International
-
తప్పుదారి పట్టించావు.. నెతన్యాహుపై మండిపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు?
పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. ట్రంప్ ఏమో చర్చల ఫలప్రదమవుతున్నాయని ప్రచారం చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చకుండా యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం విషయంలో ఇరాన్ని తక్కువ అంచనా వేశాడనేది కాదనలేని వాస్తవం. ఆయన అనుకున్న విధంగా యుద్ధం కొద్ది రోజుల్లో ముగియలేదు కదా నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో జేడీవాన్స్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం, ఇరాన్లో అధికార మార్పుపై ఉన్న అవకాశాలపై నెతన్యాహుకు ఉన్న విశ్వాసం గురించి వాన్స్ ఆయనను నిలదీసినట్లు కథనాలుపేర్కొన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానికి చేసిన ఫోన్కాల్లో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలడం చాలా సులభమని, యుద్ధం త్వరగా ముగుస్తుందని నెతన్యాహు గతంలో ఇచ్చిన హామీలు తప్పని వాన్స్ మండిపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జేడీ వాన్స్ను బలహీనపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఒక సీనియర్ అమెరికా అధికారి ఆరోపించారు. ఇరాన్ ప్రతినిధులు వాన్స్లో చర్చలుకే మెుగ్గుచూపుతన్నారని వస్తున్న వార్తలు వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందని ఇది వాన్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడితో చర్చలు జరపకపోతే ఎవరితోనూ జరపలేదని ఆయన పేర్కొన్నారు.అయితే సాధారణంగా జేడీ వాన్స్ విదేశీ యుద్ధాల్లో అమెరికా పాత్రపై వ్యతిరేకంగా ఉంటారు. అయితే గతంలోనూ అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ' విషయంలో తనకు, వాన్స్కు మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే గతంలో యుద్ధాల విషయంలో అమెరికా చేసిన తప్పులు పునరావృతం కాకూడదని వాన్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం మరో ముగింపు లేని యుద్ధం కాకూడదని అందుకే నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. -
నాటో, ఈయూ సమాచారం కోసం .. చైనా లింక్డిన్ వల ?
యూరోపియన్ భద్రతా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లను ఉపయోగించి నాటో (NATO) ఐరోపా సమాఖ్య (EU) సంస్థల నుండి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.నకిలీ లింక్డిన్ ఖాతాల ద్వారా సైనిక కూటమి (నాటో) లేదా ఐరోపా సమాఖ్య (EU) సంస్థలకు చెందిన డజన్ల కొద్దీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో రిక్రూట్ చేసుకున్నవారిని చిన్నపాటి నివేదికలు రాయాలని కోరుతూ కొంత మొత్తం నగదు చెల్లిస్తారని వారిపై నమ్మకం కుదిరిన తర్వాత క్రమంగా బహిరంగంగా లభ్యం కాని సమాచారం లేదా అత్యంత రహస్యమైన డేటా కోసం ఒత్తిడి చేస్తారని పేర్కొన్నాయి.ఇందులో ప్రధానంగా "కెవిన్ జాంగ్" అనే పేరుతో ఉన్న ఒక అకౌంట్ ద్వారా ఈ కుట్ర సాగినట్లు ఈయూ అధికారులు గుర్తించారు. ఇతను హాంకాంగ్కు చెందిన "ఓరియంటల్ కన్సల్టింగ్" అనే నకిలీ సంస్థ అధిపతిగా చెలామణి అయినట్లు పేర్కొన్నారు. చైనా నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఈ నెట్వర్క్ నిర్వహిస్తున్నారని దీని వెనుక ప్రధానంగా చైనా 'స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ' ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా బ్రిటన్ గూఢచారి సంస్థ MI5 కూడా గతంలో ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. -
పాక్కు షాకిచ్చిన ఇరాన్.. చమురు నౌకపై బాంబుల దాడి
పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్కు చెందిన చమురు షిప్ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.పశ్చిమాసియా యుద్ధం ఇంతట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ఎట్టి ససేమిరా అంటూ దాడులకు తెగబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓ వైపు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. అమెరికా ఆర్మీ సైతం తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తాజాగా పాకిస్థాన్కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండురోజుల క్రితం హర్మూజ్లో పాకిస్థాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జల సంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతోదానిని అడ్డుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా పాక్కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇరాన్తో తమకు సత్సంబంధాలున్నాయని యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్కు చెందిన నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.🚨🚨 Just in Breaking 🇵🇰 Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission.....See more pic.twitter.com/kvYfaniJeJ— INN Iran National News (@INNewx) March 27, 2026 -
‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్పైకి..
టెహ్రాన్: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్పైకి వదిలింది ఇరాన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.భారత్కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIBTHANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo— RT (@RT_com) March 26, 2026 -
చంపే లిస్ట్లోనుంచి వారిని తీసేసిన అమెరికా -ఇజ్రాయెల్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై కాలుదువ్విన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల యుద్ధం తర్వాత ఈ యుద్దం నుంచి అమెరికా కాస్త విరామం తీసుకుంది. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, అందుకే యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితం ప్రకటించారు .అదే సమయంలో పశ్చిమాసియాలో శాంతి స్థాపన లక్ష్యం అంటూ యూటర్న్ తీసుకున్నారు ట్రంప్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్- ఇరాన్ల యుద్ధమైతే ఆగలేదు. ట్రంప్ ప్రకటనతో అమెరికా వెనక్కి తగ్గినా, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే ట్రంప్ను నమ్మడానికి వీలు లేదనే ఇరాన్ ప్రకటనను కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే అమెరికా దాడులు చేయకుండా ఆగిపోయి, ఇజ్రాయెల్తో యుద్ధం చేయిస్తుందనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంచితే, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధరీతిలో భాగంగా వారి హిట్ లిస్ట్లో నుంచి ఇద్దరు ఇరాన్ కీలక నేతల పేర్లను తొలగించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీతో పాటు పలువురు కీలన నేతలను, అధికారులను చంపేసిన ఆ ఇరు దేశాలు.. ఇప్పుడు తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్సాస్ అరగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలిబాఫ్ పేర్లను హిట్ లిస్ట్ నుంచి తొలగించింది. ఇవే కారణాలు..వారిని అమెరికా-ఇజ్రాయెల్ హిట్ లిస్టులో నుంచి తొలగించడానికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు ఇరాన్తో చర్చలు అంటున్న అమెరికా.. ఇంకా మిగిలి ఉన్న ఇరాన్ నేతలను కూడా చంపేస్తే ఎవరితో చర్చలు జరుపుతారు అనే చర్చ వచ్చింది. ఇరాన్లోఅబ్బాస్ అరగ్చీతో పాటు స్పీకర్ ఘలిబాఫ్లు ప్రస్తుతం కీలక నేతలు. ఒకవైపు చర్చలు అంటూ వారి పేర్లను ఇంకా హిట్ లిస్ట్లోనే ఉంచితే తప్పుడు సంకేతం అవుతుందని వారి పేర్లను ఇజ్రాయెల్ తొలగించింది. అమెరికా ఆదేశాలతో వారి పేర్లను హిట్ లిస్ట్ జాబితా నుంచి తీసేసింది. పాక్ రాయబారం..!ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పాకిస్తాన్ ఆయా దేశాల మధ్య రాయబారం నడుపుతుంది. ఇరాన్తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్.. అందుకు పాక్ను ఎన్నుకున్నారు. ఇరాన్ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్.. ఇక పాక్ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్లో ట్రంప్ పడ్డారని, అందుకే ఇరాన్పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. ఆ క్రమంలోనే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పేశారు. కానీ ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, తమతో ఎవరూ చర్చలకు రాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ను తెరపైకి తీసుకొచ్చింది అమెరికా. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించే క్రమంలో ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్న అరగ్చీ, ఘలిబాఫ్ల పేర్లను తీసేయమని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.ఇరాన్.. పాక్ మాట వింటుందా..?ప్రస్తుతం ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్ మాట.. ఇరాన్ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ఒకవేళ ఇరాన్ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. మరి ఆ విషయంలో అమెరికాను పాక్ ఎలా ఒప్పిస్తుందనేది మరొక ప్రశ్న. ప్రస్తుతానికి హిట్ లిస్టులో నుంచి వారి పేర్లను తొలగించారు కానీ చర్చలు సఫలం కాకపోతే మాత్రం మరొకసారి తీవ్రస్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటున్న సమయంలో మరి పరిస్థితి ఎటుపోతుందో అనే భయం కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. -
‘యుద్ధంలోకి నాటో దిగాల్సిందే.. లేదంటే..’
ఇరాన్ యుద్ధం ప్రపంచ సంక్షోభంగా మారకముందే ఈ ఘర్షణను ముగించేందుకు అమెరికాతో నాటో కలవాలని పలువురు నిపుణులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనపడుతుండడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టు మారియో నాఫల్తో ఓ ఇంటర్వ్యూలో తాజాగా హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఆర్బాన్ మాట్లాడారు. ఆ దేశ ప్రధానిగా విక్టర్ 2010 నుంచి కొనసాగుతున్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు అమెరికాకు నాటో మద్దతు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆలస్యం జరిగితే పెను సంక్షోభంగా మారి యూరప్తో పాటు ప్రపంచంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. హంగేరీ కూడా యూరప్ దేశమే.ఇరాన్ యుద్ధం విషయంలో, అలాగే గ్రీన్లాండ్పై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో నాటోలో విభేదాలు కొనసాగుతున్న సమయంలో విక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. “ఈ యుద్ధం త్వరగా ముగిస్తే విజయం, లేదంటే విపత్తు” అని విక్టర్ చెప్పారు.కాగా, యుద్ధం ప్రారంభమైనప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే.. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను బహిరంగంగా ప్రశంసించారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను తగ్గించడంలో ఇది ముఖ్యమని చెప్పారు. సభ్య దేశాలు అమెరికా చర్యలకు సహకరించవచ్చని సూచించారు.అయితే, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్.. ఈ యుద్ధం యూరప్ యుద్ధం కాదని చెప్పారు. నాటో నేరుగా పాల్గొనడాన్ని తిరస్కరించారు.విక్టర్ ఆర్బాన్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హింసాత్మక, యూదు వ్యతిరేక, స్వేచ్ఛా వ్యతిరేక నెట్వర్క్ కేంద్రంగా ఉంది. దాని మిలిటరీ సామర్థ్యాన్ని ధ్వంసం చేస్తే శాంతికి దోహదం చేసినట్లు అవుతుందని అన్నారు.9 కోట్ల జనాభా అస్థిరమైతే..అయితే ఇది త్వరగా సాధ్యం కాకపోతే మరింత పెద్ద, సంక్లిష్ట, దీర్ఘకాలిక యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధం ఇంధన ధరలను పెంచుతుందని, ఇరాన్ నుంచి యూరప్నకు వలసలను పెంచుతుందని చెప్పారు. 90 మిలియన్ల (9 కోట్ల) జనాభా ఉన్న ఇరాన్ అస్థిరమైతే.. టర్కీ, బాల్కన్ మార్గాల ద్వారా వలసలు హంగేరీ సరిహద్దులకు చేరుతాయని చెప్పారు. 2015లో జరిగిన యూరోపియన్ శరణార్థి సంక్షోభం సమయంలో 1.3 మిలియన్ మంది శరణార్థులు వచ్చిన పరిస్థితి ఇప్పటికే అనేక దేశాలను తీవ్రమైన సమస్యల్లోకి నెట్టిందని అన్నారు.సహజ వనరులు లేని హంగేరీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇంధన దిగుమతుల ఖర్చులు పెరగడంతో 10 బిలియన్ యూరోల ఆర్థిక నష్టం చవిచూసింది. హార్మూజ్ జలసంధి ఇష్యూ వల్ల మళ్లీ చమురు ధరలు పెరిగితే మరో దెబ్బ తగులుతుందని చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వాలని ఆర్బాన్ సూచించారు. అమెరికా చాలా ఏళ్లుగా యూరప్ భద్రతకు మద్దతు ఇచ్చిందని, అందుకే ఇప్పుడు యూఎస్కు సహకారం అందించడం అవసరమని చెప్పారు. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో వార్నింగ్..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాస్త విరామం ఇచ్చినా, ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే, ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా నేవీ బేస్లను పలు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేశాలపై దాడులకు దిగిన ఇరాన్.. మరోసారి వారిని హెచ్చరించింది. తమతో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, అవి మానుకోవాలని సూచించింది. ఒకవేళ అలా కాకుండా తమపై దాడి చేసే వారికి మీ(గల్ఫ్ దేశాల్లోని) హోటళ్లలో ఉండేందుకు అవకాశం కల్పిస్తే మాత్రం మరోసారి తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై దాడి చేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలా మంది అమెరికా సైనికులు, ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లి, దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. కాని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంచితే,. ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఇరాన్ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అదే సమయంలో ఇరాన్ సైతం దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ఇజ్రాయెల్ వాయు రక్షణ దళం సమర్థవంతంగా అడ్డుకుంది. -
అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని
ర్యాపర్గా కెరీర్ ప్రారంభించి, అతి చిన్న వయసులోనే నేపాల్ రాజకీయాలను మలుపు తిప్పిన యువనేత బాలేంద్ర షా (Balen Shah)నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. శుక్రవారం నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అట్టహాసంగా, రాజకీయ సందడి నెలకొంది. ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేపాల్ రాజకీయ దిగ్గజాలు హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఒకరు మాత్రం గైర్హాజరు కావడం గమనార్హం.కేపీ శర్మ ఓలీ గైర్హాజరుఈ కార్యక్రమానికి పుష్ప కమల్ దహల్ “ప్రచండ”, మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖనాల్, , బాబురామ్ భట్టారాయ్లతో సహా పలువురు మాజీ ప్రధానమంత్రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయిన ఖిల్ రాజ్ రెగ్మీ కూడా హాజరయ్యారు. విదేశాలలో ఉన్నందున హాజరు కాలేకపోయిన నేపాలీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా కూడా ఈ సమావేశానికి హాజరుకాని వారిలో ముఖ్యమైనవారు.కా నీ మాజీ ప్రధానమంత్రి, యూఎంఎల్ ఛైర్మన్,కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది.ఇదీ చదవండి: బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!బోర్న్ లీడర్ బాలెన్ముగ్గురు తోబుట్టువులలో చిన్నవాడైన బాలేన్, అక్క బావ సుజాత , కౌశల్ షాల వద్ద పెరిగాడు. వారు అతనిలోని నాయకత్వ లక్షణాలను చిన్నప్పుడే గుర్తించారు. అందుకే అతను "బాలెన్ పుట్టుకతోనే నాయకుడు అంటారు. బాలెన్ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నామనంటూ సుజాత, కౌశల్ దంపతులు అభిలషించారు. కానీ మొదట రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆశ్చర్యం కలిగించింది. నాయకుడుగా బాలెన్ ఎదిగిన తీరు చూశాక తాము తీసుకున్న అత్యంత సరైన నిర్ణయమని ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ సుజాత ఆనందాన్ని వెలిబుచ్చారు. కాగా తన సొంత కంచుకోటలో ఓలీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. నాలుగు సార్లు ప్రధాని అయిన ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం కారణంగా చెలరేగిన విస్తృత నిరసనల నేపథ్యంలో, ఓలీ 2025 సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!
ర్యాపర్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువకెరటం బాలేంద్ర షా (Balen Shah) నేపాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. బాలెన్గా పాపులర్ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోనిపార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. 1999 తర్వాత తొలిసారిగా ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించింది కూడా బాలేంద్రనే. దీంతో దశాబ్దాల కాలం తర్వాత భారత్ సరిహద్దుల్లోని దక్షిణ మైదాన ప్రాంతానికి చెందిన 'మధేసీ' వ్యక్తి నేపాల్ పగ్గాలు చేపట్టడం ఒక విశేషంఅవినీతి రహిత పాలన కోరుతూ గత ఏడాది జరిగిన జెన్ జెడ్ విప్లవం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో, నేపాల్ సంప్రదాయ పార్టీలను చిత్తుగా ఓడించాడు ఖాఠ్మండు మాజీ మేయర్ బాలేన్. మార్చి 5న జరిగిన ఈ ఎన్నికల్లో బాలేన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ 182 సీట్లు (మొత్తం 275లో) సాధించి రికార్డు సృష్టించింది. దీంతో 35 ఏళ్ల వయసులో నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ఖాట్మండులోని 'శీతల్ నివాస్'లో ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ సమక్షంలో బాలేన్ షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Kathmandu: Rastriya Swatantra Party (RSP) leader Balendra Shah takes oath as Prime Minister of NepalVideo source: Nepal Television/YouTube pic.twitter.com/Th6NxTZWwm— ANI (@ANI) March 27, 2026చారిత్రాత్మక విజయం ప్రమాణ స్వీకారం పూజారుల వేద మంత్రాలమధ్య ఎర్రని వస్త్రాలు ధరించిన బౌద్ధ సన్యాసుల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాలేంద్ర షా తన మార్కు స్టైల్ స్కిన్-టైట్ ప్యాంటు, మ్యాచింగ్ జాకెట్,నల్ల కళ్లజోడు ధరించి దేశం, ప్రజల తరఫున, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని, ప్రధానమంత్రిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు బాలేన్ షా. నేపాల్ చరిత్రలో మధేసీ ప్రాంతానికి చెందిన వ్యక్తి తొలి ప్రధాని కావడంతో దేశంలోని మధేసీ ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది.మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి షాక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ర్యాపర్గా పాపులర్ అయిన బాలేన్ రాజకీయ ఆరంగేట్రం2022లో జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండు మేయర్గా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని సుమారు 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించడం విశేషం. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కేవలం 38 స్థానాలతో పరిమితమూ రెండో స్థానానికి పడిపోయింది. జెన్ జెడ్ ఆందోళనల తర్వాత రాజీనామా చేయవలసి వచ్చిన ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) 25 సీట్లను గెల్చుకుంది. ముందున్న సవాళ్లు3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉద్యోగాల కొరత, పాతుకుపోయిన అవినీతి కారణంగా యువత నేతృత్వంలోని నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జనాభాలో ఐదవ వంతు మంది పేదరికంలో జీవిస్తుండగా, ప్రతిరోజూ సుమారు 1,500 మంది పని కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత కూడా ఒక శాపంగా మారింది. 1990 నుండి 32 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, వాటిలో ఏదీ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం , క్షేత్రస్థాయిలో అవినీతిపై పోరాటమే కీలకమైన బలంగా అధికారంలోకి వచ్చిన బాలేన్ ముందు అస్థిరతను తొలగించడం, ఉద్యోగాల కల్పన, అవినీతి నిర్మూలన లాంటి అనేక సవాళ్లను ఏ మేరకు అధిగమించగలడు అనేది కాలమే చెప్పాలి. -
అమెరికా సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమెరికా ట్రెజరీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇకపై ముద్రించనున్న అన్ని కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనున్నట్లు వెల్లడించింది. దీంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికినట్టైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ‘చారిత్రాత్మక సంస్కరణ’గా అభివర్ణించింది. ఇప్పటివరకు అమెరికా కరెన్సీపై ట్రెజరర్, ట్రెజరీ సెక్రటరీ సంతకాలు మాత్రమే ఉండేవి. అధ్యక్షుడి సంతకం నేరుగా నోట్లపై ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.ట్రెజరీ శాఖ ప్రకటన ప్రకారం.. కొత్త డిజైన్తో విడుదలయ్యే నోట్లపై ట్రంప్ సంతకం 2026 చివరి త్రైమాసికం నుంచి కనిపించనుంది. ఈ మార్పు అమెరికా కరెన్సీకి ‘జాతీయ గుర్తింపు,నాయకత్వ ప్రతీక’గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయీకరణగా అభివర్ణిస్తూ, కరెన్సీ వ్యవస్థను అధ్యక్షుడి వ్యక్తిగత బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.అమెరికా చరిత్రలో కరెన్సీ డిజైన్ మార్పులు చాలా అరుదుగా జరుగుతాయి. ముఖ్యంగా సంతకాల విషయంలో 1861 నుంచి కొనసాగుతున్న విధానాన్ని మార్చడం పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మార్పు అమెరికా కరెన్సీపై ప్రజల దృష్టిని మరింత ఆకర్షించవచ్చు. దీనికి రాజకీయ ప్రభావం కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.ట్రంప్ సంతకం ఉన్న నోట్లను ప్రజలు ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటారన్న దానిపై ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. కానీ కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా భావిస్తున్నారు. -
అమెరికాకు నరకం అంటే ఏంటో చూపిస్తాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని అమెరికాకు హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నీమ్.. ‘ఇరాన్లో లక్ష మందికిపైగా అమెరికాతో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. బసిజ్, ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, ఆర్మీ నిర్వహిస్తున్న కేంద్రాల్లో యువకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే వారికి నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.’ అని నివేదించింది. అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వ పాలనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు సాధించింది.ఈ క్రమంలో ఇరాన్లో అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశం తన న్యూక్లియర్ విధానాన్ని కఠినతరం చేయాలని ఐఆర్జీసీలోని ప్రముఖులు బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. అధికారికంగా ఇరాన్ ఇంకా అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నప్పటికీ.. ఇరాన్లోని రాజకీయ, సైనిక వర్గాల్లో అణ్వస్త్రాల వైపు వెళ్లాలా? అనే ప్రశ్న ఇప్పటివరకు లేనంతగా బలంగా, బహిరంగంగా చర్చకు వస్తోంది. అంటే అణు విధానంలో కఠిన మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని తస్నీమ్ తెలిపింది. అమెరికా సైనిక కదలికలుఅమెరికా 82వ ఎయిర్బోర్న్ డివిజన్ దళాలు త్వరలో పశ్చిమాసియా భూభాగంలోకి అడుగు పెట్టనున్నాయి. ఇప్పటికే వేలాది మంది సైనికులు మెరైన్లతో అక్కడికి చేరారు. ఈ కదలికలు ఇరు దేశాల మధ్య భూతల దాడులు సంభవించే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి.ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేలా ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ ఖండించింది. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. -
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్ఎఫ్ సిరీస్ ఎయిర్ఇండియా విమానం లండన్కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్లోని జాన్ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్కు చేరుకోవాల్సిన ఎయిర్ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
ఇక భీకర యుద్ధమే!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హార్మూజ్పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం(టోల్ ఫీజు) వసూలు చేస్తోంది. కనీసం రెండు నౌకలు చైనా కరెన్సీ యువాన్లలో ఇరాన్కు చెల్లింపులు చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. పార్లమెంట్లో ఆమోదం పొంది టోల్ వసూలును అధికారం చేయబోతున్నట్లు సమాచారం. నౌకలు క్షేమంగా జలసంధిని దాటాలంటే రుసుము చెల్లించక తప్పదని ఇరాన్ అధికారులు అంటున్నారు. హార్మూజ్లో ఇరాన్ టోల్ బూత్ తెరిచినట్లు ఆరు గల్ఫ్ అరబ్ దేశాల కూటమి అయిన గల్ఫ్ సహకార మండలి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అల్–బుదైవీ నిర్ధారించారు. నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే హార్మూజ్ నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గల్ఫ్లో క్షిపణుల మోత మరోవైపు యుద్ధం గురువారం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్సైతం ప్రతీకార దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సైనిక స్థావరాలకు కేంద్రమైన ఇస్పహాన్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి అంతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. యుద్ధంలో ఉమ్మడి లక్ష్య సాధన విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయానికి ఈ ఆపరేషన్ మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోనూ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఇజ్రాయెల్లోని నహరియా ఏరియాలో ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు తెలిసింది. మరో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ఇరాన్లోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటిదాకా 1,900 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ మంత్రి అలీ జఫారియన్ చెప్పారు. ఇజ్రాయెల్లో 18 మంది, లెబనాన్లో ముగ్గురు ఇజ్రాయెల్ జవాన్లు, 1,100 మంది సాధారణ ప్రజలు, గల్ఫ్ దేశాల్లో 13 మంది అమెరికా సైనికులు మృతిచెందారు. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లను ఖతం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని అక్కడికి తరలిస్తోంది. భారతీయుడు సహా ఇద్దరి బలి అబూదాబీపై ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. యూఈఏ గగనతల వ్యవస్థ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్షిపణుల శకలాలు నేలకూలి మంటలు చెలరేగడంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించారు. మరో భారతీయు డు సహా ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందిన రెండో వ్యక్తిని పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించారు. పశ్చిమాసియా యుద్ధంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. 169 మంది గాయపడ్డారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అబూ దాబీ రక్షణ శాఖ ప్రకటించింది. ఇరాన్లో 10 వేల టార్గెట్లపై దాడులు ఇరాన్లో ఇప్పటిదాకా 10 వేలకుపైగా టార్గెట్లపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఇజ్రాయెల్తో కలిసి మరిన్ని లక్ష్యాలపై గురి పెడతామని అన్నారు. కచ్చితత్వంతో కూడిన దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై పైచేయి సాధిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నావికాదళంలో 92 శాతం భారీ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. యూఎస్ఎస్ ట్రిపోలి సహా పలు నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయి. వీటిలో 2,500 మంది జవాన్లు ఉన్నారు. అలాగే 1,000 మంది పారాట్రూపర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. సంధానకర్తగా పని చేస్తున్నాం: పాక్ పశ్చిమాసియాలో సంక్షోభ పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ చెప్పారు. యుద్ధానికి తెరదించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తాము సంధానకర్తగా పని చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ఒక దేశం సందేశాన్ని మరో దేశానికి చేరవేస్తున్నామని పేర్కొన్నారు. శాంతి సాధన విషయంలో తుర్కియే, ఈజిప్టు కూడా తమకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.అంచెలంచెలుగా ఉన్నతస్థాయికిఅలీ రెజా తంగ్సిరి మృతితో ఇరాన్కు భారీ నష్టం జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత శక్తివంతమైన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నావికాదళం చీఫ్ అలీ రెజా తంగ్సిరి మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్లోని తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్లో వైమానిక దాడుల్లో తంగ్సిరితోపాటు ఐఆర్జీసీకి చెందిన ఇతర సీనియర్ నావల్ కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపారు. అయితే, దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. హార్మూజ్ జలసంధి మూసివేతను తంగ్సిరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాంటి కీలక అధికారి మృతిచెందడం ఇరాన్కు భారీ నష్టంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తంగ్సిరి దక్షిణ ఇరాన్లోని బుషెహర్ ప్రావిన్స్లో 1962లో జన్మింంచారు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇరాన్ సైన్యంలో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 2010 నుంచి 2018 దాకా ఐఆర్జీసీ నేవీ డిప్యూటీ కమాండర్గా పనిచేశారు. అనంతరం ఈ దళం అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అక్కడ విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ఇదంతా తంగ్సిరి నేతృత్వంలోనే జరిగింది. ఇజ్రాయెలీలు యూదులని, అమెరికన్లు క్రైస్తవులని, వారు తమకు మిత్రులు కాదని మత గ్రంథం ఖురాన్ బోధిస్తోందని ఒక సందర్భంలో తంగ్సిరి వ్యాఖ్యానించారు. యుద్ధంలో ఇరాన్ కీలక నేతలు, అధికారులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడం ఆ దేశానికి నష్టదాయకంగా పరిణమించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ తదితరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. తంగ్సిరి చేతులకు చాలా రక్తం అంటింది: నెతన్యాహు అలీ రెజా తంగ్సిరి మృతిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ధ్రువీకరించారు. ఈ మేరకు వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. బుధవారం రాత్రి ఐఆర్జీసీ నేవీ కమాండర్ తంగ్సిరిని అంతం చేసినట్లు తెలిపారు. అతడి చేతులకు చాలా రక్తం అంటిందని, హార్మూజ్ జలసంధిని మూసివేయడానికి నాయకత్వం వహించింది కూడా అతడేనని తేల్చిచెప్పారు. ఇరాన్ నేతలు, అధికారులే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ఉగ్రవాద పాలనపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒప్పందం కోసం ఇరాన్ బతిమాలుతోంది: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ రెండో మాటకు తావులేకుండా తిరస్కరించింది. దీనిపై ట్రంప్ గురువారం స్పందించారు. ఒప్పందం కోసం ఇరాన్ తమను బతిమాలుతోందని అన్నారు. చర్చల కోసం తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై జరిగే చర్చలను సీరియస్గా తీసుకోవాలని టెహ్రాన్కు సూచించారు. ఇరాన్ ఒక బహుమతి ఇచ్చిందని ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ బహుమతి ఏమిటన్నది ఇప్పుడు బయటపెట్టారు. 10 చమురు నౌకలు హార్మూజ్ గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతి ఇచ్చిందని చెప్పారు. చర్చల విషయంలో ఇదొక సానుకూల ముందడుగు అని అభివరి్ణంచారు. అనుమతి పొందిన నౌకలు పాకిస్తాన్కు చెందినవిగా ట్రంప్ సంకేతాలిచ్చారు. తదుపరి సుప్రీంలీడర్గా ఉండాలంటూ ఇరాన్ తనను వేడుకుందని, అందుకు తిరస్కరించానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ పదవి తనకు ఇష్టం లేదన్నారు. -
ఇరాన్పై దాడులకు నాటో చీఫ్ పూర్తి మద్దతు
ఇరాన్పై దాడులకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను బహిరంగంగా సమర్థించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలతో ఐరోపా భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నాటోపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాటో కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టే ప్రతిస్పందిస్తూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంలో కూటమి పాత్రను సమర్థించారు. ఆ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారు.రుట్టే తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం సమయంలో టర్కీ వైపు దూసుకెళ్తున్న మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో అడ్డుకుంది. అంతేకాదు, హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్టు తర్వాత వచ్చాయి. ట్రంప్ నాటోను విమర్శిస్తూ ఇరాన్తో జరుగుతున్న యుద్ధంతో తమకు మద్దతు ఇవ్వకపోవడాన్ని అమెరికా మర్చిపోదని చెప్పారు. -
వెంటనే ఇరాన్ ఇలా చేయకపోయిందో..: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. "ఇరాన్ తరఫున చర్చలు జరిపే ప్రతినిధులు చాలా భిన్నంగా, వింతగా ఉన్నారు. ఒప్పందం చేసుకోవాలని మమ్మల్ని వారు అడుక్కుంటున్నారు. ఎందుకంటే ఇరాన్ సైనికపరంగా పూర్తిగా నాశనమైంది. తిరిగి నిలబడే అవకాశం సున్నా. అయినా వారు బహిరంగంగా ఇంకా మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే, వారికి తిరిగి వెనక్కిచూసే అవకాశం కూడా రాకపోవచ్చు. తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు, ఇవాళ ఇరాన్లోని బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో ఐఆర్జీసీ నేవీ చీఫ్ అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి.ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేస్తుందన్న భయంతో ఇరాన్ అక్కడ భద్రతను పెంచుతోంది. ఖార్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ భావిస్తోంది. దీంతో ఇరాన్ అక్కడికి తమ సిబ్బందిని తరలిస్తోంది, దీవి చుట్టూ గగనతల రక్షణ వ్యవస్థను పెంచుతోంది. ఖార్గ్ దీవి వాటా ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఉంటుంది.భుజంపై మోసుకెళ్లి ప్రయోగించే గగనతల క్షిపణి వ్యవస్థ (మాన్పాడ్స్)ను ఆ దీవి వద్ద పెంచుతోంది. అయితే, ఏ దాడి జరిగినా అధిక ప్రాణనష్ట ప్రమాదం ఉంటుందని అమెరికా అధికారులు, సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బంగ్లాదేశ్లో నదిలో పడిన బస్సు.. 24 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఫెర్రీ ఎక్కే ప్రయత్నంలో ఓ బస్సు పద్మా నదిలో పడిపోయింది. దీంతో 24 మంది మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ప్రమాదం బుధవారం రాజ్బారి జిల్లాలోని దౌలత్డియా వద్ద జరిగింది. ఇది ఢాకా నుంచి సుమారు 100 కిలోమీటర్లు (62 మైళ్లు) దూరంలో ఉంది. ఫెర్రీ వద్దకు చేరుకునే సమయంలో బస్సు నియంత్రణ కోల్పోయి ఓ వైపునకు ఒరిగి, సుమారు 30 అడుగులు (9 మీటర్లు) లోతులో నదిలో మునిగిపోయిందని పోలీసులు, ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ (అగ్నిమాపక, అత్యవసర రక్షణ విభాగం) తెలిపారు.నదిలో మునిగిన బస్సు నుంచి సిబ్బంది 22 మృతదేహాలను వెలికితీశారు, అందులో ఆరుగురు పురుషులు, 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని ఫైర్ సర్వీస్ అధికారి తల్హా బిన్ జాసిమ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 4 ఫైర్ సర్వీస్ యూనిట్లు, 10 మంది డైవర్లు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సైన్యం, పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకా కొంత మంది ప్రయాణికులు అదృశ్యమై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం రోడ్డు, ఫెర్రీ ప్రమాదాల్లో వందల మంది మరణిస్తున్నారు. -
గల్ఫ్ దేశాలకు మరో టెన్షన్.. ఇరాన్ అలా చేస్తే మాత్రం..!
తీర ప్రాంతాల్లోని నిర్లవణీకరణ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోతుంది. సముద్ర జలాల్లోని ఉప్పును తొలగించి, శుద్ధ జలంగా మార్చే ప్లాంట్లు ఇవి. ఈ నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘ముహార్రక్’పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ డీశాలినేషన్ ప్లాంటు దెబ్బతింది. దైనందిన తాగునీటి అవసరాల కోసం గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఈ నిర్లవణీకరణ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ ఇప్పుడు భద్రతాపరమైన అంశంగా మారింది.నిర్లవణీకరణ జలాన్ని ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నది గల్ఫ్ దేశాలే. వీటి తీరప్రాంతాల్లో వందలాది డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కువైట్ ప్రాంతంలో 90 శాతం తాగునీరు ఇదే. తీర నగరాలు, విద్యుత్కేంద్రాలు, పారిశ్రామిక హబ్స్ వద్ద ఈ డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదిప్పుడు వాటి బలహీనతగా, ఇరాన్ ఆయుధంగా మారుతోంది. నిర్లవణీకరణ కేంద్రాల్ని లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది.విద్యుత్ సరఫరాతోనే డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే అవి మూతపడతాయి. ఉద్రిక్తతలు పెరిగితే డీశాలినేషన్ ప్లాంట్లు, విద్యుత్కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తుందేమోనని, అప్పుడిక గృహావసరాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నీరు అందదేమోనని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామమే. అయితే ఈ రిస్క్ అన్ని గల్ఫ్ దేశాలకు ఒకేలా లేదు. మిగతా వాటితో పోలిస్తే సౌదీ, ఖతార్, యూఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.- జమ్ముల శ్రీకాంత్ Sources: SANA (Syrian Arab News Agency), Gulf News -
ఇరాన్ను కోలుకోలేని దెబ్బకొట్టిన ఇజ్రాయెల్!
టెహ్రాన్: ఇరాన్లోని బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం జెరూసలేం పోస్ట్ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది.హార్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్ ఉంది. ప్రపంచ వాణిజ్య చమురు, సహజ వాయువు సుమారు 20 శాతం హార్మూజ్ గుండా సాగుతుంది. ఈ జలసంధి మూసివేతకు బాధ్యుడిగా అలీరెజాను పేర్కొంటారు. అతడి మరణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కీలక పరిణామం. ఎందుకంటే ఐఆర్జీసీ నౌకాదళానిదే ఇరాన్ సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసేది కూడా ఐఆర్జీసీ నౌకాదళమే.హార్మూజ్పై పట్టును మరింత సాధిస్తున్న వేళ ప్రస్తుతం హార్మూజ్ జలసంధిపై పట్టును మరింత పెంచుకుంటోంది ఇరాన్. కాల్పుల విరమణ ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ “డీ ఫాక్టో టోల్ బూత్ విధానం” (అధికారిక ప్రకటన లేకుండా అమలులో ఉన్న ఫీజు వ్యవస్థ) అమలు చేస్తోందని నిపుణులు చెప్పారు. ఈ విధానంలో కొన్ని నౌకలు తమ సరుకు వివరాలు, సిబ్బంది సమాచారం, గమ్యస్థానం వివరాలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు అందించాలి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ (నౌకాయాన విశ్లేషణ సంస్థ) కూడా ఇదే విధానాన్ని ప్రస్తావిస్తూ, కనీసం రెండు నౌకలు జలసంధి గుండా వెళ్లేందుకు చైనా యువాన్లో ఫీజులు చెల్లించాయని తెలిపింది. ఈ ఫీజు వసూలు వ్యవస్థను అధికారికం చేయడానికి తమ పార్లమెంట్ ప్రయత్నిస్తోందని ఇరాన్ నేత ఒకరు అన్నారు. “మేమే భద్రత కల్పిస్తున్నాం, నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ ఫీజులు చెల్లించడం సహజమే” అని చెప్పారు.ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ (అంతర్జాతీయ చమురు ధర సూచిక) ధర గురువారం 104 డాలర్ల వద్ద ఉంది, ఘర్షణ ప్రారంభం నుంచి 40 శాతం పైగా పెరిగింది. -
హోర్మూజ్ తరువాత : ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజాగా మరో సంచలన హెచ్చరిక జారీ చేసింది. తన ద్వీపాలపై దాడులు జరిగిగే మరో జలసంధిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఇరాన్ గనుక కాల్పుల విరమణ షరతులకు అంగీకరించకపోతే, సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరిక జారీ చేసింది. శత్రువు పీచమణచాలంటే.. బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టుఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ దక్షిణ ద్వీపాలపై భూతల దాడులు జరిగితే, యెమెన్కు చెందిన సాయుధ రాజకీయ, మత సమూహమైన అన్సరుల్లా (హౌతీలు) బాబ్ అల్-మండబ్ (Bab al-Mandab)జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది.దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనా (Resistance) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమ్మకమైన హామీలు లేకుండా చర్చలకు లేదా కాల్పుల విరమణకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్పై దాడితో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అన్సరుల్లా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువును దారికి తీసుకురావడానికి ఈ కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ మీడియా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది.శత్రువుకు మరింత గుణపాఠం నేర్పడానికి ఈ జలసంధిని నియంత్రించడం అవసరమని భావిస్తోంది. ఈ జలమార్గంలో "విశ్వసనీయమైన ముప్పు"ను సృష్టించే సామర్థ్యం ఇరాన్కు ఉండటమే కాకుండా, అన్సరుల్లా "వీరోచిత శక్తులు" కూడా "నైపుణ్యంతో కూడిన పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని తస్నిమ్ తెలిపింది.ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుకాగా ఇప్పటికే ఇజ్రాయెల్కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకలపై హుతీలు దాడులు చేస్తూ ఆర్థికంగా ఇజ్రాయెల్ను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నౌకలపైనే కాకుండా, అమెరికా యుద్ధ నౌకల పైన మరియు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల పైన హుతీలు వైమానిక దాడులు చేస్తున్నారు.రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉన్న బాబ్ అల్-మండబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్ ట్రిప్స్, బెంజ్కారు! -
ఇరాన్ సుప్రీం లీడర్గా డొనాల్డ్ ట్రంప్?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్కి సుప్రీం లీడర్గా ప్రతిపాదించిందని, కానీ తాను తిరస్కరించానని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ఫండ్రైజర్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నాయకత్వం నన్ను సుప్రీం లీడర్గా చూడాలని అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆ పదవి ఎవరూ కోరుకోరు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్పై అమెరికా చర్యలను ‘మిలిటరీ డెసిమేషన్’గా వర్ణించారు. అంటే సింహ భాగం ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. తద్వారా మేం ము సాధించిన విజయాన్ని ఎవరూ చూడలేదు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ తమ ప్రజల భయంతో, అలాగే అమెరికా ప్రతీకార దాడుల భయంతో బహిరంగంగా చెప్పలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఖండించిన ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఒకవైపు ఆయన ‘ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది’ అని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ‘ఎలాంటి చర్చలు లేవు’ అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. శకలాలు మోజ్తబా కాలును ఛిద్రం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాలును తొలగించి చికిత్స కొనసాగిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం ఇరాన్లో నాయకత్వ సంక్షోభాన్ని మరింతగా పెంచుతోంది. -
పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు
పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. -
‘అందరి కోసం ఓ ప్రతీకారం’: ఇరాన్
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు త్వరలో చల్లబడేలా కనిపించడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ను రెచ్చగొట్టేలా ఇరాన్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేసింది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అంటూ అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరిక జారీ చేసింది.ఈ వీడియోలో అమెరికా చరిత్రలో జరిగిన యుద్ధాలు, అణు దాడులు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘర్షణలను చూపిస్తూ చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షస రూపంలో చిత్రీకరించారు. స్టాచ్యూని క్షిపణితో ధ్వంసం చేస్తామని హెచ్చరించేలా వీడియోని క్రియేట్ చేయడం గమనార్హం.అమెరికా గత చర్యలపై విమర్శవీడియోలో అమెరికా స్థానిక ప్రజల భూ స్వాధీనం, హిరోషిమాపై అణు బాంబు దాడి, వియత్నాం యుద్ధం, అలాగే యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, పాలస్తీనా ఘర్షణలను ప్రస్తావించారు. ఈ సంఘటనలన్నింటినీ అమెరికా కారణమని చూపిస్తూ, బాధితుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సందేశం ఇచ్చింది.స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై దాడి వీడియో చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షసుడిగా చూపించి, దానిపై క్షిపణి దాడి చేసిన దృశ్యం ఉంది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అనే నినాదంతో అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ వీడియో ఇజ్రాయెల్–అమెరికా దాడుల తర్వాత విడుదల కావడం గమనార్హం. ఇరాన్ ఇటీవల అమెరికాను పశ్చిమ ఆసియాలో అస్థిరతకు కారణమని ఆరోపిస్తూ, ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా అదనపు సైనిక దళాలు, యుద్ధ నౌకలు, విమాన దళాలను ఇరాన్ ప్రాంతంలో మోహరించింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వీడియో కేవలం ప్రచార సాధనం మాత్రమే కాదు. ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు చూపించడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
‘నెట్ఫ్లిక్స్’లో ‘బీటీఎస్’ పచ్చి నిజాలు?
సియోల్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాప్ సెన్సేషన్ బీటీఎస్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తన సొంత సంస్థ ‘హైబ్’(HYBE)తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ కొరియన్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ముఖ్యంగా మాతృభాషలో పాటలు పాడేందుకు ‘బీటీఎస్ ’ ఏడుగురు సభ్యులు చేసిన అంతర్గత పోరాటం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సాక్షిగా వెలుగులోకి వచ్చింది.ఇంగ్లీష్ వద్దు.. కొరియన్ ముద్దు!బీటీఎస్ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) నిర్మాణ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ త్వరలో విడుదల చేయనున్న ‘బీటీఎస్ : ది రిటర్న్స్’ డాక్యుమెంటరీ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఆల్బమ్లో ఎక్కువ ఇంగ్లీష్ పాటలు ఉండాలని ‘హైబ్’ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. అయితే ఆర్ఎం,సుగా, జిన్, జె-హోప్, జిమిన్, వీ, జంగ్కుక్.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ‘కనీసం రాప్ భాగాల్లోనైనా కొరియన్ పదాలు ఉండాల్సిందే’ అని వారు మేనేజ్మెంట్తో వాదించినట్లు సమాచారం. ముఖ్యంగా జిమిన్ తన ఇంగ్లీష్ ఉచ్చారణ వల్ల పాట సహజత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేయగా, లీడర్ ఆర్ఎం తమ మూలాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు.నికోల్ కిమ్ వ్యాఖ్యలపై ‘ఆర్మీ’ ఆగ్రహంబిగ్ హిట్ మ్యూజిక్ వైస్ ప్రెసిడెంట్ నికోల్ కిమ్ తీరు ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బీటీఎస్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన ‘ఆన్’, బ్లాక్ స్వాన్’వంటి పాటలు జనాలకు అంతగా కనెక్ట్ కాలేదని ఆమె వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఇంగ్లీష్ పాటలు ఉంటేనే గ్లోబల్ సక్సెస్ సాధ్యమని ఆమె వాదించడాన్ని సోషల్ మీడియాలో ‘ఆర్మ్మీ’(బీటీఎస్ ఫ్యాన్స్) తప్పుబడుతున్నారు. ‘మాతృభాషలో పాడి ప్రపంచాన్ని జయించిన వారిని మార్చాలని చూడటం మూర్ఖత్వం" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.వివాదాల నడుమ రికార్డుల వర్షంఇలాంటి విమర్శలు వివాదాలు ఎన్ని వస్తున్నా ‘అరిరంగ్’ మాత్రం రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే స్పాటిఫైలో 110 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించడమే కాకుండా, కేవలం మూడు రోజుల్లోనే 40 లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడయ్యాయి. గ్వాంగ్వామున్ ఈవెంట్లో రద్దీ వల్ల ‘హైబ్’ షేర్లు స్వల్పంగా తగ్గినప్పటికీ, మ్యూజిక్ చార్ట్స్లో మాత్రం బీటీఎస్ తిరుగులేని విధంగా దూసుకుపోతోంది.ఇది కూడా చదవండి: Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం? -
భారత్ కోసం హార్మూజ్ తెరుస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ విషయంలో భారత్, మరో నాలుగు దేశాలకు ఇరాన్ భారీ ఊరటను ఇచ్చింది. ఈ ఐదు దేశాల కోసం హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టు తాజాగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘి చెప్పుకొచ్చారు. దీంతో, ఆయా దేశాలకు చమురు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. ఈ సందర్బంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధిలో భారత్తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. భారత్తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్లకు చెందిన నౌకలకు కూడా జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇరాన్ మీడియాతో అబ్బాస్ మాట్లాడుతూ.. చాలా దేశాలు హార్మూజ్ విషయంలో మమ్మల్ని సంప్రదించి, జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని అభ్యర్థించారు. మేము మిత్రదేశాలుగా భావించే కొన్ని దేశాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. వీరికి మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి. భవిష్యత్తులో కూడా, యుద్ధం తర్వాత కూడా ఆయా దేశాల నౌకల ప్రయాణాలు కొనసాగుతాయి’ అని ఆయన తెలిపారు. #Iran FM Abbas #Araghchi: We permitted passage through the Strait of #Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan. pic.twitter.com/RvLtiwYB4v— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సు లేట్ జనరల్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో, హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో ఉండటం అవి స్వదేశం చేరేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే ఐదు గ్యాస్ ట్యాంకర్లు హార్మూజ్ వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. అయితే, ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మూజ్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ మంత్రి సంచలన ప్రకటన
అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా పంపిన ప్రతిపాదనలను కేవలం తమ దేశ నాయకత్వం పరిశీలిస్తుందని తెలిపారు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో చర్చలు అనుకోకూడదని తేల్చిచెప్పారు.ఇరాన్పై యుద్దం చేసి తన లక్ష్యాలను చేరుకోవడంలో అమెరికా విఫలమైందని అరాగ్చీ విమర్శించారు. సులభంగా విజయం సాధించాలని, లేదా ఇరాన్లో ప్రభుత్వ మార్పు చేయాలని ట్రంప్ కలలు కన్నారని కానీ అవి నెరవేరలేదని తెలిపారు. అందుకోసమే అగ్రరాజ్యం బేరానికి వస్తుందని విమర్శించారు.ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ పరిశీలిస్తోందని అయితే మధ్యవర్తలు ద్వారా మాత్రమే ఆ సందేశాలు పరిశీలిస్తున్నామని అంతేగానీ చర్చలు జరపడం లేదని తేల్చిచెప్పారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తేలేదన్నారు.ఇరాన్ను ఎవరూ బెదిరించలేరని విషయాన్ని ఇదివరకే ప్రపంచానికి చాటి చెప్పామని, తమ దేశం యొక్క దృఢత్వాన్ని నిరూపించుకున్నామని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధాన్ని కొనసాగించాలని తాము కోరుకోవడం లేదని, అయితే తమ నిబంధనలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారాన్ని మాత్రమే ఆశిస్తున్నట్లు అరాగ్చీ తెలిపారు. -
Bangladesh : నదిలో పడిన బస్సు 23 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్బారి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ వద్ద 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దురదృష్టవశాత్తు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఇటీవల ఈద్ సెలవులు ముగించుకొని ఢాకాకు తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల 14 మృతదేహాలు లభించాయి. ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. -
కాల్పుల విరమణకు షరతులు
దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముఖ్యంగా అణు, క్షిపణి కార్యకలాపాలను కట్టిపెట్టడం, హార్మూజ్పై పెత్తనాన్ని వదులుకోవడం, హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపులకు ఆర్థిక, ఆయుధ సాయం నిలిపివేత వంటి షరతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదని కుండబద్దలు కొట్టింది. హార్మూజ్పై తన సార్వ¿ౌమాధికారాన్ని గుర్తించాల్సిందేనని డిమాండ్ చేసింది. ‘‘మాపై ఇంకెప్పుడూ యుద్ధానికి దిగరాదు. ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి. మా నేతలు, సైనికాధికారుల హత్యలను మానుకోవాలి’’అంటూ అమెరికాకు 8 షరతులు విధించింది! గల్ఫ్ నుంచి అమెరికా బలగాలన్నీ వైదొలగాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులను కొనసాగించింది. అమెరికా కూడా మరో 5,000 మంది మెరైన్లు, 1,000 మంది సైనికులను గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలను చర్చలకు ఒప్పించేందుకు పలు దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన పట్ల ఇజ్రాయెల్ విస్మయం వెలిబుచ్చింది. ఇరాన్ పూర్తిగా కాళ్లబేరానికి వచ్చేదాకా దాడులు కొనసాగించాలని అభిప్రాయపడింది. మరోవైపు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ యత్నాలకు ఈజిప్టు, టర్కీ కూడా ముందుకొచ్చాయి. కొనసాగుతున్న చర్చల యత్నాలు అమెరికా, ఇరాన్ నడుమ చర్చల దిశగా పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇరుదేశాలు అంగీకరిస్తే వాటి నడుమ ద్వైపాక్షిక చర్చలకు వేదికగా నిలిచేందుకు పాకిస్తాన్ సిద్ధమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తన 15 షరతులను పాక్ ద్వారానే ఇరాన్కు అందజేసినట్టు న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ఇరాన్ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్ ప్రకటించింది. యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించాల్సింది ఇరానే తప్ప ట్రంప్ కాందంటూ మండిపడింది. అంతేగాక ఇరాన్ కూడా 8 షరతులతో కూడిన తమ ప్రతిపాదనలను పాక్ ద్వారానే అమెరికాకు పంపింది. వాటన్నింటికీ అంగీకరిస్తేనే యుద్ధానికి తెర దించడంపై నిర్ణయం తీసుకుంటామంటూ కుండబద్దలు కొట్టింది. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని పునరుద్ఘాటించింది. గల్ఫ్, పరిసర దేశాల మంత్రులు తదితరులు తమతో మాట్లాడుతున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చెప్పుకొచ్చారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు మాత్రం అబద్ధమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ అన్నారు. ట్రంప్ మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొ చ్చారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జెరేద్ కుష్నర్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వాటిలో పాల్గొంటున్నట్టు వైట్హౌస్లో మీడియాకు వెల్లడించారు. ఎలాగోలా ఒప్పందానికి రావాలనే ఇరాన్ ఆశ పడుతున్నట్టు కూడా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అమెరికా ఎఫ్–18 కూల్చివేత! ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు బుధవారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్పై తీవ్రస్థాయిలో బాంబులు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకపైనా దాడి చేసింది. దానిపైకి పలు క్షిపణులను ప్రయోగించింది. దాడిలో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పుకొచ్చింది. ఈ నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, అమెరికా ఖండించడం తెలిసిందే. కువైట్ విమానాశ్రయంపైనా ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన ఎఫ్–18 యుద్ధ విమానంపై క్షిపణితో దాడి చేసినట్టు ఇరాన్ పేర్కొంది! ఇందుకు సంబంధించి వీడియో కూడా విడుదల చేసింది. అంతేగాక తమపై దాడులు కొనసాగితే యెమన్ సమీపంలోని బబ్ ఎల్ మందెబ్ జలసంధిని కూడా మూసేస్తానంటూ ఇరాన్ తాజాగా హెచ్చరికలు చేసింది. ఇది యెమన్, ఎరిత్రియా నడుమ ఉన్న 32 కి.మీ. వెడల్పుతో కూడిన జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. -
ద్వీపాన్ని ఆక్రమించే ప్లాన్? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధం కొలిక్కివస్తుందనే తరుణంలో మరోసారి సమస్యలు తీవ్రతరమైతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న(బుధవారం) అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా ప్రస్తుతం టెహ్రాన్కు చెందిన ఓ ద్వీపాన్ని శత్రుదేశం ఆక్రమించే యత్నం చేస్తుందని ఆ దేశ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు.ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ "ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ శత్రువులు ఒక ప్రాంతీయ దేశం మద్దతుతో ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మా బలగాలు శత్రువుల కదలికలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. వారు ఏ మాత్రం ముందడుగు వేసినా శత్రువుకు సహాయం చేసిన ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నింటినీ ఏ మాత్రం కనీకరం లేకుండా ధ్వసం చేస్తాం. నిరంతరం దాడులు చేస్తాం" అని హెచ్చరించారు.కాగా ప్రస్తుతం ట్రంప్ వేలాది మంది వైమానిక దళాలను మరియు అదనపు మెరైన్లను గల్ఫ్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంబాట్ వార్కు తెరదించనున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇదివరకే ట్రంప్ ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో ప్రధానమైన ఖర్గ్ ద్వీపాన్ని "పూర్తిగా రక్షణ లేకుండా అక్కడ ఉన్న ఒక చిన్న చమురు ద్వీపం" అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
'జిన్పింగ్ కోసం ఎదురుచూస్తున్నా'.. త్వరలో చైనాకు ట్రంప్
అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటనకు కొత్త తేదీలు ఫిక్స్ చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. వాస్తవానికి ట్రంప్ ఈ నెలలోనే ( మార్చి) చైనాలో పర్యటించాల్సి ఉండగా యుద్ధం నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మేలో చైనా వెళ్లనున్నట్లు తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన నూతన తేదీలను వైట్హౌస్ ప్రకటించింది. మే 14, 15 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ భేటీ కానున్నట్లు తెలిపింది. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.."యుద్ధం మరో నాలుగు నుండి ఆరు వారాల్లో ముగియవచ్చు. ట్రంప్ చైనా వెళ్లే సమయానికి పరిస్థితులు చక్కబడతాయి". అని అన్నారు.కాగా చైనా పర్యటనపై గతవారం ట్రంప్ స్పందించారు. "మేము చైనాతో కలిసి పనిచేస్తున్నాము. నేను చైనా అధ్యక్షున్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. ఆయన కూడా నన్ను కలవాలని ఎదురుచూస్తాడు అనుకుంటా "అని అన్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో మూతపడింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కాగా ఈ మార్గాన్ని రక్షించడానికి సైనిక సహాయం అందించాలని ట్రంప్ చైనాను సహాయం కోరతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. అధిక పన్నుల ప్రకటన తర్వాత తొలిసారిగా ఇరు దేశాల అధినేతలు భేటీ అవతుండడంతో ఇరు దేశాల వాణిజ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఫైటర్ జెట్ను కూల్చేసాం.. ఇరాన్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్కు చెందిన ఫైటర్ జెట్ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026 -
టెలిగ్రామ్లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్ చేస్తే!
టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా విదేశీ శక్తులు యువతను ప్రలోభ పెడుతున్నాయనేందుకు నిదర్శనగా ఒక షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్ ఏజెంట్లతో చేతులు కలిపి గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ 14 ఏళ్ల ఇజ్రాయెల్ మైనర్ బాలుడిపై అభియెగాలు నమోదు కావడం నెట్టింట చర్చకు దారి తీసింది. టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, వారిచ్చిన పనులను పూర్తి చేస్తూ డబ్బులు (క్రిప్టోకరెన్సీ) తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.మధ్య ఇజ్రాయెల్కు చెందిన 14 ఏళ్ల బాలుడిపై ఇరాన్ కోసం గూఢచర్యం చేసినందుకు, ఇరాన్ గూఢచారుల కోసం డబ్బు తీసుకుని పనులు చేసినందుకు అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు బుధవారం తెలిపారని ఇజ్రాయెల్ ఆధారిత ఐ24 న్యూస్ నివేదిక పేర్కొంది. టెల్ అవీవ్ జిల్లా బాలల న్యాయస్థానంలోని స్టేట్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆ బాలుడు ఉద్యోగానికి ఆశపడి, గత ఏడాది ఏప్రిల్లో టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంప్రదింపులు జరిపాడు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటనఎలా మొదలైందీ అంటే..గత ఏడాది టెలిగ్రామ్లో వచ్చిన 'ఉద్యోగ ప్రకటన'కు మైనర్ బాలుడు స్పందించాడు. దీంతో హ్యాండ్లర్లు బాలుడితో పరిచయం పెంచుకున్నారు. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లోపలు అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రతిఫలంగాజరిగే లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరిగేవని దర్యాప్తులో తేలింది. నిందితుడు తన హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో నాలుగు డిజిటల్ వాలెట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనులన్నిటికీ కలిపి సుమారు లక్ష రూపాయలు అందుకున్నాడు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుఎలాంటి పనులు చేసేవాడుఇచిలోవ్ ఆసుపత్రి సమీప వీధులను చిత్రీకరించడం, రామత్ గాన్ ప్రాంతంలోని పరిసరాలను మ్యాపింగ్ చేయడం. 'కిర్యా' అనే కీలక మిలిటరీ కాంప్లెక్స్ను గుర్తించి, తెల అవీవ్ ఆకాశహర్మ్యాలను (skyline) వీడియోలు తీయడం.కిర్యా మిలిటరీ ప్రాంతం సమీపంలో ఒక అపార్ట్మెంట్ను వెతికి, దాని ఫోటోలను, యజమానుల వివరాలను తన హ్యాండ్లర్లకు పంపడం.మరో సందర్భంలో, విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఇంటి సమీపంలో గ్రాఫిటీ (గోడలపై రాతలు) వేసి, పరిసరాలను రికార్డ్ చేయమని అతడిని కోరారు, కానీ పాఠశాల పని కారణంగా ఆ పనిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు అరెస్ట్ తర్వాత సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. తన వాలెట్లో ఉన్న డబ్బు తన క్లాస్మేట్ పంపాడని అబద్ధం చెప్పమని తన స్నేహితుడిని కోరడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడని అభియోగపత్రంలో పేర్కొన్నారు. -
కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
పాకిస్థాన్కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
కొత్త నిబంధనలు.. రేషన్ బియ్యం తరహాలో రేషన్ పెట్రోల్, డీజిల్
లుబ్లియానా: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా పడుతోంది. ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనే ప్రయత్నంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశం స్లోవేనియా ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. దీంతో వాహన దారులు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, ఇతర సహజ వనరులు రవాణా చేసే నౌకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ అంతరాయాలను ఎదుర్కొనేందుకు స్లోవేనియా కొత్త చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయంతో ఆ దేశంలోని పెట్రోల్, డీజిల్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో వాహన దారులకు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇంధన రేషన్ రూల్స్లో భాగంగా వ్యక్తిగత వాహనదారులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల ఇంధనం వరకు కొనుగోలు చేసుకోవచ్చు. వ్యాపారాలు, రైతులకు మరింత సడలింపు ఇచ్చి రోజుకు 200 లీటర్ల వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇంధనం కొరత లేదు‘స్లోవేనియాలో తగినంత ఇంధనం ఉంది. ఇంధనం గిడ్డంగులు నిండుగా ఉన్నాయి. ఇంధన కొరత ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని ప్రధాన మంత్రి రాబర్ట్ గోలోబ్ అన్నారు. స్లోవేనియా ప్రభుత్వం నిర్ణయాలను అక్కడి పెట్రోల్ బంకులు నిర్వాహకులే అమలు చేయాలి. వినియోగదారులు అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేసుకోకుండా ఉద్యోగులు నిర్ధారించుకోవాలి. ఈ సందర్భంగా విదేశీ డ్రైవర్ల కోసం కఠినమైన పరిమితులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇంధన విక్రయ సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది.ఈ చర్యల ఫలితంగా స్లోవేనియాలో ‘ఫ్యూయల్ టూరిజం’ ఊపందుకుంది. స్లోవేనియాలో పెట్రోల్,డీజిల్ తక్కువ ధరకే లభ్యం కావడంతో దాని సరిహద్దు దేశాల ప్రజలు సైతం క్యూకట్టారు. స్లోవేనియాకు వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. -
యుద్ధం ముగింపునకు ట్రంప్ బిగ్ ప్లాన్.. ఇరాన్కు కష్టమే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరాన్ యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని సూచనలు చేశారు. దీంతో, ట్రంప్ ప్రణాళికను ఇరాన్ అంగీకరిస్తుందా? అనే చర్చ నడుస్తోంది.కాగా, ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో చర్చలకు సిద్దమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ సిద్దం చేసినట్టు ఇజ్రాయెల్ చానెల్ 12 పలు కథనాలను వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదని, క్షిపణి కార్యక్రమాలను తగ్గించాలని, హార్మూజ్ సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచాలని, ఒక నెల కాలం కాల్పుల విరమణ జరగాలని సూచించారు. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, ఇరాన్కి ఉన్న మూడు ప్రధాన శక్తులను (అణు, క్షిపణి, ప్రాంతీయ ప్రభావం) వదులుకోవాలని ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికలో ముఖ్యాంశాలు..అణ్వాయుధాలు: ఇరాన్కి అణ్వాయుధాలు ఉండకూడదు, అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి.క్షిపణి కార్యక్రమాలు: బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను తగ్గించాలి.హార్మూజ్ సముద్ర మార్గం: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని తెరిచి ఉంచాలి.కాల్పుల విరమణ: ఒక నెలపాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపాలి.ప్రాంతీయ ప్రభావం: ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించాలి.పాకిస్తాన్ మధ్యవర్తిత్వం: ఈ ప్రణాళికను ఇరాన్కి పాకిస్తాన్ ద్వారా పంపించారు.సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ: బుషెహర్ వద్ద ఇరాన్కి శాంతియుత అణు శక్తి అభివృద్ధికి సహాయం అందించవచ్చని సూచన.నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నిలిపివేసి ధ్వంసం చేయాలి.ఇరాన్ సరిహద్దులలోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్ను విడిచిపెట్టాలి.క్షిపణుల భవిష్యత్ వినియోగం: కేవలం ఆత్మరక్షణ ప్రయోజనాల కోసం మాత్రమేIsrael's Channel 12 (@yaronavraham) published the Trump Administration's 15-point plan (I counted 14) sent to Iran to end the war:1. All existing nuclear capabilities will be dismantled.2. A commitment that Iran will never strive to obtain nuclear weapons.3. No material will…— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) March 24, 2026మరోవైపు.. ఇరాన్పై ట్రంప్ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ నౌకాదళం , వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, సైన్యంపరంగా వాళ్లు చచ్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా.. ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. దాదాపుగా వారి వద్ద ఉన్న ప్రతీదీ పోయింది. టెహ్రాన్తో పాటు వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి’ అని చెప్పారు. ఇదే సమయంలో అమెరికాకు ఇరాన్ హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బహుమతి ఏమిటన్న వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. -
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక ‘రహస్య బహుమతి’ అందిందని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘వారు మాకు ఒక బహుమతి ఇచ్చారు. అది చాలా పెద్దది. దాని విలువ అపారం. ఇది అణు సంబంధమైనది కాదు. చమురు, గ్యాస్కు సంబంధించినది. వారు చేసిన పని చాలా మంచిది’ అని పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏమిటన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీసాయి. చమురు సరఫరా, సముద్ర మార్గ భద్రత లేదా ఇతర వ్యూహాత్మక అంశాలకు సంబంధించినదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.ట్రంప్ మరోసారి అమెరికాదే పైచేయి అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో యుద్ధం త్వరగా ముగియడం పట్ల రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ నిరాశ చెందారని తెలిపారు. అమెరికా అధికారులు టెహ్రాన్లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరాన్ నాయకులు యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ తరచుగా ఈ మార్గాన్ని మూసివేస్తానని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.గత కొన్ని వారాలుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించింది. మిత్రదేశాలను కూడా యుద్ధ నౌకలు పంపమని కోరింది. అయితే, చాలా దేశాలు దీనికి నిరాకరించాయి.ట్రంప్ చెప్పిన ‘రహస్య బహుమతి’ అసలు ఏమిటన్నది స్పష్టత లేకపోయినా, ఇది అమెరికా–ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక సర్దుబాటు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాకిస్తాన్కు బంపరాఫర్.. ట్రంప్ ప్లానేంటి?
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విషయమై ఉత్కంఠ నెలకొంది. అసలు చర్యలు జరుగుతాయా? యుద్ధం ముగుస్తుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నేతలు బయటకు వచ్చి ట్రంప్తో చర్చల్లో పాల్గొంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధమని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అనంతరం, షరీఫ్ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేయడం ఆసక్తిని పెంచింది. అంటే, చర్చలకు పాకిస్తాన్ వేదిక కానుందనే సంగతి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా చర్చలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో..‘పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం పాకిస్తాన్కు లభిస్తే మేము.. దానిని ఒక గౌరవంగా భావిస్తాం. అమెరికా, ఇరాన్ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాకిస్తాన్ స్వాగతిస్తుందని అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన పోస్టును ట్రంప్ షేర్ చేయడం విశేషం. అంటే, పాకిస్తాన్ వేదికగా చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ను ట్రంప్ ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రంప్ ప్లానేంటి అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇదిలా ఉండగా.. రహస్యంగా జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన ప్రకటన, ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. అయితే, అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ను ఎంపిక చేస్తారంటూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. కాగా, ఈ ఊహాగానాలను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు వెలువడే వరకు వేచి చూడాలని మీడియాకు పాక్ విదేశాంగ శాఖ సూచించింది.Pakistan welcomes and fully supports ongoing efforts to pursue dialogue to end the WAR in Middle East, in the interest of peace and stability in region and beyond. Subject to concurrence by the US and Iran, Pakistan stands ready and honoured to be the host to facilitate…— Shehbaz Sharif (@CMShehbaz) March 24, 2026 -
తమ షరతులు అంగీకరిస్తే కాల్పుల విరమణ: ఇరాన్
-
హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. -
ఇరాన్ జాతీయ భద్రతా మండలికి కొత్త చీఫ్
దుబాయ్: ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు నూతన కార్యదర్శిగా మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ను నియమించారు. ఈయన గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్స్ప్ (ఐఆర్జీసీ)లో గతంలో కమాండర్గా సేవలందించారు. ఐఆర్జీసీలో ఉంటూ ఈయన గతంలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగారు.ఇప్పటికే జోల్ఘదర్ ఇరాన్ పార్లమెంట్కు, 12 మంది సభ్యులుండే గార్డియన్ కౌన్సిల్కు మధ్య పొడచూపే విబేధాలను పరిష్కరించే ఇరాన్ ఎక్స్పిడియన్సీ కౌన్సిల్కు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలా లారిజానీ ఇటీవల దాడుల్లో చనిపోవడంతో జోల్ఘదర్ను ఎంపికచేశారు. -
ఐనా.. ఆగని దాడులు!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది. చమురు క్షేత్రాలకు నష్టం ఇరాన్లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్మెంట్పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. టెల్ అవీవ్లో విధ్వంసం ఇరాన్ కూడా ఇజ్రాయెల్పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్మెంట్తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్లో 16కు పెరిగిన మృతుల సంఖ్యఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు. యుద్ధ నెపం హెగ్సెత్పై!దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు. -
ఇరాన్కు అమెరికా స్పెషల్ ఫోర్స్.. రీజన్ ఇదే..?
మధ్యప్రాచ్యంలో యుద్దంపై అమెరికా ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు అదనపు బలగాలు అక్కడికి పంపిస్తున్నట్లు సమాచారం. తాజాగా అమెరికా మెరైన్ బలగాలకు సహాయంగా మిడిల్ ఈస్ట్కు అత్యంత శక్తివంతమైన 3,000 మంది ఎలైట్ సైనికులు పంపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి..ఇంతకాలం బాంబులు మిసైళ్లతో దద్దరిళ్లిన మిడిల్ ఈస్ట్ ఇప్పుడు కొంత శాంతించింది. ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇవ్వడంలో ప్రస్తుతం ఇరు వర్గాలు శాంతించాయి. అయితే ఇరాన్తో చర్చలు సఫలమవుతున్నాయని అణు ఆయుధాలు తయారు చేయకుండా ఉండడానికి ఆదేశం అంగీకరించదని వైట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా సాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా, అమెరికా తన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుండి సుమారు 3,000 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్న మెరైన్ బలగాలకు మద్ధతుగా ఈ ఎలైట్ సైనికులు రాబోయే శుక్రవారం నాటికి అక్కడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడానికి లేదా ఇరాన్ యొక్క వ్యూహాత్మక దీవులను నియంత్రించడానికి ఈ బలగాలను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఇరాన్ మూసివేసినట్లు ప్రకటించిన హోర్ముజ్ జలసంధిని తెరిపించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ చాలా శక్తివంతమైన ఆర్మీగా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ 18 గంటల్లో వీరు చేరుకోగలరు. వీరు పారాచూట్ ద్వారా శత్రువుల ప్రాంతాల్లోకి ప్రవేశించడంలో దిట్టలు. -
ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్
పశ్చిమాసియా యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. వైట్హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు.పశ్చిమాసియా యుద్ధం తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అమెరికా తరచుగా చెబుతున్నప్పటికీ టెహ్రాన్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైట్హౌస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ప్రస్తుతం ఇరాన్లో సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నాం వారు ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco పాల్గొంటున్నారు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని అంగీకరించిందని తెలిపారు.అదేవిధంగా ఇరాన్పై అమెరికా చేసిన దాడుల వల్ల అక్కడి పాలనలో మార్పు జరగబోతుందని తెలిపారు. కాగా ఈ యుద్ధం ముగిసినట్టేనా?: ఇరాన్తో శాంతి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుందని ట్రంప్ను ప్రశ్నించగా.. "ఈ యుద్ధంలో విజయం సాధించాం" అని సమాధానమిచ్చారు. అయితే చర్చల విషయంలో ఇరాన్ ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
లండన్లో యూదు అంబులెన్సులు దగ్ధం
లండన్లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గత సోమవారం తెల్లవారు జామున దుండగులు ఈచర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించే నాలుగు అంబులెన్స్లు దగ్ధమయ్యాయి. వాహనాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.ఈ ఘటనను ఆదేశ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత రెండేళ్లలో బ్రిటన్లో యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో 1,662 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,700కు పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి. -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
కంటికి తల తీస్తాం.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో చర్చల అంశం నడుస్తున్న వేళ ఇరాన్ ట్రంప్నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయీ అన్నారు. కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని హెచ్చరించారు.అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని 'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం ట్రంప్ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం ఎక్స్లో చేసిన పోస్ట్లో ఈ వివరాలు తెలిపారు.కాగా, అలీ లారిజానీ మృతితో కొత్త సెక్యూరిటీ చీఫ్ను నియమించింది ఇరాన్. మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించింది. దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’. డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసినప్పటికీ ఇరాన్ దాడులు ఆపడం లేదు. ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను, 17 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ ఇవాళ ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిలిప్పీన్స్ ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ ప్రకటన చేశారు. దేశీయ ఇంధన సరఫరాలు, ఎనర్జీ స్టెబిలిటీపై ఇరాన్ యుద్ధం వల్ల పడ్డ ప్రభావాన్ని ఆయన గుర్తు చేశారు.“పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో, దేశ ఎనర్జీ సరఫరా లభ్యత, స్థిరత్వానికి ప్రమాదం ఉండడంతో జాతీయ శక్తి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం,” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో తెలిపారు. President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026 -
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న యూ టర్న్కు ముందు ఏం జరిగింది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వార్కు బ్రేక్ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని ట్రంప్ ప్రకటనకు కేవలం 15 నిమిషాల ముందే మార్కెట్లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్ రియాక్షన్ కేవలం 20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.ట్రంప్ వార్ బ్రేక్ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్కు 88.70 డాలర్లను తాకింది.ఇరాన్పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.'అన్యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు. మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్ను కొనుగోలు చేశారు.రెండో బెట్ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలుట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం ఎక్స్లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు ఏం జరిగింది అనేదానిపై కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.నికోలస్ మదురో అరెస్ట్కు ముందు కూడాఅలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే దీని వెనుక ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ -
ఎఫ్-35.. ఇక చౌక బేరం!
ప్రపంచంలోనే అత్యాధునిక అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35ను కూల్చివేసినట్టు ఇరాన్ ఈ నెల 19న ప్రకటించింది. ఈ వాదనే నిజమైతే ప్రపంచంలో ఆ ‘ఘనకార్యం’ చేసిన తొలి దేశం ఇరానే అవుతుంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఎఫ్-35 ఫైటర్ జెట్... అమెరికా మిలిటరీ పరాక్రమానికి రెండు దశాబ్దాల ప్రతీక. శత్రువులు కనుగొనలేని, ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా గుర్తించలేని స్టెల్త్ సామర్థ్యంతో దూసుకెళుతూ దాడులు జరిపేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.రాడార్ సైతం గుర్తించలేని, శత్రువుల కంటబడని ఓ అమేయ ‘అదృశ్య శక్తి’గా విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఎఫ్-35 విమానానికి సంబంధించి కీలక బలహీనతను తాము కనిపెట్టినట్టు ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది. తాము సొంతంగా అభివృద్ధి చేసుకున్న ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి ద్వారా అమెరికన్ ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చినట్టు పేర్కొంది.గమనంలో ఎఫ్-35 జెట్ వెలువరించే వేడి లేదా పరారుణ వికిరణం ఆధారంగా ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశామని తెలిపింది. రాడార్లకు దొరక్కుండా తప్పించుకునే సామర్థ్యం ఎఫ్-35కు ఉంటే ఉండొచ్చుగాక... ఇంజిన్ విడుదల చేసే వేడి పరంగా (హీట్ సిగ్నేచర్) మాత్రం అది పూర్తిగా శత్రువుల కళ్లుగప్పలేదని తేటతెల్లమైంది.ఎఫ్-35ను దెబ్బకొట్టడానికి తమ ‘తలాష్’ గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్టు తొలుత పేర్కొన్న ఇరాన్... వాస్తవానికి ‘మాజిద్’ (ఏడీ-08) స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో కేవలం ఒకేఒక క్షిపణితో ఆ కార్యం సాధించినట్టు తుది పరిశీలన అనంతరం ప్రకటించింది. శత్రు రాడార్ల సంకేతాలను నిలువరించేలా లేదా వాటిని చెల్లాచెదురు చేసేలా ఎఫ్-35లోని ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కానీ ఈ సందర్భంలో అవేవీ అక్కరకు రాలేదు. ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ 2021లో తొలిసారి ఆవిష్కరించింది. ఇది రాడార్ బదులు పరారుణ సాంకేతికతపై ఆధారపడుతుంది.ఎఫ్-35లపై స్పెయిన్ వెనుకంజ!ఎఫ్-35ను ఇరాన్ కూల్చివేసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సైనిక, రక్షణ రంగాల నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గగనతలంలో ఎఫ్-35కు ఎదురేలేదని ఇన్నాళ్లూ కొనసాగిన ఏకధాటి భావనను తాజాగా సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’కు ఎఫ్-35 సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిణామం పలు దేశాలను ఇప్పుడు పునరాలోచనలో పడవేయనుంది. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ లాక్ హీద్ మార్టిన్ తయారుచేసిన ఐదో తరం ఎఫ్-35 స్టెల్త్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను స్పెయిన్ ప్రభుత్వం ఏడాది క్రితమే అటకెక్కించింది.2030 నాటికి తమ హారియర్ ఏవీ8బీ ఫైటర్లను తప్పించి వాటి స్థానంలో నేవల్ వెర్షన్ అయిన ఎఫ్-35బి జెట్స్ మోహరించేందుకు స్పెయిన్ నౌకాదళం తొలుత ఆసక్తి చూపినా చివరకు వెనకడుగు వేసింది. ఎఫ్సీఏఎస్ (ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్) రూపొందించే ఆరో తరం యుద్ధవిమానాల కోసం నిరీక్షించాలని, అవి అందుబాటులోకి వచ్చేవరకు తమ మెక్ డానెల్ డగ్లస్ ఎఫ్/ఏ-18 హార్నెట్స్ స్థానంలో ఎఫ్-35ఏ యుద్ధవిమానాలను తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని స్పెయిన్ వైమానికదళం కూడా భావించింది.తమ నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాల రీత్యా పాత విమానాలను డీకమిషన్ చేసి వాటి బదులు ఎఫ్-35లను ప్రవేశపెట్టడానికి స్పెయిన్ తన 2023 బడ్జెట్లో 6.25 బిలియన్ యూరోలను (సుమారు రూ.68 వేల కోట్లు) ప్రాథమికంగా కేటాయించింది. ప్రస్తుతం ఆ ప్రణాళికలు మూలనపడ్డాయి. ఎఫ్-35ల బదులు ఎయిర్ బస్ నేతృత్వంలోని సంస్థలు తయారుచేసే ‘యూరోఫైటర్’ జెట్స్ కొనాలని స్పెయిన్ తలపోస్తోంది.ఫ్రెంచ్ రఫేల్ వైపే భారత్ మొగ్గు!ఇరుదేశాల రక్షణ బంధం బలోపేతం దిశగా ఎఫ్-35 యుద్ధవిమానాలను ఇండియాకు అమ్ముతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఆఫర్ ఇచ్చారు. వేరియంట్ ఆధారంగా ఒక్కో ఎఫ్-35 ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఎఫ్-35లో ఎ, బి, సి అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్-35ఎ రకం జెట్ టేకాఫ్, ల్యాండింగ్ సాధారణ విమానాల మాదిరిగా ఉంటుంది. దీనికి పొడవైన రన్ వే కావాలి.ఎఫ్-35బి వెర్షన్ అయితే అతికొద్ది రన్ వేతో పైకి లేచి నిట్టనిలువుగా కిందికి దిగగలదు. ఇక ఎఫ్-35సి అనేది... విమాన వాహక నౌకల (నేవీ క్యారియర్ బేస్డ్) కార్యకలాపాల్లో వాడే వేరియంట్. ఎఫ్-35లను కొనబోమని భారత్ గతంలోనే స్పష్టీకరించింది. తమ వైమానిక దళ అవసరాల కోసం రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధవిమానాలను సేకరించే ప్రతిపాదనను భారత్ ఇటీవల ఆమోదించింది.అదే బాటలో స్విట్జర్లాండ్, కెనడా!అమెరికన్ ఎఫ్-35 జెట్స్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ స్విట్జర్లాండులోనూ నిరుడు డిమాండ్లు ఊపందుకున్నాయి. 36 ఎఫ్-35ఎ విమానాలను కొనాలని స్విట్జర్లాండ్ మొదట్లో భావించింది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర కారణాల రీత్యా ధర పెరిగినందున అన్ని జెట్స్ కొనలేమని, ఆరు విమానాలను తగ్గించి 30 మాత్రమే ఎఫ్-35లను కొనుగోలు చేస్తామని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ ఈ నెల 6న వెల్లడించింది.ఇక కెనడా విషయానికొస్తే 16 ‘ఎఫ్-35ఏ లైట్నింగ్ 2’ విమానాల కోసం తొలుత ఆర్డర్ ఇచ్చింది. అవి త్వరలో అందుతాయి. అదనంగా మరో 14 ఎఫ్-35ల కొనుగోలుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. అయితే విమానాల ధర పెరగడం, అమెరికాతో రాజకీయ-వర్తక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని కెనడా ప్రభుత్వం మరిన్ని ఎఫ్-35లను కొనాలా? వద్దా? అని ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతోంది. ‘హీట్ సిగ్నేచర్’ బలహీనతను కనిపెట్టి ఇరాన్ కొట్టిన ఉండేలు దెబ్బకు భవిష్యత్తులో ఎఫ్-35లకు గిరాకీ తగ్గి కొనుగోలు మార్కెట్ డీలా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భలే మంచి చౌక బేరం తప్పదా?!- జమ్ముల శ్రీకాంత్(Credits: The Wall Street Journal, MSN, Reuters, Politico, The Hill) -
45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్
టోక్యో: జపాన్లో ఇటీవలి కొత్త ఆవిష్కరణ విశేషంగా నిలుస్తోంది. 1982 తర్వాత జపాన్లో గుర్తించిన మొట్ట మొదటి కొత్త పక్షి జాతిగా శాస్త్రవేత్తలు టోకారా లీఫ్ వార్బ్లర్ను గుర్తించారు దాదాపు 45 ఏళ్ల తర్వాత జపాన్లో గుర్తించిన మొదటి కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. పక్షుల శాస్త్రీయ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అంటూ కొత్త అతిథి రాకపై హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దామా...శాస్త్రవేత్తలు జపాన్లోని టోకారా దీవుల్లో 'టోకారా లీఫ్ వార్బ్లర్' (Phylloscopus tokaraensis) అనే కొత్త పక్షి జాతిని కనుగొన్నారు. డాక్టర్ కెంటా మోరిషిత నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఆధునిక సాంకేతికత (జన్యు పరిశోధన) అందుబాటులోకి రావడంతో ఎప్పుటినుంచో మన కళ్ల ముందే ఉన్నా గుర్తించ లేక పోయిన జీవులను ఇప్పుడు కనిపెట్టడం సాధ్యమవు తోందని నిపుణులు చెబుతున్నారు.టోకారా లీఫ్ వార్బ్లర్ (Tokara Leaf Warbler) విశేషాలుజన్యు అధ్యయనాలు దీనిని ఒక కొత్త జాతిగా నిర్ధారించాయి. ఈ పక్షి కేవలం మారుమూల టోకారా దీవులలో మాత్రమే, అక్కడి దట్టమైన అడవుల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది చూడటానికి 'ఇజిమాస్ లీఫ్ వార్బ్లర్' (Phylloscopus ijimae) అనే పక్షిని పోలి ఉంటుంది. ఇవి చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ పక్షి పొడవు సుమారు 10–12 సెంటీమీటర్లు, బరువు కేవలం 6–9 గ్రాములు మాత్రమే ఉంటుంది.జన్యు పరిశోధన ఒక గేమ్-ఛేంజర్సాధారణంగా, పక్షుల గుర్తింపు వాటి రూపాన్ని బట్టి ఉంటుంది. ఈ పక్షి చూడటానికి పాత జాతిలాగే ఉన్నప్పటికీ, DNA (జన్యు) సీక్వెన్సింగ్ అది పాడే పాట విధానం (Song patterns) ద్వారా ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పక్షుల జనాభా చాలా తక్కువగా ఉంది. అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పుల వల్ల వీటికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.జపాన్లోని ద్వీపాలు జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయని, జాగ్రత్తగా చేసే పరిశోధనలతో వాటిని కనుక్కోవచ్చు అనేది మనకు గుర్తు చేస్తుందని ఈ కొత్త పక్షి జాతి ఆవిష్కరణలో ప్రముఖ పరిశోధకులలో ఒకరైన డాక్టర్ కెంటా మోరిషితా అన్నారు. -
‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!
చాంగ్చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో కొందరు దొంగలు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026చాంగ్చువాంగ్ ఎక్స్ప్రెస్వే హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్! -
ఖమేనీ హత్యకు 48 గంటల ముందు.. తెర వెనుక జరిగింది ఇదే..!
ఖమేనీ హత్యకు 48 గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ వివరాలను రాయిటర్స్ సంచలన నివేదిక వెల్లడించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. నెతన్యాహుతో జరిపిన ఫోన్ కాల్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దాడులు ప్రారంభం కావడానికి 48 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ కీలక సంభాషణ జరిగినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని నెతన్యాహు ట్రంప్ను ఒప్పించినట్లు రాయిటర్స్ తెలిపింది. అలీ ఖమేనీ తన ముఖ్య అనుచరులతో కలిసి టెహ్రాన్లోని తన నివాసంలో సమావేశం కానున్నట్లు ట్రంప్, నెతన్యాహు ఇద్దరికీ ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి.ఇది "డెకాపిటేషన్ స్ట్రైక్" (అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకునే దాడి) చేయడానికి సరైన సమయమని వారు భావించారు. టెహ్రాన్లో జరగాల్సిన సమావేశం శనివారం రాత్రి జరగాల్సి ఉండగా.. శనివారం ఉదయానికి మార్చబడినట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. వెంటనే ఇద్దరు నేతలు ఫోన్ ద్వారా చర్చించుకున్నారు. ఫిబ్రవరి 27న ట్రంప్ తుది ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం మొదటి బాంబులు పడగా.. ఆ సాయంత్రం ట్రంప్ ఖమేనీ మరణాన్ని ప్రకటించినట్లు రాయిటర్స తన రిపోర్ట్లో పేర్కొంది.స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్ఫుల్గా ట్రాక్ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘ఇరాన్పై యుద్ధం నీవల్లే.. పీట్పై ట్రంప్ చిందులు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని పట్టుబడుతున్న ట్రంప్.. ఇరాన్పై యుద్ధం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా..ఇరాన్తో యుద్ధం చేయాలన్న ఆలోచన తనది కాదని, అది అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ అంటూ ఆయనపై చిందులు తొక్కాడు. దీంతో ఇరాన్పై యుద్ధంలో ట్రంప్ అల్లుతున్న మరో కట్టుకథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల పేరుతో ఇరాన్పై యుద్ధానికి దిగిన ట్రంప్పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇరాన్పై యుద్ధం అపవాదు నుంచి భయటపడేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా, అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ట్రంప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్కు ఇరాన్పై యుద్ధం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ట్రంప్ తనదైన స్టైల్లో.. ఇరాన్పై యుద్ధం చేయాలన్న ఆలోచన మా డిఫెన్స్ సెకట్రరీ పీట్ది. ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాన్ని ఆపాలని పిలుపునిచ్చింది ఆయనేనంటూ పక్కనే కూర్చున్న పీట్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నేను పీట్కు ఫోన్ చేశాను. నేను జనరల్ కేన్కు ఫోన్ చేశాను. గొప్పగొప్ప వ్యక్తులకు ఫోన్ చేశాను. మనకు పశ్చిమాయాలో ఓ సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే పశ్చిమాసియాలో ప్రయాణం చేసి ఆ పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా దాడి ఎందుకు చేస్తోంది?. యుద్ధం వెనుకున్నది ఎవరు? ఇలా అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతున్న.. ట్రంప్ అల్లిన మరోకట్టు కథ అల్లినట్లైంది. ఇరాన్తో మనం యుద్ధం ఎందుకు చేస్తున్నాం? అని ట్రంప్ యంత్రాంగంలో ఓ ఇద్దరిని అడిగినా సమాధానం ఉండదు. ఎందుకంటే యుద్ధం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ ఇరాన్తో యుద్ధం చేయాడానికి గల కారణాలు అమెరికా వద్ద అనేకం ఉన్నాయి. వాటిల్లో ఇజ్రాయెల్ ఎలాగూ దాడి చేయబోతోందని, అందువల్ల అమెరికా జోక్యం అనివార్యమైందని ట్రంప్ ప్రభుత్వంలోని ప్రముఖులు అంటుంటే.. మరికొందరు తమ దేశంపై ఇరాన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుందని ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధంలో ఇప్పుడు పీట్ హెగ్సెత్ను ట్రంప్ బలి పశువును చేయడంపై అమెరికన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్!
ల్యాప్టాప్ అవసరం లేకుండానే ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చకచకా పూర్తయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ఇప్పుడు దీన్ని సాకారం చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘క్లాడ్’ (Claude)కు సంబంధించి ఒక విప్లవాత్మకమైన ఫీచర్ను ‘ఆంత్రోపిక్’ తాజాగా పరిచయం చేసింది.మనిషిలాగే కంప్యూటర్ వాడకంఇప్పటివరకు మనం ఏఐ సాయంతో ప్రశ్నలు అడగడమో లేదా సమాచారం సేకరించడమో చేసేవాళ్లం. కానీ ఇకపై ‘క్లాడ్’.. మీ కంప్యూటర్ను ఒక మనిషి మాదిరిగా ఆపరేట్ చేయగలదు. మౌస్ కదపడం, కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం, స్క్రీన్ను రీడ్ చేయడం లాంటి పనులను ఇది సునాయాసంగా చేస్తుంది. ఫలితంగా మీరు కంప్యూటర్ ముందు లేకపోయినా, మీరు ఇచ్చిన టాస్క్లను ‘క్లాడ్’ పూర్తి చేస్తుంది. అంటే మీ పనులను చక్కబెట్టే ఒక నమ్మకమైన ‘రిమోట్ ఉద్యోగి’ మీతో పాటు ఉన్నట్టేనని ‘ఆంత్రోపిక్’ పేర్కొంది.ల్యాప్టాప్ అవసరం లేని భవిష్యత్తుఈ కొత్త ఫీచర్ గురించి ఆంత్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ మాట్లాడుతూ ‘పని కోసం ల్యాప్టాప్ తెరవాల్సిన అవసరం లేని భవిష్యత్తు అత్యంత వేగంగా మనకు చేరువవుతోంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆఫీస్ పనుల కోసం ఇకపై డెస్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ నుంచే క్లాడ్ ద్వారా అన్నింటినీ చక్కబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.ఇది ఎలా పనిచేస్తుంది?క్లాడ్ మీ కంప్యూటర్లోని స్లాక్ (Slack) లేదా క్యాలెండర్ లాంటి అప్లికేషన్లకు కనెక్ట్ అవుతుంది. అవసరమైతే ఇతర యాప్స్ యాక్సెస్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది. ఇటీవలే విడుదలైన 'డిస్పాచ్' (Dispatch) ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచే కంప్యూటర్లో ఉన్న క్లాడ్కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మీరు బయట తిరుగుతున్నా, ‘క్లాడ్’ మీ బ్రౌజర్లో సమాచారం వెదకడం, స్ప్రెడ్షీట్లను నింపడం లాంటి పనులను చిటికెలో పూర్తి చేసి పెడుతుంది.ఎవరికి అందుబాటులో ఉంటుంది?ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం రీసెర్చ్ ప్రివ్యూ దశలో మాత్రమే ఉంది. పెయిడ్ వెర్షన్ వాడుతున్న ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork)‘క్లాడ్ కోడ్’ (Claude Code) యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలరు. ముఖ్యంగా ప్రస్తుతం ఇది కేవలం మ్యాక్ ఓఎస్ (macOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం క్లాడ్ డెస్క్టాప్, మొబైల్ యాప్స్ రెండింటినీ అప్డేట్ చేసి అనుసంధానించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఏఐ పోటీఆటోమేషన్ రంగంలో వస్తున్న ఈ మార్పులు టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ‘నెమోక్లా’ (NemoClaw)ను అందుబాటులోకి తీసుకురాగా, మెటా, ఓపెన్ ఏఐ సంస్థలు కూడా తమ సొంత ఏఐ ఏజెంట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రేసులో ఆంత్రోపిక్ ఒక అడుగు ముందే ఉన్నదని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం -
పాక్ మునీర్తో ట్రంప్ ఫోన్ కాల్.. అంతలోనే షాక్
వాషింగ్టన్: ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్తో చర్యలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్యలు జరుగుతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీన్ని వైట్హౌస్ వర్గాలు ఖండించాయి. చర్యలు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.అయితే, ఇరాన్తో ట్రంప్ చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ సైనాధికారి ఆసిమ్ మునీర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు బయటకు వచ్చాయి. మధ్యవర్తిత్వానికి ఆయనే ఉండాలని కోరినట్టు కథనాలు పేర్కొన్నాయి. ఇదేసమయంలో అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్ను పాకిస్తాన్ ప్రతిపాదించినట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ముందడుగు అంటూ పలు కథనాలు వెలువడ్డాయి.Pakistan army chief speaks with US President Trump about the ongoing West Asia conflict as Islamabad positions itself as a mediator: UK media report.#Pakistan #WestAsiaConflict #Iran #Israel #ITVideo | @Sriya_Kundu pic.twitter.com/VCnOzetBio— IndiaToday (@IndiaToday) March 24, 2026ఈ క్రమంలో పాక్లో మధ్య వర్తిత్వ చర్చల కథనాలపై వైట్హౌస్ స్పందించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్లు ఇరాన్ ప్రతినిధులతో ఇస్లామాబాద్లో భేటీ కానున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ కథనాలు ఊహాజనితమని కొట్టేశారు. చర్యలకు వేదికపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే తామే వెల్లడిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో, పాక్ అనుకూల కథనాలకు తెరపడినట్టు అయ్యింది. -
ట్రంప్నకు టెన్షన్.. ఇరాన్, పుతిన్ సీక్రెట్ ఆపరేషన్!
కీవ్: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేసినట్టు ట్రంప్ తెలిపారు. ఇరాన్తో చర్చలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో బాంబు పేల్చారు. ఇరాన్కు రష్యా గూఢచర్య సమాచారాన్ని అందిస్తోందని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ఇరాన్ యుద్ధంపై స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ వీడియోలో మాట్లాడుతూ.. అమెరికాతో యుద్ధం సమయంలో రష్యా వారికి సహకరించింది. ఇరాన్ ప్రభుత్వానికి రష్యా గూఢచర్య సహాయాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది ఒక విధ్వంసకర చర్యగా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తప్పక ఆపాలి. ఎందుకంటే ఇది మరింత అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. యుద్ధం అనేక దేశాల్లో ఇంధన పరిస్థితిని గణనీయంగా క్లిష్టతరం చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి, మరింత కచ్చితంగా దాడులు చేయడానికి, రష్యా చేస్తున్న సహాయం యుద్ధాన్ని మరింత పొడిగిస్తోంది. యుద్ధం కారణంగా మార్కెట్లు ఇప్పటికే ప్రతికూలంగా స్పందిస్తున్నాయి’ అంటూ ఆయన తన పోస్టులో వెల్లడించారు.There is growing evidence that the Russians continue to provide the Iranian regime with intelligence support. This is clearly destructive activity, and it must be stopped, as it only leads to further destabilization. All decent states are interested in guaranteeing security and… pic.twitter.com/tg1WwPnb6n— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 23, 2026ఇరాన్తో రష్యా మంత్రి ఫోన్.. మరోవైపు.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ కారణంగా పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న క్షీణత గురించి మంత్రులు చర్చించారు. ఈ సంఘర్షణ కాస్పియన్ ప్రాంతంలోకి ప్రమాదకరంగా విస్తరించడంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.అంతకుముందు ట్రంప్.. ఇరాన్తో చర్చల గురించి ప్రస్తావించారు. చర్చలు చాలా వరకు కొనసాగాయి. వారు (ఇరాన్) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నారు. మేము కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాము. మేము ఈరోజు బహుశా ఫోన్ ద్వారా సమావేశమవుతాము. ఎందుకంటే వారు ఉన్న దేశం నుంచి బయటకు రావడం వారికి చాలా కష్టంగా ఉంది. అయితే అతి త్వరలో మేమందరం ప్రత్యక్షంగా కలుస్తాము. మేము దీనిని ఐదు రోజుల పాటు పరిశీలిస్తాము. అది ఎలా జరుగుతుందో చూద్దాం.ఒకవేళ అంతా సజావుగా సాగితే మేము దీనిని పరిష్కరిస్తాము. లేదంటే మా దాడులను యధావిధిగా కొనసాగిస్తాము. మార్కెట్లో సాధ్యమైనంత ఎక్కువ చమురు ఉండేలా చూడటమే నా ఉద్దేశం. సముద్రంలో చమురుతో నిండుగా ఉన్న నౌకలు ఉన్నాయి. ఆ చమురును అక్కడే నిల్వ ఉంచడం కంటే అది మార్కెట్లోకి చేరడమే నాకు ఇష్టం. ఇరాన్కు లభించే ఏ చిన్న మొత్తపు డబ్బు కూడా ఈ యుద్ధంలో ఎటువంటి మార్పునూ తీసుకురాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్లూటూత్ ఇయర్ఫోన్ల వాడకం ప్రతీ ఒక్కరికీ అవసరంగా మారింది. ఆఫీసు పనులైనా, ప్రయాణాలైనా ఇవి లేనిదే ఎవరూ ముందుకు నడవడం లేదు. అయితే వీటిని నిరంతరం వాడటం వల్ల రేడియేషన్ బారిన పడి ‘బ్రెయిన్ ట్యూమర్’ (మెదడు కణితి) వచ్చే ప్రమాదం ఉందంటూ, సోషల్ మీడియాలో తరచూ కథనాలు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఇలాంటి భయాల్లో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ దీనిపై సంచలన వివరణ ఇచ్చారు.అసలు నిజం ఏంటి?అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ.. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల చికిత్సలో నిపుణురాలు. ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అంశంపై నెలకొన్న అపోహలను శాస్త్రీయంగా తిప్పికొట్టారు. బ్లూటూత్ హెడ్ఫోన్ల వాడకానికి, బ్రెయిన్ ట్యూమర్లకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూ.. ‘మెదడులో పెరిగే ట్యూమర్లు, వినికిడి నాడుల వద్ద వచ్చే గడ్డలు (వెస్టిబ్యులర్ స్క్వానోమాస్), క్యాన్సర్ గడ్డలకు సర్జరీ చేసే వైద్యురాలిగా, సైన్స్ ఏం చెబుతుందో వివరిస్తున్నాను. బ్లూటూత్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’ అని ఆమె స్పష్టం చేశారు.పరిశోధనలు ఏం చెబుతున్నాయి?డాక్టర్ జుతానీ తన వివరణకు తోడుగా 2022లో నిర్వహించిన పరిశోధనను ఉదాహరించారు. దాదాపు 10 లక్షల మంది మహిళలపై 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో, బ్లూటూత్ లేదా సాధారణ హెడ్ఫోన్ల వాడకం వల్ల ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ సుదీర్ఘ అధ్యయనం ఇయర్ ఫోన్ల వినియోగదారుల్లో ఉన్న భయాన్ని పటాపంచలు చేసింది.రేడియేషన్కు భయపడాలా?సాధారణంగా రేడియేషన్ అనగానే ఎవరికైనా సరే క్యాన్సర్ గుర్తుకు వస్తుంది. అయితే అన్ని రకాల రేడియేషన్లు ప్రమాదకరం కావు. డాక్టర్ జుతానీ వివరణ ప్రకారం బ్లూటూత్ పరికరాల నుండి ‘నాన్-అయోనైజింగ్ రేడియేషన్’ విడుదల అవుతుంది. ఇది ఎక్స్-రేలు లేదా ఇతర ప్రమాదకర కిరణాల మాదిరిగా మన శరీరంలోని డీఎన్ఏ (డీఎన్ఏ)ను దెబ్బతీయదు. డీఎన్ఏ దెబ్బతిననప్పుడు క్యాన్సర్ లేదా ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఫోన్ నేరుగా చెవి దగ్గర పెట్టుకుంటే..మనలో చాలామంది బ్లూటూత్ వాడటం వల్ల ప్రమాదం అనుకుంటారు కానీ, అసలు ముప్పు ఫోన్ నేరుగా వాడటంలోనే ఉందని డాక్టర్ జుతానీ హెచ్చరించారు. బ్లూటూత్ ఇయర్ఫోన్ల కంటే, మొబైల్ ఫోన్ను నేరుగా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినప్పుడు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ఫోన్ను తలకి దూరంగా ఉంచాలని ఆమె సూచించారు. ఫోన్ కాల్ వెళ్తున్న సమయంలో రేడియేషన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయని, అలాగే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువగా వెలువడుతుందని ఆమె తెలిపారు. అటువంటి సమయంలో ఫోన్ నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఇయర్ఫోన్స్ వాడటమే సురక్షితమని ఆమె తెలిపారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలురేడియేషన్ ముప్పు లేకపోయినా, అతిగా హెడ్ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి డాక్టర్ జుతానీ కీలక సూచనలు చేశారు.స్పీకర్ మోడ్: వీలైనంత వరకు ఫోన్ను స్పీకర్ మోడ్లో పెట్టి మాట్లాడటం అన్నిటికంటే ఉత్తమం.సరైన వినియోగం: టెక్నాలజీని అవసరమైన మేరకే వాడాలి. పని పూర్తయిన వెంటనే ఇయర్ఫోన్లను చెవుల నుండి తొలగించి, దాచుకోవాలి.ఫోన్ దూరం: ఫోన్ను నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం వల్ల వినికిడి నాడులపై ఒత్తిడి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెడ్ఫోన్లు వాడినప్పుడు ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది.ఏదైనా అతిగా వాడితే..బ్లూటూత్ ఇయర్ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్లకు కారణమవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ జుతానీ స్పష్టం చేశారు. అయితే, ఏదైనా అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వైర్లెస్ సాంకేతికతను వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్ను నేరుగా తలకు ఆనించి మాట్లాడకుండా ఉండటం శ్రేయస్కరం.గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘అది వివక్ష కాదు.. ఆచారం’ -
ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
వాషింగ్టన్: టెక్సాస్లోని ఆయిల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించింది. టెక్సాస్లోని వలెరో పోర్ట్ ఆర్థర్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. ఆ వెంటనే వరుసగా తీవ్రమైన మంటలు చెలరేగాయి.టెక్సాస్లోని పోర్ట్ ఆర్థర్లో ఉన్న వాలెరో రిఫైనరీ సమీపంలో తమ ఇళ్లు కదిలించేంత పెద్ద శబ్దం వినిపించిందని ఆ ప్రాంత నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదుతో పోలీసులు,సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే, ఈ ప్రమాదంపై తొలుత అనుమానం వచ్చినా.. వేడి కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనాFollowing reports of an explosion, a massive fire can be seen at the Valero oil refinery in Port Arthur, Texas. pic.twitter.com/I3UYBTS41A— OSINTdefender (@sentdefender) March 24, 2026 -
ఇటలీ ప్రధాని మెలోనీకి బిగ్ షాక్
రోమ్: పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో న్యాయ వ్యవస్థ సంస్కరణలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆమెకు నిరాశ ఎదురైంది. రెండు రోజులపాటు జరిగిన ఓటింగ్ ఊహించని రీతిలో ప్రజలు స్పందించారు.కనీసం 54 శాతం మంది సంస్కరణలను తిరస్కరించగా, 46 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. అధికార పక్షంలో లుకలుకలు ప్రస్ఫుటం కాగా, ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించి, ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టింది. ఈ ఫలితంతో మెలోనీ నాయకత్వం దేశంతోపాటు అంతర్జాతీయంగానూ బలహీనమైనట్లేనని పరిశీలకులు అంటున్నారు. లాయర్లు, జడ్జీలు తరచూ తమ వృత్తులను మార్చుకోకుండా నిరోధించడం, ఎన్నికకు బదులుగా లాటరీ విధానంలో ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టడం వంటివి మెలోనీ తలపెట్టిన న్యాయ సంస్కరణల్లో ఉన్నాయి. మెలోనీ స్పందన.. అయితే, ఈ తీర్పుపై తాజాగా ప్రధాని మెలోనీ స్పందించారు. ఇటలీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్బంగా మెలోనీ ఈ ఓటమిని “ఇటలీని ఆధునీకరించడానికి కోల్పోయిన అవకాశం” గా పేర్కొన్నారు. అయితే, తాను పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రతిపక్షం ఈ సంస్కరణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని ఆరోపించింది. కాగా, ఈ ఓటమి మెలోనీ నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమికి పెద్ద దెబ్బగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఓటమి.. 2027 సాధారణ ఎన్నికలకు ముందు ఇది మెలోనీ ప్రజాదరణను తగ్గించే అవకాశం ఉంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను మెలోనీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా విశ్లేషకులు పేర్కొన్నారు.Gli italiani hanno deciso. E noi rispettiamo questa decisione.Andremo avanti, come abbiamo sempre fatto, con responsabilità, determinazione e rispetto verso il popolo italiano e verso l’Italia. pic.twitter.com/KCBf19hO8d— Giorgia Meloni (@GiorgiaMeloni) March 23, 2026 -
పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చ
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్.. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం: రష్యా
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఢిల్లీతో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.2025 చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు, వ్యూహాత్మక లక్ష్యాలను మోదీ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2025లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని దీనిని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.భారత్, రష్యాది కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ నిలిచిన స్నేహ బంధమని, సమానత్వం, విశ్వాసం, గౌరవం, ప్రయోజనాలను ఇరుదేశాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా భారత్, రష్యాల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం జాతీయ కరెన్సీలలోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం విశేషమని ఆయన గుర్తుచేశారు.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల రష్యాకు ఎంతో గౌరవం ఉందని లావ్రోవ్ కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ ఒక గొప్ప శక్తిగా, ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు -
లండన్లో మత విద్వేష ఘటన
లండన్: బ్రిటన్లోని ఉత్తర లండన్లో సోమవారం తెల్లవారుజామున యూదు వ్యతిరేక దాడితో స్థానికంగా ఒక్కసారిగా కలకలంరేగింది. ‘హ్యాట్జోలా నార్త్వెస్ట్’ అనే లాభాపేక్షలేని యూదుల సేవా సంస్థకు చెందిన ఒకేచోట పార్క్చేసిన నాలుగు అంబులెన్సులను ‘గోల్డన్స్ గ్రీన్’ ప్రాంతంలోని హైఫీల్డ్ రోడ్డులో గుర్తుతెలియని ఆగంతకులు తగలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఈ దాడి ఘటన జరిగింది. అంబులెన్సుల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. సమీప నివాస భవన అద్దాల కిటికీలు బద్ధలయ్యాయి. విషయం తెల్సి వెంటనే ఉగ్రవ్యతిరేక పోలీస్ విభాగం రంగంలోకి దిగి నిందితుల కోసం వేట మొదలెట్టింది. ‘‘ఘటనతో ముగ్గురికి ప్రమేయం ఉందని భావిస్తున్నాం. త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం’’ అని పోలీస్ సూపరింటెండెంట్ సారా జాక్సన్ తెలిపారు. అంబులెన్సులను దహించివేస్తున్న అగ్నికీలలను ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. 40 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పేశారు. -
రన్వేపై ఫైర్ట్రక్ను ఢీకొట్టిన విమానం
న్యూయార్క్: అప్పుడే ల్యాండ్ అయి రన్వే మీద దూసుకుపోతున్న విమానం అటుగా వచ్చిన ఒక అగ్నిమాపక విభాగ ట్రక్కును ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఆ దెబ్బకు విమానం కాక్పిట్ భాగం మొత్తం ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో కాక్పిట్లోని పైలట్, కోపైలట్ ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ప్రయాణికుల్లో 41 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వీళ్లను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరిని ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఫైర్ట్రక్కులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎయిర్పోర్ట్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్లోని లాగార్డియా అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగో నంబర్ రన్వే మీద స్థానికకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీల పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిర్ గార్సియా చెప్పిన వివరాల ప్రకారం కెనడాలోని మాంట్రియల్ నుంచి 72 మంది ప్రయాణికులతో బయల్దేరిన ‘ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్’8646 నంబర్ విమానం క్షేమంగానే లాగార్డియా ఎయిర్పోర్ట్లో ల్యాండయి రన్వే మీద గంటకు 167 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అయితే కొద్దిసేపటికి ముందే మరో రన్వే మీద దిగిన యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో దుర్వాసన వస్తోందని ఆ విమాన పైలట్ ఫిర్యాదుచేశారు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్లోని అగ్నిమాపక, అత్యయిక విభాగం వాహనం రంగంలోకి దిగింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాన్ని చేరేందుకు నాలుగో నంబర్ రన్వే దాటేందుకు ప్రయతి్నంచింది. అదేసమయంలో ఆ రన్వేమీదుగా దూసుకెళ్తున్న కెనడా విమానం ఈ ట్రక్కును నేరుగా ఢీకొట్టింది. దెబ్బకు విమానం ముందుభాగం తుక్కుతుక్కయింది. అయితే ముందువైపు ఉన్న ఎగ్జిట్ డోర్ గుండా ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు ఒక పెద్ద నిచ్చెన తెప్పించి విమానానికి అనుసంధానం చేశారు. అప్పటిదాకా కిందకు పడిపోయిన ముందుభాగం ఒక్కసారిగా విమానం బరువులో సమతుల్యత లోపించడంతో ముందుభాగం గాల్లోకి లేచి వేలాడటం మొదలెట్టింది. దీంతో ప్రయాణికులను బయటకు తీసుకురావడం కొంత కష్టంగా మారింది. అయితే ‘విమానం వస్తోంది. ఒకటో నంబర్ ట్రక్కు అటుగా వెళ్లొద్దు. ఆగిపొండి. ఆగిపొండి’అని ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి తీవ్ర హెచ్చరిక సందేశాలు వచ్చినా విమానాల శబ్దహోరులో ట్రక్కు డ్రైవర్కు విన్పించకపోయిఉండొచ్చని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిర్ గార్సియా అభిప్రాయపడ్డారు. లాగార్డియా అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికాలోని అత్యంత రద్దీమయ ఎయిర్పోర్టులో ఒకటి. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ల ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరగనుంది. -
ట్రంప్తో మాట్లాడా.. ఆవిధంగానే ఒప్పందం?: నెతన్యాహు
ఇరాన్తో అమెరికా చర్చలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ట్రంప్తో తాను మాట్లాడానని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా ఇరాన్పై తమ దాడులు కొనసాగుతూ ఉంటాయని ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు వెనుకకు వేసినా ఇజ్రాయెల్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు తాజాగా బెంజిమిన్ నెతన్యాహు ఆ విధమైన వ్యాఖ్యలే చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను మాట్లాడినట్లు తెలిపారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు సాధించిన విజయాల ఆధారంగానే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపారు.అయితే ఈ ఒప్పందం తప్పనిసరిగా ఇజ్రాయెల్ యొక్క ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని పేర్కొన్నారు. ట్రంప్ సైతం ఈ విధంగానే ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నెతన్యాహూ మాట్లాడుతూ "ఏ పరిస్థితిలోనైనా మా ప్రయోజనాలను మేము కాపాడుకుంటాం. అదే సమయంలో ఇరాన్ మరియు లెబనాన్లలో మా దాడులు కొనసాగుతూనే ఉంటాయి" అన్నారు.ఇరాన్ అణు మరియు క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా, గత కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టామని ది ఇక్కడితో ముగిసిపోదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ స్పీకర్ సైతం అమెరికాతో చర్చలు జరగడం లేదని ప్రకటించారు. -
శాంతి వీచికలు..?!
‘‘పశ్చిమాసియాలో కల్లోలానికి పూర్తిగా తెర దించే దిశగా ఇరాన్, అమెరికా నడుమ రెండు రోజులుగా ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఎంతో లోతుగా, సవివరంగా జరుగుతున్న ఈ నిర్మాణాత్మక చర్చలు వారమంతా కొనసాగుతాయి. తద్వారా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. అందుకే ఇరాన్ విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై ఐదు రోజుల పాటు ఎలాంటి దాడులూ చేయొద్దని మా యుద్ధ విభాగాన్ని ఆదేశించా. అయితే ఈ విరామం చర్చలు ఏ మేరకు ఫలప్రదమవుతాయనే దానికి లోబడి ఉంటుంది’’ – ట్రూత్సోషల్ పోస్టులో అధ్యక్షుడు ట్రంప్ దుబాయ్: మూడు వారాలకు పైగా కొనసాగుతున్న పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అవి ఈ వారమంతా కొనసాగుతాయని ప్రకటించారు. సోమవారం ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు చేశారు. చర్చల నేపథ్యంలో ఇరాన్లోని కీలక విద్యుత్కేంద్రాలు, చమురు వ్యవస్థలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపేయనున్నట్టు ప్రకటించారు. హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవని పక్షంలో ఇరాన్ చమురు, విద్యుత్ వ్యవస్థలపై భారీగా విరుచుకుపడతామని ఆదివారం ట్రంప్ అలి్టమేటం జారీ చేయడం తెలిసిందే. అదే జరిగితే హార్మూజ్ను పూర్తిగా మూసేయడమే గాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, ఐటీ సెంటర్లు, నీటి శుద్ధి కేంద్రాలు తదితరాలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ఇరాన్ బెదిరింపులకు దిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గిస్తూ ట్రంప్ నుంచి ‘చర్చల ప్రకటన’వెలువడింది. అయితే దాన్ని ఇరాన్ ఖండించడం విశేషం. అమెరికాతో అలాంటి చర్చలేవీ జరగడం లేదని ఇరాన్ విదేశాంగశాఖ పేర్కొంది. బహుశా అంతర్జాతీయంగా చుక్కలనంటుతున్న చమురు ధరలను తగ్గించేందుకు, తదుపరి యుద్ధ వ్యూహాల అమలుకు సమయం తీసుకునేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసి ఉంటారంటూ అనుమానాలు వెలిబుచ్చింది. ‘‘యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికాయే. కనుక ఆ దేశమే నేరుగా మాతో చర్చలకు రావాలి’’అంటూ డిమాండ్ చేసింది. కానీ ఆ తర్వాత ట్రంప్ ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. చర్చలు కొనసాగుతున్నట్టు పునరుద్ఘాటించారు. ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా పరిణతి, గౌరవాదరాలున్న పలువురు నేతలు ఆ దేశంలో ఉన్నారు. అలాంటి ఒక ఇరాన్ నాయకునితో అమెరికా దూతలు చర్చలు జరుపుతున్నారు’’అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జరేద్ కుష్నర్ ఓ ఇరాన్ నేతతో ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా చర్చించినట్టు వివరించారు. ఆ నేత ఎవరన్నది వెల్లడించకపోయినా, సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అయితే కాదని స్పష్టం చేశారు. మొజ్తబా పేరిట అప్పుడప్పుడూ ప్రకటనలు రావడమే తప్ప ఆయన బతికున్నదీ లేనిదీ కూడా అనుమానమేనన్నారు. ఇరాన్కు కూడా ఒక ఒప్పందానికి రావాలనే ఉందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ‘‘చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయి. అవి ఫలిస్తే త్వరలోనే çహార్మూజ్ తెరుచుకుంటుంది. చమురు ధరలు ఒక్కసారిగా దిగొస్తాయి. అంతేకాదు, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది కూడా’’అని ఆశాభావం వెలిబుచ్చారు. చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై క్షిపణులు, బాంబుల వర్షాన్ని కొనసాగిస్తామని ట్రంప్ హెచ్చరించడం విశేషం. అమెరికా, ఇరాన్ చర్చలకు రెండు రోజులుగా టర్కీ, ఈజిప్్ట, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ఆక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. అటు విట్కాఫ్, కుష్నర్తో, ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీలతో మూడు దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా మంతనాలు జరుపుతున్నట్టు వెల్లడించింది. టర్కీ విదేశాంగ మంత్రితో తాను చర్చలు జరిపినట్టు అరాఘ్చీ ధ్రువీకరించారు. కరడుగట్టిన మతవాదిగా పేరుబడ్డ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్తో కూడా విట్కాఫ్, కుష్నర్ చర్చలు జరిపినట్టు వార్తలు వెలువడుతుండటం విశేషం. ఇజ్రాయెల్ మీడియా కూడా వీటిని ధ్రువీకరించింది. మరోవైపు, ఇరాన్ హెచ్చరికల కారణంగానే ట్రంప్ దిగొచ్చారంటూ ఆ దేశ అధికారిక వార్తా సంస్థ పేర్కొంది. ట్రంప్ తాజా ప్రకటనతో చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. యథావిధిగా దాడులు ట్రంప్ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై దాడుల పరంపరను కొనసాగించింది. ఆయన ప్రకటన వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు నగరాలపై సోమవారం క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లోని మౌలిక వ్యవస్థలపై భారీ స్థాయిలో మరిన్ని దాడులు చేస్తామని ప్రకటించింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యాలపై కూడా దాడులను కొనసాగించింది. ఆ దేశంలో మృతుల సంఖ్య దాదాపు 1,100కు చేరింది. లెబనాన్లో తీర ప్రాంత నగరమైన నఖోరాలో తమ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగినట్టు ఐరాస శాంతి పరిరక్షణ దళం (యునిఫిల్) పేర్కొంది. ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. పలు డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ పేర్కొంది. -
అమెరికా-ఇరాన్ చర్చలు ఫిక్స్?.. ఎక్కడో తెలిస్తే షాక్..!
గత కొద్ది వారాలుగా మారణహోమం సృష్టించిన పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐదు రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని దానికి వేదిక పాకిస్థాన్ కానుందని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్- అమెరికా యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభంతో అనేక రంగాలు ప్రభావితమయ్యాయి. సప్లై చైన్ దెబ్బతిని ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో ట్రంప్కు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు నిన్న (సోమవారం) సీజ్ ఫైర్ ప్రకటించి చర్చలు జరుపతున్నామని ప్రకటించారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేలా తెరవెనుక పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయంది. అమెరికా తరపున ప్రతినిధులుగా ఆదేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారించనున్నారని, ఇరాన్ తరపున ఆ దేశ కీలక అధికారులు పాల్గొననున్నారని పేర్కొంది. మధ్యవర్తులుగా ఇస్లాం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ పాల్గొననున్నాయని రాయిటర్స్ ప్రచురించింది.కాగా ఇది వరకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడి, శాంతి పునరుద్ధరణకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ స్పీకర్ ప్రస్తుతం చర్చలు ఏమి లేవని తమపై దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందో వేచి చూడాలి. -
ట్రంప్ చర్చల బూటకం అందుకే? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
ఇరాన్పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ప్రకటనపై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి బూటకమన్నారు. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నకిలీ వార్తలు సృష్టిస్తున్నారన్నారు.నిన్న( సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేస్తూ " అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో చర్చలు జరిపాడనేది పూర్తిగా అవాస్తవం దీని వెనుక రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ధరలు తగ్గించడం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులనుంచి ప్రజల దృష్టి మళ్లించడం"అని తెలిపారు.తమ దేశంపై జరిగిన దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని గాలిబాఫ్ తెలిపారు. ఇరాన్ అంతా ఏకంగా ఉందని తామనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. -
కుప్పకూలిన ఆర్మీ విమానం..110మంది సైనికులు
కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. టేకాఫ్ సమయంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. పెరు సరిహద్దు సమీపంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 110 మంది సైనికులున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. కొలంబియా సైన్యానికి చెందిన సి-130 అనే జెట్ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజామో నుండి సైనికులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడూ జరగకూడని భయంకరమైన ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ఫోర్స్ చీఫ్ జనరల్ మాట్లాడుతూ ప్రయాణ సమయంలో విమానంలో మొత్తం 125 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారిలో పెద్దసంఖ్యలో సైనికులున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు వారిలో 57 మందిని గాయాలతో రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. -
ట్రంప్కు ఇండోనేషియా షాక్.. డబ్బులిచ్చేది లేదు?
పశ్చిమాసియా యుద్ధంతో సతమతమువుతున్న ట్రంప్కు ఇండోనేషియా షాక్ ఇచ్చింది. ఇటీవల గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్' మిషన్కు ఎటువంటి ఆర్థిక మద్ధతు అందించలేదని తెలిపింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రస్తుతం అనేక సమస్యలు వేదిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం కొద్దిరోజుల్లోనే ముగిద్దామనుకున్న ట్రంప్కు చుక్కెదురైంది. ఇరాన్ ఎంతకూ లొంగకపోవడంతో చేసేదేం లేక తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. ఇటీవల ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్లో చేరడానికి సభ్యత్వ రుసుమును చెల్లించేది లేదని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్పష్టం చేశారు.ఆదివారం ఇండోనేషియా అధ్యక్షుడి ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ కోసం జకార్తా కేవలం ఎనిమిది వేల మంది శాంతి పరిరక్షక దళాలను మాత్రమే కేటాయించిందని ఎటువంటి సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని తెలిపారు. కాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్లో చేరినందుకు ఇండోనేషియా ముస్లిం ప్రజల నుంచి ప్రభోవో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ రుసుము చెల్లించడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో గాజా ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
హార్మూజ్ తరంగాలపై భారత నావికుడి సాహసం..!
ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్ జలసంధి దాటించడమే కాదు.. భారత్కు తీసుకొచ్చాడు. లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని మరీ అక్కడ నుంచి దాటి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. ముంబైలో ఓడ నిలిచిపోయిందిఅయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. అంతా డార్క్ మోడ్..అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.శభాష్ భారత నావికుడా.. ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. -
ట్రంప్ ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
''ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.Trump announces he ordered to postpone strikes against Iranian energy infrastructure for 5 days pic.twitter.com/ELW18FLsAL— The Daily News (@DailyNewsJustIn) March 23, 2026 -
హార్మూజ్లో మన నౌకలకు ఇరాన్ ఎందుకు అనుమతిచ్చిందంటే?
ప్రపంచదేశాలు తనకు వ్యతిరేకమైతే.. ఇరాన్ ఉపయోగించే ఆయుధం ఒక్కటే.. అదే హార్మూజ్ జలసంధిని మూసివేయడం..! చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే.. ఇది ఎన్నోమార్లు పునరావృతమైంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా తనపై దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మూజ్ని ఇరాన్ మూసివేసింది. దీంతో.. దక్షిణాసియా దేశాలు చమురు కోసం అతలాకుతలమవుతున్నాయి. భారత్లో కూడా ఎల్పీజీ కొరత తారస్థాయికి చేరుకుంది. అయితే.. ఉన్నఫళంగా హార్మూజ్ నుంచి భారత నౌకలను ఇరాన్ అనుమతించడానికి కారణమేంటి? దీని వెనక ఉన్న రహస్య అజెండా ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ను కాదని ఇరాన్కు భారత్ ఆ స్థాయిలో సహాయం చేసిందా?? ఈ ప్రశ్నలపై ఇప్పుడు ప్రపంచదేశాల్లో చర్చ సాగుతోంది.ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే.. హిందూమహాసముద్రంలోని ఆ దేశ నౌకలను సైతం అమెరికా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో శ్రీలంక తీరంలో ఉన్న ఓ ఇరాన్ నౌకను అమెరికా ధ్వంసం చేయగా.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షతగాత్రులకు శ్రీలంక సర్కారు ఆశ్రయం కల్పించింది.అయితే.. అదే సమయంలో భారత్లోని కొచ్చి తీరంలో కూడా ఓ ఇరాన్ నౌక ఉందనే విషయం ఎంతమందికి తెలుసు?? అప్పటికే కొచ్చి తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ లావన్ అనే ఇరాన్ నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక లంగర్ వేసింది. అమెరికా కూల్చేసిన ఐరిస్ దేనా అనే నౌకతోపాటు.. ఐరిస్ లావన్ గత నెల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. కొచ్చి తీరానికి ఐరిస్ లావన్ అవి తిరిగి వచ్చే క్రమంలో ఐరిస్ దేనాను అమెరికా ధ్వంసం చేయగా.. ఐరిస్ లావన్ మాత్రం కొచ్చి తీరానికి చేరుకుంది. ఈ నెల 13న ఆ నౌకలోని సిబ్బంది భారత్ను శరణు కోరారు. స్వతహాగా శరణన్న వారికి ఆశ్రయం కల్పించే నైజమున్న భారత్ అందుకు ఓకే చెప్పింది. అంతేకాదు.. ఐరిస్ లావన్ నౌకలోని నావికులను ఇరాన్కు పంపే ఏర్పాట్లు చేసింది. అప్పట్లోనే ఈ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందని తెలుసుకున్న అమెరికా నేవి, బ్రిటన్ రాయల్ నేవీ.. ఆ నౌక జోలికి వెళ్లకపోవడం గమనార్హం..! అదే సమయంలో తన నావికులకు ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ రాయబారి భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.నౌకకు భారత్ భద్రత ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐరిస్ లావన్ యుద్ధ నౌకలో ఏకంగా 140 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది, సహాయకులు ఉన్నారు. వారందరినీ ఇరాన్ యుద్ధ విమానాల్లో వారి దేశానికి సురక్షితంగా తరలించారు. పరిస్థితులు సద్దుమణిగేవరకు కొచ్చి తీరంలో ఉన్న యుద్ధ నౌకకు భద్రత కల్పించాలని ఇరాన్ కోరగా.. తమ వంతు ప్రయత్నం చేస్తామని భారత్ సమాధానమిచ్చింది. లంగరు వేసిన ఐరిస్ లావన్ను చిత్రీకరించిన ఓ జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని బట్టి ఆ నౌకకు భారత్ ఎంతలా భద్రత కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్కు ఇది ఓ పెద్ద సాయం. నౌకాదళాన్ని కాపాడుకోవడానికి భారత్ భారీ సహకారం అందించినట్లు ఇరాన్ భావించింది. అంతే.. భారత్ కూడా తన అవసరాల కోసం ఇరాన్ ముందు డిమాండ్లు పెట్టింది. శాంతియుతంగా ఉండే తమ దేశానికి వస్తున్న నౌకలను హార్మూజ్లో అనుమతించాలని కోరింది. దాంతో.. ఇరాన్ వెంటనే ఓ ప్రకటన చేసింది. భారత్తో పాటు.. ఈ యుద్ధంలో పాల్గొనని దేశాల నౌకలకు హార్మూజ్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటికి మాత్రం భారత్ నౌకలు మాత్రమే హార్మూజ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. -వెబ్డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారా?
‘ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం. గత కొన్ని రోజులుగా వారితో చర్చలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన.‘అదేమీ లేదు.. ట్రంప్ మాతో చర్చలు జరపలేదు.. అమెరికా భయపడింది. మాతో అమెరికా ఎటువంటి చర్చలు జరపలేదు. వారికి వారే యుద్ధం ఆపేశారు’ అని వెనువెంటనే ఇరాన్ ప్రకటనఅంతకుముందు చూస్తే.. ‘ 48 గంటలే ఇరాన్కు గడువు. ఇరాన్ లొంగిపోవాల్సిందే’ అంటూ ట్రంప్ ప్రకటన. ఈ మాట యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ ఏదొక సందర్భంలో అమెరికా నోట వస్తూసే ఉంది. అధ్యక్షుడు ట్రంప్ కానీ, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ కానీ ఇరాన్ను వదిలే ప్రసక్తే లేదంటూ గాంభీర్యం ప్రకటించారు. వేటాడుతాం. మా శత్రువులు ఎవరైనా వదిలి పెట్టం. వెంటాడి వేటాడి చంపుతాం. ఎక్కడున్నా తుద ముట్టిస్తాం’ అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. అదే సమయంలో ఇరాన్ కూడా ధీటుగానే బదులిస్తూ వచ్చింది. ‘ అంత సీన్ లేదు. లొంగిపోయే ప్రసక్తి అసలే లేదు. మేము ఆరు నెలల కాదు.. ఆరేళ్లైనా యుద్ధం చేస్తాం. ఆ సత్తా మాకు ఉంది. అమెరికా-ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే వరకూ మా పోరాటం ఆగదు’ అని ఇరాన్ స్ట్రాంగ్గానే కౌంటర్ల ఇస్తూ వచ్చింది. అంతే ధాటిగా యుద్ధం కూడా చేసింది.ఆ రెండూ ట్రంప్కు భయం పుట్టించాయా?ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఇందులో ఒకటి అమెరికా అధునాతన టెక్నాలజీ కల్గిన ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ డ్రోన్ కూల్చేయగా, మరొకటి 4000 కి.మీ రేంజ్తో ఒక బాలిస్టిక్ మిసైల్ను అమెరికా నావికా స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించడం. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. ఆ రెండు ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కచ్చితంగా భయం పుట్టించే ఉంటాయి. మనం ఎంతో అధునాతనం అనుకున్న ఎఫ్ 35 విమానం ఎలా కూలిపోయిందనేదనే విషయంపై అమెరికా కచ్చితంగా చర్చలు జరిపే ఉంటుంది. అదే సమయంలో నాలుగువేల కిలోమీటర్ల రేంజ్తో క్షిపణిని ఇరాన్ ప్రయోగించడమే అమెరికాను డైలమాలో పడేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు సందర్భాలు కూడా ఇరాన్ సైనిక శక్తిని అమాంతం పెంచేశాయి. ఇరాన్ బహిరంగంగా ప్రకటించిన దానికి, వాస్తవానికి భిన్నంగానే యావత్ ప్రపంచానికి అనిపించింది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో వాటికి బలం చేకూరనట్లయ్యింది. ఏమాత్రం ఇష్టం లేని యుద్ధంఅమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేసిన యుద్ధం.. అమెరికా పౌరులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ అమెరికా పౌరులకే కాదు.. యావత్ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో ఎవరు గెలిచినా.. నష్టపోయేది ప్రజలే కాబట్టి.. దీన్ని ఎవరూ స్వాగతించలేదు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కన పెడితే, దీని వల్ల ఎన్నో కుటుంబాలు ప్రభావితం అవుతాయనేది అందరికి తెలుసు కానీ, మూడు దేశాల్లో(అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్) జరగాల్సిన విధ్వంసం ఇప్పటికే జరిగిపోయిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ ఆ యుద్ధానికి దిగిన ఆ మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతే.. ప్రపంచ దేశాలపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది. మళ్లీ శాంతి మంత్రం..మూడు వారాలకు పైగా భారీ విధ్వంసానికి కారణమైన ట్రంప్.. ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తాం అంటూ ప్రకటించేశారు. అంటే అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడమనేది ట్రంప్ నైజమనేది మరోసారి రుజువైంది. అప్పుడు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఆయనకు ఆయనే తగ్గిరనేది వాస్తవం. అంటే ఇరాన్ యుద్ధ సామర్థ్యం ఏమిటో ట్రంప్కు చిక్కలేదు. మరొకవైపు ఇరాన్ ప్రకటనలు కూడా భయం పుట్టించేంతగానే ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వెనక్కి తగ్గారనేది వాస్తవం. ఇక్కడ ట్రంప్ వెనక్కి తగ్గారనడం కంటే కూడా అమెరికా తేలిపోయింది అనుకోవడం ఇప్పుడు మన వంతైంది. ఎప్పుడూ ప్రపంచ దేశాలకు బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చే అమెరికా శక్తి ఏపాటిదో కూడా అందరికీ తెలిసిపోయింది. అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తే వాళ్లను వెనక్కి తగ్గేలా చేయడం పెద్ద కష్టమేం కాదు అనే విషయం ఇరాన్ రుజువు చేసిందనేది కాదనక తప్పదు. చివరకు చేసేదేమీ లేక ట్రంప్ ఇలా చేతులెత్తేసే.. మళ్లీ శాంతి మంత్రం జపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు ఇరాన్ ప్రకటన కూడా బలం చేకూరుస్తుంది. తమతో చర్చలు ఏమీ జరపలేదని ఇరాన్ ప్రకటించడం కూడా ట్రంప్ డబుల్ గేమ్కు అద్దం పడుతోంది. -
భయపడి వెనక్కి తగ్గిన ట్రంప్ : ఇరాన్ కౌంటర్
ఇరాన్పై దాడులకు అయిదు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. ఇంధన వసతులపై దాడులు, చర్చలు అంటూ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సంచలన సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ తాజా పోస్ట్పై స్పందిస్తూ, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.టెహ్రాన్ గట్టి హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసే ప్రణాళికల నుండి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు అసలు అమెరికా ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ఇటీవలి అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం, తమ విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారని, ఈ సందర్భంగా మారుతున్న ప్రాంతీయ పరిస్థితి మరియు సమన్వయంపై చర్చించారని రష్యా తెలిపింది.మధ్యప్రాచ్యంలో మన శత్రుత్వానికి సంపూర్ణ పరిష్కారం కోసం గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ దేశం మధ్య చాలా మంచి, ఫలవంతమైన సంభాషణలు జరిగాయని, చర్చలు ముగిసేవారు దాడులుండవని ట్రూత్ సోషల్లో చేసిన ఒకపోస్ట్లో ట్రంప్ ప్రకటించారు. ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీకాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులను ప్రారంభించాయి. మిస్పైళ్లతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబంలో చాలామంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇరాన్ తీవ్ర ప్రతిఘటనకు దిగింది. అలా గత 24 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఇంతలో మూసివేసిన హర్మోజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్కు డెడ్లెన్ విధించారు ట్రంప్. ఈగడువు మంగళవారం ఉదయంతో ముగియనుంది. ఇంతలోనే యుద్దానికి విరామం ప్రకటించడం దిగ్బ్రాంతి రేపింది. -
యుద్ధానికి తాత్కాలిక బ్రేక్: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నామన్నారు. టెహ్రాన్తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మీడియాలో పోస్టు చేశారు.ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ట్రంప్ వాయిదా వేశారు. టెహ్రాన్తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా.. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు. -
ట్రంప్ 48 గంటల డెడ్లైన్ : ఏం జరగబోతోంది?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతిదారులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థిలా ఆందోళన కరంగా పరిణమిస్తోంది. సముద్ర మార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.14 గంటలకు ముగుస్తుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్ను కోరారు. అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీమరోవైపు ట్రంప్ 48 గంటల గడుపు, చమురు కేంద్రాలపై దాడులు హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ తమ తీరాలపై లేదా ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో నావికా మందు పాతరలను మోహరిస్తామని ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఈ దేశాల మధ్య శాంతి సంధి, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్కు ధరల పరంగా మరిన్ని షాక్లు తగిలే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 110 డాలర్ల వద్ద ఉంది.ఇండియా పరిస్థితిఒకవేళ టెహ్రాన్, యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 50 శాతంతోనైనా ట్యాంకర్లను హోర్ముజ్ గుండా అనుమతిస్తే, కోట్లాది భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, కోట్లాది మంది పేదలకు ఊరట లభించినట్టే. ఇది ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలలో జరగబోయే అత్యంత కీలకమైన ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి కూడా ఇది ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది. ట్రంప్ హెచ్చరికను ఇరాన్ లక్ష్య పెట్టకపోతే, వివిధ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాను, మొదటగా అతిపెద్ద ప్లాంట్తో ప్రారంభిస్తాను అన్న ట్రంప్ అదే పాటిస్తే యుద్ధం మరింత ముదిరి హోర్ముజ్ గుండా రవాణా అయ్యే చమురు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయి.మరోవైపు శత్రువులు కాని దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇందుకోసం టెహ్రాన్తో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి ఆదేశించినట్లు బీబీసీ నివేదించింది. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో 22 దేశాలు చేరాయినార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని నిర్ధారించేందుకు కనీసం 22 దేశాలు అంగీకారానికి వచ్చాయి. నాటో సైనిక కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించిన ప్రకారం, నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వంటి భాగస్వామ్య దేశాలతో సహా 22 దేశాలు ఈ ఇరుకైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛనునిర్ధారించడానికి తమ చర్యలను సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి. యుద్ధం ముగింపు గురించి మాట్లాడిన 24 గంటలలోపే ట్రంప్ ఈ బెదిరింపునకు పాల్పడటం, ఇరాన్ వైఖరితో ఈ యుద్ధం నుండి బయటపడే మార్గం లేదని భౌగోళిక రాజకీయ సైనిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్తో పోలిస్తే హెచ్ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
New York: రన్వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్కు చెందిన ఒక విమానం రన్వేపై గ్రౌండ్ వెహికల్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ కెనడా సీఆర్జే (CRJ) ఫ్లైట్ ఏసీ 8646 విమానం రన్వే 04/22ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ నిలిపి ఉంచిన ‘ట్రక్ 1’ అనే ఫైర్ ఇంజిన్ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అప్రమత్తమై, లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానాల రాకపోకలను నిలిపివేస్తూ ‘గ్రౌండ్ స్టాప్’ ఉత్తర్వులు జారీ చేసింది.ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో విమానం రన్వేపై కదులుతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తే.. విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విజువల్స్ను విమానయాన అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గాయపడిన వారి సంఖ్య, పరిస్థితిపై ఎయిర్పోర్ట్ లేదా ఎయిర్ లైన్స్ వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.ఈ ప్రమాదం కారణంగా లాగార్డియాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాప్యం లేదా విమానాల దారి మళ్లింపుపై అధికారులు ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Reports of a serious incident at LaGuardia Airport in New York City, after Jazz Airlines Flight 646, a Canadair Regional Jet CRJ-900, collided with a firetruck while taxiing to Gate B48. pic.twitter.com/FPTayPzHAt— OSINTdefender (@sentdefender) March 23, 2026 -
ఇరాన్ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు
టెహ్రాన్/న్యూఢిల్లీ: ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ‘హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ఇప్పుడు ఇరాన్ ‘దందా’కు అడ్డాగా మారింది. యుద్ధం కారణంగా మూతపడిన ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి ఇరాన్ ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18,76,57,000) వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. యుద్ధ ఖర్చుల కోసమే ఈ ‘ఫీజు’ఇజ్రాయెల్, అమెరికా కూటమితో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ తన అధికారాన్ని చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘యుద్ధం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించాం’ అని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలద్దీన్ బ్రౌజెర్డి స్పష్టం చేశారు. ఇది ఇరాన్ శక్తికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బమార్చి మొదటి వారం నుండి హర్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20 శాతం చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఈ జలమార్గం గుండానే వెళ్లాలి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఉన్న ఇరాన్కు ఇలా కోట్లలో నగదు చెల్లించడం షిప్పింగ్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ ప్రతిసవాల్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లోగా జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది.భారత నౌకలకు ఊరటఅయితే ఇరాన్ తన శత్రు దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని చెబుతోంది. ఇప్పటికే భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ కూడా సురక్షితంగా ప్రయాణించింది. కానీ, గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిని తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఇరాన్ కొన్ని నౌకల నుండి భారీ రవాణా రుసుములు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు నౌకలు జలసంధి గుండా ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంది. కానీ తాజా పరిణామాల ప్రకారం, రానున్న రోజుల్లో ఈ స్వేచ్ఛా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ భారీ సుంకం ఇప్పటికే అమలు చేయబడిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త విధానానికి నిదర్శనమని పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది తెలిపారు.కొత్త సుప్రీం లీడర్ చర్యలుబరూజెర్ది ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇతర దేశాల జోక్యం లేకుండా పాలన సాగించేలా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.రవాణా రుసుము ఉద్దేశ్యం“జలసంధిని దాటే కొన్ని నౌకల నుండి రవాణా రుసుముగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇరాన్ పట్టు సాధించే ప్రయత్నం కనబడుతోంది. యుద్ధానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి సహజంగానే మనం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి రవాణా రుసుములు వసూలు చేయాలి’అని బరూజెర్ది వ్యాఖ్యానించారు.ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20శాతం హర్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది.ఇది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మధ్య ఉన్న సన్నని మార్గం. గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్) నుంచి చమురు నౌకలు ఈ మార్గం గుండా ప్రపంచ దేశాలకు చేరతాయి. ఇప్పుడీ మార్గం ద్వారా వెళ్లే కొన్ని నౌకల నుంచి రవాణ రుసుము వసూలు చేయడం వల్ల సంబంధిత దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య వ్యయం అధికమవుతుంది. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. -
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
టోక్యో: ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు (Naval Mines) జపాన్కు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటిని తొలగించేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుజపాన్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, జపాన్ తన అత్యవసర నిల్వల నుంచి చమురును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యగా మారింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, 2015లో తీసుకువచ్చిన భద్రతా చట్టాల ప్రకారం.. దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే లేదా సన్నిహిత భాగస్వామ్య దేశాల భద్రత దెబ్బతింటే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది. ఫుజి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఒత్తిడి ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జలసంధిని పునరుద్ధరించేందుకు మిత్రదేశాల సహకారం అవసరమని ట్రంప్ కోరారు. మరోవైపు జపాన్ నౌకల రాకపోకల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసి, పరిస్థితులు శాంతించిన తర్వాతే మైన్లను తొలగించే ఆపరేషన్పై జపాన్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు! -
మొజ్తబా ఎక్కడ?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్లను వేధిస్తోంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా అంతం చేసిన నేపథ్యంలో మొజ్తబా జాడ కోసం అవి తీవ్రంగా వెదుకుతున్నాయి. తండ్రి ఖమేనీ మరణానికి కారణమైన దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ‘‘మొజ్తాబా క్షేమంగానే ఉండి ఉంటారు. ఇజ్రాయెల్కు తన జాడ తెలియొద్దనే బయటికి రావడం లేదు’’ అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రజ్ జిమిత్ అభిప్రాయపడ్డారు. -
ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
-
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
క్యాన్బెర్రా: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం మార్చి 22, 2026న రాత్రి 8:57 సమయంలో నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది.ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల అదే ప్రాంతంలో చిన్నచిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.రింగ్ ఆఫ్ ఫైర్పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం-పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప ప్రాంతం. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. ప్రపంచంలోని 90శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. -
గ్రీన్లాండ్ను ట్రంప్ నుంచి కాపాడతాం: ఇరాన్
టెహ్రాన్: గ్రీన్లాండ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారినుంచి కాపాడుతామంటూ ఇరాన్ ముందుకు వచ్చింది! పిలిస్తే చాలు, వచ్చి రక్షిస్తామని యూరోపియన్ యూనియన్ను ఉద్దేశించి పేర్కొంది. ‘‘గ్రీన్లాండ్ను స్వాదీనం చేసుకుంటామంటూ ఈయూను ట్రంప్ బెదిరించారు. వారు గ్రీన్లాండ్ను కాపాడుకోలేని పక్షంలో మాకు ఒక్క మాట చెబితే చాలు, ఆ ద్వాపానికి అండగా వస్తాం’’ అని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆదివారం పేర్కొన్నారు. ఇరాన్ మూసేసిన హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ముందుకు రావాలని ఈయూతో పాటు ఇతర దేశాలను ట్రంప్ కోరుతుండటం తెలిసిందే. కానీ ఇప్పటిదాకా సానుకూల స్పందన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రీన్లాండ్ విషయంలో ఈయూకు ఇరాన్ ఇలా ఆఫర్ ఇవ్వడం గమనార్హం. -
విమానం దిగుతూ తూలిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (79) ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి కిందికి దిగే క్రమంలో తడబడ్డారు. రెయిలింగ్ను గట్టిగా పట్టుకొని చాలా జాగ్రత్తగా దిగుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కురీ్చలో కూర్చోవడానికి కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు. రెండు చేతులతో కురీ్చని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. మోకాళ్లు వంచేటప్పుడు ముఖం బిగుసుకుపోయి కనిపించింది. అయితే తాను భేషుగ్గా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్గావ్, పుణె, అహ్మదాబాద్ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్దానికి కావాల్సినంత డబ్బుంది.. అమెరికా
ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్దం ఇప్పట్లో తెగేలా లేదు. తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్తో యుద్ధానికి అమెరికా ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులు ఉన్నాయని బెసెంట్ తెలిపారు. భవిష్యత్తులో సైన్యం అవసరాలకు అదనపు నిధులు అవసరం పడవచ్చని అన్నారు. యుద్దానికి నిధులు సమకూర్చేందుకు పన్నులు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రక్షణ శాఖ 200 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కోరిందని తెలిపారు. యుద్ధం మొదటి ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. బెసెంట్ వ్యాఖ్యల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ సైన్యాన్ని మరింత బలపరిచారు. భవిష్యత్తులో కూడా నిధులు కొరత రాకుండా చూడాలని కోరారు. కాగా, ఈ ఏడాది (2026) అమెరికా రక్షణ బడ్జెట్ 840 బిలియన్ డాలర్లుకు ఆమోదించబడింది. -
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా... క్షిపణుల వర్షం
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్లో సైరన్ల మోతలు వినిపించాయి. టెల్ అవీవ్పై క్షిపణి దాడులు సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇజ్రాయెల్లో కీలక నగరం టెల్ అవీవ్పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి. ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.హార్మూజ్ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్ ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి. చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. -
గాఢాంధకారంలో క్యూబా
క్యూబాలో మరోసారి జాతీయ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దేశవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేకుండా చీకటిలో మగ్గారు. వారం వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇలా జరగడానికి అమెరికా విధించిన ఇంధన ఆంక్షలు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ నెలలో ఇప్పటికే మూడు ప్రధాన బ్లాక్ఔట్లు చోటు చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ఔట్కు నిరసనగా హవానాలో ప్రజలు గిన్నెలు, పాత్రలతో శబ్దాలు చేశారు. మోరాన్ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. ఈ సంక్షోభంపై క్యూబా ఎనర్జీ మంత్రి మాట్లాడుతూ.. జాతీయ విద్యుత్ వ్యవస్థ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యింది. మొదటి ప్రాధాన్యతగా ఆసుపత్రులు, నీటి సరఫరాకు విద్యుత్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.ఇదిలా ఉంటే, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్-కనెల్ను తొలగించాలనే ట్రంప్ భావిస్తున్నారు. క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటే గౌరవంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు డియాజ్-కనెల్.. అమెరికా దాడులకు ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. -
పారిస్ మేయర్గా ఎమ్మాన్యుయెల్
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎమ్మాన్యుయెల్ గ్రెగోయర్ విజయం సాధించారు. ఆయన, అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఆన్ హిడాల్గో స్థానాన్ని భర్తీ చేస్తూ, కొత్త మేయర్గా ఎన్నికయ్యారు.గ్రెగోయర్, కన్సర్వేటివ్ ప్రత్యర్థి రషిదా దాతిపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. విజయం అనంతరం గ్రెగోయర్ మాట్లాడుతూ.. ఇది ఒక కొత్త పారిస్ విజయం. ఉత్సాహభరితమైన, ప్రగతిశీలమైన పారిస్ అని పేర్కొన్నారు. మేయర్గా ఎన్నికైన వెంటనే గ్రెగోయర్ సైకిల్పై నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. కాగా, ఫ్రాన్స్లో 1500 కమ్యూన్లలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నికయ్యారు. పారిస్తో పాటు మార్సెయ్, నీస్ వంటి ప్రధాన నగరాల్లో పోటీ తీవ్రంగా జరిగింది. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది (2027) అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. -
హమ్మయ్య..ఆయన చనిపోయాడు..!
వాషింగ్టన్: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు దీర్ఘకాలం డైరెక్టర్గా పనిచేసిన రాబర్ట్ ఎస్ ముల్లర్(81) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ముల్లర్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిపై, ట్రంప్ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘హమ్మయ్య..ఆయన చనిపోయారు. చాలా సంతోషంగా ఉంది. అమాయకులను ఆయన ఇక ఏమాత్రం బాధపెట్టలేరు’అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రచార బృందం రష్యాతో చేతులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయ శాఖ చేపట్టిన విచారణలో ముల్లర్ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. రష్యా జోక్యం మాట వాస్తవమేననీ, కుట్ర పన్నినట్లు మాత్రం తగు ఆధారాలు లేవని ముల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు. 2001లో అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆయన్ను ఎఫ్బీఐ డైరెక్టర్గా నామినేట్ చేశారు. సెపె్టంబర్ 11 దాడులకు కేవలం వారం రోజులు ముందుగా డైరెక్టర్ బాధ్యతలను చేపట్టారు. దాదాపు 12 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన..ప్రపంచం నివ్వెరపోయిన రీతిలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ఎఫ్బీఐని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే రీతిలో పూర్తి స్థాయిలో పటిష్టం చేశారు. -
శ్రీలంకలో ఇంధన మంటలు
కొలంబో: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఇంధన ధరలను 25 శాతం మేర పెంచింది. ఈ పెంపు వారంలో రెండోసారి కాగా, మార్చి ఒకటో తేదీ తర్వాత మూడోసారి కావడం గమనార్హం. నూతన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, కనీసం 20 శాతం మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనాలున్నాయి. ఆటో డీజిల్ లీటరు ధర ప్రస్తుతమున్న రూ.303 నుంచి 26.1 శాతం మేర పెరిగి రూ.382కు చేరుకుంది. సూపర్ డీజిల్ రూ.353 నుంచి రూ.443కు, కిరోసిన్ రూ.195 నుంచి 30.8 శాతం మేర పెరిగి రూ.255కు, అదేవిధంగా, పెట్రోల్ 25.6 శాతం మేర పెరిగి రూ.398కి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశం 2022నాటి ఆర్థిక సంక్షోభాన్ని మరోసారి చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1948లో స్వాతంత్య్రం పొందాక మొట్ట మొదటిసారిగా శ్రీలంక అప్పులు చెల్లించలేని స్థితిలో సార్వభౌమ డిఫాల్టర్గా ప్రకటించారు. ఇంధన ధరలు పెరిగిన కారణంగా 90 శాతం మేర బస్సులను తిప్పే పరిస్థితులు లేవని ప్రైవేట్ బస్సు సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. ‘డీజిల్ ధరల్లో గతంలో ఎన్నడూ ఇంతభారీగా పెరగలేదు. ఇందుకు తగ్గట్లుగా కనీసం 15 శాతమైన ఛార్జీలను పెంచకుండా బస్సులను నడపలేం’అని ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు విజయరత్నే చెప్పారు. దేశంలోని బస్సు సర్వీసులను 65–75 శాతం మేర ప్రైవేట్ సంస్థలే నడుపుతున్నాయి. పెట్రోల్ ధర రూ.400 వరకు పెరిగితే ఆటోల్లో ఎవరు ప్రయాణిస్తారంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెంచిన ఇంధన ధరలతో పన్నుల రూపంలో ప్రభుత్వమే లాభపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం 5–8 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లీటరు పెట్రోలుపై రూ.100, డీజిల్పై రూ.20 వరకు సబ్సిడీ ఇస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన ధరలను పెంచకుంటే మరింత భారం మోయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు విద్యుత్ శక్తితో అవసరాలు తీర్చుకోవాలని, ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఇంధన రేషనింగ్ అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ సాయంతో వారానికి బైక్లకు 5 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బస్సులకైతే 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే అందిస్తోంది.ఇంధన ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది. -
13 గంటలు విమానంలోనే మహిళ మృతదేహం
లండన్: విమానం టేకాఫ్ తీసుకున్న గంటలోపే ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచింది. అయినప్పటికీ పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా, ఆ మృతదేహం కనీసం 13.5 గంటలపాటు విమానంలో ఉండిపోగా, చెడు వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఆదివారం బ్రిటిష్ ఎయిర్ వేస్కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. హాంకాంగ్ నుంచి టేకాఫ్ తీసుకున్న గంట సమయానికి విమానంలోని 60 ఏళ్ల ప్రయాణికురాలొకరు అనారోగ్యంతో చనిపోయారు. ఇలాంటి సందర్భాలను మెడికల్ ఎమర్జెన్సీగా భావించరాదన్న నియమాల ప్రకారం పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించారు. మృతదేహాన్ని విమానం వెనుక భాగంలోని ఓ మూలన ఉంచారు. అక్కడ వేడిగా ఉండటంతో కొద్ది సేపటికే మృతదేహం నుంచి చెడు వాసన వస్తున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. హీత్రూ విమానాశ్రయంలో ల్యాండయ్యాక..విచారణ కోసం 45 నిమిషాలపాటు మొత్తం 331 మంది ప్రయాణికులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వలేదు. -
దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్
ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్ను కోరారు. రెజా తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా దళాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దక్షిణ నగరం జపోరిజ్జియాలో శనివారం ఒక నివాస గృహంపై డ్రోన్ దాడి జరగగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది గాయపడ్డారు.సమీపంలోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు డోనెత్స్క్ మరియు దక్షిణ ఖెర్సన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఫ్లోరిడాలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్పై విస్తృత దాడులు జరపడం ఇదే మొదటిసారి. కాగా, పశ్చియాసియాలో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు పలకగా.. రష్యా ఇరాన్ పక్షాన ఉంది. 2022లో మొదలై నేటికీ కొనసాగుతుంది..!రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం 2022లో మొదలై, నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ అనూహ్య ప్రతిఘటనతో ఇటీవలికాలంలో రష్యా దాడులను కాస్త తగ్గించింది. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో రష్యా ఈ యుద్దాన్ని మొదలుపెట్టింది. -
దెబ్బకు దెబ్బ తీస్తాం.. అమెరికాపై ఇరాన్ కౌంటర్ అటాక్
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దం సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య తారాస్థాయికి చేరింది. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇంధన కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇవ్వగా.. ఇరాన్ తొలుత మొత్తబడినట్లే కనిపించి, ఆతర్వాత గట్టి కౌంటరిచ్చింది.ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప, మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చని ప్రకటించిన ఇరాన్.. అమెరికా మా ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని వార్నింగ్ ఇచ్చింది. అలాగే మధ్యప్రాచ్య మౌలిక సదుపాయాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని హెచ్చరించింది. అమెరికా 48 గంటల వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లో ఇరాన్ మిలిటరీ ఈ ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూస్తే, అమెరికా వార్నింగ్లకు ఇరాన్ బెదిరేలా కనిపించడం లేదు. దెబ్బకు దెబ్బ తీసేలా కనిపిస్తుంది. ఊపిరి పీల్చుకున్న ప్రపంచంహర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తొలుత చేసిన ప్రకటన వల్ల ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది. ధరల పెరుగుదలపై ఆందోళనలు కూడా ఒకింత తగ్గాయి. అయితే ఇరాన్ తాజా ప్రకటన తర్వాత పరిస్థితి మొదటికొచ్చింది. -
ఒమన్లో పెను విషాదం
ఒమన్లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.ఒమన్లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్క ఒమన్ ఇరాన్ మిస్సైల్ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిరోజు ఒమన్పై దాడులు చేస్తుంది. ఒమన్తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే?
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..ఇరాన్అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన్నారు.లెబనాన్ మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.వెస్ట్ బ్యాంక్ రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.గల్ఫ్ గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. కువైట్లో ఆరుగురు మరణించారు.యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.బహ్రెయిన్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఇరాక్ యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.జోర్డాన్జోర్డాన్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. గల్ఫ్లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది. -
గజగజా వణికించే ఎఫ్-35ని ఇరాన్ సింపుల్గా ఇలా కొట్టింది..
టెహ్రాన్: ప్రపంచంలో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్గా పేరుగాంచిన ఎఫ్-35ను ఇరాన్ ఎలా గుర్తించింది, ఎలా పేల్చేసింది? ఎఫ్-35 శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. అయినప్పటికీ, ఇరాన్ దాని పని పట్టింది.ఇరాన్కు ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా, 44 సెకన్ల ఓ యానిమేటెడ్ క్లిప్ దీన్ని కొత్త కోణంలో విశ్లేషించి చూపించింది. రాడార్ సంకేతాలపై ఆధారపడకుండా ఇరాన్ ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లపై ఆధారపడి ఉండొచ్చు. అంటే, ఏదైనా వస్తువు నుంచి వెలువడే వేడి (ఉష్ణం)ని గుర్తించి, ఆ వేడి ఆధారంగా ఆ వస్తువు ఎక్కడ ఉంది? ఎలా కదులుతోంది? అనేది దీని ద్వారా గుర్తించొచ్చు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ చాలా వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడిని సెన్సర్లు గుర్తించి, ఆ జెట్ స్థానాన్ని తెలుసుకుంటాయి. దీంతో పైలట్లకు ఇరాన్ సైనికులు తమను గమనిస్తున్నారని తెలియకపోవచ్చు.ఇరాన్ ఎఫ్-16ను కూడా దెబ్బతీసినట్లు ప్రకటించింది. నిన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దేశ మధ్యభాగంపై ఇజ్రాయెల్కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించాయి. “జయోనిస్టు పాలనకు చెందిన ఎఫ్-16 శత్రు ఫైటర్ జెట్ను ఉదయం 3.45 గంటలకు దెబ్బతీశాం” అని గార్డ్స్ తమ సెపా న్యూస్ వెబ్సైట్లో తెలిపాయి.ఇరాన్ మీడియా ఆకాశంలో పొగ కనిపిస్తున్న చిత్రాన్ని విడుదల చేసి, మరో విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది, కానీ అది ఏ రకమో లేదా ఇజ్రాయెల్దా, అమెరికాదా అన్నది కూడా వెల్లడించలేదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ యానిమేషన్ వీడియో నిశ్శబ్ద ప్యాసివ్ గుర్తింపు సిద్ధాంతాన్ని చూపుతోంది. టెక్ వ్యాఖ్యాత ఫుర్కాన్ గోజుకారా ఎక్స్లో పంచుకున్న ఈ క్లిప్ ఈ విషయాన్ని వివరిస్తుంది. తరంగాలను విడుదల చేసే రాడార్ వ్యవస్థలతో భిన్నంగా, ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు నిశ్శబ్దంగా ఉండి, ముఖ్యంగా జెట్ ఇంజిన్ల నుంచి వచ్చే వేడిని గుర్తిస్తాయి.యానిమేషన్లో ప్రకాశించే గుర్తులు విమానం ప్రయాణ మార్గాన్ని చూపుతాయి, సెన్సర్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా లక్ష్యాన్ని పట్టుకుంటాయి. ఏ సంకేతం ప్రసారం కాకపోవడంతో విమానంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థలు అలర్ట్ ఇవ్వవు. యానిమేటెడ్ క్లిప్ ఇదే..Iran is brilliantly bypassing billion dollar stealth tech using passive detection systems. Instead of radar, they use advanced infrared sensors to track heat signatures. It emits no signal, giving US pilots zero warning they are being targeted. Absolute game changer. pic.twitter.com/YCXtYEjvKj— Furkan Gözükara (@FurkanGozukara) March 22, 2026 -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాల్లో అధికంగా లభించే సహజ వనరులు అయిన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)తో పాటు ఇతర ఇంధన వనరుల నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి. లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం. పెద్ద దానితో మొదలు పెట్టి గట్టిగా ముగిస్తాం” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి స్పందించారు.‘ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అధికంగా లభించే ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్) వంటి ఇంధన వనరుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది.ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి తెరవబడటం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిస్తుంది. -
ట్రంప్ వార్నింగ్ ఇవ్వగానే దాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన వెంటనే ఇరాన్ మరింత అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని పేల్చేసింది.‘హార్మూజ్ దీవి సమీపంలో, ఇరాన్ దక్షిణ తీరంపై అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించాం. ఎఫ్-15 యుద్ధ విమానాన్ని మా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి’ అని ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఎక్స్లో పేర్కొంది. ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.కాగా, అమెరికాకు చెందిన అతి భీకర ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో ఢీకొట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్-35 యుద్ధ విమానాల చరిత్రలో ఇటువంటిది మునుపెన్నడూ జరగలేదు. ఎఫ్-35 అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం. ఇది శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్ చెబుతూ ఆధారాన్ని కూడా పోస్ట్ చేసింది.మరోవైపు, యుద్ధం వేళ నిరాధార వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. యూరప్పై ఇరాన్ క్షిపణులను ఎక్కుపెట్టిందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని యూకే తెలిపింది. యూరప్పై క్షిపణి దాడులకు ఇరాన్ ప్రణాళికలు వేసుకుంటోందని, అంతటి సామర్థ్యం ఇరాన్కు ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని బ్రిటన్ తెలిపింది.లండన్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలను చేరే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన తరువాత బ్రిటిష్ కేబినెట్ మంత్రి స్టీవ్ రీడ్ ఆ వాదనను తిరస్కరించారు. ఇరాన్ మీడియా పోస్ట్ చేసిన వీడియోAn enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/x8kYuQGR6o— Press TV 🔻 (@PressTV) March 22, 2026 -
అమెరికాకు బలం తోడైంది?..ఇరాన్పై దాడికి సిద్ధమైన మరో దేశం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది. ఈ క్రమంలో న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్మెరైన్ ‘హెచ్ఎంఎస్ ఆన్సన్’హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్ మెరైన్ హర్మూజ్ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు మరింత బలం చేకూరినట్లువుతుంది. ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్మెరైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి. సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్మెరైన్ ఉపయోగపడనుంది. ఇరాన్పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి. -
ఖతార్లో కూలిన సైనిక హెలికాఫ్టర్
దోహ: ఖతార్ సైనిక హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం.ఖతర్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, సాధారణ విధుల్లో ఉన్న ఒక సైనిక హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా దేశపు సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ఎటువంటి సంబంధం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదానంతరం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి వివరాల గురించి తెలియాల్సి ఉంది. -
మాకే 48 గంటల టైమ్ ఇస్తారా? రెచ్చిపోయిన ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ స్పందించింది. ట్రంప్కే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా అంతటా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పింది.“మా ఇంధన, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై శత్రువులు దాడి చేస్తే.. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఆస్తులతో పాటు ఆయా దేశాల్లోని ఎనర్జీ, సమాచార సాంకేతిక, సముద్ర జల ఉప్పుతీత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాం” అని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.కాగా, హార్మూజ్ భద్రతకు యూరోపియన్ దేశాలు, నాటో మిత్రదేశాలు, ఇతర దేశాలు సహకరించాలని ట్రంప్ కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. “48 గంటల్లో ఇరాన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తాం’’ అని అన్నారు.బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇరాక్ దేశాల్లో పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ చేసిన దాడులను జీ7 విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు.“ఈ దేశాలపై ఇరాన్ చేసిన దాడులు ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పుగా నిలుస్తున్నాయి. ఇరాన్ తక్షణం, ఎలాంటి షరతులు లేకుండా అన్ని దాడులను నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాం. సముద్ర మార్గాల రక్షణ, నౌకాయాన భద్రతకు సహకరించాల్సిందే. హార్మూజ్ జలసంధి సహా కీలక జలమార్గాలు, సరఫరా చైన్ భద్రత, ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం అవసరం” అని జీ7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.కాగా, ఇరాన్ ఇప్పటికే పలు దేశాలకు హార్మూజ్ జలసంధిని వినియోగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలు హార్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని, నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. -
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి.. ఇంట్లోకి దూసుకొచ్చిన క్షిపణి?
జెరూసలేం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. తాజాగా,ఇరాన్ దక్షిణ ప్రాంతంలో నతాంజ్ అణు కేంద్రాన్ని లక్క్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్..ఇజ్రాయెల్లోని డిమోనా, అరద్ నగరాలపై క్షిపణులతో విరుచుకు పడింది.ఇరాన్ జరిపిన క్షిపణ దాడుల్లో అనేక భవనాలు శిథిలయ్యాయి. క్షిపణుల దాడి సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇరాన్ ప్రయోగించిన ఓ క్షిపణి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు,కిటికీల ఫ్రేములు ఎగిరిపోతుండగా..సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.ఏఎఫ్పీ ప్రకారం..ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ అరద్ పట్టణంలో 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, డిమోనాలో 33 మంది గాయపడ్డారు. డిమోనాలో బాంబు షెల్ కారణంగా తీవ్రంగా గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి డిమోనా కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ దాడులకు ప్రాముఖ్యత ఏర్పడింది. כדור אש יורד מהשמיים: תיעוד הפגיעה בדימונה@Itsik_zuarets pic.twitter.com/8R1G7lmDVW— כאן חדשות (@kann_news) March 21, 2026 -
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ట్రంప్ బ్రీఫింగ్లలో హాట్టాపిక్!
టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లలో హాట్టాపిక్గా మారిందిఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోజ్తాబా మౌనంమరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. -
ఒమన్లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి. Significant flooding in Muscat, Oman’s port capital today...🌊 pic.twitter.com/ZBkEdqBBWj— Volcaholic 🌋 (@volcaholic1) March 21, 2026వారికి భారీ జరిమానాలువరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ -
రికార్డు సృష్టించిన పాక్.. ఏ విషయంలో తెలుసా?
పాకిస్థాన్కు తన చేస్తున్న పనులకు తగిన గౌరవం లభించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మెుదటి స్థానానికి చేరుకొని రికార్డు సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా టాఫ్ ప్లేసులో ఉన్న ఈ దేశం ఇప్పుడు ఏకంగా మెుదటి స్థానానికి చేరుకొని అశాంతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.పాకిస్థాన్ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ ఇంతకాలం శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చింది. దాయాది దేశం కపటబుద్దిని ఉగ్రవాదులకు కల్పిస్తున్న అండదండలను అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అయినప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్పై విషం చిమ్ముతూ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో పాకిస్థాన్ మెుదటి స్థానం దక్కించుకుంది. దీంతో ఆదేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లమయ్యింది. కాగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంగా దేశంలో ఉగ్రవాద ఘటనలు 44 శాతం తగ్గాయని పేర్కొంది. క్రితంతో పోలిస్తే 2025లో ఉగ్రవాద మరణాలు 28 శాతం తగ్గాయి. ఉగ్రదాడుల సంఖ్య 22శాతం తగ్గి 2,944కు చేరుకుంది. 81 దేశాలలో పరిస్థితి మెరుగుపడగా 19 దేశాలలో పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాలలో ఉగ్రవాద దాడులు 280 శాతం పెరిగాయి.టెర్రరిజం అరికట్టడానికి ప్రహార్అయితే భారత్ ఉగ్రవాదాన్ని సమూళంగా అణిచివేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 23న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'ప్రహార్' పేరుతో మెట్ట మెుదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని విడుదల చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా ఈ విధానం చర్యలు తీసుకోనుంది. ఇండెక్స్ ఏ ఆధారంగా?గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నాలుగు ప్రధానాంశాల ఆధారంగా గుర్తిస్తారు. సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీలుగా చిక్కుకున్నవారు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. -
సముద్రంలో రేసింగ్ లెజెండ్ గల్లంతు
మాల్దీవులు: భారత మోటార్ స్పోర్ట్స్ రంగంలో విషాదం నెలకొంది. ఐదుసార్లు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్గా నిలిచిన లెజెండరీ డ్రైవర్ హరిసింగ్ (59), మాల్దీవుల్లో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. గడచిన 48 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో, ఆయన మృతి చెంది ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగింది?శుక్రవారం ఉదయం వావు అటోల్లోని ఫెలిధూ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు చెందిన యాచ్తో అనుసంధానమై ఉన్న ఒక హై-స్పీడ్ బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో బోటులో హరిసింగ్, సింఘానియాతో పాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు గౌతమ్ సింఘానియాతో సహా ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. అయితే హరిసింగ్, బోటు కెప్టెన్ మాత్రం సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయారు.పగడపు దీవుల్లో చిక్కుకున్నారా?మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) కోస్ట్ గార్డ్ బృందాలు మూడవ రోజు కూడా ముమ్మరంగా గాలిస్తున్నాయి. సముద్ర గర్భంలోని పగడపు దీవుల (Coral Reef) మధ్య హరిసింగ్ చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే హరిసింగ్ కుమారుడు మివాన్ సింగ్ మాల్దీవులకు చేరుకున్నారు.భారత రేసింగ్ చరిత్రలో..హరిసింగ్ కేవలం ఒక రేసర్ మాత్రమే కాదు.. భారత మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఒక మార్గదర్శిగా నిలిచారు.1990లలో వరుసగా ఐదుసార్లు జాతీయ ర్యాలీ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక ఆసియా జోన్ ర్యాలీ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి భారతీయునిగా నిలిచారు. ప్రస్తుతం జేకే టైర్ మోటార్ స్పోర్ట్ హెడ్గా ఉంటూ, పలువురు యువ రేసర్లకు శిక్షణనిస్తున్నారు. హరిసింగ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు -
ట్రంప్ ఎఫెక్ట్.. యుద్ధంలోకి మరో దేశం?
పశ్చిమాసియా యుద్ధంలో మరో దేశం దిగనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బ్రిటిష్కు చెందిన ఓ అణు జలాంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరించినట్లు డేలీ మెయిల్ కథనం పేర్కొంది. దీనితో ఈ క్షణాన్నైనా ఇరాన్పై దాడులు చేసే అవకాశం ఉందని సమచారం.నాటో దేశాలపై ట్రంప్ ఇటీవల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధి విషయంలో అవి స్పందించడం లేదని వారంతా పిరికి వాళ్లన్నారు. అమెరికా లేని నాటో ఏందుకు పనికి రాదని పేపర్ పులి లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తూ తన అధికారిక సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ స్పందించినట్లు తెలుస్తోంది.బ్రిటన్ అరేబియా సముద్రంలో ఒక అణుశక్తితో నడిచే జలాంతర్గామిని మోహరించిందని డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఈ సబ్మెరైన్లో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను దాడికి సిద్ధంగా ఉంచిందని తెలిపింది. హెచ్ఎంఎస్ ఆన్సన్ అనే జలంతార్గామి మార్చి 6న ఆస్ట్రేలియా నుంచి బయిలుదేరిందని అరేబియా సముద్రంలోని పరిస్థితులను వివరించేందుకు ప్రతి 24 గంటలకోకసారి హెచ్ఎంఎస్ ఆన్సన్ ఉపరితలానికి వస్తున్నట్లు డైలీమెయిల్ కథనం ప్రచురించింది.కాగా బ్రిటన్, అమెరికాకు చెందిన ద్వీపం డీగో గార్సియాపై దాడి చేసింది. నాలుగువేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్పై అటాక్ చేసింది. ఇరాన్పై దాడికి డీగో గార్సియా ద్వీపం ఉపయోగించుకోవచ్చని బ్రిటన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇప్పుడు బ్రిటన్ సైతం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్కు బిగ్ షాక్!.. ఇరాన్ పవర్ఫుల్ అటాక్
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం టార్గెట్గా ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో, ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు కీలకమైన అణు కేంద్రం ఉండటం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక, ఈ ఘటనలో పిల్లలు సహా 100మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని పేర్కొంది. దీని వల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది. MAJOR IRANIAN ATTACK..Israel’s most secretive nuclear siteIn Dimona is on fire‼️Widely believed to be a nuclear research and weapons-related facility. pic.twitter.com/t6MSGsSAR2— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 21, 2026 నెతన్యాహు హెచ్చరిక.. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయం. గాయపడిన వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో శత్రువులను ఎదుర్కొంటాం. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పనిచేస్తున్న అత్యవసర సేవా బృందాలకు నెతన్యాహూ అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతం నుంచి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇరాన్ ఝలక్.. ఇజ్రాయెల్పై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి స్పందించారు. ఇజ్రాయెల్ గగనతలం రక్షణ లేకుండా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల ఆకాశంపై ఇరాన్ మిసైల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇకపై జరగబోయే దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కమాండర్లను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.Video shows the moment an Iranian missile struck Dimona in southern Israel, home to the country’s nuclear facility. Nearly 50 people have been injured. Iran had warned it would target the area if the US and Israel pursued regime change in Tehran. pic.twitter.com/cPkzWskiw6— Al Jazeera Breaking News (@AJENews) March 21, 2026 -
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్బీఐ (ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.విద్వేషానికి పరాకాష్టముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.ఎఫ్బీఐలో కొత్త ఉత్సాహంముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
అఫ్గానిస్తాన్లో భూకంపం
అఫ్గానిస్థాన్ని స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు కుదిపేశాయి. ఉత్తర ప్రాంతంతో పాటు రాజధాని కాబూల్, ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5, 4.6గా రికార్డయింది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.అయితే భూకంప తీవ్రతకు కొన్ని చోట్ల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై రోడ్లమీదకి వచ్చారు. కాబుల్ సమీపంలోని డే సబ్జా, ఖాదిర్ ఖిల్, భక్తియారన్ వంటి ప్రాంతాలపై దీని ప్రభావం పడింది.కాగా ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 4 లేదా అంతకంటే తీవ్రతతో వరుసగా భూమి ప్రకపించడం ఈ మధ్య కాలంలో చాలా సార్లు జరిగింది.కాగా ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. కాబూల్పై పాక్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశంలోని ఒక ఆసుపత్రిపై పాక్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దుర్ఘటనలో వందల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. -
యుద్ధం వేళ కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర సర్కారు
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు.. -
ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం
నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్య అగ్రగామి, కే-పాప్ సంచలనం బీటీఎస్ మళ్లీ స్టేజ్ పైకి వచ్చేసింది. శనివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని గ్వాంగ్హ్వామున్ స్క్వేర్లో జరిగిన బీటీఎస్ కంబ్యాక్ కన్సర్ట్ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్గా ప్రసారమైన ఈ మెగా ఈవెంట్కు వేలాది మంది పోలీసులు రక్షణగా నిలవగా, లక్షలాది మంది అభిమానులు (ARMY) తమ అభిమాన హీరోలను చూసి పరవశించిపోయారు. ‘అన్యోంగ్హాసెయో!’.. మేము మళ్లీ వచ్చేశాం" అంటూ బ్యాండ్ లీడర్ ఆర్ఎం పలికిన మాటలు సీయోల్ వీధుల్లో ఉవ్వెత్తున మారుమోగాయి.సరికొత్త రికార్డుల వేటలో..దక్షిణ కొరియాలో తప్పనిసరి అయిన సైనిక సేవను గ్రూప్లోని ఏడుగురు సభ్యులు (ఆర్ఎం, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్ కుక్) విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జరిగిన మొదటి పూర్తిస్థాయి కన్సర్ట్ ఇది. శుక్రవారం విడుదలైన వీరి ఐదవ ఆల్బమ్ ‘అరిరంగ్’ మొదటి రోజే ఏకంగా 40 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. తన కాలికి గాయం అయినా దానిని లెక్కచేయకుండా ఆర్ఎం చేసిన పర్ఫార్మెన్స్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసి, కన్నీరు పెట్టించింది.గ్వాంగ్హ్వామున్ వేదికగా సంగీత సంగమంచారిత్రక గ్వాంగ్హ్వామున్ స్క్వేర్, గ్యోంగ్బోక్ ప్యాలెస్ నేపథ్యంగా పర్పుల్, ఎరుపు, నీలం రంగుల వెలుగుల్లో ఈ వేడుక అద్భుతంగా సాగింది. కొరియా జానపద గీతం ‘అరిరంగ్’ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్, విడిపోవడం, తిరిగి కలవడంలో ఉండే ఆవేదన, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ‘మేము ఎవరమో, మళ్లీ ఎలా కలిసి వచ్చామో ప్రపంచానికి చూపించాలనుకున్నాం’ అని ఆర్ఎం ఈ సందర్భంగా ఉద్వేగంగా పేర్కొన్నారు.పోలీసు వలయంలో సీయోల్!2022 హాలోవీన్ విషాదం తర్వాత ప్రభుత్వం భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించింది. కన్సర్ట్ కోసం సమీపంలోని సబ్వేలు, బస్సు సర్వీసులను నిలిపివేసి, చుట్టుపక్కల భవనాలను కూడా సీల్ చేశారు. 22,000 మంది ‘అదృష్టవంతులు’ గ్యాలరీల్లో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించగా, బయట వేలాది మంది భారీ స్క్రీన్ల ముందు ఆనందంగా ఊగిపోయారు.పాత జ్ఞాపకాలు.. కొత్త ఊపిరిగంట పాటు సాగిన ఈ ప్రదర్శనలో "‘బేబీ టు బాడీ’, "స్విమ్" లాంటి కొత్త పాటలతో పాటు, గ్లోబల్ హిట్స్ అయిన ‘డైనమేట్’, ‘బట్టర్’ పాటలకు అభిమానులు స్టెప్పులేశారు. ‘కొన్నేళ్ల క్రితం బూసాన్ కన్సర్ట్లో మా కోసం వేచి ఉండమని అడిగాం.. ఆ మాట నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ జిన్ భావోద్వేగానికి లోనయ్యారు. చలిని కూడా లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి సభ్యులు స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు.ముందుంది గ్లోబల్ టూర్ఈ కన్సర్ట్ కేవలం ప్రారంభం మాత్రమే! ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో సుమారు 82 ప్రదర్శనలతో కూడిన భారీ గ్లోబల్ టూర్ కు బీటీఎస్ సిద్ధమైంది. కే-పాప్ చరిత్రలో ఇదొక ‘రెండవ స్వర్ణయుగం’ అని సాంస్కృతిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కే-పాప్ క్రేజ్ను ఈ కంబ్యాక్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు.ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ.. -
ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్లైన్.. లేకపోతే ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరాయం కలగకుండా చూడాలన్నారు. లేకపోతే యుఎస్ఏ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కాదు కదా మరింత పెరుగుతున్నాయి. నిన్న( శనివారం) ఇరాన్ తన ప్రాంతానికి 4వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరిని షాక్కు గురిచేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. " 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లపై దాడికి తెగబడుతుంది. వాటిలో అతిపెద్దదానిపై మెుదటగా దాడి చేస్తుంది". అని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు.అయితే నిన్న ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించారు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకే తన లక్షాలను చేరుకుందని కనుక సైనిక చర్యను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. కాగా ఈ రోజు మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
న్యూఢిల్లీ/దుబాయ్/భోపాల్/శ్రీనగర్: రంజాన్ పర్వదినాన్ని శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలు, మసీదుల ప్రాంగణాలు, స్టేడియంలు, బహిరంగ ప్రాంతాలు, విశాల మైదానాల్లో పెద్దసంఖ్యలో జనం ముస్లింలు ఒకేచోటకు చేరుకుని సామూహికంగా నమాజ్ చేశారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం మరింత వెల్లివిరియాలని కోరుకున్నారు. ముస్లిం సోదరుల ఆతీ్మయ ఆలింగనాలతో ఆ ప్రాంతాలన్నీ పర్వదిన శోభను సంతరించుకున్నాయి. పాత ఢిల్లీ మొదలు జమ్మూకశ్మీర్ దాకా చాలా ప్రాంతాల్లో ముస్లింలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మొదలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, విపక్ష నేతల దాకా ముఖ్యనేతలంతా దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈద్–ఉల్–ఫితర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నాయకులంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్లు పెట్టారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదుతోపాటు ఫతేపురీ మసీదు, సీలాంపూర్, ఓఖ్లా, నిజాముద్దీన్ మసీదుల్లో పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పెద్దసంఖ్యలో ఢిల్లీ పోలీస్, పారా మిలటరీ బలగాలు శాంతియుతంగా పండుగ జరిగేలా చూసుకున్నాయి. జమ్మూకశ్మీర్లోనూ పండగను ముస్లింలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. శ్రీనగర్లో దాల్ సరస్సు సమీపంలో పురాతన హజ్రత్బల్ మసీదు ఆవరణలో భారీసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలుచేశారు. అయితే వరసగా ఏడో ఏడాదీ శ్రీనగర్ ఓల్డ్ సిటీ జామామసీదులోకి ఈద్ ప్రార్థనలకు స్థానికులను స్థానికయంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. లక్నోలోని అయి‹Ùబాగ్ ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో క్రైస్తవ, సిక్కు నేతలు సైతం పాల్గొనడం విశేషం. కోల్కతాలోని రెడ్రోడ్లో వార్షిక ‘ప్రార్థనా సమూహం’ కార్యక్రమంలో భారీసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ‘‘ఈద్–ఉల్–ఫితర్ వేళ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి అంతటా మరింతగా సోదరభావం, కరుణ విస్తరించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈద్ ముబారక్’’అని ప్రధాని మోదీ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. పలుచోట్ల యుద్ధవ్యతిరేక నిరసనలు రంజాన్ జరుపుకునే ఇరానియన్లపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్లను తప్పుబడుతూ జమ్మూకశ్మీర్లోని బుద్గామ్, బందీపొరా, రాజస్తాన్లోని సిఖార్, అజీ్మర్, మధ్యప్రదేశ్లోని భోపాల్ తదితర ప్రాంతాల్లో షియా ముస్లింలు నల్ల బ్యాడ్జీలు, పాత దుస్తులు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనగా కొన్ని మసీదులపై నల్లజెండాలను ఎగరేశారు. ఇరాన్ సుప్రీంనేత, షియా ముస్లింల కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని చంపేసినందుకు సంతాపసూచికగా మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల షియా ముస్లింలు ఈద్కు దూరంగా ఉండిపోయారు. భోపాల్లోని ప్రసిద్ధ ఇమామ్బారాలో ఖమేనీ భారీ కటౌట్ను పెట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం సున్నీ వర్గీయులు వేడుకలు జరుపుకోవడం గమనార్హం.టెహ్రాన్లో భారీ ప్రదర్శనలు, ప్రార్థనలు రంజాన్ను పురస్కరించుకుని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ సంఖ్యలో జనం మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలుచేశారు. యుద్ధం ముగిసిపోవాలని కోరుకున్నారు. ‘‘అయతొల్లా అలీ ఖమేనీ లేకుండా ఈద్ ప్రార్థనలు జరగడం నన్నెంతో కలిచివేస్తోంది. ఇటీవల మరణించిన జనరల్ అలీ మొహమ్మద్ నయీనీ కోసం సైతం ప్రార్థనలుచేశాం’’ అని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) అధికార ప్రతినిధి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
పండుగ రోజు పెను విషాదం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.ఈ దాడిలో ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం పూర్తిగా నేలమట్టమైంది. అత్యవసర చికిత్స భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రసూతి ఆపరేషన్ థియేటర్ పైకప్పు ధ్వంసం కాగా.. ఆసుపత్రి తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. దాడి తర్వాత ఆసుపత్రి మూసివేయడటంతో లక్షలాది మంది అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యారు. ఇటీవలికాలంలో ఎడ్ దాయిన్ ఆసుపత్రిపై జరిగిన మూడో వైమానిక దాడి ఇది.కాగా, సూడాన్లో 2023 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం 2026 నాటికి మరింత తీవ్రమైంది. సూడాన్ సైన్యం (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పెద్ద మానవ సంక్షోభాల్లో ఒకటిగా మారింది. -
విస్తరిస్తున్న యుద్ధ క్షేత్రం?
మూడు వారాలకు పైగా ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితమైన యుద్ధ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపరుస్తున్నాయి. తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా–బ్రిటన్ సంయుక్త స్థావరం డీగో గార్సియాపై దాడి రక్షణ నిపుణులనే నివ్వెరపరిచింది. తద్వారా అమెరికా సైనిక స్థావరాల్లో తనకు అందరానివంటూ ఏవీ లేవని ఇరాన్ చాటిచెప్పినట్టయింది. గార్షియా స్థావరంపైకి అది ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి విఫలం కాగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్సెప్టర్తో కూల్చేసినట్టు అమెరికా చెబుతోంది. కాకపోతే ఇరాన్ క్షిపణుల రేంజ్, సామర్థ్యం అమెరికా ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే చాలా ఎక్కువేనని ఈ దాడితో రుజువైంది. ఇరాన్ క్షిపణుల రేంజ్ మహా అయితే 2,000 కి.మీ. మాత్రమేనని అమెరికా చెబుతూ వస్తోంది. ఇరాన్ కూడా వాటిని ఎన్నడూ ఖండించలేదు. కానీ ఆ దేశం చడీచప్పుడూ లేకుండా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోందనేందుకు తాజా దాడులు నిదర్శనమంటున్నారు. వ్యూహాత్మకంగా కీలకం హిందూ మహాసముద్రం నడి»ొడ్డున ఉన్న చాగోస్ ద్వీపసమూహంలో డీగో గార్సియా అంతర్భాగం. అక్కడి 60 దీవుల్లో ఇదే అతి పెద్దది. 1960ల్లో ఇక్కడి 2,000 పై చిలుకు మూలవాసులను బ్రిటన్ బలవంతంగా ఖాళీ చేయించింది. 1971 నుంచీ ఈ దీవి అమెరికాకు అతి కీలక సైనిక స్థావరంగా మారింది. అప్పట్లో వియత్నాం మొదలుకుని అనంతర కాలంలో ఇరాక్, అఫ్గానిస్తాన్పై అమెరికా సాగించిన యుద్ధాల్లో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి దేశమైన చైనా కార్యకలాపాలపై నిశితమైన నిఘాకు కూడా అగ్ర రాజ్యానికి వీలు కలి్పస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ దీవిలో మోహరించిన 2,500 మంది సైనికుల్లో అత్యధికులు అమెరికన్లే. భారీ బాంబర్లు, నిఘా విమానాలతో పాటు కీలకమైన సైనిక మౌలిక సదుపాయాలన్నీ డీగో సొంతం. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన బీ–2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాలను కూడా గతేడాది ఆ దీవిలో అమెరికా మోహరించింది. ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో అక్కడ అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించడం కూడా తప్పేలా లేదు. అదే జరిగితే అమెరికాకు ఇప్పటికే తడిసిమోపెడవుతున్న యుద్ధ వ్యయం మరింత పెరగడం ఖాయం. ఈ కోణం నుంచి చూస్తే ఇరాన్ దాడి ప్రాధాన్యం సంతరించుకుందన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ‘‘శనివారం నాటి దాడి ద్వారా యుద్ధక్షేత్రాన్ని గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రానికి విస్తరించడంలో ఇరాన్ సఫలమైంది. అంతేకాదు, దక్షిణ యూరప్ దాకా ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం తనకు సమకూరిందంటూ హెచ్చరిక సంకేతాలు పంపింది’’అని వారంటున్నారు. తాజా యుద్ధానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో జరిగిన రెండో ఘటనగా ఇరాన్ క్షిపణి దాడులు నిలిచాయి. ఆ దేశ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాను శ్రీలంక తీర సమీపంలోని సముద్ర జలాల్లో జలాంతర్గామి దాడి ద్వారా అమెరికా ముంచేయడం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్సెప్టర్తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది. అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు. టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. ఇరాన్ ముమ్మర దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్లో ఒక కిండర్గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది. ఖర్గ్లో నౌకపై ఇజ్రాయెల్ దాడి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను! తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది. -
గాజాలో కన్నీటి శోకాల మధ్య 'మదర్స్ డే'
మధ్యప్రాచ్యంలో చాలా ప్రాంతాలు మదర్స్ డేను (మార్చి 21) ఘనంగా జరుపుకుంటున్న వేళ, గాజాలో (పాలస్తీనా) మాత్రం తల్లులు తమ కోల్పోయిన పిల్లలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు తమ తల్లులు లేని మదర్స్ డేను ఎదుర్కొన్నారు. గాజాలో మదర్స్ డే తల్లులు, పిల్లలకు శోకదినంగా మారింది. సమాధుల వద్ద తల్లులు తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపిన వైనం ప్రపంచం మొత్తాన్ని కంటితడి పెట్టిస్తుంది. యుద్ధం (ఇజ్రాయెల్తో) కారణంగా గాజా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న బాధ అంతర్జాతీయ సమాజానికి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పిల్లలను కోల్పోయిన తల్లుల ఆక్రందనలు ప్రపంచం నలుమూలలకు వినపడుతూ ఉన్నాయి.శవాలు కూడా అప్పగించలేదు..!గాజా సిటీలోని ఒక టెంట్లో కూర్చున్న ఎమ్ రామి దావ్వాస్ అనే మహిళ తన ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన జ్ఞాపకాలను పంచుకుంది. వారిలో ఇద్దరి శరీరాలను ఇప్పటికీ తమకు అప్పగించలేదని వాపోయింది. మదర్స్ డే రోజున నా కుమారులు నాకు పూలు, బహుమతులు తెచ్చేవారు. వారు నా జీవితానికి వెలుగులు అనుకుంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.వెక్కివెక్కి ఏడ్చింది..!14 ఏళ్ల మారమ్ తన తల్లిని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కోల్పోయింది. నాకు డబ్బు లేకపోయినా, తల్లికి చిన్న బహుమతి కొనేదాన్ని అని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది.64,000 మంది పిల్లల మృతిUNICEF అంచనాల ప్రకారం, 2023 అక్టోబర్ నుండి గాజాలో 64,000 మంది పిల్లలు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. Amnesty International నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం. యుద్దం కారణంగా గాజాలో ప్రసూతి, మాతృ, శిశు ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.సీస్ ఫైర్ తర్వాత కూడా దాడులుగతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ సీస్ ఫైర్ ప్రకటించింది. అయినా దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా వ్యాప్తంగా ఇప్పటివరకు 72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది. -
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.కొద్ది గంటల ముందే ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను రీచ్ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. -
వారిని రంగంలోకి దించుతా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇవాళ జరిగిన కాంగ్రెస్ (పార్లమెంట్) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ (డెమోక్రాట్లు) సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విమానాశ్రయ భద్రతకు అవసరమైన నిధులను వెంటనే ఆమోదించకపోతే ICE (Immigration and Customs Enforcement) సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నియమిస్తానని హెచ్చరించారు. ICE ఏజెంట్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా భద్రతా తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారుల అరెస్టు చేస్తారని అన్నారు. ముఖ్యంగా సోమాలియా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వారు మిన్నెసోటా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, స్థానిక డెమోక్రాట్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇల్హాన్ ఒమర్ అనే మహిళా సభ్యురాలిని అవినీతిపరురాలిగా ఆరోపించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా విమానాశ్రయ భద్రత Transportation Security Administration (TSA) పరిధిలో ఉంటుంది. అయితే ICE ఏజెంట్లను అక్కడికి పంపడం అనేది అసాధారణ చర్య. ICE ఏజెంట్లు ఇమిగ్రేషన్ అమలు, సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి పనుల్లో ఉంటారు. TSA స్థానంలో ICE ఏజెంట్లు భద్రతా తనిఖీలు చేపడితే ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారవచ్చు.కాగా, కాంగ్రెస్లో విమానాశ్రయ భద్రతా నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల (ట్రంప్ పార్టీ) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ తాజా హెచ్చరికను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. -
లష్కర్-ఎ-తయిబా కీలక ఉగ్రవాది దారుణ హత్య
పాకిస్తాన్లోని లష్కర్-ఎ-తయిబా (LeT) ప్రధాన కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. భారత్లో అనేక ఉగ్రదాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న LeT మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలఫీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆతర్వాత కత్తులతో పొడిచి హతమార్చారు. సలఫీ.. మసీదులో నమాజ్ పూర్తి చేసుకొని బయటికి రాగానే దుండగులు అటాక్ చేశారు.సలఫీ LeTలో కీలక నేత అని, భారత్లో అనేక దాడుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ హత్య LeTలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. కాగా, లష్కర్-ఎ-తయిబా పాకిస్తాన్లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రమూక భారత్లో అనేక దాడులకు పాల్పడింది. 2008 ముంబై దాడులు సహా అనేక రక్తపాతాల్లో LeT పాత్ర నిరూపితమైంది. -
మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి
భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్మెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
ఆమెతో చాలామంది లవ్లో పడ్డారు.. కానీ!
ఆమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కలిసి నడిచారు.. రష్యా అధ్యక్షుడు కలిసి ఫోటోలు దిగారు. మెలానియా ట్రంప్ కలిశారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమావేశమయ్యారు. చివరకు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా బంధించారు. ఇలా రూపకల్పన చేసిన ఆ మహిళకు మిలియన్ సంఖ్యలో ఫాన్స్ వచ్చిపడ్డారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే..కృత్రిమ మేధస్సుతో (AI) రూపొందించిన చిత్రాల్లో జెసికా ఫోస్టర్ అనే మహిళ ఒకటి,. ఆమె ఉనికిలో లేదు.. కానీ ఏఐ జనరేటెడ్ టెక్నాలజీ ఆమెను రూపొందించి ఇలా ప్రపంచానికి పరిచయం చేశారు. . ఆమెకు సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్స్ పేజ్ కూడా క్రియేట్ చేయబడింది. అమెరికా ఆర్మీ సైనికురాలిగా చూపించారు. ఆమెను ‘అమెరికా ఫస్ట్’అజెండాకు సేవలందిస్తున్న అసాధారణ జీవితం గడుపుతున్న మహిళగా చిత్రీకరించారు. హోర్ముజ్ జలసంధిలో యుద్ధనౌకపై హీల్స్ వేసుకుని నిలబడి ఉండటం.. ప్రసంగాలు ఇవ్వడం, ఇతర మహిళా సైనికులతో పిల్లో ఫైట్స్ చేయడం, ప్రపంచంలోని ప్రసిద్ధులైన వ్యక్తులను కలవడం ఇలా అన్నీ ఆమెతో చిత్రీకరించారు.ఆమెకు యువత ఫిదా..!ఆమెను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఏఐ జనరేటెడ్ మహిళలా లేదు. దివి నుంచి దిగివచ్చిన ఒక అందమైన కన్యలా ఉంది. అందుకే యువత ఆమెకు ఫిదా అయ్యారు. లవ్ ఎమోజీలతో ఆమెకు మెస్సేజ్లు పెట్టారు. ఆమె ఎంత అందంగా" ఉందో అని వ్యాఖ్యానిస్తూ, ఆమె అమెరికా ఫస్ట్ సందేశాన్ని ప్రశంసించిన వారిలో చాలా మంది పురుషులు తమ ప్రొఫైల్ చిత్రాలలో ఆమెనే పెట్టుకున్నారట. ఆమె కొన్ని ఫోటోలకు 30,000 కంటే ఎక్కువ లైక్లు రాగా, ఆమె నిజమైన వ్యక్తి కాదనే విషయం తెలియక లేదా పట్టించుకోక, వినియోగదారులు కామెంట్లను హార్ట్-ఐస్ ఎమోజీలతో నింపేశారు. లక్షల్లో ఫ్యాన్ ఫోలోయింగ్, 30 వేలకు పైగా లైక్లు ఆమె ఫోటోలకు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె కోసం సృష్టించిన అకౌంట్లను డిలీట్ చేశారు. ఇది నిజంగా పిచ్చే..!ఇలా ఏఐ సృష్టికి మనుషులు మోసపోవడం నిజంగానే వారి పిచ్చికి అద్దం పడుతుందని మాజీ ఇల్లినాయిస్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ కిన్జింగర్ ట్వీట్ చేశారు. జెసికా పోస్టర్ అనేది అమెరికా ఆర్మీ సైనికురాలు కాదు.. ఏఐ చేత సృష్టించబడిన మహిళ. ప్రజలు కామెంట్లు, ఏమి చెబుతున్నారో చూస్తే ఏఐతో ఇలా మోసపోతారా అనిపిస్తోంది’ అని ఆయన కామెంట్ చేశారు. -
ఇరాన్కు అంత సామర్థ్యం ఉందా?.. అలా అయితే వణుకే!
ఇరాన్.. అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోంటుంది. ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు అయ్యింది. అయినా ఇప్పటికీ ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గలేదు. తొలుత ఇరాన్పై యుద్ధానికి దిగినప్పుడు ఆ దేశాన్ని సులువుగానే అదుపులోకి తేవొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకొని ఉంటారు. కానీ ఆ అంచనా తప్పని ట్రంప్కు ఈపాటికి అర్థమై ఉంటుంది. అందుకే హార్మూజ్ జలసంధి భద్రత విషయంలో పలు దేశాల సాయాన్ని కూడా కోరారు. అదే సమయంలో అమెరికా అత్యాధునిక ఎఫ్-35 విమానం.. ఇరాన్ దెబ్బకు కుప్పకూలిపోయింది. ఎటువంటి రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా దాడి చేసే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం కుప్పకూలిపోవడం ట్రంప్కు కచ్చితంగా మింగుడు పడని అంశం. దీన్ని కాసేపు పక్కకు పెడితే ఇప్పుడు ఇరాన్ మరో భయాన్ని కూడా పుట్టించిందనేది మరో వార్త. అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతలకు తావిస్తోంది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. అసలు ఇరాన్ గతంలో ప్రకటించిన దానికి ఇది రెట్టింపు సామర్థ్యం కల్గి ఉందని అర్థం. అంతకముందు ఇరాన్ తమ బాలిస్టిక్ క్షిపణుల రేంజ్ 2,000 కిలోమీటర్లు అని బహిరంగంగానే చెప్పింది. మరి ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏమిటో అర్థం కావడం లేదు.ఇరాన్ గోప్యత పాటిస్తుందా?ఇరాన్ ఏమైనా అత్యాధునిక టెక్నాలజీతో క్షిపణులను తయారు చేసిందా.. లేక ఎక్కడ నుంచైనా కొనుగోలు చేసిందా అనేది చిక్కు ప్రశ్న. ఇరాన్ అప్రకటిత క్షిపణుల సామర్థ్యం అంత ఉంటే భవిష్యత్లో పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఇరాన్ ఆ రేంజ్తో దాడికి దిగితే ప్రపంచానికి తెలియని సామర్థ్యం అనేది ఆ దేశం వద్ద ఉన్నాయని అర్థం చేసుకోవాలి. తన వాస్తవ దాడి పరిధిపై శత్రువులకు స్పష్టత లేకుండా చేయడం ద్వారా, ఇరాన్ పరోక్షంగా పైచేయి సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఈ అస్పష్టత అమెరికా, యూకేల ప్రణాళికలను సైతం క్లిష్టతరం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కే కాదు.. గల్ఫ్ దేశాలకు కూడా భయం పుట్టించేది అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. డియాగో గార్సియా ఒక చిన్నస్థావరం కాదు.. ఇది అమెరికా ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఒక అత్యంత విలువైన కేంద్రం. ఇది ఒక కీలకమైన లాజిస్టిక్స్. అమెరికా యుద్ధ ప్రణాళికకు కూడా ఇది వేదికగా పనిచేస్తుంది. ఇది అమెరికా భారీ బాంబర్లు, నిఘా విమానాలకు నిలయంగా చెబుతారు.మరి ఆ స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం అనేది శత్రువు ఇంతకుముందు ఊహించిన దానికంటే ఇరాన్ క్షిపణుల పరిధి చాలా ఎక్కువ అని చూపే ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇరాన్ వార్తా సంస్థ ఒకటి అభివర్ణించింది.ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’! -
ఆయిల్పై అమెరికా అంచనా.. ఇరాన్ క్లారిటీ
అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణమార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 120 డాలర్ల మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులను మరింత తీవ్రం చేసుకుంటూ పోతున్నాయి. ఈ వారం ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింతగా పెరుగుతుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సైనిక అధికారులతో సమీక్ష సమయంలో చెప్పారు.టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఉగ్ర పాలనపై ముందుండి దాడులను కొనసాగించేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని కాట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు, అలాగే అమెరికా ప్రయోజనాలకు పశ్చిమాసియాలో ఉన్న ప్రతి ముప్పును తొలగించే వరకు ఆగబోమని అన్నారు. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు తాము ఆగబోమని ఆయన పేర్కొన్నారు.ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కు తగ్గకపోతుండడంతో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. చమురు, గ్యాస్ నిక్షేలపై ఆయా దేశాలు దాడులు చేస్తుండడంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దాడులు ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. Spoke with President Dr. Masoud Pezeshkian and conveyed Eid and Nowruz greetings. We expressed hope that this festive season brings peace, stability and prosperity to West Asia.Condemned attacks on critical infrastructure in the region, which threaten regional stability and…— Narendra Modi (@narendramodi) March 21, 2026 -
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తున్నామని ఇరాన్ మరోసారి తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్తో ఆయా దేశాలు సంప్రదిస్తే సరిపోతుంది. మేము ఈ జలసంధిని మూసివేయలేదు. మా శత్రువుల నౌకలను మాత్రమే వెళ్లనివ్వడం లేదు. ఇతర దేశాల నౌకలు ఈ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. సంప్రదింపులు జరిపితే వారి నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తాం’ అని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. కాగా, నాటో మిత్రదేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఈ యుద్ధంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఓ పోస్టు చేశారు.నాటో సభ్యదేశాలను పేపర్ టైగర్స్ అని పిలిచారు, అలాగే చమురు ధరలు పెరుగుతుండడం ఆయా దేశాలకు నచ్చడం లేదని విమర్శించారు. అయినప్పటికీ, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఏర్పాటు చేద్దామనుకుంటున్న కూటమిలో చేరడానికి ఆ దేశాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ట్రంప్ దాదాపు ఏడు రోజుల క్రితం పలు దేశాల మద్దతు కోరారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఏడు దేశాల పేర్లను పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.బాగ్దాద్లో డ్రోన్ దాడి ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని మంసూర్ ప్రాంతంపై డ్రోన్ దాడి జరిగింది, ఆ డ్రోన్లలో ఒకటి ఇరాక్ గూఢచారి భవనాన్ని లక్ష్యంగా చేసుకుందని ఇరాక్ తెలిపింది. ఆ భవనంలో ఇరాక్ భద్రతా సంస్థ పని చేస్తోందని చెప్పింది. అది ఇరాక్లో అమెరికా సలహాదారులతో కలిసి పని చేస్తోందని వివరించింది. -
పాకిస్తాన్ 30 విమానాలకు తప్పిన ప్రమాదం..
లాహోర్: పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్జోన్లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్జోన్లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. -
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. అయితే ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. -
యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్..?
పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.తన సోషల్ మీడియా పోస్ట్లో " ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది."We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf— The White House (@WhiteHouse) March 20, 2026 -
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
ఇరాన్తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.వైట్హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.#WATCH | On the US-Israel vs Iran conflict, US President Donald Trump says, "We can have dialogue, but I don't want to do a ceasefire. You don't do a ceasefire when you're literally obliterating the other side... we're not looking to do that."(Source: US Network Pool Via… pic.twitter.com/4Y5AUK4jG0— ANI (@ANI) March 20, 2026యుద్ధం ఆగదు.. మరోవైపు.. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలుఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇరాన్ క్షిపణ శక్తిపై భీకర దాడులు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. -
ఇరాన్పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ సర్కార్ దావా
వాషింగ్టన్: అమెరికాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంపస్లో యూదు వ్యతిరేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అణచివేయడంలో హార్వర్డ్ యాజమాన్యం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వర్సిటీ యాజమాన్యాన్ని కోర్టుకు లాగడం చర్చనీయాంశంగా మారింది. హార్వర్డ్కు ఇచ్చే నిధులను నిలిపివేయడం, ఇప్పటిదాకా ఇచి్చన సొమ్మును తిరిగి వసూలు చేసుకోవడం ట్రంప్ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ శుక్రవారం మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో లాసూట్ దాఖలు చేసింది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రసక్తే లేదని దావాలో తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని పేర్కొ ంది. పన్నుచెల్లింపుదారుల సొమ్మును హార్వర్డ్కు కట్టబెట్టామని పేర్కొంది. యూనివర్సిటీ నిర్వహణ కోసం బిలియన్ల డాలర్ల ధనం ఇచి్చనట్లు గుర్తుచేసింది. ఉద్రిక్తతలకు కారణమైన హార్వర్డ్ నుంచి ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ దావాపై హార్వర్డ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. -
కుమార్తెతో కలిసి కిమ్ సైనిక స్థావరాల సందర్శన
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏతో కలిసి మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. ఒక ఆధునిక యుద్ధ ట్యాంక్ను నడిపారు. నల్లటి తోలు జాకెట్లు ధరించిన తండ్రీకూతుళ్లు, ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకుని శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడం, సైనికులు రైఫిల్ షూటింగ్ చేయడం వంటి ప్రత్యక్ష సైనిక వ్యాయామాలను దగ్గరుండి పర్యవేక్షించారు. 420 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను కూడా గురిపెట్టే లక్ష్యంతో ఈ డ్రిల్ జరిగినట్లు సమాచారం. ట్యాంక్ యూనిట్లు, పదాతి దళాలతో కూడిన కాల్పులు, ఇతర విన్యాసాలను కిమ్ పర్యవేక్షించారని, యుద్ధ సన్నాహాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. కిమ్ జు–ఏ 2022 నుంచే తన తండ్రితో కలిసి హై–ప్రొఫైల్ సైనిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గత వారమే తండ్రీకూతుళ్లిద్దరూ ఒక తేలికపాటి ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. పిస్టల్స్తో కాల్పులు జరిపారు. పలు రాకెట్ ప్రయోగ వ్యవస్థల ప్రత్యక్ష కాల్పుల పరీక్షను వీక్షించారు. అంతేకాదు కిమ్ జు–ఏ గత సెపె్టంబర్లో తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లింది. నూతన సంవత్సర వేడుకల్లోనూ పాల్గొంది. ఈ వరుస చర్యల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఆమెను త్వరలోనే తన వారసురాలిగా ప్రకటించనున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ కూడా అంచనా వేసింది. ఇది తదుపరి వారసురాలు ఆమె కావచ్చనే ఊహలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ సైనిక విన్యాసాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, అమెరికా, ఇతర దేశాలకు యుద్ధానికి సిద్ధమనే హెచ్చరికగా భావిస్తున్నారు.


