మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం | 65 Year Old Woman Shocking Incident In Nagarkurnool District, Case Filed Against Her Daughter Husband | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం

Feb 10 2026 10:03 AM | Updated on Feb 10 2026 10:25 AM

65 Year Old Woman Incident In Nagarkurnool District

నాగర్‌కర్నూల్ జిల్లా:  మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను  అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో  అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్‌ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది.

 రాఘవేందర్‌ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు  తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్‌ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement