-
ప్రజలందరికీ కృతజ్ఞతలు: చల్లా
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తమ అమూల్యమైన సమయాన్ని పాలమూరు ప్రాంతానికి కేటాయించి ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులతోపాటు గత కొన్ని నెలలుగా శక్తివంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయతీరాల వైపు నడిపించడానికి ఎత్తి జెండాను దించకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎప్పటికప్పుడూ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించి పోలింగ్ను శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు, పోలీస్ యంత్రాంగానికి ఆయన అభినందనలు చెప్పారు. ● గత నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొన్న చల్లా వంశీచంద్రెడ్డి పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారం హైదరాబాద్లోని తాను ఉంటున్న అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా పిల్లలు మహాక్షరెడ్డి, కృష్ణదేవారెడ్డితో కలిసి బొమ్మలతో ఆటలాడుకుంటూ సరదాగా ముచ్చటించారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దామరగిద్ద: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని విఠలాపూర్, గడిమున్కాన్పల్లి, దామరగిద్ద, బాపన్పల్లి గ్రామాల్లో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా దుకాణాల్లో ఎరువులు, విత్తనాల స్టాక్ రికార్డులను పరిశీలించారు. వానాకాలం పంటసాగుకు సంబంధించి రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విక్రయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్లో నమోదు చేయాలన్నారు. ఫిజికల్ బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ను సరిచూసుకోవాలని తెలిపారు. కాగా, రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే, స్థానిక స్థానిక వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పీయూకి ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న ఈవీఎంలలో ఓట్లు పోల్ కాగా, వాటిని పాలమూరు యూనివర్సిటీ (పీయూ) కి తరలించారు. మంగళవారం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా సమక్షంలో ఇక్కడి ఎగ్జామినేషన్ బ్రాంచి, లైబ్రరీ బ్లాక్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, ఫార్మస్యూటికల్ బ్లాక్లోని స్ట్రాంగ్రూం లలో భద్రపరిచారు. అనంతరం వాటికి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సీల్ వేశారు. కాగా, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూములతో పాటు చుట్టూ పూర్తిగా కేంద్ర బలగాలు, పోలీసులు కాపలా ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావుతో పాటు ఆయా పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సింగ్ అసిస్టెంట్లో ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సంయుక్త ఆధ్వర్యంలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సరిత సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ప్రథమ్ హెల్త్కేర్ శిక్షణ కేంద్రలో 2 నెల ల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ పూర్తి కాగా నే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18– 30 ఏళ్లలోపు అభ్యర్థులు పదో తరగతితోపాటు ఏఎన్ఎం, జీఎన్ఎం, డిప్లొమా లేక ఇతర ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. శిక్షణలో స్టడీ మెటీరియల్, యూనిఫాం ఉచితంగా ఇవ్వడంతోపాటు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు సెల్నం.90002 03952 సంప్రదించాలని కోరారు. -
బీజేపీ గెలుపును ప్రజలు నిర్ణయించారు
పాలమూరు: గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 10 శాతం ఓటింగ్ పెరిగిందని, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా 10 శాతం పెరిగిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అధికంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని ప్రజలు అధికంగా ఓటు వేస్తే.. ఈసారి మోదీని మరోసారి ప్రధానిని చేయడానికి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారన్నారు. ఎంపీ ఎన్నికల్లో డీకే అరుణ గెలవాలని ఎన్నికల కంటే ముందు ప్రజలు నిర్ణయానికి వచ్చిన పరిస్థితి చూశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు 8 సార్లు వచ్చాడని, కాంగ్రెస్ వాళ్లు ఎంత బెదిరించిన ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు చేయలేదనే విషయం ప్రజలకు తెలుసన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం వంద శాతం గెలిచి తీరుతామని, 2–3 లక్షల మెజార్టీ వస్తుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి బీజేపీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తే పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి నేను కృషిచేస్తానని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, రమేష్కుమార్, కిరణ్కుమార్రెడ్డి, పద్మవేణి, అంజయ్య, రామాంజనేయులు, కిషోర్, రాములు, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ అంచనాలు (శాతాల్లో)..
నాగర్కర్నూల్మహబూబ్నగర్9.81%10.33%27.74%26.99%45.84%45.15%57.17%58.92%68.04%66.21%71.66%69.01% -
తీర్పు.. ఇచ్చేశారు
మహబూబ్నగర్లో 71.66 శాతం.. నాగర్కర్నూల్లో 69.01 శాతం ● గత ఎన్నికలతో పోలిస్తే రెండు స్థానాల్లోనూ భారీగా పెరిగిన ఓటింగ్ శాతం ● బ్యాటరీ పరిశ్రమ వద్దంటూ ఎదిరలో గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ ● గుట్ట మైనింగ్ అనుమతులు నిలిపియాలని మైలారం వాసులు సైతం ● అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైలెంట్గా క్రాస్ ఓటింగ్..! ● భారీ భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంల తరలింపు ● గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. జూన్ 4న ఓట్ల లెక్కింపు మహబూబ్నగర్ లోక్సభలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం (సా.6 గంటల వరకు) అంచనా.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూ ల్: లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఇచ్చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే నాటికి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో 71.66 శాతం, నాగర్కర్నూల్లో 69.01 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్ పరిధిలో పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఎన్నికల సామగ్రిని పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో, నాగర్కర్నూల్ పరిధిలో జిల్లాకేంద్రంలోని నెల్లికొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలకు తరలించారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. రెండు లోక్సభ సెగ్మెంట్లలో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతం.. ● మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్, షాద్నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం ఆరు గంటల వరకు 71.66 శాతం ఓట్లు పోయ్యాయి. గత ఎన్నికల్లో 65.38 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.28 శాతం ఓటింగ్ పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది. ఈవీఎంల మొరాయింపు.. ● కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని పోలింగ్స్టేషన్ 67లో సాంకేతిక సమస్యతో ఈవీఎం మొరాయించింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన వాళ్లు అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 తర్వాత మరో ఈవీఎంను ఏర్పాటు చేయగా.. పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇదే మండలంలోని కొత్తపల్లి పోలింగ్స్టేషన్ 101లో, 83లో సైతం ఈవీఎంలు మొరాయించాయి. కానుకుర్తిలోని 69వ బూత్లో అరగంట పాటు ఆలస్యంగా ఆరంభమైంది. ● జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్లోని పోలింగ్ స్టేషన్ 81లో ఉదయం 11:30 గంటలకు ఈవీఎం మొరాయించింది. అధికారులు వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని 255 పోలింగ్ సెంటర్లో వీవీ ప్యాట్ మొరాయించగా.. అధికారులు సరిచేశారు. నవాబుపేట మండలంలోని లింగంపల్లి పోలింగ్ స్టేషన్ 15లో ఉదయం 7.15 గంటలకు కరెంట్ పోయింది. సుమారు 20 నిమిషాల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అప్పటి వరకు పోలింగ్ సిబ్బంది టార్చిలైట్ వెలుతురులో పోలింగ్ కొనసాగించారు. ● మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం కున్సిలోని పోలింగ్స్టేషన్ 74లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈవీఎం సతాయించింది. గంట పాటు పోలింగ్కు అంతరాయం కలిగింది. ఉట్కూర్లోని 37,38 బూత్లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఓటింగ్ కొనసాగింది. ● దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లిలోని పోలింగ్ స్టేషన్ 260లో ఈవీఎం మొరాయించింది. గంట తర్వాత ఆన్ కావడంతో పోలింగ్ కొనసాగింది. భూత్పూరు మున్సిపాలిటీలోని తొమ్మిదో బూత్లో కాసేపు ఈవీఎం మొరాయించింది. అధికారులు పరిద్ది వెంటనే పోలింగ్ ప్రారంబించారు. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ పలుచోట్ల మాత్రం ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా క ేటిదొడ్డి మండలం గంగన్పల్లిలో, నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వరబావిలోని రెండు పోలింగ్కేంద్రాల్లో, ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లిలో ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఈవీఎం మిషన్లను పునరుద్ధరించడంతో పోలింగ్ ప్రారంభమైంది అసెంబ్లీ స్థానం పోలింగ్ శాతం మహబూబ్నగర్ 65.35 దేవరకద్ర 73.47 జడ్చర్ల 76.70 షాద్నగర్ 76.42 మక్తల్ 70.85 నారాయణపేట 68.71 కొడంగల్ 70.14 నాగర్కర్నూల్ లోక్సభలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం (సా.6 గంటల వరకు) అంచనా.. ధన్వాడ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు అసెంబ్లీ స్థానం పోలింగ్ శాతం అచ్చంపేట 62.70 నాగర్కర్నూల్ 63.56 కొల్లాపూర్ 64.00 కల్వకుర్తి 72.51 అలంపూర్ 71.23 గద్వాల 74.93 వనపర్తి 66.56 ముగిసిన లోక్సభ ఎన్నికలు స్వల్ప తోపులాటలు.. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఉట్కూరు మండలం మల్లెపల్లి, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ మండలం మల్కాపూర్, పెర్కివీడు గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. -
సైలెంట్గా ‘క్రాస్’ ఓటింగ్ !
జనరల్ స్థానమైన మహబూబ్నగర్తో పాటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి 31 మంది, నాగర్కర్నూల్లో 19 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఉదయం మందకొడిగా.. తొమ్మిది తర్వాత కొంత పుంజుకోవడం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తగ్గడం.. చివరి రెండు గంటల్లో అధిక సంఖ్యలో ఓటర్లు బారులుదీరిన క్రమంలో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మహబూబ్నగర్ పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్రాస్ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ పార్టీకి చెందిన ఓట్లు వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి నాగర్కర్నూల్ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం చోటుచేసుకున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. -
ఓటేసిన కలెక్టర్
మహబూబ్నగర్ న్యూటౌన్: మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ పోలింగ్ సరళిని కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించారు. స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగం స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్యం విలువలు కాపాడే విధంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం టీచర్స్కాలనీ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లోని 113వ పోలింగ్ బూత్లో సోమవారం వంశీచంద్రెడ్డి దంపతులు ఓట్లు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నేను బూత్లో మొదటి ఓటు హక్కు వినియోగించిన వ్యక్తిగా గర్వపడుతున్నట్లు చెప్పారు. అంతకు ముందు టీడీగుట్ట తిరుమలనాథస్వామి ఆలయంలో చల్లా వంశీచంద్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వంశీచంద్రెడ్డి బైక్పై వెళ్లి పట్టణంలోని పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. మొదటి గెలుపు పాలమూరుదే.. పాలమూరు: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 15 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఇందులో మొదటి గెలుపు మహబూబ్నగర్దే అని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రం టీచర్స్కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈసారి ఎన్నికలకు వాతావరణం కూడా సహకరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచినా.. ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది లేదని, ప్రజలు బీజేపీకి ఓటు వేస్తామని ఫోన్ చేసి చెబుతున్నారన్నారు. ధర్మం కోసం ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశంలో అన్నివర్గాలు మోదీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. గురుకుంటలో ఓటేసిన మన్నె శ్రీనివాస్రెడ్డి నవాబుపేట: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, తాజా మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సోమవారం తన స్వగ్రామం మండలంలోని గురుకుంటలో ఓటు వేశారు. అనంతరం మండల కేంద్రంతోపాటు రుద్రారం గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని, ఆయన పాలనలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరి గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశారని, ఇప్పుడు హామీలను విస్మరిస్తున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతారని చెప్పారు. -
ఎదిర వాసుల పోలింగ్ బహిష్కరణ
మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని నాలుగో వార్డుకు చెందిన ఎదిర వాసులు పోలింగ్ను బహిష్కరించారు. ఈ వార్డు సమీపంలో అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు కొన్ని నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కాలుష్యంతో తమ బతుకులు ఆగమవుతాయంటూ అమరరాజా బ్యాటరీ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి పేరిట స్థానికులు కొన్ని రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలంటూ తీర్మానించుకున్న వారు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. అధికారులు వచ్చి సముదాయించినా.. సాయంత్రం వరకు స్పందించలేదు. ఇక్కడ మొత్తం 3,300 ఓట్లు ఉండగా.. 130 ఓట్లు పోలైనట్లు సమాచారం. -
No Headline
● ఊట్కూర్లో 37,38 బూత్లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు అప్రమత్తమై సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఓటింగ్ కొనసాగింది. మద్దూర్లోని 67 బూత్లో ఈవీఎం మొరాయించడంతో రెండు గంటల పాటు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత మంది ఓటు వేయకుండానే వెనుగిరిగారు. కానుకుర్తిలో 69 బూత్లో అరగంట పాటు ఆలస్యంగా ఆరంభమైంది. ● సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా.. పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలతో పోలింగ్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పాలమూరుకు బయలు దేరారు. జిల్లాలో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ (ఉన్నత) గ్రౌండ్ పాఠశాలలో గల 130వ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ సతీమణి శశికిరణ్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. ధన్వాడలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, కోయిలకొండ మండలం శేరివెంకటపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, పేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కుంభం శివకుమార్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ ఓటు వేశారు. జాజాపూర్ గ్రామపంచాయతీ పరిధి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ట్రాన్స్జెండర్ జనని ఓటు వేశారు. -
1300 మందితో బందోబస్తు
నారాయణపేట: పార్లమెంట్ ఎన్నికలకు 1300 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పోలీస్ వారు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలు నుంచి ఇప్పటివరకు రూ.1,48,96,300 నగదు, రూ.17,18,036 విలువ గల లిక్కర్, రూ.17లక్షల విలువ గల బంగారుం, రూ.31వేల విలువ గల వెండి, సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. -
రారండోయ్.. ఓటేద్దాం!
నారాయణపేటసోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024వివరాలు 2లో uబరిలో 50 మంది.. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో 31 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ తరపున చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు సాగనుంది. సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల పర్వానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఆదివారం సాయంత్రానికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఎన్నికల సామగ్రిని తరలించారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అలాగే ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు కృషిచేస్తున్నారు. సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికలను నిర్వహిస్తుండగా.. ఈసారి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ చేపట్టి.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. రెండు బ్యాలెట్ యూనిట్లతో.. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండేసి చొప్పున బ్యాలెట్ యూనిట్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి బ్యాలెట్ యూనిట్లో 1 నుంచి 16 వరకు అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉండగా.. మిగతా అభ్యర్థుల జాబితా రెండో బ్యాలెట్ యూనిట్లో ఉంటాయి. చివరి స్థానంలో నోటాకు అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 16,82,470మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది సీ్త్రలు, 42 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 2,59,260 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,937 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా వీటిలో 21 వరకు వివిధ గిరిజన తండాలు, మారుమూల పల్లెల్లో పోలింగ్ ఉపకేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు.నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 8,64,875 మంది పురుషులు, 8,73,340 మంది సీ్త్రలు, 39 మంది ఇతరులున్నారు. ఈ స్థానం పరిధిలో అత్యధికంగా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,057 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. వీటిలో 113 పోలింగ్ ఉపకేంద్రాలను చెంచుపెంటలు, గిరిజన ఆవాసాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఓటర్ల వివరాలుమహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం.. నియోజకవర్గం పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కేంద్రాలు మహబూబ్నగర్ 275 1,28,384 1,30,863 13 2,59,260 జడ్చర్ల 274 1,11,053 1,11,779 6 2,22,838 దేవరకద్ర 289 1,18,615 1,21,130 0 2,39,745 నారాయణపేట 270 1,16,497 1,19,682 3 2,36,182 మక్తల్ 284 1,19,809 1,24,363 1 2,44,173 కొడంగల్ 282 1,18,856 1,22,933 5 2,41,794 షాద్నగర్ 263 1,19,042 1,19,422 14 2,38,478 నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో..నాగర్కర్నూల్ 264 1,17,487 1,18,603 4 2,36,094 అచ్చంపేట 339 1,23,126 1,24,598 5 2,47,729 కొల్లాపూర్ 282 1,20,917 1,18,541 5 2,39,463 వనపర్తి 307 1,35,876 1,37,984 3 2,73,863 గద్వాల 303 1,25,644 1,30,982 11 2,56,637 అలంపూర్ 291 1,18,391 1,21,662 10 2,40,063 కల్వకుర్తి 271 1,23,434 1,20,970 1 2,44,405 లోక్సభ సమరానికి అంతా సిద్ధంపోలింగ్ శాతం పెంచేందుకు చర్యలుఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటుహక్కు వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు నీడ కోసం టెంట్లు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెంట్ సౌకర్యం, దివ్యాంగులకు ర్యాంప్ సౌకర్యం, అవసరమైన ఫర్నిచర్ సిద్ధంగా ఉంచారు. గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో 65.31 శాతం, నాగర్కర్నూల్ స్థానంలో 62.23 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి దీనిని పెంచేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ పార్లమెంట్లో 31 మంది..నాగర్కర్నూల్ బరిలో 19 మంది అభ్యర్థులు రెండు స్థానాల్లో మొత్తం 34,20,724 మంది ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటాపోటీ ప్రలోభాల పర్వంలో పార్టీలు తలమునకలు -
No Headline
నారాయణపేట: నేటి పోలింగ్కు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని సింగారం స్టేజీ సమీపంలోని శ్రీదత్త బృందవన్ కళాశాల దగ్గర ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 270, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 284 పోలింగ్ కేంద్రాలకు 2,624 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో 2,36,182 మంది ఓటర్లు, మక్తల్లో 2,44,173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. పేటలో మొత్తం 270 పోలింగ్ స్టేషన్లకు 31 రూట్లను, మక్తల్లో 284 పోలింగ్ స్టేషన్లకు 35 రూట్లను సిద్ధం చేశామని, అలాగే పేటలో 5, మక్తల్లో 4 మోడల్ పోలింగ్ కేంద్రాలు, అలాగే పేటలో 5, మక్తల్ మరో 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, ఒక్కో యువ ఓటర్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. -
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
నేను గెలిస్తే నా మొదటి ప్రాధాన్యత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్టే. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్కు జాతీయ హోదా తీసుకొస్తా. దీంతోపాటు రెండేళ్లలో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతా. పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు పాటుపడుతా. నిరుద్యోగ శాతం ఇక్కడే ఎక్కువగా ఉంది. ఈ మేరకు తగిన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి.. పూర్తిస్థాయిలో వలసలు నివారించేలా తగిన చర్యలు తీసుకుంటా. -
No Headline
‘తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే నెరవేరుస్తూ మన్ననలు అందుకుంటోంది.’ అని కాంగ్రెస్ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య బీమా, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ సరఫరా పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఎమ్మెల్సీ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ వంటి వాటికి బ్రేక్పడింది. కోడ్ ముగియగానే వాటిని అమలు చేస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సైతం ఆగస్టు 15లోపు చేస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు’ అని పేర్కొన్నారు. ‘ఇచ్చిన హామీలను అమలు కావడం లేదని ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి.. ఈ ఎన్నికలు పాలమూరు భవిష్యత్కు సంబంధించినవి.. గెలిస్తే పాలమూరుకు, ఢిల్లీకి వారధిగా ఉంటూ మహబూబ్నగర్ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా’ అని ఉద్ఘాటించారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీచంద్రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
● పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా నా మొదటి ప్రయార్టీ ● రెండేళ్లలో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ● పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం ● పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ అధికారంలో ఉన్నా..మహబూబ్నగర్నుపట్టించుకోలేదు.. ● వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ● ‘సాక్షి’తో కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్కు మద్దతుగా వనపర్తిలోని పాలిటెక్నిక్ క్రీడామైదానంలో శనివారం నిర్వహించిన జనసభలో ఆయన మాట్లాడారు. మైసిగండి, ఉమామహేశ్వరం, జోగుళాంబ అమ్మవారిని నమస్కరిస్తూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. రైతుకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతు కు రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని.. ఇవి అమలుకు నోచుకోలేదన్నారు. ప్రతి రైతుకు క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్, విద్యార్థులకు రూ.5 లక్షల రుణం, కళాశాలకు వెళ్లే ప్రతి బాలికకు స్కూటీ ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు.. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు అమిత్షా వెల్లడించారు. రూ.820 కోట్లతో కల్వకుర్తి–నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రూ.1,100 కోట్లతో సోమశిల వద్ద కృష్ణానదిపై కేబుల్ ఐకాన్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా నాగర్కర్నూల్ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. భద్రాచలం, అలంపూర్ జోగులాంబ, రామప్ప దేవాలయాలకు ప్రసాద్ స్కీం ద్వారా నిధులు కేటాయించామని చెప్పారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 2.15 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందించినట్లు వెల్లడించారు. 33 వేల మంది మహిళలకు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశామని, రెండు లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందజేస్తున్నట్లు వివరించారు. బీజేపీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్కు ఓటు వేస్తే అవి నేరుగా మోదీకి వెళ్తాయన్నారు. -
నియోజకవర్గానికో హబ్..
ఎస్సీ వర్గీకరణతోపాటు ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–లోకి మార్చేలా, మాదాసి కుర్వలను ఎస్టీ జాబితాలో చేర్చేలా నా వంతు ప్రయత్నం పకడ్బందీగా చేస్తా. మన్యంకొండ, కురుమూర్తి తదితర ఆలయాలకు అధిక మొత్తంలో నిధులు సమకూరేలా అందరి సహకారంతో ముందుకు సాగుతా. వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్కు సర్వే ఇప్పటికే మొదలైంది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రస్థాయి అధికారులతో మాట్లాడారు. దీన్ని పూర్తి చేయడంతో పాటు షాద్నగర్ వరకు ఎంఎంటీస్ సేవలు విస్తరించేలా పాటు పడతా. సైనిక్ పాఠశాల ఏర్పాటు, గోకుల్ ప్రాజెక్ట్కు నిధులు మంజూరయ్యేలా చూస్తా. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్, ఐటీ హబ్గా, జడ్చర్లను ఇండస్ట్రియల్ హబ్గా, దేవరకద్రను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా, నారాయణపేటను టెక్సటైల్ హబ్గా, మక్తల్ను టూరిజం హబ్గా, షాద్నగర్ను లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతా. జూరాల, కోయిల్సాగర్, సంగంబండ, చంద్రఘడ్ పోర్టును పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. -
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలు బంగ్లా అహంకారానికి, పాలమూరు ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నవి. ప్రజలు నిశితంగా గమనించాలి. ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటేయాలి. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన ఇలాకా ఎలా అభివృద్ధి చెందిందో చూడండి. ఇప్పడు మన పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలం పెరిగేలా చూడాలి. నేను గెలిస్తే అటు రాష్ట్రానికి, కేంద్రానికి ఇటు ఉమ్మడి పాలమూరుకు వారధిగా ఉంటా. పాలమూరుకు నిధుల వరద పారితే అన్ని రకాలుగా జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజలు ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
నారాయణపేట: ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సెక్టోరియల్ అధికారులు సిబ్బంది కృషి చేయాలనీ అడిషనల్ కలెక్టర్ మాయాంక్ మిత్తల్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్హాల్లో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్, పోల్పర్చెంటేజ్, రిసెప్షన్ పై ఎన్నికల సెక్టోరల్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ, వారు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని వెంట వెంట ఎన్ కోర్ యాప్ లో నమోదు చేయాలని, పోలింగ్ ముగిసిన మీదట ఈవీఎంలను జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్లకు చేర్చాలని, వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. మాక్ పోలింగ్ ఏజెంట్లో సమక్షంలో నిర్వహించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కమలోత్సాహం..
ప్రధాని మోదీ సభతో ‘కమలం’ శ్రేణుల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ● మోదీ గ్యారంటీ అంటే హామీలు పూర్తి చేసే గ్యారంటీ అని ఉద్ఘాటన ● మహబూబ్నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిక్సింగ్ అయ్యాయని విమర్శలు ● మహిళ అని చూడకుండా అవమానకర భాష వాడుతున్న సీఎం అని ధ్వజం ● ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపు ● బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రధాని నరేంద్ర మోదీ రాక భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. బీజేపీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన జనసభకు జనాలు పోటెత్తడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సభలో ముందుగా మోదీ జోగుళాంబ మాతకు నమస్కరించి.. నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగం మొదలుపెట్టగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. కాంగ్రెస్ అవలంబిస్తున్న దేశ అభివృద్ధికి వ్యతిరేకమైన ఎజెండాను అడ్డుకునేందుకు ఇక్కడ నిలబడ్డ ఏకై క పెట్టని కోట నరేంద్ర మోదీ అంటూ తనదైన పంథాలో ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. మోదీ గ్యారంటీ అంటే హామీలు పూర్తి చేసే గ్యారంటీ అని.. మోదీకి శక్తి మీ ప్రేమ, మీ ఓటు నుంచి వస్తుందంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మోదీ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఈ ఎన్నికలు దేశ భవిష్యత్కు సంబంధించినవి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దశాబ్దాలుగా తప్పుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు దేశం మోదీ గ్యారంటీని నమ్ముతోంది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ.. రాష్ట్ర, జాతీయ భద్రతకు గ్యారంటీ, ప్రపంచంలో భారత్ గౌరవం పెంపొందించే గ్యారంటీ, రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చే గ్యారంటీ.. 70 ఏళ్ల్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య చికిత్స అందించే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటేనే పక్కాగా పూర్తి చేసే గ్యారంటీ.’ అని అన్నారు. -
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయండి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న వసతి గృహాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం పరిశీలించారు. విశాలమైన గదులలో నలుగురు విద్యార్థులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని కాంట్రాక్టర్కు సూచించారు. మిగిలిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ ఉన్నారు. 13న వేతనంతో కూడిన సెలవు ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్ సంస్థలకు, పరిశ్రమలకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవును ప్రకటించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. నెగోషియబుల్ ఇన్సూమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. -
సీఎం సమక్షంలో భారీ చేరికలు
మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. రెనివట్ల ఎంపీటీసీ కన్కమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి పార్టీ నాయకులు కరుణాకర్రెడ్డి, నర్సిము లు, ప్రభాకర్రెడ్డి వీరితో పాటు మరో 100 మంది కార్యకర్తలు హైదరాబాద్లోని సీఎం నివాసంలో పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని కోస్గి లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తిరుపతిరెడ్డి సమక్షంలో మద్దూరు, పల్లెర్ల, పర్సపూర్, రెనివట్ల, తిమ్మారెడ్డిపల్లి, చెన్వార్ తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ నాయకులు మద్దూరు మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్రెడ్డిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని వారు సూచించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దికి అందరు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పార్టీ అద్యక్షుడు నర్సింహా, పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, సంజీవ్, రమేష్రెడ్డి, చెన్నాప్ప, రహీం, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
కమలం గూటికి మున్సిపల్ చైర్పర్సన్..?
● నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం గూటికి ● పేట మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న కారు నారాయణపేట: మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ తన అనచరులతో బీఆర్ఎస్ పార్టీని వీడీ గురువారం డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2017లో చైర్పర్సన్ బాధ్యతతో పార్టీని వీడి మళ్లీ 2023లో అదే బాధ్యతతో గందె అనసూయ సొంతగూడు అయిన బీజేపీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉండగా, మరి కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉండగా.. మున్సిపల్ పాలక వర్గంలో చైర్పర్సన్ భర్త, వైస్ చైర్మన్ మధ్య విబేధాలతో కౌన్సిలర్లు చేరో దారి పడుతుండడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇది వరకు మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణభట్టడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ఇద్దరు కౌన్సిలర్లు అమీరుద్దీన్, సరితలు సైతం కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. మరో ఐదుగురు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు సైతం పార్టీ మారారు. నలుగురు కాంగ్రెస్లోకి వెళ్లగా మరొకరు బీజేపీలోకి చేరిపోయారు. 2వ వార్డు జొన్నల అనిత, 12వ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్ బస్సపురం నారాయణమ్మ, 15వ వార్డు కౌన్సిలర్ బండి రాజేశ్వరితో పాటు వారి అనుచరులు ఏపీ జితేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో వారికి కండువ కప్పి ఆహ్వానించారు. మరో కౌన్సిలర్ మెఘాశ్రీపాద్ పార్టీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో కమలం గూటికి చేరడంతో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్కు షాక్.. నెల రోజుల వ్యవధిలోనే మున్సిపాటీలోని బీఆర్ఎస్ పాలకవర్గంలో మున్సిపల్వైస్ చైర్మన్తో పాటు ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి షాక్ తగిలినట్లయ్యింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ సైతం చేరో దారిలో వెళ్లిపోతుండడంతో పార్టీకి కోలుకోని దెబ్బ అని పలువురు చర్చించుకుంటున్నారు. -
వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..
నేను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశా. మెటల్ రోడ్లను తారు రోడ్లగా మార్చేందుకు రూ.778 కోట్లు మంజూరు చేయించాను. దేవరకద్ర–కృష్ణా లైన్ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచి పూర్తి చేశాం. దేవరకద్ర, మహబూబ్నగర్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయించాం. మహబూబ్నగర్–చించోళి జాతీయ రహదారి మంజూరుకు నావంతు కృషి చేశా. జాతీయ రహదారుల డివిజన్ కార్యాలయాన్ని పాలమూరుకు తీసుకొచ్చాం. ఐదేళ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద రూ.25 కోట్లు వచ్చాయి. రెండేళ్లు కరోనా కాలం కాగా.. రూ.10 కోట్లు కోవిడ్ కట్టడికి కేంద్రమే వినియోగించింది. ఇవి పోనూ రూ.15 కోట్లతో లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్లు, పాఠశాలల భవనాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాం. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కటకట
ధన్వాడ: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కటకట ఏర్పడిందని.. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయితే తాగునీరు బంద్ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం ధన్వాడ మండలంలోని హన్మున్పల్లి, కిష్టాపూర్, ధన్వాడ గ్రామాంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరుతు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే చాల గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తిందని, ఎన్నికలు పూర్తి అయితే అవి కూడా రాకుండా పోయాతాయన్నారు. కోయిల్కొండ వద్ద ఉన్న మిషన్ భగీరథ తాగునీటి ఫిల్టర్కు ఆరు నెలల నుంచి నిధులు రాకపోవడంతో అది పనిచేయడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడొద్దు అని ఐకేపీల ద్వారా పొలాల వద్దకే వచ్చి వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తే.. ఇప్పుడు ధన్వాడకు వెళ్లి విక్రయించాల్సి వస్తోందని, అది కూడా ఎప్పుడు కొనుగోళ్లు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మట్టి అక్రమ దందా.. ధన్వాడ ఆడ బిడ్డ అని ఎవరికి అయితే ఓటు వేశారో.. ఇప్పుడు ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఆక్రమంగా మట్టిని తరలిస్తు డబ్బులను వేనుకేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రెవంత్రెడ్డి సీఎంగా ఉండడు అక్కడ ఉత్తమ్రెడ్డి, లేదా వెంకట్రెడ్డి అయినా వస్తారని ఇంకో ఆరు నెలలు గడిస్తే మళ్లీ ఎన్నికలు వచ్చినా ఆశర్యపోవాల్సి అవసరం లేదని, ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావచ్చని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే ముందుగా వారు చేసేది రైతుల పొలాల వద్ద మీటర్లు బిగిస్తారని, ఉచిత విద్యుత్ నిలిపేస్తారని అన్నారు. ప్రజలు విటిని గుర్తించి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, సునిల్రెడ్డి, వాహిద్, మురళిదర్రెడ్డి, హున్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement