breaking news
Crime News
-
ఓఆర్ఆర్ వద్ద బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కర్నూలు ఘటన.. మరో షాకింగ్ ట్విస్ట్!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బైక్.. బస్సునుగానీ, బస్సును.. బైక్ గానీ ఢీ కొట్టలేదని తెలుస్తోంది. అయితే బైక్ ప్రమాదానికి గురైన తర్వాతే.. బస్సు దానిని ఈడ్చుకెళ్లిందని, ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగిందని తాజాగా పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బైక్పై శంకర్తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని నుంచి పోలీసులు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..శివశంకర్తోపాటు అతని స్నేహితుడు ఎర్రి స్వామి ఫుల్గా మద్యం సేవించి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక వర్షంలో వెళ్తుండగా.. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. డివైడర్కు బలంగా తల ఢీ కొట్టడంతో శంకర్ బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డు పక్కనే కూర్చుని పోయాడు. సరిగ్గా అదే సమయంలో.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్ను వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. కాస్త దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అది చూసి భయపడిపోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రి సామి అక్కడి నుంచి పోరిపోయాడు. సీసీ ఫుటేజీ, సెల్ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్న పోలీసులు.. అతని స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఎర్రిస్వామిని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎర్రిస్వామి ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
పోలీసులు లైంగిక వేధింపులు.. అరచేతిపై బాధితురాలి లేఖ
-
సంగారెడ్డి: స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: డ్రైవర్ అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికుల సాయంతో డ్రైవర్ పిల్లలను దించేయడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. శనివారం ఉదయం నారాయణఖేడ్లో విజ్ఞాన్ పాఠశాల బస్సు పిల్లలతో బయల్దేరింది. అయితే ఒక్కసారిగా బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. స్థానికులను కేక వేసి పిల్లలను వెంటనే దించేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.గురువారం అర్ధరాత్రి టైంలో.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూల్ శివారులో ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మంటలు ఎగసి పడి బస్సు దగ్ధమైపోగా.. అందులోని ప్రయాణికుల్లో 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
సాక్షి, ప్రకాశం: కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ.. వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం(Vemuri Kaveri Travels Reaction) స్పందించింది. బస్సుకు ఫిట్నెస్ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్ డోర్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది. అయితే.. ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు. మరోపక్క.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైక్ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. కనీసం డోర్ తెరిచినా.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, బైకర్ కలిపి ఇప్పటిదాకా 20 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి.. ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్ -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్లో అత్యధికం హైదరాబాద్కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఓ హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. నిన్న రాత్రి(అక్టోబర్ 22 బుధవారం) ఆర్ ఇన్ హోటల్లో టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహించారు. విదేశాల చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేన బావతో వివాహం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.మేన బావతో 2012లో వివాహం..కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్పై పెద్దగుట్ట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉజ్మా..!
కర్నూలు జిల్లా: మండల కేంద్రం వెల్దురిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తిలోని 14 వ వార్డులో నివసించే ఉజ్మా (34)కు, మస్తాన్ అనే గౌండతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వెల్దురిలోని వడ్డెగేరిలో నివసించే వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానం పెంచుకున్న మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసిన పైకం ఇవ్వాలని ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉజ్మా ఇంటికి మాజీ ప్రియుడు వెళ్లాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది. పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కాగా మృతురాలు ఇంటా, బయట ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల హార్డ్డిస్్క, ఆమె సెల్ఫోన్ సైతం హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట ప్రజ్ఞాపూర్లో గౌండ పని చేసేందుకు వెళ్లిన మస్తాన్.. భార్య హత్య విషయం తెలుసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ మధుసూధన్ రావు, ఎస్ఐ అశోక్లు సంఘటనాస్థలికెళ్లి విచారించారు. మృతురాలి తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది చెరువు దగ్గర ఏం జరిగిందో తెలిస్తేనే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈలోపే నారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ‘‘నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలి’’ అని నారాయణరావు కొడుకు సురేష్, కోడలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు(Narayanarao Suicide). ‘‘అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్రూమ్ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికింది’’ అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.సంచలన విషయాలు.. తుని మైనర్ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బెదిరించాడు. ఈలోపు కొందరు వీడియో తీసి అతగాడి బాగోతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు. -
పోచారం ఐటీ కారిడార్ లో గోసంరక్షుడిపై కాల్పుల కలకలం
-
మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలంవర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురుఅన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు. -
తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
సాక్షి, కాకినాడ: బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్రూమ్కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నారాయణరావు అరెస్ట్ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు. -
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్కుమార్ తెలిపారు. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పట్టపగలు ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మ కూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్ల య్య–భిక్షమమ్మ(40) దంపతులకు ఇద్దరు కుమారు లు. మల్లయ్య లారీ డ్రైవర్గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్లో మెకానిక్గా, చిన్నకుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. మల్లయ్య–భిక్షమమ్మ దంపతులకు ఇటీవల తగాదాలు జరగ్గా.. మంగళవారం పెద్దల సమక్షంలో మా ట్లాడి భిక్షమమ్మ ఇంటికి తిరిగి వస్తోంది. గ్రామ నడిబొడ్డుకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు భిక్షమమ్మను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమె వద్దకు దుండగులు కారు దిగి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా.. కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతోపాటు దేశ గురువు, వారి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చెల్లీ అని పిలుస్తూనే.. బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని గుడారిగుంట ప్రకాశ్ నగర్కు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని వెల్పేర్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఆమెకు రావులపాలేనికి చెందిన అజయ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని పిలుస్తూ, ఏదైనా అవసరం అయితే తనకు చెప్పమనేవాడు. ఇదిలావుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర సామగ్రి తీసుకువస్తానని హాస్టల్ వార్డెన్కు చెప్పి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి ఏడు గంటలకు బాలిక తల్లి హాస్టల్కు వచ్చింది. ఆ సమయంలో ఆ బాలిక బయట నుంచి రావడంతో తల్లి ఎక్కడికి వెళ్లావని అడిగింది. దీంతో ఆమె జరిగిదంతా చెప్పింది. తనను అజయ్, అతడి స్నేహితుడు బయటకు తీసుకెళ్లారని, స్నేహితుడు తమను రైల్వే స్టేషన్ ఎదురుగానున్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ తనను హోటల్ రూమ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. లాడ్జి నిర్వాహకులు జరిగిదంతా చెప్పారు. యువకుడు, బాలిక వచ్చి తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని చెప్పారన్నారు. దీంతో పోలీసులు అజయ్పై కేసు నమోదు చేశారు. అలాగే మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
సుశీల నా కోరిక తీర్చు.. రౌడీ షీటర్ టార్చర్..!
ఖమ్మం జిల్లా: మండలంలోని వీవీ.పాలెంనకు చెందిన ఓ వివాహిత రౌడీషిటర్ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన బోడా సుశీల (28).. మరో మహిళతో కలిసి సోమవారం కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని పత్తి చేనులో పనికి వెళ్లింది. గ్రామానికే చెందిన రౌడీషీటర్ వినయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ఎదురుతిరగడంతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆమె ఇంటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. సుశీలకు భర్త, ఓ కుమారుడు ఉన్నారు. రౌడీ షీటర్ వినయ్ తరచూ వేధిస్తుండడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, సదరు రౌడీషిటర్ వినయ్ కారులో సుశీలను బలవంతంగా తీసుకెళ్లి అమ్మపాలంలో వదిలేశాడని, ఈ విషయంలో అనుమానాలు ఉన్నా యని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాక మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నా పట్టించుకోకుండా.. ఉరివేసుకుని, సహజ మరణంగా వైద్యులు తేల్చారంటూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుశీల భర్త, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో సీఐ ఉస్మాన్షరీఫ్, ఎస్ఐలు వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈక్రమాన కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
మాజీ డీజీపీ కొడుకు కేసులో భయానక ట్విస్ట్
మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్షుద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో.. తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
చాయ్వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు
పక్కా సమాచారంతో ఓ మారుమూల పల్లెలోని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయతే ఆ రైడ్లో ఏకంగా కోటి రూపాయల నగదుతో పాటు బంగారం, కొంత వెండి, కుప్పలుగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్లు, ఆధార్ కార్డులు, చెక్బుక్లు, ల్యాప్ల్యాప్, సెల్ ఫోన్స్ చూసి షాకయ్యారు. ఈ క్రమంలో ఆ చాయ్వాలా సోదరుడ్ని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.బీహార్ గోపాల్గంజ్ అమైతీ ఖుర్ద్ గ్రామంలో అంతరాష్ట్ర సైబర్ మాఫియా బయటపడడం కలకలం సృష్టించింది. ఓ చిన్న టీ స్టాల్ నడిపించే అభిషేక్ కుమార్, అతని సోదరుడు ఆదిత్య ‘సైబర్ మాఫియా’ నడుపుతున్నారంటే పోలీసులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ.. ఆ వచ్చిన నగదును పక్కా ప్లాన్తో వైట్లోకి మార్చేసుకుంటున్నారు ఈ అన్నదమ్ములు. అలా వచ్చిన సొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.అన్నదమ్ముల ముఠా.. ?అభిషేక్ కుమార్ స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపించేవాడు. అయితే తర్వాత దుబాయ్కి వెళ్లి అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని సహకారంతో ఆదిత్య కుమార్ ఇక్కడ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైబర్ నేరాలతో కొల్లగొట్టిన సొమ్మును బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి నగదును డ్రా చేసి వాడుకుంటున్నారు.తనిఖీలలో పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సైబర్ డీఎస్పీ అవంతిక దిలీప్ కుమార్ వెల్లడించారు. బెంగళూరులో జారీ అయిన పాస్బుక్స్ ఆధారంగా ఈ నెట్వర్క్.. కేవలం బీహార్కే పరిమితమై ఉండకపోవచ్చని, జాతీయ స్థాయిలో విస్తరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఉగ్ర లింకుల నేపథ్యంలో.. ఇన్కమ్ టాక్స్, ఏటీఎస్(Anti-Terrorism Squad) బృందాలు రంగంలోకి దిగాయి. -
అర్ధరాత్రి దాకా పోస్ట్మార్టం.. తెల్లవారక ముందే అంత్యక్రియలు పూర్తి
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో అతగాడు దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.జీజీహెచ్ ఆస్పత్రి మార్చురీలో గత అర్ధరాత్రి దాకా రియాజ్ మృతదేహానికి పోస్ట్మార్టం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుండి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బోధన్ రోడ్డులో గల స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రియాజ్(24)పై 40 కేసులతో(దొంగతనాలు, దాడులు) పాటు రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీన అతని గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) సిబ్బంది ఇద్దరు రంగంలోకి దిగారు. అయితే అతన్ని బైక్పై తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్(48)ను తన దగ్గర ఉన్న కత్తితో పొడిచి పరారయ్యాడు. రెండ్రోజుల పాటు 8 పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ ఘటనను రాష్ట్ర పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. అయితే.. రెండ్రోజుల తర్వాత ఆదివారం.. అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ క్రమంలో గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఖైదీల వార్డులో చికిత్స చేయించారు. అయితే సోమవారం ఉదయం తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వద్ద గన్ లాక్కునే ప్రయత్నం చేసి పారిపోసాగాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు దిగడంతో బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి స్పందిస్తూ.. రియాజ్ కాల్పులకు దిగి ఉంటే మరిన్ని ప్రాణాలు పోయి ఉండేవని, పోలీసులు సకాలంలో స్పందించారని అన్నారు. మరణించిన ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయాల ఆర్థిక సాయం , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారాయన.ఇదీ చదవండి: తెలంగాణ మంత్రి వద్ద సీనియర్ నేత ఆవేదన చూశారా? -
నంద్యాలలో దారుణం.. బుర్ఖాలో వచ్చి..
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో దారుణం జరిగింది. వృద్దురాలిని కత్తితో దాడి చేసిన దండుగులు బంగారు అభరణాలను అపహరించారు. బుర్ఖాలో వచ్చి వృద్దురాలు ఇందిరమ్మపై దాడి చేశారు. వృద్ధురాలు ప్రతి ఘటించడంతో మహిళ కత్తితో దాడి చేసింది. గాయాలైన వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కానిస్టేబుల్ ప్రమోద్ కేసు: రియాజ్ ఖతం, డీజీపీ ఏమన్నారంటే..
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్చైన్స్నాచర్ టు కానిస్టేబుల్ హత్య.. చిన్నచిన్న దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు పాల్పడే రియాజ్ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్ 17వ) తేదీన నిజామాబాద్ సీసీఎస్కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్పై ఎక్కించుకున్నారు.అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ అంటూ ప్రచారం.. శుక్రవారం ప్రమోద్ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే.. ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు. నిందితుడు రియాజ్ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్ను కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయే క్రమంలో ఎన్కౌంటర్ కావడం గమనార్హం.ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా? -
భర్తతో గొడవ..పిల్లల్ని చంపి..ఆ తర్వాత తల్లి
నల్గొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా గడపాల్సిన రోజున కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీ బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచాల రమేష్ ,నాగలక్ష్మి(27)దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లాకు వచ్చి కొండమల్లేపల్లిలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అవంతిక(9),మోహన్ సాయి(7) ఉన్నారు. భర్త రమేష్ తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గత కోన్నాళ్లుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు .ఇదే క్రమంలో అక్టోబర్ 19న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భర్త రమేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగలక్ష్మి తన ఇద్దరి పిల్లల గొంతు నులిమి తాను ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన కొండమల్లేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అంతలోనే అనంతలోకాలకు..
నల్గొండ జిల్లా: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్‡కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్‡కృçష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్ కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. -
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
ఒక్కగానొక్క కొడుకు.. ఇంకెందుకు బతకాలి?!
కర్నూలు: గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ కాలు జారి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు అయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం కాగా ఉదయ్కుమార్ కోసం గాలిస్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చదువుతున్న పీఎన్. చెన్నారెడ్డి(20), ఉదయ్ కుమార్(20), శివ, బాబు, అస్తాబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయి గణేష్ విద్యార్థులు ఇంట్లో కళాశాలకు వెళ్తామని చెప్పి గురువారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు, నీటి నిల్వ పరిసరాల్లో సందడి చేశారు. వారం రోజుల నుంచి గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగవ క్రస్ట్ గేట్ ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పారుతున్న నీటిలో ఆడుతూ సెలీ్ఫలు దిగుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారి చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ పారుతున్న నీటిలో కొట్టుకొని కిందకు పోయారు. దీన్ని గమనించిన శివ వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. చెన్నా రెడ్డి, ఉదయ్ కుమార్లు నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయి మునిగిపోవడంతో మిగతా వారు కేకలు వేశారు. దీంతో ప్రాజెక్టు అధికారులు గేటును మూసివేశారు. అయితే అప్పటికే వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులతో వెతికించారు. సాయంత్రం చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కనిపించదని మత్స్యకారులు బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఉదయ్ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఎందుకు బతకాలి? ‘ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని మేం ఎందుకు బతకాలిరా’ అంటూ చెన్నారెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, శకుంతలు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన మోహన్ రెడ్డి, శకుంతలకు ఒక కుమారుడు చెన్నారెడ్డి, ఇద్దరు కూమార్తెలు వైష్ణవి, చైతన్య ఉన్నారు. వీరు ఎమ్మిగనూరు పట్టణంలో హోటల్ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా తండ్రి మౌలేశ్వర రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి ఒక్కటే హోటల్ నడుపుతూ పెద్ద కూతురుకు వైష్ణవికు వివాహం చేశారు. హోటల్లో వచ్చిన సంపదనతోనే చెన్నారెడ్డిని, చైతన్యను చదివిస్తున్నారు. చెన్నారెడ్డి మృతిచెందిన సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాజెక్టుకు చేరుకొని ఒక ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో ఆశాలు పెట్టుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా ఒంటరిని చేసి వెళ్లి పోతావని అనుకోలేదని ఉన్న ఒక్క కుమారుడు పోయాడు. ఇక మేము ఎందుకు బతకాలి అని తల్లిదండ్రులు రోదించారు. ఎవరూ ముందుకు రాలేదు మా స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని, కేకలు వేస్తూ సమీపంలో ఉన్న వారందరినీ వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు. నీటిలో మునిగిపోయారు సహాయం చేయండని వేడుకున్నా ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేసి ఉంటే మా స్నేహితులు బతికి ఉండేవారు. – చెన్నారెడ్డి, ఉదయ్ స్నేహితులు కన్నీటి పర్యంతం..‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..
కరీంనగర్క్రైం: నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపాలనుకున్నదో భార్య. మొదటిసారి విఫలం కావడంతో రెండోసారి మద్యంలో బీపీ, నిద్రమాత్రలు పొడిచేసి కలిపి తాగించింది. అపస్మారస్థితిలోకి వెళ్లాక ఉరేసి చంపేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్లో గురువారం సీపీ గౌస్ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..నగరంలోని సప్తగిరికాలనీలో నివాసముంటున్న కత్తి మౌనిక, సురేశ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక ఇటీవల సెక్స్వర్కర్గా మారింది. సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. వారి సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ తినలేదు. గతనెల 17న సురేశ్ మద్యం సేవిస్తుండగా బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి మద్యంలో కలపడంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మౌనిక ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమెను విచారించగా తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ను సీపీ అభినందించారు. -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కోనసీమ జిల్లా: వివాహం జరిగి ఏడాది పూర్తి కాకుండానే భర్తతో పాటు అత్తింటి వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.జగన్మోహన్రావు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన గొర్లి శిరీష (23), ఏనుగుతల ప్రదీప్కుమార్కు సుమారు ఐదు నెలల కిందట వివాహం జరిగింది. కాగా ప్రదీప్కుమార్ ఒంటిమామిడిలో దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గోపాలపట్నంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కాగా బుధవారం సాయంత్రం ప్రదీప్కుమార్ ఉద్యోగానికి వెళ్లిన అనంతరం అత్తింటివారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. వివాహిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
సజ్జనార్ ఎఫెక్ట్.. ఆ చిల్లర ఇంటర్వ్యూలు డిలీట్!
ఇటీవల కాలంలో యూట్యూబ్ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంఖలానికి తెర లేపుతున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, చేష్టలు చేయిస్తున్నారు. తాజాగా ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్ఫారమ్లలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓ షార్ట్ఫిల్మ్/ఆల్బమ్ చేసిన జంట అందులో ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా.. అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్ షాక్ కావడం.. మీమ్స్, ఫన్నీ ఎడిట్ వీడియోల రూపంలోనూ వైరల్ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ కన్నెర్ర చేశారు. మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ యూట్యూబ్తో పాటు ఇన్స్ట్రాగామ్ తదితర సోషల్మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లపై సిటీ పోలీసుల నజర్ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్లోడ్ చేస్తున్నవాళ్లను, మీమ్స్ పేరిట పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు. అంతా అల్గారిథమ్ మహిమ!ఇటీవల కాలంలో సోషల్మీడియా ఖాతాలు, ఈ–కామర్స్ వెబ్సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు.. వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి. వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా? వ్యూస్, లైక్స్తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.వీసీ సజ్జనార్, నగర కొత్వాల్ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసు కూడా! ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్ సజ్జనర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొత్వాల్ ‘ఎక్స్’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలను డిలీట్ చేస్తుండటం గమనార్హం.:::సాక్షి, సిటీబ్యూరో -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
భిక్కనూరు/బోనకల్: రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్హెచ్ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్పల్లికి చెందిన మెరుగు కిషన్ (54) ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్లో చర్చి పాస్టర్గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు. కిషన్ తన కుమార్తె జాస్లీన్ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్ ప్రకాశ్ (4), జాడ్సన్ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం
-
కదలికలను గమనించి.. కళ్లలో కారం కొట్టి
రంగారెడ్డి జిల్లా: కొన్నాళ్లుగా మహిళ కదలికలను గమనిస్తున్న ఓ దుండగుడు ఇంట్లోకి దూరి కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్తో దాడిచేసి పుస్తెలతాడును అపహరణకు యత్నించాడు. పారిపోతున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం శంకర్పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజుమాదిరిగానే టిఫిన్ సెంటర్కు వచ్చిన సునీత పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేందుకు ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగుడు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సునీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు. బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తనయుడి తిట్లతో తల్లి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా: తరచూ కుమారుడు తిడుతుండటంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ స్రవంతి తెలిపిన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన చింతల సాయిలు తన తల్లి చింతల లక్ష్మి (70)ను తరచూ తిడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తిండి పెట్టకుండా తల్లిని వేధించాడు. సూటిపోటి మాటలతో ఎందుకు బతికున్నావ్.. చనిపో అంటూ దూషించేవాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి జీవితంపై విరక్తి చెంది.. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో కుమారుడు తల్లిని తిట్టడం, చనిపొమ్మంటూ వేధించడంతో ఆమె మనోవేదనకు గురయినట్లు తేలిందని ఎస్ఐ వివరించారు. పోలీసులు సాయిలుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. దుర్గాపూర్/కోల్కతా: పశ్చిమబెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్మేట్ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్కావడం గమనార్హం. దుర్గాపూర్ పట్ణణ శివారులోని ప్రైవేట్ ఎంబీబీఎస్ కళాశాల హాస్టల్ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్రేప్ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ గుప్తా సారథ్యంలోని బృందం సీన్ రీక్రియేషన్ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్చేశామని కమిషనర్ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్రేప్ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్ వ్యాఖ్యానించారు.వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకెనిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్ వెల్లడించారు. ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది -
‘ఏయ్ అరవకు.. ఇంకొందరిని పిలవమంటావా?’
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ స్టూడెంట్పై జరిగిన సామూహిక ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పిన విషయాలు ఓ జాతీయ మీడియా కథనం ద్వారా బయటకు వచ్చింది.వాళ్లు తమ వాహనాల నుంచి దిగి మా వైపు నడుచుకుంటూ వచ్చారు. అది గమనించి మేం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాం. వాళ్లలో ముగ్గురు నన్ను పట్టకుని దగ్గర్లోని అడవిలోకి లాక్కెళ్లారు. నా ఫ్రెండ్కు కాల్ చేయమని నాపై ఒత్తిడి చేశారు. అయితే అవతలి నుంచి స్పందన లేకపోవడంతో.. నన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. గట్టిగా అరిచేందుకు ప్రయత్నిస్తే.. అరిస్తే మరికొంత మందిని పిలిపిస్తామని బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అని స్టేట్మెంట్లో బాధితురాలు పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన హక్కుల కమిషన్ బాధితురాలిని పరామర్శించి.. ఘటనపై నివేదికను సిద్ధం చేస్తోంది.ఒడిశా జలేశ్వర్కు చెందిన యువతి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. గత శుక్రవారం డిన్నర్ కోసం ఫ్రెండ్తో ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్యాంగ్రేప్కు గురైంది. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు 10 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు అర్దరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే పోలీసుల నివేదిక ప్రకారం.. అత్యాచారం రాత్రి 9గం. ప్రాంతంలోనే జరిగింది. -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో బీటెక్ విద్యార్థిని..
సిరిసిల్ల: హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్నగర్కు చెందిన బండారి అశోక్–గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇటీవల దసరా పండుగకు ఇంటికొచ్చి వెళ్లిన మనోజ్ఞ హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ తాగిన మైకంలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మనోజ్ఞ మృతదేహాన్ని సిరిసిల్లకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలివెళ్లారు. బంగారు భవిష్యత్ కోసం హైదరాబాద్కు వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది -
నా అప్పులతో నా భార్యాపిల్లలకు సంబంధం లేదు..!
సిరిసిల్ల: ‘మీ అమ్మకి ఏమీ తెలియదు. చాలా అమాయకురాలు. ఇక నన్ను క్షమించండి. నేను చేసిన అప్పులతో నా భార్యాపిల్లలకు ఏం సంబంధం లేదు. వారికి ఎలాంటి హానీ తలపెట్టవద్దు. నా భార్యాపిల్లలకు మనవి.. మీకు ఇబ్బందిగా ఉంటే.. నాతోపాటే మీరు కూడా రాగలరు. జిల్లా కలెక్టర్ గారు.. ఎస్పీ గారు.. నా భార్యాపిల్లలకు న్యాయం చేయండి.. నేను బిజినెస్లో నష్టపోయి.. అప్పులోళ్లకు మొహం చూపించలేక సచ్చిపోతున్నా... అప్పులోళ్లు ఇద్దరే చాలా వేధించారు..’ అని సూసైడ్ నోట్ రాసి చనిపోయిన సంఘటన సిరిసిల్లలో సంచలనంగా మారింది. కరీంనగర్ శివారులోని ఎలగందులకు చెందిన విక్కుర్తి శేఖర్(48) ఇరువై ఏళ్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. స్థానిక మొదటి బైపాస్రోడ్డులో గణపతి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక సోమవారం విగ్రహాలను తయారు చేసే షెడ్డులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లకు చెందిన బాలసాని అంజయ్యగౌడ్ తన ప్లాటు(స్థలం) కాగితాలను బెదిరించి లాక్కున్నారని, బాలసాని యాదయ్య ఇల్లును ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లేఖలో శేఖర్ పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన ఇతరులు ఏమీ అనలేదని, మూడేళ్లు సమయం ఇచ్చారని, వాళ్లంతా నన్ను క్షమించాలని లేఖలో వేడుకున్నారు. వాళ్లకు మొఖం చూపించలేకపోతున్నానని పేర్కొన్నారు. షెడ్డు ఓనర్ తన భార్యపిల్లలకు సహకరించాలని కోరారు.కలెక్టర్, ఎస్పీలకు లేఖతన ఆస్తి భార్య పిల్లలకు దక్కేలా చూడాలని, కల్లు సొసైటీలో సభ్యత్వం పిల్లలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు. మృతుడికి భార్య వసుధ, పిల్లలు అఖిల్, మణిదీప్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
హైదరాబాద్ బాలానగర్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను బలవన్మరణానికి పాల్పడింది(Balanagar Mother Kills Children). మరణించిన చిన్నారులు కవలలుగా తెలుస్తోంది. బాలానగర్ పద్మారావునగర్ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై నివాసం ఉంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను కార్తీకేయ(2) లాస్యత వల్లి(2), సాయిలక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: నాన్నమ్మ మందలింపు, భార్యాకొడుకుతో కలిసి రైలు కింద పడి.. -
బాలుడిపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: బాలసదనంలోని ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి ఆ బాలుడు వెళ్లగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ బాల సదనంలోని ఓ బాలుడిపై కొంత కాలంగా అక్కడే పనిచేస్తున్న గార్డ్ స్టాఫ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు అస్వస్థతకు లోనయ్యాడు. అనుమతి లేకున్నా, షార్ట్ లీవ్ మంజూరు చేశారు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్.. ఆ బాలుడు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలసదనానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఉద్యోగి (గార్డ్ స్టాఫ్)ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. మరికొందరిపైనా దాడి...: ఈ బాలసదనంలో మొత్తం 77 మంది చిన్నారులున్నారు. లైంగిక దాడి విషయంపై పోలీసులు ఆదివారం కూడా ఆరా తీశారు. మరో నలుగురిపైనా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి వెనుక మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. నిత్య వైద్య పరీక్షలేవీ?: వాస్తవానికి విద్యార్థులకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు అక్కడ శాశ్వత ప్రాతిపదికన డాక్టర్ను నియమించినా, ఆయన బాలసదనానికి చుట్టపుచూపుగా వస్తుంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోచోట ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆయన ఇక్కడ విధులకు సకాలంలో హాజరుకారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. -
కూతురిలా ఉన్నావంటూనే...
బంజారాహిల్స్: కూతురిలా ఉన్నావని ప్రారంభంలో మర్యాదగా మాట్లాడి.. చనువు పెంచుకుని మెల్లమెల్లగా తన దుర్బుద్ధిని బయటపెట్టిన సీనియర్ అధికారిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైండ్స్పేస్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తున్న యువతి (26)కి తన పైఅధికారిగా పనిచేస్తున్న మృణాల్దాస్ (51)తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. తన కుమార్తెలా ఉన్నావంటూ మృణాల్దాస్ మొదట్లో ఆత్మయంగా వ్యవహరించేవాడని బాధిత యువతి పేర్కొంది. ఈ ఏడాది జులై 5వ తేదీన ఆమె మృణాల్దాస్తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–72లో ఉన్న ది స్విఫ్ట్ ఎలిమెంట్ స్పాకు వెళ్లినట్లు తెలిపింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు ఉన్నాయని చెప్పడంతో తాను వెళ్లగా తనకు మసాజ్ చేస్తున్న సమయంలో నిద్రలో ఉండగా ఒక దశలో వెనుక నుంచి వేరొకరి చేతులు తగిలాయని, గమనించి చూసేసరికి మృణాల్దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించానంది. తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తాను అరిచి మందలించానని తెలిపింది. ఆయన గది నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ రావాలని ప్రయత్నించాడని ఆరోపించింది. ఇటీవల ఆయన లండన్కు వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కూడా వీడియో కాల్ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటనను తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ హెచ్ఆర్ టీమ్కు కూడా తెలియజేశానని పేర్కొంది. తన భద్రత పట్ల భయంగా ఉందని, ఆయన మళ్లీ వేధించే అవకాశం ఉందంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జూబ్లీహిల్స్ పోలీసులు మృణాల్దాస్పై బీఎన్ఎస్ సెక్షన్ 75 (1) (ఐ) (2), 78 (1)(ఐఐ)(2), 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
కడప నగరంలో తీవ్ర విషాదం, కుటుంబ కలహాలతో..!!
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు.అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
మనవడు మహా ముదురు
విశాఖ సిటీ : క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలెంలో బామ్మ, మనవడిని కట్టేసి.. బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగే అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్ సినిమాను తలదన్నెలా ముగ్గురి స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచేశాడు. సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకుని షాక్కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన కృష్ణకాంత్ (19)తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్ (30), షేక్ అభిష్క్ (21), అవసరాల సత్యసూర్యకుమార్ (24)లను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనంద్రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసముంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్కు వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ నిద్రలో ఉన్నారు. ఆ అగంతకులు బామ్మ, మనవుడ్ని ప్లాస్టర్, ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న రూ. 50 వేలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్ర ఎక్స్యూవీ వాహనాన్ని కూడా దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్) లతా మాధురి ఆధ్వర్యంలో ఇన్చార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ క్రైమ్ సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్ఐ షేక్ అబ్దుల్ మరూఫ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్ డేటాలో అనుమానాస్పద యాప్లు, ట్రేడింగ్కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్ సెర్చ్ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్లలో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహీంద్రా కారును స్వా«దీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో అప్పులపాలుప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తండ్రి ఆనంద్రెడ్డిలా వ్యాపారంలో సక్సస్ అవ్వాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పీఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, కేఆర్ఎం కాలనీకి చెందిన షేక్ అభిõÙక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్లో నేరానికి ఏం ఉపయోగించాలి.. ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చెయ్యకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్రెడ్డి హైదరాబాద్కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్రెడ్డి కార్లో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. -
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు. -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం..!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
నెల్లూరు డబుల్ మర్డర్.. గంజా బ్యాచ్ పనే!
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
నల్లగొండ: హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం.. ఆన్లో ఉన్న కంప్యూటర్ వల్లే!
సాక్షి, నల్లగొండ: హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది(Haliya SBI Fire Accident). అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు.హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్(Computer Short Circuit) జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రేషన్ కార్డులు.. అందరికీ కాదు! -
పెన్నా బ్యారేజ్: డబుల్ మర్డర్ కలకలం
సాక్షి, నెల్లూరు: పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికి తీశారు. హత్య చేసి నదిలో పడేసి ఉంటారని.. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల వివరాల కోసం సమీపంలోని గిరిజన తండాల్లో ఆరా తీస్తున్నారు. -
మమ్మీడాడీ కావాలి!
అనంతపురం జిల్లా: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియని నాలుగేళ్ల బాలుడు తనకు మమ్మీ.. డాడీ కావాలంటూ రోదిస్తుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఘటనలో పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో సీనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న విశాఖనగరానికి చెందిన రామ్సుధీర్ భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, అనంతపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతూ రామ్సుధీర్ సైతం మృతిచెందాడు. వీరి కుమారుడు ఆద్విక్ కాలు విరిగి జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అంతటి నొప్పిలోనూ తన తల్లిదండ్రుల కోసం చిన్నారి పరితపిస్తూ రోదిస్తున్నాడు. చిన్నారి రోదన చూసిన వారి హృదయాలు బరువెక్కిపోతున్నాయి. -
ప్రియాంక ఆత్మహత్య కేసుపై డీఎస్పీ విచారణ
శ్రీ సత్యసాయి జిల్లా: ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆదివారం గద్వాల డీఎస్పీ మొగు లయ్య, గట్టు ఎస్ఐ మల్లేశ్ చిన్నోనిపల్లె, దీనికి సమీపంలోని మిట్టదొడ్డి గ్రామాల్లో విచారణ చేపట్టారు. ప్రియాంక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థి తులు, చుట్టుపక్కల వారితో ఆమె ఏ విధంగా ఉండేదనే వివరాలను డీఎస్పీ అడిగి తెలుసు కున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసు కోవాలన్న ఉద్దేశంతో కొత్తగూడెం జిల్లా పా ల్వంచ నుంచి గద్వాల జిల్లా చిన్నోనిపల్లె గ్రా మానికి చేరుకున్న ప్రియాంక.. దాదాపు రెండు నెలలపాటు ప్రియుడి ఇంటి వద్ద పోరాటం చేసినా.. చివరికి ఆ ప్రేమకథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. చిన్నోనిపల్లె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ను పెళ్లి చేసుకోవడానికి పోరాటం సాగించిన ప్రియాంక, తన ప్రయత్నం విఫలం కావడంతో శుక్రవారం విషపు గుళికలను కూల్డ్రింక్లో కలుపుకొని తాగగా.. గద్వాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం అదే రాత్రి ప్రియాంక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కొత్తగూడెం జిల్లా పాల్వంచకు తరలించారు. యువతి ప్రేమకథ విషాదాంతం -
సతాయిస్తోందంటూ.. అత్తను చంపిన కోడలు
మహబూబ్ నగర్ జిల్లా: ఇంట్లో నిత్యం గొణుగుతూ తనను సతాయిస్తోందంటూ వృద్ధురా లైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపింది. ఈ అమానుష ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్సై రజిత కథనం ప్రకారం నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్లమ్మ భర్త దసరయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందడంతో కుమారుడు మల్ల య్య వద్ద ఎల్లమ్మ ఉంటోంది. అయితే కోడలు బొగురమ్మతో తరచూ ఆమె గొడవ పెట్టుకొనేది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఎల్లమ్మను బొగురమ్మ రాడ్డుతో కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
రాజస్థాన్: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్లోని సవాయ మాన్సింగ్(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ਸਵਾਈ ਮਾਨ ਸਿੰਘ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਦੇ ICU 'ਚ ਲੱਗੀ ਅੱ+ਗਝੁਲ.ਸ ਗਏ ਕਿੰਨੇ ਹੀ ਮਰੀਜ਼ ! ਦੇਖੋ ਰਾਜਸਥਾਨ ਦੇ ਸਰਕਾਰੀ ਹਸਤਪਾਲ ਦੀਆਂ ਤਸਵੀਰਾਂ #jaipur #rajasthan #accident #LatestNews #Bignews #PunjabiNews #DailypostTV pic.twitter.com/kvlIRlBb4I— DailyPost TV (@DailyPostPhh) October 6, 2025 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది. #WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ— ANI (@ANI) October 5, 2025ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025సిబ్బందిపై ఆరోపణలుఅయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.ప్రధాని దిగ్భ్రాంతిజైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi— PMO India (@PMOIndia) October 6, 2025 #WATCH | Jaipur, Rajasthan | SMS Hospital Trauma centre Incharge Anurag Dhakad says, "Our trauma centre has two ICUs on the second floor: a trauma ICU and a semi-ICU. We had 24 patients there; 11 in the trauma ICU and 13 in the semi-ICU. A short circuit occurred in the trauma… pic.twitter.com/cjMwutRCl3— ANI (@ANI) October 5, 2025 -
దృశ్యం సినిమా తరహా హత్య.. నెల రోజుల తర్వాత సీన్ రివర్స్
-
లైంగిక వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
కొమరవోలు(పామర్రు): లైంగిక వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం, కొమరవోలులో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేడపాటి ప్రవీణ్ రాజు, వసంత(24)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న మెరుగుమాల పవన్ రోజూ వసంతను అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతూ.. రెండు రోజుల నుంచి లైంగికంగా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. శనివారం రాత్రి బాధితురాలి వద్ద పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తనను పవన్ నిత్యం లైంగికంగా వేధించడం వల్లే విషద్రావణం తాగానని చెప్పిందని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మృతదేహాన్ని పామర్రు–గుడివాడ జాతీయ రహదారిపై ఉంచి కుటుంబీకులు శనివారం రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
యువతి ప్రేమకథ విషాదాంతం
గద్వాల జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అందరి నీ ఎదిరించింది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకు వచ్చింది. రెండు నెలలుగా ఆ యువకుడి ఇంట్లోనే మకాం వేసింది. చివరికి విషపు గుళికలను తీసుకొని తనువు చాలించింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామా నికి చెందిన రఘునాథ్గౌడ్ను ప్రేమించింది. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం రఘునాథ్గౌడ్కు కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట తనను పెళ్లి చేసుకోవాలని ప్రియాంక చిన్నోనిపల్లె గ్రామానికి వచ్చి రఘునాథ్గౌడ్ను కోరింది. అయితే రఘునాథ్ గౌడ్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె వారి ఇంట్లోనే మకాం వేయడంతో రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కాగా, అప్పట్లోనే ప్రియాంక నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆమెను వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణా పాయం తప్పింది. అనంతరం ప్రియాంక రఘునా థ్గౌడ్తోపాటు కుటుంబ సభ్యులపై గట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జూలైలో కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా సెక్షన్ మార్పు చేసి, రఘునాథ్ను రిమాండ్కు తరలించగా ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యాడు.మరోసారి ఆత్మహత్యాయత్నం.. ఈ క్రమంలో ప్రియాంక శుక్రవారం గుళికల మందు తీసుకున్నట్లు పోలీసు లకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహు టిన చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆమె మృతిచెందింది. ఇదిలా ఉండగా రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లుగా ఆమె తల్లి దండ్రులు ఆస్పత్రి వద్ద ఆరోపించారు. రఘునాథ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై ప్రియాంక తల్లి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కాగా, ప్రియాంక మృతికి కారణమైన రఘు నాథ్గౌడ్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ వెల్లడించారు. మరో పక్క దళిత యువతి మృతికి కారణమైన రఘునాథ్గౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, కుల సంఘాల నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. -
Hyderabad: యువతి ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబంలోని విభేదాలతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డినగర్కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారి కుమార్తె సృష్టిత (21) తల్లి ప్రసన్నతో కలిసి మధుసూదన్రెడ్డినగర్లో ఉంటుండగా...భర్త వేరుగా ఉంటున్నాడు. సృష్టిత డిగ్రీ చదువుతుండగా, తల్లి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ప్రసన్న రోజులానే ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో కూతురు సృష్టిత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తల్లి కుమార్తెతో ఫోన్లో మాట్లాడింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు మరోమారు ఫోన్ చేస్తే సృష్టిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఇంట్లో కిరాయిదారులకు ఫోన్ చేసి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని తెలిపి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు తలుపు తట్టి ప్రయతి్నంచినా ఎలాంటి సమాధానం రాలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సృష్టిత తన గదిలో ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో విషయాన్ని తల్లి ప్రసన్నకు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల వల్లే మనస్థాపం చెంది యువతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కదిరిలో ‘దృశ్యం’ తరహా కేసు.. మిస్టరీ వీడింది
తన కూతురితో పాటు తనపైనా కన్నేసిన ఓ మృగాన్ని భార్య కడతేరిస్తే.. ఆ మృతదేహాం ఆనవాలు కూడా దొరక్కుండా మాయం చేస్తాడు ఓ భర్త. అటుపై ఈ కేసులో కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతగాడు చేసే ప్రయత్నాల ఆధారంగా అటు మలయాళం, ఇటు తెలుగు, మిగతా భాషల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్గా ‘దృశ్యం’ సిరీస్ అలరిస్తూ వస్తోంది. తాజాగా ఒరిజినల్ లాంగ్వేజ్లో మూడో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్ఫూర్తితో చాలా నేరాలు జరగడమూ చూశాం. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోనూ ఈ తరహాలో జరిగిన ఓ నేరాన్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని కనపడకుండా చేశారు ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అల్లుగుండుకు చెందిన అమర్నాథ్ మిస్సింగ్ కేసు రెండేళ్ల తర్వాత సాల్వ్ అయ్యింది. తన భర్త, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో ఓ మహిళ అతన్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అమర్నాథ్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆమె రగిలిపోయింది. విషయాన్ని తన భర్త దాదా పీర్కు చెప్పి వాపోయింది. దీంతో.. అమర్నాథ్పై కోపంతో రగిలిపోయిన దాదా పీర్.. స్నేహితులు సాధిక్, యాసిన్లతో కలిసి అమర్నాథ్ను హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని చెర్లోపల్లి రిజర్వాయర్లో పడేశాడు. తాజాగా కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆ శ్రీనుగాడి వల్లే.. నన్ను క్షమించు మమ్మీ!
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ (petbasheerabad police station) పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి (Kompally) పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీనును కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్నెట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. కొంపల్లి పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచి్చన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీను ను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
‘నా కొడుకుని వదలనంది..’ పూజపై అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలు
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన. అలీఘడ్లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. అయితే.. పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.అభిషేక్ తండ్రి ఏమన్నారంటే.. పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన. నిందితుడి అరెస్ట్తో.. ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడుఅరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు. పోలీసులేమన్నారంటే.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరీ పూజా శకున్?పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా -
వాటర్ ట్యాంకులో శవమై తేలిన ఏడేళ్ల బాలిక
చంచల్గూడ: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మొదట బాలిక ఇంటి నుంచి తప్పిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు మంగళవారం మాదన్నపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం సదరు బాలిక అమ్మమ్మ ఇంట్లోని వాటర్ ట్యాంక్లో శవమై తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సంతోష్ నగర్కు చెందిన షబానా బేగం తన కుమార్తె (7)తో కలిసి మంగళవారం మధ్యాహ్నం యాఖుత్పురాలోని పుట్టింటికి వచ్చింది. బాలికను ఇంట్లోనే వదిలి షాపింగ్కు చారి్మనార్ వెళ్లింది. ఇంటికి తిరిగి వచి్చన తర్వాత కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు వెతికినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. బాధితురాలి ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్లో శవమై కనిపించింది. బాలిక చేతులు వెనక నుంచి తాడు కట్టి ట్యాంక్లో పడేసి ఉండవచ్చిన పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా బాధితురాలి తల్లి ఆస్తి విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలికను లక్ష్యంగా చేసుకుని హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ హల్చల్
-
పోలీసుల పైకి కుక్కను వదిలారు..
హైదరాబాద్: మద్యం మత్తులో న్యూసెన్స్కు పాల్పడుతుండగా డయల్ 100 కాల్తో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసుల పైకి కుక్కలను వదిలిన ఓ న్యూస్ రిపోర్టర్తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని అరోరా కాలనీలో ఓ ఇంటి టెర్రస్పై 20 మందికి పైగా యువకులు అర్ధరాత్రి దాకా మద్యం సేవిస్తూ గాలిలోకి మద్యం బాటిళ్లను విసురుతూ, పగులగొడుతూ గోల చేస్తుండగా చుట్టుపక్కల నివాసితులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్కుమార్, నైట్ డ్యూటీ ఎస్ఐ సంధ్యారాణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ జరుగుతున్న ఇంటి టెర్రస్ పైకి వెళ్లడానికి యతి్నంచగా వీరి పైకి కుక్కను వదిలి విధులను అడ్డుకున్నారు. దీనిపై బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ న్యూస్ రిపోర్టర్ సహా అజయ్, శివ, రవి తదితరులపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 126 (2), 291, 292, 352, 189 (5) కింద కేసు నమోదు చేశారు. తాము ఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో సుమారు 20 మంది వరకు తమను అడ్డుకోవడంతో పాటు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేయగా తన చేతికి గాయమైందని కానిస్టేబుల్ భరత్కుమార్ ఆరోపించారు. తాము ఘటనా స్థలం నుంచి మెట్టుదిగే క్రమంలో మరోసారి 10–15 మంది వరకు తమను చుట్టుముట్టి దుర్బాషలాడుతూ యూనిఫాం తీసేసి అవమానిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరిలో కుమార్ అనే వ్యక్తి తాను న్యూస్ చానల్ రిపోర్టర్నంటూ తీవ్రంగా దుర్బాషలాడాడని అజయ్, శివ, రవి సహా మరికొందరు కూడా తోడయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నార్సింగిలో యువకుడి దారుణ హత్య
మణికొండ: ఓ సెల్ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు. చోరీ చేసిన ఫోన్ను తిరిగి ఇచ్చేయాలని చెప్పిన యువకున్ని మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన నార్సింగి – కోకాపేట రోడ్డులోని డబుల్ బెడ్ రూం గృహాల సముదాయం పక్కన సోమవారం అర్ధరాత్రి జరిగింది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..షాద్నగర్కు చెందిన కాశారం యాదగిరి(24), కిషన్బాగ్కు చెందిన అఫ్రోజ్, నవాజ్ల కుటుంబాలకు 11 నెలల క్రితం నార్సింగిలో డబుల్ బెడ్రూంలు మంజూరు కావటంతో ఇక్కడే పక్కపక్కనే నివసిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు రోజుల క్రితం నార్సింగిలో మరో యువకున్ని కొట్టి సెల్ఫోన్ను లాక్కున్నారు. దాన్ని యాదగిరి వ్యతిరేకించాడు. అది తిరిగి ఇచ్చేయాలని పట్టుపట్టాడు. అప్పటికే దాన్ని అమ్మేసిన హంతులకు విషయం యాదగిరి బయటపెడతాడని భావించి సోమవారం రాత్రి వారి గృహాలకు సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుదామని అతన్ని పిలిచారు. వింటే సరే లేదంటే హత్య చేయాలని పథకం వేసుకున్నారు. మద్యం తాగించి హత్య.. తమ పథకంలో బాగంగా మృతుడు యాదగిరికి ఎక్కువగా మద్యం తాగించి మత్తు ఎక్కేలా చేశారు. తర్వాత వారి వద్ద సిద్ధంగా ఉన్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. నొప్పి తాళలేక గట్టిగా అరవడంతో డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వారు సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108ను రప్పించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులలో ఒకడైన అఫ్రోజ్పై ఆర్జీఐ, బహదూర్ పురా పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. నిందితులనిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు. భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్ లేన్లోని ఆకాశ్ హోటల్ రూమ్ నెంబర్ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్మెంట్ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్రూమ్ డోర్ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు. పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసిన ముఠా వివరాలన సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నాలుగు నెలలు దర్యాప్తు చేశాం. దేశంలో మొదటిసారి ఓ గ్యాంగ్ను పట్టుకున్నామని సీపీ తెలిపారు.‘‘పైరసీ వల్ల సినిమా నిర్మాతల కష్టం వృథా అవుతుంది. మూవీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. 2023లో దేశంలో మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు పైరసీ వల్ల నష్టపోయారు. 2024లో తెలుగు ఇండస్ట్రీ 3700 కోట్లు నష్టపోయారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోతైన దర్యాప్తు చేశాం. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్కు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. టారెంట్ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారు...సర్వర్స్ హ్యాకింగ్తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా తన యాప్లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే బృందాలను ఏర్పాటు చేశాముతమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్లో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్.. అత్తాపూర్లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమా కాపీ చేసాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించి జానా కిరణ్ కుమార్ నిందితుడని తేలింది. సింగిల్, అనేక మూవీని అత్తాపూర్లోని మంత్ర థియేటర్లో మొబైల్తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలభై మూవీలు థియేటర్ లో కాపీ చేసాడు.150 నుండి 500 డాలర్లు ప్రతి మూవీ కాపీ చేసినందుకు ఇస్తున్నారు. సూటబుల్ సీటు చూసుకుని టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్ తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అర్సలన్ అహ్మద్ బీహార్ కు చెందిన వాడు. ఇతను కూడా హిందీ భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరల్కు పంపుతున్నాడు. సుధాకరన్ సత్యమంగళానికి చెందిన వ్యక్తి.. ఇతను కూడా సినిమాలు పైరసీ చేసి సిరిల్కు ఇస్తాడు. కరూర్కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు. నాలుగు వెబ్సైట్లు 2020 నుంచి నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చేసి ఈజీ మనీకి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడు.’’ అని సీపీ వెల్లడించారు. -
50 రోజులు.. 15 హోటళ్లు.. ఢిల్లీ బాబా కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు గతంలో చైర్మన్గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
టాలీవుడ్ నటికి కాబోయే భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: నేను జీవితంలో చాలా తప్పులు చేశాను... ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన ఓ నటికి కాబోయే భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్కు చెందిన సోహాని బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమెకు రాజస్తాన్కు చెందిన సవాయ్ సింగ్ అనే యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గత జూలైలో ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న సోహాని కుమారి అక్కడే ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. శనివారం ఉదయం సవాయ్ సింగ్ ప్రశాసన్నగర్లోని ఆమె ఇంటికి వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి గచి్చ»ౌలిలోని ఎవరి కార్యాలయాలకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం సోహాని ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆత్మహత్య చేసుకునే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. సోహాని కుమారితో పరిచయానికి ముందు సవాయ్ సింగ్కు మరో యువతితో స్నేహం ఉండేదని ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా శుక్రవారం ఉదయం 11.47 గంటలకు సవాయ్ సింగ్ ఆమె ఉంటున్న ఫ్లాట్ వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకునిని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నారు. -
పిల్లల ముఖం చూసైనా ఇంటికి రా.. ప్రియుడే కావాలన్న భార్య
కర్ణాటక రాష్ట్రం: బెంగళూరు బన్నేరుఘట్ట సమీపంలో బసవనహళ్లి గ్రామంలో తన భార్య ప్రియునిపై వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. మంజునాథ్ భార్య లీలావతి.. సంతు ఏళె అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరు కొడుకులు, ఓ కూతురుని భర్త వద్దే వదిలేసింది. మంజునాథ్ న్యాయం చేయాలని బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు ఇద్దరిని వెతికి పట్టుకొచ్చారు.తాను భర్తతో కాపురం చేయనని లీలావతి తెగేసి చెప్పింది. పిల్లల ముఖం చూసి అయినా ఇంటికి రావాలని మంజునాథ్ వేడుకున్నా లీలావతి ససేమిరా అంది. ఈ విషయమై భర్త సోషల్ మీడియా ద్వారా గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హుళిమావు పరిధిలోని బసవనపురలో సంతు ఇంటికి వెళ్లిన మంజునాథ్ గొడవ పడ్డాడు. బీర్ బాటిల్ తీసుకొని దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతు ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హుళిమావు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నెల్లూరు చిన్నారుల అదృశ్యం విషాదాంతం
సాక్షి, నెల్లూరు: ఉయ్యాలపల్లి చిన్నారుల అదృశ్యం ఘటన.. విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఆ తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ పరిణామంతో.. మిస్సింగ్ కేసును మిస్టరీ డెత్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉయ్యాలపల్లి(Uyyalapalli) గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష్ణువర్దన్, శ్రవణ్లు బుధవారం మధ్యాహ్నాం ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేపట్టారు. ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి ఉంటారనే స్థానికులు చెప్పడంతో డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..గురువారం విష్ణువర్దన్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. ఆపై అనుమానంతో కొంత నీటిని బయటకు తోడేయడంతో శ్రవణ్ మృతదేహాం కూడా బయటపడింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తాతకు నివాళిగా పోస్ట్...హత్యకు దారి తీసిన ‘లాఫింగ్’ ఇమేజ్
గుజరాత్లోని రాజ్కోట్లో ఫేస్బుక్ పోస్ట్ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. బాధితుడిని బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్మీడియాలో పాటించాల్సిన కనీస మర్యాద, సభ్యత, సంస్కారాలకు నిదర్శనం ఈ ఘటన.20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ బీహార్కు చెందినవాడు. మరో ముగ్గురు బంధువులతో కలిసి గుజరాత్లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం కాలం చేసిన తన తాత రూప్నారాయణ్ భింద్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక కథనాన్ని అప్లోడ్ చేశాడు ప్రిన్స్. అయితే బీహార్కు చెందిన ప్రిన్స్ పరిచయస్తుడు బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ అనుచితంగా రియాక్టయ్యాడు. ప్రిన్స్ పోస్ట్కు నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.మొల్లగా ఫోన్లోమొదలైనఘర్షణ ముదిరి భౌతిక దాడికి దారి తీసింది.ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి, 12:30 గంటల ప్రాంతంలో, ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల ఆటో రిక్షాలో కూర్చుని బిపిన్ దాడిచేశాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో, బిపిన్ ప్రిన్స్ను కత్తితో పొడిచాడు. ప్రిన్స్ అరుపులు విన్న అతని సహచరులు వెంటనే అతనికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై రాజ్కోట్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులకు పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సెప్టెంబర్ 22నకన్నుమూశాడు. చనిపోవడానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.చదవండి: మిలన్ ఫ్యాషన్వీక్ : రొటీన్గా కాకుండా బోల్డ్ లుక్లో మెరిసిన ఆలియాప్రిన్స్ వీపుపై అంగుళంన్నర, రెండు అంగుళాల లోతు గాయం ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. -
మాకు ఇక దిక్కెవరమ్మా..!
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇంట్లో చీరతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన రామసాని అనిల్రెడ్డికి చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అక్షయ(32)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. మంగళవారం ఉదయం అక్షయ తనకు తలనొప్పిగా ఉందని, బయట టీ స్టాల్ నుంచి టీ తీసుకురమ్మని భర్తకు చెప్పి పంపించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ బెడ్రూంలో వెంటిలేటర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి అక్షయ ఉరికి వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. వారు వచ్చి అక్షయను కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త అనిల్రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిసాటి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. భాస్కర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల మధ్య గత ఆరు నెలలుగా కలహాలు మొదలయ్యాయని, ఈ క్రమంలోనే భర్త అనిల్రెడ్డే అక్షయను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. కాగా ఇరుపక్షాల పెద్దమనుషులు కూర్చొని మృతురాలి ఇద్దరు పిల్లల పేరిట రూ.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు స్థిరాస్తినంతా పిల్లలకు రాసిచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. -
ప్రియుడి కోసం స్వాతి స్కెచ్.. మతిపోవాల్సిందే!
వివాహేతర సంబంధాల మోజుతో భర్తలను, భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య చూస్తున్నవే. అలాగే.. ప్రేమ మత్తులో తల్లిదండ్రులకు, అయిన వాళ్లకూ ద్రోహాన్ని తలపెడుతున్న జంటలనూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్వాతి తన ప్రేమికుడి కోసం చేసిన పని మాత్రం.. నెక్ట్స్ లెవల్ అంతే!.స్వాతి(21).. స్థానికంగా సెలూన్ నడిపించే మనోజ్(22) అనే యువకుడ్ని గాఢంగా ప్రేమించింది. కానీ, ఇంట్లో వాళ్లు తమ ప్రేమకు ఒప్పుకోరని భయపడింది. ఈ క్రమంలో రోజూ రాత్రి ఇంట్లో వాళ్లు తినే తిండిలో మత్తు మందు మాత్రలు కలుపుతూ వచ్చింది. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో ఊరిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఏకాంతంగా గడపం చేస్తూ వచ్చింది. అలా.. ఓ రోజు స్వాతి కదలికలపై ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. దీంతో..ఆమె మనోజ్ను సలహా అడిగింది. గప్చుప్గా ఇంట్లో వాళ్లను చంపేయమని చెప్పాడు మనోజ్. స్వాతి అన్నంత పని చేయబోయింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. దీంతో.. ఆ ప్రేమ జంట ఓ క్రైమ్ షో స్పూర్తితో మరో భయంకరమైన స్కెచ్ వేసింది.తమ ప్లాన్ను మనోజ్ తన దగ్గరి బంధువు మాంజిత్కు సాయం కోరాడు. మాంజిత్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. సెప్టెంబర్ 17వ తేదీన.. స్థానికంగా పెయింటింగ్ పనులు చేసే యోగేష్.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాడు. అతన్ని గమనించి మనోజ్.. మద్యం ఆఫర్ చేసి అతన్ని జనసంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలవడంతో యోగేష్ సోయి లేకుండా పడిపోయాడు. ఆపై అతన్ని మనోజ్, మాంజిత్లు తమ బైక్పై ఎక్కించుకుని దగ్గర్లోని ఓ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక రాళ్లతో కొట్టి యోగేష్ను దారుణంగా హతమార్చారు. ఆపై యోగేష్ ఫోన్ నుంచి స్వాతి సోదరుడు గౌరవ్కు ఫోన్ చేసి.. కాల్ కట్ చేశారు. అటుపై పోలీస్ హెల్ప్లైన్కు కాల్ చేసి ‘‘యోగేష్, కపిల్(స్వాతి సోదరులు), శోభారామ్(స్వాతి తండ్రి) తనపై దాడి చేస్తున్నారని.. తనను కాపాడాలని’’ వేడుకుంటూ ఫోన్ కట్ చేసి యోగేష్ డెడ్బాడీ దగ్గర పడేసి వెళ్లిపోయారు.తెల్లారి స్మశానంలో శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలతో.. ఈ కేసులో పోలీసులు స్వాతి తండ్రి, సోదరులే నిందితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో.. యోగేష్కు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా తండ్రి, సోదరులు అరెస్ట్ అయినా స్వాతి ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండిపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో.. ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె మనోజ్ను రహస్యంగా కలవడంతో.. అనుమానం అతనిపైకి మళ్లింది. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో.. యోగేష్ హత్యలో మనోజ్ పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు అప్పటికే పరారైన అతని కోసం గాలింపు ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం(సెప్టెంబర్ 22వ తేదీ) అతనిపై కాల్పులు జరిపి(కాలికి బుల్లెట్ గాయం అయ్యింది) మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల ఎదుట మనోజ్, మాంజిత్లు నేరం ఒప్పుకున్నారు. అయితే.. ఈ కేసులో మాస్టర్ మైండ్ స్వాతినే అని చెప్పేసరికి పోలీసులు కంగుతిన్నారు. తన తండ్రిని, సోదరులను ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తే కటకటాల పాలవుతారని, అలా తమకు ఏ అడ్డు ఉండబోదని స్వాతి భావించిందట. అలా పాపం అమాయకుడైన యోగేష్ను కూడా చంపేందుకు ఆమెనే ఎంపిక చేసిందట. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు. ఈ ఘాతుకం ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో జరిగింది. -
బాయ్ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతూ..
అన్నానగర్(చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని ఎరుమనూర్ గ్రామానికి చెందిన దర్శిని (18). ఈమె విరుదాచలం ప్రభుత్వ కొలంజియప్పర్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం బి.ఎ. చదువుతోంది. విరుదాచలం జంక్షన్ రోడ్ బస్టాండ్ సమీపం సెల్ఫోన్ సేల్స్ షాపులో పనిచేస్తోంది. విద్యార్థిని దర్శిని కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సోమవారం ఉదయం సెల్ఫోన్ షాపులో పనిచేస్తుండగా, తన ప్రియుడితో సెల్ఫోన్ ద్వారా వీడియో కాల్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య సమస్య కారణంగా, వీడియో కాల్లో మాట్లాడుతున్న దర్శిని దుకాణం వెనక్కి వెళ్లి అక్కడి గదిలో తలపాగాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పరార్.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
సాక్షి, తూర్పుగోదావరి/ఎన్టీఆర్ జిల్లా: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దొంగతనం కేసులో నిందితుడు అయిన ఇతను పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్స్పెక్టర్ తెలిపారు.పైముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 94407 96584 (ఇన్స్పెక్టర్ దేవరపల్లి), 94407 96624 (సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి) ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్లో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. -
కన్నపేగు ఎంత కఠినం?
సాక్షి, బళ్లారి: మొదటి కాన్పు, రెండవ కాన్పులో ఆడపిల్లలే పుట్టారు, మూడవ కాన్పులో మగపిల్లవాడు పుడతాడని భావించిన తల్లి ఆడపిల్ల పుట్టిందని పేగుబంధాన్ని తెంచుకుని, ఆ బిడ్డను తుంగభద్ర కాలువలోకి విసిరేసింది. బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా తోరణగల్లులో ప్రియాంక దేవి అనే కఠినాత్మురాలు ఈ ఘోరానికి ఒడిగట్టింది. ఆమె భర్త సనోజ్కుమార్ జిందాల్లో ఉద్యోగి, బిహార్ కి చెందిన ఈ దంపతులు తోరణగల్లులో ఉంటున్నారు. రెండు నెలల కిందట ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆనాటి నుంచి కోపంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శనివారం వేకువన పసిపానను నీటి కాలువలోకి పడేసింది. ఏమీ తెలియనట్లు తోరణగల్లు పోలీస్టేషన్లో బిడ్డ కనిపించడంలేదని విలపిస్తూ నటించింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తల్లి కాలువ వద్దకు తీసుకెళ్తున్న దృశ్యం çకనిపించింది. కసాయి తల్లిని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. సోమవారం ఉదయం శిశువు శవం దొరికింది. -
భార్య చికెన్ వండలేదని యువకుడి ఆత్మహత్య
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు
కట్నం డబ్బుల(dowry) కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) కాన్పూర్నగరంలోని కల్నల్గంజ్లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది.బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. చదవండి: నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది! -
సూట్ కేసులో కుక్కి.. ఓ సెల్ఫీ దిగి..!
ఆమె అతన్ని ప్రేమించింది. అతను ఆమెతో పాటు మరో యువతినీ ప్రేమించాడు. ఈ క్రమంలో రెండో గర్ల్ఫ్రెండ్ వ్యవహారం మొదటి గర్ల్ఫ్రెండ్కు నచ్చలేదు. ఆమెతో తిరగడం ఆపేయాలంటూ ప్రియుడ్ని వారించింది. దానిని సీరియస్గా తీసుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా మొదటి ప్రేయసిని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె మాత్రం అతన్ని విడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోక.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో యమునా నదిలో దొరికిన ‘సూట్కేసులో యువతి డెడ్బాడీ మిస్టరీ’.. రెండు నెలల తర్వాత వీడింది. తన అబద్ధాలతో రెండు నెలలపాటు పోలీసులను ఏమార్చిన యువకుడు.. చివరకు నేరం అంగీకరించాడు. రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే విచారణలో నిందితులు విస్తుపోయే వివరాలనే వెల్లడించారు. ఆగస్టు 8వ తేదీన కాన్పూర్కు చెందిన అకాంక్ష(18) అనే యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి బర్రాలోని ఓ రెస్టారెంట్లో పని చేస్తుందని తెలుసుకున్న పోలీసులు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడి(20)తో వెళ్లిపోయిందని భావించారు. ఈ క్రమంలో.. అతన్ని విచారణ జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె తనతో చాలా రోజుల నుంచి టచ్లో లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది నిజమేనని ధృవీకరించుకున్న పోలీసులు.. మళ్లీ అతగాడ్ని తమైమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. ఆకాంక్ష తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. హనుమంత్ విహార్లో ఓ గదిని అద్దెను తీసుకుని జీవించసాగింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకుని నిలదీసింది. తప్పు జరిగిపోయిందంటూ ఆమెను బతిమాలి కూల్ చేశాడా యువకుడు. అయినప్పటికీ మరో యువతితో అతని బంధం కొనసాగింది. ఈ క్రమంలో.. జరిగిన విషయాన్ని మరో గర్ల్ఫ్రెండ్కి చెప్పగా.. అకాంక్షను అడ్డు తొలగించుకుందాం అని సూచించింది. దీంతో.. సెప్టెంబర్ 8న రెస్టారెంట్లో ఆ జంట మధ్య గొడవ జరిగింది. కోపంతో ఇంటికి వచ్చిన అతను ఆమెను కొట్టి, అనంతరం గొంతు నలిపి హత్య చేశాడు. హత్య అనంతరం.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి మోటార్సైకిల్పై బండా జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో శవం ఉన్న సూట్ కేసు పడేశారు. ఆపై రెండో గర్ల్ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి.. ఆమెతో జాలీగా గడిపాడు.మొదట పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన నిందితుడు.. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులతో దొరికిపోయాడు. దీంతో యువకుడిని, ఫతేపూర్కు చెందిన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఐ ఫోన్ కొనలేదని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: తల్లిదండ్రులు ఐ ఫోన్ కొనలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుజాతనగర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సుజాతనగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాడు. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్(26) కొంతకాలం హైదరాబాద్లో సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఐ ఫోన్ కావాలని తండ్రిని సాయి అడుగుతున్నాడు. ఆదివారం కూడా ఈ విషయంపై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం తన గదిలోకి వెళ్లిన కెవిన్ సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపును బలవంతంగా తెరడంతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. హతాశులైన తల్లిదండ్రులు అతడ్ని కిందకు దించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కెవిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కేవీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో భార్య హత్య
కొమరంభీం జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన మండలంలోని నారాయణపూర్లో చోటుచేసుకుంది. రెబ్బెన సీఐ సంజయ్ కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన గజ్జల తిరుపతి, మంచిర్యాల జిల్లా బూదకలాన్కు చెందిన స్రవంతి (38) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. తిరుపతి వ్యవసాయ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గత కొంతకాలంగా తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో భార్యను ఎలాగైన హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న స్రవంతి మెడ, గొంతుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ, సీఐ సంజయ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును, అందుకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తమ్ముడు టేకుమట్ల సంజయ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
చర్లపల్లి: సంచిలో మృతదేహం కేసు.. ఆ మహిళ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
శంషాబాద్: 12 కోట్ల విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు సమాచారం ఆధారంగా.. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది. డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన ఆ మొత్తం 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి విలువ రూ.12 కోట్ల దాకా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.హైడ్రోపోనిక్ గంజాయి అంటే.. హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.53 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.శిక్ష ఏంటంటే..హైడ్రోపోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి భారతదేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం ఎన్డీపీఎస్ చట్టం 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం శిక్షించబడతారు. ఈ చట్టం కింద బెయిల్ పొందడం చాలా కష్టం. నేరం తీవ్రతను బట్టి కోర్టు విచారణ జరుగుతుంది.గంజాయి రవాణా, విక్రయానికి.. 10–20 సంవత్సరాల జైలు + రూ. 1–2 లక్షల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే గనుక.. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదూ విధించవచ్చు. -
బండకు బాది చంపేశాడు.. నా కొడుకుని చంపేసేయండి
-
చావు పిలిచింది.. వెళ్లిపోతున్నా..
యాదాద్రి భువనగిరి జిల్లా: ‘తనను పది రోజులుగా చావు పిలుస్తుంది.. నేను చావు వద్దకు వెళ్లిపోతున్న.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’అంటూ ఓ యువకుడు చెరువులో దూకాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు, యువకుడి వాయిస్ రికార్డులో నమోదైన వివరాల ప్రకారం...హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్లో డీమార్ట్ వెనుకాల తన భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నాడు. సురేందర్ హైటెక్ సిటీలోని ఓప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజులుగా సురేందర్ మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఏదేదో మాట్లాడుతుండేవాడు. నిత్యం చావు కల వస్తుందని, తన వద్దకు రమ్మని చావు పిలుస్తుందని, దేవుళ్లు పిలుస్తున్నట్టు పీడ కలలు వస్తున్నాయని, తాను చనిపోతానని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులకు చెబుతుండేవాడు. కాగా కుటుంబసభ్యులు అతని పలు దేవాలయాలు, దైవదర్శనాలకు తిప్పారు. మానసిక పరిస్థితి మెరుగుపడటంతో ఉద్యోగానికి వెళ్లానని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఒప్పుకున్నాడు. నాలుగు రోజులుగా ఉద్యోగానికి వెళ్తున్న సురేందర్.. శుక్రవారం ఉదయం కూడా డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పాడు. క్యాబ్ బుక్ చేసుకొని బీబీనగర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. చావు రమ్మటుంది.. నేను వెళ్తున్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని, తన చావు కార్యక్రమాలు పాత ఇంట్లో చేయాలని, నా చావుకు ఎవరూ కారణం కాదని సెల్ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పంపాడు. ఆ తర్వాత బూట్లు, సెల్ఫోన్ చెరువు కట్టపై పెట్టి చెరువులో దూకాడు. బంధువుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీం చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకకపోవడంతో అక్కడే ఉన్న సురేందర్ భార్య.. భర్త లేనిదే తాను ఉండలేనంటూ చెరువులో దూకింది. అప్రమత్తమైన రెస్క్యూ టీం ఆమెను కాపాడింది. శుక్రవారం రాత్రి వరకు గాలించినా సురేందర్ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశముంది. -
కూరగాయలు కోసే కత్తితో భర్తను పొడిచిన భార్య
మణికొండ: తనను తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కోకాపేటలో జరిగింది. నార్సింగి ఇన్చార్జి సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన కృష్ణంజ్యోతి బోరా (30), బర్క బోరా భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కోకాపేటలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం భార్యను కొట్టి ఆమెతో గొడవ పడి ఇంట్లోంచి కృష్ణంజ్యోతి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి తలుపులు కొట్టినా ఆమె తీయలేదు. తలుపులను కృష్ణంజ్యోతి బలంగా తన్నటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బర్క బోరాను కర్రతో కొట్టేందుకు యతి్నంచగా.. ఆమె పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. తల, మెడ, కుడి భుజంపై కత్తితో పొడవటంతో కృష్ణంజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు వినిపించడటంతో లేబర్ క్యాంపులో ఉన్న చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితురాలు బర్క బోరాని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య!
కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తి కుమార్తెతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బïÙరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కాలేజీ వెనక ఉన్న చెరువులో గురువారం ఉదయం ఓ వ్యక్తి, బాలిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి. విచారించగా బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50), అతని కుమార్తె దివ్య(05)గా గుర్తించారు. నాలుగేళ్లుగా అశోక్, అతడి భార్య సోనీ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం రోడ్డు అతడి భార్య సోనీ రోడ్డు దాటుతుండగా లారీ ఢీనడంతో ఎడమ కాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు క్రితం అశోక్ ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు. దీనిని గుర్తించిన అతడి భార్య సోనీ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆరి్పవేసినట్లు సమాచారం. ఆ మర్నాడు సాయంత్రం అశోక్ కుమార్తెను తీసుకుని ఇంటి నుండి వెళ్లిన అశోక్ కుమార్తెతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
-
హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఫ్లోర్ ఇంఛార్జ్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. గడ్డి అన్నారం నారాయణ కాలేజీ బ్రాంచ్లో ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యంచేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులను చితకబాదాడు.తిండి తినలేని స్థితిలో విద్యార్థి ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా, విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కనబెడితే.. గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. -
జ్యూస్ తాగుతుండగా గుండె ఆగింది!
క్రైమ్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జ్యూస్ తాగుతూ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపే అతని ప్రాణం పోయింది. బుధవారం రాత్రి 8గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగుతూ ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతనికి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడు. గుండెపోటుతోనే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా పల్లిపాడుగా పోలీసులు తెలిపారు. అతని పేరు, ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. -
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్మేట్స్.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం..!
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
ప్రియుడు అనిల్తో కలిసి భర్త చెవులు కోసిన భార్య
మహబూబాబాద్ రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించగా.. తీవ్ర గాయా లతో భర్త తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్కు జిల్లాలోని కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్దెల అనిల్తో రషి్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్ను రష్మి ఫోన్ చేసి పిలిపించింది.నిద్రిస్తున్న ప్రసాద్ను రషి్మ వెనుక నుంచి అదిమిపట్టుకోగా అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయతి్నంచాడు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రసాద్కు ఎడమ చెవి, ఎడమ చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు, తండ్రి పాపయ్య అక్కడికి చేరుకుని అనిల్ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనిల్, రష్మిని అదుపులోకి తీసుకుని మహబూబాబాద్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రసాద్ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
పట్టపగలు వివాహిత...
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
హనీ ట్రాప్లో యోగా గురువు రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్కి తెరతీసింది.అమర్ గ్యాంగ్కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మా కుమారుడిది ముమ్మాటికీ హత్యే.!
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.కాశీపురంలో విషాదఛాయలు నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో కేసు నమోదునవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. -
మీ అక్క నా వద్ద ఉంది.. వచ్చి తీసుకెళ్లు
నెల్లూరు (క్రైమ్): ఓ యువతిని కత్తితో పొడిచి ప్రేమికుడే కడతేర్చిన ఘటన శనివారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో జరిగింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబలి్లకి చెందిన గిరిబాబు, శ్రీలక్ష్మి దంపతులకు మైథిలిప్రియ (23), సాహితి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరిబాబు 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబం మూలాపేటలో ఉంటోంది. మైథిలిప్రియ వెంకటాచలంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది మార్చిలో బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమె బీఫార్మసీ చదివే సమయంలో అదే కళాశాలలో సహచర విద్యార్థి రాపూరు మండలానికి చెందిన నిఖిల్తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. మైథిలిప్రియ, ఆమె చెల్లెలు సాహితి పోస్టల్కాలనీ మొదటి వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఎదురు బిల్డింగ్లో నిఖిల్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉంటూ మైథిలితో తరచూ గొడవ పడుతుండేవాడు. సుమారు నాలుగు నెలల కిందట మైథిలికి బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది. పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చి.. ఈ నెల 6న మైథిలి పుట్టిన రోజు కావడంతో 3న నెల్లూరుకు వచ్చింది. చెల్లెలు గదిలో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే నిఖిల్ పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సాహితి అతనితో ఇక వద్దని అక్కకు సూచించింది. ఈ నెల 12న రాత్రి పొద్దుపోయే వరకు మైథిలి ఫోన్ చేసుకుంటూ ఉండగా సాహితి నిద్రపోయింది. 13వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.45 గంటల ప్రాంతంలో సాహితి నిద్ర నుంచి లేచి చూడగా అక్క కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేసింది. ఫ్రెండ్స్తో ఉన్నానని, పది నిమిషాల్లో వస్తానని, నిఖిల్కు ఫోన్ చేయొద్దని చెప్పింది. దీంతో సాహితి తిరిగి నిద్రపోయింది. సుమారు 3.35 గంటల ప్రాంతంలో ‘‘మీ అక్క నా వద్ద ఉందని, వచ్చి తీసుకెళ్లు’’ అని నిఖిల్ సాహితికి ఫోన్ చేసి చెప్పాడు. సాహితి తన స్నేహితురాలు, రూమ్ కింద ఉంటున్న ఓ మహిళను తీసుకుని నిఖిల్ గది వద్దకు వెళ్లింది. అక్కడ మెట్లపై మైథిలి విగతజీవిగా ఉంది. ఆమె ఎడమ చంక కింద కత్తి పోటు ఉంది. రక్తస్రావమైంది. దీంతో తన అక్కకు ఏమైందని నిఖిల్ను నిలదీయగా తనతో గొడవపడడంతో కత్తితో పొడిచానని నిఖిల్ చెప్పాడు. సాహితి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సాహితి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిఖిల్ దర్గామిట్ట పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. తన కుమార్తెను హత్య చేసిన నిఖిల్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి శ్రీలక్ష్మి పోలీసు అధికారులను కోరారు. -
Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?
-
Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?
-
కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
-
Anakapalli: కుమార్తెను ప్రేమించాడని యువకుడిని హత్య చేయించిన టీడీపీ నేత కుటుంబం
-
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
అత్తతో అల్లుడు.. పక్కింటామెతో మామ..!
ధర్మవరం అర్బన్: పట్టణంలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం భార్యను భర్త హతమార్చి పాతిపెట్టాడు. కాలనీ వాసుల గుసగుసలతో అప్రమత్తమైన పోలీసులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న వెంకట్రాముడు, సరస్వతమ్మ దంపతులు ఆటోలో చిప్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ పనిలో సహాయకుడిగా ప్రశాంత్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో సరస్వతమ్మ, ప్రశాంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు సరస్వతమ్మ తన కుమార్తె మహాలక్ష్మిని ప్రశాంత్కు ఇచ్చి వివాహం చేసింది.ఆ తర్వాత కూడా ప్రశాంత్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రావడాన్ని వెంకట్రాముడు పసిగట్టాడు. తన భార్యపై అక్కసుతో తాము నివాసముంటున్న కాలనీలోనే మరో మహిళతో వెంకట్రాముడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతమ్మ, అల్లుడు ప్రశాంత్తో కలసి సదరు మహిళ కుమారుడుని కిడ్నాప్ చేసి.. వెంకట్రాముడు కిడ్నాప్ చేసినట్లుగా సదరు మహిళతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రాముడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి రెండు నెలల క్రితం వెంకట్రాముడు బయటకు వచ్చాడు. దీంతో ప్రశాంత్ తన భార్యను పిలుచుకుని అనంతపురానికి మకాం మార్చాడు. ఇంటికి చేరుకున్న వెంకట్రాముడు.. తనను జైలుకు పంపిన భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసి రెండు నెలల క్రితం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడు విజయ్ను పిలిపించుకుని మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనంపై మధ్యలో మృతదేహాన్ని ఉంచుకుని గొళ్లొళ్లపల్లి సమీపంలోని వంకలో పాతి పెట్టాడు. సరస్వతమ్మ కనిపించకపోవడంతో కాలనీవాసులు గుసగుసలాడుకోవడం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంకట్రాముడు, విజయ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహం బయటపడగానే అరెస్ట్ చూపే అవకాశలున్నాయి. -
మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు
నాతవరం(అనకాపల్లి జిల్లా): మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మండలంలో వైబీ పట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిటికిల జోగునాయుడు, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కొడుకు రామ్మూర్తినాయుడు మాకవరపాలెం మండలానికి చెందిన అమ్మాయిని çప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులివ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. భర్త వే«ధింపులు భరించలేక భార్య దేవి నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు కూడా పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తినాయుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. గురువారం మరిడమ్మతల్లి పండగ కావడంతో గ్రామానికి వచ్చాడు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి వైబీ పట్నంలోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు పరిస్థితి గమనించిన ఆయన అక్కడి నుంచి తప్పించుకోగా, నిద్రిస్తున్న తల్లి మంగను కొట్టి డబ్బులడిగాడు. మంచం పైనుంచి కింద పడేసి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తల్లి స్పృహ తప్పి అపస్మార స్థితికి చేరుకుంది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, శతమానం లాక్కుని పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి మంగ మరణించింది. మృతురాలి భర్త జోగునాయుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకున్నామని, దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
రేణు అగర్వాల్ కేసు.. పోలీసులు అదుపులో నిందితులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఢిల్లీలో, మరో ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. దీంతో, వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలించారు. తాజాగా నిందితులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. -
ప్రియుడితో కలసి కన్నబిడ్డ హత్య
శివ్వంపేట (నర్సాపూర్): ప్రియుడితో కలసి రెండేళ్ల కన్నబిడ్డను హత్య చేసి పాతిపెట్టిందో తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందని భావించి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని శభాష్పల్లిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు మమతకు సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, కూతురు తని్వసి (2) సంతానం. కాగా, మమత శభా‹Ùపల్లికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మార్చి నెలలో ఇద్దరూ కలసి పారిపోవడంతో పెద్దలు సర్ది చెప్పి అత్తగారింటికి పంపించారు. మేలో పిల్లలను తీసుకొని మమత తల్లిగారింటికి వచ్చింది. ఆమెలో ఎలాంటి మార్పు రాకపోగా.. రెండోసారి మే 21న కుమారుడిని తల్లిగారి ఇంట్లోనే వదిలేసి కూతురు తన్విసిని తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మమత తండ్రి రాజు ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో దొరికిన మమత, ఫయాజ్ శివ్వంపేట పోలీసులు ఏపీలోని గుంటూరులో మమత, ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురు తని్వసి విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. గొంతు పిసికి హత్య చేసి, పాతి పెట్టినట్లు చెప్పారు. దీంతో శుక్రవారం సాయంత్రం శభాష్ పల్లి గ్రామ శివారులో చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని కనుగొన్నారు. డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్ కమలాద్రి, ఎస్ఐ మధుకర్రెడ్డి సమక్షంలో కుంట కట్టు కాల్వలో పూడ్చిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫయాజ్పై ఇప్పటికే దొంగతనాలు ఇతర నేరాలకు సంబంధించి 30కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
అసలేం జరిగిందంటే..? కూకట్ పల్లి ఘటనపై ACP క్లారిటీ
-
రషీద్ హత్య వెనుక లేడీ డాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు
గూడూరు రూరల్: పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కాగా, రషీద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టిడ్కో గృహాల కాలనీలో వ్యభిచారం, గంజాయి, సెటిల్మెంట్తో లేడీ డాన్గా వందన ఎదిగింది. వందన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడంతో రషీద్ హత్యకు గురైనట్లు సమాచారం. లేడీ డాన్ వందనతో పాటు ఆమె అనుచరులు వెంకీ, హన్షిద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాట్నాలో ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత దారుణ హత్య గురయ్యారు. రాజ్కుమార్ రాయ్ను దుండగులు కాల్చి చంపారు. బుధవారం రాత్రి పాట్నాలోని చిత్రగుప్త్ ప్రాంతంలోని మున్నాచక్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్కుమార్ రాయ్.. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాయ్ భూమి కొనుగోలు, అమ్మకాల్లో వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
Kukatpally: బంగారం కోసం మహిళా దారుణ హత్య
-
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. -
కూకట్ పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ దారుణ హత్య
-
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగాలపై దాడి చేసిన భార్య..!
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్కూలర్ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
తండ్రి తల నరికి వాగులో పారేసిన కొడుకు
కల్వకుర్తి టౌన్: మూఢనమ్మకాల అనుమానంతోనే కన్నతండ్రిని హత్య చేయాలని కుమారుడు పథకం రచించాడని.. ఈ ప్రణాళికలో భాగంగానే పొలం వద్ద పంచాయితీ పెట్టుకొని హత్య చేశాడని.. అనంతరం తల, మొండెంను వేరుచేసి డిండిచింతపల్లి, డీఎల్ఐ కాల్వలో పారవేశారని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన ఆదివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య (70)కు ముగ్గురు కుమారులు ఉండగా.. ఇందులో ఒకరు గతంలో చనిపోయారు. మిగిలిన ఇద్దరిలో చిన్న కుమారుడు బీరయ్య. అయితే, బీరయ్యకు ఒక కుమార్తె ఉండగా.. మూడు నెలల క్రితం బాలిక ఆత్మహత్య చేసుకుంది. నాటి నుంచి బాలిక తండ్రి బీరయ్య నిత్యం ఆలోచనలో ఉంటూ.. కూతురి మృతికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. ఈక్రమంలో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లిన బీరయ్యకు నీ కూతురి మృతికి నీ తండ్రి బాలయ్యనే కారణమని చెప్పాడు. దీంతో నాటి నుంచి తండ్రిపై పగ పెంచుకున్నాడు బీరయ్య ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన పొలం వద్ద పశువులను మేపుకుంటూ ఉన్న తండ్రి బాలయ్య గొడవకు దిగాడు. పంచాయితీ కాస్త పెద్దగా కావడంతో అక్కడే ఉన్న కర్రతో తండ్రి బాలయ్య తలపై కుమారుడు బీరయ్య విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాలయ్య స్పృహతప్పి పడిపోయాడు. ఇదే అదునుగా అతన్ని చనిపోయే వరకు దాడిచేశాడు. ఈ దాడిని బాలయ్య వద్ద పనిచేసే రామచంద్రి చూడగా, అతని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తా అనడంతో అతడు అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. హత్యకు ముందు నుంచే ప్రణాళిక.. ఇదిలాఉండగా, తండ్రి బాలయ్యని ఎలాగైనా చంపాలని బీరయ్య ముందే పక్కా ప్రణాళిక వేశాడు. గొడవ చోటుచేసుకోవడంతో ఇదే అదునుగా హత్య చేశాడు. అయితే, వరుసకు మేనల్లుడు అయిన వంగూర్ మండలం రంగాపూర్కు చెందిన అంజికి బీరయ్య విషయాన్ని అంతా ఫోన్ ద్వారా వివరించాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత అంజి అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతని కారు డిక్కీలో బాలయ్య మృతదేహాన్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, పొలం వద్దకు వెళ్లిన తండ్రి బాలయ్య రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో మరో కుమారుడు మల్లయ్య పొలం వద్దకు వెళ్లి వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న రక్తపు మరకలు, రామచంద్రి తెలిపిన వివరాలతో విచారణ చేపట్టారు. నిందితులు బీరయ్య, అంజి ఫోన్ లొకేషన్ ద్వారా వారు పట్టణంలోని జేపీనగర్ నుంచి కొట్రకు వెళ్లే దారిలో అనుమానంతో సంచరిస్తుండగా వారిని పట్టుకొని విచారించగా తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.విచారణలో విస్తుపోయే విషయాలుపోలీసుల విచారణలో తండ్రి బాలయ్యపై దాడి చేసి తానే హత్య చేశానని, మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లామని బీరయ్య ఒప్పుకున్నాడు. అనంతరం శరీరం నుంచి తలను చిన్న రంపంతో వేరుచేసి, మొండెంను వంగూర్ మండలం డిండిచింతపల్లి కాల్వలో, తలను డీఎల్ఐ కెనాల్లో పడేశానని తెలిపాడన్నారు. తలను వేరు చేసే సమయంలో బాలయ్య చెవికి ఉన్న బంగారు రింగులను రంపంతోనే కట్చేసి వారితో పాటుగా తీసుకెళ్లారు. ఈ వివరాలతో రెండు కాల్వల్లో గాలింపు చర్యలు చేపట్టి మొండెం, తలను స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. నిందితులు ఇద్దరిని కల్వకుర్తి జడ్జి ఎదుట హాజరుపర్చగా వారి ఆదేశానుసారంగా రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్రతో పాటుగా, రంపం, కారు, బైక్, బంగారు చెవిపోగులు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామన్నారు. హత్య కేసును చేదించిన కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, మహేష్, వెంకట్రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులకు నగదు రివార్డులను అందజేశారు. -
కల్లు ఇవ్వలేదని వివాహిత ఆత్మహత్య
వనపర్తి జిల్లా: కల్లు ఇవ్వలేదని వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. మండలంలోని రేమద్దులకు చెందిన భవానీ(26)కి మేనమామ అయిన మండ్ల రాములుతో 9ఏళ్ల కిందట వివాహమైంది. భవానీకి తరచుగా కల్లు తాగే అలవాటు ఉంది. అదేక్రమంలో ఆదివారం కల్లు తీసుకురావాలని భర్తకు చెప్పగా సాయంకాలం తీసుకొస్తానని చెప్పి భర్త కూలీ పనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. కల్లు తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి చూడగా.. ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్న భార్య శవాన్ని కిందకు దించాడు. భవానీకి రోజూ కల్లుతాగే అలవాటు ఉండటం, కల్లు తాగకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేదని, భర్త కల్లు తెచ్చి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది క్షణికావేశంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విశాఖ SR నగర్ లో దారుణం
-
విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
విశాఖపట్నం: విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికపై మద్యం మత్తులో మైనర్ మూగ బాలిక పై అత్యాచారంకి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు. ఎస్ఆర్నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్ళి మైనర్ మూగ బాలిక పై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. -
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
తమిళనాడులో షాకింగ్ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొడుకు పుట్టనో.. చెట్టునో పట్టుకుని ఉంటడు
రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వరి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కారి్మక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మీరట్లో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం.. అక్కడేం జరుగుతోంది?
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో "న్యూడ్ గ్యాంగ్" పేరుతో మహిళలపై దాడులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా దౌరాలా ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోకి కొందరు పురుషులు నగ్నంగా వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను పొలాల్లోకి లాక్కెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవల మీరట్లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్కు వెళ్తున్న సమయంలో ఓ ప్రాంతంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత మహిళ కేకలు వేయడంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలించినా ఫలితం లేదన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదంటూ బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇలాంటి ఘటనే ఎదురు కాగా, భయంతో బయటపెట్టలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్తులు తెలిపారు.కొంతమంది ఈ ఘటనలను వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్ను చూశామంటూ చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్ల సహాయంతో ఈ ప్రాంతాలను గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ వయసులో నీకిది అవసరమా..!
అమలాపురం రూరల్: భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్కవనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. -
పైలెట్ పాడుపని.. సిగరెట్ లైటర్ స్పై కెమెరాలతో..
ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ మోహిత్ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్స్కు వచ్చే యువతులను టార్గెట్ చేసిన మోహిత్.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ.. కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్ లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవల ఢిల్లీలోని కిషన్గఢ్ ప్రాంతంలోని శని బజార్లో మోహిత్ లైటర్తో మహిళల వీడియోలను రికార్డ్ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. -
లంచం తీసుకుంటూ.. ఎస్ఐ, పోలీసుల పరారీ
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది. పోక్సో కేసులో అనుకూలంగా చార్జ్షిట్ తయారు చేస్తామని, ఇందుకు రూ.70 వేలు ఇవ్వాలని దేవనహళ్లి పోలీస్స్టేషన్ మహిళా ఎస్సై జగదేవి, ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండు చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. అతని నుంచి రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్ అమరేశ్ పట్టుబడగా మరో కానిస్టేబుల్ మంజునాథ్, ఎస్సై జగదేవి ఇద్దరూ కాలికి బుద్ధిచెప్పారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఠాణాలో సోదాలు చేసి పలు రికార్డులను సీజ్ చేశారు. పరారైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. \లైన్మ్యాన్కు షాక్ మీటర్ మార్చడానికి రూ.10 వేలు లంచం డిమాండు చేసిన బెస్కాం లైన్మ్యాన్ లోకాయుక్తకు చిక్కిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా బేవూరు బెస్కాం సబ్ డివిజన్ లైన్మ్యాన్ రమేశ్ను హనుమంతయ్య అనే వ్యక్తి కలిసి ఇంటి పాత మీటర్ మార్చి కొత్త మీటర్ అమర్చాలని కోరాడు. ఇందుకు రూ.10వేలు లంచం అడిగాడు. ఆ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త సిబ్బంది దాడి చేసి రమేశ్ని పట్టుకున్నారు. -
వరుసకు అన్న చెల్లెలు అవుతారు..!
శివ్వంపేట(నర్సాపూర్): ప్రేమ విఫలమైందని ఓ యువతి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన యువతి సక్కుబాయి(21) ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నారాయణఖేడ్కు చెందిన సుధాకర్ అలియాస్ సిద్దును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను చెప్పింది. కుటుంబ సభ్యులు గోత్రాలు పరిశీలించగా.. వరుసకు అన్నా చెల్లెలు అవుతారని మందలించారు. ఆ తర్వాత పది రోజుల క్రితం ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా.. మళ్లీ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగింది. తొలుత నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి బహుదూర్పల్లిలోని ఎస్వీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. మృతిరాలు తండ్రి కేశ్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. -
ప్లీజ్ నాన్న.. చంపొద్దు..
నాగర్కర్నూల్ జిల్లా: తెలంగాణలో దారుణం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బైక్ నంబర్ ఆధారంగా వివరాల గుర్తింపు..ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా కోనేటీపూర్ టోల్ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
ఫోన్ స్విచ్ ఆఫ్.. మానస ఎక్కడికి వెళ్ళింది..!
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుల మానస(19) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో బుధవారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కాలేజీకి వెళ్లిన యువతి..పటాన్చెరు టౌన్: కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన లక్ష్మి కూతురు నవనీత (17) పటాన్చెరు డివిజన్ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో మంగళవారం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కూతురి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.అచ్చన్నపల్లిలో వ్యక్తి..టేక్మాల్(మెదక్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అచ్చన్నపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడ్డె సురేశ్ (26) అల్లాదుర్గం సర్కిల్ 108లో పని చేస్తున్నాడు. వారం క్రితం డ్యూటీ నిమిత్తం వెళ్లిన అతడు ఏడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మంగళవారం భార్య సునీత ఎక్కడికి వెళ్లావు, ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
ఏవండీ అతను లేకుండా ఉండలేను.. అతనే కావాలి..!
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధం వద్దని మందలించడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన ఓ మహిళ(28) అదే ఊరికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో భర్త ఈ నెల 1న సాయంత్రం భార్య కుటుంబీకులను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబీకులు తలుపులు తీసి చూడగా అప్ప టికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెదక్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.


