breaking news
Narayanpet
-
హైవే నిర్మాణంతో జిల్లాకు మహర్దశ : మంత్రి
మక్తల్: మహబూబ్నగర్–గుడెబల్లూరు రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.3,174 కోట్లు మంజూరు చేసిందని.. ఇందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలందరం సీఎం రేవంత్రెడ్డిని కలిసి రహదారి విస్తరణకు వినతిపత్రాలు అందించామని.. డిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిసి మాట్లాడినట్లు చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటన ఫలితమే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని.. ఏప్రిల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. రహదారి నిర్మాణం హ్యామ్ పద్ధతిలో చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీకేఆర్ ట్రస్ట్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, రవికుమార్యాదవ్, కట్టా సురేష్, కోళ్ల వెంకటేష్, శ్రీనివాసులు, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు మక్తల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఎస్పీ డా. వినీత్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పూజరి తిప్పయ్యస్వామి వారిని శాలువాతో సన్మానించారు. ఎస్పీ వెంట సీఐ రాంలాల్, మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు నారాయణపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని.. వచ్చే వారం నుంచి యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. -
వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం
మండలంలోని పస్పులలో కృష్టానది ఒడ్డున వెలిసిన శ్రీవల్లభాపురం దత్తాత్రేయస్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో అలంకరించిన రథంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ ముందుకు లాగారు. ఈ సందర్భంగా రథోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తప్ప, కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మక్తల్ -
ఎక్కడ.. ఎలా.. ఎవరు?
● పలు పురపాలికల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఖరారు ● కొన్నింటిలోకొనసాగుతున్న సస్పెన్స్ ● నాగర్కర్నూల్ పురపాలిక హస్తగతమైంది. చైర్మన్ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా.. తీగల సునేంద్ర పేరు ప్రచారంలో ఉంది. వైస్ చైర్మన్గా బాదం రమేష్ పేరు వినిపిస్తోంది. ● అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా సీఎం సురేష్ను ముందుగానే ప్రకటించారు. వైస్ చైర్మ న్ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించలేదు. ● మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించి చైర్మన్ జనరల్కు రిజర్వ్ కాగా.. సరిత మక్తల్, శైవీరెడ్డి, కోళ్ల సంధ్య, అల్ కురుపావళని పదవి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ కోసం మహేష్, జుట్ల అనిత ప్రయత్నిస్తున్నారు. ● కల్వకుర్తి పురపాలికలో కాంగ్రెస్ పాగా వేసింది. చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కా గా.. రత్నమాల పేరును ఖరారు చేశారు. వైస్ చైర్మన్గా షానవాజ్ ఖరారైనట్లు సమాచారం. ● మద్దూరు మున్సిపాలిటీ హస్తగతం కాగా.. చైర్మన్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ఇప్పటివరకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. మున్సిపాలిటీలో విలీనమైన రేణివట్ల నుంచి పదో వార్డులో గెలుపొందిన గడ్డమీది గోవిందు ఈ పదవిని ఆశిస్తున్నారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జీడి మౌనిక, 16వ వార్డు నుంచి విజయం సాధించిన డిల్లికర్ సరస్వతిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్యకుమారి, మాజీ సర్పంచ్ శ్రీదేవి గౌతమ్గౌడ్, వంగ అనూ ష రాజశేఖర్గౌడ్, గుండ్రాతి స్వప్న శిల్ప, పసుల సుజా త చైర్పర్సన్ పదవికి పోటీలో ఉన్నారు. వైస్ చైర్మన్ కోసం ముస్లిం, ఎస్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల్లో సోమవారం కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను అధిరోహించేది ఎవరనే దానిపై కొన్ని చోట్ల స్పష్టత వచ్చింది. మరికొన్నింటిలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులు అధికంగా ఉండడం.. పోటాపోటీ నెలకొనడంతో ఆయా పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రిజర్వేషన్ ప్రకారం ఆయా పదవులకు ఎంపికై న వారి పేర్లను ప్రకటించకుండా గోప్యతను పాటిస్తుండగా.. ప్రమాణ స్వీకారం సమయానికి క్తొ ముందస్తుగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకద్ర మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. మున్నూరు కాపు వర్గానికి చెందిన కొండా దమయంతిని ఎన్నికల సమయంలోనే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే సమయంలో వైస్ చైర్మన్ విషయంపై చర్చించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 12వ వార్డులో గెలిచిన యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వీరిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మరో అభ్యర్థి సైతం వైస్ చైర్మన్ ఇస్తే పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. భూత్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వచ్చిన బాల్కోటిని ఎన్నికల ప్రచార సమయంలోనే ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గెలుపొందడంతో చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వనపర్తి చైర్మన్ పీఠం జనరల్ మహిళ రిజర్వ్ కాగా.. ఈ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. చీర్ల రజినీ చందర్, ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్తో పాటు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధనలక్ష్మి ఆశిస్తున్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పీఠం జనరల్కు రిజర్వ్ కాగా.. సుమిత్రా ఎల్లారెడ్డి, అక్కి శ్రీనివాస్ గౌడ్ పదవిని ఆశిస్తున్నారు. చైర్పర్సన్ ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై క్లారిటీ వస్తేనే వైస్ చైర్మన్ ఎవరనేది తెలుస్తుంది. ఆత్మకూర్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. పదో వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందిన జుబేదాబేగం, ఏడో వార్డు నుంచి విజయం సాధించిన నాగమణి ఈ పదవిని ఆశిస్తున్నారు. ఎవరనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కొత్తకోట మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు రిజ ర్వ్ కాగా.. పోతులపల్లి అరుణ శ్రీనివాస్ పేరు ను కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించారు. వైస్ చైర్మన్గా పి.పల్లవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కాగా.. ఎన్నికల ముందే నాగులపల్లి నరేందర్కు డిక్లేర్ చేశారు. వైస్ చైర్మన్గా మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు కేటాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోవర్దన్ రెడ్డి సతీమణి చింతల సరితకు అవకాశం దక్కనుంది. గత ఎన్నికల్లో చైర్మన్గా బెజ్జు సంగీత ప్రమాణ స్వీకార సమయంలో ఎక్స్ అఫీషియో ఓట్లతో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో బీఆర్ఎస్కు పీఠం దక్కగా.. ఆమె చైర్మన్ కాలేకపోయారు. ఈసారి సైతం కౌన్సిలర్గా గెలుపొందిన ఆమె వైస్ చైర్మన్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అలంపూర్ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ పీఠం బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉండగా.. ఆ పార్టీ నుంచి ఆరో వార్డులో గెలుపొందిన జయరాముడికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. వైస్ చైర్మన్ పీఠాన్ని ఆసిఫుద్దీన్ ఖాన్, మాధురితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికై న విక్రం ఆశిస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత, పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ భార్య కల్పన, పార్టీ సీనియర్ నాయకురాలు మంజుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు నడుస్తుండగా.. బీజేపీ శిబిరానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వచ్చి.. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎంపీ డీకే అరుణకు వదిలేసినట్లు తెలిసింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠం బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ ఏఐఎఫ్బీ నుంచి వడ్డేపల్లి శ్రీనివాసులు తరఫున బరిలో నిలిచి ఎనిమిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. వడ్డేపల్లి శ్రీనివాసులు కుమారుడు అజయ్కుమార్ తొమ్మిదోవార్డు నుంచి పోటీ చేయగా.. ఆయనే చైర్మన్ అభ్యర్థి అని భావించారు. కానీ అతడు ఓటమి పాలు కావడంతో ఈ పదవిపై సందిగ్ధత నెలకొంది. ఇదే ప్యానల్లో ఐదో వార్డులో గెలిచిన యుగంధర్ శ్రీనివాసులుకు స్వయానా తమ్ముడి కొడుకు కాగా.. ఆయన ఆశలు పెట్టుకున్నారు. నాలుగో వార్డు నుంచి గెలుపొందిన మంజుల సైతం పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి ఇచ్చినా ప్యానల్లో చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ముహూర్తం నేడే..
పురాల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్కు 14 ఖాయం.. భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్తో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ మ్యాజిక్ ఫిగర్ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది. అయిజలో బీఆర్ఎస్.. అలంపూర్లోనూ.. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో ఈ పురపాలిక పీఠాన్ని ఆ పార్టీ కై వసం చేసుకోనుంది. మరోవైపు అలంపూర్లో 10 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెరి సమానం వచ్చాయి. ఎక్స్అఫీషియోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ సైతం కారు విజయం ఖాయమైంది. వనపర్తి జిల్లా అమరచింతలో బీజేపీ, బీఆర్ఎస్ కూటమినే పీఠం వరించనున్నట్లు తెలుస్తోంది. 10 వార్డులు ఉండగా.. మూడు చొప్పున కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపొందాయి. ఒక సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్కు సీపీఎం మద్దతిస్తుండడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ఆరు కాగా.. మంతనాలు సాగుతున్నాయి. చైర్మన్ పదవిని పంచుకునేందుకు ఇరు పార్టీలు అంగీకారం తెలిపినా.. తొలి పర్యాయంపై ఎవరికి వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. గద్వాలలోనూ ‘చేతి’కే అవకాశం .. అయినా.. అమరచింతలో కారు, కమలం కూటమికే.. నారాయణపేటలో బీజేపీకే మొగ్గు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం మహబూబ్నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే.. గద్వాలలో సైతం హస్తానికే అవకాశం నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు అయిజతో పాటు అలంపూర్లో బీఆర్ఎస్కు లైన్క్లియర్ అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కూటమికే.. -
అత్తాకోడళ్లకు అగ్నిపరీక్ష..!
పేటలో కమలం వికసిస్తుందా.. హస్తగతం అవుతుందా? ● అంతర్మథంలో ఆశావహులు ● 12కు చేరిన బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య ● కాంగ్రెస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ మైత్రితో 10కి చేరిన కౌన్సిలర్లు ● బీఆర్ఎస్ సైలెంట్తో పరేషాన్లో అధికార పార్టీ ● ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీకి సులువు నారాయణపేట: స్థానిక పురపాలికలో పాగా వేయడం ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. పేట మినహా మిగిలిన వాటిలో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైనట్లే. కాగా ఇక్కడ బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. బీజేపీ రెబల్గా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి జయశ్రీ శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 12కు చేరింది. ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటును ఇక్కడే వేసేందుకు దరఖాస్తు చేసుకోవడంతో పీఠం దక్కించుకోవడం నల్లేరు మీద నడకై ందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ట్రై.. టై.. డ్రా..? సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితిలో హస్తగతం చేసుకోవాల్సిందేనంటూ ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి అధిష్టానం నుంచి సాంకేతాలు రావడంతో అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ ఒకరితో కలిపి వారి సంఖ్య పదికి చేరింది. బీజేపీలో చేరిన స్వతంత్ర అభ్యర్థిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని చేయని ప్రయత్నమంటూ లేదు. ఇక అది ఫలించకపోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరిని కలుపుకొంటే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార పార్టీ సైతం 13 స్థానాలకు చేరుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు కానుండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ను డ్రా పద్ధతిలో ఎన్నుకునే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేటకు చేరుకున్న ఎమ్మెల్యే.. అనారోగ్య సమస్యలతో మూడు నెలలుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సిన పరిస్థితి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ఆదివారం నారాయణపేటకు చేరుకొని సీవీఆర్ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారపార్టీలోకి ఎవరొచ్చినా ‘కోటీ’శ్వరుడే.. అధికారపార్టీలోకి ఎవరొచ్చినా కోటీశ్వరుడే అవుతారంటూ పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి అధికార పార్టీలోకి ఒక కౌన్సిలర్ వచ్చినా తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు దూతల ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చినట్లు వీడియో కాల్చేసి చూపిస్తే తప్ప తాము నమ్మే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలుస్తోంది. -
చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
ఎత్తులు.. పొత్తులు!
–8లో uనారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. కోస్గి, మద్దూర్, మక్తల్లో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైంది. నారాయణపేట మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుందోననే చర్చ కొనసాగుతోంది. పేట కమలంలో మూడు ముక్కలాట.. నారాయణపేటలో 24 వార్డులుండగా.. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ వార్డులో బీజేపీ రెబల్ అభ్యర్థి జయశ్రీ విజయం సాధించడంతో ఆమె బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 12కు చేరింది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి 4వ వార్డు కౌన్సిలర్ కొండ శ్వేత ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తాను చైర్మన్ అభ్యర్థిగా రంగంలో దిగానని, ఆ సమయంలో అవకాశం దక్కలేదని.. ఈ సారి కచ్చితంగా ఇవ్వాలంటూ పార్టీ రాష్ట్ర నేతలతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్ తన సతీమణి 17వ వార్డు కౌన్సిలర్ కల్పనకు చైర్పర్సన్ అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. బీజేపీకి అండగా నిలుస్తూ వస్తున్న జీఆర్రెడ్డి తన సతీమణి 6వ వార్డు కౌన్సిలర్ మంజులను చైర్పర్సన్ చేయాలంటూ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ముందు వారి బలాబలాలు సైతం నిరూపించుకునేందుకు వెనుకాడటం లేదని సమాచారం. చైర్మన్ పదవి కోసం కమలంలో మూడు ముక్కలాట మొదలైందని.. ఎవరిని చైర్పర్సన్ చేస్తారోనని చర్చ కొనసాగుతుంది. ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడే వేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని చైర్పర్సన్ చేయాలని అనుకుంటున్నారోనన్న చర్చ కొనసాగుతోంది. ‘హస్త’గతానికి ప్రయత్నాలు.. పేట మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ బడా నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్కు 7, ఎంఐఎం 2, ఎఐఎఫ్బీ ఒకటితో కలిసి మొత్తం పది స్థానాలకు చేరుకుంది. బీఆర్ఎస్ మద్దతుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ మద్దతిస్తే బలం 12కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్నీకారెడ్డి సైతం ఇక్కడే తన ఎక్స్ అఫీసియో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మనోహర్గౌడ్ సతీమణి 14వ వార్డు కౌన్సిలర్ అరుణ, 20వ వార్డు కౌన్సిలర్ శ్వేత, 15వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ బండి రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సింహం బలమెవరికో..? పేటలో రాజకీయ పరిణామాలు రెండ్రోజులుగా మలుపులు తిరుగుతున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైలెంట్గా ఉండటంతో తాము పీఠాన్ని అధిరోహించడమే తరువాయి అన్న ధీమాలో బీజేపీ ఉంది. 11వ వార్డులో ఏఐఎఫ్బీ పార్టీ తరఫున విజయం సాధించిన భాగ్యవతి ఓసారి కాంగ్రెస్కే మద్దతునిస్తుందని.. మరోసారి రూట్ మారుస్తుందనే చర్చ సాగుతుంది. దీంతో సింహం బలమెవరికో వేచి చూడాల్సిందే మరి. మిగతా మూడు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతం కావడం ఖాయమని తెలవడంతో చైర్మన్ అయ్యేందుకు అశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఇలాకాలోని కోస్గి మున్సిపాలిటీలో నాగులపల్లి నరేందర్ పేరు వినిపిస్తోంది. మద్దూర్లో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. మక్తల్ మున్సిపాలిటీలో మంత్రి మదిలో ఎవరున్నారో తెలియక ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పేట కమలంలోమూడు ముక్కలాట స్వతంత్రుడి చేరికతో 12 స్థానాలకు చేరిన బీజేపీ ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తుచేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యే హస్తగతానికి కాంగ్రెస్ ఎత్తుగడలు బీఆర్ఎస్ సైలెంట్.. ‘సింహం’ బలమెవరికో? మూడు మున్సిపాలిటీల్లో ఆశావహుల్లో ఉత్కంఠ -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూ రులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజ కీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితు లు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్ లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరి ణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. అటు ఇటుగా ఒకరికొకరు.. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కారణాలతోనే.. ● నారాయణపేటలో 24 వార్డు స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్, ఎంఐఎం రెండు స్థానాల చొప్పున, ఏఐఎఫ్బీ, ఇండింపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. బీజేపీకి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలుకుతుండగా.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి బలం మ్యాజిక్ ఫిగర్ 13కు చేరుతుంది. కాంగ్రెస్కు ఎంఐఎం అభ్యర్థులు ఇద్దరు, ఒక ఏఐఎఫ్బీ అభ్యర్థి మద్దతు తెలుపుతుండగా.. వారి బలం పదికి చేరింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎక్స్ అఫీషియోగా ఓటు వేస్తే 11కు చేరనుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా బీజేపీ కట్టడి చేసే వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● గద్వాలలో మొత్తం 37 వార్డు స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. ఇద్దరు స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎంఐఎం అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ బలం 19కి చేరింది. అదే బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే వారి బలం 18కి చేరుతోంది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్రులనుతమ వైపునకు తిప్పుకునేలా ఆ పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ● పెబ్బేరు పుర పీఠం జనరల్కు కేటాయించడం.. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్గౌడ్, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే మేఘారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఐదు వార్డుల ను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ● అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. రసవత్తరంగా క్యాంప్ రాజకీయాలు నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
మాయమాటలునమ్మి మోసపోవద్దు: ఎస్పీ
నారాయణపేట: గొలుసుకట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం చేసే వారు పెరుగుతున్నారని, ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు అంటూ ఆశ చూపుతారని, మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో మల్టీలేవెల్ మార్కెటింగ్పై దృష్టి సారించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రకటనలిస్తూ అమాయకులను ఆకర్షించి మోసగిస్తున్నారని పేర్కొన్నారు. చాలామంది విదేశాల్లో ఉండి రాకెట్లా నడుపుతారని.. భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట అమాయకులకు వల పన్నుతారని, మాయమాటలు నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని.. మోసపూరిత ప్రకటనలు, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. పాలమూరు 53వ డివిజన్పై హై‘డ్రామా’ ● ఒక్క ఓటుతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 60డివిజన్లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. అయితే 53వ డివిజన్ ఫలితాలపై అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. మొదటి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్కు 816, బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కింపు నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండు ఓట్లు పెరిగి 818కి, బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరగడంతో 819కి చేరింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యం సాధించాడు. మూడోసారి జరిగిన రీకౌంటింగ్లో కాంగ్రెస్కు 818, బీజేపీ 819 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ను గెలుపొందినట్లు కమిషనర్ రామానుంజులరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాతనే రమేష్ గెలుపొందినట్లు ప్రకటించారు. పాక్షిక శనిత్రయోదశి పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
18న పీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
మహబూబ్నగర్ న్యూటౌన్: అమ్నీల్ ఫార్మా జడ్చర్ల, ఆర్–టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 18న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్లు పీయూ ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎన్ అర్జు న్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఫార్మ సీ, ఎంకామ్, ఎంబీఏ విద్యార్థుల కోసం ఫా ర్మసీ కళాశాల ఆడియోరియంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ విభాగాల్లో, ఆర్–టెక్ సొల్యూషన్స్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజార్టీ లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. గద్వాల, పేట, అమరచింత, పెబ్బేరు, అలంపూర్లో కీలకం ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు నారాయణపేటలో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
కౌంటింగ్ ప్రక్రియనుపరిశీలించిన ఎస్పీ..
కొత్తపల్లి/కోస్గి రూరల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ అన్నారు. శుక్రవారం ఆమె మద్దూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేల ఏర్పాటు, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమన్నారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, గెలిచిన అభ్యర్థులు సంయమనం పాటించాలని సూచించారు.● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
బీజేపీ విజయం ఖాయం
నారాయణపేట రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ ధీమా వ్యక్తంచేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షు డు సత్యయాదవ్తో కలిసి ఆయన మాట్లాడా రు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలిచారని.. ప్రజల ఆశీస్సులతో అనూహ్య ఫలితాలు సాధించబోతున్నామని అన్నారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, అమరచింత మున్సిపాలిటీలను కై వసం చేసుకోనున్నామని.. మిగతా మున్సిపాలిటీల్లో గణనీయమైన సంఖ్యలో వార్డు కౌన్సిలర్లను గెలుచుకుంటామ ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు విసిగి న ప్రజలు బీజేపీ వైపు నిలిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మీడియా ఇన్చార్జి కిరణ్ ఉన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి నారాయణపేట రూరల్: ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫ్యాకల్టీ ఈడీ మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడో తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించడం.. రాయించడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న జరిగే ఎఫ్ఎల్ఎం పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లిష్లో ధారాళంగా చదవడం.. గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి భాషలో తప్పనిసరిగా చదవడం, రాయడం రావాలని సూచించారు. అనంతరం ధన్వాడ మండలం కన్సన్పల్లి, మరికల్ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్ఓ భానుప్రకాశ్, హెచ్ఎంలు అనురాధ, రజిత, బాలకృష్ణ ఉన్నారు. నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్ అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తా మని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నా రు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్ల తో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. -
77.96%
2020లో‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్ 78.48%2026లోసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూర్ మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగులాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది. 10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల అత్యధికంగా మక్తల్లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్ అమరచింతలో 2.89 శాతం మేర పైకి.. -
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
కోస్గిరూరల్/కొత్తపల్లి(మద్దూర్): మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కిపును అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, మద్దూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. కోస్గి, మద్దూరులో 16 వార్డుల చొప్పున ఉండగా.. రెండు రౌండ్లుగా విభజించినట్లు తెలిపారు. మొదటి రౌండ్లో 1–8 వార్డులు, రెండో రౌండ్లో 9–16 వార్డుల ఓట్ల లెక్కింపునకు 8 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం 1గంట వరకు పూర్తి ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. ● ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానంపై మద్దూరులో ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. ఓట్లను లెక్కించే సమయంలో పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు స్పష్టంగా చూయించి.. చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లు బాటు కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఏదేని ఓటును చెల్లని ఓటుగా నిర్ధారిస్తే.. మళ్లీ ఆ ఓటును పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు ఏమైనా కారణాలతో లిఖిత పూర్వకమైన నోటీసు ఇస్తేనే రీ కౌటింగ్పై నిర్ణయం తీసుకోవాలని.. దీనిపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు విధులకు వచ్చిన ఉద్యోగులకు రాత్రి బస ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ప్రత్యేకాధికారి, డీఆర్డీఓ మొగులప్ప, ఎన్నికల అధికారులు నాగరాజు, శ్రీకాంత్, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ మేనేజర్ అనిల్కుమార్ ఉన్నారు. -
మూడంచెల భద్రత ఏర్పాటు : ఎస్పీ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్రూం ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేని వ్యక్తులు స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఇతరులు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లుతీసుకెళ్లడం నిషేధమన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మేరకు సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదన్నారు. మోడల్ కండక్ట్ కోడ్ ముగిసిన తర్వాత పోలీసుల అనుమతితో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటుచేసిన టేబుళ్లు, అభ్యర్థుల ఏజెంట్లకు కేటాయించిన స్థానాలు, మీడియా పాయింట్, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. లెక్కింపు ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, పురుషోత్తం ఉన్నారు. -
కౌంటింగ్కు సర్వం సిద్ధం
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 71 వార్డులకు ఎన్నికలు ● మక్తల్, కోస్గి, మద్దూరులో 2 రౌండ్లు, పేటలో 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను 71 వార్డుల్లో 90,301 మంది ఓటర్లు ఉండగా.. 66,859 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకో వడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం పాఠకులకు విదితమే. ఆ వార్డు మినహా మిగతా వార్టుల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మద్దూర్, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లో రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. నారాయణపేటలో 24వార్డులు ఉండడంటంతో మూడు రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఆర్ఓ, హాల్ సూపర్వైజర్లను నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల్లోని పీఎస్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగు టేబుళ్ల చొప్పున.. నారాయణపేట మున్సిపాలిటీలో రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో నాలుగు టేబుళ్ల చొప్పున ఏర్పాటుచేసి.. ఒక్కొక్క రౌండ్లో రెండు కౌంటింగ్ హాళ్లలో 8 వార్డుల లెక్కింపు పూర్తిచేయనున్నారు. మొదటి రౌండ్లో 1, 4, 7, 10, 13, 16, 19, 22 వార్డులు, రెండో రౌండ్లో 2, 5, 8, 11, 14, 17, 20, 23, మూడో రౌండ్లో 3, 6, 9, 12, 15, 18, 21, 24 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మాస్లైన్ జిల్లా నాయకుడు కాశీనాథ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ముందుగా స్థానిక మున్సిపల్ పార్కు వద్ద సభ ఏర్పాటు చేశారు. అనంతరం సావర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చి, కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను దివాలా తీయించేందుకు, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక పాలసీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్, నర్సింహ, శశికళ, శివకుమారి, బాలమణి, అనురాధ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహి స్తున్న కార్మిక సంఘాల నాయకులు -
మహ దేవప్ప కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
● రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య పాల్గొన్నారు. -
పోలింగ్ డే
ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను సరిచూసుకుంటున్న అధికారులు నేడే పురపాలిక ఎన్నికల పోలింగ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికలకు ముందు రోజు వరకు అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. ఒకరి కన్నా మరొకరు పోటీపడుతూ అంచనాకు మించి ఖర్చు చేశారు. వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించారు. ఓటుకు రూ. 2 వేల నుంచి 4 వేల వరకు వెచ్చిస్తూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు పూర్తిచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీతో అభ్యర్థులు యథేచ్చగా ప్రలోభాలకు పాల్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితోమక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన -
మున్సి‘పోల్స్’కు రెడీ
● జిల్లాలో 71 వార్డులకు ఎన్నికలు ● 149 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు గాను 71 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి.. 181 మంది పీఓలు, 181 మంది ఏపీఓలు, 538 మంది ఓపీఓలను నియమించారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. అధికారులు, సిబ్బంది మంగళవారమే ఎన్నికల సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణపేటలో 35,460, కోస్గిలో 20,248, మక్తల్లో 23,345, మద్దూర్లో 12,701 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని గు రుకుల బాలికల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచే సిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎ లాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలన్నారు. చెక్లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా.. లేదా అనేది జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడి న బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్రూం, కౌంటింగ్ హాళ్లను సైతం కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఉన్నారు. నేడు సాధారణ సెలవు నారాయణపేట: సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు పోలింగ్ రోజున ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకొని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. -
పాలమూరులో అధికార పాలి‘ట్రిక్స్’
● మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో రాజకీయ దుమారం ● తెరపైకి కోస్గిలో కౌన్సిలర్ ఆశావహులపై బెదిరింపుల పర్వం ● మహబూబ్నగర్లో పోలీసుల డేగకన్నుతో ప్రతిపక్ష అభ్యర్థుల కట్టడి ● కొల్లాపూర్, అలంపూర్లో సైతం ఇవే పరిస్థితులు ● ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదు ప్రధానంగా అమాత్యులఇలాకాల్లోనే.. -
మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం
నాగర్కర్నూల్ జిల్లా: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?
సాక్షి నారాయణ పేట: మక్తల్లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదిన సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.రేపు బుధవారం ఎలక్షన్ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. -
క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్
నర్వ: గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణాన్ని వెలికితీసేందుకే సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి అన్నారు. సోమవారం పాథర్చేడ్ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మక్తల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించి.. క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో ఆత్మకూర్ ప్రథమ, ఊట్కూర్ ద్వితీయ, ఖోఖోలో కృష్ణా ప్రథమ, మక్తల్ అర్బన్ ద్వితీయ, కబడ్డీలో మక్తల్ అర్బన్ మొదటి, అమరచింత ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో ఊట్కూర్ ప్రథమ, మక్తల్ అర్బన్ ద్వితీయ, ఖోఖోలో మక్తల్ అర్బన్ ప్రథమ, ఊట్కూర్ ద్వితీయ, కబడ్డీలో నర్వ ప్రథమ, మక్తల్ రూరల్ ద్వితీయ స్థానాలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి, కాలేరు సురేష్, సర్పంచ్ లింగమ్మ, హెచ్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మారుస్తాం
మక్తల్: మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంరతం అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి.. పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని ఓటర్లను కోరారు. ఇప్పటికే మక్తల్లో రూ. 25కోట్లతో మినీ స్టేడియం, రూ. 15కోట్లతో సీసీరోడ్లు, రూ. 210 కోట్లతో మక్తల్–పేట రోడ్డు విస్తరణ, రూ. 43కోట్లతో 150 పడకల ఆస్పత్రి, రూ. 2కోట్లతో తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు డిగ్రీ కళాశాల, కోర్టు, రిజిస్ట్రార్ కార్యాలయం, 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా దుస్థితికి చేరిన పడమటి ఆంజనేయస్వామి ఆలయ కోనేరును ఆధునికీకరించినట్లు చెప్పారు. పట్టణంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు 340 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మక్తల్ – పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో 35వేల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, కట్ట సురేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్పై నిశిత పరిశీలన జరపాలి
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు పక్కాగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ.. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో బాధ్యతలు కేటాయించనున్నట్లు చెప్పారు. పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై మైక్రో అబ్జర్వర్లకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు 9 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా? లేదా అనేది పరిశీలించాలని.. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందా? లేదా అనేది నిశిత పరిశీలన చేయాలని.. గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలన్నారు. టెండర్, చాలెంజ్ ఓటింగ్ జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ తీరు తెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని.. ఎక్కడ పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని.. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా.. ఇతరులు ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, మున్సిపల్ ప్రత్యేకాధికారులు రాజేందర్గౌడ్, సుధాకర్రెడ్డి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతో రాత్రికి రాత్రే శంకుస్థాపనలు
మక్తల్: నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే తనకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే శంకుస్థాపనలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. 30 ఏళ్ల కాలంలో మక్తల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి వాకిటి శ్రీహరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి హయాంలోనే భీమా ప్రాజెక్టు సాధించి.. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మక్తల్కు భారీగా నిధులు మంజూరుచేసి.. అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రమే 60శాతం నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి మాట్లాడటం సరైంది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో కొండయ్య, ఇన్చార్జి అమరనాథ్, రాజశేఖర్రెడ్డి, నర్సింహ, బాలరాంరెడ్డి, భాస్కర్, కర్నిస్వామి పాల్గొన్నారు. -
పకడ్బందీగా పోలింగ్
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రి య పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందు కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లు, ఎన్నికల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం మున్సిపల్ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్/రిసెప్షన్ సెంటర్లలో పోలింగ్ సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ పూర్తయిందన్నారు. 99 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామన్నారు. పోలింగ్ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని.. మధ్యా హ్న భోజనం ముగించుకుని ఎవరికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారు వెళ్లిపోవాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని వసతి సౌకర్యాలు కల్పి ంచాలని కమిషనర్లను ఆదేశించారు. పోలింగ్ ఆఫీసర్స్ గుర్తింపు కార్డులు, పోలింగ్ ఏజెంట్ల పాసులు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలన్నారు. ఈ నెల 11న ఎన్నికల నియమ నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్లకు తరలించి.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూముల్లో భద్రపరచాలన్నారు. 13న కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులంతా బాధ్యతగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. 16న చైర్మన్ ఎన్నిక.. ఎన్నికై న కౌన్సిలర్లు, ఎక్స్ఆఫీషియో సభ్యులకు నోటీసులు జారీచేసి 16న చైర్మన్ ఎన్నిక నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా కోరం లేకపోతే.. ఒక గంట సమయం ఇవ్వాలన్నారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజు చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లు చేతులు ఎత్తే ప్రక్రియను పూర్తిగా వీడియో, ఫొటో చిత్రీకరణ చేయించాలన్నారు. చైర్పర్సన్ ఎన్నికై న తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ప్రత్యేకాధికారులు రాజేందర్గౌడ్, రామచందర్ నాయక్, మొగులప్ప, జాన్ సుధాకర్, సుధాకర్రెడ్డి ఉన్నారు. -
నేడు, రేపు సెలవు
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా స్థానిక సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు నారాయణపేట: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.వినీత్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జలాల్పూర్ ఎరగ్రుట్ట చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానాన్ని స్వయంగా పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర అనుమానాస్పద వస్తువుల తరలింపును కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్పోస్ట్ వద్ద సిబ్బంది సంఖ్య పెంచి తనిఖీలను మరింత కఠినంగా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతున్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడమే పోలీస్శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు నరేశ్ ఉన్నారు. సమస్యలపరిష్కారానికి కృషి నారాయణపేట రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ నిర్విరామంగా కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి.. యూనియన్ బలోపేతానికి కృషిచేసిన విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు కృషి చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పీఆర్పీ, డీఏ బకాయిలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, వెంకటరెడ్డి, రఘువీర్, జనార్దన్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్, సూర్యప్రకాశ్, గోపాల్రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, రమేశ్శెట్టి పాల్గొన్నారు. -
వలస ఓటర్లే కీలకం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు, కౌన్సిల్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపునకు వలస ఓటర్లే కీలకం కానున్నారు. ఏ వార్డు ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లా లోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా 18 మున్సిపాలిటీల్లోనూ వలస ఓటర్లు అ ధికంగా ఉన్నారు. అయితే జడ్చర్ల, అచ్చంపేట మినహా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూ త్పూర్, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్, అమరచింత, ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండటంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్ల కోసం పరుగులు పెడు తున్నారు. పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవ ధి మాత్రమే ఉండటంతో హైదరాబాద్, బెంగళూర్తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన వారితో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం వెళ్లిన వారి జాబితా పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో వెయ్యి నుంచి 3, 4 వేల మంది వరకు వలస ఓటర్లు ఉండటంతో అభ్యర్థుల విజయ అవకాశాలపై వీరు ప్రభావం చూపనున్నారు. దీంతో అభ్యర్థుల తరుఫున కొందరు వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి ఓటు వేసేందుకు రావాల్సిందిగా బతిమిలాడుతున్నారు. వీరిని రప్పించేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే వాహనాలను సమకూర్చుతున్నారు. ఒకరిద్దరు ఉంటే బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. కుల సంఘాలకు గాలం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం కుల సంఘాలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదని తెలిసినా గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆలయాలు కట్టిస్తామని, ఇళ్లు, పింఛన్లు ఇప్పిస్తామని, శుభ కార్యాలకు సహకారం అందిస్తామంటూ కుల సంఘాల ఓటర్లకు గాలం వేస్తున్నారు. మీ వార్డులకు సీసీ రోడ్లు, మురుగు కాల్వలు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు రాబట్టేందుకు కొన్ని సాధ్యం కాని పనులు కూడా చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇతరులు తమ మద్దతుదారులను బరిలో నిలిపారు. వారి గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు కుల సంఘాలను కలుస్తూ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటున్నారు. అలాగే వార్డులు, కులాల వారీగా అవసరమైన డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావితం చేసేది వీరే జీవనోపాధి కోసం వెళ్లినవారి ఓట్ల కోసంనేతల ప్రయత్నాలు వాహనాలు, బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కార్మికులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగానే వలస జీవులు -
మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలవండి
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సభలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, అన్వర్సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లు ఎదురుచూడాలి..
1951లో ఏర్పడిన చేనేత సహకార సంఘంలో మొదట 4,265 మంది సభ్యులుంటే ప్రస్తుతం కేవలం 72 మందికి మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు అందరికి కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఇందుకోసం 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. – వెంకటేష్, చేనేత కార్మికుడు నారాయణపేట ఎడ్యుకేషన్: ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించి చేనేత కార్మిక సంఘంలో సభ్యత్వం కల్పిస్తామని ప్రతిసారి ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇస్తున్నారే తప్ప నేటికి నెరవేర్చే నాయకుడు కరువయ్యారని స్థానిక గాంధీనగర్ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 4,265 మంది సభ్యులున్న సొసైటీలో ప్రస్తుతం కేవలం 72 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుత నాయకులైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహించిన చర్చావేదికలో పలువురు కార్మికులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇదీ సమస్య.. జిల్లాకేంద్రంలో చేనేత సహకార సంఘం 1951లో ఏర్పడింది. అప్పట్లో 4,265 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మిక సొసైటీ తరుఫున గాంధీనగర్కాలని నిర్మించారు. 104 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు చేనేత సామగ్రి పంపిణీ చేశారు. ఇందుకుగాను కార్మికుల నుంచి ప్రతినెల రూ.5 చొప్పున రూ.2,475 వసూలు చేశారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధరను 35 ఏళ్ల కిందటే లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లింపు పూర్తి చేశారు. అయినా నేటికీ సొసైటీ నిర్వాహుకులు ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. -
సమస్యలు పట్టవా..
రాజకీయ నాయకులకు మా సమస్యలు పట్టవా. సొసైటీకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా బకాయిలు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ చేయకపోవడం దారుణం. ఇకనైనా పట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. – శ్రీనివాస్, చేనేత కార్మికుడు.. పోరుబాట తప్పదు.. ఈసారి మా సమస్యలు పరిష్కరించకపోతే గాంధీనగర్లో ఉన్న చేనేత కార్మికులందరం పోరుబాట పట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – బాలరాజు, చేనేత కార్మికుడు -
పుర ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయ మన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు.. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజల్లో మత విధ్వేషాలు రెచ్చగొట్టడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి రైతులు, రైతు కూలీలకు ఉపాధిని దూరం చేస్తోందని ఆరోపించారు. మతోన్మాద పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కాంగ్రెస్పార్టీతో కలిసి పుర బరిలో నిలిచామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కరించుకునే వీలుందని వివరించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, విష్ణు, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, రమేష్, అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పెరుగుతున్న కిడ్నీ సమస్య బాధితులు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల ప్రజలు కిడ్నీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని.. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి వైద్య బృందంతో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా మండలాల్లో నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ మండలం మంతన్గోడ్, ఎర్నాగునపల్లి, కాట్రేవ్పల్లి, నర్వ మండలం రాయికోడ్, జక్కన్నపల్లి, పాతర్చేడ్లో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండువేల జనాభా లేని కాట్రేవ్పల్లిలో కిడ్నీ సమస్యతో పదేళ్లలో పదిమందికి పైగా మృతిచెందారని, డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఐదుగురు, డయాలసిస్కి చేరువలో 15 మంది ఉన్నారని సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ.రెండు వేలు ఇచ్చి, మక్తల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకొనే ధోరణిలో ఉందని, వెంటనే ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఆయా మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలని సూచించారు. ఆయా మండల కేంద్రాల్లో వారానికి రెండుసార్లు నెఫ్రాలజిస్ట్ను అందుబాటులో ఉంచాలని, డయాలసిస్ సెంటర్ సామర్థ్యం పెంచి రోగులకు నెలకు రూ.12 వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు దిలీప్, తాళ్ల రోహిత్, సభ్యులు శ్రీధర్, వెంకటనారాయణ , బొల్లి ఆదాంరాజు ఉన్నారు. -
‘పది’ ఫలితాల్లో జిల్లా ర్యాంకు పెంచాలి
● ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ముఖ్యమైన కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాల మెరుగు, మౌలిక వసతుల కల్పన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ పరీక్షల వివరాలు, విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల స్థాయి, బలహీనంగా ఉన్న అంశాలు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మెరిసేలా సమష్టి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం పాఠశాలల వారీగా తెలుసుకొని అసంపూర్తి పనులు, వాటి గడువు తదితర అంశాలపై సమీక్షించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎఫ్ఎల్ఎస్, ఎఫ్ఎల్ఎన్ సర్వేల అమలుపై చర్చించి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనస్థాయిని నిరంతరం గమనిస్తూ అవసరమైన అకాడమిక్ ఇంటర్వెన్షన్లు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల సన్నద్ధతే ఎఫ్ఎల్ఎన్ విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తూ వంద రోజుల పఠనోత్సవం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, భాషాపరమైన నైపుణ్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఆయా కార్యక్రమాలు నిర్దేశిత విధంగా అమలు కావాలని సూచించారు. అలాగే కేజీబీవీలు, పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి సదుపాయా లు, తరగతి గదులు, ఇతర సివిల్ వర్క్స్ పనుల పురోగతిని సమీక్షిస్తూ విద్యార్థులకు అనుకూలమైన, శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, సంగీత, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన పథకం కో–ఆర్డినేటర్ యాదయ్య పాల్గొన్నారు. -
ఫైనల్లో పోరాడి ఓడిన మహిళా జట్టు
● రన్నరప్గా నిలిచిన పాలమూరు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ మహిళాజట్టు ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జట్టు ఫైనల్లో చివరి ఓవర్ వరకు పోరాడి రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరంగల్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పో యి 98 పరుగులు చేసింది. జట్టులో సాయి ధ్రువిజ్ఞ 38 పరుగులు చేసింది. మహబూబ్నగర్ బౌలర్లు త్రివేణి 3, అక్షర రాథోడ్, ఇందు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మ హబూబ్నగర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగుల వద్దే నిలిచిపోయింది. జట్టులో ఆర్యాని (30), ఇందు (18) మాత్రమే రాణించారు. -
ఈవీఎం గోదాంపై నిరంతర నిఘా
నారాయణపేట: ఈవీఎం గోదాం భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. నెలవారీ తనిఖీలో భాగంగా శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను ఆయన తనిఖీ చేశారు. వీవీ ప్యాట్స్, ఈవీఎంల భద్రత, ఎంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, గోదాం చుట్టూ ప్రహరీ, సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారిణి జయసుధ, రాణిదేవి ఉన్నారు. -
రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలు
నర్వ: మండలంలోని పాతర్చేడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నుంచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ నియోజకవర్గస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ కన్వీనర్, ఎంఈఓ రాంరెడ్డి, క్రీడల ఇన్చార్జ్, పీడీ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్వహించే సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలన్నారు. ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మక్తల్, మక్తల్ అర్బన్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, ఆత్మకూర్, ఆత్మకూర్ అర్బన్, అమరచింత మండలాల్లో ఎంపికై న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు సోమవారం ఉదయం 9 వరకు మైదానానికి చేరుకోవాలని సూచించారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
102, 108 వాహన సేవలు భేష్
మక్తల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 102, 108 వాహనాలు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని, వాహనాలు బాగా పని చేస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కె.రవి తెలిపారు. శనివారం పట్టణంలోని వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. 102 అమ్మ ఒడి వాహనాలను గర్భిణుల వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చడానికి, ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సినేషన్కు వినియోగించాలని సూచించారు. నయాపైస ఖర్చు లేకుండా 102, 108 వాహనాలు ఇళ్ల దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ పి.సునీల్కుమార్, టెక్నీషియన్ ఆంజనేయులు, పైలెట్లు శివశంకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత ఒప్పందం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు -
పకడ్బందీగా భూ సర్వే
కోస్గి రూరల్: పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములను రక్షించేందుకు, పక్కాగా పర్యవేక్షణ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ భారతిలో భాగంగా భూ సర్వే చేపట్టిందని ఏడీ ల్యాండ్ సర్వే వేణుగోపాల్రెడ్డి అన్నారు. గ్రామ నక్షాలు సక్రమంగా లేని గ్రామాల్లో సర్వే నిమిత్తం జిల్లాలోని నారాయణపేట, నర్వ, కోస్గి మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. అందులో భాగంగా శనివారం మండలంలోని కొత్తపల్లిలో భూ సర్వేపై అవగాహన కల్పించారు. మొదటి విడతలో ప్రభుత్వ భూమి, రోడ్లు, చెరువులు, కుంటలు సుమారు 72 ఎకరాల సర్వే చేపడతామన్నారు. రెండోవిడతలో 1,160 ఎకరాల పట్టాదారుల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. 30 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టనున్నారని వివరించారు. సర్వేకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, అప్పుడే 100 శాతం లక్ష్యం పూర్తవుతుందన్నారు. సర్వేయర్తో పాటు ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్.సుభాష్, సర్వేయర్ అరుణ, కృష్ణ, గ్రామపంచాయతి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పేట పురపాలికపై గులాబీజెండా ఎగరాలి
● మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ నారాయణపేట: తెలంగాణ ఉద్యమ నేత.. తొలి సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ నారాయణపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల ప్రగతిలో పరుగులు పెట్టించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డికి దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డితో కలిసి 7, 8, 11, 12, 13, 18, 19, 23, 24 వార్డులో అభ్యర్థులతో ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసారి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. రెండేళ్ల రేవంత్ సర్కార్లో ప్రజలెవరూ మనశ్శాంతిగా జీవించడం లేదని.. ప్రజాపాలన అని చెప్పుకొనే సీఎం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలవడం లేదన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి 420 ప్రభుత్వంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఎస్.రాజేందర్రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పునాదులు పడుతాయన్నారు. ఆయనను ఈసారి మంత్రి హోదాలో ఈ ప్రాంత ప్రజలు చూడడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఎస్ఆర్ రెడ్డి జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తించారు. -
‘పది’ విద్యార్థులకుప్రణాళిక
నర్వ: పదోతరగతి విద్యార్థుల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఇన్చార్జి తహసీల్దార్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ కోరారు. శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 విద్యాశాఖ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ సమకూర్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై హెచ్ఎంలతో సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీఓ రమేష్కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, క్లస్టర్ హెచ్ఎం సునీత తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,441 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.10,259, కనిష్టంగా రూ.5,219 ధర పలికింది. అదేవిధంగా శనగలు రూ.5,441, ఆలసందలు గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.6,012, ఎర్ర కంది రూ.8,512– రూ.5,591, తెల్ల కంది గరిష్టంగా రూ.8,512, కనిష్టంగా రూ.6,032 ధరలు లభించాయి. బీజేపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బూత్స్థాయిలో బాధ్యతగా పని చేయాలని, మరో 4 రోజులు కష్టపడితే ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశ దొరుకుతుందని జాతీయ మహిళ కమిషన్ మాజీ చైర్పర్సన్ రేఖశర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి ప్రజలు ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారని, కొద్దిగా కష్టపడితే ఈ ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని తెలిపా రు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ 4 రోజులు కొంత శ్రద్ధ పెంచాలన్నారు. ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, పవన్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఆట మొదలైంది..!
● పాచికలతో అధికార పార్టీ వ్యూహాలు ● ఎత్తుకు పైఎత్తులో ప్రతిపక్షాలు ● ఎవరి మధ్య పోటీ.. అభ్యర్థులపై సర్వేలు ● రంగంలోకి దిగిన రేవంత్ సైన్యం నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్నందున అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తూ అభ్యర్థుల కదలికలు, ప్రచారంపై ఓ బృందం కన్నేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంలో అధికార పార్టీకి కత్తిమీద సాముగా మారింది. నామినేషన్ల మొదలు ఉపసంహరణ సమయం ముగిసే వరకు జాగ్రత్తపడినా అధికార పార్టీకి అసంతృప్తులు తలనొప్పిగా మారారు. వార్డులను ఏకగ్రీవం చేయాలనుకున్నా సాధ్యపడకపోవడంతో కొత్త వ్యూహాలకు తెర తీసింది. సీఎం ఇలాఖాలోని కోస్గిలోని 4వ వార్డుకు చెందిన భానునాయక్ను ఏకగ్రీవం చేయాలని మొదటి నుంచి వ్యూహాలు చేసినప్పటికీ.. అశావహులైన శ్రీనివాస్, రామునాయక్ను ప్రతిపక్షాలైనా బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దింపి బీ ఫారాలు సైతం ఇచ్చాయి. ఆ ఇద్దర్ని ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువాలు కప్పడంతో వాతావరణం వేడెక్కినట్లయింది. పేటలో స్వతంత్ర అభ్యర్థి సరెండర్.. నారాయణపేటలో కాంగ్రెస్పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సరిత భట్టడ్కు చెందిన జువెల్లరీ దుకాణంలో సెల్స్ మేనేజర్ బుగ్గప్ప 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అతడిని తప్పిస్తేనే ఆ వార్డులో కాంగ్రెస్పార్టీకి ఇబ్బందులు ఉండవని భావించి శుక్రవారం సరెండర్ చేసుకుంది. తాను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడం చూస్తుంటే అధికార పార్టీ ఎన్నికల వ్యూహం ఏ తరహాలో కొనసాగుతుందో అర్థమవుతోంది. రంగంలోకి రేవంత్ సైన్యం.. జిల్లాలోని అన్ని పురపాలికల్లో అధికార పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి సైన్యం రంగంలోకి దిగింది. మున్సిపాలిటీలు హస్తగతం కాకపోతే జిల్లాలో సీఎం ఓడినట్లేనని ముందస్తుగా భావించిన అధికార పార్టీ ప్రతిపక్షాల పాచికలను పసిగడుతూ వ్యూహరచన చేస్తున్నాయి. ఎవరి మధ్య పోటీ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల గెలుపోటములపై ఎవరికి వారే సర్వేలో నిమగ్నమయ్యారు. ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తునే మరోవైపు తమ అనుచరులతో ప్రజల నాడి పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సిట్టింగ్ కౌన్సిలర్లు.. కొత్తగా పోటీచేస్తున్న వారు. ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మంది గెలుస్తారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం తమ అధినేతలకు పంపిస్తున్నారు. మక్తల్, పేటలో బీజేపీకి పట్టు.. గత మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో బీజేపీకి బడా లీడర్లు, క్యాడర్ ఉండటంతో కై వసం చేసుకున్నట్లు అధికార పార్టీ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 2020లో నారాయణపేటలో బీఆర్ఎస్, మక్తల్లో బీజేపీ, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయితే నారాయణపేట పుర చైర్పర్సన్ గందె అనసూయ తన అనుచరులతో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూటికి చే రింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్వేలో మక్తల్, నారాయణపేటలో బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలువబోతున్నట్లు తేలనుండటంతో జీర్ణి ంచుకోలేక చేయి దాటకముందే పసిగట్టి ప్రతిపక్షాల ను సెల్ఫ్అవుట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మద్దూర్లోబీఆర్ఎస్ గట్టి పోటీ.. కోస్గి పురపాలికలో హస్తం హవా కొనసాగుతుండగా.. మక్తల్, నారాయణపేటలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మద్దూర్లో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో అధికారపార్టీ కంటే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ సైన్యం కారుకు బ్రేకులేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. నాలుగు మున్సిపాలిటీలు హస్తగతం అవుతాయా.. లేదో వేచి చూడాల్సిందే మరి. -
ఇన్చార్జి తహసీల్దార్గా శిక్షణ కలెక్టర్
నర్వ: మండల ఇన్చార్జి తహసీల్దార్గా శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 వారాల పాటు ఇన్చార్జ్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానన్నారు. శనివారం జంగంరెడ్డిపల్లిలో నిర్వహించే గ్రామసభలో భూముల సర్వేపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కోస్గి రూరల్: పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన భద్రత చర్యలు చేపడుతున్నామని సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శివాజీ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, బాహర్పేట, రామాలయం, మున్నూరువాడ, తెలుగువీధి, వినాయకనగర్లో భారీ బలగాలతో ఆ యన ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేసినా.. డబ్బు, మద్యం, ఉచిత వస్తువులు వంటి ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నా రు. కార్యక్రమంలో భీంకుమార్, ఎస్ఐలు బా లరాజు, విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మొగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
మక్తల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
మక్తల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పుర ఎన్నికల్లో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేశవనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పట్టణంలో రూ.43 కోట్లతో 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు చేపడుతున్నామని చెప్పారు. పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషోద్దీన్, ఎండీ సలాం, కట్టా సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఊట్కూర్: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని తహసీల్దార్ చింత రవి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్–14 బాలల సాఫ్ట్బాల్ ఎంపికలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది బాలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు భవిష్యత్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు త్వరలో మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిశోర్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, పీడీ సాయినాథ్, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, బాలరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అండర్–15 రెజ్లింగ్ పోటీలు.. ధన్వాడ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా రెజ్లింగ్ (కుస్తీ) పోటీల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. గ్రామీణప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు ఎంతగానో దోహదపడుతాయని ఎంఈఓ గాయత్రి అన్నారు. పెద్దసంఖ్యలో క్రీడాకారులు తరలిరావడంతో ఈ ప్రాంతంలో కుస్తీ పోటీల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్కుమార్, పీడీ నెల్సన్కుమార్, కోచ్ శ్రీనివాస్నాయక్, బాలాజీసింగ్నాయక్ తదితరులు తెలిపారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో టీజీఎంఐఎస్డీసీ ఏజెన్సీ చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. మక్తల్లో రూ.34 కోట్లతో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు, జిల్లాకేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పక్కన 90 శాతం పనులు పూర్తయిన హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆమె చూశారు. రూ.8.50 కోట్లతో చేపట్టిన హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో తలుపులు, కిటికీలు, ఇతర ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం చుట్టూ ప్రహరీ, సీసీ రహదారి, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులు నెలలోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రూ.26 కోట్లతో నారాయణపేట మండలం అప్పక్పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మదర్, చైల్డ్ హాస్పిటల్) పనులను పరిశీలించారు. నర్సింగ్ కళాశాల రెండు బ్లాకులలో నిర్మాణంలో ఉన్న స్టడీ హాల్, డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్ బ్లాక్, మీటింగ్ హాల్ పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, భవనం చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ఆయన వెంట టీజీఎంఐఎస్డీసీ ఈఈ వేణుగోపాల్, చేనేత జౌళిశాఖ అధికారి సాయిబాబా, ఏఈ సాయి మురారి తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మక్తల్, నారాయణపేట, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయా పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఈ నెల 7, 8న ఓటు వేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు పుర కమిషనర్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం నోడల్ అధికారి, డీఏఓ జాన్ సుధాకర్(సెల్నంబర్ 63036 17267)ను సంప్రదించాలని కోరారు. -
నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. -
భూమికి హద్దులతో భూ ఆధార్
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: భూములకు ఆధునిక సాంకేతికతో కచ్చితమైన హద్దులు, నిర్దిష్టమైన కొలతలు నిర్ణయించి రైతులకు భూ ఆధార్ ఇచ్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో గుర్తించిన మూడు గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి ఏడీ సర్వే ల్యాండ్, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీసర్వేకు నారాయణపేట మండలం శేర్నపల్లి, నర్వ మండలం జంగంరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలను ఎంపిక చేసిందని చెప్పారు. శేర్నపల్లిలో 1,567 ఎకరాలు, జంగంరెడ్డిపల్లిలో 1,500 ఎకరాలు, కొత్తపల్లిలో 1,167 ఎకరాలు రీ సర్వే చేసి ఆయా గ్రామాలకు సరిహద్దులు, శివార్లు, ప్రభుత్వ భూములు, రోడ్లు, భవనాలు, అటవీ, దేవాదాయ, శిఖం భూములను గుర్తించి పూర్తిస్థాయి మ్యాపులను రూపొందించాల్సి ఉంటుందన్నారు. రీసర్వేకు ముందురోజు ఆయా గ్రామాల్లో టాంటాం వేయించాలని, గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యాలయాల్లో పట్టాదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో రీసర్వే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్, కోస్గి, నారాయణపేట తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, అమరేంద్ర కృష్ణ, సర్వేయర్లు పాల్గొన్నారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి.. జిల్లాలో ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఏఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించామని.. ప్రతి ఏఈఓ 25 ఎకరాలు సాగు చేయించాలని, సర్పంచులకు సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది లక్ష్యం చేరుకోకపోవడంతో వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా లోని నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా, మరికల్, ధన్వాడ, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి, మద్దూర్ సాగుకు అ నుకూలమని.. రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఉద్యాన అధికారి సాయిబాబా, ఆయిల్ఫెడ్ అధికారులు, కో–ఆపరేటివ్ అధికారులు ఆంజనేయులు పాల్గొన్నారు. -
నైపుణ్యాల మెరుగుతోనే ఉపాధి అవకాశాలు
కోస్గి రూరల్: ప్రస్తుత సమాజంలో పోటీ తీవ్రంగా ఉన్నందున విద్యార్థులు ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. గురువారం పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి టెక్ఫెస్ట్–2026 నిర్వహించగా.. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, పెబ్బేరు, వడ్డేపల్లి కళాశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ప్రథమ స్థానం, మహబూబ్నగర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలవగా.. ధ్రువపత్రాలు అందజేశారు. వీరు రాష్ట్రస్థాయి టెక్ఫెస్ట్లో పాల్గొననున్నారని చెప్పారు. ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తిలకించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన బృందం కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ కోర్సు ప్రారంభానికి అవసరమైన తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. కార్యక్రమంలో వసుంధరరాణి, ప్రవీణ్కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి -
వికసిత భారత్ కేంద్ర లక్ష్యం
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట/కోస్గి రూరల్/కొత్తపల్లి: గ్రామీణ పేదల అభ్యున్నతితో పాటు ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం కోస్గి, మద్దూర్ పురపాలికల్లో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తన సొంత నియోజకవర్గంలో కూడా నెరవేర్చలేదన్నారు. రుణాలు ఎక్కడా లభించడం లేదని స్వయంగా ఆయనే చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ బియ్యం వంటి వాటికి నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడలేదని, పేదల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2047 నాటికి వికసిత భారత్ రూపకల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో సుమారు రూ.55 వేల కోట్లతో హైస్పీడ్ రైల్ కారిడార్ను మంజూరు చేసిందని.. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే, చైన్నెకి నడువనున్నాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లిం సోదరులకు చేసిందేమీ లేదని.. ఓట్ల కోసం మత రాజకీయాలు చేపడుతుందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రధాని అభివృద్ధిలో ముందుకుసాగుతున్నారని వి వరించారు. కోస్గి, మద్దూర్ పురపాలికల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని.. పురపాలికలపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజవర్ధన్రెడ్డి, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీని సందర్శించిన జీసీడీఓ
ఊట్కూర్: మండలంలోని పులిమామిడిలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం జీసీడీఓ సంగీత సందర్శించారు. పాఠశాల, జూనియర్ కళాశాల రికార్డులను తనిఖీ చేసి తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని ఎస్ఓ లక్ష్మిని ఆదేశించారు. ఆమె వెంట సీఎంఓ రాజేంద్రకుమార్, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు దివ్యాంగుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తోందని.. వారికి సంక్షేమ ఫలా లు సకాలంలో అందిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్పీఆర్డీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా ప్రధానకార్యదర్శి కాశప్ప, జిల్లా సహాయ కార్యదర్శులు బాలరాజు, బస్వరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఖతల్, పెంటయ్య, నరేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల రద్దు సరికాదు : సీఐటీయూ నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి తెస్తూ 2025, నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన బిల్లులు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల హక్కులు హరించే విధంగా చట్టాలను రూపొందిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో కార్మికుల అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, జిల్లా కార్యదర్శి బండమీది బాలరాం, ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకుడు నరహరి తదితరులు పాల్గొన్నారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ కీలకం
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు ర్యాండమైజేషన్ ప్రక్రియ అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపులో భాగంగా బుధవారం కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసిన అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించారు. మొత్తం 72 వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 20 శాతం రిజర్వుతో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 362 మందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ సమావేశంలో ఎస్పీ డా.వినీత్కుమార్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం బ్లాక్ స్పాట్స్ వద్ద చేపట్టాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణపేట, మక్తల్, మరికల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద మూడేళ్ల కాలంలో 101 రోడ్డు ప్రమాదాలు జరిగి 64 మంది ప్రాణాలు కోల్పోయ్యారని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. కాగా, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న పాఠశాలల వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసేలా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ గోవిందరాజులుకు కలెక్టర్ సూచించారు. క్షత్రగాత్రులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్ను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఓ మెంబర్ పోషల్ రాజేష్, డిపో మేనేజర్ లావణ్య తదితరులు ఉన్నారు. ● జిల్లాలో అర్హత లేని వైద్యులు స్కానింగ్ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్కు సూచించారు. జిల్లాలో తక్కువ జెండర్ రేషియో (నిష్పత్తి) ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి (0–6 ఏళ్ల) జెండర్ రేషియో పెంచాలని సూచించారు. మూడేళ్ల క్రితం ఎక్కువ ఉన్న రేషియో.. ఈ ఏడాది తక్కువ కావడంపై కారణాలను విశ్లేషించాలన్నారు. రెండోసారి స్కానింగ్ తర్వాత మళ్లీ స్కానింగ్కు రాని గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కాగా, 2024–25లో (955/1000), 2025–26లో (927/1000) జెండర్ రేషియో నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ, డీఎస్పీ లింగయ్య, ఐఎంఏ ప్రెసిడెంట్ మల్లికార్జున్, సీఐ శివశంకర్ ఉన్నారు. ● జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి 3,500 ఎకరాల ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని సాధించాలని.. అందులో భాగంగా ఈ నెలలో 500 ఎకరాల సాగు కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్పాం సాగు పురోగతిపై కలెక్టరేట్లో ఆమె సమీక్షించారు. లక్ష్య సాధన కోసం జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ అధికారులు, టీజీ ఆయిల్ఫెడ్ మేనేజర్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్సుధాకర్ ఉన్నారు. -
మిగిలింది 5 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్ పోరుతో ఆందోళన.. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. వార్డులవారీగా ఇన్చార్జిలకు బాధ్యతలు.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పార్టీ నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వార్డులో ఉన్న ఓటర్లలో కులాల వారీగా ఉన్న ఓట్లపై దృష్టి పెట్టి గంపగుత్తగా ఓట్లను పొందేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది. మహిళా ఓట్లకు గాలం.. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు వార్డులవారీగా పార్టీ ఇన్చార్జిలకు బాధ్యతలు అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం గద్వాల, మహబూబ్నగర్లో రెబల్స్ పోరుతో ఆందోళన -
క్రీడాభివృద్ధికి కృషి
ధన్వాడ: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి అన్నారు. మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేపట్టిన రెజ్లింగ్ కోర్టు నిర్మాణ పనులను బుధవారం డీఈ యశ్వంత్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రెజ్లింగ్ కోర్టు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు. వారి వెంట పీడీ సాయినాథ్, రవికుమార్ ఉన్నారు. టీజీ–ఐపాస్తో పరిశ్రమల స్థాపనకు అనుమతులు నారాయణపేట: టీజీ–ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీ–ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం వివిధ శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. సకాలంలో ఆమోదించాలన్నారు. టీ–ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు 50 పరిశ్రమలకు దరఖాస్తు చేసుకోగా.. 36 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు డిజిల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలోని ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను డీఈఈటీలో నమోదయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్, ఐపీఓ పి.నర్సింహారావు, తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ నవీన్కుమార్, డీపీఓ సుధాకర్రెడ్డి, ఆర్టీఓ మేఘాగాంధీ, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు. పెసర క్వింటా రూ.7,221 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్యార్డులో బుధవారం పెసర క్వింటాకు రూ. 7,221 ధర పలికింది. వేరుశన గ గరిష్టంగా రూ. 8,406, కనిష్టంగా రూ. 4, 050,ఉలవలు రూ. 3,529, అలసందలు రూ. 6,192, వడ్లు (సోన) రూ. 2,460, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,469, కనిష్టంగా రూ. 6,255, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,669, కనిష్టంగా రూ. 7,980 ధరలు పలికాయి. -
సెమీస్కు పాలమూరు మహిళల జట్టు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్నగర్ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్ (46 నాటౌట్), ఆర్యాని (25 నాటౌట్)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్నగర్ జట్టు సెమీఫైనల్లో ఖమ్మం జట్టుతో తలపడనుంది. -
అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఎవరూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు, టీఎస్ఎస్పీ బెటాలియన్తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్.. పాత బస్టాండ్, మెయిన్ చౌక్, సరఫ్ బజార్, పల్లా హనుమాన్ టెంపుల్, జంగిడిగడ్డ, మసుమల్లి దర్గా, అంబా భవాని టెంపుల్, మహంకాళి టెంపుల్, సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. ఫ్లాగ్ మార్చ్లో సీఐ శివశంకర్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఎస్ఐలు నరేష్, వెంకటేశ్వర్లు, రాముడు, కృష్ణ చైతన్య, రాజు, గాయత్రి, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యంతో ఇబ్బందులు..
రాష్ట్ర సరిహద్దు సమీపంలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం కావడం విచారకరం. ఈ ప్లాంట్తో మండల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. మేము నిత్యం కృష్ణానదిలోని నీటిని తాగేందుకు, పంటల సాగుకు ఉపయోగిస్తున్నాం. ఇక మీదట ఆ నీరు కలుషితమైతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – గజ్జి శాంతమ్మ, సర్పంచ్, గుడెబల్లూర్ ప్రమాదం పొంచి ఉంది.. రాష్ట్ర సరిహద్దుకు 3–4 కి.మీ. దూరంలో ఏర్పాటుచేస్తున్న అణువిద్యుత్ కేంద్రంతో మన ప్రాంతానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కలుషిత వ్యర్థాల కారణంగా వాతావరణం, నదీ జలాలు కలుషితమవుతాయి. దీన్ని మొదట్లోనే వ్యతిరేకిస్తే కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. – నర్సింహులు, ముడుమాల్ ● -
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
● ముత్యాల అలంకరణలో మెరిసిన స్వామివారు ● మన్యంకొండలో కొనసాగిన భక్తుల రద్దీ మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి దర్బారు సేవ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మన్యంకొండ దేవస్థానం నిర్మాణ మూల పురుషుడు అళహరి రామయ్య చిత్రపటానికి హారతితో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్బారు సేవ జరిపారు. శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సేవలో స్వామివారు ముత్యాల అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లను గర్భగుడి నుంచి తేరు మైదానం సమీపంలో ఉన్న హనుమద్దాసుల కోనేరు మీదుగా దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మళ్లీ సుదర్శన పెరుమాళ్లను పల్లకీలో గుట్టపై ఉన్న గర్భగుడి వద్దకు తీసుకువచ్చారు. పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ముగిసిన సేవలు మన్యంకొండ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గత నెల 28న ప్రారంభమైన స్వామివారి సేవలు శుక్రవారం ముగిశాయి. ప్రతిరోజు రాత్రి స్వామివారి వివిధ సేవలను నిర్వహించారు. సేవలు ముగిసినప్పటికీ మార్చి 1న దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకు దేవస్థానం వద్ద జాతర కొనసాగనుంది. -
‘అణు’ముప్పు!
కృష్ణా: రాష్ట్ర సరిహద్దు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా మండలానికి అతి సమీపంలోని శక్తినగర్ పవర్ప్లాంట్ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుతో కృష్ణాజలాలు కలుషితం కావడంతో పాటు తాగు, సాగునీటి కష్టాలు తలెత్తుతాయని కృష్ణా మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్ పవర్ప్లాంట్ వద్ద దాదాపు 1300 ఎకరాల్లో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు రెండు రోజుల క్రితం స్థల పరిశీలన చేశారు. దీనిపై అక్కడి రెవెన్యూ అధికారులు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ థర్మల్ పవర్ప్లాంట్ ఉండటం.. ఈ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు అయితే కృష్ణా మండల ప్రజలకు కష్టాలు తప్పవని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వందల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు.. ఇప్పటికే సరిహద్దు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం వందల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాతావరణం, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడే కెమికల్ పొగ మూలంగా పలు గ్రామాల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వదజల్లే కాలుష్యాన్ని నియంత్రించాలని మండల ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఇప్పుడు కృష్ణానది అటువైపు ఏర్పాటుకానున్న అణువిద్యుత్ కేంద్రంతో నదిలోని నీరు కలుషితం కానుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా శక్తినగర్, రాయచూర్ పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేస్తూ అక్కడి అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఏదేమైనా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసే అణువిద్యుత్ కేంద్రంతో మండల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలోని శక్తినగర్ పవర్ప్లాంట్ సరిహద్దు సమీపంలో అణువిద్యుత్కేంద్రం ఏర్పాటుకు కర్ణాటక సన్నద్ధం కలుషితంకానున్న కృష్ణాజలాలు పంటలపై తీవ్ర ప్రభావం ఆందోళన చెందుతున్న రైతులు -
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక
● పాలమూరులోని ఎంవీఎస్ కళాశాలలోకార్యకర్తల సమావేశం పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బూత్ స్థాయి కార్యకర్తల దగ్గరి నుంచి జిల్లా నాయకులు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని శాఖలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిపి దాదాపు 25వేల మందితో ఈ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కార్యకర్తలు సమావేశ స్థలం దగ్గరకు చేరుకోవాలని, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ● మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రరెడ్డి పరిశీలించారు. సమావేశం నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. -
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
కొత్తపల్లి(మద్దూరు): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర కార్యదర్శి బి.కృష్ణయాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం మద్దూరులో జాగృతిసేన జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కురుమయ్య అధ్యక్షతన బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీల జెండాలు వేరైనప్పటికీ బీసీలను రాజకీయంగా అణచివేయడంలో ఒకే ఎజెండా అమలు చేస్తున్నాయన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని నమ్మించి.. ఎన్నికల్లో బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 17 శాతమే రిజర్వేషన్లు కల్పించి మరోమారు మోసం చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల హమీని అమలు చేయకపోయినా బీసీలు జనరల్ స్థానాల్లోనూ పోటీచేసి సత్తా చాటారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు గణేశ్, నాయకులు చిన్నయ్య, లాలప్ప, మొగులప్ప, భాస్కర్, రాము, రవి, మాణిక్యం తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండాలి
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నిర్దేశిత లక్ష్యం.. సాధించిన లక్ష్యంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం వందశాతం సాధించాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో దశల వారీగా నిర్మాణాలు పూర్తిచేయించి.. బిల్లులు అందించి ప్రోత్సహించాలన్నారు. నిర్మాణాల్లో వెనకబడిన గ్రామాల్లో వారం రోజుల్లోగా పురోగతి సాధించేందుకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కోస్గి మండలంలోని గ్రామాలకు ఇచ్చిన ఇళ్ల టార్గెట్లో వంద శాతం నిర్మాణాలను ప్రారంభింపజేసిన సర్జఖాన్పేట, చెన్నారం గ్రామాల కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. కొడంగల్ నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే అవకాశం ఉందని.. అంతలోగా అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని 90శాతం సాధించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో ఆస్తిపన్ను వసూలు, పారిశుద్ధ్యంపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. ● భూ భారతి సర్వే సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. భూ భారతి సర్వేకు వినియోగించే పరికరాల పనితీరును జిల్లా సర్వే అధికారి ఏడీ వేణుగోపాల్రెడ్డి కలెక్టర్కు వివరించారు. జిల్లాలో మొదటి విడతగా కోస్గి, కొత్తపల్లి నారాయణపేట, షేర్పల్లి, నర్వ జంగంరెడ్డిపల్లిలో గ్రామసభలు నిర్వహించి.. సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. -
రాజకీయం రణరంగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వార్డులను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రయత్నించారు. పార్టీలో రెబల్స్గా పోటీలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ బీఫారాల అప్పగింతకు సమయం ఉండగా పలుచోట్ల చివరి క్షణం వరకూ హైడ్రామా కొనసాగింది. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 15వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించడం, ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొదట బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన తవిటి ఇందిర చివరి క్షణంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కాంగ్రెస్కు చేరడంతో మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులను విత్డ్రా చేయించేందుకు సైతం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అభ్యర్థి నజియా బేగం ఇంటికి చేరుకుని అప్పటికే మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆమెకే బీఫారాన్ని అందించారు. అసంతృప్త నేతల రాజీనామా పర్వం.. కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాజీనామా చేయడం ఆపార్టీలో చర్చనీయాంశంగా మారింది. టికెట్ రాని వారిని నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపడంతో పాటు పార్టీకి రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన తైలి శ్రీనివాసులకు పార్టీ బీఫారం ఇవ్వలేదు. దీంతో భంగపాటుకు గురైన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నాగర్కర్నూల్ పార్లమెంట్ కమ్యునికేషన్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లేపల్లి జగన్ కల్వకుర్తి మున్సిపాలిటీలో 11 వార్డులో నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇవ్వకపోవడతో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డబుల్ బీఫారాలతో అలజడి.. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఒకే వార్డుల్లో ఇద్దరికి బీఫారాలు ఇవ్వడం కలకలం రేపింది. మొదట మున్సిపాలిటీలో 37 వార్డు స్థానాలకు గానూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన వర్గీయులకు 37 మందికి పార్టీ బీఫారాలను అందజేశారు. ఆతర్వాత కాంగ్రెస్ నేత సరితాతిరుపతయ్య వర్గానికి చెందిన మరో ఏడుగురు సైతం పార్టీ బీఫారాలను సమర్పించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వతంత్రుల్లో సింహభాగం రెబల్స్గా.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలాచోట్ల బీజేపీ అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా పోటీలో ఉండటంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల కేడర్ ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడం, తుది పోరులో మిగిలిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోవడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పార్టీల్లోకి చేరికలు గద్వాల, నాగర్కర్నూల్ మున్సిపాలిటీల్లోచివరి వరకు హైడ్రామా బలాబలాల ప్రదర్శనపై ప్రధాన పార్టీల దృష్టి ఉపసంహరణ ఘట్టం ముగియడంతోఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం -
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
● మనిషి మనుగడకు ప్రకృతి అవసరం ● రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మహబూబ్నగర్ న్యూటౌన్: సమాజంలో మనిషిగా మన కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో ప్రకృతిని కాపాడుతూ వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విజ్ఞానదర్శిని, నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమాన్ని జేపీఎన్సీఓ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం స్వావలంబనకు శాసీ్త్రయ దృక్పథం, ఆధునిక భారత్, నెహ్రూ దార్శనికత అనే అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. జనవరి 27న ప్రారంభమైన యాత్ర ఈ నెల 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జన్యుపరంగా మానవుడికి కులమతాల భేదం లేదని, అవి మనం సృష్టించుకున్నవే అని పేర్కొన్నారు. ప్రకృతిని వైజ్ఞానికంగా పరిశీలించడం ద్వారానే సైన్స్ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతిని తనను తాను కాపాడుకోగలదని, మనిషిగా మనం మనుగడ సాధించాలంటే ప్రకృతి ఉండాల్సిన అవసరముంది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా.గుమ్మడి వెన్నెల, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రముఖ గేయ రచయిత జయరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్రెడ్డి, జన విజ్ఞాన వేదిక డా.రమేశ్, జేపీఎన్సీఓ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లింగం నాయక్, సీపీఎం నాయకులు కిల్లెగోపాల్, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పేటలో కొలిక్కి..
జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులకు రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి బీ ఫారాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మిలాఖత్లో ఎంఐఎంకు 23, 24 వార్డులను వదులుకోవడంతో.. మిగిలిన 22 వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సోమవారం డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులకు పార్టీ బీ ఫారాలను అందజేశారు. బీజేపీలో అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేసినప్పటికీ.. రెండు వార్డుల్లో అభ్యర్థుల రెబల్స్తో బీ ఫారాలు ఇవ్వలేకపోయింది. వారిని బుజ్జగించి మంగళవారం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నిబంధనల మేరకు గుర్తుల కేటాయింపు
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఈసీ నిబంధనల మేరకు గుర్తులు కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల విత్డ్రా అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఆయా గుర్తులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. వార్డుల వారీగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ అనంతరం రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్స్ ముద్రణ చేయించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. అందులోని నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోటీ చేసే ప్రతి బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా డివిజన్లలో పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ల అభ్యర్థులతో సోమవారం ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రావడం ఇదే సమయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలోని పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. బూత్స్థాయి కార్యకర్తల సమావేశం కావడం అధిక సంఖ్యలో తరలిరావాలని, సభా స్థలానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేరుకోవాలన్నారు. సాధారణ పబ్లిక్ మీటింగ్ కాదని, పార్టీ జెండా మోసే బీజేపీ కార్యకర్తల సమావేశం కావడం వల్ల నాయకులు అధికంగా రావాలన్నారు. నగరం మొత్తం బీజేపీ బ్యానర్లు, కమలం జెండాలతో అలంకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, పద్మజారెడ్డి, నాగురావు నామాజీ, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రతంగ్పాండురంగారెడ్డి, దిలీపాచారి, శ్రీనివాస్రెడ్డి, రమేష్కుమార్, నాయకులు బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ● ఈ నెల 4న నగరంలో ఎంవీఎస్ మైదానంలో బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రామచందర్రావుతో పాటు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలర్తో కలిసి పరిశీలించారు. మధ్యాహ్నం నుంచి మొదలు కానున్న సమావేశంలో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు రాకుండా కచ్చితమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల పరిశీలన -
బీఫాం ఎవరికో..?
మక్తల్, కోస్గి, మద్దూర్ బల్దియాల్లో తేలని టికెట్ల ‘పంచాయితీ’ నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ఒకరికి మించి అభ్యర్థులు నామినేషన్లు వేయడం.. వాటి పరిశీలన సైతం పూర్తికావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెబల్స్ పోటీలో ఉంటే వైఫల్యం తప్పదని భయపడుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు.. తమకు పోటీగా ఉన్న వారిని బుజ్జగిస్తూ, రాయబారాలతో నామినేషన్ ఉపసంహరణ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ.. జిల్లాలోని మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో ఇంకా ఎవరికీ పార్టీ బీఫాంలు ఇవ్వలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ప్రతి వార్డుకు ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో బీఫాం ఎవరికి దక్కుతుందో తెలియ ని పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం వరకు ఉండటంతో ఆయా పార్టీల నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. చివర కు పార్టీ నుంచి బరిలో ఉండేదెవరో.. రెబల్గా మిగిలేదెవరోనని పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడితే, పైసలు ఉన్న వారికి టికెట్ ఇస్తారా అంటూ కొందరు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరికొందరు ప్రధాన పార్టీల ముఖ్యనేతల వద్ద బీఫాం కోసం క్యూ కడుతుండటంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు బీఫారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించనున్నారు. దాటవేత ధోరణిలో అధినేతలు.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అంటూ అధినేతలు దాటవేస్తున్నారని పోటీదారులు వాపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరి కంటే ఎక్కువగా నామినేషన్లు వేసిన వారిలో ఒకరికి బీ ఫామ్ ఇస్తే.. మిగిలినవారు పార్టీ జంపయ్యే అవకాశం లేకపోలేదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ వార్డుల పరిధిలో గెలుపోటములపై సర్వే నిర్వహిస్తున్నామని చెబుతూ బీ ఫారాలు ఇవ్వకుండా దాటవేస్తున్నట్లు తెలిసింది. నామినేషన్లు వేసినప్పుడే బీఫారాలు ఇచ్చి ఉంటే అభ్యర్థులు ప్రతి ఓటరును కలిసే అవకాశం ఉండేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు పోటీదారుల్లో బీఫాం టెన్షన్ -
పార్లమెంట్ మార్చ్కు తరలిరావాలి
నారాయణపేట రూరల్: సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ మార్చ్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. డీఎస్సీ ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులకు మళ్లీ టెట్ పేరుతో పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నర్సింహా రెడ్డి, ఉదయభాను, ఏఎంఓ విద్యాసాగర్, ఏఎస్ఓ శ్రీనివాస్, రఘువీర్, జనార్దన్, సత్య నారాయణ, రమేశ్, గోవర్ధన్, లక్ష్మణ్, నారాయణరెడ్డి, అరవింద్, వెంకటప్ప పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై శిక్షణ నారాయణపేట: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానంపై సోమవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖల సిబ్బంది, రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఈడీఏ అసిస్టెంట్ మేనేజర్ సుకేష్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానం, లైసెన్సింగ్, ఐఈసీ సర్టిఫికెట్ పొందడం, ఆర్సీఎంసీ నమోదు ప్రక్రియ వంటి అంశాలను విపులంగా వివరించారు. ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాధారణంగా 40 శాతం, ప్రభుత్వ సంస్థలకు 90 శాతం వరకు రాయితీ ఉంటుందన్నా రు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏపీఈడీఏ ద్వారా అందిస్తామని తెలిపారు. అనంతరం డీఏఓ జాన్సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తు న్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యాన పంటల ఎగుమతులపై ఉద్యానశాఖ అధికారి సాయిబాబా అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి పోటీతత్వం అవసరం నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించాల్సిన అవసరముందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్, తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు సాంఘికశాస్త్రం జిల్లాస్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్ష నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న జ్ఞానాన్ని వెలికితీయడం అభినందనీయమన్నారు. పరీక్షలపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి.. వారిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించి.. భవిష్యత్ మార్గదర్శనం చేశారు. కాగా, జిల్లాస్థాయి టాలెంట్ టెస్టులో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. తెలుగు మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కళ్యాణి, పూజ, కృష్ణయ్య నిలవగా.. ఆంగ్ల మాధ్యమంలో పూర్విక, కార్తీక్ , శంభావి నిలిచారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కనకప్ప, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సెక్రెటరీ యశ్వంత్, ఎంఈఓలు కృష్ణారెడ్డి, గాయత్రి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్ , నాగార్జునరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్ మహబూబ్నగర్ న్యూటౌన్: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రకిరణ్, హెచ్ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ డా.వినీత్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో పురోగతి, నేరాల నియంత్రణ అంశాలపై సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. జనసామర్థ్యంగల ప్రదేశాల్లో విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ చోరీ కేసులను ఆధునిక సాంకేతికతతో ఛేదించి.. చోరీ సొత్తు బాధితులకు అందించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ను వెంటనే అమలు చేయాలన్నారు. రౌడీ షీటర్స్, పాత నేరస్తులు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసి.. వెపన్స్ డిపాజిట్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలన్నారు. చెక్పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ నిరంతరం తనిఖీలు నిర్వహించి నగదు, మద్యం, ఇతర ప్రలోభకర వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, భగవత్రెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, సునీత, రాజు, రాముడు, బాలరాజు, రాజశేఖర్, రాములు, భాగ్యలక్ష్మీరెడ్డి, నవీద్, అశోక్బాబు, పురుషోత్తం, గాయత్రి, మహేశ్వరి ఉన్నారు. -
పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత
మక్తల్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన వారికే తగిన ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారీ.. నిరాశే
నారాయణపేటకేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర బడ్జెట్ ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లావాసులకు నిరాశే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గద్వాల– మాచర్ల రైల్వేలైన్కు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. కొత్తగా అలంపూర్– నల్లగొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించినా భంగపాటు ఎదురైంది. వెనుకబడిన జిల్లాలో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని ఆశించగా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే హైదరాబాద్– బెంగళూరు రైల్వే మార్గంలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాకు కాసింత ప్రయోజనం కలగనుంది. ఊసే లేని గద్వాల– మాచర్ల కొత్త లైన్ ఉమ్మడి పాలమూరులో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. గద్వాల– మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే మిగిలింది. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్ల ప్రతిపాదనలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లా అలంపూర్ సమీపంలోని పుల్లూరు నుంచి నల్లగొండ వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వే సైతం నిర్వహించగా.. ఈసారి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. చేనేత కార్మికులకు దన్ను.. మహాత్మగాంధీ గ్రామ్ స్వరాజ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న మరమగ్గాలు, చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా బ్రాండింగ్తోపాటు మార్కెట్ లింకేజీ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచనున్నారు. చదువు.. ఉపాధి విద్యాభివృద్ధిలో భాగంగా బాలికల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బాలికల భాగస్వామ్యం పెంచడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా బాలికలకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. ● యువతకు చదువుతో పాటు నేరుగా ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సామాన్యులకు వ్యతిరేకం.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ రాష్ట్రంపై నిర్లక్ష్యం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి హైస్పీడ్ రైల్వే కారిడార్.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైల్వే మార్గాన్ని హైస్పీడ్ రైల్వే కారిడార్గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకోనున్నాయి. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మార్చడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. తద్వారా వేగంగా చేరుకోవడంతో పాటు ఇతర రైల్వే నెట్వర్క్, రోడ్లపై రద్దీ భారం తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ ద్వారా ఉమ్మడి జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దక్కని జాతీయ హోదా.. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటనతో పాటు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్లో దీనిపై కనీస ప్రస్తావనకు నోచుకోలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు చేసే భారమంతా రాష్ట్రం మీదే పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలో ఐదోశక్తి పీఠమైన అ లంపూర్ జోగుళాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద ప్రత్యేకంగా నిధులు అందుతాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా భంగపాటు తప్పలేదు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన కరువు గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్లు, నూతన జాతీయ రహదారులకు తప్పని భంగపాటు హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్తో ప్రయోజనం ప్రతి జిల్లాలోనూ బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుతో మేలు -
వికసిత భారత్ బడ్జెట్..
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్న దేశ ఆర్థికవృద్ధిని వేగవంతం చేయడం, సబ్కా సాత్.. సబ్కా వికాస్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బయో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్, విద్య, వైద్య, వ్యవసాయరంగాలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కీలక రంగాలకు భారీ కేటాయింపులు, విదేశీ పెట్టుబడులకు అవకాశాలు, ఫ్యూచర్స్ ట్రేడింగ్పై పన్నుల పెంపువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. – సత్యయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడుసామాన్యులకు నష్టమే.. కేంద్రం ప్రకటించిన బడ్జెట్తో సామాన్యులకు నష్టమే. ఈసారి ఇన్కం ట్యాక్స్ స్లాబ్లో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. బంగారం, నిత్యవసర సరుకుల ధరల నియంత్రణకు సరిపోను బడ్జెట్ ఇది. రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టింపు లేదు. – ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట అంకెల గారడీ.. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన రోజే స్టాక్మార్కెట్ కుప్పకులింది. బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. సామాన్యులు, నిరుద్యోగులను నిరాశ పర్చింది. ఈ బడ్జెట్లో అంకెలు మార్చారే తప్పా యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. – ఎస్.రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ● -
ఎత్తిపోతల స్టేజ్–1 పంపుహౌజ్ పనులు ప్రారంభం
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టేజ్–1 పంపుహౌజ్ నిర్మాణానికి ఆదివారం మండలంలోని కాటేవ్రుపల్లి దగ్గర ఇరిగేషన్శాఖ ఎస్ఈ శ్రీధర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం సుమారు రూ.1,400 కోట్లు మంజూరు చేసిందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో రైతులకు ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించిందని చెప్పారు. పనులు యుద్ధపాతిపదికన చేపట్టాలని కాంట్రాక్టర్ రాఘవకు సూచించారు. కార్యక్రమంలో ఈఈ గోపాల్చారి, ఏఈఈ నాగశివ, ఎండి ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార హోరు..!
● అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ ● కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ ● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికలు.. 72 వార్డుల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం రంగంలోకి దిగారు. నారాయణపేటలో కాంగ్రెస్పార్టీ అందరికంటే ముందుగానే చైర్పర్సన్ అభ్యర్థిగా పుర మాజీ వైస్ చైర్మన్ సతీమణి సరిత హరినారాయణభట్టడ్ పేరుకు ప్రకటించి ముందడుగు వేసింది. బీజేపీ అభ్యర్థులను ఎంపీ డీకే అరుణ ప్రకటించి సన్మానించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి ప్రకటించి అందరి కంటే ముందే బీఫారాలు పాత చిన్నపిల్లల ఆస్పత్రి వద్ద అందజేశారు. మిగతా ఏ పురపాలికలోనూ ఏ పార్టీ చైర్మన్ అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహులకు టికెట్ దక్కకపోతే ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలా.. తమ సత్తా ఏమిటో చాటేందుకు రెబల్గా దిగుదామా అంటూ అనుయాయులతో సమాలోచనలు జరుపుతున్నారు. ● అధికార కాంగ్రెస్పార్టీ పురపాలికలపై జెండా ఎగరవేసేందుకు అశావహుల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి నామినేషన్ వేయించారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్లో దాదాపు రూ.25 కోట్లు, నారాయణపేట మున్సిపల్ కేంద్రంలో రూ.19 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. నారాయణపేటలో జెండా ఎగరవేస్తే క్రీడా మైదానానికి రూ.30 కోట్లు, ప్రతి వార్డుకు రూ.కోటి చొప్పున అభివృద్ధి నిధు లు మంజూరు చేస్తామ ని హామీ ఇచ్చారు. సీఎం ఇలాఖాలోని మద్దూర్ మున్సిపాలిటీలో దాదాపు రూ.50 కోట్లు, కోస్గి మున్సిపాలిటీలో రూ.300 కోట్ల పనులు ఇప్పటికే ప్రారంభించారు. అధికారపార్టీ నాలుగు పురపాలికలను హస్తగతం చేస్తే రూ.వందల కోట్లు తీసుకొచ్చి ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటూ భరోసానిస్తున్నారు. కేంద్ర పథకాలతో.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సైతం పుర ఎన్నికలను సవాల్గా తీసుకుంది. కోస్గి, మద్దూర్, నారాయణపేట, మక్తల్లో అమృత్ 2.0 కింద తాగునీటి సరఫరాకు రూ.కోట్లు ఇచ్చింది కేంద్రమేనంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్పార్టీ చేసిన పలు అభివృద్ధి శంకుస్థాపనలు ఎన్నికల స్టంట్ అంటూ దుయ్యబట్టారు. ప్రతి వార్డులో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో కోర్ కమిటీలు ఏర్పాటుచేసి అభ్యర్థులను ప్రకటించే బాధ్యతను వారికే అప్పగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి.. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. సీఎం ఇలాఖాలోని కోస్గి, మద్దూర్లో కారు జోరుతో హస్తాన్ని అడ్డుకునేందుకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వ్యూహరచన అమలు చేస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి ఎవరి ఊహకు అందకుండా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పావులు కదిపారు. మక్తల్ మున్సిపాలిటీ మంత్రి ఇలాఖా కావడంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తన రాజకీయ అనుభవంతో 16 వార్డుల్లో అభ్యర్థులను నిలిపారు. -
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి
పాలమూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం పాలమూరుకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలకు బయలుదేరి నేరుగా ఎంవీఎస్ కళాశాల మైదానానికి చేరుకుంటారని ఎంపీ డీకే అరుణ అన్నారు. తొలిసారి జిల్లాకు వస్తున్న క్రమంలో భారీగా స్వాగతం పలకాలని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారన్నారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని, బూత్స్థాయి కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు. ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోటీ చేసే అవకాశం వచ్చిన ప్రతి అభ్యర్థి దీనిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కార్పొరేషన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. గెలుపు అవకాశాలు అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసిందని, డివిజన్లో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు రమేష్, పద్మజారెడ్డి, బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు రోజులు దగ్గరపడ్డాయి
● పేటలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు ● బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నారాయణపేట: సిట్ నోటీసులు ఒక్క కేసీఆర్కు కాదు.. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులు, యావత్ ప్రజలకు ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలో ఆయనతో పాటు మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సింగారం చౌరస్తాలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమై పురవీధుల్లో కొనసాగుతూ సత్యనారాయణ చౌరస్తా వరకు చేరింది. అక్కడ సీఎం రేవంత్రెడ్డి దహనం చేసి మాట్లాడారు. కేసీఆర్కు సిట్ నోటీసులతో జిల్లా, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీల్లో జనాలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పేటలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బడా వ్యాపారి పైసలిచ్చి చైర్మన్ గిరి కొనుక్కున్నారంటూ ప్రతి మహిళా మాట్లాడుకుంటున్నారన్నారు. లోపాయికారి ఒప్పందంతో నీచ రాజకీయాలు చేస్తున్నాయని.. మానుకోవాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. పుర ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని, మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెన్నారెడ్డి, ప్రతాప్రెడ్డి, విజయ్సాగర్, రాంరెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇచ్చిన లక్ష్యం.. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నియోజకవర్గం వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో వేగం పెంచాలన్నారు. పూర్తిగా వెనుకబడిన కృష్ణా మండలానికి సంబంధించి ఎంపీడీఓను వివరణ కోరారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరుకావాలని, లేనిపక్షంలో వేతనంలో కోత విధించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. గ్రామాలకు ఆలస్యంగా వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులను వివరణ అడిగారు. కారణాలు చెప్పకుండా పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. జాబ్కార్డులు ఉన్న ఉపాధి కూలీలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సమీక్షలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్ పాల్గొన్నారు. పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని బూత్స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని, వారితో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్నాయక్, తహసీల్దార్ అమరేంద్రకృష్ణ, సి–సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. 30 ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే.. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరుకావడం లేదు. ● గద్వాల– డోర్నకల్ లైన్కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు. ● కొత్తగా అచ్చంపేట– మహబూబ్నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది. ● గద్వాల– వనపర్తి– నాగర్కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఈ ఊసే కనిపించడం లేదు. ఏళ్లుగా పెండింగ్లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ఇంకా ప్రారంభం కాని మహబూబ్నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు మహబూబ్నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది. -
హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్ వాహన సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే ప్రభోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. -
బెదిరింపులు.. బుజ్జగింపులు!
● బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలో రెబెల్స్ బెడద ● ఉపసంహరించుకుంటారా.. పోటీలో నిలుస్తారా? నారాయణపేట: పుర ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో రెబల్స్గా బరిలోకి దిగేందుకు నా మినేషన్లు వేశారు. సీఎం ఇలాఖాలోని కోస్గి పురపాలికలో కాంగ్రెస్పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రసన్నకుమారి సైతం రెబల్గా నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. మద్దూర్లోని పలు వార్డుల్లో రెబల్స్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నారాయణపేట పురపాలికలో కాంగ్రెస్పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సరిత హరినారాయణభట్టడ్ నామినేషన్ వేసిన 16వ వార్డులో రెబల్గా బుస్సయ్యస్వామి సతీమణి సుజాత నామినేషన్ వేయడంతో పరేషాన్లో పడ్డారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి సరితకు చెందిన బాలాజీ జువెల్లర్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న బుగ్గప్ప ఒకటోవార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగడం చర్చనీయాంశంగా మారింది. 8వ వార్డులో బుల్లెట్ రాజు తల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా రంగంలోకి దిగారు. 11వ వార్డులో మాజీ సింగిల్విండో డైరెక్టర్ మల్లేష్ సతీమణి, ఆయన సోదరుడి సతీమణిని సైతం రంగంలోకి దింపారు. ● పేట మున్సిపాలిటిలోని 4, 17 వార్డులో అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు వేస్తోంది. 17వ వార్డు టికెట్ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుస్సయ్య స్వామి ఆశిస్తుండగా.. ముందుగా శోభారాణి రాజును నామినేషన్ వేయించారు. ఆ వార్డు బీజేపీ కంచుకోటగా భావించిన కాంగ్రెస్ వెంటనే సమాలోచనలు జరిపి గందె ఉమాకాంత్ సతీమణితో చివరిరోజు నామినేషన్ వేయించారు. బుస్సయ్య స్వామికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కోడలు పవిత్రను కాంగ్రెస్ పార్టీ రెబల్గా నామినేషన్ వేయించారు. పక్కనే ఉన్న 16వ వార్డులో కాంగ్రెస్పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సరితపై బుస్సయ్య స్వామి సతీమణి సుజాతను నామినేషన్ వేయించడంతో పరేషాన్లో పడ్డారు. ● మద్దూర్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్పార్టీ శ్రేణులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రతాప్రెడ్డి చెప్పుకొచ్చారు. బెదిరింపులకు భయపడమని తేల్చిచెప్పా రు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో రెబల్స్ను బుజ్జగించే ప్రయత్నంలో ఆయా పార్టీల ప్రధాన నాయకులు ఉన్నారు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీలిస్తున్నారు. అయితే రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకుంటారా.. లేదా పోటీలో ఉంటారా వేచి చూడాల్సిందే మరి. సీఎం ఇలాఖాలోనూ.. సీఎం ఇలాఖాలోని కోస్గి పురపాలికలో 16 వార్డులుండగా.. దాదాపు మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులకు రాకపోవడంతో రెబల్గా పోటీ చేసేందుకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. సీఎం ఆదేశాలతో నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 1వ వార్డులో అనిత (కాంగ్రెస్ రెబల్), 2వ వార్డులో కాంగ్రెస్పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్నకుమారి, యాదమ్మ, 5వ వార్డులో వెంకటయ్య, 6వ వార్డులో దమయంతి, 7వ వార్డులో సలీం, శ్రీనివాస్, 9వ వార్డులో ప్రబోత్తం, 10వ వార్డులో పద్మమ్మ, 11వ వార్డులో వనజ, సుష్మిత, 12వ వార్డులో రాంబాబు, సోమశేఖర్, వేణుగోపాల్, 15వ వార్డులో ఆనంద్గౌడ్, బిచ్చప్ప, 16వ వార్డులో ఉజ్వల్ రెబల్గా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగిస్తూ విత్డ్రా చేయించే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. చివరకు పోటీలో ఉంటారా లేక ఉపసంహరించుకుంటార అనేది వేచి చూడాల్సిందే మరి. 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కె.లక్ష్మి రెబల్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. -
4న పాలమూరుకు నితిన్ నబీన్
● ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ● ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. -
పేట పురపాలికపై గులాబీజెండా ఎగరాలి
● బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట: స్థానిక పురపాలికలోని 24 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గులాబీజెండా ఎగరేస్తే వెంటనే తరలించిన చిన్నపిల్లల ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిని తిరిగి తీసుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలో తొలగించిన చిన్నపిల్లల ఆస్పత్రి ఎదుట పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు పార్టీ ఎన్నికల ఇన్చార్జ్, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల నారాయణపేట జిల్లాను తొలగిస్తారనే వార్తాలు వస్తున్నాయని, జిల్లా వద్దనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలని సూచించారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తాను ముందుండి పోరాడి జిల్లాను పోనివ్వకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు 2020లో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేని మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రికి తరలించారని ఆరోపించారు. ఆస్పత్రి తరలింపుతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి చిన్నపిల్లలు, ప్రసూతి ఆస్పత్రిని తిరిగి పట్టణంలో ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని గుర్తుచేశారు. జిల్లాను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని.. ఇదే జరిగితే నారాయణపేట అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ బూటకపు హామీలను ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని.. పుర ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
9 నామినేషన్లు తిరస్కరణ
● కోస్గిలో 8, మక్తల్లో ఒకటి నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో శుక్రవారం వరకు వేసిన అభ్యర్థుల నామినేషన్లను శనివారం ఆర్ఓలు అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. కోస్గి పురపాలికలో 84 మంది 119 నామినేషన్లు వేయగా 8 తిరస్కరణకు గురైనట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అలాగే మక్తల్ పురపాలికలో ఒక నామినేషన్ను తిరస్కరించినట్లు పుర కమిషనర్ శ్రీరాములు తెలిపారు. 8వ వార్డు ఎస్సీ మహిళలకు కేటాయించగా.. కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బి.రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ నామినేషన్ను తిరస్కరించినట్లు వెల్లడించారు. ● నారాయణపేట మున్సిపాలిటీలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయడంతో ఎవరి నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదని పుర కమిషనర్ నర్సయ్య తెలిపారు. మొత్తం 24 వార్డులకు 124 మంది అభ్యర్థులు 202 నామినేషన్లు వేశారన్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు నామినేషన్లు వేయడంతో క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలు జరగలేదని గుర్తించినట్లు వివరించారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 39, బీజేపీ నుంచి 27, బీఆర్ఎస్ నుంచి 26, ఎంఐఎం నుంచి 4, టీడీపీ నుంచి 2, ఇతరులు 26 మంది నామినేషన్లు ఉన్నట్లు తెలిపారు. ● మద్దూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 71 మంది అభ్యర్థులు 89 నామినేషన్లు వేశారు. అన్ని నామినేషన్లు సరిగానే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. -
ప్రజల సహకారం కీలకం : ఎస్పీ
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని.. ఒక్క ఫోన్కాల్తో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్ 88898 08182 శనివారం ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించి ప్రమాద సమయాల్లో వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు పై నంబర్కు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్లో పంపితే మరింత వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీస్ కంట్రోల్రూమ్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వెంటనే స్పందించి సంబంధిత పోలీస్స్టేషన్, పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందిస్తారని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. సమాచారం అందించి ప్రాణాలు కాపాడటంలో సహకరించిన వారికి జిల్లా పోలీస్శాఖ తరఫున ప్రోత్సాహక బహుమతి, ప్రశంసాపత్రం అందించనున్నట్లు వివరించారు. -
పట్టుదల,క్రమశిక్షణ ముఖ్యం
మహబూబ్నగర్ క్రీడలు: ప్రస్తుతం మహిళా క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో శనివారం ఉత్తరాఖండ్–హైదరాబాద్ ఇన్విటేషన్ మ్యాచ్ జరిగింది. తెలంగాణకు చెందిన మాజీ భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా మ్యాచ్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘మహిళా క్రికెట్కు మంచి ప్రాచుర్యం లభిస్తోంది. మొదట్లో తాము ఆడుతున్నప్పుడూ వసతులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్లో పట్టుదలతో ఆడాలని, అదే సమయంలో క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. మహబూబ్నగర్ మైదానం చాలా బాగుంది. జింఖానా మైదానాన్ని పోలి ఉంది. ఔట్ ఫీల్డ్ చక్కగా ఉంది. ఔత్సాహిక మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మహబూబ్నగర్ మైదానంలో మ్యాచ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మ్యాచ్లు ఇక్కడి యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపుతుంది. ● నేను 1999లో మొదటగా హెచ్సీఏ అండర్–16 మ్యాచ్ ఆడాను. లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్గా దేశవాళీ క్రికెట్లో 200కి పైగా మ్యాచుల్లో దాదాపు 400 వికెట్లు తీసుకున్న. 2008 నుంచి 2015 వరకు భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. భారత అండర్–21 జట్టు, సీనియర్ జట్టుకు ఆడాను. 2009, 2013లో మహిళల వన్డే ప్రపంచకప్, మూడు టీ–20 ప్రపంచకప్లు ఆడాను. 50 వన్డే మ్యాచ్లు ఆడి 66 వికెట్లు, 37 టీ–20కు మ్యాచుల్లో 29 వికెట్లు తీశాను. మిథాలీరాజ్ కెప్టెన్సీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాను. 2023–24లో వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది ఆగస్టులో క్రికెట్కు రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం హెచ్సీఏ అండర్–19, అండర్–15 మహిళల జట్టుకు హెడ్కోచ్గా ఉన్నాను. మహిళా క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది ఎండీసీఏ మైదానం చాలా బాగుంది భారత మహిళా మాజీ క్రికెటర్ గౌహర్ సుల్తానా -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని పురపాలికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నారాయణపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని.. కేంద్ర నిధులతో అభివృద్ధి చేసుకుందామన్నారు. పేట మున్సిపాలిటీలో 24 వార్డు ఉండగా.. అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. ఇందులో ముగ్గురు ముస్లింలు సైతం ఉన్నారన్నారు. పురపాలికపై బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టణ ప్రజలను కోరారు. గతంలో పార్టీ నుంచి గెలిచిన చైర్మన్ అభివృద్ధి పేరు చెప్పి నాటి అధికార పార్టీలో చేరారని తెలిపారు. పురపాలికకు రూ.34 కోట్లు అమృత్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటిస్తారా అని విలేకర్లు అడగగా.. రాష్ట్రంలో ఎక్కడా ప్రకటించ లేదని చెప్పారు. అనంతరం నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఎంపీ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పుర ఎన్నికల ఇన్చార్జ్ బి.కార్తీకరెడ్డి, బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావునామాజీ, రతంగ్పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు రఘురామయ్యగౌడ్, వినోద్, కిరణ్, బిల్డర్ వెంకట్రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. అయినా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం ఆశావహులకు పరీక్షలా మారింది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా, బీజేపీ పలు డివిజన్లకు అభ్యర్థులను ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో చివరి రోజు ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు అధిక సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు పోటెత్తారు. అనిశ్చితి, ఆందోళనల మధ్యే నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అందరూ రెండు సెట్లు (పార్టీ తరఫున, స్వతంత్రంగా) దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకమేనా.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు డివిజన్ల పరిధిలోని శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. రెబల్స్ ప్రభావం అధికంగా ఉందని గ్రహించిన ఆయా పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు నిర్వహించినా.. వ్యూహాత్మకంగానే అధికారికంగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీపాంలు అందజేసే అవకాశం ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వార్డుల వారీగా ఫైనల్ అయిన అభ్యర్థులకు ఫోన్ చేసి మీ పని మీరు చేసుకోండని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెబల్ అభ్యర్థులను బుజ్జగించేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు సంప్రదింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్: 60 డివిజన్లు.. 781నామినేషన్లు కొత్తగా ఆవిర్భవించిన ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా 781నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 328, బీఆర్ఎస్ నుంచి 153, బీజేపీ నుంచి 112, ఎంఐఎం నుంచి 28, జనసేన తరఫున 20, బీఎస్పీఎనిమిది డివిజన్లలో, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, ఆప్, సీపీఎం నుంచి ఇద్దరేసి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. మరో 125 మంది స్వతంత్రులు/ఇతరులు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు కనిష్టంగా ముగ్గురు నుంచి గరిష్టంగా పది మంది వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో గరిష్టంగా ఒక్కో డివిజన్లో ఆరుగురు, బీఆర్ఎస్లో గరిష్టంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసినా ఖరారు కాని అభ్యర్థిత్వాలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ కొనసాగుతున్న అనిశ్చితి ఎంఎంసీలో చివరి రోజు పోటెత్తిన కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తంగా 781.. ఒక్కొక్కరు దాదాపు 2 సెట్లు దాఖలు రెబల్స్ కట్టడికి ప్రధాన పార్టీల వ్యూహాత్మక అడుగులు -
మహాత్ముడి ఆశయ సాధనకు కృషి
మక్తల్: ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ఎనాడూ మరవొద్దని సూచించారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, చిన్నహన్మంతు, నాయకులు నారాయణ, నాగరాజు, హరికృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
● అధికారులు పనితీరు మార్చుకోవాలి ● కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా వెనుకబడి ఉండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దామరగిద్ద మండలం పూర్తిగా వెనుకబడి ఉండటంతో ఎంపీడీఓను సంజాయిషీ కోరారు. పద్ధతి మార్చుకోవాలని, పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద రోజుల పని కల్పించడంలో కూడా జిల్లా చాలా వెనుకబడి ఉందని.. అధికారులు ఇకపై స్థానికంగానే ఉండాలని తేల్చి చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో లక్ష్యం చేరుకున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. సర్పంచ్లను సమన్వయం చేసుకుని పాలనను ముందుకు సాగించాలని, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని కోరారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. సమీక్షలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సందర్శన.. పుర ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఏవైనా ఫిర్యాదు వచ్చాయా అని ఆరా తీశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అధికారులకు అందించాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, అధికారులు, సిబ్బంది ఉన్నారు. నామినేషన్ కేంద్రం తనిఖీ.. మక్తల్: స్థానిక పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్ట్రాంగ్రూంను పరిశీలించారు. ఆమె వెంట పుర కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్కుమార్, ఏఈ నాగశివ ఉన్నారు. -
షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు ● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం ● కాంగ్రెస్లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్ ● బీఆర్ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం ● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి.. ● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. బీఫాంలు ఎవరికో.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్తోపాటు అటు బీఆర్ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే.. గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్తో టచ్లోకి.. ఆ వెంటనే.. టికెట్ల నిరాకరణతో నారాజ్లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. -
ముగిసిన నామినేషన్ల పర్వం
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉండగా.. మూడు రోజుల్లో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 541 నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజున అభ్యర్థులు భారీగా రావడంతో ఉదయం 10.30 నుంచి రాత్రి 7 వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. మొత్తంగా 398 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు. ● నారాయణపేట పుర పరిధిలో 24 వార్డులు ఉండగా.. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 121 మంది 202 నామినేషన్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ 72, బీజేపీ 41, బీఆర్ఎస్ 48, ఎంఐఎం 6, టీడీపీ 2, ఇతరులు 29 మంది ఉన్నారు. ● మక్తల్లో 16 వార్డులుండగా.. కాంగ్రెస్ 42, బీజేపీ 32, బీఆర్ఎస్ 23, బీఎస్పీ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ● కోస్గిలో 16 వార్డులకుగాను కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 37, బీజేపీ 22, ఇతరులు 12 నామినేషన్లు వేశారు. ● మద్దూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 89 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో నాలుగు పురపాలికలు..72 వార్డులు చివరి రోజు 398 దాఖలు మూడు రోజుల్లో మొత్తం 541 నామపత్రాల స్వీకరణ -
ఎన్నికల నియమావళి పాటించాలి
కోస్గి రూరల్/మద్దూర్: పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఈసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతించాలని సూచించారు. అధికారులు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పులుంటే అభ్యర్థులతో సరి చేయించాలన్నారు. గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమం వేదికగా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయడం, మత విధ్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట పుర కమిషనర్, ఎన్నికల అధికారి నాగరాజు, మేనేజర్ అనిల్కుమార్, సీఐ సైదులు, ఎస్ఐ బాలరాజు ఉన్నారు. -
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలో శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్వాహన సేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు. -
రెండో రోజు 124 నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండో రోజైన గురువారం 124 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 36 నామినేషన్లు వచ్చాయి. అందులో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ తరఫున 11 మంది, ఏఐఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి 12 మంది, టీడీపీ తరఫున ఒకరు, ఇండిపెండెంట్గా ఒకరు నామినేషన్ వేశారు. మక్తల్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఎస్పీ నుంచి 6, బీజేపీ తరఫున 10, కాంగ్రెస్ తరఫున 15, ఎంఐఎం ఒకటి, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ల నుంచి 3 నామినేషన్లు అందాయి. కోస్గిలోని 16 వార్డులో 27మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మద్దూర్లో 16 వార్డులకు గాను 21 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 6, బీజేపీ 5, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు. -
పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పార దర్శకంగా నిర్వహించాలని.. ముఖ్యంగా చెల్లని ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ముగిసిన తర్వాత భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్లను అన్ సీల్ చేసి.. కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే విషయాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కౌంటింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు. సందేహాలు నివృత్తి చేసుకోవాలి కోస్గి రూరల్: ఎన్నికల అధికారులకు తలెత్తే సందేహాలను విధిగా నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఓలకు పలు సూచనలు చేశారు. నారమినేషన్ పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే వారి వాహనాలను కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే నిలిపివేసేలా పోలీసుల భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆభ్యర్థి వెంట సాక్షి, ప్రతిపాదకుడిని మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ సైదులు, డీటీ కరుణాకర్ ఉన్నారు. -
జిల్లాలో 4 చెక్పోస్టుల ఏర్పాటు: ఎస్పీ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ డా.వినీత్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టేందుకు 4 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాటిలో రెండు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, రెండు జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఉన్నాయన్నారు. అదే విధంగా 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో 4 ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్, 4 స్టాటటిక్ సర్వేలెన్స్ టీంలు చెక్పోస్టుల వద్ద, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు అందరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మక్తల్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ అన్నారు. మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కౌంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలను శాంతియుతంగా, స్చేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే పోలీస్శాఖ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఆర్ఎస్ఎస్, 144 సీఆర్పీసీ అమలులో ఉంటుందని.. నిబంధనల మేరకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, ఎస్బీ ఎస్ఐ నరేశ్, నవీద్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
ఎరువుల విక్రయాల్లో పారదర్శకత
కోస్గి రూరల్: యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా బుక్ చేసుకోవడంతో పాటు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత చేపట్టవచ్చని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మన గ్రోమోర్లను తనిఖీ చేశారు. డీలర్లు, అగ్రోస్, పీఎసీఎస్ నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, ఏడీఏ రామకృష్ణ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి మద్దూరు: మున్సిపల్ కేంద్రంలోని పీఏసీఎస్, మన గ్రోమోర్ ఎరువుల దుకాణాదారులు రైతులకు యురియా యాప్ బుకింగ్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రైతులకు యూరియా పంపిణీ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ జోలికొస్తే పాతరేస్తాం
మక్తల్: రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడు తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి తన నివాసం నుంచి నారాయణపేట క్రాస్రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి.. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్రెడ్డి.. ప్రతిపక్ష నేతలను కూడా జైలుకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది తన దివాలకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. మక్తల్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూది బాల్రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఉద్యమనేత కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేశారని అన్నారు. తమ అధినేతను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, నాయకులు చిన్నహన్మంతు, శ్రీనివాస్గుప్తా, గాల్రెడ్డి, శ్రావణ్, ఈశ్వర్, నేతాజీరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మొగులప్ప, ఒంకార్, ఆంజనేయులు ఉన్నారు. -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీవైపు చూపు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నారాయణపేటలో కాంగ్రెస్, ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
వైభవంగా హంసవాహన సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పూజలు చేసి తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణలతో స్వామివారి సేవ ముందుకు సాగింది. శుక్రవారం రాత్రి స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
వెంకటేశా.. నమోస్తుతే...
● మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. పల్లకీలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి స్వామివారిని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. తిరుచ్చిసేవలో స్వామివారు బంగారు ఆభరణాలు, వివిధ పూల అలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. గురువారం స్వామివారికి హంసవాహనసేవ నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
నారాయణపేట: పుర ఎన్నికల వేళ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. బుధవారం నారాయణపేట, మద్దూర్లోని నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి భద్రత ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ర్యాలీలు, వాహనాలకు మైక్ల ఏర్పాటుకుగాను ముందస్తుగా పోలీస్శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్శాఖ కట్టుబడి ఉందని, ఇంతకుముందు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు. అదేవిధంగా పుర ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట ఎస్ఐ నరేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసులు ఉన్నారు. -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
మాగనూర్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు కస్తూర్బా విద్యాలయను తనిఖీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రశంసించారు. రికార్డుల నిర్వహణ నియమావళి ప్రకారం కొనసాగుతుందని అభినందించారు. ఆయన వెంట మండల విద్యాధి కారి మురళీధర్రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. జాగ్రత్తలు పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దాం కోస్గి రూరల్: జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపడంతో ప్రమాదాలు తగ్గించవచ్చని జిల్లా రవాణాశాఖ అధికారి బోధిశ్రీ జ్యోతి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత మాత్రమే వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జనార్దన్రెడ్డి, సిద్రాములు, వార్ల మల్లేషం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో రోడ్డుపై సిగ్నల్స్ను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, డ్రైవ్ చేసేటప్పుడు సెల్ఫోన్లు కూడా మాట్లాడొద్దని సూచించారు. అడిషనల్ డిఎస్పీ రత్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్రావు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు, పీయూ అధికారులు కృష్ణయ్య, రవికుమార్, గాలెన్న, అర్జున్కుమార్, చిన్నాదేవి, ఈశ్వర్కుమార్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. -
ఆడపిల్ల తల్లిదండ్రులకు బలం
నారాయణపేట: ఆడపిల్ల తల్లిదండ్రులకు బాధ్యత కాదని.. వారి బలమని అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె.అవినాష్ అన్నారు. ‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలోని సఖికేంద్రంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏటా జనవరి 24న దేశమంతటా ‘జాతీయ బాలికా దినోత్సవం‘ జరుపుకొంటామని, బేటీ బచావో – బేటీ పడావో వంటి పథకాలు బాలికల రక్షణ, విద్యకు ఎంతగానో తోడ్పడతాయన్నారు. బాలికలు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం కాగా.. నేటికీ వివక్షకు గురవుతున్నారని తెలిపారు. లింగ వివక్ష లేని వాతావరణాన్ని సృష్టించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, హక్కుల రక్షణ, బాల్య వివాహాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆడపిల్లను చదివిస్తేనే వారు కుటుంబాలకు మద్దతు గా నిలబడగలరన్నారు. పలువురు వక్తలు చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, బాలికల రక్షణకు ఉపయోగపడే పథకాలు, పోక్సో చట్టం, సామాజిక రక్ష ణ, బాల కార్మిక వ్యవస్థ, తదితర వాటిపై అవగాహ న కల్పించారు. టోల్ఫ్రీ నంబర్ 15100కి కాల్చేసి ఉచిత న్యాయ సాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్గౌడ్, సఖిసెంటర్ కో–ఆర్డినేటర్ క్రాంతిరేఖ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరిష్మా, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది జి.నర్సింహ, డి.నర్సింహ, నర్సింహ, సఖిసెంటర్ సోషల్ వర్కర్ కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాకేంద్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఎస్పీ డా. వినీత్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ నోడల్ అధికారి ఎండీ రియాజ్ హూల్హక్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లాకేంద్రంలోని పలు ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించారు. ఓవర్ స్పీడ్కు అడ్డుకట్ట వేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. కలెక్టర్, ఎస్పీకి వివరించి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని.. ముఖ్యంగా హోటళ్లు, బ్యాంకులు, దుకాణాల ఎదుట రోడ్లపై వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లు వివరించారు. సంబంధిత బ్యాంకు మేనేజర్లు, హోటళ్లు, దుకాణాల యజమానులకు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి వ్యాపార సంస్థ విధిగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని వాహనాలను రోడ్లపై కాకుండా కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలంతా పోలీస్శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య, ఆర్టీఏ సభ్యుడు పోషల్ రాజేష్ తదితరులు ఉన్నారు. -
నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణతో మొదలుకొని పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు, స్ట్రాంగ్రూంల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ సూచించారు. వీసీలో డా.వినీత్, ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, నోడల్ అధికారులు సాయిబాబా, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్, రహమాన్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణలో ఉద్యోగుల పాత్ర కీలకం
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఎస్పీ డా.వినీత్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆశావర్కర్లు, మెప్మా, సెర్ఫ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 10 రోజులుగా రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో కలిసి బ్లాక్ స్పాట్స్ను సందర్శించినప్పుడు వారి బాధలు వర్ణనాతీతమని.. ఒక కుటుంబంలో పెద్దను కోల్పోతే ఆ కుటుంబమంతా ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చేతులు, కాళ్లు విరగడం లేదా శాశ్వత వికలత్వం కలిగితే జీవితాంతం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రతి ఉద్యోగి రోడ్డు భద్రత నియమాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి.. మరో 10 మందికి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడినవారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూరు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
నారాయణపేట ఎడ్యుకేషన్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 8 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు పుర కమిషనర్ నర్సయ్య తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయా వార్డులకు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. యూరియా పక్కదారి పడితే చర్యలు కోస్గి రూరల్/మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ యూరియా యాప్ ద్వారానే వ్యవసాయదారులకు యూరియా విక్రయాలు చేపట్టాలని డీఏఓ జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం కోస్గి, మద్దూరు, గుండుమాల్లోని ఎరువుల విక్రయ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యూరియా యాప్తో రైతులకు విక్రయాలు చేపట్టడం వల్ల యూరియా లభ్యత స్పష్టంగా తెలుస్తుందన్నారు. యూరియాను పక్కదారి పట్టిస్తే సంబంధిత ఫర్టిలైజర్ దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కోస్గి వ్యవసాయ కార్యాలయంలో కొనసాగుతున్న ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. డీఏఓ వెంట ఏడీఏ రామకృష్ణ, ఏఓ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. ‘పది’లో వందశాతంఉత్తీర్ణత సాధించాలి నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. మంగళవారం నారాయణపేట మండలంలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అభ్యాస దీపికలో ఉన్న ముఖ్యాంశాలను చదివితే సులభంగా వార్షిక పరీక్షలు రాయవచ్చన్నారు. వీక్లీ, రీవిజన్ టెస్టులను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రాయాలని సూచించారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు క్రమ పద్ధతిలో దిద్దాలని.. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఈఓ వెంట హెచ్ఎం భారతి, భానుప్రకాశ్, నర్సింహ, నిర్మల, రఘురాంరెడ్డి తదితరులు ఉన్నారు. పీఎఫ్తో కార్మికులకు ప్రయోజనం అమరచింత: కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ పీఎఫ్ కార్యాలయ అధికారి రుధీర్రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో సమావేశమై ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన, ఎంప్లాయి ఎన్రోల్మెంట్ కాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. కంపెనీ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. యాజమాన్యం ప్రతి కార్మికుడు, ఉద్యోగికి పీఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్ అందేలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో కంపెనీ సీఈఓ ఎం.చంద్రశేఖర్, కంపెనీ డైరెక్టర్ పొబ్బతి అశోక్, సిబ్బంది మహేష్తో తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటా రూ.10,555
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 10,555, కనిష్టంగా రూ. 4,600 ధర పలికింది. అదే విధంగా ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8,639, కనిష్టంగా రూ. 7,151, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,589, కనిష్టంగా రూ. 7,080 ధరలు పలికాయి. ఉత్సాహంగా అండర్–16 జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్లు గోపాలకృష్ణ, ముఖ్తార్అలీ, క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు. ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. వారం రోజులపాటు కొనసాగిన ఉత్సవాల్లో ఆలయ అర్చక బృందం స్వామివారికి నిత్యారాధన, హోమం, పూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ధ్వజ అవరోహణం, పుష్పయాగం, పురవీధుల్లో శేషవాహనసేవ నిర్వహించారు. -
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం
నారాయణపేట: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ.. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పునరంకితమవుదామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. సాధించిన ప్రగతిని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా.. సంక్షేమంలో సరికొత్త అధ్యయనం సృష్టించేలా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన.. నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిందని వివరించారు. రూ.574 కోట్లతో రైతు రుణమాఫీ.. జిల్లాలో 65,631 మంది రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం రూ.574 కోట్లు విడుదల చేసిందన్నారు. రైతుభరోసా వానాకాలం–2025కు గాను 1,79,154 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.261 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతుబీమా 2025–26కు గాను 1.18 లక్షల మంది అర్హులు కాగా.. వివిధ కారణాలతో 261 మంది మృతిచెందారని.. వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున అందించి అండగా నిలిచినట్లు కలెక్టర్ వివరించారు. అదే విధంగా జిల్లాలో 117 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి.. 19,234 మంది రైతుల నుంచి రూ. 335 కోట్ల విలువైన 1,40,266 టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 500 చొప్పున రూ. 43కోట్ల బోనస్ రైతులకు అందించామన్నారు. ధన్వాడ మండలంలోని కిష్టాపూర్లో 50 మంది రైతులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులతో రూ. 59.88లక్షలతో విద్యుత్ సదుపాయం, వ్యవసాయ బోర్లు, మొదటి పంట సహాయం అందించినట్లు తెలిపారు. ● రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్, డీజిల్ బంక్ను నారాయణపేటలో రూ. 1.30 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించామన్నారు. పెట్రోల్బంక్ను మహిళలచే విజయవంతంగా నడుపుతూ ఇప్పటి వరకు రూ.12.93 లక్షల లాభం పొందినట్లు వివరించారు. ● ఉపాధి హామీ పథకం ద్వారా 1,06,904 జాబ్ కార్డుదారులకు 4,183 లక్షల పనులు సమకూర్చడం జరిగిందన్నారు. చేయూత పింఛన్ లబ్ధిదారులు 73,611 మందికి ప్రతినెలా రూ. 19కోట్లు పంపిణీ చేయడంతో పాటు బ్యాంక్ లింకేజీ ద్వారా 6,861 సంఘాలకు రూ. 179 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో 3,445 మంది కూలీల కుటుంబాలకు రూ. 6వేల చొప్పున బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేశారన్నారు. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ.. జిల్లాలో చేపట్టిన చదువుల పండగలో భాగంగా ఎంపిక చేసిన 38 పాఠశాలల్లో ఫైనాన్షియల్ లిటరసీ, 19 పాఠశాలల్లో కేరీర్ గైడెన్స్, మరో 12 పాఠశాలల్లో ఆష్రానమి క్లబ్స్ ఏర్పాటు, 12 పాఠశాలల్లో వేద గణితం కార్యక్రమం, 20 పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తూ 12,800 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 478 యంగ్ ఆరేటర్ క్లబ్ల ఏర్పాటు, పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేసేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా క్యూఆర్ కోడ్ విధానంతో మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని కోస్గిలో ప్రారంభించారని.. ఈ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు యంత్ర అభ్యాసం, డేటా సైన్స్ కోర్స్ల్లో ప్రవేశం కలదన్నారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. నేతన్నకు చేయూత.. నేతన్న పొదుపు కింద 904 మంది చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతాలను తెరిపించి.. రూ. 29.95 లక్షలు అందించినట్లు కలెక్టర్ వివరించారు. నేతన్న బీమా కింద 17 మంది కార్మికులకు రూ. 85లక్షలను వారి నామినీ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ డా.వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, ఏఎస్పీ రియాజ్ హాల్ హాక్, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. జిల్లాలో ఇప్పటి వరకు 2,24,90,000 మంది మహిళలకు రూ.106.72 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే వంటగ్యాస్ పథకం కింద జిల్లాలో 70,056 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 9.33కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. గృహజ్యోతి పథకంతో 81,788 మంది లబ్ధిదారులకు 2024 జూన్ నుంచి ఈ నెల వరకు జిల్లాలో రూ. 38కోట్ల సబ్సిడీ అందిందన్నారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు జిల్లాలో 6,362 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 1,276 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. లబ్ధిదారులకు రూ. 58.78 కోట్లు అందించామన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో 2,529 మందికి రూ. 25కోట్లు, , షాదీ ముబారక్తో 260 మందికి రూ. 2కోట్లు అందించడం జరిగిందన్నారు. భూ పరిహారం ఎకరాకు రూ.20లక్షలు మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2945.50 కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందన్నారు. ఇందుకు 2,705 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల చొప్పున నష్టపరిహారం 3,591 మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 433 ఎకరాల భూ నిర్వాసితులు 634 మందికి రూ. 90కోట్లు అందించడం జరిగిందన్నారు. ఇంకా దశల వారీగా భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పంపిణీ చేస్తామన్నారు. ప్రజా సంక్షేమంలో సరికొత్త అధ్యయనం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన.. నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి మహిళా సమాఖ్య పెట్రోల్బంక్తో రూ.12.93 లక్షల లాభం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు -
భక్తుల ఇంటికే బంగారం..
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tgsrtclogistics. co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టీసీ వినూత్న కార్యక్రమం రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం -
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
నారాయణపేట: దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.., దిల్ యే ఇండియా.. మా తుజే సలాం.., దేశ్ రంగీలా రంగీలా.., మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.., ఇదే మన భారతం.. ఇలలో పూలరథం.. అనే దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ నత్యాలతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డా.వినీత్ అభినందించారు. -
రోడ్డు భద్రత నియమాలతో ప్రాణాలు సురక్షితం
నారాయణపేట: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని జిల్లా రవాణాశాఖ అధికారి మేఘాగాంధీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, ఇతర వాహనాల డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలని సూచించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, అతివేగం, డ్రంకెన్ డ్రైవ్తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐ భోదిశ్రీ, ఏఎంవీఐ దీప్తి, సాయితేజరెడ్డి, ఆర్టీఏ మెంబర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి’
నారాయణపేట: ఓటు హక్కు ద్వారా నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి వీలుంటుందని, 18 ఏళ్లు పైబడిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆమె జెండా ఊపి కలెక్టరేట్ వద్ద ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్లు, దివ్యాంగ, సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించారు. అనంతరం కళా బృందం ఓటరు చైతన్య గీతాలు ఆలపిస్తుండగా.. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ శాసన్పల్లి రోడ్డు, ఆర్డీఓ కార్యాలయం, పాత బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు చేరుకుంది. విద్యార్థులు చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి ఓటరు చైతన్యం నినాదాలు చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్డీఓ రాంచందర్నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, డీపీఆర్ఓ రషీద్, ఎంఈఓ బాలాజీ, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు
నర్వ: ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నర్వ మండల ఎంపీడీఓ శ్రీనివాసులు ఎంపిక కా వడంతో మండల పరిషత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీడీఓను జిల్లా ఎంపీడీఓ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సముచితమేనన్నారు. ఆయన ఎన్నికపై ఎంపీఓ రాఘవేందర్, ఏపీఓ గౌరిశంకర్గౌడ్, ఏపీఎం చంద్రశేఖర్, ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్లు గోపాల్, రవి, శ్రావణి, పంచాయతీ కార్యదర్శులు రాజబాబు, గిడెన్, శ్రీకాంత్రెడ్డి, అర్జున్ తదితరులు అభినందనలు తెలిపారు. అందరికీ శ్రేష్ఠమైన ఆహారం అందించాలి నారాయణపేట ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ భారతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎన్ఎంఎన్ఎఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం గ్రామ భారతి నారాయణపేట అధ్యక్షుడు జయచంద్రమోహన్ వ్యవసాయ క్షేత్రంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. కృషి సఖీలకు నారాయణపేటలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ బాధ్యతలు, ప్రతి నెల వారికి గౌరవ వేతనంతో పాటు ఎలాంటి ప్రయోజనాలు చేకురాతాయో తెలియజేశారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా గ్రామ భారతి గౌరవ అధ్యక్షుడు, నాబార్డ్ పూర్వ సీజీఎమ్ మోటూరి సూర్యకళ మాట్లాడుతూ ప్రతి నెల జయచంద్ర వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖీలకు ధృవీకరణ పత్రాలు, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో రఘోత్తమ ఆచార్యలు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కన్వీనర్ వెంకోబా, గ్రామ భారతి నారాయణపేట ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, దేవేందర్ రాజు, ముకుందరెడ్డి, జ్ఞానేశ్వర్, శిక్షకుడు రాజేష్, పాలమూరు గ్రామ భారతి అధ్యక్షుడు రాజనరసింహ, నారాయణపేట రైతులు పాల్గొన్నారు.ఽ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా దామరగిద్ద: కేంద్ర ఐఈఎస్కు చెందిన ఆర్మీ ఇంజినీరింగ్ సర్వీస్ ట్రెయినీ బృందం ఆదివారం మండల కేంద్రంలో పర్యటించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సమక్షంలో గ్రామంలో సీఎస్పీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించడంతో వ్యవసాయ కూలీలతో మాట్లాడి పలు వివరాలను సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వయం సమృద్ధి పథకాలను అమలు తీరును అడిగి తెలుసు కున్నారు. రైతుభరోసా, సీఎస్పీ, సోషియో ఎకనామిక్ లబ్ధిదారులతో మాటాడారు. కేంద్ర బృందం సభ్యుల్లో సూరజ్కుమార్, రోహిత్కుమార్, అమన్ ప్రతాప్సింగ్, రాజేశ్, మృంత్యుజయ్ పాత్ర ఉన్నారు. మరో రెండు రోజుల పాటు గ్రామంలో మహిళ సమాఖ్య, సీతాఫల్ ప్రాసెసింగ్ నిర్వహణ, తదితర కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. 25ఎన్ఆర్పిటి402–210083: సీఎస్పీ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం సభ్యులు -
భక్తిశ్రద్ధలతో గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం
మక్తల్: మండలంలోని మాద్వార్ గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండపై నుంచి లక్ష్మీవేంకటేశ్వరస్వామిని తీసుకొచ్చి రథోత్సవంపై అలంకరించారు. వేలాది భక్తుల నడుమ రథోత్సవాన్ని బాల ఆంజనేయస్వామి ఆలయం లాగారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, సర్పంచు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్రెడ్డి, కట్ట సురేస్, మాజీ ఎంపీటీసీ బాల్రాంరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. కర్నిలో గుండురంగస్వామి రథోత్సవం మండలంలోని కర్ని గ్రామ శివారులోని గుండురంగస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంతకముందు కల్యాణోత్సవం చేశారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. -
ప్రపంచంతో పోటీ పడేలా ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’
మక్తల్: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని గొల్లపల్లిలో 25 ఎకరాల్లో రూ. 250 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెడుతుందన్నారు. గతంలో ఎవరూ చేయని అభివృద్ధి నేడు నియోజకవర్గంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పుర పోరు.. ఏర్పాట్ల జోరు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు మున్సిపల్ అధికారులను ఆదేశించాం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడిచ్చిన అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు, పోలీసులకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి. – సిక్తాపట్నాయక్, కలెక్టర్, నారాయణపేట నారాయణపేట: ఏ క్షణమైనా బల్దియా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో మున్సిపల్ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడం.. నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల ఎంపిక చేసి శిక్షణ సైతం ఇచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పేపర్లు, వైట్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ, పింక్ కవర్లు, ఇంకు, పేపర్ సీళ్లు, ట్యాగ్స్, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల నిబంధనల బుక్స్, ఇతర సామగ్రి కార్యాలయాలకు చేరాయి. నామినేషన్లు స్వీకరించే కార్యాలయాలు, స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ సెంటర్ల కోసం భవనాల ఎంపిక సైతం అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిలో ర్యాంపులు, లైటింగ్, ఫర్నీచర్, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఆర్ఓలదే బాధ్యత.. ఈసారి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించారు. అందులోనూ గెజిటెడ్ హోదా ఉన్నవారినే ఆర్వోలుగా నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఆయా వార్డులకు ఆర్వోలే బాధ్యత తీసుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనంగా ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల అనంతరం కౌన్సిలర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేసే వరకు ఆర్ఓ బాధ్యుడిగా ఉండాలి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉన్నాయి. మద్దూర్ మున్సిపాలిటీలో.. మద్దూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 6 నామినేషన్ల కేంద్రాలు, నలుగురు జోనల్ అధికారులు, 42 బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. కోస్గి మున్సిపాలిటీలో.. కోస్గిలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 8 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జోనల్ అధికారులు నలుగురు, బ్యాలెట్ బాక్సులు 82, కౌంటింగ్ కేంద్రం ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీలో.. మక్తల్లో నామినేషన్ కేంద్రాలు 8, జోనల్ అధికారులు నలుగురు, 76 బ్యాలెట్ బాక్సులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో.. నారాయణపేటలో నామినేషన్ కేంద్రాలు 4, జోనల్ అధికారులు 8 మంది, బ్యాలెట్ బాక్సులు 140, కౌంటింగ్ కేంద్రం యాద్గీర్ రోడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో వార్డులు ఆర్ఓలు, ఏఆర్ఓలు మున్సిపాలిటీ వార్డులు పీఎస్లు ఆర్వోలు ఏఆర్వోలు నారాయణపేట 24 56 10 10 మక్తల్ 16 38 08 08 కోస్గి 16 34 08 08 మద్దూర్ 16 21 06 06 మొత్తం 72 149 32 32 జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..72 వార్డులు నామినేషన్ స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పత్రాల స్వీకరణ, పరిశీలన చేయనున్నారు. మెన్పవర్ మేనేజ్మెంట్, వెబ్ కాస్టింగ్, కోడ్ అమలు, వ్యయ పరిశీలన, సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ట్రాన్స్ఫోర్ట్, శిక్షణ నిర్వహణ, మెటీరియల్ నిర్వహణ, మీడియా కమ్యూనికేషన్, నివేదికల తయారీ తదితర విధులకు సంబంధించి నోడల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు పోలీసు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం 149 పోలింగ్ కేంద్రాలు, 32 మంది ఆర్ఓలు ఎన్నికలు ముగిసే వరకు ఆర్వోలదే పూర్తి బాధ్యత పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాటు -
పాలమూరు పద్మం
నారాయణపేట● నగరవాసి పి.విజయానంద్రెడ్డిని వరించిన అవార్డు ● వైద్యరంగంలో 44 ఏళ్ల సేవలకు విశిష్ట పురస్కారం ● క్యాన్సర్పై అవగాహనకు అనేక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లాకు మూడోసారి దక్కిన గౌరవం ..చెన్నకేశవుడి చెంతకే గంగాపురంలో ఆదివారం రాత్రి నిర్వహించిన లక్ష్మీచెన్నకేశవుడి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uమహబూబ్నగర్లోని పాలకొండ వెంకట్రాంరెడ్డి, దమయంతి దంపతుల కుమారుడు విజయానంద్ రెడ్డి 1982లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులపాటు భూత్పూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రేడియేషన్ అంకాలజీలో ఎండీ, డీఎన్బీ పూర్తి చేసి గత 30 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలోని అంకాలజీ విభాగం ప్రొఫెసర్ హెచ్వోడీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శశికళ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్డ్ కాగా.. ఇద్దరు కొడుకులలో ఒకరు వైద్యుడిగా, మరొకరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. పాలమూరు సిగలో మరో పద్మశ్రీ చేరింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మొగులయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తాజాగా పాలమూరు నగరంలోని వల్లబ్నగర్కు చెందిన వైద్యుడు పాలకొండ విజయానంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్రెడ్డి గత 44 ఏళ్లుగా వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ పురస్కారం దక్కిందని కొనియాడారు. – సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్/ పాలమూరు జాతీయ, -
యముడి వేషంతో వినూత్న ప్రచారం
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసుశాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నారాయణపేట పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హోంగార్డు లింగం యముడు వేషధారణ ధరించి.. వాహనదారులకు హెల్మెట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవ్ నివారణ, సీట్ బెల్టు వినియోగం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం, రాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కళాత్మకంగా, భావోద్వేగంగా అందించిన సందేశం ప్రజల మనసుల్లో బలమైన ప్రభావం చూపిందని పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. – నారాయణపేట -
మెడికల్ సీట్లు పెరిగే అవకాశం?
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా పాల్గొన్నారు. 150 సీట్లతో 2016లో పాలమూరు ప్రభుత్వ కళాశాల ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
బాలికల సంరక్షణ అందరి బాధ్యత
నారాయణపేట రూరల్: రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా బాలికలదేనని.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కోర్టు జూనియర్ సివిల్జడ్జి బి.సాయిమనోజ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలు బాలికల రక్షణ, విద్యకు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. బాలికల ఉజ్వల భవిష్యత్కు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు సహకరించాల్సిన అవసరముందన్నారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, సాధికారత అందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉండేలా చేయవచ్చని అన్నారు. అనంతరం బాలల సంరక్షణ చట్టాలు, చైల్డ్ హెల్ప్లైన్ 1098 నంబర్పై అవగాహన కల్పించారు. టోల్ఫ్రీ 15100 నంబర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.లక్ష్మీపతిగౌడ్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందు నామాజీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరిష్మ, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు. -
ఓటే వజ్రాయుధం..
పగిడ్యాల్లో ‘కృష్ణతాత’ గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణతాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. –8లో uహక్కు.. బాధ్యతలపై అవగాహన భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతలను ప్రజలకు తెలియజేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మద్దూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. మద్దూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలోనే 6 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఇందుకోసం పాత, కొత్త భవనాలను ఉపయోగించుకోవాలని కమిషనర్ శ్రీకాంత్ను ఆదేశించారు. అదే విధంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల భవనాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్ ఉన్నారు. ముంబై మారథాన్లో డీఎస్పీకి పతకాలు నారాయణపేట: ముంబై మారథాన్ 2026లో జిల్లా నుంచి పాల్గొన్న డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్ అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కి.మీ.) లాంగ్ రన్లో ఆయన పాల్గొని ఉత్తమ టైమింగ్ (5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్లు)తో మారథాన్ విజయవంతంగా పూర్తిచేసి రెండు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ ఆయనను మెడల్స్తో సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభకనబరచడం డీఎస్పీ మహేశ్ ప్రత్యేకత అని అన్నారు. ఆయన సాధించిన విజయం యువత, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా డీఎస్పీ నల్లపు లింగయ్య డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్కు శుభాకాంక్షలు తెలిపారు. అనాథలకు బాలసదన్ ఓ ఇల్లు: ఎంపీ మహబూబ్నగర్ రూరల్: మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ మెట్టుగడ్డలోని స్టేట్హోమ్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.34 కోట్ల నిధులతో బాలికల కోసం నూతనంగా నిర్మించిన బాలసదన్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలసదన్ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్కు బలమైన పునాది వేస్తున్నామని అన్నారు. అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న జిల్లా సంక్షేమశాఖ సిబ్బందిని ఎంపీ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్లో చేర్చి, వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్కు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ బాలసదన్లోని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా సంరక్షణ అందించాలని ఆదేశించారు. అనంతరం జాతీ య బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ డీకే అరుణ బాలసదన్ పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, శిశుగృహ మేనేజర్ గణేష్బాబు, బీజేపీ జాతీయ కౌన్సిల్మెంబర్ పద్మజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
వేరుశనగ క్వింటా రూ.9,500
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 9,500, కనిష్టంగా రూ. 5,050 ధర పలికింది. అలసందలు గరిష్టంగా రూ. 6,195, కనిష్టంగా రూ. 4,809, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,669, కనిష్టంగా రూ. 2,040, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,209, కనిష్టంగా రూ. 6,452, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,361, కనిష్టంగా రూ. 6,336 ధరలు వచ్చాయి. మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ఇన్చార్జిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నియమించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, భూత్పూర్ మున్సిపాలిటీకి ఏఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, దేవరకద్రకు మాజీ చైర్మన్ పల్లె రవి, కొత్తకోటకు పార్టీ సీనియర్ నేత పటేల్ విష్ణువర్ధన్రెడ్డిలను నియమించారు. అలాగే జోగుళాంబ జిల్లా పరిధిలోని గద్వాల మున్సిపాలిటీ ఇన్చార్జిగా శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్చార్జిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రాజీవ్సాగర్, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఉప్పల వెంకటేష్గుప్తాలను నియమించారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడొద్దు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళికపై శనివారం కలెక్టరేట్లో డీఆర్డీఓ, డీపీఓ, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఏఈలతో కమిటీ వేసి వచ్చే నెల 1 నుంచి 20 వరకు గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా.. లేదా అనేది పరిశీలించాలన్నారు. సమస్య ఉన్న చోట స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్, కోస్గి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కడా నుంచి నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో తాగునీటి పైపులైన్ల మరమ్మతు ఇతర పనులకు పంచాయతీ నిధులు లేదా జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో ఏ ఒక్క పంచాయతీలో తాగునీటి సమస్య ఉందనే ఫిర్యాదులు రావొద్దన్నారు. కాగా, జలశక్తి అభియాన్ అమలు తీరు జిల్లాలో సంతృప్తిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే నారాయణపేట 31వ స్థానంలో ఉందని, వచ్చే నెల వరకు జిల్లా ర్యాంకింగ్ పెంచాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈలు రంగారావు, శ్రీనివాస్ ఉన్నారు. ● ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విసిట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపికచేసిన ఊట్కూర్, దామరగిద్ద, నారాయణపేట మండలం సింగారం, మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీల్లో ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ బృందం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా 29 నుంచి 31వ తేదీ వరకు నారాయణపేట మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. సర్వేకు నోడల్ అధికారిగా డీఆర్డీఓ మొగులప్ప వ్యవహరిస్తారన్నారు. బాలికా సాధికారత సాధిద్దాం.. జిల్లాలో బాలికా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి.. వారిని అన్నివిధాలుగా ప్రోత్సహించాలన్నారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి రాజేందర్గౌడ్, డీపీఆర్ఓ రషీద్, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సింహ, ఇన్చార్జి డీసీపీ కరిష్మా, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నర్సింహులు, తిరుపతయ్య, వెంకట్, సాయి పాల్గొన్నారు. -
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
‘పేట’ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
● పదవులు శాశ్వతం కాదు.. ప్రజాసేవకే ప్రాధాన్యం ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట: పురపాలికతో పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల అభివృద్ధి తన బాధ్యతని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం సాయంత్రం పురపాలికలోని 24 వార్డుల్లో రూ.16.40 కోట్ల అభివృద్ధి పనులకు కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సెంటర్చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవితంలో పదవులు శాశ్వతం కాదని.. ప్రజల కోసం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. పేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, మైదానం అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. తనకున్న మిగతా శాఖల నుంచి కూడా రూ.5 కోట్లు కేటాయిస్తానని, ప్రతి వార్డుకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు పూర్తితో జిల్లాకు బిహార్ కూలీలు వలస వచ్చి ఇక్కడి పొలాల్లో నాట్లు వేస్తారన్నారు. 60 ఏళ్ల కల అయిన కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రంతో మాట్లాడి మంజూరు చేసుకొచ్చారని, ఇటీవలే క్యాబినెట్లో చర్చించి రూ.423 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ముందుగానే 96 శాతం రైతులను ఒప్పించి వారి భూములకు పదింతల నష్టపరిహారం ఇచ్చిన ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం, మంత్రుల ఇంట్లో తినే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సరిత హరినారాయణభట్టడ్ను చైర్పర్సన్ను చేసి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. రూ.వంద కోట్లు తీసుకొచ్చి పురపాలికను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవకుడిగా పార్టీ కండువా తీసి ఓటు అడిగేందుకు మీ ముందుకు వస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యకుడు సలీం, పార్టీ పట్టణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చేనేత రుణమాఫీ వర్తింపజేయడంతో అందుకు సంబంధించిన చెక్కులను శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి చేనేత కార్మికులకు అందజేశారు. 8 బ్రాంచ్లలో 106 మంది కార్మికులకు సంబంధించి రూ.65,93,854 మంజూరయ్యాయి. చెక్కులు అందుకున్న చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత, జౌళిశాఖ అధికారులు విజయ్కుమార్, బాబు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో ఆర్ఓల పాత్ర కీలకం
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: పురపాలికల ఎన్నికల నిర్వహణలో ఆర్ఓల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నారాయణపేట, మద్దూరు పురపాలికలకు సంబంధించిన ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని.. నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శిక్షణలో చెప్పిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ మొదలు స్క్రూటినీ, నామపత్రాల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పని చేశాం.. అన్ని తెలుసనే ధీమాలో ఉండకుండా మాస్టర్ ట్రైనర్లు చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇచ్చిన హ్యాండ్బుక్ను పూర్తిగా చదవాలని, అప్పుడే అన్ని విషయాలపై అవగాహన వస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి, పుర కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఓటరు ప్రతిజ్ఞ.. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, ఏఓ శ్రీధర్ పాల్గొని జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. -
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ కేరాఫ్ నడిగడ్డ ● ‘ఆధిపత్య’మే హద్దుగాఅసమాన రాజకీయాలు ● అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం ● నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. ● హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి –IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల: పెద్దల వద్దకు ‘వార్డుల’ లొల్లి గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
దేశం గర్వించదగ్గ మహానేత నేతాజీ
నారాయణపేట: స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులందరికీ ఆదర్శప్రాయుడని ఎస్పీ డా. వినీత్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని సుభాష్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎస్పీ పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతాజీ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, శ్యాంసుందర్గౌడ్, బండి శివరాంరెడ్డి, సిద్ధి వెంకట్రాములు, లక్ష్మీకాంత్, మో హన్, ప్రశాంత్కుమార్, అనుపూర్ సునీల్కుమార్, మన్నె జయప్రకాష్, బండి రాజు, హన్మంతు, గజ్జలి గిరన్న, యువత తదితరులు పాల్గొన్నారు. -
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి
నారాయణపేట: రాబోయే రోజుల్లో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాబోతుందని.. యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు కదం తొక్కాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ జిల్లా సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ మరింత బలోపేతం కావాలంటే యువత ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని, అందుకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ యువతకు అధికసంఖ్యలో స్థానాలు కేటాయించిందని.. రానున్న పురపాలిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతకుముందు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, పీసీసీ సభ్యులు చిట్టెం అజయ్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ విజయ్కుమార్, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శివంత్రెడ్డి, కోట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తింపు కోస్గి: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ వర్తింపజేసిందని జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబు, ఏడీఓ లావణ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఉన్ని సహకార సంఘంలో పని చేస్తున్న రెండు సొసైటీలకు రుణమాఫీ చెక్కులను అందజేసి మాట్లాడారు. పోతిరెడ్డిపల్లి సిల్క్ సంఘంలోని 17 మంది సభ్యులకు రూ. 8,24,454 లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. నేడు ఉచిత వైద్య శిబిరం నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని వీరసావర్కర్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉచిత చర్మ సంబంధిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గందె ఉమాకాంత్ తెలిపారు. ప్రముఖ డర్మటాలజిస్ట్ డా. శృతిశ్రీ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలకు శ్రీసాయి ఆస్పత్రి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. -
వేరుశనగకు రికార్డు ధర
● బాదేపల్లి, కల్వకుర్తి మార్కెట్లో క్వింటా రూ.10వేలకు పైనే.. ● ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర జడ్చర్ల/నారాయణపేట/కల్వకుర్తి రూరల్/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా క్వింటా వేరుశనగ రూ.10 వేలు దాటింది. శుక్రవారం బాదేపల్లితో పాటు కల్వకుర్తి మార్కెట్లో ఈ ధరలు పలకడం విశేషం. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం క్వింటా కు రూ.411 పెరిగింది. మార్కెట్కు 1,679 క్వింటాళ్ల విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ.10,280, కనిష్టంగా రూ.7,560 ధరలు లభించాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,263గా ఉంది. గతేడాది కనీసం మద్దతు ధర కూడా లేదని, త్వరలోనే క్వింటా ధర రూ.11 వేలు పలకవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,752, కనిష్టంగా రూ.2,649, కందులు గరిష్టంగా రూ.7,801, కనిష్టంగా రూ.5,766, మొక్కజొన్న రూ.1,921 ధరలు పలికాయి. కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగా గరిష్టంగా రూ.10,200, కనిష్టంగా రూ.9,369 ధర లభించింది. కందులు క్వింటాల్కు రూ.7,009 ధరకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ● నారాయణపేట మార్కెట్లో వేరుశనగ గరిష్టంగా రూ.8,935, కనిష్టంగా రూ.6,930, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,308, కనిష్టంగా రూ.6,369, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,270, కనిష్టంగా రూ.6,422గా దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.7,059, కనిష్టంగా రూ.6,959గా ధరలు నమోదయ్యాయి.


