లాహోర్: పాకిస్తాన్లో ఇంధన కొరత భయంతో పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన కాల్పుల్లో ఒక్కరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల మేరకు.. శనివారం సియాల్కోట్లోని దాస్కా రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ పంప్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ కారులో పెట్రోల్ పోయించుకున్నారు. వెంట తెచ్చుకున్న మరో రెండు క్యాన్లలోనూ పెట్రోల్ నింపాలంటూ వాదులాటకు దిగారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది తెలపడంతో తీవ్ర హెచ్చరికలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
🇵🇰⛽📈🔫A man was shot dead as tensions rose over rising petrol prices in Haji Pura area, Sialkot, Punjab, #Pakistan during a clash. pic.twitter.com/7CT9OicpMm
— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) March 7, 2026
కొద్దిసేపటి తర్వాత తుపాకులతో బంక్ వద్దకు చేరుకుని సిబ్బందిపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయల మేర భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే పలు ప్రాంతాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
🚨 BREAKING: Pakistan is facing a major fuel crisis after the government raised petrol and diesel prices by PKR 55 per litre, citing rising global oil prices amid escalating Middle East tensions. #Pakistan #FuelCrisis #OilPrices #BreakingNews pic.twitter.com/41wp2xmkWm
— News (@NewsSportzz) March 6, 2026


