Narayanpet
-
శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శం: ఎస్పీ
నారాయణపేట: శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని.. సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పళ్ల హనుమాన్ మందిర్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన ఊరేగింపు చివరకు సుభాష్రోడ్ వరకు కొనసాగింది. అనంతరం బ్రాహ్మణ్వాడి రామాలయంలో సామూహిక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యాయాదవ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి రాందేవునిగుట్టపై నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎస్పీ డా. వినీత్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు. ఎస్పీ దంపతులను మార్కెట్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
మన్సూర్పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు మెడికల్ షాపుల్లో నకిలీ డ్రగ్స్ కట్టడికిబల్క్ ఎస్ఎంఎస్ విధానం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నారాయణపేట: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి కలిశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానూకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. సమగ్ర అభివృద్ధికి కదలిరావాలి నారాయణపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఆవిర్భాస్తున్న నూతన పార్టీలో చేరి సమగ్ర అభివృద్ధికి కదలిరావాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గౌవినోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ బలోపేతానికి జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని.. యువత, రైతులు, తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలికల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కంకణబద్దులు కావాలని కోరారు. – వివరాలు 8లో.. -
ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు
గట్టు: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని గండి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు నిర్వహించారు. పోటీల్లో బండమీది అంజి 100 కేజీ చేతి రాయిని ఎత్తి మొదటి బహుమతి రూ.4,016, ద్వితీయ బహుమతిని గువ్వల పరశురాముడు 95 కేజీల రాయి ఎత్తి రూ.3,016, తృతీయ బహుమతి తెలుగు నల్లారెడ్డి 90 కేజీల రాయి ఎత్తి రూ.2,016, నాల్గవ బహుమతి చాకలి నాగరాజు 88 కేజీల రాయి ఎత్తి రూ.1,016లను దక్కించుకున్నారు. విజేతలకు గండి ఆంజనేయస్వామి ఆలయ కమిటి సభ్యులు బహుమతులను అందజేశారు. మూడుబండ్ల గిరక పోటీలు మూడు బండ్ల గిరక పోటీలను సంతబజారు వేదికగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొదటి బహుమతి రూ.10,016 గట్టు తెలుగు ఆంజనేయులు ఎద్దులు 257 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. ద్వితీయ బహుమతి రూ.8,016లను సల్కాపురం మారెప్పకు చెందిన ఎద్దులు 244 ఫీట్ల దూరం గిరకను లాగి దక్కించుకున్నాయి. అంతపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఎడ్లబండి గిరక పోటీలను మాజీ ఎంపీపీ విజయ్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు శంకరమ్మ, ఉపసర్పంచ్ హనుమంతు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టులో నిర్వహిస్తున్న సందేరాళ్ల పోటీలు గట్టులో ఉత్సాహంగా మూడు బండ్ల గిరక పోటీలు -
మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యం
నారాయణపేట: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సీవీఆర్ భవన్లో జరిగిన జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కాంతుకుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందజేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహకారంతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.4,500 కోట్లతో చేపట్టి ఈ ప్రాంతంలోని చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. చెరువులు నిండితే చేపల ఉత్పత్తి పెరుగుతుందని.. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. ఈసారి బడ్జెట్లో మత్స్యశాఖకు భారీగా నిధులు కేటాయించారని.. వాకిటి శ్రీహరి మత్స్యశాఖకు మంత్రిగా ఉండటం అందరికీ కలిసి వస్తుందన్నారు. జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సొసైటీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్కు సూచించారు. మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, మార్కెట్ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్రెడ్డి, సర్ఫరాజ్ అన్సారీ, న్యాయవాది సతీష్గౌడ్, మాజీ కౌన్సిలర్ మారుతి తదితరులు పాల్గొన్నారు. -
జగమంతా రామమయం
● పేటలో మార్మోగిన శ్రీరామ నామం ● కిటకిటలాడిన ఆలయాలు మక్తల్లో సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు నాారాయణపేట: జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని మూల హనుమాన్ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హనుమాన్ భక్తబృందం ఆధ్వర్యంలో అర్చకులు శ్రీపతిజ్యోషి రఘుప్రేమ్, రవితేజ ఆచార్య మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం కనులపండుగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని జ్యోషి రఘుప్రేమ్ భక్తులకు వివరించారు. అంతకుముందు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామాలయంలో డోలారోహణం.. బ్రాహ్మణవాడి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అర్చకులు రాఘవేంద్ర సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి డోలారోహణం జరిగింది. మక్తల్ రాంలీలా మైదానంలో.. మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం పక్కనున్న రాంలీలా మైదానంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి దంపతులు, పుర చైర్పర్సన్ వాకిటి మానస దంపతులు, బీకేఆర్ చై ర్మన్ బాలకృష్ణారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం కల్యాణ వేదిక వద్ద కు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి తరఫున మాజీ ఎంపీటీసీ మధు సూదన్రెడ్డి ముత్యాల తలబ్రాలు అందజేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వేదపండితులు రాఘవేందర్చారి స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. సంగంబండకు చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అంతకుముందు సీతారాముల విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, మక్తల్ మార్కెట్ చైర్మన్ రాధమ్మ, శ్రీనివాస్గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొండయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
సంత.. తీరని చింత
● ఏళ్లుగా నలుగుతున్న పెబ్బేరు సంత వివాదం ● రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ ● మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ● అయోమయంలో ప్రజానికం జాతీయ రహదారి 44పై పెబ్బేరు సంతను నిర్వహిస్తుండటంతో ఇక్కడి సంతకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువుల విక్రయదారులు ఇక్కడికి వస్తుంటారు. కూరగాయల నుంచి గృహ నిర్మాణం, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్లు ఇక్కడ సంత రోజుల్లో విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద ఎత్తున పశువులు, గొర్రెలు, మేకల విక్రయాలు జరుగుతాయి. ప్రతి అమ్మకం, కొనుగోలుపై వచ్చే ఆదాయం పెబ్బేరు మున్సిపాలిటీకి చేరాల్సి ఉండగా.. గత కొన్నేళ్లుగా సంత అనధికారికంగా నిర్వహిస్తుండతో ఆదాయం ఎవరి చేతికి వెళ్తుందనే అంశాన్ని పాలకులు, నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ను ఎప్పుడు, ఎవ్వరు ప్రశ్నించిన త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామనే మాటచెప్పటం పరిపాటిగా మారింది. ఆ దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం ఇప్పటి వరకు ఎలాంచి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. వనపర్తి: దక్షిణ తెలంగాణలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పెబ్బేరు సంత అంశం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ప్రధాన పార్టీల మధ్య ప్రచార అస్త్రంగా మారింది. సంతస్థలంపై విమర్శలు, హామీలు ఎన్నికలను ప్రభావితం చేసినట్లుగా ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు సంత స్థలం వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదంటూ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీస్తుండగా.. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి.. పెబ్బేరు సంత విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కేబినేట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెప్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా నేతల మధ్య విమర్శలు తప్పా పరిష్కారం వైపు కనీసం ఒక్క అడుగు పడలేదనే ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ఇటీవల స్పందించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రిపై ఘాటు విమర్శలే చేశారు. దీనికి ఇంతవరకు మాజీ మంత్రి స్పందించకున్నా.. బీఆర్ఎస్ నాయకులు మీడియాలో మరోసారి ఆరోపణలు గుప్పించడం స్థానికులను అయోమయంలో పడేసేలా చేస్తోంది. పెబ్బేరు సంత అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటన్నారే తప్పా.. ఈ వివాదం కారణంగా సంత నిర్వహణ కోసం టెండర్ నిర్వహించకపోవడంతో ఏటా మున్సిపాలిటీకి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతుందనే విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.12 కోట్లకుపైగా ఆదాయం మున్సిపాలిటీ కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
పాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలకం
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లా పాలనలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని.. ఆ శాఖ అధికారులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి ఎక్కువ శాతం భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని.. మండలస్థాయిలోనే పరిష్కరిస్తే ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అదేవిధంగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని.. రెవెన్యూ అదనపు కలెక్టర్ అనుమతి లేకుండా సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలొద్దని తేల్చి చెప్పారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని, సోలార్ పవర్ ప్లాంట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కుల ధ్రువీకర ణ పత్రాల జారీలో అలసత్వం సరికాదని తెలిపారు. వీటి తోపాటు లోకాయుక్త , బైండోవర్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఏప్రిల్లో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని.. అంతలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్నాయక్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సి–సెక్షన్ అధికారు లు జయసుధ, అఖిల ప్రసన్న పాల్గొన్నారు. -
పురపాలికలో కలహాలు!
–8లో uనారాయణపేట: ఎన్నికల ఖర్చుకు అడిట్ ఉండదనే సాకుతో స్థానిక పురపాలికలో ఏకంగా రూ.79 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతుండటంతో అందరూ పరేషాన్లో పడ్డారు. బిల్లులు సరిగా లేవని చెక్కులు రాయనంటూ అకౌంటెంట్ తేల్చిచెప్పడంతో పుర అధికారులతో కొనసాగుతున్న అంతర్గత కలహం ఆలస్యంగా వెలుగు చూసింది. అకౌంటెంట్ బీరువాకు తాళం వేసుకొని వెళ్లగా.. పగలగొట్టి సరిచేయించడం, అదేరోజు వాట్సప్లో అకౌంటెంట్కు మెమో జారీ కావడంతో పుర అధికార యంత్రాంగంలో ఒకింత చర్చకు దారితీసింది. పుర కార్యాలయం అవినీతి తిమింగళాలకు అడ్డాగా మారిందని అధికారుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలోతొక్కి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా కొందరు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది. పుర ఎన్నికల ముసుగులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.లక్షల చెక్కులు రాయాలని, లేదంటే అంతు చూస్తామని కిందిస్థాయి సిబ్బందిని బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అడ్వాన్సుల పేరిట దోపిడీ..? మున్సిపల్ ఎన్నికల ఖర్చు పేరుతో ఓ వార్డు అధికారికి రూ.12 లక్షలు, ఓ అధికారికి రూ.15 లక్షలు, మరో అధికారికి రూ. 5 లక్షలు.. ఇలా రూ.32 లక్షలు డబ్బులు డ్రా చేయించినట్లు సమాచారం. రూ.24 లక్షల చెక్కులు వెంటనే రాయాలని అకౌంట్స్ విభాగం అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. బిల్లులు తర్వాత.. ముందు చెక్కులు రాయంటూ సదరు అధికారి హుకూం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తోంది. చెక్కులు మాయం..? ఈ నెల 18న సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్న అకౌంటెంట్ బిల్లులు లేకుండా చెక్కులు రాయడం కుదరదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్లిన వెంటనే కొందరు అధికారులు సెక్షన్్లోకి చొరబడినట్లు సమాచారం. అధి కారి లేని సమయంలో సెక్షన్న్లోని బీరువాలో ఉన్న చెక్కులను అక్రమంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో సిబ్బంది లేని సమయంలో ఇలాంటి చొరబాట్లు జరగడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది. చైర్పర్సన్ రాక ముందే.. పుర చైర్పర్సన్గా ఎన్నికై న కొండ శ్వేత బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె బాధ్యతలు చేపట్టకముందే ఖజనా ఖాళీ చేయాలనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైర్పర్సన్ వస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుందని ముందే భావించిన మున్సిపల్ అధికారులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి బిల్లులు డ్రా చేసుకోవాలనుకున్నారా అనేది విచారణ జరిపిస్తే తప్పా అసలు విషయం బయటకు రాదని తెలుస్తోంది. అధికారులు వర్సెస్ అకౌంటెంట్ మున్సిపల్ ఎన్నికల వ్యయం రూ.79 లక్షలా? ప్రభుత్వం నుంచి వచ్చింది రూ.20 లక్షలే.. జనరల్ ఫండ్ నుంచి రూ.59 లక్షలుడ్రా చేసేందుకు ప్రయత్నాలు అకౌంటెంట్కు మెమో జారీ -
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిద్దాం
ఊట్కూర్: సనాతన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిద్దామని స్వామి అనంతానంద భారతి అన్నారు. బుధవారం పట్టణంలోని కళాశాల మైదానంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామీజీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం సనాతనమైందని.. పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైతే సీ్త్రలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని.. కుటుంబ వ్యవస్థను పటిష్టపర్చాలని కోరారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని తెలిపారు. హిందూ సమ్మేళనానికి వేలాది మంది కుటుంబాలతో హాజరుకావడం ఆనందంగా ఉందని చెప్పారు. మండలంలోని కొల్లూరు, నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, సమస్తాపూర్, పెద్దపొర్ల తదితర గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా హిందూ బంధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరత నాట్యం, కోలాటం, డోలు వాయిద్యాలు, చెక్కభజన తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు భాగయ్య, సౌభాగ్యలక్ష్మి, సిరిగిరి చందులాల్, కుర్మన్న, గరిడి లింగిరెడ్డి, రేణుక భరత్, శేషప్ప పాల్గొన్నారు. -
పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీ
నారాయణపేట: పట్టణంలోని పెట్రోల్, డీజిల్ బంక్లను బుధవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 44 పెట్రోల్ బంకులు ఉండగా.. 75 శాతం బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని డీఎస్ఓ బాలరాజు పేర్కొన్నారు. మిగతా 25 శాతం బంకుల యజమానులు ఆయిల్ కంపెనీలకు డీడీలు చెల్లించారని.. రాత్రిలోగా ట్యాంకర్లు బంక్లకు చేరుతాయని యజమానులు చెప్పినట్లు తెలిపారు. జిల్లాలోని వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 ఎల్పీజీ ఏజెన్సీలు ఉన్నాయని... ఆయా ఏజెన్సీల్లో సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం గుండుమాల్లోని రైతువేధికలో మండలంలోని భోగారం గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రైతులకు రైతుభరోసా అందించి పంట పెట్టుబడికి ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, బోగారం సర్పంచ్ శేఖర్గౌడ్, ఉప సర్పంచ్ సాయప్ప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జయప్రకాశ్రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్రావు, సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.85.10 లక్షలు పలికిన సంత కోస్గి రూరల్: పుర పరిధిలోని పశువుల సంత వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.85.10 లక్షలు పలికిందని పుర కమిషనర్ నాగరాజు, చైర్మన్ నాగులపల్లి నరేందర్ తెలిపారు. బుధవారం పుర కార్యాలయంలో నిర్వహించిన వేలంలో 9 మంది పాల్గొనగా మాటికోటి వెంకటయ్య రూ.85.10 లక్షల పాటపాడి దక్కించుకున్నారని వివరించారు. తైబజార్కు 13 మంది పోటీపడగా రవికుమార్ రూ.34.13 లక్షలకు చేజిక్కించుకున్నట్లు చెప్పారు. పశువుల సంత గతేడాది కంటే ఈసారి రూ.16.06 లక్షలు, తైబజార్ రూ.3,10,500 ఎక్కువ వచ్చిందని తెలిపారు. వేలంలో వైస్ చైర్పర్సన్ సరిత, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, అంజిలయ్య, భానునాయక్, మేకల రాజేష్, కోడిగంటి హరి, ఓంప్రకాశ్, తుడుం శ్రీనివాస్, పుర మేనేజర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల నిరసన నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.మనోహర్ప్రసాద్గౌడ్, పట్టణ అధ్యక్షుడు భరత్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు పట్టణంలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకొని ఏఓ శ్రీధర్కు డిమాండ్ల వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వ్యాలిడేషన్ యాక్ట్ ఆమోదించిందని, ఈ చట్టం ప్రకారం 1.1.2026న పదవీ విరమణ పొందిన వారికి భవిష్యత్లో పీఆర్సీలో ఫిట్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందన్నారు. ఈ యాక్ట్ రాజ్యాంగ సూత్రాలతో పాటు సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని, పింఛన్ ఉద్యోగుల సంక్షేమానికి అన్యాయం జరుగుతుందని, వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, బాలరాజు, రాములు, ఎంఎస్ కుమార్, కృష్ణయ్య, గందె గంగాధర్, ధర్మరాజ్, దశరథ్, నారాయణ, సంగంనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
2న యూనివర్సిటీస్థాయి కామర్స్ ఫెస్ట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. -
పోటెత్తిన ఉల్లి
● గరిష్టంగా రూ.1,400,కనిష్టంగా రూ.800 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రావడంతో ఎక్కడ చూసినా ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే వచ్చిన ఉల్లిలో అటు ఇటుగా ఉన్న ఉల్లి కుప్పలకు ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లి వేలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,00 వరకు ధరలు పలికాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాలుగా ఉల్లిని తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసి తరలించారు. ఇక స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో మార్కె ట్ అంతా సందడిగా కనిపించింది. -
ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతా
నారాయణపేట: పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పుర చైర్పర్సన్ శ్వేత సత్యయాదవ్ అన్నారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన చాంబర్లో చైర్పర్సన్ దంపతులతో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం చైర్పర్సన్ కుర్చీలో కూర్చున్న తర్వాత వేదపండితుల ఆశీర్వదం తీసుకున్నారు. పుర కమిషనర్ నర్సయ్య చైర్పర్సన్తో రిజిస్టర్లో తొలి సంతకం చేయించారు. చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్ మంజుల రాఘవేందర్రెడ్డిని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణంలోని ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. సన్మానించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మాజీ పుర వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్పాండురెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వదంతుల హోరు.. బంకుల్లో వాహనాల జోరు
7నారాయణపేట: పెట్రోల్ బంకులు బంద్ అవుతా యనే ప్రచారం, ఇంధన కొరత వార్తలతో ప్రజలు భయాందోళనతో బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీతో పెరగడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తాలోని జెడ్ఎంఎస్, మక్తల్ రోడ్లో ని మరో బంకు వద్దకు వాహనాలు భారీగా రావడంతో గంట వ్యవధిలోనే వారు సైతం నో స్టాక్ అంటూ చేతులేత్తాశారు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా.. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలో అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ఈ రద్దీకి కారణమవుతున్నయని అధికారులు అంటున్నారు. -
‘టీబీ రహితరాష్ట్రంగా మార్చుదాం’
ధన్వాడ: తెలంగాణ రాష్ట్రాన్ని టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి జయచంద్రమోహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీబీ క్యాంపును స్థానిక సర్పంచు జ్యోతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి బహుమతులను అందజేశారు. 14 ఏళ్లు పైబడిన మహిళ లకు స్కానింగ్ చేశారు. 50 మంది సస్పెక్ట్ కేసులుగా గుర్తించినట్లు వారు తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగాం అధికారి సత్యప్రకాష్, డాక్టర్ అనుషా, భీష్మఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మరాజ్ తదితరులు పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి నారాయణపేట రూరల్: జిల్లాలో నాలుగేళ్లుగా నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేదని, త్వరగా నియమించి న్యాయం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ మొగులప్పకు తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జీపీఎఫ్ చెల్లింపులు వేగవంతం చేసి ఆన్లైన్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రవీందర్, జిల్లా కోశాధికారి కిషోర్కుమార్, నాయకులు నర్సింలు, రాజు పాల్గొన్నారు. -
నారాయణపేట
ఎట్టకేలకు బాధ్యతలు బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలు పూర్తయి.. చైర్పర్సన్గా కొండ శ్వేత సత్యయాదవ్ ఎన్నికై నా బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. ఇదిలా ఉండగా నారాయణపేటలో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని, మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటలకు మూహుర్తం ఫిక్స్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని నైరుతి భాగంలో మున్సిపల్ చాంబర్ ఉండాలనే వాస్తు నిపుణుల సూచనలతో గదిని సిద్ధం చేశారు. 11 స్థానాలతో.. స్థానిక మున్సిపాలిటీలో బీజేపీ 10 కౌన్సిలర్ స్థానాలు సాధించగా.. రెబెల్గా గెలిచిన మరో కౌన్సిలర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 11 సభ్యులకు చేరింది. ఇందుకు జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఎంపీ డీకే అరుణ, బీజేపీ అధిష్టానం సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేతను చైర్పర్సన్ నియమించేందుకు మొగ్గుచూపారు. వైస్ చైర్మన్గా మంజుల రాఘవేందర్రెడ్డి ఎన్నికయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు గత నెల 16న అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కొండా శ్వేత ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
‘పది’ పరీక్షలకు 13 మంది గైర్హాజరు
నారాయణపేట రూరల్: జిల్లాలో సోమవారం పదోతరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. మొత్తం 43 కేంద్రాల్లో 8,319 మంది విద్యార్థులకుగాను 8,306 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో 11 మందికి 11 మంది పరీక్ష రాశారు. ఈ నెల 18న జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ నిజామాబాద్లో లీక్ కావడంతో విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ఉదయం కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించే సమయంలో విస్తృతంగా తనిఖీ చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు కేంద్రాలను జల్లెడ పట్టాయి. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పరీక్షల విభాగం అధికారి శశికుమార్ కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించి సీఎస్, డీఓలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లను అనుమతించరాదని సూచించారు. మరోపక్క ఎస్పీ వినీత్ పరీక్షా కేంద్రాల దగ్గర బందోబస్తును పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశించారు. -
అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి
నారాయణపేట: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, బండమీది బలరాం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళ, జిల్లా కార్యదర్శి శివకుమారి మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని, కేంద్రం తెచ్చిన ఎన్ఐపి–2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, రాష్ట్రంలో ప్రీప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు గ్రాట్యుటీ చెల్లించాలనే తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. అంతకుముందు మున్సిపల్ పార్క్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం ఏఓ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోషి, జిల్లా నాయకులు నరహరి, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు పుష్ప, జ్యోతి, నారాయణమ్మ, రాధ, విజయలక్ష్మి, హారిక, వనమాల, పద్మ, చంద్రకళ, ఉమామహేశ్వరి, పద్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇవ్వాలి
నారాయణపేట: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చి.. బాధితులకు భరోసాగా నిలవాలని ఎస్పీ డా.వినీత్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో గౌరవంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినాలన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమర్పించే ఫిర్యాదులకు సత్వర చర్యలు లభించకపోతే, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. సర్కిల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత డీఎస్పీ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలకు అండగా నిలవడం పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని, అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ విధులను నిబద్దతతో నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. -
‘చిరు’ సాగుపై అనాసక్తి
● క్షేత్రస్థాయిలో లోపించిన అవగాహన ● ఉమ్మడి జిల్లాలో వంద క్వింటాళ్లు దాటని దిగుబడి ● మార్కెట్లో పెరిగిన డిమాండ్ ●ప్రతి ఏటా మా బంధువులు చిరుధాన్యల సాగుతో అధిక లాభాలు అర్జిస్తున్నారు. వారిని అనుసరించి యాసంగిలో పంటమార్పిడి చేసి రెండు ఎకరాల్లో అరకలు సాగు చేశా. పంట నాటిన నుంచి ఇప్పటి వరకు రూ.25 వేల పెట్టబడి అయింది. మరో నెల రోజుల్లో కోతకు రానుంది. అధిక దిగుబడి వస్తే వచ్చే యాసంగిలో సాగును మరింత విస్తారిస్తా. – కొండాపూర్ వెంకట్రెడ్డి, రైతు, మరికల్ మార్కెట్లో అధిక ధరలున్న చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఇలాంటి పంటలను సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు. రెండేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాం. రైతులు అక్కడక్కడ ముందుకొచ్చి ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. మిగతా రైతులు కూడా ఆసక్తి కనబరిస్తే సాగుపై అవగాహన కల్పిస్తాం. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మరికల్: రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి చేసి కొత్త రకం పంటలను సాగు చేయాలని పదే పదే చెబుతున్నా.. రైతులు మాత్రం మూస పద్ధతిని మాత్రం వీడ టం లేదు. ఉమ్మడి జిల్లాలో చిరుధాన్యాల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపక పూర్తిగా తగ్గింది. ప్ర స్తుతం వీటి వినియోగం భారీగా పెరిగినా.. సాగు మాత్రం తగ్గుతోంది. ఐదేళ్ల కిందట రైతులు ఎంతో కొంత చిరు ధాన్యాలను సాగు చేసేవారు. అయితే కొందరికి ఎక్కడ విక్రయించాలో తెలియక సాగును తగ్గిస్తూ వచ్చారు. ఆయా పంటలను పక్కనబెట్టి వర్షాకాలంలో మాత్రం జొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ రాగులు, జొన్నలు సాగు చేసినప్పటికీ ఇతర చిరు ధాన్యాలైన కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అడ్డుకొర్రలు కనిపించడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చిరుధాన్యల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించి ఉంటే కొంతమేరకై నా మొగ్గు చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు అధిక శాతం వరి, పత్తి, మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 37 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను పాల్గొన్నారు. ● నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవన సముదాయం వరకు సమాంతరంగా రోడ్డు నిర్మించాలన్నారు. అదే విధంగా భవన సముదాయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి తొలగించాలని తెలిపారు. భవనం చుట్టూ నాలువైపులా మొక్కలు నాటించి, గ్రీనరీ ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ మొగులప్పకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ డీఈఈ రాములు తదితరులు ఉన్నారు. -
మిగిలింది 9 రోజులే..
నారాయణపేటఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానే పన్నుల వసూళ్లు ● గడువు దగ్గర పడుతుండటంతో వేగం పెంచిన అధికారులు ● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ● పుర ఎన్నికలు, సిబ్బంది కొరతతోనే జాప్యం సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు. నారాయణపేటలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది (ఫైల్) ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట ● -
గంప జాతర..
బయలెల్లుతున్న గ్రామాలు మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు. ఇళ్లకు తాళాలు.. రోజంతా వనవాసాలు ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కలిసి విందులు ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం -
హైలెవల్ వంతెన నిర్మించి తీరుతాం
ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ.. మండలంలోని తిప్పడంపల్లిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి శనివారం ఆవిష్కరించారు. అలాగే ఆత్మకూర్లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. మేడేపల్లిలో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాస్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ పాల్గొన్నారు. పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం... అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామస్తుల ఇష్టం మేరకే..
●గ్రామస్తుల ఇష్టం మేరకే గంపజాతర నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయిస్తాం. ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తోంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గ్రామంలో ప్రజలందరూ గంపజాతరకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నారు. – శ్రీదేవి, మాజీ సర్పంచ్, షేక్పల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా గ్రామంలో గంపజాతర నిర్వహిస్తే అనుకోని విపత్కర పరిస్థితులు ప్రజలకు రావని, దారిద్య్రం, అంటురోగాలు రావని ప్రతి సంవత్సరం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నిర్వహిస్తారు. గంపజాతర నిర్వహించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతాం. గంపజాతర నిర్వహించకపోతే గ్రామంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. – శ్రీకాంత్, నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా విపత్కర పరిస్థితులు రావు.. -
క్రమంగా ఆచారంలో మార్పులు
గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. ● జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. -
భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్
బందోబస్తు పర్యవేక్షించిన డీఎస్పీ.. ● ఈద్గాల వద్ద ముస్లింలప్రత్యేక ప్రార్థనలు ● శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు నారాయణపేట: జిల్లావ్యాప్తంగా శనివారం రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్)ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాల వద్దకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నా పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈద్గాల వద్ద మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. గొప్ప పండుగల్లో రంజాన్ ఒకటి.. పవిత్ర రంజాన్ మాసం దీక్షలు ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతాయని.. చెడు భావన, అధర్మం, ధ్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగల్లో రంజాన్ పండుగ ఒకటని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ముస్లిం చేసే ప్రార్థనలు, అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, అన్నివర్గాల ప్రజలు రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రముఖుల శుభాకాంక్షలు.. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, సుధాకర్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఎస్పీ డా. వినీత్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ ఎన్.లింగయ్య జిల్లాకేంద్రంలోని బువ్వమ్మ గుట్ట ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. డీఎస్పీ వెంట సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఆదాయం అంతంతే..
నారాయణపేటఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు జీడీడీపీ.. (ప్రస్తుత ధరల వద్ద.. రూపాయల్లో)మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి జో.గద్వాల నారాయణపేట17,27828,47137,456సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది. ● వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి -
ప్రతిఏటా నిర్వహిస్తాం..
●గంపజాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకరోజు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే కొన్నిరకాల రోగాలు దరిచేరవనే నమ్మకం అందరిలో ఉంది. అంతేకాకుండా గంపజాతర నిర్వహిస్తూ చెట్ల కింద ఆనందంగా గడపడానికి కూడా ప్రజలు దీన్ని నిర్వహిస్తున్నారు. – శిర్ప రవి, వేపూరు గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా ఆ తర్వాతే పొలం పనులు.. గ్రామాల్లో ఆచారంగా వస్తున్న గంపజాతర కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే పొలం పనులు మొదలుపెడతారు. వర్షాలు కురువక ముందే గంపజాతర జరుపుకొంటారు. గంపజాతర నిర్వహించిన తర్వాత పంటలు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకుంటారు. -
మంత్రి ఇంటి ఎదుట ఆశాల ధర్నా
మక్తల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా కార్యకర్తలు సంఘం అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది ఆశా కార్యకర్తలు 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ హామీ ఇచ్చిందని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్ఎచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. కుష్టు సర్వే, ఎన్నికలు, పరీక్షల విధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం మంత్రి పీఏ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకట్రాంరెడ్డి, బాల్రాం, రాజు, నిక్సన్, గోవిందరాజ్, నరహరి, గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, 6 గ్యారంటీలకు సరిపడా నిధులు కేటాయించక మసిబూసి మారేడుకాయ చేసింది. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు, పంట బీమాకు రూ.1,886 కోట్లు, సన్న వడ్ల బోనస్కు రూ.3,500 కోట్లు అంటూ అంతా గారడి చేసింది. మహాలక్ష్మి పథకం తప్పా మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఊసే లేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా నిరుద్యోగులను మళ్లీ మోసం చేసింది. – సత్యయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
ప్రత్యేక నిధుల్లేవ్..!
నారాయణపేటఅంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు ● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట ● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే.. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మ డి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. లక్ష్యం కొండంత.. నిధులు అరకొర ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1,800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది. -
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. వాతావరణం ఆకాశం నిర్మానుష్యంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవత్ర పెరుగుతుంది. రాత్రివేళలో చల్లటి గాలులు వీస్తాయి. కొడంగల్కు అధిక ప్రాధాన్యం.. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద పెండింగ్లో ఉన్న భూసేకరణతో పాటు పనులను వేగంగా పూర్తిచేసి సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్లో ఉన్న వాటికి.. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది. –IIలో u గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్ అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రజా.. ప్రగతి బడ్జెట్ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం సామాన్యుడి కలలను సాకారం చేసే ప్రజా ప్రగతి బడ్జెట్ ఇది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. ఇది అన్నివర్గాలకు అమోదయోగ్యమైన బడ్జెట్. – డా. చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం.. మా ప్రభుత్వానిది జనరంజక బడ్జెట్. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా అన్నివర్గాలకు సమ ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ కేటాయింపులతో ప్రజలు ఆనందంగా ఉన్నా రు. – ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంక్షేమానికి నిధులు పెంచాల్సింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భట్టి బడ్జెట్ నో గ్యారంటీలా ఉంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలోని 420 హామీల్లో పది శాతం అమలు చేయలేని పరిస్థితి. బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయరంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు పెంచాల్సి ఉండింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నోచుకోలేని బడ్జెట్ ఇది. – ఎస్.రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ● -
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టడం భక్తుల రద్దీని సూచిస్తోంది. ఆలయం వద్ద జాతర కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మట్టి కుండలు, గాజుల దుకాణాలు, మిఠాయి షాపుల వద్ద రద్దీ కనిపించింది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
ఉగాది సంబురం
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు..పంచాంగ శ్రవణాలు ● వ్యవసాయ పనులు ప్రారంభించిన అన్నదాతలు నారాయణపేట: జిల్లా ప్రజలు గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇళ్ల లోగిళ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త దుస్తులు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆలయాల్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలోని పరిమళాపురం రాఘవేంద్రస్వామి ఆలయం, శక్తిపీఠంలో వ్యవస్థాపకుడు డా. ఊట్కూర్ శాంతానంద్ పురోహిత్, శివలింగేశ్వర ఆలయంలో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శివకుమార్స్వామి పంచాంగ శ్రావణం చేశారు. కొత్త సంవత్సరంలో కాలగణన, రాశిఫలాలు, వ్యవసాయ ఫలితాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రైతులు వ్యవసాయ సామగ్రి, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులు ప్రారంభించారు. శక్తిపీఠంలో ఉగాది పురస్కారాలు.. జిల్లాకేంద్రంలోని శక్తిపీఠంలో ఉన్న శారదాంబ కల్యాణ మండపంలో గురువారం ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, సంగీత, చిత్రకారులు, నృత్యం తదితర రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ అధ్యాత్మిక, సామాజిక, రాజకీయవేత్త కృష్ణాకు చెందిన అమర్ దీక్షిత్, మక్తల్కు చెందిన ప్రముఖ నాట్యాచారుడు హరతి గోపాలచార్య, ప్రముఖ అధ్యాత్మికవేత్త కరణం రాఘవేంద్రచార్య, ప్రముఖ సినీ సీరియల్ నటుడు చింతచెట్టు నారాయణరెడ్డి, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పవన్శేషు, ప్రముఖ చిత్రకారుడు నీమ్కర్ రమేష్ ఉన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. -
పేటలో ఏప్రిల్ 3న హిందూ సమ్మేళనం
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని సింగార్బేస్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గుంపు బాలరాజు తెలిపారు. గురువారం కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు పట్టణంలో ప్రత్యేక సమావేశమయ్యారు. పట్టణంలోని పది ఉప బస్తీల నుంచి ఆధ్యాత్మిక భజన సంకీర్తనలతో కాలినడకన హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ముందుగా యజ్ఞ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, వక్త సందేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హిందువులు అధికసంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. అంతకుముందు ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యవర్గాన్ని పాలమూరు జిల్లా సహ కార్యవాహ మ్యాడం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుంపు బాలరాజు, ఉపాధ్యక్షులుగా దత్తు చిల్లాల్, రాజ్కుమార్ దోత్రే, వినోద్, విజయలక్ష్మి, కొండోళ్ల రాములు, కార్యదర్శిగా యశ్వంత్, సహ కారదర్శులుగా ఉదయ్కుమార్, చిన్న రఘు, కిరణ్, మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
కురుమూర్తిస్వామి ఆశీస్సులు ఉండాలి
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆశీస్సులు రాష్ట ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, రాష్ట ప్రజలపైన ఉండాలన్నారు. కార్యక్రమంలోఅరవింద్కుమార్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్గా యెన్నం
● మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి అవకాశం ● ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికి.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. -
పక్కాగా పంటల నమోదు
నారాయణపేటశుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026నర్వ: జిల్లా రైతులు యాసంగిలో సాగు చేసిన పంట వివరాల నమోదుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ ద్వారా సర్వే చేపడుతోంది. వలంటీర్లు ఫిబ్రవరి 27 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యాసంగి సాగు వివరాల నమోదుకు ఆన్లైన్ సర్వే ప్రారంభించారు. ఈసారి సర్వేకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించగా.. ఒక్కొక్కరు గరిష్టంగా 3,550 సర్వేనంబర్ల వరకు చేపడుతున్నారు. ఎక్కువ నంబర్లు ఉన్న గ్రామాలు, పటాలు లేని గ్రామాలు, భూముల హద్దుల లేనిచోట ఏఈఓలు సర్వే చేస్తున్నారు. 45 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన పంట వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రైతు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. యువతకు తాత్కాలిక ఉపాధి.. వలంటీర్లుగా విద్యావంతులైన గ్రామీణ యువతకు ప్రాధానమిచ్చారు. స్మార్ట్ఫోన్ వినియోగంపై అవగాహన ఉండి కనీసం పదోతరగతి చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికతపై అవహహాన ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వారు క్షేత్రస్థాయికి వెళ్లి 50 మీటర్ల రేడియస్ నుంచి సర్వేనంబర్ల వారీగా పంటల నమోదు చేస్తున్నారు. వీరికి ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికం అందిస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో మాత్రం ఏఈఓలు పంటల నమోదు చేస్తారు. జిల్లాలో ఇలా.. గ్రామాలు 280 మండలాలు 13ఏఈఓ క్లస్టర్లు 77 రెవెన్యూ గ్రామాలు 239 సర్వేలో పాల్గొనాల్సిన వలంటీర్లు232ఇప్పటి వరకు పాల్గొన్న వలంటీర్లు206నమోదు చేయాల్సిన సర్వేనంబర్లు 4,40,506ఇప్పటి వరకు నమోదు చేసింది92,88021.4%పూర్తయిన శాతంరెండేళ్లుగా పత్తి సాగుకే మొగ్గు.. గతేడాది పత్తికి అధిక డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది కూడా రైతులు వానాకాలం, యాసంగిలోనూ అదే పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే నీటివసతి ఉన్న ప్రాంతాల్లో వరి సాగవుతుంది. ప్రభుత్వం వరికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మద్దతు ధర చెల్లిస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు పప్పు ధాన్యాలైన కంది సాగుకు కొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే నూనెగింజల సాగును పెంచాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించి రైతులను ప్రోత్సహిస్తుండటంతో ఆసక్తి కలిగిన రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రయోజనాలు ఇలా.. జిల్లాలో 77 ఏఈఓ క్లస్టర్లుండగా 4,40,506 సర్వే నంబర్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. వలంటీర్లు, ఏఈఓలు స్మార్ట్ఫోన్ యాప్లో తెలంగాణ భూనక్ష కడస్ట్రాల్ మ్యాప్ను అనుసంధానించి ఉపగ్రహ సాంకేతికతతో అక్షాంశాలు, రేఖాంశాలు, ధరణి చిత్రపటాల ఆధారంగా పంటలు, వాటి వివరాల నమోదు చేయాలి. యాప్లో 50 మీటర్ల పరిధిలోని సర్వేనంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో నమోదు చేసే వారు తప్పనిసరిగా రైతు క్షేత్రానికి వెళ్లాల్సిందే. పొలాలకు వెళ్లి భూ నక్ష మ్యాప్ ఆన్చేసి రైతు పేరు భూ విస్తీరణం, ఆధార్, గ్రామం, గతంలో, ప్రస్తుతం సాగుచేసిన పంట రకం, పెట్టుబడి, చీడపీడలు, నష్టం, ఎరువుల వాడకం, పంట ఫొటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినప్పుడు ఈ వివరాలతో పరిహారం చెల్లింపు, బీమా అమలు, రాయితీల కల్పన తదితరాలు సులువు అవుతాయి. వివరాల నమోదులో కచ్చితత్వంతో ఉత్పత్తుల విక్రయంలో రైతులకు ఇబ్బందులు ఉండవు. నేల స్వభావం, సాగునీటి లభ్యత, గతంలోని చీడపీడలు, వాతావరణం, దిగుబడి తదితరాల అధారంగా వచ్చే సీజన్లో ఏ పంటలు సాగుచేయాలో సూచిస్తారు. చీడపీడల నివారణకు మందుల రూపకల్పన, నూతన వంగడాల ఆవశ్యకత, శాస్త్రవేత్తల ప్రయోగాలకు మార్గదర్శనంగా ఉండనుంది. జిల్లాలో కొనసాగుతున్న యాసంగి డిజిటల్ సర్వే ఈ ఏడాది వలంటీర్లతో.. గరిష్టంగా 3,550 సర్వేనంబర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల నమోదు 45 రోజుల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా.. గ్రామ పటాలు లేనిచోట ఏఈఓలతో.. -
వ్యాధుల బారిన పడుతున్నాం..
మరికల్కు సంబంధించిన డంపింగ్ యార్డు ఇబ్రహీంపట్నం శివారులో ఉండటంతో కలుషిత నీరు, ద్వురావాసనతో గ్రామస్తులు వ్యాధుల బారినపడుతున్నారు. దీంతోపాటు గ్రామంలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, అర్హులకు పింఛన్లు తదితర సమస్యలను మండల సమవేశాలు లేక ఎవరికి చెప్పకోవాలో తెలియడం లేదు. – నాగరాణి, సర్పంచ్, ఇబ్రహీంపట్నం, మరికల్ మండలం అవగాహన పెరుగుతుంది.. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. – వెంకటయ్య, సర్పంచ్, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలం -
షడ్రుచుల ఉగాది
నారాయణపేట● నేడు తెలుగువారి తొలి పండుగ ● శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం ● ఆలయాల్లో పంచాంగ పఠనానికి ఏర్పాట్లు ● సాగు పనులకు శ్రీకారం చుట్టనున్న రైతులు గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: తెలుగువారి తొలి పండుగ ఉగాదిని జిల్లావ్యాప్తంగా గురువారం ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఆలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం పంచాంగ పఠనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉగాది పచ్చడికి అవసరమైన మట్టికుండలు, మామిడికాయలు, బెల్లం, వేపపూత, కొత్త చింతపండు, మామిడి తోరణాల విక్రయాలతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పంచాంగ శ్రవణం.. ఉగాది పర్వదినాన దేవాలయాలు లేదా ఇంట్లో పంచాంగం వినడం ద్వారా రాబోయే కాలంలో జరగబోయే శుభ, అశుభాలను తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది.. అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ప్రజల నమ్మకం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు జిల్లావ్యాప్తంగా ఉండటంతో.. ప్రఽ దానంగా దాతే, సు ర్పూర్, గంటల పంచాంగం, అశ్లీ, ముక్తేశ్వరి, బెంగళూర్ వా రి దార్వాడ్, ఒంటి కొప్పల్, సోలాపూర్ పంచాంగాలను వేద పండితులు వివరించనున్నారు. శక్తిపీఠం ఆధ్వర్యంలో పురస్కారాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీసంత్ మఠమూల మహాసంస్థానం శక్తిపీఠం ఆథ్వరంలో స్వామీజీ డా.శాంతానంద్ పూరోహిత్ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున సామూహికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సమాజంలో ఆధ్యాత్మిక, సామాజిక, సేవా రంగాల్లో విశేష కృషి చేసినవారిని గుర్తించి.. శక్తిపీఠం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందిస్తున్నారు. ఉగాది పర్వదినాన సనాతన ధర్మం, భారతీయత, తెలుగుదనాన్ని సంరక్షించే దిశలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి.. కళాకారులను సన్మానించి ప్రోత్సహిస్తారు. -
మరింత ప్రగతి సాధించాలి..
జిల్లా ప్రజలకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి శ్రీపరాభవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగ అని.. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయన్నారు. రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. వ్యవసాయరంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిమైందన్నారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనమని.. ఉగాది పచ్చడి షడ్రుచుల మాదిరిగానే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ, ముందుకు సాగాలన్నారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు దేశం మరింత ప్రగతి సాధించాలని మంత్రి కాంక్షించారు. పాడిపంటలతో కళకళలాడాలి పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. బుధవారం ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనదన్నారు. పండుగ రోజున షడ్రుచులు స్వీకరించడం, దైవంతో భక్తి చాటడం చెప్పుకోదగ్గ విశేషమన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్లో వివరించే పంచాంగం ఇదే రోజు వెలువరించడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన కాంక్షించారు. -
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కోస్గి రూరల్: సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హల్లో నిర్వహించిన మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్లో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, ఏడీఏ రామకృష్ణ తదితరులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సిరిధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. సిరిధాన్యాల సాగుతో రైతులకు అధిక లాభాలు రావడంతో పాటు మానవళికి పోషకాలతో కూడిన ఆహారం అందుతుందన్నారు. అనంతరం రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇతర సిరిధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించి.. రైతులందరికీ వాటి రుచి చూయించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమా లు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమా ర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ దీల్లికర్ సరస్వతీ జనార్దన్, ఏఓ రేష్మారెడ్డి, కొత్తపల్లి రమేశ్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, కౌన్సిలర్ భానునాయక్, మాస్టర్ శ్రీనివాస్, ఓంప్రకాశ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు పాల్గొన్నారు. -
హిందూ ముస్లింలుసోదరభావంతో మెలగాలి
కొత్తపల్లి (మద్దూరు): మున్సిపల్ పట్టణ పరిధిలోని రెనివట్ల గ్రామంలోని జామియా మసీద్లో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యశ్రీ శంకర్ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ను పురస్కరించుకొని బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ మహిమూద్, మహేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవుల భూముల విషయమై ఫిర్యాదు
మక్తల్: పట్టణంలోని క్రైస్తవుల భూములు కొనుగోలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎంబీ ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్ క్రిష్టఫర్ మీసా కోరారు. ఈ మేరకు బుధవారం కమిషనర్, తహసీల్దార్, సీఐకు వినతిపత్రం అందజేశారు. సదరు భూమిలో 2012లో వందకు పైగా ప్లాట్లను పలువురికి విక్రయించారని, కొనుగోలు చేసిన స్థలాల్లో కొందరు ఇళ్లు, దుకాణాలు కూడా నిర్మించుకున్నారన్నారు. అయితే ఆ భూములపై ప్రస్తుతం ప్రసాద్ అనే వ్యక్తి లేని పోని అపోహలను సృష్టిస్తూ భూములు కొనుగోలు చేసిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అతడిని ఎవరు నమ్మొద్దని కోరారు. ఉడిమిళ్లలోగుప్తనిధులతవ్వకాలు అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ వీరేష్గౌడ్ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఆటో, కారు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
మరికల్: ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయలైన ఘటన పట్టణ శివారులోని రైల్వేబ్రిడ్జి దగ్గర బుధవారం చోటుచేసుకుంది. ఆటో మరికల్లో ప్రయాణికులను ఎక్కించుకొని జిన్నారానికి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి సమీపంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. డ్రైవర్ వాజీద్, ఆటోల్లో ఉన్న కృష్ణమ్మ అనే ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిధులు మంజూరు చేయడం అభినందనీయం ఊట్కూర్: మండలంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎంపీ డీకే అరుణ రూ. 54 లక్షలు మంజూరు చేయడం హర్షనీయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఊట్కూర్కు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, వల్లంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దజట్రం గ్రామానికి రూ.5 లక్షలు, లక్ష్మిపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దపొర్ల గ్రామానికి రూ.5 లక్షలు, కొత్తపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, బిజ్వార్ గ్రామానికి రూ.5 లక్షలు, ముగ్దుంపూర్ గ్రామానికి రూ.5 లక్షలు మొత్తం రూ.45 లక్షలు మంజూరు చేశారన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు వెంటనే పనులను ప్రారంభించి నాణ్యతతో సీసీ రోడ్లు వేయాలని కోరారు. సమావేశంలో సర్పంచ్లు వాకిటి వెంకటేష్, అర్జున్కుమార్, నాయకులు కిరన్, బాలాంజనేయులు, శ్రీకాంత్రెడ్డి, అశోక్గౌడ్ పాల్గొన్నారు. ఆడబిడ్డల తల్లులకు వరం ‘కల్యాణలక్ష్మి’ దామరగిద్ద: ఆడబిడ్డలు అంటే భారం కాదు వరమని తెలిసేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ కన్కిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తిరుపతయ్య సమక్షంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో 207 మందికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కన్కిరెడ్డి, విండో మాజీ అద్యక్షుడు ఈదప్ప మండల పార్టీ అద్యక్షుడు బాల్రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఖాజా, రఘు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. నేటి నుంచి మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు కోరారు. -
ఇఫ్తార్ 6–34 ( గురువారం సాయంత్రం)
సహర్ 5–00 (శుక్రవారం తెల్లవారుజామున) ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలి మరికల్: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని సర్పంచ్ కల్యాణి, ఉద్యాన శాఖ అధికారి లింగారాజ్ అన్నారు. మండలంలోని అప్పంపల్లిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన కూరగాయల విత్తనాలను సర్పంచ్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకాల మేరకు ఉద్యాన సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలే దామోందర్రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు దామోందర్రెడ్డిలు పాల్గొన్నారు. -
మతసామరస్యాన్ని చాటాలి : ఎస్పీ
నారాయణపేట: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో విశిష్టమైనదని.. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జామా మసీదు, హజికన్పేట్ మసీదు వద్ద ఏర్పాటుచేసిన ఇఫ్తార్లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, కౌన్సిలర్ రవికుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అమీర్రుద్దీన్, దస్తగిరి చాంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్ గౌడ్, తఖీ పాల్గొన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఎస్పీ డాక్టర్ వినీత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో తీపి, చేదు, కష్టాలు, సుఖాలు సహజమని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలు శాంతి భద్రతలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
బస్టాండ్లో వృద్ధురాలు మృతి
మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్లో యాచిస్తూ బస్టాండ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. జూరాల కాల్వలోకి దూసుకెళ్లిన కారు వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. -
స్టేజీ–1 పనులు ప్రారంభం..
రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్హౌస్లు, పైపులైన్ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్ మెయిన్ పైపులను కాచ్వార్ వద్ద అందుబాటులో ఉంచారు. -
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవారం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్చైర్పర్సన్ రాధ అరుణ్, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, కమలాకర్గౌడ్, రవికాంత్, శ్యామ్, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, హనుమంతు నాయక్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచండి
● మూడు నెలల్లో నిర్మాణం పూర్తికావాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లా కేంద్రం సమీపంలో రూ. 55కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ సముదాయం నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్.. ప్రస్తుత కలెక్టరేట్ నుంచి నేరుగా కొత్త భవన సముదాయం వద్దకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన భవన నిర్మాణం పురోగతిని ఆర్అండ్బీ అధికారులతో తెలుసుకున్నారు. కలెక్టరేట్ భవన సముదాయం వెంటనే నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రోడ్లు, ఇతర పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మూడు నెలల్లోగా పనులన్నీ పూర్తిచేయాలన్నారు. అయితే ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవన సముదాయం వరకు మొర్రం మట్టి చదును చేయాల్సి ఉందని ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ కలెక్టర్కు తెలిపారు. కాగా, కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ను అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్తో పాటు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలి
మక్తల్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బురాన్ సమకూర్చిన దుస్తులను మంత్రి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు కొత్త దుస్తులు అందించిన బురాన్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, వాకిటి హన్మంతు, సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, చెన్నమ్మ, జుట్ల అనిత, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26లో భాగంగా బ్యాంకు అనుసంధానంతో అందించే ఆర్థిక సహాయ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం పథకం కింద ఈవీ టు వీలర్, ఈవీ త్రీ వీలర్, వ్యవసాయ పథకం కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను బ్యాంకు లింకేజీతో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు కలిగి.. గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2లక్షల వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీల అక్రమ అరెస్టు తగదు నారాయణపేట: తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలను ప్రభుత్వం పోలీసులచే అక్రమ అరెస్టులకు పాల్పడటం తగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మద్దూర్, మక్తల్ , నారాయణపేట ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి అక్రమంగా అరెస్టులకు పాల్పడటం దారుణమన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస వేతనం రూ. 18వేలకు పెంచాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో పాటు సీఐటీయూ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాభివృద్ధికి సహకరించండి నారాయణపేట: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సకాలంలో ఆస్తి, నీటి, వ్యాపార పన్నులను చెల్లించి.. పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య కోరారు. సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కలిసి బకాయి ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం మరో 15 రోజుల్లో ముగుస్తున్నందున ప్రజలు తమ ఆస్తి, నీటి పన్ను, వ్యాపార పన్నలును సకాలంలో చెల్లించాలని కోరారు. కమిషనర్ వెంట ఆర్ఐలు సందీప్, శివకుమార్, వార్డు ఆఫీసర్లు సుభాని, తిప్పన్న, బిల్ కలెక్టర్ ప్రదీప్ ఉన్నారు. తెల్లకుసుమలు క్వింటా రూ.5,406 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం తెల్లకుసుమలు క్వింటాకు రూ. 5,406 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ. 5,175, కనిష్టంగా రూ. 5,105, పెసర గరిష్టంగా రూ. 7,912, కనిష్టంగా రూ. 5,052, వేరుశనగ గరిష్టంగా రూ. 6,636, కనిష్టంగా రూ. 4,069, జొన్నలు గరిష్టంగా రూ. 5,325, కనిష్టంగా రూ. 2,250, అలసందలు గరిష్టంగా రూ. 5,816, కనిష్టంగా రూ. 4,025, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,809, కనిష్టంగా రూ. 5,209, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,569, కనిష్టంగా రూ. 7,069 ధరలు పలికాయి. -
‘రైతు భరోసా’ ఏకకాలంలో చెల్లించాలి
నారాయణపేట: యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఏకకాలంలో చెల్లించాలని ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఏఓ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా అందించకపోవడంతో రైతులు పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా విడుదల చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విడతలు పూర్తి కావడానికి పుణ్యకాలం గడిచి.. మళ్లీ వానాకాలం పంటల సాగు మొదలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణయ కమిషన్ కేవలం ధరలు నిర్ణయించి.. చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతందని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, కృష్ణయ్య, కొండ నర్సింహులు, బి.నారాయణ, బాలకృష్ణ, ఎ.రాములు, సిరిదస్తప్ప, ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. -
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం: 4 టీఎంసీలు మొత్తం విడతలు : 3మంజూరైనవి : రూ.1,400 కోట్లు వ్యయం : రూ.2,945 కోట్లు కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్, ఎస్ఈ, ఇరిగేషన్, మహబూబ్నగర్ -
‘కమలం’లో ముసలం!
పేట బీజేపీ శ్రేణుల వ్యవహారశైలితో ఎంపీ డీకే అరుణకు కోపమొచ్చిందా అనే చర్చ కొనసాగుతోంది. మున్సిపల్ పీఠాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడతామని ఎవరు చెప్పారు.. దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని పార్టీ పెద్దలకు ఎంపీ చురకలంటించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తోచినట్లు చెబితే అధిష్టానం ఎందుకున్నట్లని మందలించినట్లు సమాచారం. పదవులు ఆశించడం తప్పు కాదు.. పెద్దలపై బురదజల్లడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. పార్టీ పెద్దల తీరు.. పలువురు కౌన్సిలర్లు తెర వెనుక మాట్లాడిన మాటలు జేజమ్మ చెవులో పడటంతో ఆమె గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సమయం ఇవ్వాలంటూ ఎంపీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, చైర్పర్సన్ భర్త సత్యయాదవ్ కోరగా.. పార్లమెంట్ సమావేశాల తర్వాత అని చెబుతుండటంతో ఒకింత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ సమయం ఇచ్చిన తర్వాతే బాధ్యతలు చేపడతారా... లేక సమయం ముంచుకొస్తుందనే భావనతో ముందుకు వెళ్తారో వేచి చూడా లని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నారాయణపేట: పట్టణ బీజేపీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ శ్రేణులో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రూపు రాజకీయాలు, కీలక నేతల పనితీరుతో పుర ఎన్నికల తర్వాత పార్టీలో మూడు ముక్కలాట మొదలైందనే చర్చ కొనసాగుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత పుర చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పార్టీలో నాయకుల మధ్య దూరం పెరుగుతుండగా ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముసలం చివరకు ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలోని కోస్గి, మక్తల్, మద్దూరు పురపాలికల్లో అధికార పార్టీ అభ్యర్థులు చైర్పర్సన్లుగా పదవీ బాధ్యతలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. కానీ నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ నుంచి చైర్పర్సన్గా కొండ శ్వేత ప్రమాణ స్వీకారం చేసి సోమవారానికి సరిగ్గా నెలరోజులు అవుతుంది. నేటి వరకు పదవీ బాధ్యతలు చేపట్టేందుకే పెద్దల ఆశీస్సులు దొరక్కపోవడం.. వాస్తు ప్రకారం చైర్పర్సన్ చాంబర్ను మార్చడంలో నిమగ్నమవడం.. ముహూర్తం కుదరకపోవడంతో అసలు పేట బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ కొనసాగుతోంది. పుర చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలో ఏం జరిగిందనే చర్చ నెలరోజులుగా వినిపిస్తోంది. ఫిబ్రవరి 16న ఉదయం 10 వరకు చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం తేల్చకపోవడం.. పార్టీ కౌన్సిలర్లు హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక వాహనాల్లో జిల్లాకేంద్రం సమీపంలోని ద్వారక పాఠశాల ప్రత్యేక శిబిరానికి ఎంపీ డీకే అరుణ సమక్షంలో చేరుకోవడం వరకు బాగానే ఉంది. ఈ తర్వాత తాము చెప్పిన వారినే చైర్పర్సన్ ఎన్నుకుంటేనే చేతులు ఎత్తుతామని పలువురు కౌన్సిలర్లు ఎంపీ ఎదుట చెప్పడంతో ఆమెకు కోపమొచ్చినట్లుందని సమాచారం. పార్టీ అధిష్టానం ప్రకటించిన వారికి మద్దతు ఇవ్వాలిగాని.. మీరెలా నిర్ణయిస్తారంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదేం క్రమశిక్షణ అంటూ సీనియర్ నేతలతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్ నేతలతో పాటు కొందరు కౌన్సిలర్లు మంకుపట్టుతో చివరకు చేసేది లేక కొండ శ్వేతను చైర్పర్సన్గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 1వ వార్డు కౌన్సిలర్ సత్యరఘుపాల్రెడ్డికే వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ఊహించారు. కానీ చివరకు సత్యరఘుపాల్తోనే జి.రాఘవేందర్రెడ్డి సతమణి మంజుల పేరును ఎంపీ చెప్పించారు. చైర్పర్సన్ పదవి రాకపోయినా వైస్ చైర్మన్ పదవి వచ్చిందనే సంతృప్తిలో మంజుల రాఘవేందర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసి నెల గడుస్తున్నా బాధ్యతలు చేపట్టని పేట చైర్పర్సన్ అంతర్గత విభేదాలే కారణమా? పుర చైర్పర్సన్ పదవి తమ సతీమణికి ఇవ్వాలంటూ ఆశించిన వారిలో సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, రాఘవేందర్రెడ్డి, శ్యాంసుందర్గౌడ్ ఉన్నారు. కాగా గత మున్సిపల్ ఎన్నికల్లో సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేతను చైర్పర్సన్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అయితే అప్పట్లో పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో కల నెరవేరలేదు. ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందడం, 10వ వార్డులో బీజేపీ రెబల్గా పోటీచేసిన జయశ్రీ విజయం సాధించి తిరిగి పార్టీలో చేరడంతో సంఖ్య 12కు చేరింది. గత మున్సిపల్ ఎన్నికల్లో నష్టపోయామని, తనకు ఈసారి అవకాశం ఇవ్వాలంటూ సత్యయాదవ్ పట్టుబట్టడంతో చివరకు పార్టీ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి సత్యయాదవ్ను రాజీనామా చేయమంటారని ఒకనొక దశలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ పెద్దలు తనతో చర్చించ లేదని సత్యయాదవ్ చెబుతున్నారు. -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గరి నుంచి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు ఇదీ నేపథ్యం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక భవనం ఉంది. ● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ● వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542-245633 నంబర్కు ఫోన్ చేయాలి. టోల్ఫ్రీ నంబర్లు.. 19671800 425 00333తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హెల్ప్లైన్ నంబర్ పౌర సరఫరాల శాఖ1800 11 4000, 1915ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగ ఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్,టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణ, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల వల్ల వినియోగదారులు నష్టపోతే ఇలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది. ● సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింధర్రెడ్డి నారాయణపేట: జిల్లాలో గృహ, విద్యాలయాలు, ఆస్పత్రులకు అవసరమైన ఎల్పీజీ సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని.. వంట గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింధర్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ బుకింగ్, నిల్వలు, సరఫరాకు సంబంధించి రోజువారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు వివరించారు. యుద్ధం కారణంగా రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని ఆదేశించారు. డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌర సరఫరాలశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేస్తాయని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ సైదులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్, డీలర్లు భీమయ్యగౌడ్, శాంతకుమార్, అశోక్, ఉదయ్, దత్తాత్రేయ, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారుడి విజయం
బాలానగర్కు చెందిన ముసాని విజయానంద్ గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో దీపావళి ఆఫర్ కింద మహబూబ్నగర్–ఏనుగొండలోని ఏథర్ షోరూంలో ఎలక్ట్రిక్ బైక్ను బుక్ చేశారు. ఇందులో భాగంగా ఆన్లైన్లో అమెజాన్ ద్వారా రూ.1.04 లక్షలు చెల్లించారు. అయితే తమ వద్ద వాహనం లేదంటూ ఈ డబ్బులను రీఫండ్ చేశారు. దీంతో బాధితుడు వినియోగదారుల ఫోరం కమిషన్లో కేసు వేశారు. దీంతో షోరూం నిర్వాహకులు దిగి వచ్చి ఆఫర్లో తిరిగి డబ్బులు తీసుకుని వాహనాన్ని డెలివరీ చేయడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశారు. తూకాల్లో మోసాలు తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. –మోహన్రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా ఫిర్యాదులు పెరుగుతున్నాయి.. వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ ● -
తొలిరోజు ప్రశాంతం
● జిల్లాలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ● 99.8 శాతం హాజరు నమోదు నారాయణపేట రూరల్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ భాష పరీక్షకు మొత్తం 43 కేంద్రాల్లో 8,319 మంది విద్యార్థులకుగాను 8,306 మంది పరీక్ష రాయగా.. 13 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని మాడ్రన్ పాఠశాల కేంద్రంలో ప్రైవేట్ విద్యార్ధుల్లో ముగ్గురికి ముగ్గురు హాజరయ్యారు. మొదటిరోజు 99.8 హాజరు శాతం నమోదైంది. అధికారుల తనిఖీ.. పట్టణంలోని బ్రిలియంట్, లిటిల్స్టార్స్ పాఠశాల పరీక్ష కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తనిఖీ చేశారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్ల ఏర్పాటు, వైద్య సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి గోవిందురాజు తనిఖీ చేశారు. ఫ్లయింగ్స్కాడ్ బృందంతో పాటు పది కేంద్రాల్లో సిట్టింగ్ స్కాడ్ బృందాలు విధులు నిర్వర్తించాయి. సీఐ శివశంకర్ పలు కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. గుర్తింపుకార్డు లేని వారిని లోనికి అనుమతించరాదని చెప్పారు. -
ఆర్డీఓగా శిక్షణ కలెక్టర్
నారాయణపేట: ఆర్డీఓగా శిక్షణ కలెక్టర్ కె.ప్రణయ్కుమార్ 5 వారాల కాలపరిమితికిగాను శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ డివిజన్లో మౌలిక వసతుల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. శనగ క్వింటా రూ.5,209 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం శనగలు క్వింటా గరిష్టంగా రూ.5,209, కనిష్టంగా రూ.5,101 ధర పలికింది. అదేవిధంగా వేరుశనగ గరిష్టంగా రూ.7,889, కనిష్టంగా రూ.3,425, ఆలసందలు గరిష్టంగా రూ.6,091, కనిష్టంగా రూ.4,012, ఎర్ర కంది గరిష్టంగా రూ.8,050, కనిష్టంగా రూ.4,291, తెల్ల కంది గరిష్టంగా రూ.7,309, కనిష్టంగా రూ.7,021 ధరలు లభించాయి. వేరుశనగ క్వింటా రూ.8.519 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,519, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు రూ.5,889, జొన్నలు రూ.5,273, పెబ్బర్లు రూ.4,850, ఆముదాలు రూ.6,144, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,631, ధాన్యం హంస రూ.1,891, ఆర్ఎన్ఆర్ రూ.2,051 ధరలు పలికాయి. తొలిసారి ‘నల్లమల’కు గవర్నర్ మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని, పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగిని సంఘంలో భాగస్వామిని చేస్తూ హక్కుల పోరాటంలో ఏకం చేయాలని పిలుపునిచ్చారు. డీఏ బకాయిలు ఏకకాలంలో అన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం తగదని, పెండింగ్ బకాయిల కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెన్షనర్ ఐడీలను కల్పిస్తూ, కంట్రిబ్యూషన్ లేని హెచ్ఎస్ను అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, కోశాధికారి రాఘవేంద్ర రాష్ట్ర సాహిత్య కమిటీ వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్,రాజేష్, నరేష్, రాగవేందర్ రావు, కర్నయ్య పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు నారాయణపేట రూరల్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8,316 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని మోడ్రన్ పాఠశాల పరీక్ష కేంద్రం కేటాయించారు. ఏ కేటగిరి పరీక్ష కేంద్రాలు 17, బి కేటగిరి కేంద్రాలు 17 ఉన్నాయి. 9 కేంద్రాలు సి కేటగిరిలో ఉండటంతో ఒక్కో సీ–కస్టోడియన్తో పాటు ఒక వాహనం ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లకు 10 పోలీస్స్టేషన్లను కేటాయించారు. రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్ష జరగనుండగా.. అరగంట ముందే కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. అయితే ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్గా నిర్ధారించి 9.35 తర్వాత వచ్చిన వారిని అనుమతించరు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం శుక్రవారం వరకు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 43 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 43 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించి వారికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. సుమారు 380 మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నారు. జిల్లా నోడల్ అధికారి డీఈఓతో సహా మరో పది సిట్టింగ్, ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచడంతో పాటు ప్రతి కేంద్రం వద్ద ముగ్గురు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఎంఈఓలు, కస్టోడియన్లు దృష్టి సారించారు. తాగునీరు, ఫర్నీచర్, మరుగుదొడ్లు తదితర వాటిని సమకూర్చారు. విద్యుత్ సౌకర్యంతో పాటు వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వినియోగంపై సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ ప్రత్యేకంగా కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసింది. సందేహాలు, సలహాలు, సూచనలకు 86397 15158 సంప్రదించాలని సూచించారు. జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు.. 8,316 మంది విద్యార్థులు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి పదోతరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాం. సీసీ కెమెరాలను అవసరం మేరకు ఉపయోగిస్తాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. – శశికుమార్, జిల్లా పరీక్షల విభాగం అధికారి పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి ప్రైవేట్ విద్యార్థులు యూనిఫామ్ ధరించరాదు. సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. హాల్టికెట్, ప్యాడ్తో పాటు వాటర్బాటిల్, చేతి రుమాలు వెంట తెచ్చుకోవాలి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్తో పరీక్షకు హాజరుకావచ్చు -
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి : డీఈఓ
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డీఈఓ గోవిందరాజు అన్నారు. తపస్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి ప్రతిభ పరీక్షల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందజేసి మాట్లాడారు. పుస్తకాల్లోని జ్ఞానం కేవలం పరీక్షల కోసమే కాకుండా జీవితాన్ని తీర్చిదిద్దడానికి వినియోగించాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించాలని, ప్రశ్నించేతత్వం అలవర్చాలని కోరారు. సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని.. ఇలాంటి పోటీ పరీక్షలను ఉపాధ్యాయ సంఘం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగార్జునరెడ్డి, సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, తపస్ నాయకులు లక్ష్మణ్, నర్సింహులు, అశోక్ రెడ్డి, లాలప్ప, ప్రదీప్, శంకర్, చంద్రకాంత్, రాజేష్, సల్మాన్రాజ్, అర్చన, వెంకటయ్య, శంకర్సింగ్ పాల్గొన్నారు. విజేతలు వీరే.. ప్రాథమిక స్థాయిలో 3వ తరగతి విభాగంలో శ్రీజ (ఉంటకుంటతండా) ప్రథమ, ఓంకార్ (అంత్వర్) ద్వితీయ, 5వ తరగతిలో గణేష్ (సింగారం) ప్రథమ, వర్ష (ఉంటకుంట తండా) ద్వితీయ, ప్రాథమికోన్నత స్థాయిలో 7వ తరగతి విభాగంలో మహేశ్వరి (పేరపళ్ల) ప్రథమ, రాకేష్ (ఎక్లాస్పూర్) ద్వితీయ, ఉన్నత పాఠశాల స్థాయిలో 7వ తరగతి వైష్ణవి (బొమ్మన్పాడు) ప్రథమ, సింధు (కొల్లంపల్లి) ద్వితీయ, 9వ తరగతి విభాగంలో లావణ్య (కొల్లంపల్లి) ప్రథమ, చరణ్తేజ (గ్రౌండ్ స్కూల్) ద్వితీయ బహుమతులు సాధించారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్, కోస్గి మున్సిపాలిటీ నోడల్ అధికారి విశాల్రాజ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుర కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు కేవలం 52 శాతం మాత్రమే వసూలు అయ్యాయని.. మరో పది రోజుల్లో 80 శాతానికి చేరేలా చూడాలని ఆదేశించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్జల్ పనుల్లో వేగం పెంచాలని, ప్రతి వ్యాపారస్తుడికి ట్రేడ్లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, మెప్మా సిబ్బంది ఉమెన్ ఫర్ ట్రీ ప్రోగ్రాంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలని కోరారు. పట్టణంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియం, పంచతంత్ర పార్క్, డంపింగ్యార్డు పనులను స్వయంగా పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి గడువులోకి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే పుర పరిధిలోని మల్రెడ్డిపల్లి, 6వ వార్డులో డ్రైనేజీలను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు అంజిలయ్య, నాగులపల్లి రాధిక నర్సింహులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్
● ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరుగగా 4,143 మంది విద్యార్థులకుగాను 4,058 మంది హాజరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,179 మందికిగా ను 3,124 మంది హాజరుకాగా 51 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 964 మందికిగాను 934 మంది పరీక్ష రాయగా 34 మంది హాజరుకాలేదు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్ల యింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సిబ్బందికి డీఐఈఓ సుదర్శన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిబాట పట్టిన విద్యార్థులు.. జిల్లావ్యాప్తంగా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో పాటు కేజీబీవీ బాలికలు పరీక్షలు పూర్తి కావడంతో ఇంటిబాట పట్టారు. పరీక్ష ముగిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు కళాశాలలకు వచ్చి విద్యార్థుల లగేజీతో వెంటబెట్టుకొని వెళ్లారు. -
డిమాండ్ నోటీసులు అందించాం..
బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం. – రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ, బీడీ కార్మికురాలు, అమరచింత చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీడీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో ఆందోళన చేపడతాం. – సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం ● -
నారాయణపేట
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026పాలమూరు: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం స్థానికంగా కన్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు నెలకొనడంతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వాణిజ్య సిలిండర్ల పంపిణీలో కోతలు మొదలయ్యాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. ఇలాగైతే హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో కోత పెట్టడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఏజెన్సీలు నిలిపేయడం, ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు మొత్తం ఇస్తామన్నా సిలిండర్ దొరకడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 15 పరీక్షా కేంద్రాల్లో 5,717 మంది విద్యార్థులకుగాను 4,927 మంది హాజరుకాగా.. 190 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 4,113 మందికిగాను 3,977 మంది హాజరుకాగా.. 136 మంది పరీక్షలు రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 1,004 మందికిగాను 950 మంది పరీక్ష రాయగా.. 54 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి.. స్థానిక గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద షీటీం ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్ష ముగిసిన తర్వాత బాలికలతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం షీటీం పని చేస్తుందని, వేధింపులకు గురిచేస్తే సెల్నంబర్ 87126 70398 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు కవిత, జ్యోతి, చెన్నప్ప, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబదేవి
హుండీ ఆదాయం రూ.99.55 లక్షలు అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని శ్రీజోగుళాంబదేవి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలను లెక్కించగా రూ.99,55,566 ఆదాయం సమకూరినట్లు ఈఓ దీప్తి తెలిపారు. అలాగే 28 గ్రాముల మిశ్రమ బంగారం, 298 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ కరెన్సీలైన యూఎస్డీ 39, ఫౌండ్స్ 10, ఓమన్ 100 బైసా హుండీల ద్వారా వచ్చినట్లు చెప్పారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీలను ఉగాది పండగ తర్వాత లెక్కించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన నగదును డీసీసీ బ్యాంక్లో జమ చేశామన్నారు. -
‘డయల్ యువర్ ఎస్పీ’కి విశేష స్పందన
నారాయణపేట: జిల్లా ప్రజలకు పోలీస్శాఖ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల బాధితులు, ఫిర్యాదుదారులు ఫోన్చేసి తమ సమస్యలను వివరించారు. మొత్తం 21 మంది ఫోన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు నేరుగా సంప్రదించి సమస్యలు తెలియజేసే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు రాత్రిళ్లు గస్తీ పెంచాలని, భూ తగాదాల ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. గతంలో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని కొందరు ఫిర్యాదు చేశారు. అలాగే కోస్గిలో సంత రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని, పోయిన సెల్ఫోన్లు ఇప్పటివరకు ట్రేస్ కాలేదని, ఠాణాల్లో ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని పలువురు వివరించారు. సమస్యలను ఎస్పీ స్వయంగా రాసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని, వారికి న్యాయం చేయడం ప్రధాన బాధ్యతని, నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీస్శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రూ.5 వేల కోట్లతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చి భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లు, కౌన్సిలర్ల ఒకరోజు శిక్షణకు మంత్రి హాజరై దిశా నిర్దేశం చేశారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనకు మనందరం కృషి చేద్దామన్నారు. సర్పంచ్, చైర్పర్సన్ పదవి అంటే ఆషామాషీ కాదని.. జనన, మరణ ధ్రువీకరణ పత్రం అందజేసే సర్పంచ్, చైర్మన్ పదవులు ఎంతో కీలకమన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవచేసే అవకాశం దొరకడం అదృష్టమని.. తాను సర్పంచ్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసి పదితరాల వరకు గుర్తుండేలా పని చేయాలని సూచించారు. 99 రోజుల కార్యక్రమంలో పది అంశాలను చేర్చారని.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ గడ్డ అంతా అభివృద్ధి జరుగుతుందన్నారు. వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్బంకుల నిర్వహణ, ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు. స్టేడియం నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. సర్పంచ్, చైర్పర్సన్ పదవి ఎంతో కీలకం రూ.5 వేల కోట్లతో పేట–కొడంగల్ పనులు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులందరికి మంత్రిగా సూచన చేస్తున్నానని.. ప్రజాప్రతినిధులను గౌరవించడం మనందరి బాధ్యతని మంత్రి అన్నారు. ముఖాలు, పార్టీలు చూసి పని చేయొద్దని, ప్రజాప్రతినిధులందరూ ఒక్కటేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో 272 మంది సర్పంచులు, 72 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్పీ వినీత్, మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బావోజి జాతర వాల్పోస్టర్ ఆవిష్కరించిన సీఎం
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గిరిజన ఆరాధ్య దైవం గురులోకామసంద్ బావోజి జాతర గోడపత్రికను గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆలయ కమిటీ ఆహ్వాన పత్రిక అందజేసింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గోపాల్నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నర్సింహులు, నిడ్జింత తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్రెడ్డి, సుభాష్ నాయక్, రవి నాయక్, రాజేష్ రాథోడ్, అనిల్నాయక్, లాల్యానాయక్, నర్సింహారెడ్డి, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వర్ సమస్య వస్తోంది..
నగరంలో మా ఏజెన్సీ పరిధిలో నెలకు 3 వేల వరకు కమర్షియల్ సిలిండర్లు అందిస్తున్నాం. వాటన్నింటినీ పూర్తిగా నిలిపివేశాం. ఇళ్లకు ఇచ్చే వాటిలో ఎలాంటి సమస్య లేదు.. వాటిని సక్రమంగా అందిస్తున్నాం. రెండు, మూడు కనెక్షన్స్ ఉన్న వాళ్లు మొత్తం అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి చూస్తున్నారు. దీంతో సర్వర్ సమస్య వస్తోంది. హోటల్స్, పరిశ్రమలు ఇతర కమర్షియల్ వాటికి ఇవ్వడం లేదు. తర్వాత ఎలా ఉంటుందనే అంశంపై నేడు సమావేశం ఉంటుంది. – లక్ష్మీకాంత్రెడ్డి, స్వప్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు హోటల్ నిర్వహణ కష్టంగా ఉంది మా రెస్టారెంట్లో రోజుకు నాలుగు సిలిండర్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఒకటి ఇచ్చారు. దీంతో హోటల్ నడపటం చాలా కష్టం. మా దగ్గర 150 రకాల వంటకాలు ఉంటాయి. కానీ సిలిండర్ల కొరత వల్ల బిర్యానీతో పాటు ఒకటి రెండు రకాల వంటలు చేయాల్సిన పరిస్థితి. రోజు కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కష్టం. ఇలాగే కొనసాగితే హోటళ్ల నిర్వహణ పూర్తిగా కష్టంగా మారుతుంది. – నిరంజన్రెడ్డి, శిల్పి హోటల్ యాజమాని, మహబూబ్నగర్ సిలిండర్లు లేవని చెబుతున్నారు సాధారణంగా కట్టెల పొయ్యిపై అన్ని రకాల టిఫిన్స్ చేయడం సాధ్యం కాదు. టిఫిన్ హోటల్స్కు తప్పక సిలిండర్లు అవసరం అవుతాయి. అవంతి హోటల్లో నిత్యం ఐదు సిలిండర్ల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సిలిండర్ల ధరను పెంచడం కూడా ఇబ్బందికరంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సిలిండర్లు లేవని చెబుతున్నారు. – చంద్రశేఖర్ శెట్టి, అవంతి హోటల్ కమర్షియల్ సిలిండర్లు నిలిపివేశాం.. జిల్లాలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్ ఇతర కమర్షియల్ వాటికి సిలిండర్ల వినియోగం పూర్తిగా నిలిపివేశాం. డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా సిలిండర్లు అందిస్తాం. ఈ అంశంపై ఉన్నత అధికారులతో శుక్రవారం సమావేశం ఉన్న నేపథ్యంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయి. – శ్రీనివాస్, డీఎస్ఓ, మహబూబ్నగర్ ● -
జాతీయ సమగ్రతను పెంచుతాయి: వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ల వల్ల జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటకలోని రాయచూర్లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ను పీయూ విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్యాంపులో విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయం అని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి క్యాంపులో పాల్గొనడం వల్ల పలు అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. జాతీయ ఐక్యత, సహకారం, సామాజిక బాధ్యత.. తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాల ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, లీడర్లు సోమ్లా, అధ్యాపకులు భూమయ్య, రవికుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటికి జనాభా ప్రామాణికం
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్రెడ్డి నారాయణపేట: జనాభా అన్నింటికి ప్రామాణికమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2027 జనగణనపై నిర్వహించిన 3 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పన, ఇతర అంశాలలో జనాభా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అన్నింటికి ప్రామాణికం జనాభానేనిని, ప్రాంత జనాభాను బట్టి నిధుల కేటాయింపు, అభి వృద్ధి ఆధారపడి ఉంటుందని, జనగణను అందరూ సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి జనగణన చేపడుతున్నామని.. ప్రభుత్వ నిబంధనలు, హ్యాండ్బుక్స్ అన్నింటిని జాగ్రత్తగా చదవాలన్నారు. జనగణన రెండు విభాగాలుగా జరుగుతుందని.. కుటుంబాలు, మనుషుల లెక్కలు సేకరిస్తారని చెప్పారు. 2027 జనగణన డిజిటల్ పద్ధతిలో కొనసాగుతుందని.. సరైన సమాచారంతో చేపట్టాలని కోరారు. జనగణనకు అవసరమైన టెక్నికల్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను నియమించాలని, చురుకై న వ్యక్తులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను మాట్లాడుతూ.. తహసీల్దార్లు, పుర కమిషనర్లు చార్జ్ అధికారులుగా ఉన్నందున సరైన వ్యక్తులను సూపర్వైజర్లుగా నియమించాలని, ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటారని.. మార్చి 31 నాటికి వీరి నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్లను నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి 600 నుంచి 700 జనాభాకు ఒక ఎన్యూమరేటర్ ఉంటారని వెల్లడించారు. రాష్ట్ర సెన్సెస్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ బి.లాజర్ మాట్లాడుతూ.. జనగణనలో సూపర్వైజర్తో పాటు ఎన్యూమరేటర్లు, చార్జ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. జనగణనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సూపర్వైజర్లు కూడా ఆన్లైన్లోనే సరి చూసుకోవచ్చని, పోర్టల్లో వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో సీపీఓ కాఘవాహన్, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, డీపీఓ సుధాకర్రెడ్డి, డిప్యూటీ సీపీఓ శ్రీదేవి, ఎస్ఓ సుల్తాన్, విజయ్కుమార్, పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
యువతకు కిడ్నీ గండం
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యల తో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితు లు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ఏటా మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కో సారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
డాష్బోర్డు వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా లో ఎంపిక చేసిన 26 పాఠశాలల నుంచి హాజ రైన 61 మంది ఉపాధ్యాయులకు డాష్ బోర్డు వినియోగంపై నిర్వహించిన శిక్షణను సీఎంఓ రాజేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ అమలులో భాగంగా ఏఎక్స్ఎల్ యాప్, డాష్ బోర్డులను తరగతి గదిలో ఉపయోగించి వి ద్యార్థులకు సులువుగా బోధన అందించవచ్చ న్నారు.విద్యార్థుల అభ్యాసన ప్రగతిని సక్రమంగా నమోదు చేయడం, విశ్లేషించడం, బోధన ను మెరుగుపర్చడంలో డిజిటల్ సాధనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జూన్ సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లుగా హరిసుధన్, నరేష్, శంకర్, సురేందర్, రమ్య, భీమేశ్వరి వ్యవహరించగా డీఎస్ఓ భానుప్రకాష్, ఏఏంఓ విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, శశికుమార్, పీఆర్టీ యూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జనార్దన్రెడ్డి, హెచ్ఎం దత్తురావు పాల్గొన్నారు. -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు ● విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ● ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ స్టేషన్ మహబూబ్నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్తో సహా స్పీడ్వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు. -
పోలీసుశాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ
నారాయణపేటరూరల్: పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. జిల్లాకేంద్రం సమీపంలోని రూరల్ పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసులను పరిశీలించి జాప్యానికి గల కారణాలను ఎస్ఐ రాముడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, విధుల్లో అలసత్వం సరికాదని హెచ్చరించారు. ఠాణా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రిసెప్షన్, స్టేషన్ రికార్డులు తదితర వాటిని భద్రపర్చాలని సూచించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ అక్రమ సరుకు రవాణాపై దృష్టి సారించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేడు డయల్ యువర్ ఎస్పీ నారాయణపేట: ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడంలో భాగంగా గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఎస్పీ కార్యాలయ ఫోన్నంబర్ 0850–6281182 సంప్రదించాలని.. ఎస్పీ డా. వినీత్ స్వయంగా మాట్లాడి సమాధానమిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ నారాయణపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, పుర కౌన్సిలర్లకు గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఫణిందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్హాల్లో కార్యక్రమం కొనసాగుతుందని.. ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు జరిగే శిక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు, 99 రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం నిర్వహించే వివిధ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, నిష్ణాతులైన శిక్షకులతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ‘ఇరాన్పై దాడులు ఆపాలి’ నారాయణపేట ఎడ్యుకేషన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపే దాడులు వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సావర్కర్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రపంచ దేశాలపై అడ్డుగోలుగా దాడులు చేసి ఆయా దేశాల నాయకులు, ప్రజలను చంపి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు వ్యతిరేకంగా గళమెత్తిన ఇరాన్ అధ్యక్షుడిని దారుణంగా హత్య చేసిందని.. అదేవిధంగా అణు కార్మాగాలను ధ్వంసం చేసి వేలమంది చావుకు కారణమైందన్నారు. యుద్ధ ప్రభావంతో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగిందని.. రాబోవు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాల్, అంజిలయ్య, ఆంజనేయులు, గోవింద్, అలీ, నరహరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా సదస్సుకు నిడ్జింత సర్పంచ్ కొత్తపల్లి: అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కేంద్ర ప్రభుత్వం డిల్లీలో నిర్వహించిన జాతీయ మహిళా సదస్సుకు మండలంలోని నిడ్జింత సర్పంచ్ రజిత హాజరయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మంది మహిళా సర్పంచులను ఎంపిక చేయగా జిల్లా నుంచి కొత్తపల్లి మండలం నిడ్జింత సర్పంచ్ ఎంపికయ్యారు. బీఎస్సీ బీఈడీ పూర్తిచేసిన రజిత రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు పాల్గొనే సభకు వెళ్లడంతో మండల, జిల్లాస్థాయి నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పదికి పక్కాగా ఏర్పాట్లు
జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు.. 8,316 మంది విద్యార్థులు ● కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన ● సీసీ కెమెరాల పర్యవేక్షణ ● ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి గోవిందరాజు నారాయణపేట రూరల్: జిల్లాలో శనివారం నుంచి జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కొంత మార్పులు జరిగాయి. ఓఎంఆర్ షీట్తో పాటు సమాధాన పత్రానికి బదులు 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, మౌలిక సౌకర్యాలు, ప్రశ్నపత్రాలు చేర్చడం తదితర వివరాలను బుధవారం జిల్లా విద్యాధికారి గోవిందరాజు ‘సాక్షి’కి వివరించారు. ● ప్రశ్న: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ● డీఈఓ: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా, సిట్టింగ్స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. వీరు పరీక్ష ప్రారంభం నుంచి చివరి వరకు కేంద్రంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి కేంద్రానికి తగిన పోలీసు బందోబస్తు కల్పిస్తున్నాం. ● ప్రశ్న: సిబ్బందికి ఏమైన శిక్షణ ఇచ్చారా? ● డీఈఓ: చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను సెంటర్ల వారీగా నియమించి ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. ప్రత్యేక్ష శిక్షణతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాం. నిబంధనలకు సంబంధించిన బుక్లెట్ పంపిణీ చేశాం. ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయింది. గురువారం వారికి తగిన సూచనలిస్తున్నాం. ● ప్రశ్న: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ● డీఈఓ: అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల్లో వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాట్లు చేశాం. మూత్రశాలలు, మరుగు దొడ్లు, తాగునీరు, విద్యుత్ స రఫరా, ఫ్యాన్లు ఉంటేలా మా ర్పులు చేశాం. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పోలీసుల సహకారంతో కేంద్రాల ఆవరణలో 144సెక్షన్ అమలులో ఉంటుంది.విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయిస్తున్నాం. ● ప్రశ్న: కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా? ● డీఈఓ: విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియచేయాలనుకుంటే సెల్నంబర్ 86397 15158 సంప్రదించాలి. ● ప్రశ్న: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏమిటి? ● డీఈఓ: నేరుగా పరీక్షలంటే భయం వీడి పండుగలా భావించాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలను నివృత్తి చేసుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని ముందురోజు చూసుకోవడంతో ఆందోళన ఉండదు. పరీక్షకు వచ్చే ముందు అల్పాహారం తిని రావాలి. గంటముందే కేంద్రానికి చేరుకొని హాల్టికెట్తో లోపలికి వెళ్లాలి. అన్నిరకాలైన రాత వస్తువులు వెంట తెచ్చుకోవాలి. ప్యాడ్పై ఎలాంటి రాతలు, కాగితాలు ఉండరాదు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రాకూడదు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ప్రశ్న: ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎంత మంది సిబ్బందిని నియమించారు? డీఈఓ: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాలతో కలిపి మొత్తం 43 ఏర్పాటు చేశాం. వాటిలో స్థానిక మాడ్రన్ స్కూల్లో ప్రైవేట్ విద్యార్థులను విలీనం చేశాం. 43 మంది సీఎస్లు, 43 మంది డీఓలు, 43 సీసీలు, 380 మంది ఇన్విజిలేటర్లతో పాటు స్కాడ్ డ్యూటీకి విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. ప్రశ్న: జిల్లాలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయి? ఎందరు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? డీఈఓ: జిల్లావ్యాప్తంగా అన్నిరకాల యాజమాన్య పాఠశాలలు 146 ఉండగా.. 8,316 మంది విద్యార్థులు చదువుకున్నారు. వీరికితోడు 29 మంది సప్లిమెంటరీ విద్యార్థులతో కలిపి 8,347 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,977 మంది బాలురు, 4,370 మంది బాలికలు ఉన్నారు. ప్రశ్న: పరీక్ష సమయం ఎలా ఉంటుంది? నిబంధనలు ఏమిటి? డీఈఓ: గతంలో 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడింటికి కుదించారు. ఈ ఏడాది మాత్రం వరుసగా కాకుండా పరీక్షల మధ్య నాలుగు రోజుల వ్యత్యాసంతో టైంటేబుల్ కేటాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పరీక్ష గంటన్నర మాత్రమే ఉంటుంది. కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందే అనుమతిస్తాం. పరీక్షకు ముందే విద్యార్థుల సమాచారం ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు. ప్రశ్న: హాల్టికెట్ల ఇబ్బందులు ఎలా అధిగమించాలి? డీఈఓ: హాల్టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేరుగా అందిస్తారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెచ్ఎం సంతకం లేకుండా నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు. -
యువతకు ఉపాధి కల్పనలో విఫలం
నారాయణపేట: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ.. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాలపై కన్నెత్తి చూడటం లేదన్నారు. మరోవైపు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ప్రభుత్వం ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు కూడా కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రభుత్వాలకు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, లేనిపక్షంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిద్దూ, మధు, రవి, కృష్ణ, శివ, గణేశ్, మల్లేష్ ఉన్నారు. -
ఇప్పుడే నిప్పుల కొలిమి
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు -
గడువుల ఎత్తిపోతల..!
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్ వరకు పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్ని వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది. కేఎల్ఐ, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లపై ఫోకస్.. 2025 మే 1న మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించింది. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది. ● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్–నారాయణపేట–మక్తల్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెట్టెంపాడు రూ. 252 కోట్లు రానున్న రెండేళ్లలో ఖర్చు చేసే నిధులు: రూ.22 వేల కోట్లు ఇంకా కావాల్సిన నిధులు: రూ.50 వేల కోట్లు ‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు 20 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ పెండింగ్ పనులు పూర్తి అనుకున్న సమయానికి పనులు కావాలంటే నిధులు తప్పనిసరి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు నిధులు వస్తేనే పనులు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్సాగర్ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం 15 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించగా.. 4,922 మందికి గాను 4,750 మంది హాజరయ్యారు. జనరల్లో 4,425 మందికి గాను 4,274 మంది హాజరు కాగా.. 151 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 497 మందికి గాను 476 మంది హాజరై పరీక్షలు రాయగా.. 21మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. పెసర క్వింటా రూ.7,977 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం పెసర క్వింటా గరిష్టంగా రూ. 7,977, కనిష్టంగా రూ. 7,427 ధర పలికింది. వేరుశనగ గరిష్టంగా రూ. 8,169, కనిష్టంగా రూ. 5,940, జొన్నలు గరిష్టంగా రూ. 5,369, కనిష్టంగా రూ. 5,160, అలసందలు గరిష్టంగా రూ. 6,209, కనిష్టంగా రూ. 5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,969, కనిష్టంగా రూ. 6,501, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,629, కనిష్టంగా రూ. 6,769 ధరలు పలికాయి. తరగతి గదుల పనుల్లో వేగం పెంచాలి కోస్గి రూరల్: గుండుమాల్ మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. బోగారంలో సోమవారం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కడా నిధులతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరుడ్రిల్లింగ్ను ప్రారంభించారు. కాగా, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కడా ప్రత్యేకాధికారికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ వేణుగోపాల్, సర్పంచ్ శేఖర్గౌడ్, ఉపసర్పంచ్ సాయప్ప, పంచాయతీ కార్యదర్శి అచ్యుత్, రాములు, రాఘవేందర్, మల్లయ్య ఉన్నారు. భగీరథ నీటి సరఫరా నిలిపివేత నారాయణపేట ఎడ్యుకేషన్: మన్యంకొండ – నారాయణపేట మార్గంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతు కోసం 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు డి.శ్రీనివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీ కారణంగా దెబ్బతిన్న పైపు భాగాన్ని తొలగించి.. కొత్త పైపుతో భర్తీ చేసేందుకు గాను నీటి సరఫరా నిలిపివేతతో దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని మండలాలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. 17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వెన్షన్కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్సీ రవికుమార్, మధుసూదన్రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఆశలు..
పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్హౌజ్ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల ప్రధాన కెనాల్లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 14 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్కు నేరుగా వివరించి.. అర్జీలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, ఆర్డీఓ రామచందర్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రేరణ తరగతులు
నారాయణపేట రూరల్/నర్వ: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులకు మోటివేషనల్, గైడెన్స్ సెషన్ నిర్వహించారు. మొత్తం 135 పాఠశాలల్లో 6వేల మంది విద్యార్థులు ప్రేరణాత్మక తరగతులను సద్వినియోగం చేసుకున్నట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టీవీల ద్వారా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచనలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రణాళికా బద్ధంగా ఎలా చదువుకోవాలి.. భయం వీడి పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి.. సమయపాలన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. ● కాగా, టీ–సాట్ లైవ్ ప్రోగ్రామ్లో మరికల్ మండలం పెద్దకడ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యార్థులకు అమలుచేస్తున్న అకాడమిక్ కార్యక్రమాలు, అదనపు తరగతులు, రివిజన్ టెస్టులు, సన్నాహాక కార్యక్రమాలపై ప్రత్యక్షంగా తెలియజేశారు. కా ర్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, రాజేంద్ర కుమార్, యాదయ్యశెట్టి, భాను ప్రకాశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు జ్ఞాపకశక్తి పెంపొందించుకోవాలి
కృష్ణా: ప్రతి విద్యార్థి పరీక్షలు బాగా రాయాలంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సూచించారు. మంగళవారం మండలంలోని ముడుమాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే అన్నింటా చక్కటి ప్రతిభ కనబర్చే అవకాశం ఉంటుందని, అందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల విద్యాధికారి నిజామొద్దీన్ మాట్లాడుతూ.. 10వ తరగతి కీలకమని, ఇక్కడి నుంచి వెళ్లిన వారు భవిష్యత్లో మంచిస్థానంలో నిలబడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వైద్యనాథన్రెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, కుర్మయ్య, రమేష్, తిమ్మప్ప, మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకా తప్పనిసరి -
ఆరోగ్య యువతే ‘పీఎం సంసద్ ఖేల్’ లక్ష్యం
నారాయణపేట రూరల్: దేశంలో ఆరోగ్యవంతమైన యువత నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని మోదీ పీఎం సంసద్ ఖేల్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ప్రధానకార్యదర్శి తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు క్రీడాపోటీలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని.. పాలమూరు పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 24 వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల, అసెంబ్లీ నియోజవర్గ, పార్లమెంట్స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు లక్ష్మి, వెంకట్రాములు, రఘురామయ్యగౌడ్, రఘువీర్ యాదవ్, వెంకటయ్య, కౌన్సిలర్లు సత్య రఘుపాల్, ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాలంపాడుకు మోక్షం
ఎట్టకేలకు నిధులు.. ర్యాలంపాడు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభు త్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ. 1.66కోట్లు కేటాయింపు రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూముల మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు త్వరలోనే పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభు త్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ పలుమార్లు సర్వే.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
ప్రజాప్రతినిధుల శిక్షణకు పక్కా ఏర్పాట్లు
● అదనపు కలెక్టర్ ఫణీంధర్రెడ్డి నారాయణపేట: జిల్లాలోని సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఈ నెల 12న నిర్వహించే ఒకరోజు శిక్షణకు జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షన్హాల్ను సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీ, వీఐపీ, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందేలా తగిన జాగ్రత్తలు పాటించినట్లు వివరించారు. శిక్షణకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించామని, ఆడియో, వీడియో వ్యవస్థ సరిగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం విడతలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యాచరణ, 10 థీమ్స్లో వివిధ శాఖలు చేపట్టే పనులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంపై అవగాహన కల్పిస్తామని.. మధ్యాహ్న భోజనం అనంతరం పీఆర్, మున్సిపల్ చట్టంపై తరగతులు ఉంటాయని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ లింగయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దామరగిద్ద: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించి బిల్లుల చెల్లింపులో చొరవ తీసుకుంటూ సకాలంలో పూర్తి చేయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మండలంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.. ఏయే దశల్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయని ఆరా తీశారు. సకాలంలో బిల్లులు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి ఉన్నారు. -
అన్నదాతలకు డ్రోన్లు
నారాయణపేట: రాష్ట్రంలో పంటల సాగును ఆధునికీకరించి రైతులకు అండగా నిలిచేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తుండగా.. పంటలపై పురుగు మందులు పిచికారీ చేసేందుకు తాజాగా డ్రోన్లు పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా పంటలకు పురుగు మందులు, సూక్ష్మ పోషకాలను అందించేందుకు డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తి మేరకు డ్రోన్లను సబ్సిడీపై అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో జిల్లాకు 10 డ్రోన్లను పంపిణీ చేస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యూనిట్ వ్యయం రూ.15 లక్షలు ఉండగా.. రూ.4 లక్షల రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎస్ఎంఏఎం పథకంలో.. తొలివిడతలో జిల్లాకు 10 కేటాయింపు ఎఫ్ఓపీలు, పీఏసీఎస్లకు ప్రాధాన్యం క్లస్టర్లు 76, రెవెన్యూ గ్రామాలు 250 4,99,014 సర్వేనంబర్లు.. 4,60,261 ఎకరాలు -
150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచండి
మక్తల్: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్లో 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి.. పనుల పురోగతిపై ఆరా తీశారు. నవంబర్లోగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా హైవే నుంచి ఆస్పత్రికి వచ్చే రోడ్డు విశాలంగా ఉండాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తాయప్ప, రవికుమార్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యం కోస్గి రూరల్: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తుందని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ను వారు ప్రారంభించి మాట్లాడారు. హెచ్పీవీ టీకాతో గర్భాశయంలో క్యాన్యర్ కారక వైరస్ నివారించవచ్చని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించారు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి, మద్దూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,219 టీకాలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి సెంటర్కు 400 టీకాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, డీపీఓ భిక్షపతి, వైద్యులు శ్వేత, కిష్టమ్మ పాల్గొన్నారు. సంఘటిత పోరాటంతోనే హక్కుల సాధన నారాయణపేట: సంఘటిత పోరాటాలతోనే హక్కులు సాధ్యమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం అన్నారు. ప్రజాతంత్ర మహిళా సంఘం, మెప్మా ఆర్పీల యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశ జనాభాలో 48శాతం ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, భద్రత తదితర అంశాలను పరిశీలిస్తే మహిళా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భారతీయ సంస్కృతికి గొప్ప స్థానం ఉన్నప్పటికీ.. మహిళలపై ఆకృత్యాలు, భిన్న రూపాల్లో దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, సమాన హక్కులు, పని ప్రదేశాల్లో రక్షణ, సెలవులు, ఉచిత న్యాయ సహాయం, పని భద్రత లేకుండా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి అన్యాయం చేస్తుందన్నారు. శ్రామిక మహిళా లోకం, ప్రజలు కలిసి సంఘటిత ఉద్యమాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాయి, మాధవి, శాంత పాల్గొన్నారు. భారీగా వేరుశనగ రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం పెద్దఎత్తున వేరుశనగ అమ్మకానికి వచ్చిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా యార్డుకు 7,906 బస్తాల వేరుశనగ రావడంతో యార్డు మొత్తం పల్లి కుప్పలతో నిండిపోయింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.9,100, కనిష్టంగా రూ.8,400 ధర లభించిందని ఆయన పేర్కొన్నారు. -
పేట్.. సోనేకా థేట్!
నారాయణపేట: నారాయణపేట అంటేనే చేనేత చీరలు, బంగారానికి ప్రసిద్ధి. మగువ మనసుదోచే అద్భుతమైన బంగారు ఆభరణాల మన్నికకు మారు పేరుగా.. నగల నాణ్యతలో సోనేకా థేట్– నారాయణపేట్ అని తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. త్వరలోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్) రానుంది. ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని ధారాలు తీసి.. నగలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడైనా మాంసం మార్కెట్, కూరగాయల మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండటం సహజం. కానీ ఉమ్మడి పాలమూరులోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 150 బంగారం దుకాణాలు వరుసగా ఉండటంతో సరాఫ్ బజార్గా పేరుపెట్టారు. నగరాల స్థాయిలో ఇక్కడ బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం సాగుతోంది. నారాయణపేటలో 1896 నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో లహోటికి చెందిన వ్యాపారులు బంగారం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆరంభంలో రాంచందర్ మెఘరాజ్ భట్టడ్, అసారం భట్డడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర 8 బంగారు దుకాణాలు ఉంటే.. ప్రస్తు తం 150కుపైగా దుకాణాలకు విస్తరించాయి. స్థానికంగా జువెల్లర్స్ దుకాణాల్లో తయారు చేసిన ఆభరణాలపై చిన్నసైజులో తమ దుకా ణం పేరు ముద్ర (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలుచేసిన వారు విక్రయించేందుకు వెళ్తే గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబాయి, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పదిరోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. అంతేకాకుండా హాల్మార్క్తో వివిధ రకాల డిజైన్ నగలను పశ్చిమబెంగాల్ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మి నెక్లెస్, లక్ష్మి లాంగ్చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల ఆభరణాలు లభిస్తాయి. వన్నెకు తగ్గని విలువ.. మన్నికకు మారు పేరు ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్కు 130 ఏళ్ల చరిత్ర త్వరలోనే పేట బంగారానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సరాఫ్ బజార్ కళకళలాడుతుంది. శుభకార్యలు, పండుగలు ఉన్నప్పు డు పేట బంగరాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని రాయచూర్, యాద్గీర్, సేడం, గుల్బర్గ, బీదర్, మహారాష్ట్రలో ని పుణె, షోలాపూర్, హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావాసులు ఎక్కువగా వస్తుంటారు. -
20 నెలల్లో పూర్తిచేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్ర త్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడా ది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. భూ సేకరణకు ప్రత్యేక చర్యలు సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి పథకంలో నీటి ఎత్తిపోతల పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ఖర్చు పెరిగి రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలోని రైతులకు సాగునీరు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూ సేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు వెచ్చించామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం హాజరైన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు -
తాతల కాలం నుంచే..
మాతాత మహ్మద్ హస న్ సహాబ్ చాంద్ 1955 లో బంగారం నగల వ్యాపారం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ వ్యాపారాన్ని మార్కెట్లో పోటీపడుతూ మేము కొనసాగిస్తున్నాం. జనానికి నాణ్యమైన బంగారు నగలు విక్రయిస్తాం. అందుకే నారాయణపేట్ సోనేకా థేట్ అని పేరు వచ్చింది. – తఖీ చాంద్, బంగారం వ్యాపారి, నారాయణపేట నారాయణపేట బంగారం అంటేనే మన్నికకు మారుపేరు. 24 క్యారెట్ల ఆభరణాల విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ బంగారం కొంటే రీసె ల్ 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారం అంటే ఇష్టపడతారు. – హరినారాయణ భట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు బంగారు ఆభరణాల తయారీ చొక్కంగా ఉంటుంది. నగల్లో ఎలాంటి కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డానాలు, నానులు తదితర వాటిని నాణ్యత, మన్నికతో కూడిన విధంగా తయారుచేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. మేము తయారుచేసే నగలు వంద శాతం నాణ్యతగా ఉంటాయి. – గాయత్రి, స్వర్ణకారురాలు, నారాయణపేట నారాయణపేట గోల్డ్ ప్యూరిటీతో 24 క్యారెట్ల బంగారంతో మోడ్రన్ డిజైన్లు తయారుచేసి విక్రయిస్తున్నాం. 130 ఏళ్ల చరిత్ర ఉన్న నారాయణపేట బంగారానికి జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాం. బంగారాన్ని సేవింగ్స్గా భావిస్తాం. కొన్న బంగారాన్ని అమ్మితే 98 శాతం రిటర్న్ డబ్బులు వస్తాయి. 150 జ్యువెల్లర్స్, 270 మంది స్వర్ణకారులతో మరో 1,700 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తయారుచేసే నగలు 24 క్యారెట్లతో తయారు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కానీ నారాయణపేటలో అది సాధ్యమని నిరూపిస్తున్నాం. అందుకే జీఐ గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది. – సాకేత్ భట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్, నారాయణపేట ● -
పీయూకు జవసత్వాలు
అంబులెన్స్ అందించిన ఎంపీ.. యూనివర్సిటీలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు అధికారులు ప్రత్యేక పీహెచ్సీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మాత్రమే చికిత్స ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్ర భుత్వ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎంపీ డీకే అరుణను సంప్రదించగా ఆమె స్పందించి యూనివర్సిటీకి సుమారు రూ.10 లక్షల విలువైన అంబులెన్స్ను అందించారు. ప్రస్తుతం అది విద్యార్థులకు సేవలు అందిస్తుంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేవలం ప్రభుత్వం నుంచే సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఉండేది. కానీ, పీయూలో ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరించి యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చరిత్రలోనే గతేడాది అత్యధికంగా విరాళాలు సాధించి రికార్డు సాధించారు. సుమారు రూ.10.20 కోట్ల నిధులు దాతల నుంచి రాబట్టడం విశేషం. అంతేకాకుండా భవిష్యత్లో మరిన్ని నిధులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి (సీఆర్ఎఫ్) కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద నిధులు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు యూనివర్సిటీ అవసరాలు, విద్యార్థులకు వసతుల కల్పన కోసం నిధులు సేకరించేందుకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఈ క్రమంలోనే నిధులు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో మరిన్ని నిధులు యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆడిటోరియం నిర్మాణంతో.. పీయూలో విద్యార్థులు పెద్దఎత్తున కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం ఇప్పటి వరకు లేవు. కేవలం రెండు సెమినార్ హాల్స్ మాత్రమే ఉండగా.. ఇందులో ఒకటి ఫార్మీసీ కళాశాల సెమినార్ హాల్, లైబ్రరీ ఆడిటోరియం. ఇక్కడ కూడా సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో పీయూలో ఆడిటోరియం నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత ఎంఎస్ఎన్ రెడ్డి ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు లేఖలను కూడా పీయూ వీసీకి అందించారు. దీంతో ఆడిటోరియం నిర్మాణం కోసం ఎంఈడీ కళాశాల ఆవరణలో భూమిని సైతం కేటాయించారు. త్వరలో భూమిపూజ చేసే అవకాశం ఉండగా.. సుమారు వెయ్యికిపైగా సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్నారు. అలాగే యూనివర్సిటీ అవసరాలతోపాటు బయటి వారికి సైతం అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. మరిన్ని నిధులు రాబడతాం.. ఏడాది కాలంలో యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని నిధులను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాం. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్ఎన్ రెడ్డి రూ.10 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పీయూ హాస్టల్స్లో చపాతి చేసేందుకు ఎస్బీఐ నుంచి రెండు రోటీ మేకర్ మిషన్ తీసుకువచ్చాం. విద్యార్థుల అవసరాల కోసం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అంబులెన్స్ కూడా అందజేశారు. అలాగే ఇతర అవసరాల కోసం పలు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు రానున్నాయి. వీటితో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి.. నాణ్యమైన విద్య అందించేలా కృషిచేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వినూత్న పంథాలో నిధుల సమీకరణ దాతల నుంచి గతేడాది సుమారు రూ.10.20 కోట్ల విరాళాలు హాస్టల్స్కు రెండు రోటీ మేకర్స్ ఇచ్చిన ఎస్బీఐ విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చిన ఎంపీ డీకే అరుణ విద్యార్థుల శిక్షణ, ఇతర వసతుల కల్పన కోసం పలు సంస్థలకు విజ్ఞప్తులు రోటీ మేకర్స్తో తీరిన ఇబ్బంది.. పీయూ బాలికల హాస్టల్స్లో ఇటీవల కొత్త హాస్టల్స్ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్బీఐ గణేష్నగర్ బ్రాంచ్ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్బీఐ అధికారులు పీయూ హాస్టల్స్కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. -
హక్కులను కాపాడుకోవాలి
కట్టుబాట్లతోనే వెనుకబాటు.. సమాజంలో ఉండే కట్టుబాట్లు ప్రతి మహిళలకు ప్రతి బంధకాలుగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తుంటే.. మన దగ్గర ఇంకా చాలా ప్రాంతాల్లో కట్టుబాట్లు, సంప్రదాయాలతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్లో మహిళల గొప్పతనం చాటారు. సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా లాంటి మహిళలు భారతీయ మహిళలను తలెత్తుకునే విధంగా చేశారు. – మేఘన, ఎంవీఎస్ కళాశాల, డిగ్రీ ఫస్టియర్ సమాజంలోని అందరి మద్దతుతోనే మహిళా సాధికారత సాధ్యం ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో డిబేట్ -
విద్యతోనే మహిళల అభ్యున్నతి
నారాయణపేట: విద్యతోనే మహిళల అభ్యున్నతి, సాధికారిత సాధ్యమని.. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సరైన అవకాశాలు కల్పిస్తే అతివలు సమర్థవంతంగా అనుకున్నది సాధిస్తారని.. సమాజంలో మహిళలకు పురుషులతో సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, ఉపాధి అవకాశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబంలో మగ, ఆడ పిల్లలను సమాన దృష్టితోనే చూడాలని సూచించారు. మహిళలు తమకు ఉన్న హక్కులు, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుర చైర్పర్సన్ కొండా శ్వేతా సత్యయాదవ్ మాట్లాడుతూ.. మహిళలు ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. మక్తల్ చైర్పర్సన్ వాకిటి మానస మాట్లాడుతూ.. సృష్టికి మూలం సీ్త్ర అన్నారు. ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన తనకు మంత్రి వాకిటి శ్రీహరి చైర్పర్సన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. చెల్లి, తల్లి, భార్య, కోడలిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనే నమ్మకం తనకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో భర్త, పిల్లలు అని కాకుండా ఉమ్మడి కుటుంబానికి మహిళలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి, డీఆర్డీఓ మొగులప్ప, ఆర్టీఓ మేఘాగాంధీని డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్ ఘనంగా సత్కరించారు. అలాగే జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు కృషిచేసిన ఐసీడీఎస్ నారాయణపేట, మక్తల్ ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీఓలు, ఏసీడీపీఓలు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది, కేర్టేకర్లు, పోలీసులను శాలువా, మెమెంటోతో సన్మానించారు. వీరితోపాటు నారాయణపేట, మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లను సన్మానించారు. సీడబ్ల్యూసీ అశోక్కుమార్, వైస్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు కందన్పల్లి సత్యమ్మ, జయశ్రీ, భాగ్యవతి, అరుణ, బండి రాజేశ్వరి, కల్పన రఘురామయ్య, శ్వేత వెంకటేష్ పాల్గొన్నారు. -
ఆమెకు రక్షణ అవసరం
మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎన్నో చట్టాలు వచ్చినా.. మహిళలపై వరకట్న వేధింపులు.. సీ్త్రలపై దాడులు, అత్యాచారాలు, గృహహింసతో పాటు పోక్సో కేసులు తగ్గడం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇంటా బయట మహిళలకు నానాటికీ రక్షణ కొరవడుతోంది. నగరంతో పాటు ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఉండే మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కాపురంలో కలతల వల్ల రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సెలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు. ● దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టం(బీఎన్ఎస్–2023) అమల్లోకి వచ్చింది. ఇది పాత ఐపీసీ స్థానంలో తీసుకొచ్చారు. ఇందులో మహిళలు, అమ్మాయిలపై జరిగే నేరాల కోసం ప్రత్యేకంగా చాప్టర్–5లో సెక్షన్ 63 నుంచి 99వరకు సెక్షన్లు ఉన్నాయి. ● ప్రధాన నేరాలకు ఉపయోగించే సెక్షన్లలో అత్యాచారం జరిగినప్పుడు సెక్షన్ 63, 64 నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద కనీసం పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన సందర్భంలో సెక్షన్ 65 ఏర్పాటు చేయగా గ్యాంగ్ రేప్లో సెక్షన్ 70 నమోదు చేస్తారు. ఈ సెక్షన్లలో నమోదు అయ్యే కేసుల్లో పదేళ్ల నుంచి జీవిత ఖైదు కొన్ని సందర్భాల్లో మరణ శిక్ష ఉంటుంది. ● పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సందర్భంలో సెక్షన్–69 ● మహిళలతో అసభ్య ప్రవర్తన 74 ● సెక్సువల్గా వేధించిన సందర్భంలో సెక్షన్–75 ● దుస్తులు తీసే విధంగా దాడి చేసిన సమయంలో సెక్షన్ 76 ● తెలియకుండా వీడియోలు తీసి గోప్యంగా చూసిన సందర్భంలో సెక్షన్ 77 ● సోషల్ మీడియా, ఫోన్లలో, ఫిజికల్గా ఫాలో చేసి వేధించిన సందర్భంలో సెక్షన్–78 ● వరకట్నం వేధింపుల సందర్భంలో సెక్షన్ 85 ● వరకట్నం కోసం మృతి చెందిన సమయంలో సెక్షన్ 79.● హెల్ప్డెస్క్, షీటీం, భరోసా కేంద్రాలతో అండ ● జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు -
42 శాతం రిజర్వేషన్ సాధనకు పోరాటం
వనపర్తి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం ఆగదని.. బీసీ సర్పంచ్లను ఇబ్బందులు, ఒత్తిడికి గురి చేసినా సహించమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో బీసీ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏ కుల రిజర్వేషన్లో లేని క్రిమిలేయర్ బీసీ రిజర్వేషన్లో ఉండటం వివక్షతో అణగదొక్కడమేనని, తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడానికి కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోయినా 60 శాతానికి పైగా గ్రామపంచాయతీలు, పురపాలికల్లో బీసీలే గెలుపొందారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ సాధించడానికి పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు ప్రతి బీసీ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంఘం జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు అరుణ్కు మార్, జిల్లా అధ్యక్షుడు అరవింద్స్వామి, ధారాసింగ్, రమేష్, జహంగీర్ పాషా, రఘునందన్చారి, సతీష్, ముకుందనాయుడు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పీహెచ్సీల పరిధిలో శుక్రవారం నుంచి హెల్త్మిషన్–100 వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. నిర్దేశిత రోజుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు కొనసాగనున్నాయి. ప్రధానంగా పిల్లలు, కంటి, కీళ్లు ఎముకలు, దంత వైద్య నిపుణులతో పాటు సాధారణ వైద్యులు శిబిరాల్లో సేవలందిస్తారు. జిల్లా ప్రజలు నాలుగు దశల్లో జరిగే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. – డా. జయచంద్రమోహన్, జిల్లా వైద్యాధికారి ● -
అందరికి వైద్యం.. ఆరోగ్యం
నర్వ: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చేరువ చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్మిషన్–100 పేరిట వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి జూన్ 27 వరకు అన్ని వయస్సుల వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పీహెచ్సీ వైద్యులు, ఆర్బీఎస్కే బృందాలు, ఇతర వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. గతంలో మహిళలకు స్వస్త్నారి పేరిట ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందరికీ నిర్వహిస్తారు. కార్యక్రమ ఉద్దేశం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి హెల్త్మిషన్ 100 అనే వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రజలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగా గుర్తించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), మొబైల్ మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. ఇందులో రక్తహీనత (అనీమియా), క్యాన్సర్, క్షయ, డెంగీ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. పిల్లలకు అవసరమైన టీకాలు (ఇమ్యునైజేషన్) చేయడం కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపర్చడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పట్టణాల్లో ఉన్న అర్బన్ పీహెచ్సీలను పాలిక్లీనిక్లుగా అభివృద్ధి చేయడం కూడా కార్యక్రమ లక్ష్యాల్లో ఒకటి. ప్రతి మహిళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొదించడం, 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. నాలుగు దశల్లో.. మొదటి దశలో గర్భిణులు, బాలురు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు, టీకాలు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వయోవృద్ధుల కోసం శిబిరాలు నిర్వహించనున్నారు. రెండో దశలో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగాల నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు, మందులు అందిస్తారు. మూడో దశలో సంక్రమణ వ్యాధులైన క్షయ, ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు పీహెచ్సీలలో హీట్ స్ట్రోక్ నిర్వహణ గదులు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల్లో నిపుణులైన వైద్యుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. వైద్య కళాశాలల్లోని ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్దేశిత రోజుల్లో పీహెచ్సీల ద్వారా సేవలందిస్తారు. ‘హెల్త్ మిషన్–100’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నాలుగు విడతల్లో వైద్య శిబిరాలు శుక్రవారం ప్రారంభం.. జూన్ 27 వరకు కొనసాగింపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు వైద్య పరీక్షలు నిర్వహించే దశల తేదీలు.. మొదటి దశ శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు మూడో దశ 16 ఏప్రిల్ నుంచి 15 మే వరకు నాలుగో దశ 16 మే నుంచి 9 జూన్ వరకు -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్..ఈసారి 358వ ర్యాంక్ ● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్ ● ఖిల్లాఘనపురం ఎంపీడీఓ విజయసింహారెడ్డికి 682వ ర్యాంక్ అడ్డాకుల/ఖిల్లాఘనపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్ లో పాలమూరు బిడ్డ మరోసారి సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్ప్రసాద్ సాగర్ మొదటి ప్రయత్నంలో 700 ర్యాంక్ సాధించగా.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగుపరుచుకొని 358 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న విజయసింహారెడ్డి (రంగారెడ్డి జిల్లా)ఆలిండియా 682వ ర్యాంక్ సాధించారు. -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతికి అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీఠాధిపతులు అలంపూర్కు వచ్చారు. క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీజోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతులకు పాదుకా పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో చంద్రమౌలీశ్వర ఆరాధన, శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
ప్రగతి ప్రణాళికతో ప్రజల్లోకి..
తెల్ల కుసుమ క్వింటా రూ.5,401 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తెల్ల కుసుమ క్వింటా సరాసరి ధర రూ. 5,401 పలికింది. అదేవిధంగా జొన్నలు రూ. 4,719, శనగలు రూ.5,160, పెసర రూ.7,627, వేరుశనగ గరిష్టంగా రూ.9,219, కనిష్టంగా రూ. 3,800, ఆలసందలు గరిష్టంగా రూ.6,260, కనిష్టంగా రూ.6,070, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,789, కనిష్టంగా రూ.6,440, తెల్లకంది గరిష్టంగా రూ. 7,800, కనిష్టంగా రూ.7,409 ధరలు లభించాయి. జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అందరూ చొరవ తీసుకోవాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటిరోజు నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. 99 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, కలెక్టర్లు, అధికారులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్, నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి, మహబూబ్నగర్ మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ఆయా జిల్లాల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రచార వాల్పోస్టర్లు, టీషర్ట్లను ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట: మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో ఓఎంఐఎఫ్ (ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న మహిళల్లో కొందరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డుసభ్యులుగా ఎన్నికయ్యారు. వారిని ఎస్పీ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ప్రధానమని, మహిళ చదువుకుంటే వారి కుటుంబం మాత్రమే కాకుండా తరతరాల భవిష్యత్ మెరుగుపడుతుందన్నారు. గ్రామాల్లోని కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లక్ష్మీపతిగౌడ్, అడిషనల్ పీపీ సురేష్, ఓఎంఐఎఫ్ స్టేట్ డైరెక్టర్ డా. బెరిల్ డిసౌజా, ప్రాజెక్టు మేనేజర్ ఎంజెలా దేవిస్, జిల్లా కో–ఆర్డినేటర్ హాజమ్మ, జోష్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, యాదయ్య, కమల, సఖికేంద్రం సభ్యులు క్రాంతి, కవిత, కౌన్సిలర్ మహేష్, మహిళలు పాల్గొన్నారు. -
మెళకువలతోనే సత్ఫలితాలు
నారాయణపేట‘పది’ పరీక్షల వేళ ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ● సాధన చేస్తే గణితం సులువే.. ● సైన్స్లో పట్టికలు, ప్రయోగాలే కీలకం ● సాంఘికశాస్త్రంలో అవగాహన, విశ్లేషణతో మంచి మార్కులు గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట రూరల్: విద్యాశాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో పదోతరగతి వార్షిక పరీక్ష విధానంలో రెండింటి స్థానంలో మొత్తం సిలబస్పై ఒకేరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. గణితం, సాంఘికశాస్త్రంలో 80 మార్కుల ప్రశ్నాపత్రంలో 20 మార్కులు పార్ట్–బికి కేటాయించారు. సామాన్యశాస్త్రానికి సంబంధించి భౌతిక, జీవశాస్త్రం పేపర్లు వేర్వేరుగా నిర్వహిస్తారు. గణితంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రేఖీయవర్గ స మీకరణాలు, శ్రేడులు, నిరూపక రేఖగణితం, సరూ ప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖ లు, క్షేత్రమితి, సంభవ్యత, త్రికోణమితి, సంఖ్యాక శాస్త్రం అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన, తర్వాత కఠినమైన ప్రశ్నలను ప్ర యత్నించాలి. ఏ ఒక్క ప్రశ్నను వదలొద్దు. సీసీఈ వి ధానంలో ప్రతి అంశానికి మార్కులు కేటాయిస్తారు. రేఖాచిత్రాలు పెన్సిల్తో గీయాలి. సూచికలు పెట్టా లి. సాధనలు డబ్బాలో రాయాలి. నిర్మాణాల కు అవసరమైన చిత్తుపటాలు తప్పకుండా గీయాలి. సోపాన క్రమాన్ని రాయాలి. పరీక్ష మొత్తం పూర్త య్యాక ఒకసారి జవాబు పత్రానికి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పాఠ్యాంశాలు క్షుణ్ణంగా చదువి పటాలను ప్రాక్టీస్ చేసి వాటి భాగాలు గుర్తించే వి ధంగా నేర్చుకోవాలి. రేఖాకిరణ చిత్రా లు గీ సేటప్పుడు స్కేల్ ఉపయోగించాలి. ప్రయోగ విధానంలోని అంశాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అభ్యాస దీపిక ప్రశ్నల్లోని అంశాలను చదువుకొని, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి చర్చించుకోవాలి. – యాద్గిర్ జనార్దన్రెడ్డి, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు, జెడ్పీ ఉన్నత పాఠశాల, ముడుమాల్ -
మెళకువలు అవసరం..
సాంఘికశాస్త్రం.. అవగాహన, విశ్లేషణ కీలకం సాంఘికశాస్త్రంలో విద్యార్థులు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. కీలక పదాలు రాసి ఉంచుకొని, గుర్తుంచుకొని ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు రాయాలి. తప్పులు లేకుండా అందంగా రాయగలిగితే మంచి మార్కులు సాధించవచ్చు. అన్ని అంశాలపై.. పుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకొని భావనల వారీగా ప్రాధాన్యం, అక్షరాలు, భేదాలు, పోలికలు, ఉదాహరణలు తెలుసుకోవాలి. హిమాలయాల ప్రాధాన్యం, తూర్పు పశ్చిమ కనుమల బేధాలు, వాతావరణంలో వచ్చే మార్పులు, జనాభా పెరుగుదలకు కారణాలు, వలసల వర్గీకరణ, ఉత్పత్తి కారకాలు, ప్రపంచీకరణ ప్రభావం, ఆహార భద్రత.. ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ యుద్ధాల కారణాలు, ఆర్థిక మాంధ్యం ప్రభావం విషయాలపై దృష్టి సారించాలి. వెనుకబడిన వారు చేయాల్సినవి.. కనీస సామర్థ్యాల్లో వెనుకబడిన వారు కొంత దృష్టి సారించి చదివితే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. పాఠాలు, గ్రాఫ్లు, పట్టికలు, పటాల వంటి అంశాల్లో సాధన చేయాలి. అభ్యాస దీపిక చదివితే మార్కులు పెరిగే అవకాశం ఉంది. గ్రాఫ్, పట్టికలు క్షుణ్ణంగా సాధన చేస్తే 10 మార్కులు, పేరాగ్రాఫ్లు బాగారాస్తే 12 మార్కులు, పటం సులువుగా గుర్తించగలిగితే ఐదు మార్కులు పొందేందుకు అవకాశం ఉంది. పేరాగ్రాఫ్ విశ్లేషణ చేస్తున్నప్పుడు పేరాలోని అంశాన్ని మరింత వివరించాలి. పట్టిక, గ్రాఫ్ విశ్లేషణ సమయంలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా లోతుగా వివరించాలి. ప్రముఖుల లక్షణాలు, ఆశయాలు, నినాదాలు గుర్తించుకోవాలి. భారతదేశం, తెలంగాణ అవుట్ లైన్ మ్యాప్ గీయగలగాలి. ప్రపంచ పటంలో దేశాలు, సముద్రాలు, తెలంగాణలో పర్వతాలు, నదులు, పట్టణాలు, ఎడారులు తదితర వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పర్యావరణం, నీటి సంరక్షణపై అవగాహన ఉండాలి. కరపత్రం తయారీలో శీర్షిక, విషయం, వివరణ, సలహాలు, సూచనలు, ముద్రించిన వారి వివరాలు, రద్దుల సంఖ్య, అవసరమైన పటాన్ని గీయాలి. విషయ అవగాహన ప్రశ్నలకు కీలక పదాలు వాడాలి. సమకాలిన సమస్యలకు కారణాలు, ఫలితాలు, పరిష్కారం చూపేలా సిద్ధమవ్వాలి. – నర్సింహ, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, జాజాపూర్ -
గుడ్డెందొడ్డి.. అప్గ్రేడ్
రిజర్వాయర్ సామర్థ్యం 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు ●అనుమతులు వచ్చాయి.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వే పన ులు మొదలుపెట్టాం. ఇందుకోసం రూ.16 లక్షలు విడుదలయ్యాయి. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి డీపీఆర్ను సమర్పిస్తాం. – రహీముద్దీన్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో మాత్రం ఆయకట్టుకు నీటి కష్టాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో సాగయ్యే ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. 120 రోజులపాటు వరద గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాటు లభిస్తుంది. వరద సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా ప్రణాళిక నెలాఖరు నాటికి డీపీఆర్ సిద్ధం చేసేలా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నసర్వే పనులు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై కార్యాచరణ
● అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి నారాయణపేట: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగనుందని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిదు దశల్లో 99 రోజుల ప్రణాళికను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి తప్పిదాలు లేకుండా శాఖల వారీగా రూపొందించాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు, ఏప్రిల్ 16న మండలస్థాయిలో, మే 2న నియోజకవర్గస్థాయిలో, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీలు, పురపాలికల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్చి 16 నుంచి 31 వరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, జూన్ 2 వరకు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు కార్యాలయాలు, పాఠశాలల్లో సోలార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమాలు ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సంక్షేమశాఖ ఏప్రిల్ 20 నుంచి 24 వరకు వారి కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యవసాయశాఖ మే నెల నాలుగు నుంచి 9 వరకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రీ, ఇతర పనులు చూడాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను పాల్గొన్నారు. -
జీవశాస్త్రంలో ప్రయోగాలపై దృష్టి..
పర్యావరణం, సాంకేతికత అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవశాస్త్రం ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలను నేర్చుకొని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్దిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలు, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. పాఠ్యాంశంలో అంతర్భాగంగా ఇచ్చిన సమాచారాన్ని నేర్చుకొని ఆవాహన చేసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. సెక్షన్–3లో తప్పకుండా ప్రయోగం వస్తుంది. ఎన్సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి భావనను రెండుసార్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసి భాగాలను తప్పకుండా రాయాలి. పార్ట్–బిలో జతపర్చడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, భిన్నమైన వాటిని ఎంపిక చేయడం, వరుస క్రమంలో అమర్చడం, ఫ్లో చార్టులు, బొమ్మల భాగాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. – సంతోష్కుమార్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, -
రూ.5– 6 వేల కోట్ల వ్యయం..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి 14,700 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.5– 6 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇది వరకే ఈ రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించారు. సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ● గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నింపిన నీటిని తిరిగి జూరాల ప్రాజెక్టు రిజర్వాయ ర్కు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండడం రాష్ట్రంలోనే తొలిసారి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ -
రమణీయం.. రంగనాథుడి రథోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణ ● భారీగా తరలివచ్చిన భక్తజనం ● పాల్గొన్న ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఎమ్మెల్యే తదితరులు వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు అశేష జనవాహిని నడుమ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో రథాన్ని ముస్తాబు చేశారు. వనపర్తి సంస్థానాధీశుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా కృష్ణదేవరావు, ఆయన కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకుడు విష్ణునారాయణశర్మ పర్యవేక్షణలో వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. సంస్థానాధీశుడు రాజా కృష్ణదేవరావు టెంకాయ కొట్టగా ఆయనతో పాటు వారి కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే భక్తులతో కలిసి రథాన్ని ప్రధాన ఆలయం నుంచి గోదాదేవి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. సాయంత్రం భక్తులు రథాన్ని తిరిగి ఆంజనేయస్వామి ఆలయం వరకు, అటు నుంచి రథశాలకు చేర్చారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరంగాపురం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన మంగలి నారాయణదాస్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఎన్.జయప్రకాష్ కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన మిఠాయిలు, బొమ్మలు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాంబు, ఎస్ఐ హిమబిందు సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. -
వైద్యశాఖలో దుమారం..!
సంచలనంగా మారిన జడ్చర్ల ఘటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జడ్చర్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి బాదేపల్లి మార్చురీలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్న అమానవీయ ఘటన సంచలనంగా మారింది. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. రాజకీయ పక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్.. ఇందుకు బాధ్యులు గా పేర్కొంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళతో పాటు ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీ షా, ఎంఎన్ఓ రవిప్రకాశ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎంఓ పోస్ట్ ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి గానీ, సూపరింటెండెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా ఇన్చార్జిగా పేర్కొంటూ హరినాథ్పై వేటు వేయడం వైద్యారోగ్య శాఖలో దుమారం రేపుతోంది. అంతా మౌఖికంగానే.. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పీడియాట్రిషన్)గా హరినాథ్ 2022 మార్చి 3న విధుల్లో చేరారు. ఆయన జాయినింగ్కు ముందు, ఆ తర్వాత కూడా ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్ట్ లేనే లేదు. ఇటీవల నెలన్నర, రెండు నెలల క్రితం కొత్తగా ఆర్ఎంఓ పోస్ట్ మంజూరు కాగా.. ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ నియమించలేదు. హరినాథ్ను ఆర్ఎంఓగా నియమిస్తూ ఎలాంటి అధికార ఉత్తర్వులు లేవని సమాచారం. సూపరింటెండెంట్ చంద్రకళకు ముందు ఉన్న అప్పటి అధికారి హరినాథ్ను ఇన్చార్జి ఆర్ఎంఓగా బాధ్యత లు చూడాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. ఇదే ఆనవాయితీగా రాగా.. ప్రస్తుత ఘటన నేపథ్యంలో హరినాథ్పై సస్పెన్షన్ వేటు వేయడంతో రాద్ధాంతం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సస్పెన్షన్కు గురైన సూపరింటెండెంట్ చంద్రకళను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయనను ఆర్ఎంఓగా నియమిస్తూ అధికార ఉత్తర్వులు లేవని.. నోటి మాటగానే చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతోనేనా..? బాదేపల్లి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన వైరల్గా మారడంతో ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయానా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం దారుణమని.. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యరంగంపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. ఈ ఘటన కలచివేసిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ఈ ఘటనకు నలుగురిని బాధ్యులుగా పేర్కొంటూ సస్పెండ్ చేస్తునట్లు ప్రకటించారు. విచారణ క్రమంలో డాక్టర్ హరినాథ్ తనకు సంబంధం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వినిపించుకోలేదని సమాచారం. విచారణ అనంతరం కమిషనర్ ఫోన్లో మాట్లాడడం, వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. ఈ ఘటనను ఇంతటితో ముగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడంపై విపక్షాల ఆగ్రహం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ ఇన్చార్జి ఆర్ఎంఓ హరినాథ్పై వేటుతో కలకలం ఎప్పుడు ఇన్చార్జిగా నియమించారో తనకే తెలియదంటూ ఆశ్చర్యం మౌఖికంగానే తప్ప ఎలాంటి అధికార ఉత్తర్వులు లేవని వెల్లడి డాక్టర్స్ యూనియన్కు ఫిర్యాదు.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ వాస్తవానికి నేను ఆర్ఎంఓను కాదు. నన్ను ఆర్ఎంఓగా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయాను. ఘటన చోటుచేసుకున్న సోమవారం రోజు నా డ్యూటీ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లా. డ్యూటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి నుంచి వచ్చేశాను. మార్చురీలో జరిగిన సంఘటన నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఆన్డ్యూటీలో కూడా లేను. జరిగిన ఘటన బాధాకరమే.. అయినా నా నిర్లక్ష్యం లేకున్నా నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. దీన్ని మా డాక్టర్స్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – డాక్టర్ ఎస్.హరినాథ్, సీఏఎస్ (పీడియాట్రిషన్) -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
నారాయణపేట: జిల్లాలో కాంగ్రెస్పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ సూచించినట్లు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో సోమవారం జరిగిన సంఘటన సృజన్ అభియాన్ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్గాంధీ దిశా నిర్దేశం చేసినట్లు స్థానిక విలేకర్లకు ఫోన్లో చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించనట్లు చెప్పారు. -
జిల్లాకు జనవరిలోనే చేరిన నకిలీ పత్తి విత్తనాలు?
● కర్ణాటక నుంచి గుట్టుగా దిగుమతి ● ఇటీవలే 100 క్వింటాళ్లు పట్టివేత ● రాత్రిళ్లు రైతులకు చేరవేత మరికల్: పత్తి సాగుకు మరో నాలుగు నెలల సమ యం ఉండగానే నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు చేరుకున్నాయి. ఏటా అక్రమార్కుల ముఠా అధికారుల కళ్లుగప్పి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకర గ్లైకాసిన్ (గడ్డి నివారణకు పిచికారీ చేసే) మందులను ఇక్కడి వ్యాపారులకు చేర వేస్తున్నారు. కర్ణాటక సరిహద్దు జిల్లా కావడంతో రాత్రిళ్లు రహస్యంగా తీసుకొచ్చి నమ్మదగిన రైతుల పొలాల గడ్డివాములు, పశువుల కొట్టలు, భూమి ల్లో వీటిని భద్రపరుస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో సుమారు రూ.కోటి విలువజేసే వంద క్వింటాళ్ల నకిలీ విత్తనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వర్షాధారమైన పత్తి పంటను జిల్లా రైతులు ఏటా 6 లక్షల ఎకరాలకుపైగా సాగు చేస్తారు. ఇందులో కొందరు ఫర్టిలైజర్ దుకాణాల్లో ప్యాకెట్లు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు కిలోల చొప్పున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో సగానికి పైగా రైతులు నకిలీ విత్తనాలు నాటుతున్నట్లు సమాచారం. ఈ విత్తనాలు నాటిన రైతులు రాష్ట్రంలో నిషేధించిన గ్లైకాసిన్ గడ్డిమందును పిచికారీ చేస్తారు. ఈ మందు పిచికారీతో భవిష్యత్లో భూ మి నిర్జీవమయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నెట్టెంపాడుకు మహర్దశ
● 150 కి.మీ. మేర సీసీ నిర్మాణానికి చర్యలు ● పనులు పూర్తయితే సాగునీటి లీకేజీలకు అడ్డుకట్ట ● ప్రభుత్వ అనుమతులే తరువాయి గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి మహర్దశ పట్టనుంది. తరచుగా లీకేజీలతో కోతలకు గురవుతున్న ప్రాజెక్టు మట్టి కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 1.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే సాగునీటి కాల్వలకు ఇప్పటి వరకు సీసీ లైనింగ్ చేయలేదు. దీంతో కాల్వల్లో షిల్టు, పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగాయి. దీంతో కాల్వలకు లీకేజీలు ఏర్పడి సాగునీరు వృథా అవుతోంది. తద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 150 కి.మీ. మేర ఉన్న కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ. 373కోట్లతో అంచనాలు రూపొందించారు. నీటి పారుదలకు అడ్డంకులు.. వానాకాలంలో కృష్ణానదికి వరదలు వచ్చే 120 రోజుల పాటు జూరాల ప్రాజెక్టు వెనకజలాల నుంచి నెట్టెంపాడుకు నీటిని ఎత్తిపోస్తారు. ఎత్తిపోసే నీటిని ఏడు రిజర్వాయర్లలో నింపి.. వాటి పరిధిలోని ఆయకట్టుకు కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్ల ద్వారా నీటిని పారిస్తారు. ఇలా ఆయకట్టుకు సాగునీరు పారించే కాల్వలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్టు, ముళ్లపొదలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో చాలా వరకు సాగునీరు వృథాగా పోతుంది. ప్రస్తుతం నెట్టెంపాడు కింద సుమారు 1.49 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తుండగా.. ఇందులో 2 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతోంది. తీరనున్న సమస్య.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన మట్టి కాల్వ లు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్లలో సీసీ లైనింగ్ నిర్మాణంతో నీటి పారుదల సాఫీగా సాగనుంది. తద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమ స్య తీరనుంది. 150 కి.మీ. మేర కాల్వకు సీసీ లైనింగ్ నిర్మాణానికి రూ. 373 కోట్ల అంచనా వ్య యంతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు. ప్రారంభ సమయంలో మార్చురీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాదేపల్లి ఆస్పత్రి పరిధిలోని మార్చురీలోనే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను సైతం అక్కడే భద్రపరుస్తున్నారు. కిలోమీటరున్న దూరంలో ఉండగా.. పర్యవేక్షణ కొరవడడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ముందుగా బాదేపల్లిలో మార్చురీ, ఆ తర్వాత కల్వకుర్తి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి, మార్చురీని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీలో ఉన్న మూడు ఫ్రీజర్లను పరిశీలించారు. మార్చురీ నిర్మాణం పూర్తయి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. పాత ఆస్పత్రినే పోస్టుమార్టం నిర్వహించడంపై అధికారులు, డాక్టర్లకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల పనితీరు సరిగ్గా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే దానికి అద్దం పడుతోంది. -
‘ఎఫ్ఎల్ఎస్’ మాదిరి పరీక్ష
నర్వ: ప్రభుత్వ, స్థానిక సంస్థల యూఆర్ఎస్ పాఠశాలల్లోని మూ డోతరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యాసన సామర్థ్యాల పరిశీలనకు 12, 13వ తేదీల్లో ఫరఖ్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు విద్యార్థులను సన్న ద్ధం చేసేందుకు మొద ట మూడు మాదిరి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే గత డిసెంబర్లో మొదటి, జనవరి చివరి వారంలో రెండో మాదిరి పరీక్ష రాతపూర్వకంగా నిర్వహించారు. మూడో మాదిరి పరీ క్ష మార్చి 2, 4 తేదీల్లో యాప్లో నిర్వహిస్తున్నా రు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యా శాఖ అధికారులు జూమ్ సమావేశం ద్వారా మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్ర ధాన పరీక్షకు ముందుగా నిర్వ హించే మూడు మాది రి పరీక్షలు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల ను బలోపేతం చేసేందుకు ఎంతో దోహదపడతా యని భావిస్తున్నారు. భాషా సామర్థ్యాల అభివృద్ధిలో భాగంగా బోధనలో మౌఖి క భాష, పఠన అవగాహన, చిత్రాల ఆధారంగా వాక్య నిర్మాణం తదితర 9 ముఖ్య అంశాలు, గణిత సామర్థ్యాల అభివృద్ధిలో 9 అంశాలపై విద్యార్థులతో సాధన చేయిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, మేనేజ్మెంట్, ప్రైమరీ పాఠశాలలు 298, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, ఎయిడెడ్ పాఠశాలలు 3, ప్రైవేట్ పాఠశాలలు 78, మొత్తం 464 పాఠశాలల్లో ప్రతి ఏటా జాతీయ సామర్థ్యాల సాధన (న్యాస్) పరీక్షను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈసారి మాత్రం కేవలం మూడో తరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు 464 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో 3,549 మంది విద్యార్థులున్నారు. -
కార్మికులకు వేతనాలు చెల్లించాలని ధర్నా
మక్తల్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు నాలుగు నెలలుగా పీఎఫ్ జమ చేయడం లేదని తెలిపారు. కార్మికులకు వచ్చే చాలీచాలని జీతాలను కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణయ్య, బాలు, రామలింగయ్య, జాకీర్, మూర్తి, బాలకృష్ణ, నరేందర్, ఆకాశ్, బాలమ్మ, అంజి తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ విధానంరద్దు చేయాలి నారాయణపేట ఎడ్యుకేషన్: కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే కాంట్రాక్ట్ ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి.. ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రజారోగ్య రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ తదితర సిబ్బందికి కనీస వేతనాలు అందక.. ఉద్యోగ భద్రత లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. జీఓ 60 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వేతనాల చెల్లింపులో పారదర్శకత లోపించిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ విధానానికి స్వస్తి పలికి.. కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలని కోరారు. అదే విధంగా కార్మికులకు 7 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సంతోష్, లక్ష్మయ్య, దయానంద్, కరుణాకర్, శ్రీను, ప్రకాశ్ పాల్గొన్నారు. జొన్నలు క్వింటా రూ.4,401 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం జొన్నలు క్వింటాకు గరిష్టంగా రూ. 4,401, కనిష్టంగా రూ. 4,221 ధర పలికింది. శనగలకు రూ. 5,259 ధర లభించింది. పెసరకు గరిష్టంగా రూ. 8,025, కనిష్టంగా రూ. 7,925, వేరుశనగ గరిష్టంగా రూ. 9,479, కనిష్టంగా రూ. 4,329, అలసందలు గరిష్టంగా రూ. 6,250, కనిష్టంగా రూ. 6,059 ధరలు పలికాయి. ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,069, కనిష్టంగా రూ. 6,250, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,989, కనిష్టంగా రూ. 6,700 ధరలు లభించాయి. దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరవలేనివి నారాయణపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సౌమ్య మనస్తత్వం గల దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. స్పీకర్గా పనిచేసిన సమయంలో ఆయన నిజాయతీ, నిరాడంబరత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ విజయభాస్కర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్లాల్, ఎస్ఐలు పురుషోత్తం, ఆర్ఎస్ఐ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింధర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 21 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అదనపు కలెక్టర్ నేరుగా తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ● జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఫణిందర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విశిష్ట పాత్ర పోషించారన్నారు. పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గౌరవకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఆర్డీఓ మొగులప్ప, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, డీపీఆర్ఓ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
రక్షణ కంచె ఏర్పాటు చేయాలి..
గుంటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. – వెంకటేశ్, నందిమళ్ల అవగాహన కల్పిస్తున్నాం.. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూరు నీటి ప్రవాహాన్ని తెలియజేయాలి.. జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల ● -
ఈ కాల్వ.. యమడేంజర్!
అమరచింత: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలో దిగి గల్లంతు కావడం.. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. జూరాల ఎడమ కాల్వ ఏర్పాటుచేసి నేటికీ 24 ఏళ్లు గడుస్తున్నా కాల్వ సమీపంలోని గ్రామాల ప్రజలకు చాలా వరకు నీటి ప్రవాహ ఉధృతి తెలియకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే చిన్నారులు, యువత ఈత సరదాతో కాల్వలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. జూరాల ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామంలో ఈ ఘటనలు అధికంగా చోటు చేసుకోన్నాయి. అయితే ప్రాజెక్టు అధికారుల రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. రామన్పాడు వరకు ప్రమాదమే.. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటిని అందించే రామన్పాడ్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వ ప్రవహిస్తోంది. రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న సమీప గ్రామాల వద్ద దాదాపు 10 చోట్ల కాల్వలో దిగుడు మెట్లు ఏర్పాటుచేశారు. దీంతో నందిమళ్ల, మూలమళ్ల, జూరాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగుతూ.. తమతమ అవసరాలను తీర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోవడం.. రామన్పాడ్ రిజర్వాయర్లో మృతదేహాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారాబందితో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలో వెళ్తున్న ప్రధాన ఎడమ కాల్వ లోతుగా, భయంకరంగా ఉండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఒక్క గ్రామంలోనే17 మంది మృత్యువాత.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల గ్రామంలోనే 11 ఏళ్ల కాలంలో 17 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన బండి పెద్ద హన్మంతు, కోళ్ల రంగన్న, మాల రాజు, చింతలమ్మ, బోయ చెన్నమ్మ, బోయ బొజ్జన్న, తెలుగు కాశీమన్న, చిన్నరాయుడు, రాజ్మీ బేగం, మహిమూద్, కుర్వ మణెమ్మ, అలుక్కోడి సరిత తదితరులు గల్లంతై మృతిచెందారు. గత నెలలో ఈత పడేందుకు వెళ్లి చిన్నారి ఆరిఫ్ గల్లంతయ్యాడు. అదే విధంగా మూడేళ్ల క్రితం పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు, ఆత్మకూర్ సమీపంలోని గుంటిపల్లి వద్ద 8మంది గల్లంతు కాగా.. గతేడాది మరో ఇద్దరు కాల్వలో గల్లంతై మృతిచెందారు. ప్రాణాలను హరిస్తున్న జూరాల ఎడమ కాల్వ వారాబందితో కానరాని నీటి ప్రవాహం స్నానానికి, బట్టలు ఉతికేందుకు వెళ్లి గల్లంతు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు -
ఇస్తారో.. ఇవ్వరో..
ఇదేమీ ప్రభుత్వ అయ్యా.. పంటలు కోతకొచ్చే సమయం దగ్గర పడుతున్నా రైతు భరోసా ఇవ్వడం లేదు. యాసంగికి ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామన్న ప్రభుత్వం నేటికీ వేయలేదు. అప్పులు చేసి పంట పెట్టుబడులు పెడుతున్నాం. ఇంతవరకే రెండుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఎగ్గొడితే మూడోసారి అవుతుంది. – వెంకటయ్య, రైతు, మరికల్ ఊసెత్తడం లేదు.. యాసంగి ముగుస్తున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. నాలుగెకరాల పొలంలో వరిపంట సాగుకు పెట్టుబడి రూ.లక్ష దాటింది. రైతులకు అనుకూలమైన సమయంలో రైతు భరోసా ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోయ్యే పరిస్థితి ఉంది. పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలి. నాగేష్, రైతు, పసుపుల, మక్తల్ మండలం ప్రభుత్వ నిర్ణయం మేరకే.. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది రైతుభరోసా పథకానికి అర్హులుగా ఉన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ అవుతుంది.. రైతులు ఆందోళన చెందొద్దు. – జాన్ సుధాకర్, డీఏఓ ● -
నర్వ.. ప్రగతి బావుటా
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్కు ఎంపికతో మహర్దశ సౌరశక్తి ఆధారిత వంటశాల.. సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో చేపట్టిన పనులపై గతేడాది డిసెంబర్ 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందుకు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతి కోసం నర్వ కేజీబీవీలో సౌరశక్తి ఆధారిత వంటశాల (సోలార్ ఫర్ హెల్తీ రినివబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఈటింగ్) స్థాపన కోసం రూ.62.15 లక్షలు మంజూరు చేసింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొదటి విడతగా రూ.15,53,750 మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు పీఎంశ్రీ పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటు కోసం రూ.58,13,070 మంజూరు చేశారు. దీంతోపాటు 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ.8 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూర్చునేందుకు ప్రీ స్కూల్ బల్లలు, కుర్చీలు, గోడలపై పేయింటింగ్స్, మ్యాపులు, మంకీ బార్స్, బెడ్షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. 2024–25లో యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. -
కల్యాణం.. కమనీయం
కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల -
‘మాస్టర్ ప్లాన్’ మారేనా..?
●పట్టణం విస్తరిస్తున్నా.. పట్టణం విస్తరిస్తున్నా మాస్టర్ ప్లాన్ పాతదే కొనసాగుతోంది. 20 ఏళ్ల కిందట ఇండస్ట్రియల్ జోన్గా ఉన్న ప్రాంతం నేడు రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు నిర్మించే పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపాలిలీకి సైతం ఆదాయం తగ్గుతుంది. మాస్టర్ ప్లాన్ మార్చితే నారాయణపేట రూపురేఖలు మారుతాయి. – పీవీ సాగర్, పుర లైసెన్స్డ్ ఇంజినీర్, నారాయణపేట రివైజ్డ్ చేయొచ్చు.. పేట పురపాలిక మాస్టర్ ప్లాన్ను రివైజ్డ్ చేసుకోవచ్చు. గతంలో శాటిలైట్ ద్వారా సర్వే చేశారు. పుర పాలకవర్గం తీర్మానం చేసి పంపితే పూర్తిస్థాయిలో నిబంధనలతో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకొని ప్రజల ముందుకు తీసుకురావచ్చు. – గజానంద్, ఆర్డీ, టౌన్ప్లానింగ్, హైదరాబాద్ నారాయణపేట: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న పట్టణ రూపురేఖలు మార్చాలనే తపన కనిపించడం లేదా. సీఎం ఇలాఖాగా చెప్పుకొంటున్న జి ల్లాలోని నాలుగు పురపాలికల్లో మాస్టర్ ప్లాన్లు అధికారులు, పాలకులకు గుర్తుకురావడం లేదా అనే సందేహాలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 23 ఏళ్లు గడిచినా.. నారాయణపేట 1945లో నగరపంచాయితీగా ఏర్పాటైంది. జీఓఎంఎస్ నంబర్ 487 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 06.11.2002లో మాస్టర్ప్లాన్ను అమలులోకి తీసుకొచ్చారు. 23 ఏళ్లుగా అదే మాస్టర్ప్లాన్ అమలవుతోంది. పట్టణంలోని బాహర్పేట, సరాఫ్బజార్, బ్రహ్మణ్వాడి, కుమ్మరివాడి, కలాల్వాడి, పళ్ల, హజీఖాన్పేట తదితర వీధులు ఇరుకుగా ఉండి ఇబ్బందులు తప్పడం లేదు. గృహ నిర్మాణాలు 1745.79 ఎకరాలు, కమర్షియల్ కోసం 51.35 ఎకరాలు, ఇండస్ట్రీయల్కు 210.89 ఎకరాలు, పబ్లిక్ అండ్ సెమీపబ్లిక్ యూజ్కు 250.46 ఎకరాలు, పార్క్లు, ప్లేగ్రౌండ్స్కు 88.35 ఎకరాలు, పబ్లిక్ యూటిలిటీ (నీరు, విద్యుత్ సరఫరా), గ్రేవ్స్కు 19.38 ఎకరాలు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్కు 8.16 ఎకరాలు, రోడ్లు 410.63 ఎకరాలు, వాటర్ కోర్సేస్ 61.46, హిల్లాక్స్ 37.92 ఎకరాలు మొత్తం ప్లానింగ్ ఏరియా 2,889.15 ఎకరాలు, అర్బన్ యూజబుల్ ల్యాండ్ 1677.29 ఎకరాలు మొత్తం 4566.44 ఎకరాలు (18.48 చదరపు కిలోమీటర్లు) మాస్టర్ ప్లాన్లో చూపించారు. ప్రస్తుతం కొలువుదీరిన పాలకవర్గం కొత్త మాస్టర్ప్లాన్పై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ● 2019, ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ జన్మదిన కానుకగా నారాయణపేట జిల్లా ఏర్పాటైంది. ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ కన్సలెన్సీ మార్చి 1, 2019న పుర మాస్టర్ప్లాన్లో కాస్త మార్పుచేర్పులు చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డితో పాటు కలెక్టర్గా పదోన్నతిపై వచ్చిన ఎస్.వెంకట్రావు మొదటి సమావేశంలో పాల్గొని గ్రేడ్–3లో ఉన్నప్పుడు శాటిలైట్ ద్వారా సేకరించిన మాస్లర్ప్లాన్ వద్దని.. జిల్లాకేంద్రంతో పాటు గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారిందని, భవిష్యత్ తరాలకు విద్య, ఆరోగ్యం, ఇండస్ట్రీయల్, రింగ్ రోడ్ తదితర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని వారితో పాటు నాటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, వ్యాపారులు, ప్రజల ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన డా. చిట్టెం పర్ణికారెడ్డి సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాకేంద్రంలో 2011లో 41,752 జనాభా ఉండగా.. ప్రస్తుతం సుమారు 55 వేలకు చేరింది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణం విస్తరించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా.. నారాయణపేటలో పాత మాస్టర్ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీ పబ్లిక్ ప్రాంతాల్లో సైతం భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రియల్ జోన్లో 50 శాతం గృహ నిర్మాణాలు కొనసాగడం.. అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి పదేళ్లకోసారి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో 2002 నుంచి ఉన్న మాస్టర్ప్లాన్నే కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడదామనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోస్గి, మక్తల్, మద్దూరులో.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కోస్గి, మక్తల్లో పలు గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2023, డిసెంబర్లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మద్దూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అటు సీఎం ఇలాఖాలోని మద్దూర్, కోస్గి.. ఇటు మంత్రి ఇలాఖాలోని మక్తల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పేట పురపాలికలో 2002లో రూపకల్పన 23 ఏళ్లుగా అదే కొనసాగింపు డీడీఎఫ్ కన్సల్టెన్సీ సవరణలు చేసి మార్చి 1తో ఏడేళ్లు మక్తల్, కోస్గి, మద్దూర్లోసైతం అదే తీరు ఆదాయానికి భారీగా గండి.. మాస్టర్ ప్లాన్ మారకపోవడంతో పేట మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోందని చెప్పవచ్చు. సెంటర్చౌక్ బజార్, సరాఫ్ బజార్, కొత్తబస్టాండ్, సత్యనారాయణ చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా వాణిజ్య సముదాయ భవనాలు నిర్మించబడ్డాయి. యాద్గిర్ రోడ్లో సత్యనారాయణచౌరస్తా నుంచి ఎర్రగుట్ట సమీపం వరకు ఎడమవైపు భాగంలో 210 ఎకరాల వరకు కేటాయిస్తూ అప్పట్లో ఇండస్ట్రియల్ జోన్గా మాస్టర్ప్లాన్లో చూయించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల్లో సైతం ఇండస్ట్రియల్ ఏరియా పెరుగుతుండటంతో అక్కడ సైతం ఆదాయానికి భారీగా గండిపడుతుందని నిపుణులు చెబుతున్నారు. -
సమకూరనున్న నిధులు
యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై ఢిల్లీలోని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టర్తో వీసీ నిర్వహించి నర్వ గురించి చర్చించి 12 ప్రతిపాదనలతోపాటు మరో 2 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో శ్రీపునరుత్పాదక పర్యావరణ అనుకూల ఆహారం (నర్వ కేజీబీవీలో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. అలాగే స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ నాలెడ్జ్ (ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల స్థాపన)కు ఆమోదం తెలిపారు. ● మండలంలో 6 అంగన్వాడీ భవనాలు, డైనింగ్హాల్ కోసం రూ.1.5 కోట్లు, మండలంలోని 3 కేంద్రాలలో ఫేర్ ప్రైస్ షాప్స్ (సూపర్ మార్కెట్ మోడల్) ఏర్పాటు కోసం రూ.3.73 లక్షలు, ఫ్రంట్లైన్ వర్కర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అప్రిసియేషన్ అవార్డు కోసం రూ.2 లక్షలు, మండలంలోని 22 పాఠశాలల్లో ఏఐ డిజిటల్ ల్యాబ్తోపాటు సోలార్ కిచెన్ కోసం రూ.1.2 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.15 లక్షల నిధులు మంజూరు కానున్నాయి. -
అన్నదాతకు అవస్థలు
మరికల్: వానాకాలం సీజన్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర దిగుబడి ఇవ్వకపోవగా.. యాసంగిలోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి ముగుస్తున్నా చలి తీవ్రతత తగ్గకపోవడంతో ఎదుగుదల కనిపించడం లేదు. అలాగే రకరకాల తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెట్టామని.. ఓ పక్క పంట పెరుగుదల లేక ఆందోళన చెందుతుండగా, మరోపక్క తెగుళ్లు సోకి అదనపు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పంటకు పురుగు మందుల కొనుగోలుకు రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తోందని.. దీనికితోడు పిచికారీ చేయడానికి ట్రాక్టర్ అద్దె రూ.1,500 అవుతుందని చెప్పుకొచ్చారు. ● మండలంలో యాసంగి సీజన్లో కోయిల్సాగర్ ఆయకట్టు కింద 6 వేల ఎకరాలు, వ్యవసాయ బోరుబావుల కింద 2 వేల ఎకరాల వరి సాగు చేశారు. వాతావరణ మార్పులతో అక్కడక్కడ కొన్ని పంటల పెరుగుదల బాగున్నా తెగుళ్లు వీడటం లేదు. మరికొన్ని పంటలైతే చల్లి తీవ్రత కారణంగా ఎదుగుదల లోపించింది. పంట పెరిగేదెప్పుడు, కోతకు వచ్చేదెన్నడోనన్న సందేహంలో రైతులు ఉన్నారు. ఇప్పటికే ఐదుసార్లు ఫర్టిలైజర్, మందులు పిచికారీ చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మరో 45 రోజుల్లో వరి పంటలు కోతకు రావాల్సి ఉందని.. ఇలాంటి పరిస్థితులు ఎన్నడు చూడలేదని చెబుతున్నారు. వీడని చలి తీవ్రత.. పెరగని వరి పైరులు తెగుళ్ల బారిన పడిన వైనం పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం రూ.1.50 లక్షల పెట్టుబడి.. నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 3 ఎకరాల పంట బాగుంది. మిగతా 3 ఎకరాలు చలి తీవ్రత కారణంగా అక్కడక్కడ పెరగడం లేదు. పంట ఎదుగుదలకు ఐదుసార్లు ఫర్టిలైజర్, పురుగు మందులు పిచికారీ చేసినా లాభం లేదు. ఇప్పటికే రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడిక కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. – ఎల్లగౌడ్, రైతు, ఎలిగండ్ల చలి కారణంగానే.. యాసంగిలో చలి ఎక్కువగా ఉండటంతో నారుమడులు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని రకాల భూముల్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర పెరగనట్లు కనిపిస్తోంది. వ్యవసాయ అధికారుల సూచనలతో మందులు పిచికారీ చేస్తే కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంది. – రహమాన్, ఏఓ, మరికల్ -
ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచాలి
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: పట్టణంలో నిర్మించే 150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని.. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పట్టణంలోని ట్యాంక్బండ్ను రూ.3.70 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ శ్రీరాములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్గౌడ్, నాగరాజు, గోవర్ధన్, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి.. నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని మాధ్వార్ గట్టుతిమ్మప్ప ఆలయ ఆవరణలో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్యాణ మండప నిర్మాణానికి గ్రామస్తులందరు కలిసి రూ.35 లక్షల విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. గ్రామం నుంచి ఆలయం వరకు రూ.70 లక్షలతో సీసీ రహదారి నిర్మిస్తామని.. వచ్చే జాతర వరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రహదారి విస్తరణ చేపట్టేందుకు గ్రామస్తులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. కల్యాణ మండప నిర్మాణానికిగాను తనవంతు సహకారం అందించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఆలయ నిర్వాహకులు రాజేశ్వర్రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంతోష్రెడ్డి, శ్రీనివాసులు, సత్యనారాయణ, శంకర్, రామకృష్ణ, బ్యాంకు నర్సింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనానికి అడుగులు..
వన మహోత్సవాన్ని విజయవంతం చేసేలా ప్రణాళిక ● నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు ● 272 గ్రామపంచాయతీల్లో ప్రారంభమైన పనులు నర్వ: రగామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీబీజీ రాంజీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో కవర్లలో మట్టి నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో నిర్వహించే వన మహోత్సవంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది చిన్న గ్రామపంచాయతీల్లో 3 నుంచి 5 వేలు, పెద్ద గ్రామపంచాయతీల్లో 10 వేల మొక్కలు నాటారు. కానీ కొన్ని నర్సరీల్లో నామమాత్రపు పనులు చేపట్టి వదిలేయడంతో నిర్వహణ కొరవడి మొక్కలు ఎండిపోయాయి. ఈ ఏడాది నిబంధనలు మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కనీసం 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని నిర్ణయించారు. సమన్వయం కొరవడి.. నర్సరీల నిర్వహణ, కూలీలకు వేతనాల చెల్లింపునకు ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడి లక్ష్యం ఆదిలోనే దెబ్బతింటోంది. ఓ వైపు వీబీజీ రాంజీ అధికారులు మొక్కలు నాటుతుండగా.. మరోవైపు ట్రాన్స్కో అధికారులు పెరిగిన మొక్కలను యథేచ్ఛగా తొలగిస్తున్నారు. విద్యుత్ తీగల కింద ముందుచూపు లేకుండా నాటడం కూడా తప్పిదమే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అడవుల శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా పల్లె వనాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఊరికో నర్సరీ సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు నిర్ణయించి ప్రత్యేక ప్రణాళిక రూపొదించారు. పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిహామీ పథకం సంయుక్తంగా నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు పెంచి నిర్ణీత ప్రాంతాల్లో నాటేందుకు వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది లక్ష్యాన్ని ఖరారు చేసుకొని షేడ్నెట్లను ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు. -
కవుల పోషణ
స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్కు మార్చారు. మైసూరు ప్యాలెస్ నమూనాతో రాజమహల్, మంత్రమహల్, రాణిమహల్ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది. సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధా న్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి. సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు. దక్షిణ భారతంలో రెండో విమానం కొనుగోలు చేసింది వీరే.. సుపరిపాలన అందించిన రాజా వెంకట లక్ష్మారావు హైదరాబాద్లో రాజవంశ వారసులు.. సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్ మదనగోపాలస్వామి, కొల్లాపూర్లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్లోని సురభి గార్డెన్లో నివాసం ఉంటున్నారు. కళలకు పుట్టినిల్లు.. -
దరఖాస్తుల పరిశీలన వేగవంతం
నారాయణపేట: మీ–సేవా ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ను వినియోగించి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. మీ–సేవా కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ను రూపొందించిందని, సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులు డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో పరిశీలనకు వెళ్లి అక్కడ తుది ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆదాయ, నివాస, కుల ధ్రువపత్రాల దరఖాస్తులు త్వరగా పరిష్కరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడంతో ప్రజలకు సమయ పాలనతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. శిక్షణలో యాప్ డౌన్లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫొటో అప్లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ కొంగళి విజయ్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారుల సందేహాలను నివృత్తి చేసి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మీ–సేవా సూపరింటెండెంట్ దయాకర్రెడ్డి పాల్గొన్నారు. -
చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025కిగాను సంత్ కబీర్ అవార్డులు, జాతీయ చేనేత అవార్డులకుగాను అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు డి.బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంత్ కబీర్ అవార్డుకు గతంలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన చేనేత కళాకారులు (వీవింగ్ కేటగిరి) అర్హులని.. 31.12.2025 నాటికి 50 ఏళ్ల వయస్సు, చేనేత రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అలాగే జాతీయ చేనేత అవార్డుకు 31.12.2025 నాటికి 30 ఏళ్లలోపు వయస్సు, చేనేత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని సూచించారు. ఇతర రంగాల్లోని కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు కలిగి చేనేత రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల చేనేత కార్మికులు వీవింగ్, డిజైనింగ్ కేటగిరీ కింద www.handlooms.nic.in వెబ్సైట్లో 23.03.2026 లోగా దరఖాస్తు చేసుకొని, అట్టి దరఖాస్తును చేనేత సేవాకేంద్రం, హైదరాబాద్లో (Weavers Service Centre, Chenetha Bhavan, 2nd foor, Nampay, Hyderabad) సమాచారం ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు సహాయ సంచాలకులు, చేనేత, జౌళిశాఖ, మహబూబ్నగర్ నారాయణపేట కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. ప్రశాంతంగాఇంటర్ పరీక్షలు నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా 3,808 మంది విద్యార్థులకుగాను 3,750 మంది హాజరుకాగా.. 58 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,264 మందికిగాను 3,220 మంది హాజరుకాగా.. 44 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 544 మందికిగాను 530 మంది హాజరుకాగా.. 14 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధ్యాయులకురాష్ట్రస్థాయి పురస్కారాలు నారాయణపేట రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లా ఉపాధ్యాయులు శనివారం రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. జిల్లా నుంచి హరిసూదన్రెడ్డి (పల్లెర్ల), నరేష్ (కంసాన్పల్లి), రమ్య (కర్నె), భువనేశ్వరి (కొల్లంపల్లి), సురేందర్ (శివాజీనగర్), భారతి (గుండుమాల్) ఎంపికకాగా.. వీరికి హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్ అభినందించారు. నేడు విద్యుత్ సరఫరానిలిపివేత నారాయణపేట రూరల్: మండలంలోని చిన్నజట్రంలో ఉన్న 33 కేవీ ఉప విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏఈ సాయినాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలోని అంతారం, అయ్యవారిపల్లి, లక్ష్మీపూర్, బోయిన్పల్లి, స్వాములవారితండాలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని.. రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. చింతపండు క్వింటా రూ.9 వేలు నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.9 వేలు, కనిష్టంగా రూ.5,039 ధర పలికింది. శనగలు రూ.5,259, చింతపండు బోటు రూ.2,552–రూ1,919, పెసర రూ.8,061–రూ.6,506, ఆలసందలు రూ.6, 175–రూ.4,025, తెల్ల కంది రూ.7,609, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,829, కనిష్టంగా రూ.5,189 ధరలు లభించాయి. -
నా హత్యకు ప్రయత్నాలు.. మంత్రి వాకిటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నారాయణపేట : తెలంగాణలో మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు తన మీద వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వాకిటి శ్రీహరి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘దేవుడు మనకు మరణం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే చనిపోతాం. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. చావుకు నేను భయపడను. అవమానాలు పడినందుకే రాజకీయాల్లో వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పని చేసుకుంటూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడుపడుతున్నాను. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు నా మీద వేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్ మున్సిపల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.72 సంవత్సరాల్లు 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గానికి తెచ్చింది రూ.296 కోట్లు మాత్రమే. రెండేళ్లలో మాత్రం రూ. 1035 కోట్లు తెచ్చాను. ప్రశ్నించడం మంచిదే కానీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను అవమానించవద్దు. అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు, అయినా ముందుకు పోతున్నాం. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఈ ప్రాంతం అనేక రంగాల్లో ఆర్ధికంగా ఎదగలేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తాను. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను’ అని అన్నారు. -
రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!
జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధన్వాడ మండలంలో.. గతంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి.. హనుమాన్పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 728, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధిక సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్ కెరటోడర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు. నేడు ‘ఎస్వీఎస్’ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ రేర్ డిసీజెస్ డే సందర్భంగా జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి ధన్వాడ మండలంలోని హనుమాన్పల్లిలో ఎస్వీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ రెసిడెంట్ డైరెక్టర్ కె.రాంరెడ్డి తెలిపారు. జన్యు లోపాలతో చర్మవ్యాధుల బారిన పడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అవగాహన లోపంతో చికిత్సకు రారని.. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత అవసరమయ్యే వారికి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. హనుమాన్పల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు డాక్టర్లతో వెబినార్లు మాత్రమే జరిగాయని.. స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని వివరించారు. ఈ వ్యాధులు సైతం.. మరికొందరిలో నెథర్టాన్ సిండ్రోమ్ (చర్మం ఎర్రగా, పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, తీవ్ర దురద, వెంట్రుకలు రాలిపోవడం), ఇచ్థియోసిస్ (చర్మం చాలా పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, చర్మం గట్టి పడడం), ఎపిడెర్మలైసిస్ బుల్లోసా (పుట్టిన పిల్లల చర్మం చిట్లిపోయి ఊడిపోవడం), ఎక్రోడెర్మాటిటిస్ ఎంటరోపాథికా (నోరు, ముక్కు, కళ్ల చుట్టూ ఎర్రగా మారి ప్యాచ్లు ఏర్పడడం, చేతులు, కాళ్ల చివరి భాగాల్లో పొడిగా ఉంటూ పొలుసుల్లా ఊడిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం), ఎరిత్రోపోయెటిక్ పర్ఫీరియా (సూర్యరశ్మి తగిలితే చర్మం మండడం, ఎర్రబారడం, బుడగలు, గాయాలు, మచ్చలు రావడం) వంటి రుగ్మతలు ఉన్నాయని ఎస్వీఎస్ ఆస్పత్రి ఎండీ, డెర్మటాలజిస్ట్ శరత్చంద్ర వెల్లడించారు. అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి.. రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు -
అనూహ్య మలుపులు
లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహిరంగ చర్చకు సిద్ధం : ఎంపీ మల్లు రవి శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన అనేక మలుపులతో అంతుచిక్కని దాడి కేసు బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు -
పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ -
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
ఊట్కూర్/మాగనూర్: గ్రామాల్లో ప్రజలు, నాయకులు పార్టీలను కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాలని, తర్వాత ఎవరు గెలిచినా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఊట్కూరు మండలం పులిమామిడిలో రూ.2.20 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్స్టేషన్, మాగనూరు మండలం వడ్వాట్లో సబ్స్టేషన్, గురువా లింగంపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలో 1,035 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పులిమామిడిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి, ఎస్ఈ నవీన్కుమార్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కిశోర్కుమార్, నాయకులు లక్ష్మారెడ్డి, సూరయ్యగౌడ్, యజ్ఞేశ్వర్రెడ్డి, ప్రకాష్రెడ్డి, నాగార్జున్రెడ్డి, వడ్వాట్లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, గురువలింగంపల్లి సర్పంచ్ ఈడిగి లక్ష్మీదేవమ్మ, డీఈ నర్సింహరావు, సివిల్ ఈఈ ప్రవీణ్కుమార్, ఏఈ గంగాధర్రావు, నాయకులు ఆనంద్గౌడ్, శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, నర్సింహులు, ముద్దు రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్
నారాయణపేట: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఫణీందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా.. 4,557 మంది విద్యార్థులకుగాను 4,415 మంది హాజరయ్యారు. 142 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు 4,048 మందికిగాను 3,926 మంది హాజరుకాగా.. 122 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 509 మందికిగాను 489 మంది హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పోలీసు అధికారులు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 3వ తేదీనే హోలీ పండుగ నారాయణపేట రూరల్: హోలీ పండుగను మంగళవారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్నా జగదీష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మురళి భట్టడ్, ప్రవీణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2న పౌర్ణమి ఉండటంతో కాముడి దహనం చేసి 3వ తేదీన రంగుల పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. అలాగే 19న ఉగాది, 27న శ్రీరామనవమి నిర్వహించుకోవాలని సూచించారు. శనగలు క్వింటా రూ.5,250 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం శనగలు క్వింటా గరిష్టంగా రూ.5,250, కనిష్టంగా రూ.5,212 ధర పలికింది. అలాగే ఆముదాలు రూ.5,605, పెసర రూ.7,787, వేరుశనగ గరిష్టంగా రూ.9,370, కనిష్టంగా రూ.5,252, ఆలసందలు రూ.7,919–రూ.6,440, కంది తెల్లవి రూ.7,589–రూ.7,419, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,919, కనిష్టంగా రూ.6,440 ధరలు లభించాయి. -
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నియంత్రణ
నారాయణపేట: మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీల నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కల్పించి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు చేపట్టకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా రైతు సాగు చేస్తున్నట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పారు. పోలీసు, ఎకై ్సజ్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని.. సమన్వయంతో మాదక ద్రవ్యాల నిషేధం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారి జయసుధ, ఎకై ్సజ్ సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు. ‘స్వచ్ఛ’ పద్ధతులు పాటించాలి.. జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా శుభ్ర త, పారిశుద్ధ్య పద్ధతు లు పాటించాలని రెవె న్యూ అదనపు కలెక్టర్ శ్రీను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఆహార భ ద్రత జిల్లాస్థాయి సల హా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఆహార వ్యాపార యూనిట్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి నెల రిజిస్ట్రేషన్, లైసెనన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆహార భద్రత అధికారి మౌనిక తెలిపారు. ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేసి అనుమానిత నమూనాలను రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి నమూనాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు వివరించారు. వాటికి కూడా లైసెన్స్లు జారీ చేస్తామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత సమావేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించినా ఎవరూ స్పందించ లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన పాఠశాలల హెచ్ఎంలు, వసతి గృహాల వార్డెన్లు, అంగన్వాడీ టీచర్లు విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో రెండోసారి జరిగిన సమావేశంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, డీడబ్ల్యూఓ కార్యాలయ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫలితాల వెల్లడి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–5తోపాటు బ్యాక్లాక్ పరీక్షల ఫలితాలను సైతం అధికారులు వెల్లడించారు. మొత్తం 69.39 శా తం ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
సంగాయపల్లిలో పోలీసుల విచారణ
మహమ్మదాబాద్: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్కర్నూల్కు చెందిన గణేశ్ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అమరచింత: ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని నాగల్కడ్మూర్లో శ్రీనివాస్రెడ్డి, సంధ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి మంత్రి తన సతీమణి వాకిటి లలితతో కలిసి హాజరై శ్రీనివాస్రెడ్డి దంపతులకు కానుక అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొదటి విడతలో అర్హులై ఇంటి స్థలం కలిగిన వారికి మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, సర్పంచ్ శివకుమార్, అరుణ్కుమార్, జగన్రెడ్డి, ఆశిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


