను’.. అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు. అందమైన అనుభవాల గది సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందంటే.. బట్టలు సరిపోయాయో లేదో చూసుకునే ఒక సాదాసీదా గదిని కూడా ఒక మధుర సంగీతానుభవాల లోకంగా మార్చేసింది. షాపింగ్ అంటే కేవలం వస్తువు కొనడం కాదు, అదొక అందమైన.. అద్భుతమైన జ్ఞాపకం కూడానని దుబాయ్ మరోసారి నిరూపించింది. మీరు కూడా ఇలాంటి ట్రయల్ రూమ్ లోకి వెళ్తే మొదట ఏ సంగీతం ప్లే చేస్తారో ఊహించుకోండి..! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ ఎప్ స్టీన్ కలకలం
వాషింగ్టన్: అమెరికన్లు కొద్ది రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జెఫ్రీ సెక్స్ కుంభకోణం తాలూకు మరిన్ని ఫైల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ మహిళలను, ముఖ్యంగా బాలికలను సరఫరా చేసిన వైనం 20 ఏళ్ల కింద అమెరికాలో సంచలనం రేపడం తెలిసిందే. దాని తాలూకు ప్రకంపనాలు ఇప్పటికీ సద్దుమణగలేదు. అయితే తాజా ఫైల్స్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. విపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్లో, పూల్లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్లో ఉన్నాయి. 20 ఏళ్ల కేసు: 2005 మార్చిలో ఒక బాలిక కుటుంబం ఫిర్యాదుతో ఎప్ స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయ తదితర ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ పలువురు బాలికను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనాగ్రహం నేపథ్యంలో అరెస్టైన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్ స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు.ఆయుర్వేదం ప్రస్తావన!ఎప్ స్టీన్ ఫైల్స్లో ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. ’5 వేల ఏళ్ల పురాతనమైన భారత సహజ చికిత్సా ప్రక్రియను ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది అనుసరిస్తున్నారు’ అని వాటిలో పలుచోట్ల చెప్పుకొచ్చారు. అంతేగాక ’మసాజ్ చేసే కళ’ పేరిట పలు వ్యాసాలు కూడా వాటిలో ఉన్నాయి! -
చక్రాల కుర్చీలో అంతరిక్ష యాత్ర
హూస్టన్: జర్మన్ ఏరోస్పేస్, మెకాట్రానిక్స్ ఇంజనీర్ మైఖేలా మిచీ బెంథాస్ చరిత్ర సృష్టించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె చక్రాల కుర్చీలోనే అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ శనివారం ఉదయం న్యూ షెఫర్డ్ ఎన్ఎస్–37 సబ్ అర్బిటాల్ మిషన్ను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి వ్యోమనౌకలో బెంథాస్తోపాటు మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో కాసేపు విహరించి, భూమికిపైకి క్షేమంగా తిరిగివచ్చారు. వీల్చైర్లో కూర్చొని అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఇదే మొదటిసారి. దివ్యాంగులు సైతం ఇలాంటి యాత్రలు చేయొచ్చని బెంథాస్ నిరూపించారు. ఆమె గతంలో మౌంటెన్ బైకింగ్ చేస్తుండగా గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయినప్పటికీ అంతరిక్షం పట్ల జిజ్ఞాస తగ్గలేదు. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు. -
పార్లమెంట్ ముట్టడికి యత్నం
ఢాకా: ‘ఇంక్విలాబ్ మంచ్’నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వేలాది మంది జనం బంగ్లాదేశ్ పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం పార్లమెంట్ వైపు ర్యాలీగా దూసుకొస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అతికష్టంమీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో హదీ మృతదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ –ఇ–ఇస్లామీ, నేషనల్ సిటిజెన్ పార్టీ నేతలు, కార్యకర్తలు సహా వేలాది మంది జనం తరలివచ్చారు. ‘ఢిల్లీ లేదా ఢాకా.. ఢాకా, ఢాకా’, ‘హదీ రక్తం వృథా కావడానికి వీల్లేదు’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ ఉనికి ఉన్నంతవరకూ హదీ జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ఉంటాయని మహ్మద్ యూ నస్ నివాళులర్పించారు. హదీ అంత్యక్రియల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హదీ మృతదేహాన్ని చూడడానికి సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా శనివారం సంతాప దినంగా పాటించారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న హదీపై దుండగులు కాల్పులు జరిపారు. పరిస్థితి విషమించడంతో సింగపూర్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే బంగ్లాదేశ్లో జనం ఆందోళనకు దిగారు. గురువా రం రాత్రి పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై, పత్రికా కార్యాలయాలపై దాడులు జరిగాయి. అల్లరిమూక దాడిలో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్ మృతిచెందాడు. శుక్రవారం కల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు వెల్లడించారు. జాతీయ కవి సమాధి పక్కనే.. షరీఫ్ ఉస్మాన్ హదీ మృతదేహాన్ని పార్ల మెంట్ నుంచి ఢాకా యూనివర్సిటీ క్యాంపస్కు తరలించారు. క్యాంపస్ మసీదు సమీపంలో బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ సమాధి పక్కనే ఖననం చేశారు. 1976లో నజ్రుల్ ఇస్లామ్ను ఇక్కడ సమాధి చేశారు. ఆయన తిరుగుబాటు కవిగానూ పేరుగాంచారు. హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తన కవితలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. నజ్రుల్ ఇస్లామ్ కవితలను హదీ తన ప్రసంగాల్లో తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. దీపూచంద్ర హత్య కేసులో పది మంది అరెస్టు బంగ్లాదేశ్లో హదీ హత్య నేపథ్యంలో హిందూ కారి్మకుడు దీపూచంద్ర దాస్(25)ను కొట్టి చంపిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. గురువారం అల్లరి మూక దీపూచంద్రను దారుణంగా కొట్టి చంపి, దహనం చేసిన సంగతి తెలిసిందే. -
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా,ఇజ్రాయెల్
జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళనఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.భవిష్యత్ ప్రభావంఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు. -
చైనాకు షాక్.. తైవాన్తో యుఎస్ భారీ డీల్
చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న వేళ వాషింగ్టన్, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. తైవాన్తో 11బిలియన్ డాలర్ల భారీ డీల్ చేసుకుంది. ఒక ద్వీపానికి ఇంత పెద్దమెుత్తంలో ఆయుధాలు అమ్మడం యూఎస్ చరిత్రలో ఇదే తొలిసారని ఆదేశ వర్గాలు తెలిపాయి. ఈడీల్తో చైనా-యుఎస్ మధ్య సంబంధాలు మరోసారి భగ్గుమనే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ సమయంలో పన్నులు పెంచుతాడో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రాగన్ కంట్రీతో ట్రేడ్ వార్కు దిగారు. ఈ పన్నుల యుద్ధం కొంత తగ్గి ఇప్పుడిప్పుడే రెండు దేశాల బంధాలు కొలిక్కి వస్తన్నాయనే తరుణంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు.చైనా తమ భూభాగంగా ప్రకటిస్తున్న తైవాన్తో, అమెరికా, 11 బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రి అమ్మకానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్లో ఆధునాతన రాకెట్ సిస్టమ్స్, యాంటీ టాంక్ మిస్సైల్స్, డ్రోన్స్ లాంటి అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నట్లు పెంటగాన్ ప్రకటించింది. తైవాన్ తన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని యుఎస్ తెలిపింది.ఈ భారీ ఒప్పందంపై తైవాన్ స్పందించింది. తమకు ఇంత భారీ మెుత్తంలో ఆయుధ సరఫరా చేస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలని తైవాన్ అధికారులు తెలిపారు. తన జాతీయ భద్రతను కాపాడడంలో ఎటువంటి రాజీపడేది లేదని వారు ప్రకటించారు. ఇటీవలే ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 40 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ప్రకటించినట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఖండించింది. ఈ ఆయుధాల ఒప్పందంతో తైవాన్లో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని తెలిపింది.చైనా దేశం తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమే అని ఆరోపిస్తుంది. అయితే తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించుకుంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా వివాదం చెలరేగుతుంది. -
భాలూకా ఘటన.. యూనస్ సర్కార్పై ఆగ్రహజ్వాలలు
బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మత దూషణ ఆరోపణలతో హిందూ మతానికి చెందిన ఓ యవకుడ్ని కొట్టి చంపి.. దహనం చేశారు. రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాలో మళ్లీ కల్లోలం చెలరేగగా.. హిందూ యువకుడి హత్య ఆ అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది.ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మైమన్సింగ్ జిల్లా భాలూకా ఉపజిల్లాలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్పై గురువారం రాత్రి మూక దాడి జరిగింది. కొందరు దుండగులు అతణ్ని మతపరంగా దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. ఆపై చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. మళ్లీ కొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించడం.. కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.ఈ ఘటనను బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఎక్స్ వేదికగా స్పందించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ఉస్మాన్ హాది మతసామరస్యం కోసం పాటు పడ్డాడని.. కాబట్టి శాంతియుతంగా ఉండాలని అతని అనుచరులకు యూనస్ పిలుపు ఇచ్చారు. మయమన్సింగ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని.. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.భారత వ్యతిరేకి అయిన రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. హిందూ యువకుడి మూక హత్య మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. స్క్వేర్ మాస్టర్బరీ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు దీపూ చంద్ర దాస్. అయితే..ఇస్లాంకు వ్యతిరేకంగా అతను వ్యాఖ్యలు చేశాడంటూ స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు మత వ్యతిరేక నినాదాలు చేస్తూ అతన్ని ఫ్యాక్టరీ ఆవరణలోనే చితకబాది.. అతి కిరాతకంగా హత్య చేసి హైవేపై అతని మృతదేహాన్ని తగలబెట్టారు. తన కుటుంబానికి ఏకైక ఆధారం తన కొడుకేనంటూ.. అలాంటోడిని భయానకంగా చంపారంటూ జరిగిన ఘటనను వివరిస్తూ దాస్ తండ్రి రవిలాల్ కంటతడి పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఘటనపై భారత్లో పలువురు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు సహా ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ను దాడి చేసి చంపడం దారుణం. నాగరిక సమాజంలో మతం, కులం, గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస, హత్యలు జరగడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరం. బంగ్లాదేశ్లో హిందూ, క్రైస్తవ, బౌద్ధ మైనారిటీలపై పెరుగుతున్న హింసను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. వాళ్ల భద్రత, రక్షణ అంశాన్ని ఢాకాతో బలంగా ప్రస్తావించాలి అని అన్నారామె.ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘1971లో భారత సైన్యం చేసిన త్యాగాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది. అప్పట్లో సుమారు 3,900 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, 10,000 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ పుట్టుక కోసం వారు పోరాడారు. కానీ నేడు అదే నేలపై నిరపరాధ మైనారిటీల రక్తం కారడం బాధాకరం. ప్రస్తుతం అక్కడ శాంతి అనే పదం మాటల్లో మాత్రమే కనిపిస్తోంది.. వాస్తవంలో మైనారిటీలపై హింస కొనసాగుతోంది. బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రైస్తవ ఐక్య మండలి నివేదిక ప్రకారం.. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 2,400కి పైగా మైనారిటీలపై దాడులు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అన్యాయంగా జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ నేత ప్రదీప్ భౌమిక్ లించింగ్.. ఇప్పుడు దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కేవలం ఖండనలతో ఆగిపోకుండా, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, యునైటెడ్ నేషన్స్ (UN) మైనారిటీల పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు.జిహాదీల ఉత్సవం అది..బహిష్కృత బంగ్లాదేశ్ రచయిత, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ ఈ ఉదంతంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ పథకం ప్రకారమే.. దీపు దాస్ హత్య జరిగిందని అన్నారామె. దీపు చంద్ర దాస్ మరో మతాన్ని కించపరిచాడన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఫ్యాక్టరీలో సహోద్యోగితో జరిగిన గొడవతో అతన్ని బలి పశువు చేశారు. తప్పుడు ప్రచారంతో అతనిపై మూక దాడి జరిగింది. పోలీసులు అతన్ని రక్షించి కస్టడీలోకి తీసుకున్నప్పటికీ.. చివరికి మళ్లీ వాళ్ల చేతికి అప్పగించారు. తాను అమాయకుడినని దీపు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అతన్ని ఉరి వేసి, కాల్చేసి “జిహాదీ ఉత్సవం” జరిపింది. దీపు తన కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్నాడు. అతని సంపాదనతో వికలాంగ తండ్రి, తల్లి, భార్య, చిన్నారి జీవనం సాగించేవారని ఆమె చెప్పారు. ఇప్పుడు కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో, నేరస్తులను ఎవరు శిక్షిస్తారో ప్రశ్నించారు? అని అన్నారామె.భారతీయులకు ఇప్పటికే హెచ్చరికబంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు ఇప్పటికే భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి’’ అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు. అయితే భాలూకా ఘటనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు. Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq— ANI (@ANI) December 20, 2025 -
డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు
అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.చైనా ప్రధాన ఆరోపణలుబీజింగ్లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్ను కోరింది.భారత్ వాదనచైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠగత అక్టోబర్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే.. -
సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) దళాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలను టార్గెట్ చేసి అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. కాగా, ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్కు చెందిన ఉగ్రవాది దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. ఈ సందర్బంగా సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు.- The U.S. Armed Forces launched Operation Hawkeye Strike, a large-scale retaliatory operation targeting dozens of Islamic State (ISIS) and ISIS-affiliated military sites across northern and central Syria.The strikes were conducted in direct respo...pic.twitter.com/dcxWpkV28p— Ashley Williams (@ashley_wil38239) December 20, 2025ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో ఈ దాడులు ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సమూహాన్ని లక్ష్యంగా చేసుకునే అమెరికా ప్రయత్నానికి పూర్తిగా మద్దతు ఇస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక. మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినవలసి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు.CENTCOM releases footage from Operation Hawkeye Strike , a massive retaliatory assault on ISIS in Syria.Over 100 precision munitions used by U.S. & Jordanian forces to destroy 70+ ISIS targets across northern & central Syria. pic.twitter.com/xsC15zkqOe— TRIDENT (@TridentxIN) December 20, 2025మరోవైపు, పీట్ హెగ్సెత్ స్పందిస్తూ.. సిరియాలోని ఐసిస్ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్ ప్రారంభించాయని తెలిపారు. అయితే, ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. U.S. forces deliver decisive retaliation against ISIS in Syria following the attack that claimed the lives of two American soldiers. Operation Hawkeye Strike is underway, A-10 Warthogs, Apache helicopters, and other assets launching into the night to dismantle ISIS targets.… pic.twitter.com/ouxNAl6cfp— Freyja (@FreyjaTarte) December 20, 2025 -
తైవాన్లో దారుణం.. మెట్రో వద్ద విచక్షణారహిత దాడి
తైపీ: తైవాన్ రాజధాని తైపీలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జనంపై కత్తి, పొగ గ్రనేడ్తో దాడికి దిగాడు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత నిందితుడు ఓ భవనం ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని 27 ఏళ్ల చాంగ్ వెన్గా గుర్తించారు.ఈ సందర్భంగా తైవాన్ ప్రీమియర్ చో జంగ్-తాయ్ మాట్లాడుతూ.. రాజధాని తైపీలోని మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు చాంగ్ వెన్కు నేర చరిత్ర ఉంది. అతడిపై వారెంట్లు కూడా ఉన్నాయి. అతను ఉద్దేశపూర్వకంగా స్మోక్ బాంబులను విసిరి.. ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశాడు. ఇందుకోసం పొడవైన కత్తిని ప్రయోగించినట్లు కనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. BREAKING: 3 killed, 5 injured as knife attacker goes on rampage in central Taipei, Taiwan after setting off smoke bombs at main train station — Reuters pic.twitter.com/04zgmAZs8T— Rapid Report (@RapidReport2025) December 19, 2025 -
ఉక్రెయిన్పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్కాల్స్కు సైతం నేరుగా లైవ్లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల సాయం ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. -
వైట్ హౌస్ సైట్లో... ప్రైవేట్ వీడియో!
వాషింగ్టన్: వైట్ హౌస్.జిఒవి/లైవ్. అత్యంత పటిష్టమైన సెక్యురిటీ వాల్స్ ఉండే, అత్యంత సురక్షితమైన అమెరికా ప్రభుత్వ సైట్. అందులో సాధారణంగా అధ్యక్షుని ప్రసంగాల లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. అంతటి ముఖ్యమైన సైట్ కాస్తా గురువారం రాత్రి పొద్దు ఉన్నట్టుండి పెట్టుబడి పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. అలా ఏకంగా 8 నిమిషాల పాటు సాగింది. తీరా చూస్తే అది మాట్ ఫార్లే అనే ఓ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో చెప్తున్న ఇన్వెస్టిమెంట్ సంబంధిత చిట్కాల తాలూకు లైవ్ స్ట్రీమింగ్. దాంతో అసలిదెలా జరిగిందో తెలియక విస్తుపోవడం వైట్ హౌస్ సిబ్బంది పనయింది. ఇది హ్యాకర్ల పనా, లేక తమవాళ్లే పొరపాటున స్ట్రీమ్ చేశారా అన్నది తేల్చడంలో వాళ్లిప్పుడు తలమునకలుగా ఉన్నారు. ’దీన్ని సీరియస్గానే తీసుకున్నాం. విచారణ జరుపుతున్నాం’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాంతో, దీనితో తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ ఫార్లే చెప్పుకొచ్చాడు. మనవాడు అక్కడితో ఆగలేదు. ‘నా స్ట్రీమ్ అంత పెద్ద సైట్లో అంతమందికి రీచ్ అవుతుందని ముందే తెలిస్తే బాగుండేది! ఇంకాస్త బాగా తయారై కనిపించేవాడిని. ఇంకొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్లు కాస్త నాటకీయ జోడించి మరీ చెప్పేవాడిని‘ అంటూ హాస్యమాడాడు! గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రభుత సైట్లు డిజిటల్ సెక్యూరిటీ బ్రీచ్ బారిన పడుతున్న ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. గత మే లో పలువురు అధికారులు, ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలకు అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెసేజీకు, కాల్స్ వెళ్లి పెద్ద కలకలమే రేపాయి. ఇక గత ఏడాది ట్రంప్ ఎన్ని ప్రచార వేళ ఇరాన్ హ్యాకర్లు ఏకంగా ఆయన ప్రచార సైట్లలోకి చొరబడ్డారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ మంటలు
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యాకాండ అగ్గి రాజేసింది. ఈ హత్య పట్ల ఆగ్రహానికి గురైన జనం వీధుల్లోకి వచ్చారు. విధ్వంసం సృష్టించారు. పత్రికా కార్యలయాలపైనా విరుచుకుపడ్డారు. గురువారం రాత్రంతా హింసాకాండ కొనసాగింది. అసిస్టెంట్ ఇండియన్ హైకమిషన్ కమిషనర్ నివాసంపై రాళ్లు రువ్వారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రెహా్మన్ నివాసాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు దాడి చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో దీపూచంద్ర దాస్(25) అనే కారి్మకుడు మరణించాడు. ఆటోలో వెళ్తుండగా హదీపై కాల్పులు షరీఫ్ ఉస్మాన్ హదీ గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా వ్యతిరేక రాడికల్ లీడర్గా యువతలో గుర్తింపు పొందాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. ఈ నెల 12వ తేదీన సెంట్రల్ ఢాకాలోని విజోయ్నగర్ ప్రాంతంలో ప్రచారానికి ఆటోలో వెళ్తున్న హదీపై ముసుగులు ధరించి బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. సరిగ్గా తలపై కాల్చడంతో కుప్పకూలిపోయాడు. ఒక చెవిలోకి దూసుకెళ్లిన తూటా మరో చెవి నుంచి బయటకు వచి్చంది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో సింగపూర్కు తరలించారు. ఆరు రోజుపాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యం విషమించి గురువారం మృతిచెందాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ఈ విషయాన్ని స్వయంగా టీవీలో ప్రకటించారు. దాంతో జనంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హదీ మరణాన్ని జీరి్ణంచుకోలేక వీధుల్లో విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాజ్షాహీ సిటీలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. నిరసనకారుల ముసుగులో అల్లరిమూకలు రెచ్చపోయాయి. గురువారం రాత్రంతా దాడులు జరిగాయి. రాజధాని ఢాకాలో నిరసనకారులు ఛాయానత్ అనే సాంస్కృతిక సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఫరి్నచర్ను బయటపడేసి నిప్పుపెట్టారు. బంగ్లా పత్రికలు ప్రొథోమ్ అలో, డెయిలీ స్టార్ కార్యాయాలపైనా దాడులు జరిగాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు..హదీని హత్య చేసిన దుండుగులు భారత్కు పారిపోయారని ఆరోపిస్తూ నేషనల్ సిటిజెన్ పారీ్ట(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు భారత్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దుండగులను వెనక్కి తీసుకొచ్చేదాకా భారత హైకమిషన్ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంయమనం పాటించాలని యూనస్ వినతి హింసాకాండ పట్ల మొహమ్మద్ యూనిస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంయమనం పాటించాలని, దాడులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. హదీని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హంతకులపై దయ చూపించే ప్రసక్తే లేదన్నారు. శనివారం సంతాపం దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వాయిదా తప్పదా? బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఇంతలోనే షరీఫ్ ఉస్మాన్ హత్య జరగడం, విధ్వంసం ప్రారంభం కావడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.రిజర్వేషన్లతో మొదలైన రగడ → ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా(రిజర్వేషన్లు) వ్యవస్థను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రారంభించిన పోరాటం చివరకు ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి దారితీసింది. → 1971 నాటి బంగ్లా విమోచన ఉద్యమం పాల్గొన్నవారి వారసులకు ఉద్యోగాల్లో ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2024 జూలైలో ఆందోళన ప్రారంభించారు. ఇది ‘జూలై తిరుగుబాటు’గా పేరుగాంచింది. → షేక్ హసీనా తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆందోళనకారులు పోరాటం ఉధృతం చేశారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మైనారీ్టలపై విచ్చలవిడిగా దాడులు జరిగా యి. → చేసేది లేక షేక్ హసీనా అప్పటికప్పుడే దేశం విడి చిపెట్టి వెళ్లిపోవాల్సి వచి్చంది. భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కలి్పంచింది. → నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. → షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. → మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని, 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని మొహమ్మద్ యూనస్ ప్రకటించారు. → ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడం సంచలనాత్మకంగా మారింది. దీపూచంద్ర దాస్ను కొట్టి చంపారు బంగ్లాదేశ్లపై మైనారీ్టలైన హిందువులపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. 25 ఏళ్ల దీపూచంద్ర దాస్ను గురువారం రాత్రి దారుణంగా కొట్టి చెట్టుకి కట్టి ఊరి తీశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దీపూచంద్ర దాస్ మైమెన్సింగ్ సిటీలో ఓ ఫ్యాక్టరీలో కారి్మకుడిగా పని చేస్తున్నాడు. దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అల్లరిమూక అతడిని హత్య చేసినట్లు బంగ్లా ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. దీపూచంద్ర హత్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. అతడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కచి్చతంగా శిక్షిస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్ను గడగడలాడిస్తా.. షరీఫ్ ఉస్మాన్ హదీపై కాల్పులు జరిపిన దుండుగుల్లో ఫైజల్ కరీంను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కాప్రణాళికతోనే హదీని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ హత్య తర్వాత దేశమంతటా తీవ్రస్థాయిలో అలజడి రేగుతుందని అతడు ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న హదీపై కాల్పులు జరగ్గా, అంతకుముందు రాత్రి ఢాకా శివార్లలోని ఓ రిసార్ట్లో ఫైజల్ కరీం తన గర్ల్ఫ్రెండ్ మరియా అఖ్తర్ లీమాతో ఉన్నాడు. బంగ్లాదేశ్ను వణికించే పెద్ద సంఘటన జరగబోతోందని ఆమెతో చెప్పాడు. దేశాన్ని గడగడలాడించబోతున్నానని పేర్కొన్నాడు. మరుసటి రోజే మరో ఇద్దరితోపాటు కలిసి హదీపై కాల్పులు జరిపాడు. -
బంగ్లాలో దారుణం.. హిందూ యువకుడిని చంపి ఆపై..
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా స్క్వేర్ మాస్టర్ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి. -
Green Card: ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్గా ప్రసిద్ధి చెందిన గ్రీన్కార్డ్ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఎంఐటీ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటనకు కారణం పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నేవెస్ వాలెంటే (48)నని అమెరికా పోలీసులు గుర్తించారు. వాలెంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు గ్రీన్ కార్డ్ లాటరీని అస్త్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులు అమెరికాలో అడుపెట్టేందుకు అనర్హులు. అందుకే, అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు USCIS గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపివేస్తోంది’ అని తెలిపారు. గ్రీన్కార్డ్ కేటాయింపులు ఇలాప్రతి సంవత్సరం 50వేల గ్రీన్కార్డులను అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల అభ్యర్థులు ఉంటారు. 2025 లాటరీకి దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో కుటుంబ సభ్యులను కలుపుకొని 1,31,000 మందిని ఎంపిక చేశారు. పోర్చుగీస్ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రోగ్రామ్ను అమెరికా కాంగ్రెస్ సృష్టించింది. కాబట్టి దీని నిలిపివేతపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో గ్రీన్కార్డ్ లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ ప్రకటించారు.ఇదిలా ఉండగా..ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాలపై చర్చకు దారితీశాయి. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య.. అమెరికాలో స్థిరపడాలనుకున్న విదేశీయులపై ప్రతికూల ప్రభావం పడనుంది.The Brown University shooter, Claudio Manuel Neves Valente entered the United States through the diversity lottery immigrant visa program (DV1) in 2017 and was granted a green card. This heinous individual should never have been allowed in our country. In 2017, President Trump…— Secretary Kristi Noem (@Sec_Noem) December 19, 2025 -
రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది!
బ్రస్సెల్స్: యూరప్ రాజధాని బ్రస్సెల్స్ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.ఇటీవల యురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు. కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతుల తిరుగుబాటుకు కారణంయురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.FARMERS BLOCK ROADS, BURN TIRES IN BRUSSELS to protest EU free trade deal and CARBON TAXESCritics say the deeply-unpopular policies will damage food security and farmer livelihoods in markets#BrusselsFarmersProtest #Brussels pic.twitter.com/X1kricxwBn— Mjrocksss (@Mritunjayrocks) December 19, 2025 రణరంగంగా గ్రీస్మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది. ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.Streets of Brussels woke up to a spud storm after farmers protested the EU -literally lining the streets with potatoes.#EuropeanUnion #Brussels #EuropeanParliament #farmers #BrusselsFarmersProtest#farming #NoFarmersNoFood pic.twitter.com/8ZbTkmcusR— MidnightVisions (@MidnightVision5) December 19, 2025 -
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్వర్క్ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
దుబాయ్లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025 -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్ను తీసుకొచ్చింది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్స్టాగ్రామ్లో చేసే పోస్ట్ లేదంటే రీల్కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్ట్యాగ్లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్స్టాలో 30 హ్యాష్ట్యాగ్లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్ట్యాగ్లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్ట్యాగ్లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్కు సంబంధించిన బ్యూటీ హ్యాష్ట్యాగ్లు వాడితే.. ఆ కంటెంట్ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్ను పడితే ఆ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్ట్యాగ్లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్ట్యాగ్ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్ట్యాగ్లు వాడితే మీ కంటెంట్ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫారమ్లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్ట్యాగ్లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
బరిలోకి అమెరికా.. చైనా వ్యూహం ఏంటి?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగియక ముందే.. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచింది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది.మరోవైపు.. తైవాన్కు రక్షణగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్కు 1,110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్య శ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వ ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం తమకు, అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించి ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేస్తుందని పేర్కొంది.ఏమిటీ వివాదం?చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి.BREAKING; CHINA warns the United States to "immediately stop" arming TAIWAN.China strongly condemned the United States for approving a massive $11.1 billion arms sale package to Taiwan, with officials urging the US to "immediately stop" arming the island.Chinese Foreign… pic.twitter.com/bDstNkNDJk— Global Surveillance (@Globalsurv) December 19, 2025అమెరికాకు సంబంధమేంటి?చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన.చైనా దాడికి దిగేనా?తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోదని విశ్లేషకులు చెబుతున్నారు.యుద్ధ సవాళ్లు.. ఒకవేళ చైనా, తైవాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే.. దీని ప్రభావం ఆసియాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. తైవాన్ ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్ ఉత్పత్తి చేసే దేశం. Taiwan Semiconductor Manufacturing Company (TSMC) ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్ తయారీదారుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. ఏఐ, స్మార్ట్ఫోన్ల తయారీ, రక్షణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, తైవాన్ సమస్యపై యుద్ధం జరిగితే అది కేవలం ద్వైపాక్షికంగా కాకుండా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. తైవాన్కు అమెరికా, చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం మీద.. తైవాన్ భవిష్యత్తు కేవలం ఆసియా భద్రతకే కాదు, ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా ఉంది. -
తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!
లక్ష కిలోమీటర్లు.. మనిషి శరీరంలోని చిన్నా పెద్దా నరాల పొడవు ఇది!. ప్రమాదం కొద్దో లేక ఇంకో కారణంతోనో ఈ నరాలు తెగాయి అనుకోండి. అతుకుపెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెట్టినా అవి మునుపటిలా పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. నరాలు సరిగ్గా అతుక్కోకపోతే స్పర్శజ్ఞానం పోవచ్చు. లేదంటే విపరీతమైన నొప్పి బాధపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం లాంటి విపరీత సమస్య కూడా ఎదురు కావచ్చు. అయితే.. ఇకపై ఈ సమస్యలు చాలావరకూ లేకుండా పోతాయి. ఎందుకంటారా? అమెరికాలోని ఓ కంపెనీ తెగిన నాడులను సరిగ్గా అతుకుపెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరి!. తెగిన నరాలను వైద్యులు ఇప్పటివరకూ కుట్లు వేయడం ద్వారా మాత్రమే జత చేస్తున్నారు. చాలా సూక్ష్మమైన నరాల విషయానికి వచ్చినప్పుడు మైక్రోస్కోపుల్లో చూసుకుంటూ కుట్లు వేస్తూంటారు. ఫలితంగా నాడుల్లో సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టిసియం అనే సంస్థ ‘కోఆప్టియమ్ కనెక్ట్’ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కొత్త టెక్నాలజీలో కుట్లు వేయడం అన్నది ఉండనే ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన ఒక చిన్న గొట్టం లాంటిది తయారు చేస్తారు. రెండుపక్కల తెగిన నరాలను జొప్పించి దగ్గరకు తీసుకొస్తారు. ఆ తరువాత గొట్టానికి రెండు చివర్లలో ప్రత్యేకమైన బయో ప్లాస్టిక్ జిగురులాంటిది వేసి సీల్ చేస్తారు. అంతే.. తెగిన నరాల భాగాలు రెండూ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సహజసిద్ధంగా కలిసిపోతాయి. కొంత సమయం తరువాత గొట్టం, బయో ప్లాస్టిక్ కూడా నిరపాయకరంగా శరీరంలోకి కలిసిపోతాయి. వాస్తవానికి ఈ టెక్నాలజీని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంతో కాలం క్రితమే అభివృద్ధి చేసింది. జెఫ్రీ కార్ప్ అండ్ బాబ్ లాంగర్స్ ల్యాబ్లో దీనిపై ప్రయోగాలూ జరిగాయి. విజయవంతమయ్యాయి కూడా. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత నాడుల పనితీరు పూర్వ స్థితికి చేరుకోవడమే కాకుండా.. కనీసం ఏడాది పాటు ఎలాంటి నొప్పి కూడా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చికిత్స కేవలం నాడులకు మాత్రమే పరిమతం కాకపోవడం. శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చే హెర్నియాతోపాటు గుండె కణజాలం అభివృద్ధి వరకూ వేర్వేరు చోట్ల వాడుకునే అవకాశం ఉంది. టిసియం సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. గుండె, హెర్నియా తదితర విషయాలకు సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్తో సహా ఏడుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎవరీ గ్రెగ్ బిఫిల్ రేసింగ్తో మక్కువతో కరియర్లో ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్ అని రేషింగ్ అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్మ్యాన్ ట్రక్ సిరీస్లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్లో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు.రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ, సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్కు నివాళులర్పించింది. రేసింగ్తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ❗️⚠️🇺🇸 - A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025 Oh no!! Horrible breaking news!!Greg Biffle, a NASCAR champion has gone down in a plane crash with his wife and children. Three others perished as well. One was a man and his son.Just 26 mins after takeoff the plane tried to return but crashed. pic.twitter.com/4c2ieDpQaB— Jennifer 🟥🔴🧙♀️🦉🐈⬛ 🦖 (@babybeginner) December 19, 2025 -
భారత్ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ మృతి.. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది(32) మరణ వార్త బంగ్లాదేశ్లో అగ్గి రాజేసింది. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు హాది తలపై కాల్పులు జరపడంతో సింగపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ హాది మరణించాడని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. ఆస్తులను ధ్వంసం చేశారు.కాగా.. తీవ్రవాద భావజాలం, 2024 బంగ్లాదేశ్లో తిరుగుబాటు నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. అధికారుల వైఫల్యమే హాది మృతికి కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన ‘డైలీ ప్రథమ్ ఆలో’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. అలాగే, ఢాకాలోని కవ్రాన్ బజార్లోని కార్యాలయానికి నిప్పుపెట్టారు. గంటలతరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకొన్నాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్పైనా దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. అయితే, ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. VIDEO | Dhaka, Bangladesh: Daily Star newspaper building was attacked in Dhaka following death of Sharif Osman Hadi, a prominent leader of the July Uprising and a spokesperson of the Inqilab Manch who was shot last week. Protests erupted in Dhaka as soon as the news of his death… pic.twitter.com/wJSfbc0E01— Press Trust of India (@PTI_News) December 18, 2025మరోవైపు.. హాది మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగాయి. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదిని హత్య చేశారంటూ.. అవామీ లీగ్, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, అవామీ లీగ్ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆస్తులను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్లో యూనస్ ప్రసంగిస్తూ.. షరీఫ్ ఉస్మాన్ హాది మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అలాగే, శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.#WATCH | Bangladesh: Visuals of the aftermath from The Daily Star office in Dhaka, which was burned down by protesters. After the death of Osman Hadi, a key leader in the protests against Sheikh Hasina, Bangladesh has erupted in unrest, and two newspaper offices have been set… pic.twitter.com/dpKn5h97fI— ANI (@ANI) December 19, 2025ఇక, బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 2026 జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలలో హాది అభ్యర్థిగా ఉన్నారు. అయితే, డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి తలపై తీవ్ర గాయం కావడంతో హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. Bangladeshis are burning down offices of Newspapers as a protest to the death of their beloved islamic terrorist Osman Hadi. Osman Hadi was responsible for crimes against women too. pic.twitter.com/4mX4ql2wbA— Lord Immy Kant (@KantInEastt) December 18, 2025 -
తైవాన్కు రూ.లక్ష కోట్ల ఆయుధాలు
వాషింగ్టన్/బీజింగ్: చైనాతో టారిఫ్ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ వ్యవస్థలు(హైమార్స్), 420 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(అట్కామ్స్), 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హొవిట్జర్ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. -
భారతీయులకు పెరిగిన హెచ్–1బీ కష్టాలు
వాషింగ్టన్: తెంపరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల హెచ్–1బీ వీసా కష్టాలు మరింత పెరిగాయి. అమెరికా వ్యతిరేక, పాలస్తానా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు, పోస్ట్లు చేసే విదేశీయులను తమ గడ్డమీద అడుగుపెట్టకుండా, హెచ్–1బీ, హెచ్4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ గత వారం ఆయా వీసా దరఖాస్తుదారుల సోషల్మీడియా ఖాతాల ముమ్మర పరిశీలన మొదలెట్టడం తెల్సిందే. అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా హెచ్–1బీ వీసాల ఇంటర్వ్యూలను 2026 అక్టోబర్దాకా వాయిదావేస్తున్నట్లు చాలా మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అక్టోబర్కైనా తమ వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందో లేదంటే 2027 జనవరికి మరోసారి వాయిదాపడతాయా? అనే సందిగ్దావస్థ భయాందోళనలు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్వ్యూలను గతంలోనే 2026 ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేయడం తెల్సిందే. జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఖరారైన వేరే దరఖాస్తుదారులు వాటిని రద్దుచేసుకుంటే వాళ్ల స్థానంలో తమకు అవకాశం లభిస్తుందేమోనన్న ఆశ ఈ అక్టోబర్కు రీషెడ్యూల్ అయిన దరఖాస్తు దారుల్లో కన్పిస్తోంది. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్సైట్ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.


