breaking news
Narayanpet
-
కెప్టెన్గా రాణించిన అనిత
నారాయణపేట జిల్లా కోస్గి మండలం హన్మాన్పల్లికి చెందిన అనిత ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ లీగ్లో రెడ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించి చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. రెండు మ్యాచుల్లో 59 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. వనపర్తిలోని గిరిజన సొసైటీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆల్రౌండర్గా రాణిస్తోంది. ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021లో హెచ్సీఏ మహిళా జట్టుకు ఎంపికై సూరత్లో జరిగిన టోర్నీలో ఆడింది. బెంగళూర్లో జరిగిన టీ–20 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరపున పాల్గొంది. హెచ్సీఏ టోర్నీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికకవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనిత. -
అంతా సిద్ధం
వనమహోత్సవం..●మొక్కలు నాటేందుకు సిద్ధం అటవీశాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లాలోని మిగతా 19 శాఖలతో కలుపుకొని 15.40 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేసి ఉంచాం. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రసాద్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, నారాయణపేట నారాయణపేట: జిల్లాలో వనమహోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్దేశంతో డీఆర్డీఓ మొగులప్ప, అటవీశాఖ జిల్లా అధికారి ప్రసాద్రెడ్డి, 21 శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ మొదటి వారం నుంచే మొక్కలు నాటడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ఏడాది 15.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.35 లక్షల మొక్కలు నాటించారు. నిర్ధేశించిన లక్ష్యంలో 9 శాతం పూర్తయింది. డిపార్ట్మెంట్ల వారీగా మొక్కల లక్ష్యం జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 96,750 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. టీఎస్ఆర్టీసీకి 1000, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 43,200, హార్టికల్చర్ అండ్ సెరి కల్చర్ 1.22లక్షలు, టీజీఎస్పీడీసీఎల్కు 500, మైన్స్ అండ్ జీయాలజీకి 600, హెల్త్ డిపార్ట్మెంట్కు 500, ఐసీడీఎస్కు 500, పశుసంవర్ధకశాఖకు 100, మార్కెటింగ్కు 300, పోలీస్ శాఖకు 300, ట్రాన్స్ఫోర్ట్ 500, సివిల్సప్లయ్కు 300, బీసీ వెల్ఫేర్ 300, ఎకై ్సజ్శాఖకు 25,300, ఆర్అండ్బీకి 3 వేలు, ట్రైబల్వేల్ఫేర్కు 500, అగ్రికల్చర్కు 86,100, ఇరిగేషన్శాఖకు 500, జిల్లా విద్యాశాఖకు 500, డీఆర్డీఓకు 8.66లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు టార్గెట్ ఇలా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 705 సైట్లలో 5.54లక్షల మొక్కలు, 280 జీపీల్లో ఇంటింటా 3.22 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేటగిరీలా వారీగా బండ్ప్లాంటేషన్ 6 వేలు, హర్టికల్చర్ 27,300, సంస్థాగత, కమ్యూటీ ప్లాంటేషన్ 2,49,750, ట్యాంక్బండ్ 25,300, ట్యాంక్బండ్ ఈత 23,500, ఈత ప్లాంటేషన్ 14 వేలు, ఈత ఇన్ సోసైటీ ల్యాండ్స్ 5 వేలు, మల్బరీబుస్15 వేలు, రోడ్సైడ్ ప్లాంటేషన్ 99,300, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ 62,481, కెనాల్ బండ్ 25,600, బయో పెన్సింగ్లో 1500 మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. నిరాడంబరంగా ప్రారంభం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం ఫర్ణికారెడ్డి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందువరుసలో హర్టికల్చర్ అండ్ సెరీకల్చర్ గ్రామీణాభివృద్ధి శాఖకు 8.66 లక్షల మొక్కలు కేటాయించగా గాను 24 వేల మొక్కలు నాటి 2.78 శాతం పూర్తి చేశారు. అటవీశాఖ 43,200 మొక్కలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 280 మొక్కలు మాత్రమే నాటారు. హర్టికల్చర్ అండ్ సెరి కల్చర్ లక్ష్యం 1,22,600 మొక్కలకు గాను 98,700 మొక్కలు నాటి 80 శాతానికి చేరుకున్నారు. ఎకై ్సజ్శాఖ 720, మున్సిపాలిటీల్లో 290 మొక్కలను అడపదడపా నాటేశారు. వ్యవసాయశాఖ ఈ ఏడాది 86,100 లక్ష్యం కాగా ఇంత వరకు ఒక్క మొక్క నాటలేదు. జిల్లాలో .. భూ విస్తీర్ణం 2,33,644 హెక్టర్లు ఫారెస్ట్ ఏరియా 462 హెక్టర్లు ఫారెస్టు శాతం 3.621 శాతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లక్ష్యం 0.432 లక్షలు డీఆర్డీఏ లక్ష్యం 8.671 లక్షలు ఇతర శాఖలు 6.303 లక్షలు289 నర్సరీలు.. 81 రకాలు మొక్కలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 280, ఫారెస్టు ఆధ్వర్యంలో 6 నర్సరీల్లో 20,15,841 మొక్కలు అందుబాటులో ఉండగా అందులో మీటర్ పైన పొడవు ఉన్న మొక్కలు 3,32,240,, మీటర్లోపు 9,77,601, పెంచుతున్న మొక్కలు 7,06,000 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నర్సరీలు అందుబాటులో మొక్కలు డిపార్ట్మెంట్ నర్సరీలు మొక్కల పొడవు మీటర్ పైన మీటర్లోపు పెంపుదల ఫారెస్ట్ 06 2,10,900 36,290 1,74,610 –– డీఆర్డీఏ 280 16,99,941 2,49,950 7,49,991 70,000 మున్సిపాలిటీలు 03 1,05,000 46,000 58,000 6,000 మొత్తం 289 20,15,841 3,32,240 9,77,601 70,600 మొక్కల లక్ష్యం 15.40 లక్షలు తవ్విన గుంతలు 1,96,342 నాటిన మొక్కలు 1.35 లక్షలు మంత్రి వాకిటి శ్రీహరితో అధికారికంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు -
‘పార్టీ కాదు.. పేదరికం చూసి ఇళ్లు ఇస్తాం’
మక్తల్/కృష్ణా/ఊట్కూర్/మాగనూర్: పార్టీని చూసి కాదు.. పేదరికాన్ని చూసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని పశుసంవర్ధక, క్రీడల యువజన, మత్స్యసహకార, డెయిరీ పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని కేశవనగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మక్తల్లో దోబీ ఘాట్ వద్ద రోడ్డ్యాంను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి కృషి శ్రీపడమటి అంజనేయస్వామి ఆలయ అబివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆలయ ధర్మకర్తగా ప్రాణేష్కుమార్ ప్రమాణ స్వీకారం చేపట్టగా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అందజేసి ప్రాణేష్కుమార్కు మంత్రి నియామకపత్రం అందించారు. ● సంగంబండ రిజర్వాయర్ వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని మంత్రితో పాటు స్టేట్ ఫిషరీస్ స్టేట్ డైరెక్టర్ నిఖిల్ పరిశీలించారు. ● ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి కొత్తపల్లికి రూ.1.90 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు, రూ. 20లక్షలతో నిర్మించే అవులోనిపల్లిలో గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి భూమిపూజ చేపట్టారు. బిజ్వార్ నుంచి పెద్దపోర్ల గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్లో ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టాలని ఎంపీడీఓ ధనుంజయగౌడ్కు ఆదేశించారు. బిజ్వారంలో రైతు రుణమాఫీ జాబితా ఏర్పాటు చేయకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ● కృష్ణా మండలంలోని గుర్జాల్ గ్రామానికి రూ.2.60 కోట్లతో ఏర్పాటు చేసే బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ● మాగనూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెగడబండ వరకు గ్రామ సమీపం వరకు రూ.3.80 కోట్లతో 4 కిలోమీటర్ల బీటీరోడ్డు నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శంకర్నాయక్, తహసీల్దార్లు చింత రవి, సతీష్కుమార్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, ఏఈ అజయ్రెడ్డి, ఈఓ సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, గణేష్కుమార్, ఆనంద్గౌడ్, సూర్యప్రకాశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
బ్యాటింగ్లో ‘ప్రతీక’ ప్రతిభ
మహహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన ప్రతీక తాండూరులో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్లో పాల్గొని ప్రతిభచాటింది. వికెట్ కీపర్గా, బ్యాటింగ్లో రాణిస్తోంది. హైదరాబాద్లోని కేఎస్ఎం క్లబ్లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ప్రతీక గత ఏడాది అండర్–15 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరఫున తమిళనాడు, ఆంధ్ర జట్లతో మ్యాచ్లు ఆడింది. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో వుమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రికెట్లో ప్రతిభ కనబరిచి భారత జట్టు ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది ప్రతీక. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో శనివారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ దళపతి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటి తుడుపు చర్యగా కాకుండా చట్టబద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ల ద్వారా బీసీలకు ఒరిగెదేమీ లేదని, గతంలో కేరళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని చేసిన ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంపును వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికలు ఆగిపోతాయన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదన్నారు. రిజర్వేషన్లు అమలు కాకముందే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కుర్మయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు గణేష్, వెంకటప్ప, గజలప్ప, రమేష్, నర్సింహులు, వెంకటయ్య, లక్ష్మప్ప, శ్రీనివాస్, రాము పాల్గొన్నారు. -
ఆల్రౌండర్గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే
మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రాఫే బ్యాటింగ్తో పాటు కీపర్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్టిక్ట్ అండర్–19 వన్డే క్రికెట్లో బ్యాటింగ్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద్వాలపై అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. నారాయణపేటపై 127 బంతుల్లో 3 సిక్స్లు, 25 ఫోర్లతో 165 పరుగులు చేశాడు. లీగ్లో 495 పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2023లో టుడే లీగ్లో రెండు సెంచరీలు, మూడు అర్థసెంచరీలు చేశాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో పీయూ తరఫున ఆడి రాణించాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీమిండియాకు ఆడాలన్నదే తన కల అని పే అంటున్నాడు అబ్దుల్ రాఫే. -
‘శత’క్కొట్టిన కేతన్కుమార్
జడ్చర్లకు చెందిన కేతన్కుమార్ యాదవ్ బ్యాటింగ్లో సంచలనం సృష్టించాడు. రెండేళ్లుగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న కేతన్ అండర్–23 లీగ్లో మూడు సెంచరీలు కొట్టి 474 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. వనపర్తితో జరిగిన టూ డే లీగ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకొట్టి 221 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 113, రెండో ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. మహబూబ్నగర్పై మరో సెంచరీ (101 పరుగులు) చేశాడు. రంజీ జట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు కేతన్కుమార్. -
బెస్ట్ బౌలర్గా దివ్యరాథోడ్
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మామిడిమాడకు చెందిన దివ్యరాథోడ్ ఇటీవల ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ క్రికెట్ లీగ్లో బెస్ట్ బౌలర్గా ఎంపికై ంది. రెండు లీగ్ మ్యాచుల్లో 7 వికెట్లు తీసి ప్రతిభచాటింది. వనపర్తిలోని గిరిజన గురుకులంలో చదువుతున్న దివ్యరాథోడ్ కోచ్ మన్నాన్ వద్ద రెండేళ్లగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటోంది. గత ఏడాది ఖమ్మంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 రాష్ట్రస్థాయి, హరియాణాలో జరిగిన జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నీలో ఆడింది. ఫాస్ట్బౌలర్గా గుర్తింపు పొంది జాతీయ మహిళా జట్టుకు ఎంపికవుతానని అంటోంది దివ్యరాథోడ్. -
క్రికెట్లో మెరుపులు
బ్యాట్ పడితే సిక్స్.. బంతి విసిరితే బౌల్డ్ మహబూబ్నగర్కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశా డు. రెండు ఇన్నింగ్స్లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పు న వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్కర్నూల్పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్లో జరిగిన హెచ్సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్. ● ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైనం ● సత్తా చాటుతున్న మహిళా క్రికెటర్లు ● అద్భుతంగా రాణిస్తున్న పాలమూరు యువ క్రీడాకారులు పాలమూరు క్రికెట్లో యువతరం సత్తా చాటుతోంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సైతం దూసుకుపోతున్నారు. బ్యాట్తో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సహకారంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో మెరుపులు మెరిపించి..భవిష్యత్కు భరోసా నింపుకొన్నారు. పురుషుల అండర్–23 టూ డే లీగ్, అండర్–19 లీగ్, మహిళా క్రికెట్ లీగ్తో పాటు పలు కీలక పోటీల్లో రాణిస్తున్నారు. బ్యాట్, బాల్లో మెరుపులు మెరిపిస్తున్న వర్ధమాన క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రీడలు బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్ -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట క్రైం: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సిబ్బందికి సూచించారు. కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు డీఎస్పీ ఎన్. లింగయ్య తన కార్యాలయంలో పెండింగ్ కేసులపై శనివారం సమీక్ష నిర్వహించారు. నేరాల నివారణకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. విచారణలో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సీఐ, ఎస్ఐల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతి కేసులో బాధ్యతాయుతమైన విచారణ ఉండాలన్నారు. పూర్తి పారదర్శకంగా కేసుల విచారణ చేపట్టడంతో పాటు కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారికి పూర్తి విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సామాజిక అంశాలైన సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్ఐలు విజయ్కుమార్, బాలరాజు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా తనిఖీలు..
బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలో పోలీస్శాఖ, కార్మికశాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో గత పదిరోజులుగా దాడులు నిర్వహిస్తున్నాం. పిల్లలను పనిలో పెట్టుకుంటే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించాం. – మహేష్కుమార్, కార్మికశాఖ జిల్లా అధికారి కఠిన చర్యలు తప్పవు జిల్లాలో జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మేరకు ప్రత్యేక బృందాల ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం వరుసగా దాడులు నిర్వహించి బాలకార్మికులను చేరదీసి వీరిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవు. బాలలను పనిలో పెట్టుకున్న వారి సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – యోగేష్గౌతమ్, ఎస్పీ ● -
బాల్యానికి భరోసా..
నర్వ: బడికి వెళ్లి పాఠాలు వినాల్సిన చిన్నారులు.. తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీలు.. పొలాలు.. పరిశ్రమల్లో పనిచేసేందుకు లేదా.. గొర్రెలు మేస్తూ కాపరులుగా మారి వివిధ పనుల్లో చేరి బందీ అవుతున్నారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏటా జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్.. జులై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్లను నిర్వహించి బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండు నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి విముక్తికి కృషిచేస్తుంది. జిల్లాలో గత 11 రోజులుగా ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించగా వీరిలో 8 మంది బాలికలు, 22 మంది బాలురు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాలకార్మికుల విముక్తి కోసం.. బాలకార్మికుల విముక్తి కోసం పోలీస్ శాఖ ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ పూర్తిచేసి జులై 1 నుంచి ముస్కాన్ను ప్రారంభించారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశానిర్దేశంతో ఈ నెల 1 నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. బాలకార్మికులను గుర్తించే పనిలో అధికార బృందాలు నిమగ్నమయ్యాయి. డీఎస్పీ లింగయ్య అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్లో 66 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఇందులో 47 మంది బాలురు, 19 మంది బాలికలను గుర్తించగా అందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు ఉన్నారు. మొత్తం 2 కేసులు నమోదు చేసి 13 మంది బాలలను పనిలో పెట్టుకున్న యజమానులకు రూ.74 వేలు జరిమానా విధించారు. బాలకార్మికులుగా ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గత ఏడాది కంటే ముస్కాన్ కార్యక్రమంలో ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగేంచేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలు.. బాలకార్మికులను గుర్తించి వీరిని విముక్తి కల్పించేందుకు నిర్వహించే దాడుల్లో ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుల్లు కలిసి ఒక బృందంగా ఏర్పాటై దాడులు నిర్వహిస్తారు. వీరితో పాటు కార్మికశాఖ, చైల్డ్లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, చైల్డెవెల్ఫేర్ కమిటీలు, బాలరక్ష భవన్, సఖీ, చైల్డ్ లైన్, ఐసీడీసీ సీడీపీఓ, ఆధార్ సిబ్బందితో పాటు, అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులను వీరు గుర్తించి పనులు చేస్తున్న పని ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న చిన్నారులను చేరదీసి, ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. పిల్లలను బలవంతంగా పనిచేయించుకుంటున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పలు శాఖల సమన్వయంతో కార్మికశాఖ, విద్యాశాఖ, సీ్త్రశిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్, సఖీ, కార్మికశాఖ, బాలరక్షక భవన్, విద్యా శాఖల సమన్వయంతో వ్యవహరించి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలకార్మిక నిషేధ చట్టం–1986 ప్రకారం ప్రమాదకర పనుల్లో, పరిశ్రమల్లో, 14 ఏళ్ల వయస్సు లోపు బాలబాలికలతో పనిచేయించకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పైగా జరిమానాలు విధిస్తారు. 31 వరకు జిల్లాలో ‘ఆపరేషన్ ముస్కాన్’ బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు 2019 నుంచి 2025 జనవరి వరకు 964 మంది బాల కార్మికుల గుర్తింపు -
వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
నాగర్కర్నూల్/ కల్వకుర్తి/ కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం ప్రారంభం, జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవనం శంకుస్థాపన, వెల్దండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రెండు ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలు మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రిక్ బస్సును ఏర్పాటు చేస్తానన్నారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువవద్దని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. వైద్య విద్యార్థుల కల నేటితో నెరవేరిందన్నారు. వైద్యులు రోగులకు మందులతో పాటు రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియపరచాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ నుంచి మున్ననూర్ వరకు ప్రధాన రహదారికి మరి కొన్ని రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తన చారిటీ ట్రస్టు ద్వారా కృషిచేస్తానన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బందిమెరుగైన సేవలు అందించాలి ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు -
కార్మికుల భద్రతకు భరోసా
కోస్గి: మున్సిపాలిటీల పరిధిలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్వావరణ వ్యవస్థ (నమస్తే) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేవలం గ్రేటర్ సిటీలు, నగరపాలికలు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన కార్మికులను గుర్తించి యాప్లో నమోదు చేస్తున్నారు. మరుగు దొడ్ల వ్యర్థాలు తొలగించే పాకీ పనివారు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకొనే ప్రమాదకరస్థితిని ఎదుర్కొంటున్న కార్మికులకు భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. కార్మికులకు వరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకం కార్మికులకు ఓ వరంగా మారనుంది. పారిశుద్ధ్య కార్మికుల భద్రతతో పాటు గౌరవం, సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడమే కాకుండా ఈ పథకం కింద గుర్తించిన కార్మికులకు ప్రత్యేక పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించడంతో పాటు సాధ్యమైనంత మేరకు యంత్రాలను వినియోగించేలా చర్యలు చేపడతారు. ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. చెత్త సేకరించే వారికి సైతం.. సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు డంప్ యార్డులు, ఇతర చెత్త నిల్వ ప్రదేశాల్లో చెత్తను సేకరించి అమ్ముకోవడం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చెత్త సేకరించే కార్మికులు సైతం తమ వివరాలను అధికారులకు అందించి నమస్తే యాప్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న కార్మికులకు భవష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా పించన్తోపాటు ఆర్దిక చేయుతనిచ్చి ఆదుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని నారాయణపేటలో ఐదుగురు, మక్తల్లో ఐదుగురు, కోస్గిలో 12 మంది కార్మికులను గుర్తించి నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీలో ఇంకా కార్మికుల గుర్తింపు ప్రక్రియ మొదలు కాలేదు. పథకం అమలు తీరు ఇలా.. ఆయా వృత్తుల్లో గుర్తించిన కార్మికులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తుంది. పారిశుద్ధ్య వృత్తికి సంబంధించిన వాహనాల కొనుగోలుకు సబ్సిడీ అందజేస్తారు. కార్మికుల పిల్లలు చదువుకునేందుకు ఆర్థికసాయం చేస్తారు. కార్మిక కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. ‘నమస్తే’ పథకానికి కేంద్రం శ్రీకారం మున్సిపాలిటీల పరిధిలో అమలు కార్మికుల వివరాలు యాప్లో నమోదు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రక్రియ -
ఓటరు నమోదు బాధ్యతాయుతంగా చేపట్టాలి
కోస్గి రూరల్: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును బాధ్యతాయుతంగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఎల్ఓలకు శిక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 1 తేదీ నుంచి ఓటరు నమోదు ప్రారంభమైందని, కొత్త ఓటరు నమోదు, మార్పు చేర్పులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేసుకోవడం, ఎపిక్ కార్డు జనరేషన్, ఫొటో మార్పిడి, పేర్లు సవరించడం, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. 1200 వందల ఓట్లకు పైబడిన ప్రాంతాలు 6 ఉన్నాయని అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసిల్దార్ బక్క శ్రీనివాసులు టైనర్లు రవికుమార్, హక్ తదితరులు ఉన్నారు. -
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం
నారాయణపేట రూరల్/దామరగిద్ద: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం దామరగిద్దలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని, విడతల వారీగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో బాల్రెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అధ్యక్షుడు ఈదప్ప, శ్రీనివాస్, ఖాజా, అంజప్ప, రఘు. వెంకట్రామరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో విధిగా మొక్కలను నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి విజయ్ కాలనీ అంతర్గత రహదారుల పక్కన శుక్రవారం మొక్కలు నాటి నీరు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలని, అందుకు చెట్లు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సీజన్ కొనాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. యువత, మహిళలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి మొక్కల ప్రాముఖ్యతను తెలియచేయాలన్నారు. అంతకుముందు కాలనీ మహిళా బృందం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ్ బట్టడ్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి
నారాయణపేట: అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిరంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న 1985–87 ఇంటర్మీడియట్ బ్యాచ్కు చెందిన స్నేహ మిత్ర మండలి సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి.. రక్తదాతలకు అభినందనలు తెలిపారు. శిబిరంలో 74 యూనిట్ల రక్తం సేకరించినట్లు స్నేహ మిత్ర మండలి సభ్యులు డి.మదన్మోహన్రెడ్డి, డా.బాలాజీ సింగాడే తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, డి.మల్లేష్, బిల్డర్ వెంకట్రాములు, గుత్తి రమేశ్, సైదప్ప, గోపాలకృష్ణ, జగన్నాథ్, విజయ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. నవంబర్లోగా పనులు పూర్తిచేయాలి.. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలో రూ. 5కోట్లతో చేపట్టిన జెడ్ఎంఎస్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణం ఇంకా పిల్లర్ల దశలోనే ఉండటంతో అసహనం వ్యక్తంచేశారు. భవన నిర్మాణంపై పర్యవేక్షణ పెంచాలని డీఆర్డీఓ మొగులప్ప, పంచాయతీరాజ్ ఈఈ హీర్యానాయక్కు సూచించారు. అదే విధంగా హ్యాండ్లూమ్ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఆర్ డీఈ విలోక్ ఉన్నారు. -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలి క సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్కర్నూల్/నారాయణపేట: ఏటా జనా భా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దశాబ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న కారణంగా భవిష్యత్లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. దీంతో యువ జనాభా తగ్గుముఖం పడుతుండటం, వృద్ధుల జనా భా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, సా మాజిక మార్పులు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛి న్నం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్ జిల్లాలోనే ఎక్కువశాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణులు కాగా, 10.19 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుండగా, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వరకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు, సామాజికంగా మార్పులు, ప్రజల ఆలోచనల్లో మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వరకు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది. అయితే 1991 లో 25.87 శాతం నుంచి 2001 నాటికి జనాభా వృద్ధి 14.20 శాతానికి పడిపోయింది. అక్కడి నుంచి 2011 నాటికి 15.34 శాతానికే పరిమితమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
ట్రాన్స్కో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోస్గి: విద్యుత్ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర ఆధారాలతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ట్రాన్స్కో అధికారుల లీలలు’ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై ట్రాన్స్కో ఎస్ఈ వెంకటరమణ స్పందిస్తూ.. అధికారుల మధ్య సమన్వయ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. కాగా సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్ స్వయంగా పర్యటిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశిస్తుండగా.. స్థానిక అధికారులు మాత్రం ఇష్టారీతిగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం -
గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
నారాయణపేట క్రైం: మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీంలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నారు. ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు సరికొత్త పంథాలను ప్రయోగిస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతో నట్టేట ముంచుతున్నారని తెలిపారు. మల్టీ లెవల్ కంపెనీల పేరుతో నిర్వహించే గొలుసుకట్టు వ్యాపారాలను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మల్టీలెవల్ వ్యాపారం ముసుగులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. గొలుసుకట్టు మార్కెటింగ్లో ముందుగా చేరిన వారికి మాత్రమే లాభాలు వస్తాయని.. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందేనని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింక్లు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దన్నారు. ఆర్థిక మోసాలపై సైబర్ క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య మరికల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జెడ్పీ సీఈఓ శైలేల్కుమార్ అన్నారు. మరికల్ బాలుర ఉన్న త పాఠశాలలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వాష్రూం, వంటగదితో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులతో ఆరా తీశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహఫంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నాగరత్నమ్మ పాల్గొన్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వండి నారాయణపేట: పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని భూ నిర్వాసిత రైతుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు జి.వెంకట్రామారెడ్డి, కన్వీనర్ మశ్చందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భూ నిర్వాసితుల స మావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం వ్య వసాయ భూముల ధర ఎకరా రూ. 30లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుందన్నారు. అయితే ప్రభుత్వం రూ. 13లక్షలు లేదా రూ. 14లక్షలు ఇస్తామనడం ఆమోధయోగ్యం కాదన్నారు. మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులకు పరిహారం నిర్ణయించాలని కోరారు. లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నా రు. సమావేశంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు గోపాల్, అంజిలయ్య, మహేశ్ కుమార్, ధర్మరాజు, లక్ష్మీకాంత్, కేశవ్, నారాయణ, నర్సింహులుగౌడ్, సంతోష్ ఉన్నారు. -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
నారాయణపేట: జిల్లాలోని మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి.. ఆర్థిక స్వావలంబనకు తో డ్పాటు అందిస్తామని ప్రత్యేకాధికారిణి సౌజన్య అన్నారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తన బృందంతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళ లు తయారుచేసిన వెదురు ఉత్పత్తులు, ఎర్రకోట, బంకమట్టి ఆభరణాలు, చిక్కిళ్లు, లడ్డూలు, ఇ తర స్వీట్స్, నారాయణపేట కాటన్ చీరలు, దోతీలు, చట్నీలు, నూనెలు, పల్లీ, నువ్వులు, కొ బ్బెర పట్టీలు, సబ్బులు, అగర్బత్తీలు, షాంపు లు, కలంకారి వస్త్రాలు, తాటి ఆకుల వస్తువులు, జూట్ బ్యాగ్లు, కారంపొడి, జొన్నరొట్టెలు తదితర వాటిని పరిశీలించారు. శిల్పారామంలో ఏ ర్పాటుచేసిన మహిళాశక్తి బజార్ను పరిశీలించి.. తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి సుజాత, కోశాధికారి అంజమ్మ, డీపీఎంలు గోవిందు, మాసన్న, జయన్న, సీసీలు భీమయ్య, శ్రీనివాస్, కతాల్, గొల్ల రాము, అకౌంటెంట్ మహేశ్వరి పాల్గొన్నారు. -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
విధుల్లో అలసత్వం ప్రదర్శించొద్దు
దామరగిద్ద: పోలీసులు విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్గౌతమ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు ఎస్పీ స్వాగతం పలికారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల వివరాల గురించి ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆదేశించారు. రికార్డులు, పెండింగ్, కోర్టు, దర్యాప్తు కేసులను పరిశీలించారు. నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించి మోసాలకు గురికాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల్లో పోషకాహార లోపం
మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు పెట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నా చిన్నారుల్లో పోషక లోపం, పెరుగుదల మందగించినట్లు జాతీయ ఆరోగ్య సర్వేల్లో తేలింది. దీంతో మక్తల్, మద్దూర్, నారాయణపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా చిన్నారుల ఎత్తు, బరువును కొలిచి ఆన్లైన్లో నమోదు చేయాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో నెలకొకసారి సీ్త్ర, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ వివరాలపై చర్చిస్తున్నారు. అతి తక్కువ బరువు ఉన్న చిన్నారులను ఆస్పత్రుల్లో ఉన్న పోషణ సలహ కేంద్రాలకు పంపించి, వారికి అవసరమైన మందులు అందిస్తున్నారు. 704 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 704 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిలో మేజర్ అంగన్వాడీలు 649 కాగా మినీ కేంద్రాలు 55 ఉన్నాయి. వాటిలో 639 మంది టీచర్లు, 599 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 33,214, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,025 మందికి నిత్యం పోషకాహారం అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెలా వైద్య సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ చేయిస్తాం జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్లో భాగంగా చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు చేయిస్తున్నాం. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పోషకలోపం ఉన్న చిన్నారుల వివరాల కార్డును తల్లిదండ్రులకు అందజేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారాన్ని చిన్నారులకు క్రమం తప్పకుండా అందిస్తున్నాం. – సరోజిని మట్ట, సీడీపీఓ మక్తల్ ప్రాజెక్టు వెల్లడించిన జాతీయ ఆరోగ్య శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో సర్వే జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు -
ఎకరాకు రూ.14 లక్షల పరిహారం
నారాయణపేట: ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సేకరణ చేపట్టి ఎకరానికి రూ.14 లక్షల పరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ రామచందర్నాయక్ తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మండలాల్లోని 21 గ్రామాల్లో 562.02 ఎకరాల భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూమి సేకరిస్తున్నామని తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షలు తీసుకునేందుకు రైతులు ఒప్పుకోవడంతో ఆరుగురు రైతుల నుంచి 2 ఎకరాల 11 గుంటల పొలం సేకరించి, అందుకు సంబంధించిన చెక్కులను రైతులకు అందించారు. కడుమూరు సరస్వతికి రూ.4.55లక్షలు, కడుమూరు గోవిందుకు రూ.4.40లక్షలు, వర్కూరు చంద్రయ్యకు రూ.9.80లక్షలు, వర్కూరు రమేష్కు రూ.6.30లక్షలు, వర్కూర్ లక్ష్మికి రూ.1.75లక్షలు, బొమ్మలు సూగన్నకు రూ.5.25లక్షల విలువ గల చెక్కులు అందించినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చినందుకు రైతులను సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్ తహసీల్దార్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. రైతు నమోదు ప్రక్రియలో వేగం పెంచాలి కోస్గి రూరల్: కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అందించే ప్రయోజనాలు పొందడానికి తప్పనిసరిగా రైతు నమోదు ప్రకియను వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం తోగాపురంలో చేపట్టిన రైతు నమోదు ప్రకియను ఆయన పరీశీలించారు. కోస్గి మండలంలో 44,506 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 10,499 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. మిగతా రైతులు వేగంగా నమోదు చేసుకునేందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నా రు. అనంతరం పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేశారు. యూరియా, డీఏపీ ఇతర ఎరువుల నిల్వలు రైతుల అవసరాలకు సరిపడే విధంగా ఉంచుకోవాలని డీలర్లను ఆదేశించారు. రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి అమ్మకానికి రశీదు ఇవ్వాలన్నారు. గడువు తీరిన స్టాక్ ఉండరాదని, నకిలీ ఎరువులు, రసాయన మందులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిచారు. ఏఓ రామకృష్ణ, ఎఈఓలు వినోద్, అజయ్ ఉన్నారు. -
ట్రాన్స్కో అధికారుల లీలలు
నారాయణపేటగురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో uకోస్గి: విద్యుత్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు తమ బినామీలతో విద్యుత్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తగా.. మరికొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినంత దండుకుంటున్నారు. జిల్లా విద్యుత్ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డీఈ, ఎస్ఈ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉన్నతాధికారుల కంటే కార్యాలయ బాధ్యతలు నిర్వహించే అధికారులదే హవా కొనసాగుతోంది. బయటపడిన వ్యవహారం కోస్గి పట్టణ పరిధిలో నూతనంగా వెలుస్తున్న డీటీసీపీ వెంచర్లలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని యజమానులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓ వెంచర్ యజమాని విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఆన్లైన్లో నిర్ణీత రుసుం చెల్లించి ట్రాన్స్ఫార్మన్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. కాగా అధికారులు వెంచర్లో విద్యుత్ పనులను తాము సూచించిన వ్యక్తికే అప్పగించాలని అనధికారిక షరతు విధించారు. సదరు కాంట్రాక్టర్కు జిల్లా కార్యాలయంలో పలుకుబడి ఉందని, ఇతర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తే ఇబ్బంది అవుతుందని పరోక్షంగా హెచ్చరించారు. కానీ వెంచర్ యజమాని వేరే కాంట్రాక్టర్కు పనులు అప్పగించాడు. కోస్గి సబ్స్టేషన్ అంచనా వ్యయం పెంచుతూ.. దరఖాస్తు చేసుకున్న వెంచర్లో స్థానిక ఏఈ వెంకటేష్, లైన్మెన్తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి కావాల్సిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం, ఇతర అంశాల అంచనా వ్యయంతో నివేదికను డీఈకి, అక్కడి నుంచి ఎస్ఈకి పంపిస్తారు. అధికారులు ఏఈలు పంపిన నివేదికలను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కోస్గి ఏఈ స్వయంగా పరిశీలించి 2 ఎకరాల్లో ఏర్పా టు చేసిన వెంచర్కు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుందని అధికారికంగా నివేదిక అందజేశారు. కానీ జిల్లా కార్యాలయంలో అనుమతుల వ్యవహారాన్ని పర్యవేక్షించే అధికారి 63కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేసుకోవాలని అనుమతులు మంజూరు చేశా రు. ఇదే విషయమై డీఈ నర్సింహారావును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాంట్రాక్టర్లతో కుమ్మ క్కైన విద్యుత్ అధికారుల వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. 25 కేవీ సామర్థ్యమే ఎక్కువ వెంచర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న ప్లాట్లకు 25 కేవీ సామర్థ్యం కూడా ఎక్కువే. అయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొంచెం ఎక్కువగా ఉండాలని 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ సిఫారసు చేస్తూ నివేదిక పంపాను. జిల్లా కార్యాలయం నుంచి అంచనా వ్యయం మారుస్తూ 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈ విషయం మరోమారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. – వెంకటేష్, ఏఈ, కోస్గి డీఈ మార్చమంటేనే.. సంబంధిత వెంచర్లో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ అవసరం అని ఏఈ నివేదిక అందజేశారు. కానీ డీఈ సూచించడంతో ట్రాన్స్ఫార్మన్ సామర్థ్యం పెంచి అనుమతులు మంజూరు చేశాం. దీనిపై అనుమానం ఉంటే డీఈతోనే మాట్లాడండి. – వెంకట కృష్ణారెడ్డి, ఎస్ఈ కార్యాలయ అధికారి నెలలుగా కాలయాపన.. విద్యుత్ ఏర్పాటు కోసం ఈ ఏడాది జనవరి 24న దరఖాస్తు చేసుకోగా అధికారులు మాత్రం కాలయాపన చేస్తూ వచ్చారు. తమ బినామీ కాంట్రాక్టర్కు పనులు ఇవ్వలేదని ఆగ్రహంతో అధికారులు 6 నెలలుగా ఫైల్ను పెండింగ్లో ఉంచారు. ఇదే విషయమై సదరు యజమాని కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం కావడంతో పాటు దరఖాస్తు తీసుకున్నట్లు ధ్రువీకరణ అడగడంతో అధికారులు తమదైన శైలిలో విద్యుత్ ఏర్పాటుకు మంజూరు పత్రం అందజేశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కు వెంచర్లలో తమ బినామీలకు పనులు దక్కేలా యజమానులపై ఒత్తిడి మాట వినకుంటే ‘విద్యుత్’ అనుమతుల్లో జాప్యం -
‘అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి’
కోస్గి రూరల్: స్థానిక మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ‘కడా’ ప్రత్యేక అధికారితో కలిసి కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూ.305 కోట్లు మంజూరు చేశారన్నారు. వాటితో సీసీ రోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు, జంక్షన్ల నిర్మాణం, పార్కులు, చెరువుల సుందరీకరణ తదితర పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. గూగూల్ మ్యాప్తో పట్టణ స్వరూపం, అండర్ డ్రెయినేజీ నిర్మాణాన్ని మూడు విభాగాలుగా విభజించి చేపడుతున్నామన్నారు. భవిష్యత్లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని మురుగు నీటి నిల్వ కోసం పట్టణ శివారులో మూడు ఎకరాల స్థలం అవసరమని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్ కలెక్టర్ను కోరగా.. ప్రభుత్వ భూమిని చూపించాలని తహసీల్దార్ను ఆదేశించారు. రూ. 10.50 కోట్లతో చేపట్టే పట్టణ డంపింగ్ యార్డుకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు, జంక్షన్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. రూ.37 కోట్లతో చేపట్టే ఆప్రోచ్ రోడ్లు, మేజర్ లింక్ రోడ్లు, సీసీ, డ్రెయినేజీల టెండర్లు పూర్తయిన వాటిని గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కాంప్లెక్స్ భవన నిర్మాణాల వేగం రూ. 8.80 కోట్లతో గుండుమాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి పక్కన చేపడుతున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుండుమాల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న అప్పాయపల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరీశీలించారు. 129 ఇళ్లు మంజూరు కాగా 40 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, భాస్కరస్వామి, ఎంపీడీఓ శ్రీధర్, వేణుగోపాల్, పీఆర్డీఈ విలోక్, మేనేజర్ అనిల్కుమార్, ఏఈ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. -
‘మాగనూర్ను ఎడారి చేయొద్దు’
మాగనూర్: మండల కేంద్రం శివారు ప్రాంతంలో ఉన్న వాగు నుంచి ఇసుకను తరలించి మాగనూర్ ఎడారి చేయొద్దని గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలో 24 కిలో మీటర్ల మేర వాగు ప్రవహిస్తున్నా.. అధికారులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ మాగనూర్ సమీపంలో ఇసుక తవ్వడంపై మొండిగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మండలంలో ప్రభుత్వ అనుమతులతో నడిచే రీచ్లు ఉన్నాయని, ఇసుకను అక్కడ నుంచి తీసుకువెళ్లాలని కోరుతున్నా తమ బాధ ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలింపును నిలిపి వేయాలని కోరుతూ మంత్రి వాకిటి శ్రీహరికి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే పోలీస్ బందోబస్త్తో ఇసుక తరలించేందుకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదం మంగళవారం ఇసుక తరలించేందుకు వాగులోకి టిప్పర్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వాగు వద్దకు చేరుకొని సుమారుగా 4 గంటల పాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పనుల కోసం ఇసుక తరలిస్తున్నారని, అందుకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ నాగలక్ష్మి, ఎస్ఐ అశోక్బాబు గ్రామస్తులను కోరారు. ఈ మేరకు గ్రామస్తులు, రైతులు మాట్లాడుతూ తమకు రెండు రోజుల సమయం ఇవ్వాలని, మరోసారి సమావేశం నిర్వహించి మంత్రిని కలిసి ఇసుక రీచ్ను మరో చోటుకు మార్చాలని విన్నవిస్తామన్నారు. దీంతో స్పందించిన అధికారులు రీచ్లోకి వచ్చిన టిప్పర్ల వరకు ఇసుక తరలిస్తామని, రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వచ్చేందుకు అందరూ సహకరించాలన్నారు. లేని పక్షంలో ఇక్కడి నుంచే ఇసుక తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోసారి ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు తీరు మార్చుకోని పోలీసులు, అధికారులు -
‘పోలీసులు బాధితుల పక్షాన నిలవాలి’
నారాయణ పేట క్రైమ్: ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం పెరుగుందని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. పదోన్నతి పొందిన ఏఎస్ఐ బి.బాలస్వామి మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలస్వామికి ఎస్పీ వన్ స్టార్ను అలంకరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి ఉద్యోగ జీవితంలో ఓ మైలురాయి అని, విధుల్లో మరింత బాధ్యత పెంచుతుందన్నారు. అలాగే పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకం కలిగించడంతో పాటు వారికి అండగా మనమున్నామనే ధైర్యం కల్పించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం పీయూలో ఎన్విరాల్మెంటల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఫస్ట్, సెకండియర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో పర్యావరణం ప్రధానమైనదని, దానిపై విద్యార్థులు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విభాగం విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తుందని, వాటిలో వచ్చే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, హెచ్ఓడీ శివకుమార్సింగ్, శ్రీనివాసులు, కోమలి, రాణెమ్మ, బృందాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్గా నిలవాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్బాల్లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బాలికల జూనియర్ ఫుట్బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారిక, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ, ఆశాల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మురుగు నీటికుంటలు, వర్షపునీరు నిల్వ ప్రదేశాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించి రసాయనాలను పిచికారీ చేయాలని కోరారు. గర్భిణుల నమోదు, హైరిస్క్ కేసులు గుర్తించాలని, ప్రసవానంతరం తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. మంజుల, డీడీఎం వెంకటకృష్ణ, మండల వైద్యాధికారి డా. ఫయాజ్ అహ్మద్, డా. మానస తదితరులు పాల్గొన్నారు. -
‘టీబీ రహిత జిల్లాగా మార్చుదాం’
నారాయణపేట: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో నారాయణపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై జిల్లాలోని వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లాలో క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. 2030 నాటికి.. 2030 నాటికి క్షయ నిర్మూలించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా వైద్య సిబ్బందిని బృందాలుగా విభజించి అనుమానితుల నుంచి తెమడ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ యోజన కార్యక్రమం ద్వారా చికిత్సతో పాటు నెలకు రూ.వెయ్యి వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారన్నారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెన్సీ డాక్టర్ శ్రీగణ, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకుఅవగాహన కల్పించాలి మండలంలోని జాజాపూర్లో పునాది లెవల్లో ఉన్న ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి త్వరగా పూర్తి చేస్తే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్, ఎంపీఓ బాలజీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశా టు పాలమూరు
మహబూబ్నగర్ క్రైం: ‘గంజాయి విక్రయదారులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు.. చాక్లెట్లు, సిగరెట్, ఆయిల్ రూపంలో ఇలా భిన్నంగా ఆలోచిస్తూ మత్తును చేరవేస్తున్నారు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటుపడిన యువత బయటకు రావడం చాలా కష్టంగా మారుతోంది. చివరికి దాడులు చేసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం విచారకరం. గ్రాముల చొప్పున విక్రయం.. ప్రధానంగా పాలమూరుకు సరఫరా అవుతున్న ఎండు గంజాయిలో అధిక శాతం ఒడిశా నుంచి వస్తుంటే.. మరికొంత హైదరాబాద్లోని ధూల్పేట్ నుంచి వస్తోంది. దీనిని ఒక కేజీ గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేసి.. దాంట్లో నుంచి ఐదు నుంచి ఆరు గ్రాములను ఒక పాకెట్గా ఏర్పాటు చేసి రూ.500 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు. పోలేపల్లి సెజ్తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేసే ఒడిశాకు చెందిన కూలీలు కొంత రవాణా చేస్తుంటే దీని సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కళాశాలలు, కాలనీల్లో విద్యార్థులు, యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. బానిస కావాల్సిందే.. ఎవరైనా మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. కేవలం మత్తును ఆస్వాదించడం కోసమే వినియోగించే డ్రగ్స్ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి వైద్యులు అవసరమైన మోతాదులో రోగులకు ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్ను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిత్యం కావాలనిపిస్తుంది. ఇలాంటి మత్తును రుచి చూసిన వారు జీవితాంతం కావాలని కోరుకుంటారు. ఇలాంటి మత్తు ఇంజెక్షన్ల వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే మత్తు అత్యవసరమైన సమయంలో అందుబాటులో లేకపోతే విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అవకాశం లేకపోలేదు. ధూల్పేట నుంచి యథేచ్ఛగా గంజాయి సరఫరా కట్టడి చేయడంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారుల విఫలం మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత ఇటీవల పాలమూరులో పెరిగిన దాడులు బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికం -
పాత ఆయకట్టుకు సాగునీరు..
వర్షాకాలం కావడంతో ఆయకట్టు కింద అధికంగా వరి సాగయ్యే అవకాశం ఉంది. పాత ఆయకట్టు కుడి కాల్వ పరిధిలో మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల్లో 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద దేవరకద్ర మండలం మాత్రమే ఉండటంతో అక్కడ 3 వేల ఎకరాలు కలిపి 12 వేల ఎకరాల ఆయకట్టుకు కోయిల్సాగర్ నీరు చేరుతుంది. వాస్తవానికి కొత్త ఆయకట్టు 38,250 ఎకరాలను కలుపుకొని 50,250 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2012 జూరాల నుంచి కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుతున్నారు. కానీ ఇప్పటి వరకు మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించిన దాఖాలాలు లేవు. -
రాజన్న సేవలు మరవలేనివి
మక్తల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి రాష్టంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ప్రారంభించిన పథకాలు నేటికీ పేదలకు అందుతున్నాయని, అంతటి దార్శనికత ఉన్న నేత అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకి రుణాల మాట విన్నప్పుడల్లా వైఎస్సార్ గుర్తుకు వస్తాడన్నారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటే్ష్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, ఎండీ సలాం, రజిత్కుమార్రెడ్డి, గొల్లపల్లి నారాయణ, కట్ట సురేష్, రవికుమార్, గోవర్ధన్, రవి, నాగేందర్, మందుల నరేందర్, శ్రీనివాసులు, అశోక్గౌడ్, వెంకటేష్, రవికుమార్,, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
దాబాల్లోనూ విక్రయాలు..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహబూబ్నగర్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా 975 గ్రాముల ఎండు గంజాయి, 8 మంది అరెస్టు చేయడంతో పాటు మూడు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు సీజ్ చేశారు. అలాగే జడ్చర్ల ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కాగా పది మంది అరెస్టు చేయగా రెండు కేజీల 650 గంజాయి, 8 సెల్ఫోన్లు, ఒక వాహనం సీజ్ చేశారు. జడ్చర్ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబాల్లో గంజాయి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల షాద్నగర్– బాలానగర్ మధ్యలో ఉన్న దాబాల్లో గంజాయి దొరకడమే ఇందుకు నిదర్శనం. రాజాపూర్ నుంచి టోల్గేట్ మధ్యలో ఉన్న కొన్ని హోటళ్లు, దాబాల్లో బయటి వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కొత్త ఆయకట్టు కలేనా..?
డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి గ్రహణంమరికల్: 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద ఆ మేరకు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం కావడం లేదు. ప్రధాన కాల్వలు అయితే తవ్వారు కానీ పొలాలకు వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపట్టపోవడంతో రైతులు ప్రధాన కాల్వల్లో మోటార్లు బిగించి పత్తి, కంది పంటలు సాగు చేస్తున్నారు. పిల్ల కాల్వల నిర్మాణం కోసం భూ సేకరణ చేసినా నిధులు కొరతతో పూర్తి చేయలేకపోయారు. దీంతో కొత్త ఆయకట్టుకు సాగునీరు కలగానే మిగిలింది. జూరాల నుంచి రోజుకు 315 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 23 అడుగులకు నీరు చేరింది. మరో 11 అడుగులు చేరితే పూర్తి స్థాయిలో నిండుతుంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు నారుమళ్లు సిద్ధం చేశారు. అధికారులు సకాలంలో సాగునీరు విడుదల చేస్తే నాట్లు వేసుకునే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. నిధుల కొరతతో నెరవేరని లక్ష్యం కోయిల్సాగర్ ఆయకట్టు పెంపు ఊసెత్తని అధికారులు, పాలకులు 23 అడుగులకు చేరిన నీటిమట్టం -
నీటి కోసం ఎదురుచూస్తున్నాం
వానాకాలం సీజన్లో కోయిల్సాగర్ నీళ్లపై ఆధారపడి పది ఎకరాల్లో వరిసాగు చేస్తాను. ఇప్పటికే నారుమళ్లు పెరిగాయి. ప్రస్తుతం నాట్లు వేసే సమయం సమీపిస్తోంది. కోయిల్సాగర్ నుంచి విడుదలయ్యే నీటి కోసం ఎదురుచూస్తున్నాం. అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేయాలి. – నరహరి, రైతు, రాకొండ ఆయకట్టు పెంచాలి కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే జూరాల నీటిని ఎత్తిపోస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు కింద ఒక ఎకరా కూడా వరి సాగు కాలేదు. ప్రభుత్వం మరోసారి పిల్ల కాల్వ కోసం భూ సేకరణ చేసి వాటికి నిధులు మంజూరు చేయాలి. డిస్ట్రిబ్యూటర్ కాల్వలు నిర్మిస్తేనే కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంది. – చంద్రారెడ్డి, రైతు, మరికల్ వారం రోజుల్లో నీటి విడుదల ప్రస్తుతం కోయిల్సాగర్లో నీటిమట్టం 23 అడుగులకు చేరుకుంది. మరో 2 అడుగులకు చేరిన తర్వాత ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేస్తాం. నిధులు లేకనే కొత్త ఆయకట్టు కింద పిల్ల కాల్వల పనులు జరగడం లేదు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. – ప్రతాప్సింగ్, ఈఈ, కోయిల్సాగర్ ● -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని గిరిజన భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట రూరల్: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులపై తల్లిదండ్రులతో పాటు భవిత కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఐఈ కోఆర్డినేటర్ రాజేంద్రకుమార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు ఏర్పాటుచేసిన ఫిజియోథెరపి శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. భవిత కేంద్రంలో ప్రతి సోమ, బుధవారం దివ్యాంగ చిన్నారులకు నిర్వహించే ఫిజియోథెరపి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి, ఐఈఆర్పీ శ్రీనివాస్, ఎంఐఎస్ కరిష్మా, కంప్యూటర్ ఆపరేటర్ నారాయణ, సీఆర్పీ ఆరిఫ్ అహ్మద్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి దామరగిద్ద: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. దామరగిద్దలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం హౌసింగ్ పీడీ శంకరయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల నిర్మాణ దశలు, మంజూరైన బిల్లుల వివరాలను తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 5,223 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, దాదాపుగా నిర్మాణ దశలో ఉన్నాయని.. 153 మందికి రూ. లక్ష చొప్పున బిల్లులు మంజూరైనట్లు అధికారులు వివరించారు. ట్రెయినీ కలెక్టర్ వెంట హౌసింగ్ సిబ్బంది కాకర్ల భీమయ్య ఉన్నారు. బాలకేంద్రంలో అడ్మిషన్లు నారాయణపేట రూరల్: పట్టణంలోని బాలకేంద్రంలో 2025–26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5–16 ఏళ్ల విద్యార్థినీ విద్యార్థులకు సితార్, తబలా, గాత్రం, నృత్యంతో పాటు మరిన్ని కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రోజు సాయంత్రం 5నుంచి 7గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.20, ఓసీ, బీసీలు రూ.50 అడ్మిషన్ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
పదోన్నతితో మరింత బాధ్యత : ఎస్పీ
నారాయణపేట క్రైం: ఉద్యోగులకు కల్పించే పదోన్నతులు మరిన్ని బాధ్యతలు పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన భద్రూ నాయక్ సోమవారం ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నూతనోత్సాహంతో పనిచేస్తూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, ఆర్ఐ నర్సింహ పాల్గొన్నారు. ● జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ఆరు అర్జీలు అందజేయగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి భరోసాగా కల్పించాలని తెలిపారు. పోలీసుల వద్దకు వచ్చే ఫిర్యాదుదారులు మధ్యవర్తులను తీసుకురావొద్దని.. బాధితులు నేరుగా సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం ● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత ● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్లు సిద్ధమైన తర్వాత రద్దు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది.. ● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం ● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు ● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు ఈ ఫొటోలోని మహిళ పేరు కళావతి. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న ఆమె ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇల్లు వస్తుందని ఓ కాంగ్రెస్ నాయకుడు హామీ ఇవ్వడంతో ధీమాగా శిథిలావస్థకు చేరిన ఇంటిని కూలగొట్టుకుంది. ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమైన క్రమంలో సదరు నేత నీకు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పడంతో కంగుతింది. అధికారుల చుట్టూ తిరిగిన క్రమంలో గతంలో నీ పేరిట ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైందని.. బిల్లులు కూడా డ్రా చేసుకున్నారని తేల్చేశారు. ఇప్పుడు ఈ పథకం నీకు వర్తించదని చెప్పడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో ఉన్న గూడును కూల్చుకున్నానని.. ఇప్పుడేం చేయాలో తోచడం లేదని ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకుంది. కూలగొట్టిన ఇంటి వద్ద కళావతి -
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టీజీఏబీసీడీసీ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కిల్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూలు, మెంటల్ వెల్నెస్ ట్రైనింగ్ అంశాలపై నాలుగు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. 21 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా tgobmms.cgg.gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఇతర ధ్రువపత్రాలను జిల్లా బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో 14వ తేదీలోగా అందజేయాలని తెలిపారు. మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కోస్గి రూరల్: మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని ముశ్రీఫా గ్రామంలో మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే కుట్టుమిషన్లకు 55 మంది దరఖాస్తు చేసుకోగా.. 44మందికి మంజూరైనట్లు తెలిపారు. మిగతా వారికి 10 రోజుల్లో మంజూరవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఇస్తూ పథకాలను అమలు చేస్తుందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తూం భీంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిప్రసాద్రెడ్డి, మహిపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, శశివర్ధన్, రామకృష్ణారెడ్డి, హబిబ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు స్టేషన్ మహబూబ్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు.. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్చార్జ్లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్చార్జీగా నియమితులయ్యారు. పనిగంటల పెంపు జీఓను రద్దు చేయాలి మహబూబ్నగర్ న్యూటౌన్: ఎనిమిది గంటల పనికి బదులు 10 గంటల పని సమయం పెంచుతూ రాష్ట్ర కార్మిక శాఖ దొడ్డిదారిన తెచ్చిన జీఓ నం.282ను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జీఓ నం.282పై వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జీఓ 282 ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, టీఎన్టీయూ జిల్లా నాయకుడు రాములు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిన కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా 10 గంటల పనివేళలు పెంచుతూ జీఓ జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. -
రోడ్డు విస్తరణపై ఆందోళన
మద్దూరు: మున్సిపాలిటీలో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణలో నివాసగృహాలు కోల్పోతున్న బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. స్థానిక పాతబస్టాండ్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం గుండా చింతల్దిన్నె రోడ్డు వరకు ఉన్న రహదారిని 70 ఫీట్ల మేర విస్తరించేందుకు ఇటీవల అధికారులు మార్కింగ్ వేశారు. ఈ రోడ్డు విస్తరణతో దాదాపు 60 కుటుంబాలు నివాసగృహాలు కోల్పోనున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కడా అధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణతో తాము సర్వం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా, రోడ్డు విస్తరణపై మున్సిపల్, పీఆర్ అధికారులు అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వివరించారు. నేడు పీయూ మాల్ప్రాక్టీస్ కమిటీ భేటీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2, 4, 6 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థులు మంగళవారం పీయూ మాల్ప్రాక్టిస్ కమిటీ ఎదుట హాజరుకావాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్స్ మెయిల్కు పంపించామని, వారు తప్పకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో, మాల్ ప్రాక్టిస్ చేసినందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 30 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. కాగా, అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మండల ప్రత్యేకాధికారులు విధిగా తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కోస్గి రూరల్: కోస్గి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వివేకానంద చౌరస్తా నుంచి మున్సిపాలిటీ పరిదిలోని మాసాయిపల్లి గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, సైడ్లైట్స్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా రూ.350 కోట్లు మంజూరు చేశారని, వాటితో మినీ ట్యాంక్బండ్లు, ఆహ్వాన తోరణాలు, అండర్ డ్రెయినేజీ, పలు చౌరస్తాల్లో సుందరీకరణ పనులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బీంరెడ్డి, నాయకులు రాములు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, అన్న కిష్టప్ప, శ్రీనివాస్, బాలేష్ తదితరులు ఉన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన నాగర్కర్నూల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసం నుంచి ఉదయం 8గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి అతిథిగృహానికి చేరుకొని స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం అమ్రాబాద్ బీటీరోడ్డు నిర్మాణానికి, గిరిజన భవనం ప్రహరీ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం నుంచి జరిగే హెచ్సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. టుడే లీగ్లో మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. టుడే లీగ్లో పది మ్యాచ్లు ఆడే అవకాశం ఉమ్మడి జిల్లా జట్టుకు దక్కుతుందని, ఈ మ్యాచుల్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్లు అబ్దుల్లా, ముఖ్తార్ పాల్గొన్నారు. ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు శ్రీకాంత్– కెప్టెన్ (షాద్నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్ (మహబూబ్నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్కర్నూల్), శశాంక్ (మహబూబ్నగర్), జశ్వంత్ (నాగర్కర్నూల్) ఉన్నారు. -
గ్రామాన్ని ఎడారిగా మారిస్తే ఊరుకోం..
మాగనూర్: మాగనూర్ గ్రామానికి ప్రధానంగా సాగు, తాగునీరు అందిస్తున్న పెద్ద వాగులో ఇసుక తరలిస్తే గ్రామం ఎడారిగా మారుతుందని, వారం రోజులుగా ఈ విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈమేరకు గ్రామస్తులంతా సమావేశమై ఇసుక తరలింపునకు వ్యతిరేకంగా తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాగనూర్ వంతెన దగ్గర ఇసుక తరలించవద్దని కోరినా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో భాగంగా శనివారం మళ్లీ అధికారులు ఇసుక తరలించేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని , ప్రతి రోజు ఇదే విధంగా ఇసుక రవాణాను అడ్డుకోవడం అంటే ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ఇకనైనా అధికారులు మరో చోట ఇసుక తరలించేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రయత్నం వి రమించుకోవాలని లేదంటే ఉద్యమాలకై న సిద్ధంగా గ్రామస్తులు ఏకతాటిపై ఉంటారని తెలిపారు. -
ఐదేళ్ల ప్రణాళిక..
జిల్లాలో పీఎం జుగా మిషన్ ద్వారా ఐదేళ్లలో వెనకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 34 గ్రామాల్లో 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడతారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో శిబిరాల్లో పాల్గొనే అధికారులు అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సంరక్షణ వంటివి పరిశీలించి వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత.. అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటినీ కలెక్టర్ ద్వారా పీఎం జుగా మిషన్ అధికారులకు అందజేసిన అనంతరం వెను వెంటనే వాటికి అయ్యే నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
యథేచ్ఛగా దోచేస్తున్నారు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● అధికారుల పర్యవేక్షణ కరువుఽదన్వాడ: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డ్డూ అదుపులేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొందరు అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని హమీ ఇవ్వడంతో ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ముఖ్యంగా మండలంలోని గోటూర్ గ్రామ పక్కన ఉన్న కోయిల్సాగర్ వాగు నుంచి వారం రోజులుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోటూర్ గ్రామంలో 35 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో ధన్వాడ మండలానికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఉట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఇసుక రీచ్కు అనుమతి ఇచ్చింది. కానీ అది గ్రామానికి దూరం అవుతుందని పక్కనే కోయిల్సాగర్ వాగు నుంచి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వాలని లబ్ధిదారులు, గ్రామస్తులు అధికారులను కోరారు. దీంతో తహసీల్దార్ సింధుజా, ఎంపీడీఓ సాయి ప్రకాష్ రోజుకు 4 నుంచి 5 ట్రిప్పులు ఇసుక తరలించేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఇక రెచ్చిపోతున్నారు. ఇసుకను ఇళ్లకు తరలిస్తున్నట్లు చెబుతూ మండలంలోని కిష్టాపూర్, రాంకిష్టాయిపల్లి గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాలలో ప్రైవేట్ వ్యక్తులకు ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా దాదాపు 16 ట్రాక్టర్లు ఏర్పాటు చేసి జేసీబీలతో ఇసుకను తవ్వి రోజు 100 ట్రిప్పుల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండిపడుతుంది. అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా మాముళ్లు మత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఇంటికి వెళితే.. పరువు పోతుంది..!
నారాయణపేట రూరల్: ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భర్త గొంతునులిమి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. తనకంటే చిన్నవాడైనా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో తాండూరుకు చేరుకున్నాక ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టడంతో హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. అయితే రాధ తిరిగి ఆ యువకుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. హత్యచేసి.. పక్కింట్లో నిద్రించి ఈ క్రమంలోనే గత నెల 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తా గిన మైకంలో భర్త పడుకొని ఉండగా.. భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియ నట్టు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి భర్త తనను ఇబ్బంది పెడు తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్లో కోటకొండకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల అనుమానంతో.. మృతుడి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులు అంజిలప్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో వారు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పీఎస్కు కేసును బదిలీ చేశా రు. సైబరాబాద్ కమిషనర్, డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. గతనెల 26న కుటుంబసభ్యులను విచారించారు. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఘటనపై బాచుపల్లి సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా, హత్య ఘటనలో ఒక్కరే ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సీఐ చెప్పారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం సా యంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆమె అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు జెడ్పీ సీఈవో శైలేష్ కుమార్ వివరించారు. గతంలో 140 ఎంపీటీసీ స్థానాలుండగా మద్దూరు పురపాలిక కావడంతో 136కు తగ్గా యని చెప్పారు. అలాగే గతేడాది సర్పంచి ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం మద్దూరు మున్సిపాలిటీ కావడంతో వాటి సంఖ్య 272కు తగ్గిందని డీఎల్పీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. ఎన్నికల ట్రైనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వెలువడినా నిర్వహణకు ఇప్పటి నుంచే అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీ దత్త బృందావన్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై ప్రణాళికతో ముందుకు.. మద్దూరు మండలంతో పాటు మున్సిపాలిటీలో అవసరమైన అభివృద్ధి పనులకు అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పథకాలకు రూ.19 కోట్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డంపింగ్ యార్డ్కు రూ.6.41 కోట్లు, రహదారులకు రూ.35 కోట్లు, ఫేస్–1, ఫేస్–2 రూ.45 కోట్లు, వైకుంఠధామానికి రూ.3.65 కోట్లు, ఇండోర్ స్టేడియానికి రూ.7.67 కోట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, మినీ స్టేడియం, పార్క్, కమ్యూనిటీ హాల్ షాదీఖానా తదితర వాటికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. మద్దూర్ మున్సిపాలిటీలో మొత్తం రూ.340.07 కోట్ల ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కాడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఈఈ విజయభాస్కర్రెడ్డి, డీఈ మల్లేష్, పుర కమిషనర్ శ్రీకాంత్, ఏఈ మహేష్, ఎన్సీపీఈ కన్సల్టెన్సీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి.. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, డీపీఆర్వో రషీద్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, బీసీ సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
రైతు సేవలే లక్ష్యం
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉంటే డీసీసీబీ తరపున విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేక రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. సహకార రంగాలఅభివృద్ధికి పటిష్ట చర్యలు త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం -
సమస్యలన్నీ పరిష్కరిస్తాం
వివరాలు 8లో uనారాయణపేట: పురపాలికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని నారాయణపేట పుర కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్కు పుర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వార్డుల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి, డ్రెయినేజీల్లో మురుగు, చెత్త తొలగింపు, వీధిదీపాలు, పందులు, దోమల నియంత్రణ, శిథిల భవనాలతో ఇబ్బందులు, కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలా తదితర వాటిపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఆయా విభాగాలుగా అడిగిన సమస్యలను పుర ఇంజినీర్ మహేశ్, శానిటేషన్ ఇన్చార్జ్ శ్రీనివాస్జీ, టీపీబీఓ రాజేశ్ రాసుకున్నారు. సమ స్యలు త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ● సమస్య: పట్టణంలోని 16వ వార్డు పత్తిబజార్లో ఓ ఇల్లు పాడుబడింది. విషపు పురుగుల సంచారం పెరిగింది. వీధి దీపాలు వెలగడం లేదు. – నారాయణ, పత్తిబజార్ ● కమిషనర్: శిథిల ఇంటి యజమానికి నోటీసులు జారీ చేస్తాం. ఆయన తొలగించకపోతే పురపాలిక నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. కాలనీలో త్వరలోనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. ● సమస్య: బాబాకాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలి. మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్కు సీసీ రోడ్డు వేయండి. – కాశీనాథ్, బాబాకాలనీ ● కమిషనర్: అమృత్ 2.0 పథకం కింద మూడు భారీ నీటిట్యాంకులు, పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నాం. డ్రెయినేజీలు, పార్క్కు సీసీ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ● సమస్య: 13వ వార్డులో గుట్టమీద 300 మీటర్ల వరకు పైపులైన్ టెండర్లు పూర్తయినా పనులు కావడం లేదు. చెత్తబండి ఇంటి ఎదుట రెండు నిమిషాలు కూడా నిలపడం లేదు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. – పోలెమోని శ్రీకాంత్, 13వ వార్డు ● కమిషనర్: పుర ఇంజినీర్ దృష్టికి తీసుకెళ్లి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. చెత్త బండి ఇంటింటి ఎదుట 2 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిలపాలని డ్రైవర్లకు సూచిస్తాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడతాం. ● సమస్య: 21వ వార్డులో స్పీడ్ బ్రేకర్లు వేయాలి. డ్రెయినేజీలు వారానికి ఒకసారైన శుభ్రం చేయించాలి. – రవికిరణ్, వార్డు వాసి ● కమిషనర్:అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయిస్తాం. డ్రెయినేజీల్లో మురుగు తొలగింపజేస్తాం ● సమస్య: బాహర్పేటలో డ్రెయినేజీలపై స్లాబ్ వేయకపోవడంతో చెత్త బండి సైతం రావడం లేదు. దోమల బెడద పెరగడంతో పాటు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. – అంజయ్య, 12వ వార్డు వాసి ● కమిషనర్:డ్రెయినేజీలపై అవసరం ఉన్న చోట స్లాబ్ వేయిస్తాం. మురుగు తొలగిస్తాం. దోమలు, పందుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ● సమస్య: జామా మసీద్ సమీపం, గుడ్లక్ దుకాణం దగ్గర చెత్తకుండీలు తొలగించండి. చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. – యూసుఫ్ తాజ్, వార్డు వాసి ● కమిషనర్:చెత్త కుండీలను తొలగిస్తాం. చెత్త సేకరణ వాహనాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సమస్య: 8వ వార్డులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బోరు మరమ్మతు చేపట్టాలి. వాటర్ లైన్మెన్ను మార్చాలి. – లక్ష్మణ్, 8వ వార్డు కమిషనర్:బోరు మరమ్మతు వెంటనే పూర్తి చేయిస్తాం. వాటర్ లైన్మెన్ సమస్యను పరిష్కరిస్తాం. సమస్య: 20వ వార్డులో పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా నిర్వహించడం లేదు. జవాన్లు ముందుండి పనులు చేయించడం లేదు. డ్రెయినేజీలు ఎప్పుడు శుభ్రం చేస్తారో తెలియడం లేదు. – మహ్మద్ హుస్సేనీ, వార్డువాసి కమిషనర్:పారిశుద్ధ్య పనులు పట్టణమంతా కొనసాగుతున్నాయి. నెలలో రెండు, మూడుసార్లు విధిగా డ్రెయినేజీల్లో పూడిక తొలగిస్తున్నాం. జవాన్లు పారిశుద్ధ్య సిబ్బంది వెంట ఉండి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. సమస్య: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి పళ్ల వంతెన, వల్లంపల్లి వంతెన వరకు పారే సాగునీటి కాల్వలో పెరిగిన ముళ్ల పొదలు, పూడిక తొలగించాలి. వర్షాకాలంలో పళ్ల ప్రాంతంలోని కాలనీల్లోకి నీరు చేరుతోంది. పంట పొలాల్లోకి మురుగు పారుతోంది. – వెంకోభా, బీకేఎస్ నాయకుడు కమిషనర్: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలాలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపునకు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. సమస్య: గాంధీనగర్ శాసన్పల్లి రోడ్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర వీధిలైట్ కాలిపోయి రెండు నెలలు అవుతోంది. మే 21న ఫోన్ చేస్తే కోటా లేదన్నారు. ఎప్పుడు వేస్తారో చెప్పండి. – శ్రీకాంత్, కాలనీవాసి కమిషనర్: పట్టణంలో ఎక్కడెక్కడ వీధి దీపాలు కాలిపోయాయో కొత్తవి వేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే బిగిస్తారు. సమస్య: ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులకు కొళాయి కనెక్షన్లు ఇవ్వాలి. ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు పెరిగి, మురుగు నిలిచి దోమల బెడద అధికమైంది. – అనిల్, 10వ వార్డు వాసి కమిషనర్:ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే కొళాయి కనెక్షన్ ఇస్తాం. ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయించుకోవాలంటూ యాజమానులకు నోటీసులు జారీ చేస్తాం. -
ఆర్బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ34,731 మందికి మేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ● -
ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు
మద్దూరు: స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఓటరు జాబితాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని కొడంగల్ ఎన్నికల అధికారి, వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల బీఎల్వోలకు ఓటరు నమోదు, జాబితాలో సవరణలు తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఫారం 6, 7, 8 గురించి వివరిస్తూ ఏ విధంగా తప్పులను సరి చేసుకోవాలనే విషయాన్ని విషయ నిపుణులు తెలియజేశారు. మద్దూరు, కొత్తపల్లి తహసీల్దా ర్లు మహేష్గౌడ్, జయరాములు పాల్గొన్నారు. ప్రైవేట్ క్లినిక్ సీజ్ నారాయణపేట రూరల్: మండలంలోని కోటకొండలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న ఓ ప్రైవేట్ క్లినిక్ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హతకు మించి వైద్యం చేయడాన్ని గుర్తించి నిర్వాహకులను హెచ్చరించి రోగులను ఆస్పత్రి నుంచి పంపించి సీజ్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన వైద్యుడిని నియమించుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాతే సేవలు కొనసాగించాలని సూచించారు. వైద్యురాలి తీరుపై అసహనం.. మండలంలోని కోటకొండ పీహెచ్సీతో పాటు అమ్మిరెడ్డిపల్లి ఉపకేంద్రాన్ని సందర్శించి ఫ్రైడే డ్రైడే నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో శుభ్రత పాటిస్తూ డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డా. చందన, డా. ప్రతిభ భారతి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని, యూనిఫామ్ తప్పక ధరించాలని సూచించారు. అనంతరం డెంగీ కేసు నమోదైన కుటుంబంతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ విజయ్ కుమార్ ఉన్నారు. ఎస్ఈ ఆకస్మిక తనిఖీ నారాయణపేట రూరల్: మండలంలోని అప్పక్పల్లి 132 కేవీ, 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను శుక్రవారం ఎస్ఈ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు త్రీఫేజ్ విద్యుత్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిర్ణీత సమయానుసారం సరఫరా జరగాలని ఆదేశించారు. అలాగే కొత్తగా అమరుస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ ట్రికటింగ్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏడీఈ శ్రీనివాస్, రూరల్ ఏఈ సాయినాథ్రెడ్డి, ఎల్ఐజీ రవీంద్రాచారి, దేవణ్ణ, ఏఎల్ఎం శ్రీకాంత్ ఉన్నారు. -
మన్యంకొండ వెళ్తున్నాం..
నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. – నర్సింహ, గద్వాల తినడానికి ఏమీ లేవు.. మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్, మహబూబ్నగర్ ● -
మధ్యలో నిలిపేస్తే ఎలా..?
కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు ఎంతసేపు ఉండాలో.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అమర్నాథ్, కర్నూలు -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
స్టేషన్ మహబూబ్నగర్/మదనాపురం/జడ్చర్ల టౌన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్ప్రెస్ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్ప్రెస్లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం నిలిచిపోయిన హంద్రీ, బెంగళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లు తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల పునరుద్ధరణ -
పార్కింగ్ పరేషాన్!
వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ట్రా‘ఫికర్’ ●చర్యలు తీసుకుంటాం.. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకునేలా యాజమానులకు సూచనలు చేస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకూడదు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత
వనపర్తి: బాలల హక్కులు పరిరక్షించేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నిబద్ధతతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్రెడ్డి కోరారు. గురువారం కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్తో కలిసి జిల్లాకేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాల, శ్రీరంగాపూర్లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్యశాఖపై ఉందన్నారు. పిల్లల్లో లోపాలుంటే ముందుగానే గుర్తించి ఎన్ఆర్సీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించి సరైన పౌష్టికాహారం, వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా ఏదైనా వైకల్యంతో ఉంటే డీఎస్టీ పరీక్షలు నిర్వహించి ఫిజియో, స్పీచ్ థెరపీ వంటివి చేయించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కచ్చితంగా తినిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసుల వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ సమన్వయంతో నిర్వహించడమే గాకుండా యజమానులపై జరిమానాలు విధించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే బాధ్యులపై కేసులు చేయడమే కాకుండా పెళ్లి ఆలోచనలు చేస్తున్నప్పుడే ముందుగానే పసిగట్టి అవగాహన కల్పించి నిరోధించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అలాగే పాఠశాలలను తనిఖీ చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..జిల్లాలో వయసుకు తగిన బరువు, ఎత్తు లేని పిల్లలను అంగన్వాడీ కార్యకర్తలు 102 వాహనంలో ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు ఉంచి వైద్యం, పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించామని వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి -
మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. 2023 నుంచి 2025 వరకు పలు సామాజిక మాధ్యమాల్లో ఇతర మతాలను కించపరుస్తూ 20 పైగా పోస్టులు చేసిన యువకులకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల్లో ఒకరి మతాన్ని మరొకరు ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల మత ఘర్షణలకు దారితీస్తుందన్నారు. అలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఇకపై మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయకూడదని యువకులకు సూచించారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు. ఆటో కార్మికులపై వేధింపులు ఆపాలినారాయణపేట రూరల్: ఆటో కార్మికులపై ఆర్టీఓ, పోలీసుల వేధింపులు ఆపాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, రాము డిమాండ్ చేశారు. టీయూసీఐ ఆధ్వర్యంలో గురువారం ఆటో కార్మికులు ఆర్టీఓ కార్యాలయ ముట్టడి చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రంలోని సింగారం గేట్ నుంచి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటోలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేదని వేధించడంతో పాటు ప్రతి చిన్న విషయానికి రూ.వేలల్లో జరిమానాలు విధిస్తుండటంతో ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొట్టకూటి కోసం ఆటోలు నడుపుతున్న వారిని వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటోలకు గిరాకీ తగ్గి.. డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ. 12వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు జిల్లాకేంద్రంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాశీనాథ్, నర్సింహులు, నారాయణ, సాదిక్, సలీం, ప్రశాంత్, తాయప్ప, అంజి పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గత నెల 26వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ సెలక్షన్ ఫలితాలను గురువారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 18 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. ఇందులో పది మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారని, వీరు హైదరాబాద్లోని హకీంపేట క్రీడా పాఠశాలలో నేడు (శుక్రవారం), శనివారం రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న వారు పాస్పోర్ట్ ఫోటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహశీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్తో శుక్రవారం(నేడు) మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట స్పోర్ట్ స్కూల్లో రిపోర్ట్ చేయాలని డీవైఎస్ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలు: కొత్తపల్లి ప్రేమ్కుమార్ (మహబూబ్నగర్), ముడావత్ యశ్వంత్ (బాలానగర్), జి.రిశి తేజ్, బెక్కరి వర్షిత్, కట్ల ఆదిత్య (మహబూబ్నగర్), పి.మోక్షిత్ (మహమ్మదాబాద్), కె.జయంత్ మణి (కోడ్గల్), ఎ.శౌర్య యాదవ్ (మహబూబ్నగర్), బి.నందీశ్వర్ (హన్వాడ), మద్దు పార్థ (జడ్చర్ల), బడావత్ వరలక్ష్మి (నవాబ్పేట), పాత్లవత్ భవ్యశ్రీరాథోడ్, వింజమురి భవ్యశ్రీ (కోయిలకొండ), వనం ఆరాధ్య (మూసాపేట), కె.సహస్ర (గండేడ్), ఎన్.హరిక (దేవరకద్ర), గోద లఖిత (మిడ్జిల్), కుర్వ ప్రణవి (దేవరకద్ర). -
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించండి
నారాయణపేట: ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్గా తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి సోమవారం గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే, 2023లో 32 కేసులు నమోదు కాగా.. 16 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2024లో 34 కేసులకు గాను ఒక కేసుకు మాత్రమే నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సంవత్సరం 10 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ లింగయ్య, షెడూ్య్ల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డీఏఓ జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఖలీల్, డీపీఓ బిక్షపతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, తహసిల్దార్ అమరేంద్రకృష్ణ తదితరులు ఉన్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి హౌసింగ్ అధికారులు వేసిన మార్కింగ్ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపకుండా, ఆలస్యం చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తిచేసేందుకు మున్సిపల్, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా, 11వ వార్డులో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్.. మున్సిపల్ కమిషనర్ను పిలిచి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ఉన్నారు. ప్రతి మూడు నెలలకోసారి విజిలెన్స్ కమిటీ సమావేశం తప్పనిసరి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288
తేది: 04–07–2025, సమయం: మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పుర కమిషనర్ భోగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. తాగునీటి ఇబ్బందులు, డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడం, దోమలబెడద, పందులు, కుక్కల స్వైరవిహారం, వీధిలైట్లు వెలుగకపోవడం, ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు, ఇళ్ల మధ్య మురుగునీరు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
ఏఐ ఆధారిత విద్యతో సామర్థ్యాలు మెరుగు
కోస్గి రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏఐ ఆధారిత విద్య దోహదపడుతుందని డీఎంఓ రాజేంద్రకుమార్ అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై కృత్రిమ మేధ సహకారంతో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్నాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి, హెచ్ఎం ఖుత్బుద్దీన్, మేకల రాజేశ్ పాల్గొన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి నారాయణపేట రూరల్: వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మండలంలోని పేరపళ్ల ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణులు, కిశోర బాలికలనుద్దేశించి డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్ విజయకుమార్, ఎంఎల్హెచ్పీ శిరీష, ఆరోగ్య కార్యకర్త సుజాత పాల్గొన్నారు. స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయం పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి సమస్యలపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సెషన్లలో సదస్సు ఉంటుందని, మొదటి సెషన్లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. మూడు సెషన్లలో ఎంతో మంది వక్తలు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన ఇంకా జల వనరుల దోపిడీ ఆగలేదని, స్వరాష్ట్రంలో కూడా జిల్లా వివక్షకు గురవుతుందన్నారు. సాగునీటి కల్పనలో జిల్లాకు అన్యాయం జరిగిందని, కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వలేదని ఆరోపించారు. జోరుగా ఉల్లి వ్యాపారం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వేలంలో నాణ్యతగా ఉన్న ఉల్లి ధర గరిష్టంగా రూ.2 వేలు, కనిష్ట ధర రూ.1,100 వరకు పలికింది. చిన్నసైజు ఉల్లి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.300 వరకు ధరలు వచ్చాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్ట ధర రూ.వెయ్యి, కనిష్ట ధర రూ.550, చిన్న సైజు ఉల్లి గరిష్ట ధర రూ.350, కనిష్టంగా రూ.150 బస్తాగా విక్రయించారు. మార్కెట్కు దాదా పు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఎక్కువగా చిరు వ్యాపారులు, వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,277 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,277, కనిష్టంగా రూ.2,100 ధరలు వచ్చాయి. అలాగే ఆముదాలకు గరిష్టంగా రూ.5,970, కనిష్టంగా రూ.5,780, వేరుశనగ సరాసరిగా రూ.6,131, ధాన్యం హంస రకం రూ.1,701, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,129, కనిష్టంగా రూ.1,952 ధరలు లభించాయి. -
మెరుగైన వైద్యం అందించాలి
నారాయణపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తేనే.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు మందుల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ నరసింహారావుకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బోధన తీరును పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ఆట వస్తువులు, బోధనా పరికరాలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. ఉర్దూ పాఠశాల భవనం మార్చాలని ఆదేశం.. దూల్పేటలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న హాజిఖాన్పేట ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ 25 మంది విద్యార్థులు ఉండగా.. కొన్నేళ్లుగా అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అయితే ఉర్దూ మీడియం పాఠశాలను వెంటనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చాలని ఎంఈఓ బాలాజీని అదనపు కలెక్టర్ ఆదేశించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288
తేది: 04–07–2025, సమయం: మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పుర కమిషనర్ భోగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. తాగునీటి ఇబ్బందులు, డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడం, దోమలబెడద, పందులు, కుక్కల స్వైరవిహారం, వీధిలైట్లు వెలుగకపోవడం, ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు, ఇళ్ల మధ్య మురుగునీరు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
నేడు పీయూకు విద్యా కమిషన్ రాక
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ రానుందని పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పీయూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో విద్యా కమిషన్ చైర్పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, కమిషన్ మెంబర్స్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేష్, జ్యోష్నశివారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. ఇందులో విద్యా బలోపేతం, బోధన లోపాలు, వసతుల కల్పన తదితర అంశాలను కమిషన్కు తెలియజేస్తే వారు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్రెడ్డి, రవికాంత్ పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. దూరం!
నారాయణపేట: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతివనాల్లో వేప, తంగెడు, చింత, టేకు, కానుగ, ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు.. కొన్నేళ్లుగా గాలికొదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. బోర్డులకే పరిమితం.. తెలంగాణకు హరితహరం.. వార్డుకో ఉద్యానవనం పేరిట మూడేళ్ల క్రితం రూ.లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయి. పట్టణ ప్రకృతివనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల అంతకుముందే మొక్కలు ఉండగా.. పట్టణ ప్రకృతివనం బోర్డు ఏర్పాటుచేసి నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, ప్రజలకు అహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం.. హరితహరంలో నాటిన మొక్కలు లేని చోట వనమహోత్సవంలో మొక్కలు నాటించి పెంచుతాం. మొక్కల సంరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకుంటాం. పట్టణ ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట. నిర్లక్ష్యపు నీడలో పట్టణ ప్రకృతివనాలు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం నిర్వహణ లోపంతో పెరగని మొక్కలు పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారిన వైనం -
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
కోస్గి రూరల్: మున్సిపాలిటీ ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రెవె న్యూ మేళాకు ట్రెయినీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి మార్పిడి, ఆస్తిపన్ను హెచ్చుతగ్గులు, యజ మాని పేరు, ఇంటి నంబర్ సరిచేయడం, కొత్తగా ఇంటి నంబర్లు జారీ చేయడం తదితర వాటిపై ప్రజల నుంచి 412 అర్జీలు అందినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. వీటిని క్రోడీకరించి రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు లేని వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అనిల్కుమార్, శ్రీదేవి, పెంటయ్య, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్ఐ స్టోర్, ఎంటీ సెక్షన్ ఆఫీస్, స్టోర్రూంలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం కోసం వచ్చే వస్తువులను అందరికీ లిస్ట్ ప్రకారం ఇవ్వాలన్నారు. స్టోర్ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఉపయోగంలో లేని వస్తువులు, ఫర్నిచర్ను వేలం వేయాలన్నారు. అనంతరం పోలీసు మోటారు ట్రాన్స్ఫోర్ట్ సెక్షన్లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. పోలీసు వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనానికి సంబంధించిన స్పేర్ స్పాట్స్ జాగ్రత్తగా ఉంచి.. అవసరమైన వాహనాలకు అందించాలని తెలిపారు. మెకానిక్స్, డ్రైవర్స్, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని.. ప్రతి వస్తువు సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎస్పీ వెంట ఆర్ఐ నర్సింహ, సీఐ శివశంకర్, స్టోర్ ఇన్చార్జి ఏఆర్ ఎస్ఐ శంకర్జీ, రైటర్ నరేశ్ తదితరులు ఉన్నారు. -
కాళ్లు మొక్కుతా.. ఇల్లు మంజూరు చేయండి
కోస్గి రూరల్: నా భర్త మృతిచెందాడు.. కూతురి, నేను కూలి పనిచేసుకొని బతుకీడుస్తున్నాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి సారూ.. అంటూ ఓ మహిళ కమిషనర్ కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పట్టణంలోని 9వ వార్డు పరిదిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు పర్యవేక్షిస్తుండగా చింతల్శెట్టి మణెమ్మ కమిషనర్ను కలిసింది. తమ ఇల్లు శిథిలావస్థకు చేరిందని, వెనుకభాగంలో కొంత కూలిపోయిందని, వర్షం పడితే ఇల్లు మొత్తం కురుస్తుండడంతో పైన ప్లాస్టిక్ కవర్ కప్పుకొని బతుకుతున్నామని తెలిపింది. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ ఒక్కసారిగా కమిషనర్ కాళ్లపై పడింది. స్పందించిన కమిషనర్ మహిళ కుటుంబ వివరాలు నమోదు చేసుకొని ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. -
నాలాలు మాయం
నారాయణపేట: జిల్లా కేంద్రంలో నాలాలను, వాటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించి యథేచ్ఛగా భారీ భవంతులు నిర్మించారు. డ్రెయినేజీలపైనా నిర్మాణాలు చేపట్టారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే నీరు ముందుకు పారేందుకు అవకాశం లేక.. లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందని.. తమకు ఎప్పటికై నా ముప్పు పొంచి ఉందని లోతట్టు కాలనీల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలా కబ్జాకు గురైందన్న సమాచారం తెలిసినా.. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కచ్చా నాలాలు ఇరిగేషన్వి.. పేట పురపాలికలో ఉన్న ప్రధాన నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చే వరద నీరు పళ్ల ఏరియా, యాద్గీర్రోడ్, ప్రతిభ కళాశాల వెనకభాగం నుంచి ఒల్లంపల్లి రోడ్లోని బ్రిడ్జి దగ్గర వరకు ఉన్న నాలా ఒకటి. అమ్మణ్ణబాయి నుంచి లింగయ్యగుడి, గాంధీనగర్, సాయివిజయ్కాలనీ, ఎస్పీ ఆఫీస్పక్కన, ఆర్టీసీడిపో పక్క నుంచి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ పక్కన, అశోక్నగర్, సత్యనారాయణ స్వామి ఆలయం సమీపం నుంచి ఒల్లంపల్లి బ్రిడ్జి దగ్గర మరో నాలా కలుస్తుంది. ఈ రెండు నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నవంటూ అధికారులు చెబుతున్నారు. కాగా అమ్మణ్ణబాయి నుంచి వచ్చే నాలా అక్కడక్కడ సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిందని.. కొండరెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చిన నాలా మాత్రం ఇరిగేషన్ పరిధిలో ఉంది.జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కబ్జాలు.. అడ్డగోలు నిర్మాణాలు డ్రెయినేజీలపైనా కట్టడాలు భారీ వర్షాలు కురిస్తే ముందుకు పారని నీరు లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు భయాందోళనలో ప్రజలు -
నాలాల్లో సగం కబ్జాలే..
మున్సిపాలిటీలో నాలాలు ఉండే వెడల్పులో వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అవుతున్నాయనేది స్పష్టంగా కానవస్తుంది. నాలాలను పూర్తిస్థాయిలో విస్తరించినట్టయితే.. వరదలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. వర్షం పడితే లోతట్టు ప్రాంతాల్లో, కొత్త కాలనీల్లో వరద నీటితో ఇబ్బందులు తప్పడం లేదంటూ జనం వాపోతున్నారు. ఇదిలాఉండగా, పట్టణంలో డ్రైనేజీలను ఆనుకొని కొందరు.. కబ్జా చేస్తు కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారు. వాటిపై మున్సిపల్ అధికారులకు మౌఖిక ఫిర్యాదులు అందుతున్నా వాటిని తొలగించేందుకు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితి కానవస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతో నాలాలు, డ్రెయినేజీలను అక్రమించుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నాలాలను కబ్జా చేస్తే చర్యలు నిబంధనల మేరకే భవనాల నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఇస్తున్నాం. డ్రెయిన్లపై, నాలాలను అక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు
నారాయణపేట: జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈమేరకు మంగళవారం అన్ని మండలాల తహసీల్దార్లతో వరదల ప్రవాహం, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ, కొత్త రేషన్ కార్డుల జారీ పై సమీక్ష జరిపారు. ప్రస్తుతం సీజన్లో వరదల ప్రవాహ సమాచారంపై అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల తహసీల్దార్లకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాద స్థాయి ఎంత అనే పూర్తి వివరాలను ఆయా మండలాల తహపీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం మూడో దశ భూ సేకరణ పనులు ఎంత వరకు వచ్చాయని, ఇంకా ఎన్ని ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉందని అడిగారు. అధికారులు సమన్వయంతో భూ సేకరణను పూర్తి చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులందరికీ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీవో రామచందర్ నాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. బాలసదనం సందర్శన జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. సదనంలో ఎంత మంది చిన్నారులు ఉన్నారని ఆరా తీయడంతోపాటు చిన్నారుల స్టడీ అవర్, వారి బోధనా పటిమను పరిశీలించారు. ఓ చిన్నారి వేసిన యోగాసనాల చూసి అభినందించారు. అందరూ బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అలాగే సదనం లోని వంట గదిని పరిశీలించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల సంరక్షణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దన్నారు. -
జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం
నారాయణపేట టౌన్: జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం.. అన్న ప్రార్థనలతో జిల్లా కేంద్రం మార్మోగింది. సోమవారం జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు హారతి, పూజలు చేశారు. సరాఫ్ బజార్ బాలాజీ మందిరం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. భక్తుల జై జగన్నాథ, హరేరామ్.. హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు వీధులో మార్మోగాయి. జగమేలే జగన్నాథుడి రథయాత్ర దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రథన్ని లాగేందుకు జనం పోటీపడ్డారు. రథయాత్ర మెయిన్ చౌక్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ మాదిరిగా ఆడి పాడారు. పలు ధార్మిక సంస్థ సభ్యులు హాజరై రథయాత్రలో భాగంగా స్వయంగా తాడుతో రథాన్ని లాగారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కనులపండువగాజగన్నాథ రథయాత్ర -
మళ్లీ పగిలిన మిషన్ భగీరథ పైపులైన్
మరికల్: మన్యంకొండ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుంచి జిల్లాకు నీరు అందించే ప్రధాన పైపులైన్కు మరమ్మతు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే మళ్లీ పగిలింది. మరికల్, అప్పంపల్లి మధ్య తరచు లీకేజీ అవుతున్న ప్రధాన పైపులైన్ను మరమ్మతు చేయడం కోసం మిషన్ భగీరథ అధికారులు 36 గంటల సమయం తీసుకొని సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఆదివారం రాత్రి వరకు మరమ్మతులు పూర్తి కావడంతో అదే రాత్రి మన్యంకొండ గ్రిడ్ నుంచి నారాయణపేట జిల్లాకు నీటిని వదిలారు. అలా నీటిని వదిలిన గంట వ్యవధిలోనే మరికల్ శివారులో లీకేజీకి మరమ్మతు చేసిన ప్రదేశంలోనే మళ్లీ పైపులైన్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున పత్తి పంటల్లో నీరు వరదలా ప్రవహించడంతో చాకలి రాజు 3 ఎకరాల్లో సాగు చేసిన పత్తి మొక్కలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో రూ. 50 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాకు మళ్లీ నీటి సరఫరా నిలిచిపోవడంతో పైపులైన్ మరమ్మతులు పనులు అధికారులు నాసీరకంగా చేస్తున్నారనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తోంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని సిబ్బంది కారణంగా పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు నిండి మురుగు రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ కంపు..కంపు కొడుతున్నాయి. ఇళ్ల మధ్య నిలిచే మురుగు.. పందులు, దోమలకు ఆవాసాలు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతోపాటు పలు కొత్త కాలనీల్లోని రోడ్లపై నిత్యం మురుగు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల ముప్పు మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలను సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. ఇళ్ల మధ్య మురుగు కుంటలు ఏర్పడడం, కొత్త కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, విధిగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, చెత్త తరలించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమకాటుతో ప్రజ లు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల భారిన పడుతున్నారు. అంతేగాక, వర్షాలు పడుతుండడంతో పలు చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు కావడం, డ్రెయినేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా వ్యాధులు వచ్చే అవకాశముందంటూ భయందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పేట’ పురపాలికలో వర్షానికే నిండుతున్న డ్రెయినేజీలు రోడ్లపై మురుగుతో కంపుకొడుతున్న కాలనీలు పందుల స్వైర విహారం.. దోమల బెడద తీవ్రం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులముప్పు -
ఇసుక తరలించే ప్రయత్నాలు మానుకోవాలి
మాగనూర్: ప్రభుత్వం,అధికారులు గ్రామస్తుల, రైతుల అంగీకారం లేకుండా ఇసుక తరిలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలను సైతం లేక్క చేయమని అధికారులకు మాగనూర్ రైతులు గ్రామస్తులు హెచ్చరించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పైపుల తయారీ కోసం ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఆయన మాగనూర్ గ్రామ సమీపంలోని హెన్హెచ్–167 వంతెన పక్కనే ఇసుక తరలించేందుకు స్థానిక రెవెన్యూ అధికారుల సహయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఇక్కడ ఇసుక తరలిస్తే ఊరుకోం అన్ని ఈ నెల 27వ తేదీన వాగులోకి వచ్చిన యంత్రాలను టిప్పర్లను అడ్డగించి తిప్పి పంపించారు. అయినా అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే ఇసుక తరలించేందుకు సోమవారం పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు అధికారులు గ్రామస్తులను కాదని ముందుకు వెళితే మరో లగచర్ల, గద్వాల జిల్లాలోని ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. దీంతో అధికారులు తహసీల్ధార్ కార్యాలయంలో గ్రామస్తులు, రైతులతో శాంతి చర్చలు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం అందరి సహకారం ఉండాలని తహసీల్ధార్ నాగలక్ష్మి, సిఐ రాంలాల్ కోరారు. గ్రామ సమీపంలో ఇసుక తరలిస్తే రైతుల పొలాలు ఎండిపోవడంతో పాటుగా గ్రామస్తులకు తాగునీరు లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. మాగనూర్ మండలంలో పెద్ద వాగు ఇటు నేరడగం నుంచి అటు మందిపల్లి వరకు చాలా ప్రాంతాల్లో ఇసుక లభ్యం అవుతుందని అక్కడ నుంచి తరలించుకోవాలని సూచించారు. కాదని ఇక్కడే ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు పోయినా పిడికెడు ఇసుక కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. చేసేది లేక పనులకు కావాల్సిన ఇసుకను వర్కూర్ గ్రామం నుంచి 80 శాతం తరలిస్తామని తెలిపారు. మిగిలిన 20 శాతం ఇసుక సమయం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తరలించాలనే విషయంపై మేం నిర్ణయం తీసుకుంటామని తహసీల్ధార్ తెలిపారు. ఈ సమావేశంలో మాగనూర్ గ్రామస్తులు, రైతులు , రెవెన్యూ అధికారులు, పోలిసులు తదితరులు ఉన్నారు. -
పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
నారాయణపేట: మున్సిపల్ అధికారులు పనితీరుపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అనుకూలంగా పనిచేస్తున్నా, కొందరు అధికారులు పనులు చేయడం లేదని పనితీరు మార్చుకోవాలని లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం సరిగ్గా నిర్వహించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, వీధి లైట్లు అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని కమిషనర్కు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా చేయాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలు తొలగించాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి మరీ నల్లా బిల్లులు చెల్లించాలని ప్రజలను బలవంతం చేయొద్దని సూచించారు. నాయకులను కలుపుకొని పోవాలి.. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీంతోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ.. కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పనులు చేపట్టడంలేదని, ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే వార్డుల్లో అధికారులు మార్క్ అవుట్ లో ఇస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న గృహాలకు నెంబర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నాయకులను కలుపుకొనిపోవాలని, తప్పనిసరిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చి ఇళ్ల గ్రౌండింగ్ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమస్యలన్నీ నెల రోజుల్లో అధికారులు పరిష్కరించాలలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, ఇంజనీర్ మహేష్, అధికారులు శ్రీనివాస్,లకి్ష్మ్ నర్సింహ, చెన్న కేశవులు, నాయకులు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, నాయకులు గందే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ అర్జీలను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 ఫిర్యాదులు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో 9 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యోగేష్గౌతమ్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని, ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. సమగ్ర నివేదికలతో రండి నారాయణపేట: అధికారులు సమగ్ర నివేదికలతో మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్న్స్కు హాజరుకావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్కు ఏసి (ఆర్), డి.డబ్యూఓ, డీఈఓ, డీఎంహెచ్ఓ ఇతర శాఖల అధికారులు అన్ని నివేదికలను సిద్ధం చేసుకుని హాజరు కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు
మద్దూరు: పర్యావరణ పరిరక్షణతోపాటు.. గ్రామాల్లో చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచడానికి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో దర్శమిస్తున్నాయి. ప్రకృతి వనాల చుట్టూ ముళ్ల కంచెలు పూర్తిగా ధ్వంసమై పోవడంతో పశువులు సంచరిస్తున్నాయి. కొన్ని పార్కుల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసినా సిమెంట్ కుర్చీలు, బల్లాలు విరిగిపోయాయి. అక్కడక్కడా ఊరికి ఆనుకుని ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లోనే కొంత సందడి కనిపిస్తున్నా.. మెజార్టీ గ్రామాల్లో ఊరికి దూరంగా కిలోమీటర్ల దూరంలో పార్కులను ఏర్పాటు చేయడంతో అటువైపు ఎవరూ వెళ్లడమే లేదు. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ఈ వనాలు ఉపయోగపడకపోవడంతో రూ.లక్షల నిధులు వృథా అయ్యాయి. కొందరు వీటిని అసాంఘిక కార్యకలాలపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 2021లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని అప్పటి 11 మండలాల్లో మొత్తం 343 పల్లె ప్రకృతి వనాలను రూ. 5.23 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం 5 ఎకరాల పైనా ఉన్న గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను 28 వరకు ఏర్పాటు చేశారు. ఈ వనాల ఏర్పాటు కోసం ఉపాధి హామీ పథకం నుంచి రూ.97.33 లక్షలు వెచ్చించారు. పల్లె ప్రకృతి వనాలలో వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచె మొక్కలు, ఓపెన్ జిమ్ లాంటివి ఏర్పాటు చేశారు. మొక్కలను పెంచడానికి ఒక వాచర్ను కూడా నియమించారు. రెండేళ్ల తర్వాత నిర్వహణ మొత్తం జీపీలకు అప్పగించారు. ఇది మద్దూరు మండలంలోని దోరేపల్లి గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం. ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో గుట్టల్లో నిర్మించారు. అప్పట్లో మొత్తం 460 మొక్కలను నాటారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి గేటు అమర్చారు. అయితే ఊరికి దూరంగా ఉండడంతో ప్రజలెవరూ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొంత కాలం క్రితం ఇనుప కంచెను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రస్తుతం గేటు, చుట్టూ సిమెంట్ దిమ్మెలు మాత్రమే ఉన్నాయి. అందులో నాటిన మొక్కలు ఒక్కటీ లేవు. ఈ మధ్య కాలంలో వర్షాలు పడడంతో ప్రకృతి వనం మొత్తం పిచ్చిమొక్కలు మొలిచాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరికొన్ని రోజుల్లో గేటు, సిమెంట్ దిమ్మెలను కూడా దొంగిలించే అవకాశం లేకపోలేదు. నిధుల కొరతతో.. గత కొంత కాలంగా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. వేసవి కాలంలో వీటిని పట్టించుకోకపోవడంతో వనాల్లో మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీటి నిర్వహణ చేపట్టి కొత్త మొక్కలను నాటి అంబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కొన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాలు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిర్వహణ మరిచారు.. ఊరికి దూరంగా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడంతో ఎందుకు పనికిరాకుండా పోయింది. ఊరికి సమీపంలో నిర్మించి ఉంటే దాన్ని నిర్వహణ చేపట్టపోయినా అడిగేవాళ్లం. 2 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో అక్కడి వెళ్లలేకపోతున్నాం. ప్రకృతి వనం చుట్టూ ఏర్పాటు చేసిన కంచె ఎవరో ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులైతే గేటు కూడా తీసుకెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు మొక్కలు నాటి, నిధులు మంజూరు చేసి పక్కాగా నిర్వహణ చేపట్టాలి. – శ్రీనివాస్గౌడ్, దోరేపల్లి కొత్త మొక్కలు నాటుతాం.. జిల్లాలో ఏర్పాటు చేసినా పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఊరికి దగ్గర ఉన్నవి బాగున్నాయి. ఊరికి దూరంగా ఉన్నవి అక్కడక్కడ నిర్వహణ లేకపోవడంతో పాడైన మాట వాస్తవం. మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పంచాయతీ సిబ్బందిచే బాగుచేయిస్తున్నాం. ఎండిన మొక్కల స్థానంలో ఈ వర్షాకాలంలో కొత్తవాటిని నాటుతాం. మొక్కలు ఎండకుండా విధిగా నీరు అందిస్తాం. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – సుధాకర్రెడ్డి, ఇన్చార్జ్ డీపీఓ, నారాయణపేట -
సర్వేయర్లు కావాలె..
మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జో.గద్వాల 20 9 11 నాగర్కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు 2 వేలకుపైగానే ఎఫ్లైన్ అర్జీల పెండింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు -
పది నెలల్లో మూడు సార్లు
● గతేడాది సెప్టెంబర్లో దేవరకద్ర నుంచి నారాయణపేట వరకు ఉన్న భగీరథ పైపులైన్లో లీకేజీలను సరి చేయడం కోసం పది రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు. ● జనవరిలో మళ్లీ మరికల్ నుంచి నారాయణపేట మధ్య పైపులు లీకేజీలు ఏర్పడడంతో వాటిని మరమ్మతు చేయడం కోసం ఆరు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేసి సరిచేశారు. ● తాజాగా జూన్లో మరికల్ – అప్పంపల్లి మధ్య రెండు చోట్ల ప్రధాన పైపులైన్ లీకేజీ కావడంతో ఈ సారి మూడు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేస్తున్నారు. మరికల్, అప్పంపల్లి మధ్య మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్కు మరమ్మతు చేస్తున్న సిబ్బంది -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. ప్రాజెక్టులకు రక్షణ లేదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. జూరాల క్రస్ట్ గేట్ల రోప్లు తెగుతున్నాయంటే.. వాటితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని మాట్లాడే వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రి కావడం మన దురదృష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తూ రైతులకు సాగునీరు అందించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు పంపడమే పనిగా పెట్టుకుందని.. అలాంటి పాలకులపై ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజలు మరోమారు బీఆర్ఎస్ పాలనే రావాలంటూన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. -
సోమశిలకు సొబగులు
● జటప్రోలు, కొల్లాపూర్లోని పురాతన ఆలయాల అనుసంధానం ● కృష్ణాతీరంలోని సుందర ప్రాంతాలు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం ● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిలో సిద్ధమవుతున్న లాంచీ – సాక్షి, నాగర్కర్నూల్సోమశిల కేంద్రంగా టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చెందితే మరింత విస్తృతంగా స్థానికులకు ఆదాయం సమకూరేందుకు అవకాశం కలగనుంది. ఇప్పటికే సోమశిలలో హోం స్టే విధానంలో తమ ఇళ్లను తీర్చిదిద్దుకున్నారు. పదుల సంఖ్యలో రిసార్ట్లతో పాటు వందకు పైగా ఇళ్లను హోంస్టేకు అనువుగా మలచుకున్నారు. తమ ఇళ్లలో ఉండేందుకు వసతులు కల్పించడంతో పాటు రుచికరమైన ఇంటి భోజనాన్ని పర్యాటకులకు అందిస్తున్నారు. ఆర్డర్పై చేపల పులుసు, కూరలు, రొట్టెలు, అన్నం ఇతర వంటకాలను పర్యాటకులకు అందిస్తున్నారు. సోమశిల గ్రామానికి వీకెండ్స్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నెలలో కనీసం 15 రోజుల పాటు స్థానికులు ఆదాయం పొందుతున్నారు. తమ ఇళ్లను హోంస్టేలుగా మార్చి అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎకో టెంపుల్ టూరిజం ఒకేచోట కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాలైన సోమశిల, అమరగిరి ద్వీపం, నార్లాపూర్ గ్రామాల్లో కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, కనెక్టింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అలాగే నల్లమలలోని ఈగలపెంటలో అరైవల్ జోన్, రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ పేరుతో టూరిజం క్లస్టర్ ఏర్పాటు, కొల్లాపూర్లోని మాధవస్వామి ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ సర్క్యూట్ను ఏర్పాటు చేస్తారు. సోమశిల సర్క్యూట్లోనే ఫారెస్ట్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకోసం అమరగిరి ద్వీప ప్రాంతంలో 18 కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, స్విమ్మింగ్పూల్, కేఫేటేరియా, స్పా అండ్ వెల్నెస్ సెంటర్, ఇన్డోర్, అవుట్ డోర్ గేమ్స్, వాటర్స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కొల్లాపూర్ పట్టణంలోని రాజావారి ప్యాలెస్ను సైతం సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. పురాతన భవనాల నిర్మాణ శైలి తో పాటు బంగ్లాలోని పురాతన ఫర్నిచర్, అలనాటి వైభవం, నిర్మాణ ఆకృతులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. కొల్లాపూర్లో రాజా వారి ప్యాలెస్ హోంస్టేల ద్వారా స్థానికులకు ఆదాయం.. -
ఉపాధి కోసం వచ్చాం..
ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 60 మందికి వచ్చాం. మాకు అక్కడ ప్రస్తుతం పనులు లేవు. ఇక్కడ కొన్ని ఎకరాల చొప్పున గుత్త మాట్లాడుకొని పనులు చేస్తాం. మాకు తినడానికి, ఉండడానికి అవసరమయ్యే సౌకర్యాలు రైతులు కల్పిస్తారు. మేం అందరం కూడా కలిసి పని చేస్తాం. వచ్చిన డబ్బును అందరం సమానంగా పంచుకుంటాం. మాకు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయనే మాకు పొలాలను చూయించి రైతులకు, మాకు మధ్య వారధిగా ఉంటాడు. – లవ్కుమార్, వలస కూలి, యూపీ వారి వల్లే సరైన సమయంలో నాట్లు.. మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల నుంచి జిల్లాలో వరినాట్లు వేసేందుకుగాను కూలీలు వస్తుంటారు. వీరు రావడం మూలంగా మా పొలాల్లో సరైన సమయంలో వరి నాట్లు వేస్తున్నాం. దాంతో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో కూలీల కొరత ఎక్కువగా ఉండడం, అది కూడా అధిక రేట్లు అడుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు లేకుండా వలస కూలీల ద్వారా మా పొలాలు సాగు చేస్తున్నాం. – రవిగౌడ, గుర్జాల్ రైతు ● -
ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి
నారాయణపేట: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నారాయణపే ట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వసం వెంకటేశ్వర రెడ్డి సూచించారు. శనివారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ఆస్పత్రి లోని అత్యవసర విభాగం, జనరల్ వార్డు, ఐసీయూ, జనరల్ మందుల విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి లో ఉన్న వసతి సౌకర్యాలు, అవసరమైన వసతులు, ఖాళీ పోస్టుల తదితర అంశాలను వివరించారు. జిల్లా జనాభా, మెడికల్ కళాశాల పరిధి, జిల్లా ఆస్పత్రి విస్తీర్ణం, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలు, సర్జరీలు, ఎన్ని జరుగుతాయో సరాసరి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటెన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల, జిల్లా ఆస్పత్రికి ఇంకా ఏయే వసతులు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా ఆచార్య పోస్టులు అవసరం, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, అందుబాటులోని వసతులు, కొత్తగా సమకూర్చాల్సిన వసతుల నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి రెండు రోజుల్లోగా ప్రతిపాదనలు పంపుతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్, వైద్య నిపుణులు ఆదిత్య, టీజీ ఎమ్ఐడిసి డీ.ఈ. కృష్ణ మూర్తి, ఏ ఈ సాయి మురారి పాల్గొన్నారు. -
వలస జిల్లాకే.. వలసలు
కృష్ణా: ఒకప్పుడు వలస కార్మికులకు పుట్టినిల్లుగా పేరుగాంచింది నారాయణపేట జిల్లా. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ముంబాయి.. పూణె.. తదితర మహానగరాలకు వలస వెళ్లేవారు ఇక్కడి ప్రజలు. నేడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రాజెక్టులు.. సాగునీటి కాల్వల పుణ్యమా అని ప్రతి ఎకరా సాగులోకి రావడం.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడంతో ఇప్పుడు జిల్లాకే ఇతర రాష్ట్రాల కూలీలు ఉపాధి కోసం వలస వస్తున్నారు. మహారాష్ట్ర, యూపీ ప్రజలు కూడా ఇక్కడి పనుల కోసం వలస రావడం గమనార్హం. ఇదిలా ఉండగా కృష్ణా, బీమా నది పరివాహక ప్రాంతంలోని రైతులు గత వారం రోజుల నుంచి వరినాట్లు ప్రారంభించారు. నెల రోజుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది నిండుగా ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడి రైతులు పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని భావించి వరినాట్లు వేసే పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కృష్ణా, భీమా నదీ తీరాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేశారు. ఈ పరిస్థితులలో ఇక్కడున్న కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రైతులు తీసుకొస్తుంటారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కృష్ణా రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి వలస కూలీలు గుడెబల్లూర్, టైరోడ్, ముడుమాల్, తంగిడి, గుర్జాల్ తదితర గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో వ్యవసాయ పనులకు తరలి వస్తున్నారు. నదీతీర ప్రాంతాల్లోని సాగు పనులకు కూలీలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర నుంచి వందలాది మంది రాక జిల్లాలో నెల రోజులపాటు కొనసాగనున్న వ్యవసాయ పనులు -
డిసెంబర్ నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్
కృష్ణానదిలో విహారం కోసం ఇప్పటికే పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు జాలరులు ప్రైవేటుగా బోటు విహారాన్ని కల్పిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వచ్చే నెలలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ క్రూయిజ్ ప్రయాణాన్ని పర్యాటకశాఖ అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ఇప్పటికే లాంచీ క్రూయిజ్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి లాంచీ క్రూయిజ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాంచీ అందుబాటులోకి వస్తే కృష్ణానదిలో ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తూ ఆరుగంటల పాటు నదిలో ప్రయాణించేందుకు వీలు కలుగనుంది. కృష్ణానదిలో బోటులో విహారం చేస్తున్న పర్యాటకులు -
పర్యావరణానికి పెద్దపీట
నర్వ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖలు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం ఏకోక్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరిట ఏర్పాటు చేయాలని ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 31 నాటికి సంబంధిత వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని హెచ్ఎంలకు సూచించింది. పాఠశాలల్లోని ప్రతి తరగతిలో చురుకై న విద్యార్థులు ఐదు మందిని క్లబ్లో భాగస్వామ్యం కల్పించాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. ఈ క్లబ్లో పాఠశాలల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. పర్యవేక్షణ కోసం హెచ్ఎంలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి పర్యావరణపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని సూచించింది. దీంతో పాటు వివిద రకాల కార్యక్రమాల ద్వారా చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా.. పాఠశాల పిల్లలతో క్లబ్లు ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టునుంది. ఈ క్రమంలో విద్యార్థులకు బాధ్యతలు నేర్పించడం, వారి హక్కులకు పరిరక్షించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థుల కోసం 1098 నంబర్ను, పోలీస్ సేవల కోసం డయల్ 100 నంబర్లను గోడలపై రాయించడమే కాకుండా వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక నిధులు మంజూరు జిల్లాలో మొత్తం 406 పాఠశాలకు గాను 2024–25 వార్షిక ఏడాదిలో ఏకో క్లబ్ల నిర్వహణ కోసం రూ.16.82 లక్షలు విద్యాశాఖ మంజూరు చేసింది. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 299 గాను రూ.8.97 లక్షలు , యూపీఎస్ పాఠశాలలకు 86కు గాను రూ.4.30 లక్షలు, ఉన్నత పాఠశాలలు 63కుగాను రూ.3.15 లక్షలు, హెచ్ఎస్ఎస్ పాఠశాలలకు 8కు గాను రూ.40 వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలకు ఒక్కో పాఠశాలకు రూ.3 వేలు, మిగిలిన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.5 వేల చొప్పున కేటాయించారు. 2025–26 కు విద్యాసంవత్సరానికి గాను పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికై న 19 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున రూ1.90 లక్షలు మంజూరయ్యాయియి. తప్పక అమలుచేయాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యూత్ అండ్ ఏకో క్లబ్లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణంపై ప్రాథమిక దశలోనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది నుంచి ఈ క్లబ్ల ద్వారా పాఠశాలల ఆవరణలో కిచెన్గార్డెన్స్ ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్కు నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాల కోసం నిధు లు మంజూరయ్యాయి. ప్రతి పాఠశాలలో వారు చేపట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలల్లో టోల్ఫ్రీ నంబర్లు విధిగా రాయించాలి. విద్యార్థులకున్న హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. – విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి క్లబ్ ద్వారా నేర్పించేవి.. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పెంచడం మొక్కలను, ప్రకృతిని విద్యార్థులకు పరిచయం చేయడం పర్యావరణంపై విద్యార్థులకు అవగతమయ్యేలా ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేసేలా వివిధ నినాదాలతో వాల్పోస్టర్లు రూపొదించడం పర్యావరణ, ధరిత్రి దినోత్సవాలు, చర్చగోష్టీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించడం పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి వాటి సమాచారం తెలుసుకునేలా చూడటం తోటలను పెంచి ఆకుకూరలు, కూరగాయలను మధ్యాహ్న బోజనం తయారీలో వినియోగించటం ఈ వ్యర్థాల సేకరణపై అవగాహన తరగతులు నిర్వహించటం పాఠశాలలో నీటి వృథా, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిపై అవగాహన పాఠశాలల్లో ఏకో క్లబ్ల ఏర్పాటు విద్యార్థి స్థాయి నుంచే అవగాహనకల్పించేందుకు చర్యలు ఆరోగ్యకరమైన జీవనశైలియే లక్ష్యం పీఎంశ్రీ పాఠశాలల్లో క్లబ్ల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు -
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
నారాయణపేట: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆపరేషన్ ముస్కాన్–11 కి సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు బాలల సంక్షేమ సమితి, లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో జులై 1 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్లో ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. అలాగే నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కి సంబంధించి యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ లింగయ్య, డీసీఆర్బీ, లేబర్ ఆఫీసర్ మహేష్ కుమార్, రాధ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్అడ్మిషన్లు ప్రారంభం మరికల్: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెన్నరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితోపాటు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు జులై 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యలో చదువు మానేసిన వారు, ఏదేని పనిచేసుకుంటూ చదువు కొనసాగించాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశమని, పూర్తి వివరాలకు సెల్ నం.9985523526, 83418 51534లను సంప్రదించాలని తెలిపారు. 5న సాగునీటి సమస్యపై సదస్సు పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సాగునీరు సమస్యలపై జూలై 5న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం మహబూబ్నగర్లోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందని తెలిపారు. కానీ కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు ఉన్న కావాల్సిన నీరు లేక భూములు బీడుగా మారుతున్నాయని వాపోయారు. మొక్కజొన్న @ రూ.2,310 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,310, కనిష్టంగా రూ.2,248 ధరలు లభించాయి. జొన్నలు గరిష్టంగా రూ.4,230, కనిష్టంగా రూ.2,000, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,601, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,929 ధరలు పలికాయి. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, నాగర్కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు పూర్తయితేనే.. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్లో భాగమైన ఎల్లూర్ పంప్హౌస్లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి జలకళ ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానదిలో కొనసాగుతున్న వరద రిజర్వాయర్లో 125 టీఎంసీలకు చేరువైన నీరు ఈ సారి జూన్ నెలలోనే సగానికిపైగా నిండిన ప్రాజెక్టు -
పంద్రాగస్టులోగా దరఖాస్తులను పరిష్కరించాలి
నారాయణపేట: జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను ఆగస్టు 15 ( పంద్రాగస్టు) లోపే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్తో కలిసి అన్ని మండలాల తమసీల్దార్లతో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆరా తీశారు. ఇప్పటి వరకు పరిష్కరించిన, తిరస్కరించిన వాటిపై చర్చించారు. 200లోపు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని, ఏదైనా సమస్యాత్మకంగా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్డిఓ రామచంద్రనాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:15 గంటలకు కలెక్టర్ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రార్థన లో పాల్గొని, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. నిర్ణీత సమయానికి ఎంత మంది ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారని ఆరా తీశారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్లో మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతోపాటు మరో ఐదుగురు స్టాఫ్ రాలేదని నిర్ధారించారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
స్పాన్సర్లకు అవకాశం.. మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. కాన్వకేషన్లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ● పీయూలో 4వ కాన్వకేషన్కు సిద్ధమవుతున్న అధికారులు ● హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం ● యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్మెడల్స్ ● రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇచ్చే అవకాశం -
‘నా ఇల్లు అమ్మి అయినా సరే బిల్లులు ఇస్తా..’
మక్తల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని.. నిధులు అందవనే భయంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించకపోవడం సరికాదని, అవసరమైతే తన ఇల్లు, ఆస్తులు అమ్మి అయినా సరే డబ్బులు చెల్లిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మున్సిపాలిటీలోని 291 మంది, మండలంలోని 600 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందుకుగాను రూ.175 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, ఒకవేళ ఎవరైన దళారులకు డబ్బులు ఇస్తే వారిపై చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇళ్ల ప్రొసీడింగ్లను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని, గ్రామాల్లో పెంకుటిల్లు కనిపించకూడదని అన్నారు. రైతులకు సైతం రుణమాఫీ చేసిందని అన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, అధికారులు విధిగా పరిశీలించి ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ పిడి శంకర్, కమిషనర్ శంకర్నాయక్, ఎంపీడీఓ రమేస్, తహసీల్దార్ సతీష్కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మక్తల్ మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనె, రేడియం జాకెట్లు అందజేశారు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై అపోహలు వద్దు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
ఘనంగా నిర్వహిస్తాం..
పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 9, యూజీ కోర్సులలో టాపర్స్లో 17 మంది గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ● -
సమష్టి కృషితోనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం
నారాయణపేట: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే లభించే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారి మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు గుర్తిస్తే 1908 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. తర్వాత యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు, జిల్లా అధికారులు బహుమతులను అందజేశారు. అలాగే, ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏఎస్పీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఈఓ గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, డీపీఆర్ఓ ఎం.ఏ. రషీద్ పాల్గొన్నారు. -
నీరు కలుషితమయ్యే ప్రమాదం
వర్షాకాలంలో అధికంగా కలుషిత నీరు తాగడం వల్లే రోగాల బారిన పడతారు. ఇలాంటి అంటువ్యాధులను దృష్టిలో ఉంచుకొని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలి. అలాగే ఇళ్లకు సరఫరా అయ్యే భగీరథ, స్థానిక నీటి వనరుల బోర్ల వద్ద నీటిని సేకరించి పరీక్ష చేయాలి. అవి తాగడానికి ఉపయోగపడతాయి అంటే సరఫరా చేయాలి. లేదంటే అంటువ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. – ఆంజనేయులు, మాజీ సర్పంచ్, పల్లెగడ్డ నీటి పరీక్షలు చేస్తున్నాం వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథకు సంబందించిన వాటర్ గ్రిడ్ల దగ్గర నిత్యం పరీక్షలు చేసిన తర్వాతనే గ్రామాలకు, పట్టణాలకు నీటి సరఫరా చేస్తున్నాం. లీకేజీలను పూర్తిగా ఆరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ, ఎక్కడో ఒక చోట పైపులైన్ లీకేజీలు అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి మరమ్మతు చేసి కలుషిత నీరు సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించాం. – సరిత, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ● -
జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలివ్వాలి
నారాయణపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం) ఆధ్వర్యంలో డీఎల్పీఓ సుధాకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి.నర్సింహా, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శిలు ఎదిరింటి నర్సింమ, బోయిన్ పల్లి రాములు మాట్లాడుతూ కార్మికులకు చాలీచాలని వేతనాలు నెలకు రూ.9,500 ఇస్తున్నా ఆవి సైతం రెగ్గులర్గా ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నరన్నారు. ప్రభుత్వం వారితో పని చేపించుకొని వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జీవో ఆరవై ప్రకారం జీతాలు పెంచాలని, పీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూట్ చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 51 రద్దు చేయాలని, అందరిని పర్మిట్ చేయాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు నరేష్, రాంచందర్, హన్మంతు, తాయప్ప, మహాదేవ్, తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ముప్పు..
జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. ప్రాజెక్టు క్రస్ట్గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల ● -
తాగునీరు సురక్షితమేనా..?
మరికల్: జిల్లాలో సరఫరాలో అవుతున్న నీటిలో నాణ్యత ఎంత అనేది ప్రశ్నార్థకమవుతోంది. వర్షాకాలం నేపథ్యంలో విధిగా తాగునీటి పరీక్షలు పెంచాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జిల్లాలో పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పైపులైన్ లీకేజీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు దాని వెంట అంటు వ్యాధులను తీసుకురావడం సాధారణమైపోయింది. ఈకాలంలో అందరూ తాగునీటి వనరుల నాణ్యతపై దృష్టి సారించాలి. ప్రస్తుతం జిల్లాలో మిషన్ భగీరథ పథకంతో పాటు స్థానిక సంస్థల ద్వారా చాలా గ్రామాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం శరవేగంగా సమాయత్తం కావాల్సి ఉంది. జలాశయాలు, ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు అనేక చోట్ల ఏర్పాటుచేసిన ప్రజా కొళాయిలను గాలికి వదిలేస్తున్నారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా మరిచారు. ట్యాంకులు, మురికివాడల నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. ముఖ్యంగా పాఠశాలల కుళాయిల్లో నీటిని పరీక్షించాలనే బాధ్యత అందరూ విస్మరించారు. ముందుజాగ్రత్తలతో ఎంతో మేలు గ్రామాల్లోని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా దాని శాతం నీటిలో ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం క్లోరింగ్ పరీక్ష ఉపయోగపడుతుంది. అలాగే వర్షాకాలంలో పైపులైన్ లీకేజీల కారణంగా నీటిలో బ్యాక్టీరియా చేరినా క్లోరింగ్ చేస్తే అవి చనిపోతాయి. ఈ పరీక్షలను ఇంటి వద్ద వచ్చే కొళాయిల దగ్గర శిక్షణ పొందిన సిబ్బందితో పాటు కార్యదర్శికి ఇచ్చిన కిట్ ద్వారా నీటిని పరీక్షిస్తే క్లోరింగ్ శాతం ఉందో లేదో తేలిపోతుంది. అలాగే, గ్రామ పంచాయతీ సిబ్బందితో ఏటా నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షలు, నీటి ట్యాంకులు తరచూ శుభ్రం చేయించడం, ఫిల్టర్ బెడ్ల గృహాల వద్ద ఉండే నల్లాల నుంచి నమూనాలు సేకరణ, లీకేజీలు ఉంటే మరమ్మతు చర్యలు, వానాకాలంలో ప్రతిరోజు క్లోరిన్ టెస్టు కిట్ల ద్వారా నాణ్యత స్థాయిని పరిశీలించాల్సి ఉంది. కిట్లు ఉన్నా.. వినియోగించని వైనం రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి శాఖ ద్వారా రూ.వేలు వెచ్చించి కిట్లను అందజేస్తోంది. అంతే కాకుండా పంచాయతీలోని తాగునీటి సిబ్బందికి వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందజేస్తోంది. కిట్లు అందజేయడం, శిక్షణ ఇవ్వడం బాగానే ఉన్నా వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడా పరీక్షించిన దాఖలాలు కనిపించలేదు. ఈసారి అలా కాకుండా ప్రతి బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచుగా పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయాలపై పంచాయతీలు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పరీక్షల్లో నాణ్యత లేవని తేలితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో కలవర పెడుతున్న లీకేజీలు మన్యంకొండ నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన పైపులైన్కు తరచూ లీకేజీలు జిల్లాలో 400 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా జాడ లేని నీటి పరీక్ష కిట్లు.. జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం -
నిర్లక్ష్యమేలా..?
నారాయణపేటశుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని..ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్గేట్లకు ఉన్న ఇనుప రోప్లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
రీవెరిఫికేషన్
గతేడాది ఫిబ్రవరి 20న అప్పటి కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్హెచ్పీ, వీసీసీఎం పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలుపుదల చేశారు. ఆతర్వాత కలెక్టర్ల బదిలీలో కోయ శ్రీహర్ష బదిలీ కావడంతో జూన్ 16న ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. మరో సారి జూలై 2న నోటిఫికేషన్ విడుదల చేసి జూలై 3 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు 25 స్టాఫ్ నర్సు పోస్టులకు 503 మంది దరఖాస్తు చేయగా.. 5 ఎంఎల్హెచ్పీ పోస్టులకు 140 మంది, ఒక్క వీసీసీఎం పోస్టుకు 84 మంది దరఖాస్తు చేసుకున్నారు. 15వ తేదీ నుంచి 25 వరకు దరఖాస్తులను పరిశీలించారు. అయితే, 26న ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో ఉంచాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. తిరిగి సెప్టెంబర్ 20న లిస్టు ఉంచారు. 29వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం విడుదల కాకపోవడం.. అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. గత డీఎంహెచ్ఓపై పలు ఆరోపణలు రావడంతో ఆమెను డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు సరెండర్ చేశారు. ఆ తర్వాత బదిలీపై వచ్చిన ప్రస్తుత డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ సమక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. -
తీపికబురు..
స్టాఫ్నర్స్, ఎంఎల్హెచ్పీ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ● ఆన్లైన్లో మెరిట్ లిస్ట్.. వారంలో ఫైనల్ లిస్ట్ ● 24న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ● 16 నెలల ఎదురుచూపులకు తెర ● అదృష్టవంతులు ఎవరో..? నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని 16 నెలలుగా ఎదురుచూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు సంబంధించి వారం రోజుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే తీపికబురు అందనుంది. దరఖాస్తుల పరిశీలన జిల్లాలో చేపడుతున్న నియామకాలపై గతంలో వచ్చిన అనుమానాలకు తావులేకుండా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో డీఎంహెచ్ఓ కలిసి స్టాఫ్నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను జల్లెడ పట్టారు. గతంలో ఆన్లైన్లో పెట్టిన మెరిట్ లిస్ట్ ఆధారంగా వాటిని క్షణ్ణంగా పరిశీలించి మరోసారి ఈ నెల 16న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ను ఉంచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో 8 మంది తమకు మెరిట్ లిస్టులో ఎందుకు రాలేదని అడగగా వాటిని సైతం పరిశీలించి అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం 21 స్టాఫ్ నర్సు, 5 ఎంఎల్హెచ్పీ పోస్టులకు గాను 1:3 ప్రకారం అభ్యర్థులను తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆన్లైన్లో మెరిట్ లిస్టులో ఉన్న వారు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచించారు. ఈ నెల 24న జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ సిక్తా పట్నాయక్తో పాటు డీఎంహెచ్ జయచంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సమక్షంలో 78 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
కోస్గిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం మంజూరు చేస్తుందని.. నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని డీఆర్డీఓ మోగులప్ప అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. చంద్రవంచ గ్రామానికి 220 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 102 మంది లబ్ధిదారులు బెస్మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారని, ఇందులో 52 మందికి మొదటి విడత రూ.లక్ష వారి ఖాతాల్లో పడ్డాయని, మిగతా వారికి సోమవారం పడనున్నామని తెలిపారు. అనంతరం మండలంలోని నాచారం గ్రామంలోని కేజీబీవీ పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మీర్జాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి మఽధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనాన్ని చేశారు. చెన్నారంలో హర్టీకల్చర్ లో మొక్కల నాటడాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో యంపిడిఓ శ్రీదర్ , పంచాయతి కార్యదర్శి సునిత ,తదితరులున్నారు. -
యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలి
నారాయణపేట: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం డీడబ్ల్యూఓ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ, అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు సూచించారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో కలెక్టరేట్, పోలీస్, ప్రెస్, డీడబ్ల్యూఓ మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి. మొదట పోలీస్ జట్టు, కలెక్టరేట్ జట్లు తలపడగా.. పోలీస్ జట్టు విజయం సాధించింది. అనంతరం డీడబ్ల్యూఓ, ప్రెస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగగా.. ప్రెస్ జట్టు విజయం సాధించింది. చివరగా పోలీస్ జట్టు, ప్రెస్ జట్టు తుది పోరులో తలపడగా పోలీస్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్లకు ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్, డీపీఆర్ఓ రషీద్ కప్ లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐ నరసింహ, డీవై ఎస్ ఓ వెంకటేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరుకు లైన్క్లియర్
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది. పల్లెల్లో పడకేసిన పాలన.. గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ -
‘ఎమర్జెన్సీ చీకటి ఘట్టం’
నారాయణపేట రూరల్: యాబై ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ కాలం దేశ ప్రజలకు చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ అన్నారు. బుధవారం నారాయణపేటలో బిజెపి వికారాబాద్ జిల్లా ఇన్చార్జ్ పి.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కె.సత్య యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అధికార దాహంతో కోర్టు తీర్పును అపహస్యం చేస్తూ ఒక్క కలం పోటుతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఎందరో నాయకులు, ప్రముఖులను అరెస్ట్ చేయించి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించి తూట్లు పొడిచారని అన్నారు. చివరకు పత్రికా స్వేచ్ఛను కాలరాసిందని విమర్శించారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గల్లంతై ఇందిరాగాంధీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేక పోయిందని అన్నారు. ఎమర్జెన్సీతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాంగ్రెస్కు గట్టి బుద్ది చెప్పారని అన్నారు. నేడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికల్లో బుద్ది చెప్పారని అన్నారు. -
మెనూ తప్పనిసరిగా పాటించాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. మెనూ చార్ట్ను చూసి మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తున్నా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాఠశాలలో నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించి ఏ రోజుకారోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వంటకు వినియోగించాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందించాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ అధికారి యాదయ్య శెట్టి, సీఎంఓ రాజేంద్ర కుమార్ అన్నారు. బుధవారం జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని, బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసి వంట చేయాలని సూచించారు. విద్యార్థులకు మెన్ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి చేర్పించాలని అన్నారు. గతేడాది కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా చేరారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఏం భారతి, టీచర్లు భాను ప్రకాష్, మధుసూదన్ రావు, రఘురాం రెడ్డి, వంట నిర్వాహకులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు, స్కానింగ్ సెంటర్లలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల అర్హత ధ్రువపత్రాలతో పాటు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఫీజులపై ఆరా తీశారు. స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించిన ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే స్కానింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంట ఇన్చార్జి డెమో అధికారి శ్రీనివాస్ ఉన్నారు.విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంనారాయణపేట: ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించి మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భగత్సింగ్ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో 6శాతం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. 2025 నాటికి 2.6శాతం నిధులతో సరిపెట్టిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా కేవలం 0.6శాతం నిధులు పెంచి 7.6 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టే ధర్నాలో విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, వెంకటప్ప బాలరాజ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, రాము, కృష్ణ మారుతి, వసుంధర, అనిత పాల్గొన్నారు.నేడు మార్కెట్కు సెలవుదేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం సెలవు కారణంగా ఉల్లి వేలం, ధాన్యం క్రయవిక్రయాలు జరగవని వ్యాపారులు తెలిపారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉంటుందని, దీనివల్ల ప్రతివారం జరిగే ఉల్లిపాయల బహిరంగ వేలం కూడా జరగదన్నారు. అయితే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ బయ ట ఉల్లి విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో తిరిగి గురువారం క్రయవిక్రయాలు కొనసాగుతాయి. -
నారాయణపేట బంద్ సంపూర్ణం
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అర్ధాంతరంగా అప్పక్పల్లి సమీపంలో ఉన్న మెడికల్ కళాశాల భవనంలోకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట బంద్ విజయవంతమైంది. బీజేపీ జిల్లాశాఖ పిలుపు మేరకు వ్యాపారులు, ప్రజలు బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి.. ఒక బస్సు కూడా డిపో నుంచి కదలకుండా ధర్నా చేపట్టారు. జిల్లా ఆస్పత్రిని యథా స్థానంలో ఏర్పాటు చేసేంత వరకు తమ ఆందోళన ఆగదని నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ బస్టాండ్లోనే కూర్చున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ నందు నామాజీ, కేంద్ర సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్, రఘురామయ్యగౌడ్, సిద్ధి వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేర మొక్కలు నాటాలి
నారాయణపేట: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని శాఖల వారీగా నిర్దేశించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ కె.రామకృష్ణారావు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వీఐపీలు మొక్కలు నాటేందుకు 21 ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా జిల్లాలో ఆయిల్పాం తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తోటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వానాకాలం సాగు నేపథ్యంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఏఓ జాన్ సుధాకర్, డీఆర్డీఓ మొగులప్ప, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్ తదితరులు ఉన్నారు. -
పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
పాలమూరు: ఎంపీగా ఈ ఏడాదిలో పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఏడాది పాలన సంతృప్తినిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని, ఏడాదిలో రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి రాయిచూర్ రోడ్ నాలుగు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అంగీకరించిందని, ఎన్హెచ్–44 6 లైన్లు అప్గ్రేడ్ చేశారని, కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించినట్లు చెప్పారు. నారాయణపేట మీదుగా ఎన్హెచ్–167 కర్ణాటక వరకు వెళ్లే రోడ్డు నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలల్లో వాటాలుగా నిధులు విడుదలలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. విద్యాపరంగా ఎన్నికల హామీ మేరకు ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, నవోదయ, సైనిక్ స్కూళ్లు తెచ్చుకున్నామన్నారు. అమృత్ స్టేషన్లలో భాగంగా పార్లమెంట్ పరిధిలో రూ.39.87 కోట్లతో మహబూబ్నగర్ రైల్వేస్టేషన్, మరో రూ.10.94 కోట్లతో జడ్చర్ల, రూ.9.59 కోట్లతో షాద్నగర్ రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కృష్ణ– వికారాబాద్ రైల్వేలైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మహబూబ్నగర్ మీదుగా వందేభారత్ను ప్రారంభించుకున్నట్లు వివరించారు. అమృత్ స్కీం కింద పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.400 కోట్లు మంజూరయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర మంత్రుల సహకారంతో పాలమూరు అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. అనంతరం ‘వికసిత్ భారత్లో పాలమూరు నియోజకవర్గం’ పేరుతో బుక్లెట్ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలతో భవిష్యత్ అంధకారం
మక్తల్: మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మక్తల్ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి అత్యంత కీలకమైనదన్నారు. ఈ సమయంలో మత్తుకు బానిస కావొద్దన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద కొందరు చాకెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని.. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో అందరి సహకారంతో మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే 1908 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం మక్తల్ పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎకై ్సజ్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, ఎంఈఓ అనిల్గౌడ్, ప్రిన్సిపాల్ రాములు పాల్గొన్నారు. -
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతన కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో సెక్రెటరియేట్లో పీయూకు సంబంధించి ఈసీ (ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, విద్యా శాఖల అధికారులతోపాటు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబుతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పీయూలో నూతనంగా ప్రారంభించే లా, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈసీ ఆమోదం తెలిపింది. అలాగే విద్యార్థులకు కల్పించే వసతులు, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇక టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఆమోదం కూడా జరిగింది. కానీ, ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని వీసీ పేర్కొన్నారు. అంతేకాకుండా పీయూలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి మెడికల్ రీయింబర్స్మెంట్ అవకాశం కల్పించే దానికి కూడా అనుమతించారు. 137 మంది సిబ్బంది.. పీయూలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై ఈసీలో చర్చ జరిగింది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 137 మంది సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు ఈసీ ముందు ఉంచగా దీనిపై పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో పీయూలోని పీజీ కళాశాల ప్రారంభంలో ఇచ్చిన జీఓ, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ వంటి పీజీ కళాశాలల ఏర్పాటు క్రమంలో ఇచ్చిన జీఓ సిబ్బంది నియామకానికి ఇచ్చిన అనుమతులపై ఈసీలో ప్రభుత్వ అధికారులు ప్రశ్నించారు. దీనిపై పీయూ అధికారులు పూర్తిస్థాయిలో వారు అడిగిన వాటికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే త్వరలో నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు వీసీ చెప్పారు. ఆమోదం తెలిపిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ వసతుల కల్పన, టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సైతం అనుమతులు నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలపెంపుపై చర్చ రెగ్యులర్ అధ్యాపకులకు మెడికల్ రీయింబర్స్మెంట్ -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విష యం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబితా రూపొందించి కలెక్టర్కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
స్థానిక పోరుకు కసరత్తు
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వం సన్నద్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటి ఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్కర్నూల్లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమో దం తెలిపి పార్లమెంట్కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ప్రధాన పార్టీల సమావేశాలతోవేడెక్కుతున్న రాజకీయ వాతావరణం -
ఇక క్షేత్రస్థాయి పరిశీలన
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025 రెవెన్యూ గ్రామసభలు గత శుక్రవారంతో ముగిశాయి. రైతులు ఇక తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ..ఊరు దాటక్కర్లేదు.. కాలు కదపక్కర్లేదు.. రెవెన్యూ అధికారులే మీ గడప వద్దకు వస్తారనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన భూ భారతి కార్యక్రమం గ్రామస్తుల్లోని రైతుల్లో విశ్వాసం నింపింది. జిల్లాలోని 12 మండలాల్లో 234 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 4,052 మంది రైతుల నుంచి తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందించారు. ఇందులో అత్యధికంగా నారాయణపేట మండలంలో 1230 దరఖాస్తులు రాగా..అత్యల్పంగా నర్వ మండలంలో 107 మంది వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు, రైతుల వద్దకే సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. జూన్ 2 నుంచి నిర్వహించిన రెవెన్యూ సదస్సులు నాలుగు రోజుల క్రితం ముగిశాయి. సర్వేయర్లు, రెవెన్యూ ఇన్న్స్పెక్టర్లు, అధికారులు గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి వారి భూ సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో భూ భారతితో సంబంధిత అవగాహన సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా లు చేపట్టారు. ఈ పథకం మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని మద్దూర్ మండలాన్ని ఎంపిక చేశా రు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యా ప్తంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కొత్త చట్టం ప్ర కారం, రైతులు వారి భూమి సమస్యలపై సంబంధి త ఫారాల ద్వారా అధికారులకు సమాచారం అందించారు. తర్వాతి దశలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో ప్రధానంగా మిస్సింగ్సర్వే నంబర్లు సరిచేసేందుకు 1284మంది రైతులు, భూముల ఎక్స్టెంట్ను సరిచేసేందుకు 776మంది, పేర్లు సరిచేయాల ని 335 మంది దర ఖాస్తు చేసుకున్నారు. 234 ప్రత్యేక బృందాలు.. జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో రెవెన్యూ అధికారుల బృందాలు స్వీకరించిన 4,052 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 234 రెవెన్యూ గ్రామాల్లో అధికారుల బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందడుగు వేశారు. భవిష్యత్తులో భూ వివాదం, ఘర్షణలు జరగొద్దనే ఉద్దేశ్యంతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు రెవెన్యూ అధికారుల బృందాలు చెబుతున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని అన్ని మండలాల్లోని సర్వేయర్లకు ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆగస్టు 15 నాటికి అందరూ భూమి సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందేలా ఉచితంగా పరిష్కారాలు అందించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వేయర్లు అవసరమైన సర్వేలు నిర్వహించి, భూమి గీతలు ఖచ్చితంగా గుర్తించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ‘భూ భారతి’కి సమస్యల వెల్లువ రెవెన్యూ సదస్సులో 4,052 దరఖాస్తులు అత్యధికంగా ‘పేట’లో 1230.. అత్యల్పంగా నర్వలో 107 దరఖాస్తులు మిస్సింగ్ సర్వే నంబర్లు, ఎక్స్టెంట్,పేర్ల సవరణవే అధికం -
తెలంగాణలోనే మోడల్గా ఉర్దూ ఘర్
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణలోనే ఒక మోడల్గా మహబూబ్నగర్లోని ఉర్దూ ఘర్ నిలవనుందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఉర్దూ ఘర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి షబ్బీర్అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్లో అధునాతనమైన ఉర్దూ ఘర్ నిర్మాణమవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే చాలా కష్టమన్నారు. హిమాలయ పర్వతంలోని అంచువరకు ఎక్కొచ్చుగాని ప్రభుత్వం నుంచి డబ్బులు తేవడం కష్టమని, ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు, అందులో రూ.15 కోట్లతో ఉర్దూ ఘర్ నిర్మిస్తున్నందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి వరకు చాలా మంది మైనార్టీ విద్యార్థులు ఉర్దూ తీసుకోవడం లేదని, దీంతో కళాశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకం అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఉర్దూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ రోజు మహబూబ్నగర్ చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉర్దూ ఘర్ నిర్మించుకోవాలనే కల నెరవేరుతుందన్నారు. చదువును జీవితంలో భాగం చేసుకోవాలని, చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ ఉర్దూ ఘర్ మనలోని ఐక్యతకు చిహ్నం అన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం సీఎంతో మాట్లాడి రూ.45 కోట్లు మంజూరు చేయించారన్నారు. రూ.5 కోట్లతో మౌలాలిగుట్టలో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి జహంగీర్పీర్ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబాని తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టిమిరిస్ చైర్మన్ ఫహిమోద్దీన్ ఖురేషి, మైనార్టీ గురుకులాల కార్యదర్శి షపీవుల్లా, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, అబ్దుల్ హాదీ, సిరాజ్ఖాద్రీ, సాదుల్లా, అజ్మత్అలీ, ఫయాజ్, తఖీయోద్దీన్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్అలీ షబ్బీర్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నారాయణపేట: దివ్యాంగుల వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారకశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మొక్కలు నాటి మాట్లాడారు. యువత దేశానికి వెన్నెముక వంటి వారని, మత్తు పదార్థాల బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, అందరూ చదువుకొని దేశభక్తిలో భాగం కావాలన్నారు. అదే విధంగా ఎస్పీ కార్యాలయంలో మొక్కలను ఎస్పీ యోగేష్ గౌతమ్ నాటి మాట్లాడారు. వారం రోజులు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు లభిస్తున్నట్లు తెలిస్తే పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. -
మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత
కోస్గిరూరల్: కోస్గి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో నాంపల్లి మెట్రోపాలిటీ కోర్టులో పనిచేయగా బదిలీపై కోస్గికి వచ్చారు. ఇక్కడ పని చేసిన న్యాయమూర్తి ఫర్హిన్బేగం హయత్నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. కోస్గి బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్, వీఎన్గౌడ్, శకనప్ప, మురళీనామాజీ, రాములు, రాజలింగం, భీమేష్, మల్లిఖార్జున్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట
నర్వ: దూప దీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట కార్యక్రమం చేపట్టామని డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాడపాటి జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం నర్వ మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అర్చకుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను హిందూ సమాజానికి అందిస్తూ, ధర్మ పరిరక్షణకు కృషిచేస్తున్న అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం అర్చకులను కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో డీడీఎన్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోషి రామాచారి, ప్రవీణ్ కడ్మూర్, మండల అధ్యక్షుడు నర్సింహయ్య, నాగస్వామి, అంపయ్య, మధుసూదన్చారి, సిద్ధయ్య పాల్గొన్నారు.పెండింగ్ బిల్లులు చెల్లించండినారాయణపేట రూరల్: ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎయిడెడ్ దయానంద్ విద్యా మందిర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దుచేసి.. ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హెచ్ఎంల పోస్టులను భర్తీ చేయడంతో పాటు డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు వేతన సమస్య తీర్చడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. రెండేళ్లుగా ప్రకటించాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే వెలువరించి.. మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులకు బకాయి బిల్లులతో పాటు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులు, మిగిలిన డీఏలను చెల్లించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల పనివేళలు మార్చాలని.. కేజీబీవీ టీచర్లకు బేసిక్ పే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాములు, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షులు కె.బాలాజీ, రవికుమార్, గోవిందు, వెంకట్ నాయక్, వెంకటేశ్, శంకర్ ఉన్నారు.4 వేల బస్తాల వరిధాన్యం రాకనవాబుపేట: స్థానిక మార్కెట్కు ఆదివారం ఆర్ఎన్ఆర్, ఇతర సీడ్ (1010)లు కలిసి దాదాపు 4 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. కాగా.. వరి (1010) రకం 1,209 బస్తాలు రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.1,963 ధర వచ్చింది. అలాగే వరి ఆర్ఎన్ఆర్ 3,628 బస్తాలు రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.2,285, కనిష్టంగా రూ.1,512 ధర పలికిందని కార్యదర్శి తెలిపారు. -
రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు
నారాయణపేట: స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కృషితో గతంలో ఎన్నడూ లేనివిధంగా 18 నెలల కాలంలోనే రూ. 3,272 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు తేలేని ఐరన్ లెగ్ ఎస్ఆర్.రెడ్డి అని.. ఎమ్మెల్యే గోల్డెన్ లెగ్తో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తూర్పారబట్టారు. ఆదివారం స్థానిక సీవీఆర్ భవన్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ. 2.945 కోట్లు, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రూ. 40కోట్లు, నర్సింగ్ కళాశాలకు రూ. 26కోట్లు, 33/11కేవీ సబ్స్టేషన్లకు రూ. 11కోట్లు, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10కోట్లు, ఎస్సీ కాలనీల అభివృద్ధికి రూ. 10కోట్లు, బీటీరోడ్లకు రూ. 13కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ. 35.79కోట్లు, జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్కు రూ. 1.23 కోట్లు, మహిళా సమాఖ్య నూతన భవనానికి రూ. 5కోట్లు మంజూరైనట్లు వివరించారు. అదే విధంగా రూ. 175కోట్లతో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 7.50 కోట్లతో చిల్డ్రన్ ఆస్పత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆకాల వర్షాలతో జిల్లా ఆస్పత్రి భవనం కూలిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచన మేరకు మెడికల్ కళాశాలలోకి మార్చడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రి భవనం తొలగించి, నూతన కమ్యూనిటీ ఆస్పత్రి భవనం నిర్మిస్తామన్నారు. 2018 ఎన్నికల సమయంలో కృష్ణాజలాలతో రైతుల కాళ్లు కడుగుతానని.. లేకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన వ్యక్తి 2023లో ఎందుకు పోటీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోయిల్కొండ మండలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసని అన్నారు. బీజేపీ నాయకులకు ప్రతీది రాజకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, ఆర్టీఓ బోర్డు సభ్యుడు రాజేశ్కుమార్, నాయకులు మనోహర్గౌడ్, గందె చంద్రకాంత్, వకీల్ సంతోష్, సరాఫ్ నాగరాజ్, మాజీ కౌన్సిలర్ మహేశ్, వెంకుగౌడ్ ఉన్నారు. -
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
ఆర్టీసీ బాదుడు
●ఇష్టారీతిగా పెంచడం సరికాదు గతంలో చిల్లర సమస్య పేరుతో చార్జీలను రౌండ్ ఫిగర్ చేసి భారం మోపిన ఆర్టీసీ తాజాగా కిలోమీటర్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నట్లు అసంబద్ధంగా ఇష్టారీతిగా చార్జీలు పెంచడం సరికాదు. ప్రతి టికెట్పై రూ.10, టోల్గేట్ దాటితే అదనంగా మరో రూ.10 వసూలు చేస్తున్నారు. సీజన్ పాస్ నెలకు మరో రూ.400 చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – సందీప్, ప్రయాణికుడు, నారాయణపేట పేద విద్యార్థులపై ఆర్థిక భారం.. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆర్టీసీ బస్సుల్లో పట్టణాలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరికాదు. రూ.75 నుంచి ఏకంగా రూ.275 చొప్పున నెలవారి రాయితీ పాసుల ధరలను పెంచడం ఆయా కుటుంబాలకు మోయలేని భారంగా మారుతుంది. ఆడపిల్లలతోపాటు చదువుకునే బాలురకు సైతం ఉచితంగా పాసులు అందించి ఆదుకోవాలి. – నరేష్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్, నారాయణపేట స్వల్పంగా పెరిగింది.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్గేట్ ధరలను పెంచుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అందుకు అనుగుణంగా ప్రయాణికుల టికెట్పై ఆ భారాన్ని సరిచేస్తారు. ఈసారి కొంత ఆలస్యంగా వాటిని అమలు చేశాం. ఇక పల్లె వెలుగు మాదిరి ఎక్స్ప్రెస్ బస్సులకు సైతం రౌండప్ కిలోమీటర్లకు టికెట్ ధరను సరిచేయడంతో కొన్ని స్టేజీలకు టికెట్పై స్వల్పంగా ధర పెరిగింది. – సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ – నారాయణపేట రూరల్ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు కిలోమీటర్ల రౌండ్ ఫిగర్తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్కి లెక్కించి టికెట్ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరుతో టికెట్ ధరలను రౌండప్ పేరుతో పెంచారు. తాజాగా మరోసారి కిలోమీటర్లను సర్దుబాటు చేస్తున్నామనే పేరుతో రూ.10 పెంచేశారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం పడనుంది. దీనికితోడు టోల్గేట్ దాటి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆయా మార్గాల్లోని ప్రయాణికులపై గరిష్టంగా రూ.20 భారం పడినట్లయ్యింది. సర్దుబాటు, టోల్ ప్లాజా పేర్లతో.. -
ఆమడదూరంలో అపార్
వంద శాతం పూర్తి చేస్తాం విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డులో, అడ్మిషన్ రికార్డులలో వేరువేరుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సాంకేతిక సమస్యలు తొలగిపోతే పూర్తిస్థాయిలో అపార్ నమోదు జరగనుంది. ఆధార్ తప్పులను సరి చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలో వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ ●‘నారాయణపేట మండలంలోని భైరంకొండ గ్రామానికి చెందిన విద్యార్థి పుట్టినతేదీ యు డైస్లో ఒక విధంగా, ఆధార్ కార్డులో మరో విధంగా ఉండటంతో అపార్ జనరేషన్ కాలేదు. అలాగే షేర్నపల్లికి చెందిన ఓ విద్యార్థిని యు డైస్లో ఇంటి పేరు ఉండగా, ఆధార్కార్డులో లేకపోవడంతో మ్యాచ్ కాక అపార్ జనరేట్ కాలేదు.. జిల్లాలో ఇలా చాలామంది విద్యార్థులకు ఈ పరిస్థితి నెలకొంది. మొదటి స్థానంలో కొత్తపల్లి.. చివరలో నర్వ జిల్లాలోని 13 మండలాల్లో ప్రక్రియ మందకోడిగానే సాగుతోంది. కొత్తగా ఏర్పాటు అయిన కొత్తపల్లి మండలంలో 62శాతం అపార్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలువగా, 42 శాతం మాత్రమే ఆన్ లైన్ చేసి నర్వ చివరి స్థానంలో ఉంది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్న సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆధార్ సమాచారం సరి చేసుకోవడానికి పెట్టుకునే దరఖాస్తు పరంగా అవసరమైన పత్రాలను తొందరగా మంజూరయ్యే విధంగా మండల యంత్రాంగం దృష్టి సారించడంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను తెరిస్తే విద్యార్థులకు ప్రయోజన కరంగా ఉంటుంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మందకొడిగా సాగుతున్న విద్యార్థుల నమోదు ● ఆధార్తో వివరాలు సరిపోక తీవ్ర జాప్యం ● విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు ● నూతన విద్యా సంవత్సరంలో ప్రారంభం కాని ప్రక్రియ ● జిల్లాలో 61శాతం మాత్రమే పూర్తి.. నారాయణపేట రూరల్: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కార్పొరేట్ విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సంఖ్యను కేటాయించాలని నిర్ణయించారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం 2023 అక్టోబర్ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఆధార్ లోని సమాచారం విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్ లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఎందుకు కారణంగా నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికాక ఆలస్యం అవుతుందని వాదన వినిపిస్తుంది. సమాచారంలో తేడాలతో జాప్యం చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక ఐడీలు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ అపార్ కార్డులను మంజూరు చేయనున్నారు. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని, కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరుస్తారు. ఉన్నత విద్యా ప్రవేశాలు, పోటీ పరీక్షల కు ఈ డిజిటల్ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని 13 మండల పరిధిలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో కలిపి 1,04,428 మందు విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా కేవలం 55,699 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటి వరకు అపార్ కు అనుకూలంగా ఉండి 61శాతం నమోదైంది. మిగతా విద్యార్థులకు సంబంధించిన సమాచారంలో తేడాలు ఉండడంతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ఆధార్ లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ లలో అడ్మిషన్ రిజిస్టర్ లతో పోలికలు కుదరక అపార్ జనరేట్ కావడం లేదు. అన్ని వివరాలు సరిపోలిన విద్యార్థులకి ఇబ్బంది లేకుండా అపార్ నమోదవుతుంది. కొన్నిచోట్ల ముఖ్యంగా పాఠశాలలలో ఆధార్ ను సరిచూసుకొని వారి అడ్మిషన్ రికార్డులలో వివరాలు సరిచేసి అపార్ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్ కార్డు లోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండడంతో స్థానికంగా ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం యోగా అని, నిత్యం యోగ సాధన ద్వారా మన జీవనశైలిని మెరుగుపరుచుకోవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సమితి– భారత స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తదితరులు హాజరై యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు ఎన్నో దేశాలలో యోగా దినోత్సవం జరుపుకోడం ద్వారా యోగాకు నిత్య జీవితంలో ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుందన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు చదువుతో పాటు యోగా చేయించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా జీవన విధానంలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఆచరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బిజెపి రాష్ట్ర నేత నాగురావు నామాజీ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ పాల్గొన్నారు. ఆయుష్సు పెంపు.. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడంతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాస్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వింధ్య నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా ఆసనాలు వేయాలని, వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఒత్తిడి దూరం పోలీసులు ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం సమయం దొరికినప్పుడు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. మొదటగా యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింలు యోగాను సిబ్బందికి తెలియజేస్తూ, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది వయస్సుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధన అని, గుండెకు, శరీరానికి, మనసు ప్రశాంతతకు యోగా ఆసనాలు ఉపయోగపడతాయన్నారు. ఏఎస్పి రియాజ్ హూల్ హక్, డీఎస్పీ లు ఎన్ లింగయ్య, మహేష్, సిఐ నరసింహ, సిఐ శివ శంకర్ పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కోస్గి: కొడంగల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే నంబర్ నియోజకవర్గంగా మారుతుందని, రానున్న అతి తక్కువ సమయంలోనే కొడంగల్ నియోజవర్గ దశదిశ మారుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కోస్గి మున్సిపల్ పరిధిలో రూ.305 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయనతోపాటు కడా చైర్మన్ వెంకట్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కన బెట్టి ప్రజలందరు మన ప్రాంతం అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు కోస్గి మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా పథకానికి రూ.15.99 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ.145.81 కోట్లు, వరద నీటి కాల్వల నిర్మాణం కోసం రూ.72.28 కోట్లు, చెరువుల సుందరీకరణ కోసం రూ.5.99 కోట్లు, అంతర్గత రహదారులు రూ.61.60 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. వార్ల విజయ్ కుమార్, రఘువర్దన్రెడ్డి, బెజ్జు రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. కోస్గిలో రూ.305 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ -
కోడే దూడలకు డిమాండ్..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అటవీ మేతతో దృఢంగా ఉండటం.. 20–25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం వీటి సొంతం. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడ్మిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వట్టువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. మన్ననూర్ గిత్తగా నామకరణం.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే)లో ఈ ప్రాంత రైతులతో కలిసి తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన, పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల వరకు మాత్రమే ఉన్నాయి. ఏటేటా ఈ అరుదైన పశుజాతి తగ్గిపోతోంది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనేవారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతరాలతో పశుగ్రాసం కొరత ఏర్పడి.. పశుపోషణ భారంగా మారి చాలామంది వీటిని వదులుకుంటున్నారు. వ్యవసాయ అనుబంధమైన పశుపోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశుసంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి.. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తా రు. ప్రతి ఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతుంటారు. గతంలో జత గిత్తలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. రైతులను ప్రోత్సహించాలి నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలవయ్య, మన్ననూర్, అమ్రాబాద్ వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం.. నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. – గెంటెల హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు సంతతి పెంచేందుకు కృషి.. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట కొనసాగుతున్న పరిశోధనలు.. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంది. ఈ పశుజాతిపై ఏడాదిగా ప్రత్యేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటికి తూర్పుజాతి పశువుగా గుర్తింపు లభించింది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోగనిరోధక శక్తి ఎక్కువే.. నల్లమల పశువులకు రోగనిరోధక శక్తి అధికమే. అటవీ ప్రాంతంలో ఉండే ఔషధ మొక్కలు, రకరకాల మూలికలను ఈ పశువులు తినడం వల్ల రోగాలను తట్టుకునే శక్తి వీటికి అధికంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే శక్తి కూడా అధికమే. తక్కువ పశుగ్రాసంతో ఎక్కువ పనిచేస్తోంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా పనిచేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ పశువులకు త్వరగా అలసిపోయే గుణం ఉండదు. అటవీ ప్రాంతంలో పశువుల మందపై క్రూరమృగాలు దాడి చేసినా.. చురుకుగా తప్పించుకుంటాయి. తూర్పుజాతి పశువు వేడి, చలి వంటి వాతావరణం తట్టుకుని జీవిస్తాయి. ఇవీ ఎంతో తెలివైనవని.. వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని పరిశోధనలో తేలిందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ బ్రాండ్గా తూర్పుజాతి పశుసంపద నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు మన్ననూర్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు -
ఆయకట్టుకు సాగునీరు
●నారుమడి వేసుకున్నా.. యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేసినా నీరందక ఆశించిన దిగుబడి రాలేదు. వానాకాలంలో ఎడమ కాల్వకు నీటిని ముందస్తుగా వదులుతారన్న ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. మరోమారు 5 ఎకరాల్లో వరి పండించేందుకు పొలం సిద్ధం చేసుకుంటున్నా. – మోహన్రెడ్డి, రైతు, సింగంపేట ఆనందంగా ఉంది.. జూరాల ఎడమకాల్వకు ముందస్తుగా సాగునీరు వదలడం సంతోషంగా ఉంది. ఆదివారం నీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. ఉన్న 5 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు వరి నాడుమడి ఇప్పటికే సిద్ధం చేసుకున్నా. ముందస్తుగా నీటిని వదులుతుండటంతో అనుకున్న దిగుబడి చేతికందే అవకాశం ఉంది. – బానా గిర్రెన్న, కానాయపల్లి (కొత్తకోట) మంత్రి చేతుల మీదుగా విడుదల.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో వానాకాలం పంటల సాగుకుగాను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఎడమ కాల్వకు నీరు వదులుతున్నాం. జూన్లోనే ఆయకట్టుకు నీరందిస్తున్నాం.. పొదుపుగా వినియోగించుకోవాలి. వానాకాలంలో పూర్తిస్థాయిలో నీటిని రోజువారీగా అందించనున్నాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల క్యాంపు డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు వదిలితే సాగు పనులు ప్రారంభిస్తారని.. ఉన్న నీరంతా దిగువకు వెళ్లిన తర్వాత వదలడంతో తలెత్తే సమస్యను అధికారులు ముందస్తుగా గుర్తించడం సంతోషకరమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు 100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు... జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తుండటంతో వరితో పాటు చెరుకు సాగు చేస్తున్నారు. అధికారుల సూచనల మే రకు నీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతుంది. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
నారాయణపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, చెరువు, శిఖం భూములు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎక్కడైనా ఆక్రమణకు గురైతే టోల్ ఫ్రీ నం.9154283914 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారించి నిబంధనలకు అనుగుణంగా చర్య లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.215 కోట్లు జమ నారాయణపేట: జిల్లాలో ఇప్పటి 1,67,721 మంది రైతుల ఖాతాల్లో రూ.215 కోట్ల 15 లక్షలు రైతు భరోసా నగదు జమ అయ్యాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,83,500 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారని, కాగా ఇప్పటి వరకు 1,67,721 మంది రైతులకు రూ.215 కోట్ల 15 లక్షలు జమ అయ్యాయని తెలిపారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రైతుభరోసా పథకం కేవలం ఆర్థిక సాయమే కాకుండా రైతుల భవిష్యత్పై ఆశను నింపే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకోసం అవసరమైన పెట్టుబడి భారం నుంచి రైతులకు విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఈ నగదును రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం కోస్గి రూరల్: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం పట్టణంలోని 10వ వార్డులో తడి–పొడి చెత్తపై ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తడి , పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయవచ్చని సూచించారు. వస్తువుల వినియోగానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులను వాడాలన్నారు. అమృత్జల్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలోని నాగులబావి సమీపంలో మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన పండ్ల స్టాల్, ఫుడ్ స్టాల్లను కమిషనర్ సందర్శించారు. గ్రామీణ వంటకాల రుచులు ఎంతగానో బాగున్నాయని వారిని ఆభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ అనిల్కుమార్ , హెల్త్అసిస్టెంట్ మొహిన్బాషా,రాస్నం బాల్రాజ్ మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాలతో జీవితం అంధకారం నారాయణపేట: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య, స్థానిక డీఎస్పీ లింగయ్య విద్యార్థులకు సూచించారు. ‘నషా ముక్త్ భారత్,యాంటీ డ్రగ్ దినోత్సవం జూన్ 26 ఉన్నందున యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. డీఎస్పీలు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ వారిని బానిసలుగా మారుస్తు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఐయామ్ ఆన్ యాంటీ డ్రగ్ సోల్జర్ గా సుమారు 180 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయడం జరిగిందని డీఎస్పి తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అమరచింత/ఆత్మకూర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి శుక్రవారం అమరచింత, ఆత్మకూర్ మండలాలకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట అమరచింతలో పోలీసులు గౌరవ వందనం సమర్పించగా.. స్థానిక కాంగ్రెస్ నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి సత్కరించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూర్లో అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గాంధీచౌక్ నుంచి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు మోపిందే తప్ప పేదల సొంతింటి కలను అణిచివేసి డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కాలయాప చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రకటించుకుంటామని వెల్లడించారు. పరమేశ్వరస్వామి చెరువు అభివృద్ధి, రూ.22 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనం, డయాలసిస్ కేంద్రం, జూరాల వంతెన, రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతామన్నారు. రాజావళి దర్గాలో మంత్రి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంబీ కర్మేల్ చర్చిలో పాస్టర్ హ్యాపీపాల్తో కలిసి ప్రార్థించారు. మార్కండేయ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు తిరుమల్లేష్ పాల్గొన్నారు. ఆత్మకూర్ డివిజన్ సాధిస్తా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
యోగా డేను విజయవంతం చేయాలి
నారాయణపేట: దశాబ్ది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రానికి సమీపంలోని అభినందన గార్డెన్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట ప్రభుత్వం, నారాయణపేట ఆయుష్ డిపార్ట్మెంట్, పతంజలి యోగా సమితి, సేవా భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అధికారులు, ప్రజలు మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని, ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రాణాయామ,ం మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి నారాయణపేట రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో సిటిజన్ క్లబ్ నుండి శ్రీ సత్యనారాయణ చౌరస్తా స్వామి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జయ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పతంజలి యోగ సమితి సభ్యులు, సేవ భారత్ సభ్యులు, అయుష్మాన్ భారత్ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను మన దినచర్యలో భాగం చేసుకోవాలని, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిందని, ఊబకాయం పెరిగిందని, మన దేశం వేలాది సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న యోగా, దాని లాభాలు ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆచారిస్తున్నాయన్నారు. న మనం ప్రతిరోజు యోగ ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సురేష్, రాజులహోటి, శివకుమార్, నందు నామాజీ, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, శనివారం జిల్లా కేంద్రంలోని నిర్వహించే కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని సురేష్, శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, యశ్వంత్, భాస్కర్ రెడ్డి తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా సామూహిక యోగా కార్యక్రమాలు -
‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం
మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్హెచ్ఓ సక్రమంగా మానిటరింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్ డీఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్బీ, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. రైతుల అభిప్రాయాలు సైతం.. పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్ అప్లికేషన్ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్రావు, యోగేష్ గౌతం తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల అతి జాగ్రత్త వల్లే తప్పిదం జరిగింది మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
కొత్తపల్లి: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ శైలేష్కుమార్ అధికారులను అదేశించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలో ఎంపీటీసీ స్థానాల విభజన, ఓటర్ల జాబితా, ఎన్ని పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలను ఎంపీడీఓ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏఏ రకాలు ఎక్కడెక్కడా నాటుతున్నారనే ఆరా తీశారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటాలని ఆదేశించారు. -
సాధించిన పతకాలు..
వనజారెడ్డి 2007 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది వైజాగ్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం సాధించారు. 2023 ఏపీ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో, 2024లో పలుచోట్ల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంది. సిద్దిపేటలో యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వనజారెడ్డి ప్రతిభచాటి ప్రథమస్థానంలో నిలిచారు. అదేవిధంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పతకాలు సాధిస్తూ ప్రతిభచాటుతున్నారు. వనజారెడ్డి, కీర్తనారెడ్డి యోగా విన్యాసాలు -
మెరుగైన సేవలు అందించాలి
మద్దూరు: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్ఐ విజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించి, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాతనేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ రైస్, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. సిబ్బందికి లేమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, పోలీసులు పాల్గొన్నారు. వృద్ధులకు ఇబ్బందికలగకుండా చూడాలి నారాయణపేట: వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యం అందుబాటులో ఉండాలని.. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యనాయక్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఆహారం, వసతులు, పనిచేస్తున్న సిబ్బంది విధులపై ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ ఫుటేజీలు, మూ మెంట్ రిజిష్ట్రర్లను పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతి రోజు కూరగాయలు తాజాగా కొనుగోలు చేయాలని, వృద్ధులకు ఎప్పటికప్పుడు మందులు అందజేయాలని, గదులను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. గురుకులంలో అడిషనల్ కలెక్టర్ బస ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. రాత్రి 10 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్న ఆయన తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, విద్యార్థుల గదులు, పరిసరాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ రాజారాంతో మాట్లాడారు. గదుల్లో ఫ్యాన్లు, ఆట స్థలం ఏర్పాటు చేయాలని, సమీపంగా ఉన్న కొండను తొలచాలని అడిషనల్ కలెక్టర్కు విన్నవించారు. అనంతరం పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారా, భోజనం ఎలా ఉంది అని విద్యార్థులతో ఆరా తీస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలన్నారు. అనంతరం గురుకులంలోనే అడిషనల్ కలెక్టర్ బస చేశారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట ఎడ్యుకేషన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని డీఈఓ గోవిందరాజులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జిల్లాలోని అందరూ ఎంఈఓలు, డీపీఎం, సీసీ, వీవోలకు ఎన్ఐఎల్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించి వారి అక్షరాస్యులుగా చేసే బాధ్యత వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ విషయంలో ఏదైనా జాప్యం జరిగితే శనివారం లోగా అందజేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో అదేరోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే యోగా చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, విద్యాశాఖ కో ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో పాఠశాలలు
మక్తల్/దామరగిద్ద: మక్తల్ పట్టణంలోని బీసీకాలనీలో, మండలంలోని టేకులపల్లి, సోమేశ్వర్ బండ, ఉప్పర్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదులు నెర్రలుబారడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. భూత్పూర్ గ్రామంలోని పాఠశాల రిజర్వాయర్కు దగ్గరగా ఉండడం.. ప్రహరీ లేకపోవడంతో పాములు, విష పురుగులు తరచూ పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. అలాగే, తీర్యాలపూర్లోనూ ప్రభుత్వ పాఠశాల వ్యవసాయ పొలాలకు సమీపంలో ఉండడంతో పాముల బెడద తీవ్రమై విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ● దామరగిద్ద మండలంలోని తండా పాఠశాలలో కేవలం రెండు గదుల్లో 5వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో 34 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. విద్యార్థులు ప్రమాదపు అంచుల్లో చదువులు కొనసాగిస్తున్నారు. -
నూతన జిల్లా ఆస్పత్రిలో తొలి సిజేరియన్
నారాయణపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాల,జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆపరేషన్ థియేటర్లో క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. బుధవారం పెరవళ్ల గ్రామానికి చెందిన నిండు గర్భిణి ప్రసవం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిందని, డాక్టర్లు పరీక్షించగా కడుపులో శిశువు అడ్డంగా ఉందని గుర్తించారని తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తేజస్విని, మహేంద్రవర్మ ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ అత్యవసర ఆపరేషన్ నూతన ఆస్పత్రిలో మొదటిది అని ఆయన తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్య బృందానికి బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ సదస్సు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో శుక్రవారం ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ పేరిట ఒక రోజు సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వర్క్షాపును పరిశీలించేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి మహబూబ్నగర్ రానున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి నవీన పద్ధతులను అవలంబించే విధానాలపై చర్చించనున్నారు. దీనికి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషన్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తప్పక హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఈపాటికే ఈ సదస్సు నిర్వహణకు స్థానిక మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలోని స్టాల్స్తో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్, సమావేశ హాలు, ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్నసీడీఎంఏ టీకే శ్రీదేవి పాల్గొననున్న రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్/మాగనూర్: ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మాగనూరులో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు దగా పడ్డారని, డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని నీటిమీద రాతలాంటి మాయమాటలు చెప్పి మోసపుచ్చారని విమర్శించారు. పదేళ్ల పాలనలో సంవత్సరానికి గ్రామానికి కొన్ని ఇళ్లు ఇచ్చుకుంటూ పోయినా నేటీకి గ్రామాల్లో ఇంత మంది ఇల్లు లేని లబ్ధిదారులు ఉండేవారు కాదని అన్నారు. ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండలాలకు 385 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి శ్రీమంతులు తినే సన్నబియ్యం అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ , రైతులకు బోనస్, రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీఈ హరికృష్ణ, ఏఈ అంజనేయులు పాల్గొన్నారు. క్రీడలపై విద్యార్థుల ప్రత్యేక దృష్టి మక్తల్: క్రీడలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో ఆయన నివాసంలో క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతి ప్రవేశాల కోసం ముద్రించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థులు మండల, జిల్లా స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. అనంతరం కన్యకాపరమేశ్వరి, వెంకటేశ్వర, అయ్యప్పస్వామి ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కలిసిమెలిసి ఉంటేనే భవిష్యత్ అందరూ కలిసి మెలిసి ఉంటేనే భవిషత్ ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన మక్తల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి సేవా సమితి భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బీసీ బిడ్డగా మంత్రి పదవిని సీఎం ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డితోపాటు బికేఆర్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, రాదమ్మ, సంతోష్రెడ్డి, వసంత, కుంభం శివకుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, దేవేందర్రెడ్డి, జగన్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
1.80 లక్షల మంది ఖాతాల్లో రూ.260 కోట్లు జమ
నారాయణపేట: వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం కింద జిల్లాలో 1,81,109 మంది రైతులకు రూ.260.36 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని డీఏఓ జాన్సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని తెలిపారు. ఈ వివరాలకు అనుగుణంగా గురువారం సాయంత్రం వరకు జిల్లాలోని 1,44,689 మంది రైతుల ఖాతాలలో రూ. 146.55 కోట్ల నిధులు ఇప్పటికే జమ అయ్యాయని తెలిపారు. 4 నుంచి 5 ఎకరాల లోపు 15,096 మంది రైతులకు రూ.40.56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. 5–6–2025 తేదీలోపు పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తులను 20–6–2025 తేదీలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివిధ కారణాల చేత నాలుగు ఎకరాల లోపు 151 మంది రైతుల అకౌంట్లో నగదు జమ కాలేదని, అట్టి రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి కొత్త అకౌంట్లను సమర్పించాలని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని తెలిపారు. -
నిర్మించినా.. నిరుపయోగం
కొత్తపల్లి: భూనీడ్ ఉన్నత పాఠశాలలో 375 మంది విద్యార్థులకుగాను రెండే మూత్రశాలలున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఒంటికి రెంటికి ఆరుబయటకు వెళ్తున్నారు. గతేడాది మన ఊరు– మన బడి కార్యక్రమం కింద మరుగుదొడ్లను, మూత్రశాలలను నిర్మించారు. కానీ బిల్లులు రాకపోవడంతో దాన్ని ప్రారంభించానికి కాంట్రాక్టర్ ఒప్పుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే, మండలంలోని వాల్యనాయక్ తండాలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులున్నారు. వీరందరు భూనీడ్లోని పాఠశాలకు వెళ్తున్నారు. గతంలో ఈ తండాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలను తొలగించారు. అప్పటి నుంచి పాఠశాలను గ్రామ పంచాయతీగా భవనంగా మార్చి ఉపయోగిస్తున్నారు. -
మురిసిన పెద్దధన్వాడ
రాజోళి: ఇథనాల్ చిచ్చు వద్దంటూ పోరాడిన రైతుల లోగిళ్లలో పచ్చ తోరణాలు గడపలకు పెనవేసుకున్నాయి. గురువారం రాజోళి మండలం పెద్దధన్వాడలో ఏరువాక సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న రైతులు, 12 గ్రామాల ప్రజలు ఈ నెల 4న పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దని తమ గొంతుకను వినిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు విధితమే. దీంతో 42 మందిపై కేసు నమోదు కాగా..12 మంది రైతులను 5వ తేదీన రిమాండ్కు తరలించారు. రైతులంతా ఉంటేనే పండుగ చేసుకోవాలంటూ.. ఈ నెల 11న చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామస్తులంతా బహిష్కరించారు. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం పండుగ నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు, వాకిళ్లను తోరణాలతో అలంకరించారు. రైతులు తమ ఎద్దులకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి సుంకులమ్మ తల్లి దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనుకోకుండా జరిగిన పరిణామాల కారణంగా సాగు ఆలస్యమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రత్యేక పూజలు చేశారు.