breaking news
Crime News
-
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
అసలేం జరిగిందంటే..? కూకట్ పల్లి ఘటనపై ACP క్లారిటీ
-
రషీద్ హత్య వెనుక లేడీ డాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు
గూడూరు రూరల్: పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కాగా, రషీద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టిడ్కో గృహాల కాలనీలో వ్యభిచారం, గంజాయి, సెటిల్మెంట్తో లేడీ డాన్గా వందన ఎదిగింది. వందన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడంతో రషీద్ హత్యకు గురైనట్లు సమాచారం. లేడీ డాన్ వందనతో పాటు ఆమె అనుచరులు వెంకీ, హన్షిద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాట్నాలో ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత దారుణ హత్య గురయ్యారు. రాజ్కుమార్ రాయ్ను దుండగులు కాల్చి చంపారు. బుధవారం రాత్రి పాట్నాలోని చిత్రగుప్త్ ప్రాంతంలోని మున్నాచక్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్కుమార్ రాయ్.. రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాయ్ భూమి కొనుగోలు, అమ్మకాల్లో వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
Kukatpally: బంగారం కోసం మహిళా దారుణ హత్య
-
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
భార్యను హతమార్చి.. దృశ్యం సినిమా
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పలుచోట్ల వైవాహిక సంబంధాలు పక్కదారులు పట్టి అవహేళనకు గురవుతున్నాయి. భార్య, లేదంటే భర్త పరాయి మోజులో పడి హత్యలకు వెనుకాడడం లేదు. ఇలా కుటుంబాలు వీధిన కూడా పడుతున్నాయి. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను హతమార్చిన లాయర్.. ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేసుకున్నాడు. దృశ్యం సినిమాను తలపించే ఈ హత్యోదంతం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉగార్ బీకే గ్రామంలో చోటుచేసుకుంది. చైతాలి (23)ని ఆమె భర్త ప్రదీప్ (28) హత్య చేశాడు. కారు యాక్సిడెంట్ అని.. జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ తెలిపిన వివరాల మేరకు... 7వ తేదీ రాత్రి ప్రదీప్ కాగవాడ పోలీస్స్టేషన్కి ఫోన్ చేసి తమ కారుకు యాక్సిడెంట్ జరిగిందని, భార్య చైతాలి చావుబతుకుల మధ్య ఉందని, వెంటనే రావాలని, భార్యను కాగవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్తున్నానంటూ చెప్పాడు. పోలీసులు ఆ ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ప్రదీప్కి ఫోన్ చేయగా తన భార్యను మహారాష్టలోని మీరజ్ ఆస్పత్రికి తీసుకువచ్చానని, అయితే చనిపోయిందని చెప్పాడు. అందరికీ అదే మాట చెప్పసాగాడు. అతని తీరు మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రమాదస్థలికి వెళ్లి చూడగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. ప్రియురాలి కోసమే దీంతో పోలీసులు ప్రదీప్, అతని మిత్రులు సద్దాం అక్బర్ ఇమాందార్, రాజన్ గణపతి కాంబ్లేను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కారు. ప్రదీప్, చైతాలిది ప్రేమ వివాహం. అయితే ప్రదీప్కి ఇటీవల మరో యువతితో çసంబంధం ఏర్పడింది. భార్య చైతాలిని అడ్డు తొలగించుకోవాలని కారులో తీసికెళ్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు స్నేహితులు సహకరించారు. తరువాత మృతదేహాన్ని తరలించి యాక్సిడెంట్ అని ప్రచారం చేశారు. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. -
కూకట్ పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ దారుణ హత్య
-
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం.. భర్త మర్మాంగాలపై దాడి చేసిన భార్య..!
సాక్షి, బళ్లారి/ రాయచూరు రూరల్: పరాయి మగవాని మోజులో మునిగిపోయి, భర్తను అంతమొందించడానికి ఆమె రాక్షసిగా మారింది. గొంతు పిసికి, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించింది, అయితే భర్త తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునందకు సిద్దప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంతోషానికి బీరప్ప అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ అనుకున్నారు. దీంతో ఏకంగా హత్య చేయాలని కుట్ర చేశారు. సోమవారం రాత్రి బీరప్ప నిద్రపోతుండగా.. సునంద భర్త ఎద మీద కూర్చుని గొంతు నులమడంతో పాటు మర్మాంగాలపై కొట్టి ప్రాణాలు తీయాలని చూసింది. సిద్దప్ప కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. అయితే బీరప్ప మేలుకుని కాళ్లతో ఎయిర్కూలర్ని గట్టిగా కొడుతూ కేకలు వేశాడు. ఇంటి యజమాని, బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు తలుపులు తెరవడంతో సునంద అఘాయిత్యం బయటపడింది. బీరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సునందతో పాటు ప్రియుడు సిద్దప్పను ఇండి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
తండ్రి తల నరికి వాగులో పారేసిన కొడుకు
కల్వకుర్తి టౌన్: మూఢనమ్మకాల అనుమానంతోనే కన్నతండ్రిని హత్య చేయాలని కుమారుడు పథకం రచించాడని.. ఈ ప్రణాళికలో భాగంగానే పొలం వద్ద పంచాయితీ పెట్టుకొని హత్య చేశాడని.. అనంతరం తల, మొండెంను వేరుచేసి డిండిచింతపల్లి, డీఎల్ఐ కాల్వలో పారవేశారని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన ఆదివారం కల్వకుర్తిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య (70)కు ముగ్గురు కుమారులు ఉండగా.. ఇందులో ఒకరు గతంలో చనిపోయారు. మిగిలిన ఇద్దరిలో చిన్న కుమారుడు బీరయ్య. అయితే, బీరయ్యకు ఒక కుమార్తె ఉండగా.. మూడు నెలల క్రితం బాలిక ఆత్మహత్య చేసుకుంది. నాటి నుంచి బాలిక తండ్రి బీరయ్య నిత్యం ఆలోచనలో ఉంటూ.. కూతురి మృతికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. ఈక్రమంలో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లిన బీరయ్యకు నీ కూతురి మృతికి నీ తండ్రి బాలయ్యనే కారణమని చెప్పాడు. దీంతో నాటి నుంచి తండ్రిపై పగ పెంచుకున్నాడు బీరయ్య ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన పొలం వద్ద పశువులను మేపుకుంటూ ఉన్న తండ్రి బాలయ్య గొడవకు దిగాడు. పంచాయితీ కాస్త పెద్దగా కావడంతో అక్కడే ఉన్న కర్రతో తండ్రి బాలయ్య తలపై కుమారుడు బీరయ్య విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాలయ్య స్పృహతప్పి పడిపోయాడు. ఇదే అదునుగా అతన్ని చనిపోయే వరకు దాడిచేశాడు. ఈ దాడిని బాలయ్య వద్ద పనిచేసే రామచంద్రి చూడగా, అతని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తా అనడంతో అతడు అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. హత్యకు ముందు నుంచే ప్రణాళిక.. ఇదిలాఉండగా, తండ్రి బాలయ్యని ఎలాగైనా చంపాలని బీరయ్య ముందే పక్కా ప్రణాళిక వేశాడు. గొడవ చోటుచేసుకోవడంతో ఇదే అదునుగా హత్య చేశాడు. అయితే, వరుసకు మేనల్లుడు అయిన వంగూర్ మండలం రంగాపూర్కు చెందిన అంజికి బీరయ్య విషయాన్ని అంతా ఫోన్ ద్వారా వివరించాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత అంజి అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతని కారు డిక్కీలో బాలయ్య మృతదేహాన్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, పొలం వద్దకు వెళ్లిన తండ్రి బాలయ్య రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో మరో కుమారుడు మల్లయ్య పొలం వద్దకు వెళ్లి వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న రక్తపు మరకలు, రామచంద్రి తెలిపిన వివరాలతో విచారణ చేపట్టారు. నిందితులు బీరయ్య, అంజి ఫోన్ లొకేషన్ ద్వారా వారు పట్టణంలోని జేపీనగర్ నుంచి కొట్రకు వెళ్లే దారిలో అనుమానంతో సంచరిస్తుండగా వారిని పట్టుకొని విచారించగా తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.విచారణలో విస్తుపోయే విషయాలుపోలీసుల విచారణలో తండ్రి బాలయ్యపై దాడి చేసి తానే హత్య చేశానని, మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లామని బీరయ్య ఒప్పుకున్నాడు. అనంతరం శరీరం నుంచి తలను చిన్న రంపంతో వేరుచేసి, మొండెంను వంగూర్ మండలం డిండిచింతపల్లి కాల్వలో, తలను డీఎల్ఐ కెనాల్లో పడేశానని తెలిపాడన్నారు. తలను వేరు చేసే సమయంలో బాలయ్య చెవికి ఉన్న బంగారు రింగులను రంపంతోనే కట్చేసి వారితో పాటుగా తీసుకెళ్లారు. ఈ వివరాలతో రెండు కాల్వల్లో గాలింపు చర్యలు చేపట్టి మొండెం, తలను స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. నిందితులు ఇద్దరిని కల్వకుర్తి జడ్జి ఎదుట హాజరుపర్చగా వారి ఆదేశానుసారంగా రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్రతో పాటుగా, రంపం, కారు, బైక్, బంగారు చెవిపోగులు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామన్నారు. హత్య కేసును చేదించిన కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, మహేష్, వెంకట్రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులకు నగదు రివార్డులను అందజేశారు. -
కల్లు ఇవ్వలేదని వివాహిత ఆత్మహత్య
వనపర్తి జిల్లా: కల్లు ఇవ్వలేదని వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. మండలంలోని రేమద్దులకు చెందిన భవానీ(26)కి మేనమామ అయిన మండ్ల రాములుతో 9ఏళ్ల కిందట వివాహమైంది. భవానీకి తరచుగా కల్లు తాగే అలవాటు ఉంది. అదేక్రమంలో ఆదివారం కల్లు తీసుకురావాలని భర్తకు చెప్పగా సాయంకాలం తీసుకొస్తానని చెప్పి భర్త కూలీ పనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. కల్లు తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి చూడగా.. ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్న భార్య శవాన్ని కిందకు దించాడు. భవానీకి రోజూ కల్లుతాగే అలవాటు ఉండటం, కల్లు తాగకపోతే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేదని, భర్త కల్లు తెచ్చి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది క్షణికావేశంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విశాఖ SR నగర్ లో దారుణం
-
విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
విశాఖపట్నం: విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికపై మద్యం మత్తులో మైనర్ మూగ బాలిక పై అత్యాచారంకి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు. ఎస్ఆర్నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్ళి మైనర్ మూగ బాలిక పై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. -
17 ఏళ్ల కుర్రాడితో ఆ సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే?
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లాలోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళ(30), యువకుడి(17)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక అదృశ్యమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళకు, పొరుగున ఉండే యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.కాగా, వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఇంటికి వచ్చిన ఆ బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఆ బాలికను బెదిరించారు. తన తండ్రికి చెబుతానంటూ ఆ చిన్నారి హెచ్చరించింది. దీంతో ఆ మహిళ, యువకుడు కలిసి ఆ బాలిక మెడకు గుడ్డ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేసి బావిలో పడేశారు. మహిళ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆ మహిళ చేతిపై కొరికిన గాట్లు కనిపించాయి. చిన్నారి తనను రక్షించుకునే ప్రయత్నంలో కొరికినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
తమిళనాడులో షాకింగ్ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొడుకు పుట్టనో.. చెట్టునో పట్టుకుని ఉంటడు
రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వరి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కారి్మక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మీరట్లో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం.. అక్కడేం జరుగుతోంది?
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో "న్యూడ్ గ్యాంగ్" పేరుతో మహిళలపై దాడులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా దౌరాలా ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోకి కొందరు పురుషులు నగ్నంగా వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను పొలాల్లోకి లాక్కెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవల మీరట్లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్కు వెళ్తున్న సమయంలో ఓ ప్రాంతంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత మహిళ కేకలు వేయడంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలించినా ఫలితం లేదన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదంటూ బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇలాంటి ఘటనే ఎదురు కాగా, భయంతో బయటపెట్టలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్తులు తెలిపారు.కొంతమంది ఈ ఘటనలను వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్ను చూశామంటూ చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్ల సహాయంతో ఈ ప్రాంతాలను గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ వయసులో నీకిది అవసరమా..!
అమలాపురం రూరల్: భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్కవనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. -
పైలెట్ పాడుపని.. సిగరెట్ లైటర్ స్పై కెమెరాలతో..
ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ మోహిత్ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్స్కు వచ్చే యువతులను టార్గెట్ చేసిన మోహిత్.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ.. కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్ లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవల ఢిల్లీలోని కిషన్గఢ్ ప్రాంతంలోని శని బజార్లో మోహిత్ లైటర్తో మహిళల వీడియోలను రికార్డ్ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. -
లంచం తీసుకుంటూ.. ఎస్ఐ, పోలీసుల పరారీ
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది. పోక్సో కేసులో అనుకూలంగా చార్జ్షిట్ తయారు చేస్తామని, ఇందుకు రూ.70 వేలు ఇవ్వాలని దేవనహళ్లి పోలీస్స్టేషన్ మహిళా ఎస్సై జగదేవి, ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండు చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. అతని నుంచి రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్ అమరేశ్ పట్టుబడగా మరో కానిస్టేబుల్ మంజునాథ్, ఎస్సై జగదేవి ఇద్దరూ కాలికి బుద్ధిచెప్పారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఠాణాలో సోదాలు చేసి పలు రికార్డులను సీజ్ చేశారు. పరారైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. \లైన్మ్యాన్కు షాక్ మీటర్ మార్చడానికి రూ.10 వేలు లంచం డిమాండు చేసిన బెస్కాం లైన్మ్యాన్ లోకాయుక్తకు చిక్కిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా బేవూరు బెస్కాం సబ్ డివిజన్ లైన్మ్యాన్ రమేశ్ను హనుమంతయ్య అనే వ్యక్తి కలిసి ఇంటి పాత మీటర్ మార్చి కొత్త మీటర్ అమర్చాలని కోరాడు. ఇందుకు రూ.10వేలు లంచం అడిగాడు. ఆ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త సిబ్బంది దాడి చేసి రమేశ్ని పట్టుకున్నారు. -
వరుసకు అన్న చెల్లెలు అవుతారు..!
శివ్వంపేట(నర్సాపూర్): ప్రేమ విఫలమైందని ఓ యువతి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన యువతి సక్కుబాయి(21) ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నారాయణఖేడ్కు చెందిన సుధాకర్ అలియాస్ సిద్దును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను చెప్పింది. కుటుంబ సభ్యులు గోత్రాలు పరిశీలించగా.. వరుసకు అన్నా చెల్లెలు అవుతారని మందలించారు. ఆ తర్వాత పది రోజుల క్రితం ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా.. మళ్లీ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగింది. తొలుత నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి బహుదూర్పల్లిలోని ఎస్వీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. మృతిరాలు తండ్రి కేశ్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. -
ప్లీజ్ నాన్న.. చంపొద్దు..
నాగర్కర్నూల్ జిల్లా: తెలంగాణలో దారుణం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బైక్ నంబర్ ఆధారంగా వివరాల గుర్తింపు..ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా కోనేటీపూర్ టోల్ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
ఫోన్ స్విచ్ ఆఫ్.. మానస ఎక్కడికి వెళ్ళింది..!
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుల మానస(19) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో బుధవారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కాలేజీకి వెళ్లిన యువతి..పటాన్చెరు టౌన్: కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన లక్ష్మి కూతురు నవనీత (17) పటాన్చెరు డివిజన్ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో మంగళవారం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కూతురి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.అచ్చన్నపల్లిలో వ్యక్తి..టేక్మాల్(మెదక్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అచ్చన్నపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడ్డె సురేశ్ (26) అల్లాదుర్గం సర్కిల్ 108లో పని చేస్తున్నాడు. వారం క్రితం డ్యూటీ నిమిత్తం వెళ్లిన అతడు ఏడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మంగళవారం భార్య సునీత ఎక్కడికి వెళ్లావు, ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. -
ఏవండీ అతను లేకుండా ఉండలేను.. అతనే కావాలి..!
హవేళిఘణాపూర్(మెదక్): వివాహేతర సంబంధం వద్దని మందలించడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఈ ఘటన బుధవారం మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన ఓ మహిళ(28) అదే ఊరికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో భర్త ఈ నెల 1న సాయంత్రం భార్య కుటుంబీకులను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబీకులు తలుపులు తీసి చూడగా అప్ప టికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెదక్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
స్కూల్ బస్సు కింద నలిగి.. నల్లగొండ టౌన్లో విషాదం
సాక్షి, నల్గొండ: పట్టణంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సును రివర్స్ చేస్తుండగా.. డ్రైవర్ చిన్నారిని గమనించుకోలేదని తేలింది. మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..
కాకినాడ రూరల్: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది.చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆస్తి కోసం.. తండ్రి వీడియోలు వైరల్
కర్ణాటక: ఆస్తి కోసం సొంత కుమారుడే తండ్రిని అశ్లీల చిత్రాలతో బ్లాక్మెయిల్ చేసిన ఘటన జిల్లాలోని మద్దూరులో జరిగింది. వివరాలు.. మద్దూరులో రాణి ఐశ్వర్య డెవలపర్స్ పేరిట హెచ్ఎల్ సతీష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను గడించారు. అందులో రూ.6 కోట్ల ఆస్తులను సతీష్ తన కుమారుడు ప్రణామ్ సతీష్ పేరిట రాశారు. అయితే జూదం, సినిమా పిచ్చి పట్టిన కుమారుడు రూ.2 కోట్ల ఆస్తులను నాశనం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి సతీష్ మిగతా ఆస్తులను అమ్మకుండా స్టే తెచ్చాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ప్రణామ్ తనకు తెలిసిన వళగెరెహళ్లి గ్రామానికి చెందిన మహేష్ అలియాస్ గుండ, మద్దూరు హళే ఒక్కలిగర వీధి ఈశ్వర్, ఆనెదొడ్డి గ్రామానికి చెందిన ప్రీతమ్లతో కలిసి కుట్ర చేశాడు. తండ్రి, ఓ మహిళ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు, సంభాషణలను సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ప్రణామ్తో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
అమ్మాయి కాదు ఆంటీ!
వివాహేతర సంబంధాలు, వాటికి అనుబంధంగా కొనసాగుతున్న హత్యల్లో చాలావరకు సోషల్ మీడియా లింకులు కూడా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం.. ఈ తరహా నేరాల్లోని మరో కోణాన్ని బయటపెట్టింది.ఓ ఆంటీ(52) ఇన్స్టాగ్రామ్కు అడిక్ట్ అయ్యింది. ఫాలోవర్స్ను పెంచుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేసేది. ఫిల్టర్లను ఉపయోగిస్తూ అమ్మాయిలా ఫోజు ఇస్తూ రీల్స్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె వయసులో సగం ఉన్న ఓ కుర్రాడు.. ఆ రీల్స్కు లైకులు, కామెంట్లు పెట్టాడు. మెల్లిగా వ్యవహారం ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్కు షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ..ఉత్తర ప్రదేశ్ మెయిన్పురిలో కిందటి నెల 11వ తేదీన గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిస్టరీగా మారిన ఆ కేసును ఎట్టకేలకు చేధించినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మృతురాలిని ఫర్రూఖాబాద్ జిల్లా రాణి(52)గా గుర్తించిన పోలీసులు.. ఆమె సోషల్ మీడియా ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.మెయిన్పురికి చెందిన అరుణ్ రాజ్పుత్(26).. రాణితో ఏడాదిన్నర కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య చాలాకాలం చాటింగ్, కాల్స్ వ్యవహారం నడిచాయి. అయితే నేరుగా కలిశాక ఆమె తనను మోసం చేసిందని.. తన కంటే వయసులో చాలా పెద్దదని గ్రహించాడు. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆమె అతనికి బోలెడంత డబ్బు(లక్షన్నర రూపాయలకు పైనే) సమర్పించుకుంది.అరుణ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని.. తన డబ్బుతిరిగి ఇచ్చేయాలని, లేకుంటే తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన కంటే రెట్టింపు వయసు, పైగా నలుగురు పిల్లలున్న ఆవిడను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని అరుణ్ భావించాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమెను మెయిన్పురికి రప్పించాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. గొంతుకు ఆమె చున్నీనే బిగించి హత్య చేశాడు. కేసులో ఎలాంటి క్లూలు లేకపోవడంతో.. మిస్సింగ్ కేసులతో సరిపోల్చుకున్న పోలీసులు చివరకు కేసును చేధించగలిగారు. పెళ్లి చేసుకోకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తుందేమోనని భయపడ్డానని..ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె ఫోన్ను దాచేశానని అరుణ్ పోలీసుల వద్ద నేరాన్ని ఒప్పుకున్నాడు. -
‘అదంతా ఫేక్’.. షీనా బోరా కేసులో కీలక మలుపు
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూతురు విద్ది ముఖర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. సీబీఐ ఛార్జ్షీట్లో తన పేరుతో ఉన్న స్టేట్మెంట్లు తనవి కాదని.. అవి నకిలీవని పేర్కొన్నారు. దీంతో ప్రాసిక్యూషన్కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూతురే విద్ధి ముఖర్జీ. మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి జేపీ దరేకర్ ఎదుట సాక్ష్యాన్ని నమోదు చేసే క్రమంలో ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ఏ దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలం నమోదు చేయలేదని, తన పేరిట నమోదైన ప్రకటనలు నకిలీవని అన్నారామె. ఇంద్రాణీ అరెస్టు తర్వాత.. పీటర్ ముఖర్జీ, ఆయన కుటుంబ సభ్యులు ఆమె ఆస్తులపై గొడవపడినట్టు విద్ది తెలిపారు. పీటర్ కొడుకులు రాహుల్, రబిన్లు ఇంద్రాణికి చెందిన కోట్ల విలువైన ఆభరణాలను, రూ.7 కోట్ల నగదు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఇంద్రాణి వాడిన పర్ఫ్యూమ్లు, బ్యాగులు, చీరల కోసం కూడా కొట్టుకున్నారని తెలిపారు. దీంతో తన తల్లి దగ్గర చిల్లిగవ్వ లేకుండా అయ్యిందని వాపోయారామె. అంతేకాదు.. ఆస్తులను ఎక్కడ అప్పగించాల్సి వస్తుందోనని ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఇంద్రాణి ముఖర్జీని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారామె. తన తల్లి అరెస్ట్ అయిన సమయంలో తాను మైనర్గా ఉన్నానని, ఆ సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని విద్ధి ప్రత్యేక న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసు విచారణలో ముంబై పోలీసులు తొలుత తనను సంప్రదించారని, ఆ తర్వాత సీబీఐ తనను ప్రశ్నించాలనుకుందని తెలిపారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని విద్ధి తెలిపారు. అయితే.. పోలీసులుగానీ, సీబీఐగానీ తన స్టేట్మెంట్ను ఎక్కడా అధికారికంగా నమోదు చేయలేదని అన్నారామె. అలాగే..సీబీఐ కార్యాలయంలో తనను ఖాళీ పత్రాలపై, కొన్ని ఈమెయిల్ ప్రతులపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని, ఛార్జ్షీట్లో ఉన్న ప్రకటనలు తనవిగా చూపించడంలో దురుద్దేశం కనిపిస్తోందని అన్నారామె. తన తల్లిదండ్రుల్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. బోరాను తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ సోదరిగానే ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకానొక టైంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎప్పుడైతే పీటర్ ముఖర్జీ పెద్ద కొడుకు రాహుల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. అతను తరచూ సెంట్రల్ ముంబై వోర్లీలో ఉన్న బోరా ప్లాట్కు వెళ్లడం ప్రారంభించాడో.. అప్పటి నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. రాహుల్, షీనాకు సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు.. డ్రగ్స్ అలవాటు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. చివరిసారిగా.. బోరాను 2011లో గోవాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చూశాను. కానీ, 2013 దాకా ఆమె ఈమెయిల్స్తో టచ్లో ఉండేది అని విద్ధీ కోర్టుకు తెలిపింది. 2015 ఆగస్టులో తన తల్లి అరెస్ట్ అయ్యేదాకా అంతా బాగానే ఉండేది. ఆ టైంలో పీటర్ కొడుకులు రాహుల్ ఏ పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. రాహుల్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే డబ్బు కోసం వాళ్లిద్దరూ తెగించారు. పీటర్ ముఖర్జీ అరెస్ట్ కంటే ముందే వాళ్లిద్దరూ ఇంద్రాణికి చెందిన నగలు దొంగిలించారు. వాటిని కొత్తగా ఓ బ్యాంక్ లాకర్ తెరిచి దాచారని అన్నారామె. తద్వారా వాళ్లిద్దరూ ఇంద్రాణిని కావానే ఇరికించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. తల్లి కావాలా? ముఖర్జీ వారసత్వం కావాలా? ఎంచుకోవాలని రబిన్ తనను బెదిరించాడని, ఒకవేళ తల్లి వైపు నిలవడితే ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుందని బెదిరించాడని కోర్టుకు తెలిపింది. బుధవారం కూడా విద్ధి సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయాల్సి ఉంది. షీనా బోరా.. ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మొదటి భర్త సిద్దార్థ్ దాస్లకు పుట్టిన సంతానం. 2012లో షీనా బోరా అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. అయితే ఆమె అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిందని ఇంద్రాణీ అందరికీ చెబుతూ వచ్చింది. 2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ఓ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించే క్రమంలో.. షీనా బోరా హత్య కేసు బయటకు వచ్చింది. ఈ కేసులో ఇంద్రాణీ, ఆమె మాజీ భర్తలు, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీలను పోలీసులు అరెస్ట్ చేసింది. ఇంద్రాణీ, సంజీవ్, డ్రైవర్ శ్యామ్వర్లు షీనాను కారులో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. హత్య అనంతరం ఆమె శరీరాన్ని రాయగడ్ అడవిలో తగలబెట్టి పారేసినట్టు ఆరోపణ ఉంది. అంతేకాదు.. షీనా మరణించాక కూడా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె పేరిట అందరికీ మెయిల్స్ పంపిందని అంటోంది. ఈ కేసులో పీటర్, సంజీవ్లకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఆరున్నరేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. 2022 మే 18న ముంబై బైకులా మహిళా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. -
లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడి.. అసభ్యంగా ప్రవర్తించి..
బహిరంగ ప్రదేశాల్లో వరుస లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తున్న బెంగళూరులో.. మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి చొరబడి ఒకరితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చోరీ సైతం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సుద్దగుంటేపాళ్య పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆగంతకుడు పీజీలోకి ప్రవేశించి.. నిద్రిస్తున్న మహిళను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మెలుకువ వచ్చి గట్టిగా అరిచింది. అయితే కంగారుపడ్డ ఆ వ్యక్తి.. ఆమె బ్యాగ్ నుంచి నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో.. ఆమె అతన్ని వెంబడిస్తూ కేకలేస్తూ బయటకు పరుగులు తీసింది. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై సుద్దగుంటేపాళ్య పీఎస్లో కేసు నమోదు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడు దర్జాగా పీజీలోకి చొరబడిన దృశ్యాలు, అలాగే పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. బెంగళూరులో పీజీలు, లేడీస్ హాస్టల్స్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేయించాలని నిర్వాహకులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో బెంగళూరులో ఓ దారుణం జరిగింది. పీజీ నిర్వాహకుడు ఒకడు.. ఓ కాలేజీ యువతిపై అత్యాచారం చేశాడు. బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యాం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
కూతురిని కడతేర్చిన తండ్రి
సాక్షి, బళ్లారి: పరువు పేరిట కన్న తండ్రే హంతకుడయ్యాడు, వేరే కులానికి చెందిన యువకున్ని ప్రేమించిందని ఓ కిరాతకుడు కూతురిని హతమార్చిన ఘటన కలబుర్గి జిల్లాలో జరిగింది. మేళకుంద గ్రామానికి చెందిన కవిత కొల్లూరు (19) అగ్రవర్ణ యువతి, అదే గ్రామానికి చెందిన మాళప్ప పూజారి అనే బీసీ కులానికి చెందిన యువకున్ని ప్రేమించింది. అతడు ఆటోడ్రైవర్గా పనిచేసేవాడు. వద్దని తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించినా కవిత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. పురుగుల ముందు పోసి.. ఆక్రోశంతో రగిలిపోయిన తండ్రి శంకర్.. బుధవారంనాడు కూతురిపై దాడి చేసి గొంతు పిసికి ప్రాణాలు తీశాడు. నోట్లోకి పురుగుల మందును పోసి.. ఆత్మహత్య చేసుకుందని కట్టుకథ అల్లారు. తరువాత అంత్యక్రియల పేరుతో మృతదేహాన్ని కాలి్చవేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సమగ్ర తనిఖీ చేయగా కూతురిని తండ్రితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు తేలింది. శుక్రవారంనాడు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
నన్ను క్షమించండి..
కాకినాడ జిల్లా: మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడు కష్టపడి ఉన్నత చదువులు చదివాడు. అధ్యాపకుడిగా జీవితంలో స్థిరపడ్డాడు. అయితే కుటుంబ కలహాలు, కూటమి నేతల ఒత్తిడి మేరకు పోలీసుల చేసిన కౌన్సెలింగ్తో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తొండంగి మండలం రావికంపాడుకు చెందిన మట్ల గంగారావు, గంగమ్మ దంపతుల కుమారుడు మట్ల శ్రీనివాస్ (35) జేఎన్టీయూకేలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతడికి సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, భార్య దివ్యతో కలిసి కాకినాడలో నివాసం ఉంటున్నాడు. వీరికి గంగ సాన్విత, సాయి గంగాధర అవినాష్ అనే పిల్లలు ఉన్నారు. కాగా.. కొంత కాలంగా శ్రీనివాస్కు అతడి భార్యతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె తన బంధువులైన కూటమి నేతల ఒత్తిడితో నాలుగు రోజుల క్రితం అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.మనస్తాపంతో..ఈ ఘటనతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ శుక్రవారం తన స్వగ్రామమైన రావికంపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి స్థానిక రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తన ఆత్మహత్యకు వీరే కారణమంటూ కొందరి పేర్లను ప్రస్తావించాడు. అలాగే నన్ను క్షమించండి అంటూ పిల్లల పేర్లు, అమ్మ నాన్న అని టైప్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. కాగా.. రైల్వేట్రాక్పై శ్రీనివాస్ మృతదేహాన్ని శనివారం గుర్తించామని, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తుని రైల్వే ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి తండ్రి గంగారావు వికలాంగుడు, తల్లి కీళ్ల వ్యాధితో నడవలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో కుమారుడిని పోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఒడిదుడుకులు తట్టుకోలేక.. ఒకరినొకరు పొడుచుకుని..
హైదరబాద్: ఆ భార్యాభర్తలు ఒకరికొకరు తోడు.. నీడగా జీవనం సాగించాలనుకున్నారు.కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని భావించారు. అయితే వారిని ఆరి్థక ఇబ్బందులు వెంటాడాయి. అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రాణం తీసుకోవాలని భావించారు. ఎలా మృతి చెందాలో అర్థం కాలేదు. ప్రాణం తీసుకునే ధైర్యం లేకో.. ఏమో..ఒకరిని ఒకరు కత్తితో పొడుచుకొని చావాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల పాటు ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. ఈ క్రమంలో భర్త మరణించగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (45), రమ్యకృష్ణ(38)లు కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుండగా భార్య గృహిణి. గతంలో నిర్వహించిన వ్యాపారాల్లో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు గాయపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నాలుగు రోజులుగా ఒకరిని ఒకరు ఉదరభాగం, మణికట్టు, గొంతుపై గాయపరుచుకున్నారు. ఉదర భాగంలో తీవ్ర రక్తస్రావమై రామకృష్ణ శుక్రవారం మృతి చెందగా, రమ్యకృష్ణ తీవ్రంగా గాయపడింది.శనివారం ఉదయం రమ్యకృష్ణ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. కేపీహెచ్బీ పోలీసులు వెళ్లి చూడగా రామకృష్ణ మృతి చెందినట్లు గమనించారు. రమ్యకృష్ణ సోఫాలో కూర్చుని ఉంది. వెంటనే ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సెక్టార్ ఎస్ఐ శ్రీలతా రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు నెలల క్రితమే... వీరు మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నట్లు రమ్యకృష్ణ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం రామకృష్ణ బలమైన గాయం చేయాలని రమ్యకృష్ణపై ఒత్తిడి చేయడంతోపాటు తనను తాను గాయపరుచుకునేందుకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో రామకృష్ణ మృతి చెందాడు. బెడ్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఇదిలా ఉండగా పోలీసులు వచ్చే వరకు అపార్టుమెంట్లో ఏ ఒక్కరికి కూడా విషయం తెలియకపోవడం, కత్తితో తీవ్రంగా గాయాలు చేసుకున్నప్పటికి ఎవరూ అరవకపోవడం గమనార్హం. సూసైడ్ నోట్ రాసి... అవమానాలు భరించలేకపోతున్నాం... ఈ లోకంలో ఉండలేకపోతున్నాం. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం అని రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు రామకృష్ణ గదిలో స్వాధీనం చేసుకున్నారు. పదిహేను రోజుల క్రితం రాసిన ఈ లేఖలో ఆర్థికం ఇబ్బందులుతో పాటు చేతి బదులుగా డబ్బులు ఇచ్చిన వారు తీర్చేందుకు సమయం ఇవ్వకపోవడం అవమానించడం వంటి వివరాలను రాసినట్లుగా ఉంది. -
ప్రియుడి మోజులో భర్తను అంతమొందించింది
చైతన్యపురి: ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జెల్లెల శేఖర్ (40) భార్య చిట్టితో కలిసి దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్ కాలనీ రోడ్ నంబర్–7లో నివసిస్తున్నాడు. 16 ఏళ్లక్రితం వీరికి వివాహం కాగా ఓ కొడుకు, కూతురు ఉన్నారు. శేఖర్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చిట్టి 100కు డయల్ చేసి తన భర్త నిద్రలో చనిపోయాడని సమాచారం ఇవ్వగా ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా పెదాలపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హతమార్చినట్లు ఒప్పకుంది. స్థానికంగా ఉండే హరీష్తో చిట్టి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో శేఖర్ పలుమార్లు మందలించాడు. ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలకున్నారు. గురువారం రాత్రి శేఖర్ నిద్రించిన తర్వాత హరీష్ గొంతుపట్టుకోగా డంబెల్స్తో చిట్టి దాడి చేసినట్లు తెలుస్తుంది -
హైదరాబాద్లో మరో దారుణం.. లవర్తో కలిసి భర్తను చంపేసింది
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హతమార్చింది. కోదండరాంనగర్ రోడ్డు నెం.7లో ఈ ఘటన జరిగింది. మృతుడు జెల్లెల శేఖర్ (40)గా పోలీసులు గుర్తించారు. భార్య చిట్టి(33)ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. శేఖర్ మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలించారు.భర్తను చంపిన తర్వాత నిద్రలోనే చనిపోయాడంటూ 100 నంబర్కు భార్య డయల్ చేయగా.. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. మృతుడి భార్యను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. -
మట్టిగాజులు.. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు.. డ్రగ్స్ కేసులో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మధ్యలో హెరాయిన్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మట్టి గాజుల మాటున కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 10 కొరియర్ సంస్థల నుండి రెండేళ్లలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించినట్టు పోలీసులు గుర్తించారు.కొరియర్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు గం జాయి రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీం రట్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ గంజాయి చేరవేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.జీడిమెట్లలోని సూరారంలో శివాలయం కాలనీలో నిర్వహించిన ఆపరేషన్లో ఈ డ్రగ్ రాకెట్లో కీలకంగా పనిచే స్తున్న నలుగురిని అరెస్టు చేసి.. 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. ఓ నైజీరియన్ తన నెట్వర్క్ ద్వారా ఢిల్లీ, బీదర్ నుంచి పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్ను హైదరాబాద్ కు చేరవేడయంతో పాటు స్థానికంగా ఉన్న పెడ్లర్ల ద్వారా మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.ఈ ఆపరేషన్లో మణిపూర్కు చెందిన నెవెల్ టాంగ్ బ్రామ్తో పాటు అంబటి గణేశ్, బూసా శివకుమార్, మహ్మద్ అషర్ జావేద్ ఖాన్ను అరెస్టు చేశారు. యూనివర్సిటీకి చెందిన 14 మం ది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మల్నాడు రెస్టారెంట్ కేసులో లింకులతో.. మల్నాడు రెస్టారెంట్ కేసు విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన శ్రీమారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేష్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ పేరిట రెండు పార్సిళ్లు డీటీడీసీ కొరియర్ సంస్థ ద్వారా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. ఆ పార్సిళ్లపై ఉన్న మొబైల్ నంబర్లు భారతీయ మొబైల్ నంబర్లుగానే ఉన్నా.. నైజీరియా నుంచి నిక్ అనే వ్యక్తి వాడుతున్నట్లు తేలింది. -
బిడ్డా నీ వెంటే నేను..
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన బాలిక మూడు రోజుల క్రితం మరణించగా.. బిడ్డా నీ వెంట నేనంటూ తండ్రి ఉరివేసుకొని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామానికి చెందిన బాలిక తనను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని లేఖరాసి, మనస్తాపానికి గురై సోమవారం చనిపోయింది. పోస్ట్మార్టం అనంతరం మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని స్వగ్రామంలో ఖననం చేశారు. ఒంటరిగా ఉంటున్న మృతురాలి తండ్రి తిరుపతి (42) అదేరోజు సాయంత్రం తన సొదరితో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు వెళ్లాడు. కూతురు చనిపోయిందన్న మనస్తాపంతో గురువారం ఉదయం ఇంట్లో లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షాలు తీవ్రంగా ఉండడంతో మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి ఇబ్బందికరంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య తన కొడుకుతో పాటు వేరుగా బెజ్జంకి మండలం చీలాపురంలో ఉంటోంది. కాగా.. తీపిరిశెట్టి తిరుపతి, మధుశాలిని నివసిస్తున్న రంగంపేటలోని ఇంటిని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై అశోక్ పరిశీలించారు. -
భర్త వేధింపులకు టెక్కీ బలి
కర్ణాటక: మహిళా ఐటీ ఇంజినీరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎస్జె పాళ్యలో నివాసం ఉంటున్న శిల్ప (26) ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ప్రవీణ్ చెబుతున్నాడు. సుద్దగుంటపాళ్యలోని నివాసంలో ఆమె ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. శిల్పాను ప్రవీణ్ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ వేధింపులు, చిత్రహింసలు కారణంగా ఇలా జరిగిందని వారు విలపించారు. శిల్ప ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్ పానీపూరి వ్యాపారం చేసేవాడని, అనుమానంతో నిత్యం వేధించేవాడని చెప్పారు. పెళ్లి సంబంధం సమయంలో తాను ఐటీ ఇంజినీరని అబద్ధాలు చెప్పాడని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా భర్త ప్రవీణ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
కన్న కొడుకులనే కడతేర్చింది..
గోల్కొండ: ఓ మహిళ తన ముగ్గురు కొడుకులను కడతేర్చిన సంఘటన సౌదీ అరేబియాలోని అల్కోబర్ నగరంలో చోటు చేసుకుంది. నిందితురాలు హైదరాబాద్ నగరానికి చెందినది కావడం గమనార్హం. వివరా లు ఇలా ఉన్నాయి... టోలిచౌకీకి చెందిన సయ్యదా ఉమేరా అమ్రీన్ భర్త సౌదీ అరేబియాలోని అల్కోబర్లో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం సయ్యదా ఉమేరా అమ్రీన్ తన ముగ్గురు కుమారులతో భర్త వద్దకు వెళ్లింది. మంగళవారం రాత్రి ఆమె తన కుమారులు యూసుఫ్ అహ్మద్(3), మహ్మద్ సాదిక్ అహ్మద్(6), మహ్మద్ ఆదిల్ అహ్మద్(6) ఇంట్లోని వాటర్ టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ఆత్మహత్యకు యతి్నంచింది. దీనిని గుర్తించిన ఆమె భర్త మహ్మద్ షానవాజ్ లేచి అమ్రీన్ను రక్షించాడు. బుధవారం ఉదయం స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు అమ్రీన్ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. కాగా ఆమెకు గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేనట్లు తెలిసింది. -
Nalgonda: రమేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
-
మహారాష్ట్రలో కుప్పకూలిన ‘అక్రమ భవనం’.. 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12.05 గంటల సమయంలో విజయ్ నగర్లోని రమాబాయి అపార్ట్మెంట్లో వెనక భాగం కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే కూలిన భవనం అక్రమ కట్టడమని విచారణలో తేలింది. దీంతో.. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు భవన నిర్మాణదారుడు నిటల్ గోపినాథ్ను అరెస్టు చేశారు. ల్యాండ్ ఓనర్ మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం. ఏడాది పుట్టినరోజు వేడుక చేసుకున్న నాడే.. ఘటనలో ఆరోహి జోయెల్(24), ఆమె ఏడాది చిన్నారి కన్నుమూశారు. భర్త ఓంకార్ జోయల్ జాడ ఇంకా తెలియరాలేదు. చిన్నారి ఏడాది పుట్టినరోజు కేక్ కట్టింగ్ వేడుక జరిపిన కొన్నిగంటలకే.. అదీ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన ఐదు నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఆ తల్లీకూతుళ్లు విగతజీవులయ్యారు. -
నమ్మించి.. ప్రాణం తీశారు!
గౌరీబిదనూరు (కర్ణాటక): ఇటీవల కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా పరిధిలో లభ్యమైన అపరిచిత మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. హతురాలిని హిందూపురం ప్రాంతానికి చెందిన అర్చనగా నిర్ధారించిన పోలీసులు ఆమెను హతమార్చిన ఓ యువకుడు, యువతిని అరెస్టు చేశారు. మంగళవారం గౌరీబిదనూరు తాలూకా మంచేనహళ్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను పోలీసులు వెల్లడించారు. హిందూపురం సమీపంలోని శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) క్యాటరింగ్ పని చేసేది. ఈ నెల 14న పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అర్చన భర్త ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.చున్నీతో గొంతు నులిమి..అర్చనకు కేటరింగ్ పనిలో బెంగళూరుకు చెందిన రాకేష్, అంజలితో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేష్కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని రాకేష్ పిలిపించుకున్నాడు. అనంతరం కారులో చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర, గౌరీబిదనూరు తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమె గొంతు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఓ వంతెన కింద పడేసి.. ఎవరూ గుర్తించకుండా బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించాడు. అనంతరం బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టి తన ఆటో రుణం కంతు చెల్లించాడు.పరారీలో డ్రైవర్, మరో యువతిఈ నెల 17న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ఫిర్యాదు మేరకు మంచేనహళ్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతరం హతురాలిని హిందూపురానికి చెందిన అర్చనగా నిర్ధారించారు. ఈ క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారు. ఆమెకు అందిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవం బయటపడింది. దీంతో రాకేష్తో పాటు అతనికి సాయపడిన అంజలిని మంగళవారం అరెస్ట్ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్ నవీన్, మరో నిందితురాలు నిహారిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కుమార్తెలు, మరిదే హంతకులు.. వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
సాక్షి, అనకాపల్లి: బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్ట్ 14 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు.. మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిళ సంతుగా గుర్తించారు.ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్యకు ప్లాన్ చేసిన కూతుర్లు.. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి టవల్తో మెడ బిగించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. డెడ్బాడీని కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాటజంగాలపాలెం దగ్గర ప్రెటోల్ పోసి తగలబెట్టారు. -
బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురిని నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు సిద్ధమైంది. బహదూర్పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్, గంజాయి దందా నడుస్తోంది. ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మణిపూర్కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్కు విక్రయిస్తున్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
సారీ నాన్నా.. నరేష్ను వదలిపెట్టకు.!
ఖమ్మం జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒంటరిగా వదిలేయడాన్ని తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రమ్య(20) వైజాగ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలు సోమవారం గ్రామంలో నిర్వహించగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన కొర్లపుడి బాసు కుమార్తె రమ్య(20), ఇదే గ్రామానికి చెందిన మేడ చిన్న బొందయ్య కుమారుడు నరేష్ ప్రేమించుకున్నారు. కులాలు వేర్వేరు కావడంతో కుటుంబాల్లో గొడవలు జరిగాయి. ఆపై రమ్య చదువు మానేసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోం చేస్తుండగా నరేష్ ఏడాది క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా రమ్యతో ప్రేమ కొనసాగిస్తూ 15 రోజుల క్రితం ఆమెను వైజాగ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే తన కొడుకు కానరావడం లేదని నరేష్ తండ్రి చిన్న బొందయ్య ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ రమ్యను వదిలించుకోవాలని ఆమె వద్ద నగదు, నగలు, సెల్ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. దీంతో మోసపోయానని గమనించిన రమ్య వైజాగ్లోని అద్దె ఇంట్లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘నన్ను క్షమించండి.. నా చావుకు కారణం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి వెళ్లిపోయిన వాడి పేరు నరేష్. నా తల్లిదండ్రులకి, ఇక్కడి వాళ్లకు నా చావుకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న సారీ.. నాన్న వాడిని మాత్రం అసలు వదిలిపెట్టకు. తమ్ముడు జాగ్రత్త. నా కోసం ఆలోచించకండి. లవ్యూ నాన్న. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించావు. నీ లాంటి తండ్రి ఏ కూతురికి ఉండడు’ అంటూ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న వైజాగ్ టూటౌన్ పోలీసులు పోస్టుమార్టం చేసి రమ్య మృతదేహాన్ని ఎర్రగడ్డకు పంపించారు. ఈమేరకు నరేష్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆమె కుటుంబీకులు ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీష్తో పాటు కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి పోలీసులతో రమ్య అంత్యక్రియలు పూర్తయ్యే వరకు బందోబస్తు నిర్వహించారు. కాగా, నిందితుడు నరేష్ను వైజాగ్ పోలీసులకు అప్పగించారు. -
నీకు తెలిసి కూడా నా లవర్ని ఎలా ప్రేమిస్తున్నావు..!
అనంతపురం: ‘నువ్వే మా ప్రేమకు అడ్డు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు చనిపోవాల్సిందే’ అంటూ ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేమికులు ప్రేరేపించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి (21) అనంతపురంలోని నలంద డిగ్రీ కళాశాలలో యూజీ మూడో సంవత్సరం చదువుతోంది. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు దీపు రక్త పరీక్ష కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, మరో టెక్నీషియన్ అయిన యువతితో స్వాతి స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అరుణ్కుమార్, స్వాతి ప్రేమలో పడ్డారు. విషయం తెలుసుకున్న సదరు యువతి సోమవారం ఉదయం స్వాతికి ఫోన్ చేసి మందలించింది. ‘నా ప్రియుడిని ఎలా ప్రేమిస్తున్నావు.. మేమిద్దరమూ ముందు నుంచి ప్రేమలో ఉన్నాం. నీవు అడ్డు వస్తున్నావు. ఈ విషయం ల్యాబ్లో, మీ హాస్టల్లో అందరికీ చెబుతాను’ అని బెదిరించింది. అదే ధోరణిలో అరుణ్కుమార్ కూడా ఆ యువతికి వత్తాసు పలుకుతూ స్వాతిని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి... సోమవారం ఉదయం 7.30 గంటలకు తాను ఉంటున్న బాలాజీ లేడీస్ హాస్టల్లో గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి పూజారి నాగభూషణం ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆ కన్నీళ్లకు అంతుందా?
మల్కాపురం(విశాఖపట్నం): నగరాలవీధిలో నివసించే సత్యనాల శేఖర్, నారాయణమ్మ దంపతుల జీవితం ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో నిండి ఉండేది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. సమాజం ఆడపిల్లలను చూసే కోణాన్ని పక్కన పెట్టి, వారిని కుమారుల్లా పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువులు చదివించారు. వారి ఆశలన్నీ ఆ ఇద్దరు కుమార్తెల మీదే. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ , సీఐ ఫైనల్ ఇయర్. చిన్న కుమార్తె గాయిత్రీ మాధురి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇదిలావుండగా ఆరు నెలల క్రితం ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ స్నేహితులతో కలిసి యారాడ సముద్ర తీరానికి వెళ్లింది. సముద్రంలో గల్లంతై మృత్యువు ఒడిలోకి చేరుకుంది. కళ్ల ముందే మెరుస్తున్న దీపం ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ బాధను ఎలాగో దిగమింగుకుని.. చిన్న కుమార్తె గాయత్రి మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటూ జీవిస్తున్నారు. తమ ఆశలన్నీ ఆమె మీదే పెట్టుకున్నారు. కానీ విధి వారిని మళ్లీ క్రూరంగా చూసింది. మాధురికి పచ్చకామెర్లు వచ్చాయి. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తమ కళ్లెదుటే మెరుస్తున్న వెలుగు మళ్లీ ఆరిపోకూడదని ఆ భగవంతుడిని వేడుకున్నారు. ఆదివారం రాత్రి ఆ దేవుడు వారికి కడుపుకోత మిగిల్చాడు. మాధురి ప్రాణాలు కోల్పోయింది. కన్నవారి కన్నీళ్లకు అంతు లేకుండా పోయింది. కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు లేరు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ విషాదకర సంఘటనతో మల్కాపురం ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రుల కన్నీటి గాథ వింటున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. -
‘సమాజం కోసం రాజీ పడితే.. చివరికి మనిషే లేకుండా పోయింది’
న్యూఢిల్లీ: తన సోదరి నిక్కీ భాటి దారుణ హత్యకు గురి కావడంపై సోదరుడు రోహిత్ గుర్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి నిక్కీ భాటిని శాశ్వతంగా తిరిగి పుట్టింటికి తీసుకొచ్చినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నాడు. తన సోదరి నిక్కీ భాటి విషయంలో తాము రాజీ పడే బ్రతికామని, అందుకు ఇంతటి దారుణం జరిగిపోయిందన్నాడు. సమాజానికి జడిసి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడంలో వెనుకడుగు వేశామన్నాడు. సమాజంలో తమ పరువు పోతుందనే ఆలోచించాం కానీ సోదరీ పడే బాధను పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. ‘మేము మా సోదరీమణులు నిక్కీ, కాంచనాల కోసం రూ. 8 లక్షల ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాం. ఆ పార్లర్లు పెట్టించి సుమారు ఏడాదిన్నర అవుతుంది. బావలు విపిన్, రోహిత్ భాటిలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబానికి చిన్న కిరాణా దుకాణం మాత్రమే ఉంది. కానీ మా చెల్లెళ్లు వారి స్వయం శక్తితో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. భర్తల నుంచి ఎటువంటి నగదు అడగకుండానే కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మా చెల్లెళ్ల పార్లర్లను అత్త మామలు ధ్వంసం చేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోదరుడు గుర్జార్.భర్త విపిన్ భాటి బాధలు భరించలేక చాలాసార్లు తిరిగి పుట్టింటికి వచ్చేదని, కానీ వారు మళ్లీ బుజ్జగింపు మాటలు చెప్పి తిరిగి తీసుకెళ్లిపోయేవారని నిక్కీ భాటి కుటుంబం తెలిపింది. అతి దారుణంగా హత్య.. యూపీ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పరిధిలో సిర్సా గ్రామంలో విపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.మరో రూ. 35 లక్షలు కావాలని వేధింపులుమరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసి చివరికి అతి దారుణంగా ఒంటికి నిప్పంటించి హత్య చేశారు.యాసిడ్ పోసి లైటర్తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు -
రెండో భర్తతో కలిసి మొదటి భర్తను హత్య చేసిన భార్య
రంగారెడ్డి జిల్లా: అజీజ్నగర్ డెయిరీ ఫామ్లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్లో పనిచేయడానికి వచి్చన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న సామ రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పని చేసే రాజేశ్కుమార్(24) శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.నెల రోజుల క్రితమే.. అజీజ్నగర్లోని రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పనిచేసేందుకు బిహార్కు చెందిన ఏజెంట్ పవన్ ద్వారా నెల రోజుల క్రితం రాజేశ్కుమార్, పూనం దేవి దంపతులు వచ్చారు. అయితే తన మొదటి భర్త మహేశ్సాని అలియాస్ గుడ్డును వదిలేసిన పూనందేవి.. రాజేశ్కుమార్ను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాజేశ్కుమార్, పూనందేవి అజీజ్నగర్లోని డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నారు. ఇటీవల రాజేశ్కుమార్ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని పూనందేవి తన మొదటి భర్త మహేశ్సానీకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈనెల 21న మహేశ్సాని అజీజ్నగర్ వచ్చాడు. అతను తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి రాజేశ్కుమార్ను హత్య చేసి, పారిపోయారు. -
కోడలి వివాహేతరం సంబంధం.. రాగి ముద్దలో విషం పెట్టి..!
కర్ణాటక: అక్రమ సంబంధాల మోజులో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే వివాహిత తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. వివరాలు.. అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది ఆరగించిన దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు. -
‘నీ క్యారెక్టర్ బాగోలేదు.. నిన్ను పెళ్లి చేసుకోలేను’
తిరువొత్తియూరు(తమిళనాడు): చెన్నై వేప్పేరిలోని ఈ.వి.కె.సంపత్ రోడ్డులో కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యువకుడు దర్శన్(26). ఇతను చెన్నై ప్యారిస్లో హార్డ్వేర్ డీలర్షిప్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రేమ ఇతనికి, రాయపురం పుదుమనైకుప్పం కల్మండపం రోడ్డు ప్రాంతంలో నివశిస్తున్న 25 ఏళ్ల హర్షిదా అనే యువతికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ గత 1 1/2 సంవత్సరాలుగా భార్యాభర్తల్లా కాపురం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత అన్నానగర్లోని ఒక హోటల్లో ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. హర్షిదా దివ్యాంగురాలు. చిన్నప్పటి నుంచి ఎడమ కాలు బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరు కుటుంబాలు నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు చేశాయి. గత ఫిబ్రవరి 12న నిశ్చితార్థం ముగిసిన తర్వాత దర్శన్, హాసిద ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒక వారం క్రితం దర్శన్ హర్షిదకు ఫోన్ చేసి ‘నీ క్యారెక్టర్ బాగోలేదు. నువ్వు నాకు వద్దు. నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని చెప్పాడు. ఇది విని దిగ్భ్రాంతి చెందిన హర్షిద తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పిన హర్షిద, తాను దర్శన్తోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై శనివారం రాత్రి 9 గంటలకు వేప్పేరిలోని ఒక అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ఉన్న దర్శన్ ఇంట్లో ఇరు కుటుంబాలు చర్చలు జరిపాయి. దర్శన్, హర్షిద ఇద్దరూ విడిగా ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో హర్షిత, దర్శన్తో నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను వద్దు అనకు అని బ్రతిమిలాడింది. కాని దర్శన్ మనసు మార్చుకోకుండా కలిసి జీవించాలని నేను కోరుకోవడం లేదు. మనం ఇద్దరం విడిపోదామని చెప్పి, పెళ్లి చేసుకోనని కచ్చితంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన హర్షిద ఇక బ్రతికి ఉండటంలో అర్థం లేదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో హర్షిత మిద్దె పైకి వేగంగా పరిగెత్తి కిందకు దూకింది. రేకుల షెడ్డుపై పడింది. 7వ అంతస్తు బాల్కనీలో ఎండ పడకుండా వేసిన రేకుల షెడ్డుపై హర్షిత పడింది. దానిపై కూర్చున్నట్లే ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దీనికి దర్శన్ సమాధానమిస్తూ ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పి, మళ్లీ పెళ్లికి నిరాకరించినట్లు మాట్లాడాడు. దీంతో మరింత మనస్తాపం చెందిన హర్షిత, రేకుల షెడ్డు నుండి మళ్లీ కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వేప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుర్రె రహస్యం గుట్టురట్టు?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్లో మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ! కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది. గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.యూట్యూబర్ సమీర్ విచారణశివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
మాతృత్వానికే మాయని మచ్చ
శివమొగ్గ(కర్ణాటక ): ముద్దులొలికే శిశువును కన్నతల్లే అంతమొందించింది. శివమొగ్గ నగరంలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రి ప్రసూతి వార్డులో టాయ్లెట్లో నవజాత మగ శిశువును గొంతు కోసి హత్య చేసిన కేసులో హంతకురాలు ఎవరో కాదు తల్లే అని బయటపడింది. దావణగెరె జిల్లా హొన్నల్లి తాలూకా తిమ్లాపురానికి చెందిన శైలా ను అరెస్ట్ చేసి కారాగారానికి తరలించారు. దొడ్డపేట సీఐ రవి పాటిల్ వివరాలను వెల్లడించారు. 16న మెగ్గాన్ ఆస్పత్రి టాయ్లెట్లో గొంతు కోసి చంపిన శిశువు మృతదేహం కనిపించింది. ప్రసూతి వార్డులో చేరిన మహిళలు, శిశువుల వివరాలను సేకరించారు. పుట్టిన శిశువులందరూ వార్డులోనే ఉన్నట్లు గుర్తించారు. ఏం జరిగిందంటే.. కడుపునొప్పిగా ఉందని అదే రోజు ప్రసూతి వార్డులో చేరిన శైలాను ప్రశ్నించారు. శిశువు మృతదేహాన్ని చూపించి అడిగినా ఆమె ఒప్పుకోలేదు. పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. శైలకు ఇద్దరు పిల్లలున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అయ్యింది. కానీ ఇటీవల గర్భం దాలి్చంది. కుటుంబానికి చెప్పకుండా దాచిపెట్టింది. 16వ తేదీన ప్రసవవేదన రాగా, కడుపునొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన ఆమెకు శిశువుకు జని్మంచింది. ఆ శిశువు వద్దనుకున్న ఆమె కిరాతకురాలిగా మారిపోయింది. టాయ్లెట్కు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పురుషులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘోరానికి కుటుంబ వ్యవహారాలే కారణమని అనుమానాలున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు. -
నేను కోరుకున్న జీవితం ఇది కాదు..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ‘అమ్మా..నాకు ఈ జీవితం నచ్చడం లేదు..నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు.. నా జీవితాన్ని ఇంకోరకంగా ఊహించుకున్నా..ఇప్పుడు జరుగుతున్నది వేరేగా ఉంది..నాకు నచ్చని ఈ బతుకు ముగించాలనుకుంటున్నాను’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్బెంగాల్కు చెందిన దేబష్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ చెక్పోస్టులో నిర్మాణంలో ఉన్న మంత్రి కన్స్ట్రక్షన్స్లో క్వాలిటీ కంట్రోలర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆవరణలో గత కొంతకాలంగా ఒక గదిలో ఉంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి అదోలా ఉంటూ.. తనకు ఈ జీవితం నచ్చడం లేదంటూ సహచర సిబ్బందితో వాపోయేవాడు. అనుకున్న విధంగా బతుకు కొనసాగడం లేదని అశాంతితో గడుపుతూ చివరకు తల్లికి సూసైడ్ నోట్ రాసి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేసి.. కాల్చేసి.. ఆపై ముక్కలుగా నరికి..
హైదరాబాద్లో తరచుగా డర్టీ మర్డర్స్ వెలుగుచూస్తున్నాయి. మానవత్వం మరిచిన కొందరు తమవారి విషయంలోనూ విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశం, కక్షలు, కార్పణ్యాలు, పక్కా పథకం ప్రకారం.. ఇలా కారణమేదైనా హత్య చేసిన తర్వాత మృతదేహాలను మాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హత్య చేసిన తర్వాత మృతదేహాలను కాల్చేయడం, ముక్కలు చేసేయడం, కుక్కర్లో ఉడికించడం... ఇలా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘోరాల్లో అత్యధికం సాక్ష్యాధారాలు మాయం చేయడానికేనని, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్ కూడా కారణమని సైకాలిజిస్టులు చెబుతున్నారు. నగరంలో జరిగిన కొన్ని దారుణ ఘటనలు ఇలా ఉన్నాయి.. సిమెంట్ దిమ్మెలో నవీష్ శవం..‘జనహర్ష’ అధినేత రమణ మూర్తితో ఆర్థిక విభేదాల నేపథ్యంలో అతడి పార్ట్నర్ నవీన్ మూర్తి 2005లో దారుణ హత్యకు గురయ్యాడు. రమణమూర్తి, ఇన్స్పెక్టర్ విజయ్సింగ్ మరికొందరు కలిసి నవీణన్ మూర్తిని ఉప్పల్ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న తమ పరిచయస్థుడి ఇంట్లో హత్య చేశారు. శవాన్ని వంటింట్లో పడేసి, కాంక్రీట్ను దిమ్మగా పోసేశారు. ఆ ఇంటి వెనుక నివసించే ఓ మహిళ ఇచి్చన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. ముక్కలు చేసి.. మూసీలో పడేసి.. మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే మహేందర్రెడ్డి గర్భవతి అయిన తన భార్య స్వాతి అలియాస్ జ్యోతిని దారుణంగా చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి, మొండెం మినహా మిగిలిన భాగాలు మూసీ నదిలో పడేశాడు. ఆదివారం ఉదయం ఈ ఉదంతం వెలుగులోకి రాగా... నిందితుడిని విచారిస్తున్న పోలీసులు మృతదేహం అవశేషాల కోసం మూసీ తీరం మొత్తం గాలిస్తున్నారు.గోనె సంచుల్లో మూటకట్టి.. 2003లో వెలుగులోకి వచి్చన ప్రభాకర్ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. యూసుఫ్గూడలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే ప్రభాకర్ ఫైనాన్స్ వ్యాపారి కూడా. పుట్టిన రోజు కార్డులు ప్రింటింగ్ చేయించుకోవడానికి వచి్చన శైలజతో అతడికి పరిచయమైంది. ప్రభాకర్ నుంచి శైలజ రూ.లక్షల్లో అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ప్రభాకర్ను ఇంటికి పిలిచి, కూల్డ్రింక్లో నెయిల్ పాలిష్ రిమూవర్ కలిపి మత్తులోకి దింపింది. ఆపై చంపేసి చేసి శవాన్ని ఐదు భాగాలుగా కోసి, గోనె సంచుల్లో కట్టి వంటింటి నుంచి టెర్రస్ వరకు ఐదు చోట్ల దాచింది. పాలేరులో పడేశారు.. కర్నూలు జిల్లాకు చెందిన రామ్భూపాల్రెడ్డికి నగరానికి చెందిన ఫిల్మ్ ఫైనాన్సియర్ మంజులారెడ్డితో పరిచయమైంది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నా కొన్నాళ్లకు మనస్పర్థలు వచ్చి వేర్వేరుగా ఉన్నారు. ఓ దశలో మంజులారెడ్డిని హతమార్చాలని నిర్ణయించుకున్న రామ్భూపాల్రెడ్డి తన మిత్రులైన మల్లికార్జునరెడ్డి, మధుసూధన్రెడ్డిలతో కలిసి 2006 జూన్ 27న చంపేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఖమ్మం సమీపంలోని పాలేరు జలాశయంలో పడేశారు.ముక్కలుగా దొరికిన రాకేష్ నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వాచ్మన్గా పని చేసిన ఓ వ్యక్తి కుమారుడు రాకేష్ 2010 డిసెంబర్లో ముక్కలు ముక్కలుగా దొరికాడు. తొలుత రామ్కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద కాళ్లు, తల లేని మొండెం, రెండు రోజులకు నారాయణగూడలో కాళ్లు లభించాయి. ఇతడి కుడికాలికి ఉన్న ఆరు వేళ్లను బట్టి తల్లిదండ్రుల తమ బిడ్డగా గుర్తించారు. రాకేష్ తల మాత్రం దొరకలేదు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరనేదీ తేలలేదు. రిఫ్రిజిరేటర్లో విగతజీవిగా.. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వస్త్ర వ్యాపారి శ్రీనివాస్ 2011లో హైదరాబాద్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగులు ఆయన మృతదేహాన్ని తమ ఫ్లాట్లో ఉన్న ఫ్రిజ్లో పెట్టి పరారయ్యారు. సిరిసిల్లకే చెందిన ఫ్రొఫెషనల్ నేరగాడు శ్రీధర్ సూత్రధారిగా ఈ హత్య జరిగింది. డ్రమ్ములో డెడ్బాడీ.. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న ఓ డెడ్బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్లో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్లతో పార్సిల్ చేసి టేప్ వేసిన స్థితిలో లభించింది. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్నగర్ అయి ఉండవచ్చని పోలీసులు భావించారు. ఉడికించి.. పొడిగా చేసి.. రాచకొండ పోలీసు కమిషనరేట్లోని మీర్పేట పరిధి జిల్లెలగూడలో ఈ ఏడాది జనవరిలో వెంకట మాధవిని ఆమె భర్త గురుమూర్తి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి క్యా్రస్టిక్ సోడా వేసి ఉడకబెట్టి, ఎముకల్ని పొడిగా చేశాడు. ఆపై డ్రైనేజీలో కలిపేశాడు. ఆధారాలు మాయం చేయడానికే..ఇలాంటి ఉదంతాల్లో మృతదేహాలను ముక్కలు చేయడం, కాల్చేయడం, ఉడికించడం.. తదితరాలన్నీ ఎక్కువగా కీలక ఆధారమైన డెడ్బాడీని మాయం చేయడానికే చేస్తుంటారు. మృతదేహాన్ని యథాతథంగా తీసుకువెళ్లి ఎక్కడైనా పడేసి వచ్చే అవకాశం లేకపోతేనే ఈ వైపు మొగ్గుతుంటారు. ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో యూట్యూబ్ ఆధారంగానూ ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. కుటుంబీకులు.. అందునా భర్తలు ఇలాంటి దారుణాలు చేయడానికి అనుమానమే ప్రధాన కారణమవుతోంది. సమాజంలో పెరిగిపోయిన యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్టర్ కారణంగానూ విచక్షణ కోల్పోతున్నారు. ఈ నేరం చేసే వరకు ఆ నిందితులు సాధారణ జీవితమే గడుపుతుండటం గమనార్హం. ఇలాంటి కేసుల్లో నేరం నిరూపణ కూడా కష్టసాధ్యం అవుతుంది. – ఆర్. ప్రభాకర్, మాజీ డీఎస్పీ -
రీల్స్, బ్యూటీ పార్లర్.. నిక్కీ కేసులో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: నోయిడా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపిన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను హత్య చేసిన విపిన్.. ఏ మాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. ‘‘నేను చంపలేదు.. తనే చనిపోయింది’’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడు.నిక్కీ బ్యూటీపార్లర్ ఓపెన్ చేయడాన్ని విపిన్ వ్యతిరేకించడంతో పాటు.. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం కూడా హత్యకు గల కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. నిక్కీ మర్డర్ కేసులో విపిన్ తల్లి దయాభాటి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. కిరోసిన్ బాటిల్ అందించినట్లు నిక్కీ సోదరి కంచన్ ఫిర్యాదులో పేర్కొంది. దయాభాటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించారు.యూపీలో గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లక్షల కట్నం చాలదని, మరింత తేవాలని చిత్రహింసలు పెట్టి, చితకబాది, చివరకు యాసిడ్ పోసి, ఆపై సజీవదహనం చేసినట్టు వెల్లడైంది! దాంతో ఆ నరరూప రాక్షసుడు కటకటాలపాలయ్యాడు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యతి్నంచి, పోలీసుల తూటా దెబ్బకు గాయపడి మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. అతనితో పాటు, కోడలిని రాచిరంపాన పెట్టిన అత్తను కూడా అరెస్టు చేశారు. సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్కు 26 ఏళ్ల నిక్కీతో 2016లో పెళ్లయింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. ఇటీవల సత్యవీర్ బెంజ్ కారు కొనుకున్నాడు. తనకూ అలాంటి మరో కారైనా, మరో రూ.36 లక్షల అదనపు కట్నమైనా తేవాలని నిక్కీని విపిన్ హింసించసాగాడు. అందుకు తల్లి దయావతి వంతపాడేది. పెద్ద కొడుకు భార్య అయిన నిక్కీ అక్కడ కంచన్కు కూడా వేధింపులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నిక్కీని ఇష్టానికి బాది, యాసిడ్ పోసి మరీ నిప్పంటించారు. అగ్నికి ఆహుతవుతూ మెట్ల నుంచి నిక్కీ పడిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి.భర్త, అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని కంచన్ రికార్డు చేసి పోలీసులకు అందించింది. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలొదిలింది. ‘‘నా చెల్లెలిని కొట్టొద్దని వారించినందుకు నన్నూ చితకబాదారు. తన తల, మెడపై విపరీతంగా కొట్టి యాసిడ్ పోశారు’’ అంటూ కంచన్ వాంగ్మూలమిచి్చంది. ఆమె ఫిర్యాదు మేరకు విపిన్, దయావతిని అరెస్టు చేశారు.సీన్ రీకన్స్ట్రక్ఛన్ కోసం నిక్కీని ఆదివారం మధ్యాహ్నం అతన్ని ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఎస్సై నుంచి పిస్టల్ లాక్కొని పారిపోయాడు. వెంటాడుతున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అతని కాళ్లపై షూట్ చేశారు. కుప్పకూలాక అదుపులోకి తీసుకున్నారు.పాపం పసివాడు! ఆరేళ్ల లేత ప్రాయం. కన్నతల్లిని తన తండ్రే నాయనమ్మతో కలిసి మరీ కర్కశంగా సజీవ దహనం చేస్తుంటే కళ్లారా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఉండడు! ‘‘అమ్మను నాన్న, నానమ్మ చెంపపై బాగా కొట్టారు. మండిపోయేది అమ్మపై పోశారు. తర్వాత నాన్న లైటర్తో నిప్పు పెట్టాడు’’ అంటూ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న ఆ బాలున్ని చూసి కంటతడి పెట్టని వారు లేరు. -
భార్య శ్రావణిని దారుణంగా కాల్చి చంపిన భర్త
-
వాడే కావాలని పోరాడి చేసుకుంది.. చివరికి అనుమానంతో..
-
భార్యను హత్య చేసి.. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి..!
న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలోవిపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు. కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ. -
Boduppal Incident: వాడిని ఉరి తీయాలి.. స్వాతి తల్లిదండ్రుల డిమాండ్
-
Boduppal Incident: భార్య శరీర భాగాలను మూసీలో పడేసిన భర్త
-
ఏం కష్టమొచ్చిందో...!
కొత్తవలస(విజయనగరం): ఓ పెళ్లిలో వారి చూపులు కలిశాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. పెళ్లితో ఐదునెలల కిందట ఒక్కటయ్యారు. కొత్తింటిలో కాపురం పెట్టారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ.. ఆనందంగా జీవిస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... ఒకరి తర్వాత ఒకరు ప్రాణం తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనతో కొత్తవలస మండలం తమ్మన్నమెరక ఘొల్లుమంది. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు కార్చుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొత్తవలస మండలం తమ్మన్నమెరక గ్రామానికి చెందిన గీతల వెంకటలక్ష్మి (26), వేపాడ మండలం చిన్నదుంగాడ (కొప్పలవానిపాలెం) గ్రామానికి చెందిన కొప్పల చిరంజీవి (30)కి ఈ ఏడాది మార్చి నెలలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమెకు దివ్యాంగుడైన తమ్ముడు రాజేష్ ఉన్నాడు. కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తూ తమ్ముడిని సాకుతూ ఓ ఇంటివాడిని చేసింది. ఓ పెళ్లిలో వెంకటలక్ష్మిని చిరంజీవి చూసి ఇష్టపడడంతో పెద్దలకు తమ మనుసులోని మాటను చెప్పడంతో పెళ్లిచేశారు. వెంకటలక్ష్మికి గత ప్రభుత్వ హయాంలో తమ్మన్నమెరక గ్రామంలోని జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో అందులోనే కొత్తకాపురం పెట్టారు. ఇద్దరు డిగ్రీ విద్యను అభ్యసించడంతో చిరంజీవి పెందుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో సేల్స్ ఉమెన్గా పని చేస్తోంది.ప్రాణం తీసిన మనస్పర్థలు...అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటలక్ష్మి భర్త చిరంజీవికి నీవు అనుకున్నట్లే చనిపోతున్నాను.. నీకు సంతోషమే కదా అని మెసేజ్ పెట్టింది. దీనికి వెరీగుడ్ అంటూ చిరంజీవి రిప్లై ఇచ్చాడు. సరే.. నేను షాపు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిపోతున్నాను అని మెసేజ్ చేస్తే ఒకే.. అంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన వెంటనే వెంకటలక్ష్మి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన చిరంజీవి వెంకటలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి అదే తాడుతో చిరంజీవి ఉరివేసుకున్నాడు. శనివారం తెల్లవారు జూ మున బంధువులు చూ సి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సీఐ షణ్ముఖరావు, పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్నదమ్ములు మా త్రం తమ్ముడు, మరదలను కావాలనే ఎవరో చంపేసి అత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్టీమ్ బృందం ఆధారాలను సేకరించింది. మృతురాలి త మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. -
ప్రామిస్ ఇదే లాస్ట్ పెళ్లి.. సంబంధం చూడండి..!
సూర్యాపేటటౌన్: బాలికను నాల్గో వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై సూర్యాపేట రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం ఎస్ఐ బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ పంచాయతీకి చెందిన బానోతు కృష్ణంరాజు నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న కృష్ణంరాజు 2023 డిసెంబర్లో సూర్యాపేట మండలంలోని సపావట్తండాకు చెందిన మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతడు ఐదో పెళ్లికి కూడా సిద్ధమవ్వగా.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ ఈ నెల 12న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సపావట్తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూక్య నారాయణ వదిన కొడుకే కృష్ణంరాజు కాగా.. నారాయణ, బాలిక తల్లి కలిసి.. ఆమెను కృష్ణంరాజుకు ఇచ్చి వివాహం చేశారని బాలిక తండ్రి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు వివాహాన్ని ప్రోత్సహించిన బాలిక తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణపై చైల్డ్ మ్యారేజీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ..
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు.ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా.. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
నంద్యాలలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: ఆర్జియమ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న భాను ప్రకాష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ హాస్టల్లో భాను ప్రకాష్ ఉరివేసుకుని బలనన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం వరకూ కళాశాలలోనే ఉన్న విద్యార్థి భాను ప్రకాష్.. హాస్టల్కు వెళ్లిన తర్వాత ఉరివేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి భాను ప్రకాష్ ఉరివేసుకున్న తర్వాత కొన ఊపిరితో ఉండటం చూసి కాలేజ్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి భాను ప్రకాష్ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కూకట్పల్లి కేసు.. ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.ఇది కూడా చదవండి: సహస్ర హత్యపై సీపీ మహంతి.. సంచలన విషయాలు వెల్లడి.. ఇక, కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్పల్లి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మెషిన్లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం. -
మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు. -
కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు
-
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన ప్లాట్లోకి వచ్చిన బాలుడు కుటుంబ సభ్యులు.. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతున్నారు. బాలుడు స్వస్థలం ఒంగోలు జిల్లా. కొద్దిరోజుల క్రితమే సహస్ర పుట్టిన రోజు వేడుకలు జరగ్గా.. ఆమె బర్త్ డే వేడుకలకు బాలుడు హాజరయ్యాడు. సహస్రకి కేక్ కూడా తినిపించి విషెస్ చెప్పాడు. అయితే, టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంత కిరాతకానికి ఎలా తెగించాడు? అనే దానిపై పోలీసులు కూడా షాక్కు గురవుతున్నారు.బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్యకు పాల్పడ్డాడు. పక్క పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు.. 10వ తరగతి దశలోనే క్రైం చేయడం నేర్చుకున్న బాలుడు.. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. బాలుడిని పదుల సంఖ్యలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటిలెజెంట్గా బాలుడు వ్యవహరించాడు.బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి తాగుబోతు, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి.. కుమారుడిని సరైన మార్గంలో పెంచలేకపోయారు. కొడుకును పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు క్రైమ్ సీన్లకు అలవాటుపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులను డీసీపీ విచారిస్తున్నారు. ఓటీటీ, యూట్యూబ్ వీడియోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ.. ఓటీటీలో క్రైం సీరియల్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. హత్యకు రెండు రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాలుడు రాసుకున్నాడు.హత్య జరిగిన రోజున కూడా పోలీసులను బాలుడు తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి గట్టిగా అరుపులు వినిపించాయంటూ.. ఏమీ ఎరగనట్లు హత్య జరిగిన రోజున పోలీసులకు చెప్పాడు. బాలుడి మాటలతో ఇతరులు చంపి ఉంటారన్న అనుమానంతో ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను చంపేసాక ఆ బాలుడు గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మరో సుపారీ మర్డర్కు ప్లాన్ చేసిన ఘటన స్థానకంగా కలకలం రేపింది. ఓ బైక్పై వెళ్తున్న ముగ్గురిని హత్య చేసేందుకు ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. దాంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు బైక్ దిగి వైన్స్లోకి పరిగెత్తడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ ముగ్గురు. సుపారీ గ్యాంగ్ను వైన్స్లో ఉన్నవాళ్లు వెంబడించడంతో వారు వచ్చిన కారులోనే పరారయ్యారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా, తాజాగా మరోసారి హత్యాయత్నం పథకం జరగడంతో సూర్యాపేటలో కలకలం రేగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే ప్రశ్న స్థానికంగా జీవిస్తున్న వారిలో మొదలైంది. -
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెద్దపల్లిరూరల్: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్ (ఓదెల పీహెచ్సీలో ఫార్మసిస్ట్) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వారు పలుమార్లు కౌన్సెలింగ్ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
చెల్లి లవ్ మ్యారేజ్.. అసూయతో ఆ అక్క..
ఆదిలాబాద్టౌన్: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఓర్వలేక ఓ అక్క ఆమెను కిడ్నాప్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. చెల్లె భగత్ మనీషా ప్రేమ వివాహం చేసుకోగా, తనకు పెళ్లి కాలేదని తలమడుగుకు చెందిన విజయ ఆమైపె కక్ష పెంచుకుంది. ఆమె భర్త నుంచి విడదీసేందుకు పన్నాగం పన్నింది. ఆమెను మహారాష్ట్రలోని కిన్వట్లో బంధించింది. బాధితురాలి భర్త అలుగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్నకు సహకరించిన తలమడుగుకు చెందిన భగత్ విజయ, భగత్ సునంద, భగత్ ప్రగతి, తాంసికి చెందిన షబ్బీర్, ఓ మైనర్ బాలుడితో పాటు కిన్వట్కు చెందిన ప్రతీన్పై కేసు నమోదు చేశారు. కిడ్నాప్కు గురైన బాధితురాలి ఆచూకీ తెలుసుకుని ఆమెను కిన్వట్ నుంచి తీసుకువచ్చారు. కాగా, మనీషా ఇటీవల భగత్ శ్రీనివాస్తో ప్రేమ వివాహం చేసుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో నివాసముంటోంది. ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె అక్క కిడ్నాప్నకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ మహిళలపై గౌరవంగా వ్యవహరిస్తుందని తెలిపారు. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ ఉన్నారు. -
మియాపూర్లో మిస్టరీ డెత్స్.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త,మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
భర్తకు దూరంగా వివాహిత.. తన ప్రేమకు అడ్డుచెప్పిందని..
సాక్షి, బెంగళూరు: ప్రేమ నిరాకరించినందుకు వివాహితను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. సినీ ఫక్కీలో కారులో ఉంచి చెరువులోకి నెట్టేయడంతో ఆమె జలసమాధి అయ్యింది. ఈ సంచలన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మృతిరాలిని హాసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)గా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత కొంతకాలం కిందట భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటోంది. ఆమె హాసన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని ఆమెను సతాయించేవాడు. అయితే, అతడి ప్రపోజల్ను ఆమె తిరస్కరించింది. దీంతో, ఆవేశానికి గురైన రవి శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.అనంతరం, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో కారులో ఎక్కించుకుని వచ్చాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. కారులోనే శ్వేతను ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత.. కారు అనుకోకుండా చెరువులో పడిందని , అందులో స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. రవి నిజం ఒప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. -
డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఆనవాళ్లు లేకుండా కాల్చేసి!
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. తనిఖీలో భాగంగా ఆమైపె అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోంది. అయితే, వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.అనంతరం, హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ఇక, ఈ కేసులో ఆమెతో స్నేహంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి విచారణ తర్వాత మాత్రమే అసలు విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.కర్ణాటకలో నిరసనలు..మరోవైపు.. యువతి హత్యను ఖండిస్తూ చిత్రదుర్గలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను సంపులో పడేసిన ఓ తల్లి బలవన్మరణానికి ప్రయత్నించింది. పిల్లలు మరణించగా.. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
నైట్ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య..
కర్ణాటక: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆనేకల్ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎల్రక్టానిక్సిటీ, హెబ్బగోడిల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్య తల నరికి స్టేషన్కు వెళ్లిన భర్త ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని, ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఏప్రిల్ 5న ఎల్రక్టానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు. మార్చి 28వ తేదిన ఆనేకల్ తాలుకా జిగణి పోలీసు స్టేషన్పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. మార్చి 4న ఆనేకల్ పోఈసు స్టేషన్ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు.పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు.ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. కౌన్సిలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్లు అవసరం ఆనేకల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి
-
కూకట్ పల్లి బాలిక ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు
-
బాలిక హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
మూసాపేట: కూకట్పల్లి దయార్గూడలో సోమవారం సహస్రిని (11) అనే బాలికను హత్య చేసిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్ఓటీ, సీసీఎస్, పోలీస్ బృందాలు సుమారు 6 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సీసీ పుటేజ్, క్లూస్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. కాలనీలో, భవనంలోని పలువుర్ని ప్రశ్నించారు. బాలిక ఒంటిపై సుమారు 20కి పైగా చిన్న చిన్న గాట్లు ఉన్నాయని, పదునైన చిన్నపాటి ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మెడపై 14 గాట్లు, కడుపులో 6 గాట్లు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగానే మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లాలోని వారి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు బాలిక హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా అదే భవనంలో ఉన్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుటుంబంపై చేతబడి చేశారన్న అనుమానంతో అతడు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రేమించడం నేరమా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రేమించడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముస్లిం బాలికల కనీస పెళ్లి వయసుకు సంబంధించిన వ్యవహారంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. పంజాబ్లో 21 ఏళ్ల ముస్లిం యువకుడు, 16 ఏళ్ల ముస్లిం బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. రజస్వల అయిన తర్వాత లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించింది. దీన్ని సవాల్ చేస్తూ ఎన్సీపీసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. బాలిక, యువకుడి మధ్య అంగీకారంతోనే పెళ్లి జరిగిందని గుర్తుచేసింది. సమాజంలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది. బాలబాలికలు ఒకచోట కలిసి చదువుకుంటున్నప్పుడు వారి మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజమేనని పేర్కొంది. వారి మధ్య ప్రేమను నేరంగా పరిగణించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. ఎన్సీడబ్ల్యూ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. -
భార్య వివాహేతర సంబంధం..సెల్పీవీడియోతో భర్త బలవన్మరణం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె భర్త మృతికి కారణమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కటకటాల పాలయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం సూర్యాతండాకు చెందిన వాంకుడోత్ బావుసింగ్ ములుగు జిల్లా వాజేడు మండలం బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో జూలురుపాడుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో అతను సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన కొత్తగూడెం పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని ఈనెల 11వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బావుసింగ్ను అరెస్ట్ చేసిన మాట వాస్తమే కాని తనకు, జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టా సమీపంలోని మొరుమూరు పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడిని బిజినేపల్లి పాఠశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. -
కూకట్పల్లి బాలిక కేసు.. పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. అదె బిల్డింగ్లోనే అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కూకట్పల్లిలోని దయార్గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని హత్యోదంతం.. రాష్టవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. చివరకు.. ఇది బయటివారి పని కాదని ఓ నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో.. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బడికిపోయి ఉన్నా బతికేదేమో! ‘‘బడికి పోయి ఉన్నా బతికేదేమో.. ఏం చేసిందని నా బిడ్డను ఇలా చంపారు. అందుకేనేమో ఆడపిల్లను కనాలంటే భయపడుతున్నారు’’ అంటూ తల్లి రేణుక గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్నగర్లోని బైక్ మెకానిక్గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు సాద్విన్ (9) ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు స్కూళ్లలో చదువుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్బాక్స్ రెడీ చేసి స్కూల్కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. -
గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
నాగర్కర్నూల్ జిల్లా: మండలంలోని ముకురాలలో గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వింజమూరి ఈశ్వరయ్య (52) ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో గుడ్డు తిన్నాడు. అందులోని పచ్చసోన గొంతులో ఇరుక్కుపోవడంతో భార్య ఈశ్వరమ్మ తలపై కొట్టి గుడ్డును కక్కించే ప్రయత్నం చేయడంతోపాటు నీళ్లు తాపినా ప్రయోజనం లేక అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. ఈశ్వరయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో చేసేదేమి లేక ఇంటికి తీసుకెళ్లి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి హఠాన్మరణం పాన్గల్: కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కేతేపల్లికి చెందిన తోకల కృష్ణ పబ్లిసిటీ పెయింటింగ్ కాంట్రాక్టర్. ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన జానీ రంగరావు, సదరం రమణ (58) పెయింటర్స్గా పని చేస్తున్నారు. ఏపీలోని అనంతపూర్లో పెయింటింగ్ పని ముగించుకొని ఈ నెల 16న రాత్రి కేతేపల్లికి చేరుకున్నారు. 18వ తేదీన సదరం రమణ బహిర్భూమికి వెళ్తూ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం దగ్గర కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ దగ్గరకు అటు నుంచి జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తోకల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
అడ్డుగా ఉన్నాడని భర్తను అంతం చేసింది
హైదరాబాద్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటనలో భార్యా, ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట రెడ్డి, ఎస్ఐ మహ్మద్ మజీద్ ఆలీలు తెలిపిన మేరకు.. రాజీవ్గాంధీ నగర్లో మహమ్మద్ షాదుల్, భార్య తబ్సుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు. నాలుగు సంవత్సరాల క్రితం తబ్సుమ్కు మొహమ్మద్ తాఫిక్ అనే వ్యక్తితో అయిన పరిచయం వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. దీంతో భర్త షాదుల్ అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడు మొహమ్మద్ తాఫిక్తో కలిసి షాదుల్ను చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం తబ్సుమ్ ప్రియుడితో కలిసి ఆగస్టు 15న ఉదయం షాదుల్ పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. ఈ సంఘటపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులైన తబ్సుం, ప్రియుడు మొహమ్మద్ తాఫిక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో మైనర్ బాలిక (12)హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుణ్ని సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు.బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాల్ని గమనించారు. అయితే, బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోమవారం కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్నగర్లో ఓ మైనర్ బాలిక(12) దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న బాలికపై నిందితులు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అర్ధరాత్రి నగ్నంగా పుర్రెలతో పూజలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని పూసికల్మేడు గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు పరుశురామన్ ఇతను అదే గ్రామంలోని రాజాత్తి ఇంటి సమీపంలో ఆదివారం అర్థరాత్రి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పరుశరామన్ ఇంటి సమీపంలో నివశిస్తున్న కుమరన్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో దీపం వెలుగుతుందని దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ సమయంలో పరుశురామన్ నగ్నంగా నిలుచుకొని పూజలు చేస్తున్నాడు. వీటిని గమనించి అవాక్కైన కుమరన్ వీటిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మద్య వాగ్వాదం ఏర్పడింది. ఇద్దరు ఘర్షణ పడటంతో స్థానికులు గమనించి అక్కడకు వచ్చారు. వెంటనే ఇరు వర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కుమరన్ ఇంటికి వెల్లి నిద్రించాడు. ఆ సమయంలో పరుశురామన్ తన అనుచరులతో వచ్చి కుమరన్ తలపై రాతిని వేసి హత్య చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కుమరన్కు తీవ్ర గాయాలు కావడంతో అతని బార్య జయలక్ష్మి వెంటనే కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి కుమరన్ను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభ్తుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జయలక్ష్మి నాట్రంబల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పరుశురామన్, అతని సోదరుడు శాంతకుమరన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
నా భర్తకు మహిళల పిచ్చి.. 30 మందితో సంబంధాలు..
తమిళనాడు: వివాహమైన 10 నెలలలోనే ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో అద్దెకు గది తీసుకుని నివసిస్తున్న జ్యోతిశ్వరి ( 30). ఈమె ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్. చదివింది. ఆమె స్వస్థలం రామనాథపురం. ఈమె మీనంబాక్కంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. ఈమెకు రామనాథపురానికి చెందిన యోతీశ్వరన్ (34)తో గత సంవత్సరం నవంబర్లో వివాహం జరిగింది. ఇంజినీరైన యోతీశ్వరన్ దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో యోతీశ్వరన్ తన భార్యను విడిచిపెట్టి తన స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ భార్యను చూడటానికి వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో పెరుంగళత్తూరు శ్రీరామ్ గేట్లో 12 అంతస్తుల అపార్ట్మెంట్లో నివసిస్తున్న తన సోదరి ముత్తులక్ష్మి ఇంటికి జ్యోతిశ్వరి వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన ఇంటికి బయలుదేరింది. అపార్ట్మెంట్ ’లిఫ్ట్’లోకి వెళ్లిన జ్యోతిశ్వరి, కిందకు వెళ్లకుండా పైకి వెళ్లింది. టెరస్ర్కు వెళ్లి తన చెప్పులు, హ్యాండ్బ్యాగ్ తీసివేసి 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఇందులో, తలకు. తీవ్రంగా గాయపడిన జ్యోతిశ్వరి సంఘటన స్థలంలోనే దారుణంగా మృతి చెందింది . ఈ విషయం తెలుసుకున్న పీర్కన్కరణై పోలీసులు ఆత్మహత్య చేసుకున్న జ్యోతిశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అరాచకాలు భరించలేకనే..? కాగా గత నవంబర్ నెలలో తల్లిదండ్రులు చూసిన వరుడు యోతీశ్వరన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే, యోతీశ్వరన్ తన భార్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా గంజాయితో పాటూ అనేక ఇతర చెడు అలవాట్లలో మునిగిపోయాడు. అంతేకాకుండా, డేటింగ్ యాప్ ద్వారా 30 మందికి పైగా మహిళలతో పరిచయం పెంచుకుని, పెళ్లయిన తర్వాత కూడా వారితో సంబంధాలు కొనసాగించాడు. కాగా ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకున్న జ్యోతీశ్వరి, తన భర్త ల్యాప్టాప్ను పరిశీలించగా, అతను అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసి మనోవేదకు గురైంది. ఈ నేపథ్యంలో, కోడంబాక్కంలోని తన తల్లితో కలిసి గది తీసుకుని ఉంటున్న జ్యోతీశ్వరి, పెరుంగళత్తూరులోని అక్క ఇంటికి వెళ్లినప్పుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భర్త వద్ద ప్రియుడితో చిట్టీలు వేయించిన భార్య..!
వరంగల్ జిల్లా : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో భర్తపై హత్యాయత్నం చేయించిన ఘటనలో భార్యతోపాటు ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని రామన్నపేట రఘునాథ్కాలనీ చెందిన గంగరబో యిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్తో మూడు సంవత్సరాల క్రితం వరంగల్ బస్టాండ్ వ ద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సందీప్తో స్నే హం చేసేలా పద్మ తన భర్త రాజుతో అతడి వద్ద చిట్టీలు వేయించింది. దీంతో సందీప్, రాజు మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు ఇంట్లో లేని సమయంలో సందీప్.. అతడి ఇంటికి తరచూ వస్తున్నాడు. దీనిపై అనుమానం వచ్చిన రాజు.. పద్మ ను, సందీప్ను ప్రశ్నించాడు. దీంతో రాజు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్ర మోద్, సబ్బీర్, స్వర్ణాకర్తో కలిసి పోతన డంపింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించగా ప్రా ణపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ..రాజుపై హత్యాయత్నం చేసి న సందీప్కు రూ. 3 లక్షలు అందజేసింది. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో రూ. 6 లక్షలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాజు కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు.. ఆదివారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వద్ద సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గరు ప్రమోద్, సబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 5.40 లక్షల నగదు, ఓ కారు, రెండు స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలి పారు. సమావేశంలో ఎస్సైలు శ్రీనివాస్, సాంబ య్యలు, హెడ్కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు. -
నా భార్యను సౌరబ్ అనే వ్యక్తి తీసుకెళ్ళాడు సార్..!
మెదక్ : భార్య అదృశ్యంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన చందన్ కుమార్ భార్యతో వచ్చి పటాన్చెరు జె.పి కాలనీలో ఉంటూ, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే చందన్ భార్య ఖుషి కొన్ని రోజులుగా సౌరబ్ కుమార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 12న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చందన్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి సౌరబ్ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అతనితో ఉంది. దీంతో భార్యని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి ఇంటి నుంచి ఖుషి వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సౌరబ్పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ క్యాంపస్కు చేరుకుని అక్కడున్నవాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కవారంలోనే పాతికకు పైగా ఇలాంటి బాంబు బూచీ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో.. ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. తాజాగా.. ఓ స్కూల్కు బాంబు ఉందని, పిల్లలు చనిపోతారని కాల్ చేసిన వ్యక్తిని.. 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసులు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా వచ్చినా, కఠిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడినవారిపై జైలు శిక్ష, ఆర్థిక జరిమానా విధిస్తారు. విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తే శిక్షతోపాటు ప్రయాణాలు చేయకుండా బ్లాక్లిస్ట్లో చేర్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. BNS (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం ఉగ్రవాద చర్యగా పరిగణించి జీవిత ఖైదు తరహా కఠిన శిక్షా పడొచ్చు. -
Hyderabad: చిక్కడపల్లిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: వివేక్నగర్లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల ఇంట్లో చోరీ జరిగిన 48 గంటల్లోనే చిక్కడపల్లి పోలీసులు కేసును చేధించారు. ఆదివారం సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పావల్లి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకు చెందిన బ్రూస్లీపై ఈనెల 13న చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఇతడిపై 64 కేసులు ఉన్నాయని తెలిపారు. చిక్కడపల్లిలోని వివేక్నగర్లోని దిట్టకవి ఎన్క్లేవ్లో నివసించే రిటైర్డ్ ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, రాజేశ్వరిల ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాయుడు చైతన్యసాయికుమార్తో కలిసి ఆభరణాలను విక్రయించాలని పథకం పన్నారు. ఇతడిపై సైతం దాదాపు 67 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో సెంట్రల్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు సుందరయ్య పార్క్ వద్ద వారిని పట్టుకున్నారు. పోలీసులు తమ తీరులో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 25.8తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ప్రతి కాలనీలీ, అపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ కోరారు. పోలీసులు కేసును చేధించడంతో పీపుల్స్పార్క్ రెసిడెన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఎసీపీ రమేష్ కుమార్, సీఐ రాజునాయక్, డీఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లై పిల్లలున్నా కొనసాగిన బంధం.. ప్రేయసిని దారుణంగా చంపేసిన ప్రియుడు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రేమించుకున్న ఆ జంట ఏ కారణం చేతనో ఒక్కటి కాలేకపోయింది. వేర్వేరు వ్యక్తులతో వారికి వివాహాలు అయ్యాయి. అయినా వారి మధ్య ప్రేమ కొనసాగి చివరకు ఇద్దరినీ బలి తీసుకుంది. ప్రియురాలిని కత్తితో హత్య చేసిన ప్రియుడు అదే కత్తితో తానూ పొడచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ సుతార్(35), రేష్మ(29)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రేష్మకు మరో వ్యక్తితో వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆనంద్కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ విషయం రేష్మ భర్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆనంద్ను పిలిపించి హెచ్చరించి వదిలేశారు. ఆగ్రహంతో ఉన్న ఆనంద్ రేష్మను నిర్జనప్రదేశానికి పిలిపించుకుని కత్తితో పొడిచి హత్య చేశాడు.అదే కత్తితో తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నందగడ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఎంత పని చేశావు సుశీల..!
విశాఖపట్నం జిల్లా: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుశీల (35)శుక్రవారం ఆత్యహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన ఆడారి సూరి నాగేశ్వరరావు,సుశీల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుశీల మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కాగా తన కుమారుడితో కలిసి సుశీల పొలం పనులకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం కొంతసేపటి తరువాత కుమారుడు ఇంటికి వెళ్లేసరికి సుశీల ఫ్యాన్కు ఉరివేసుకుని ఉంది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించిన కుమారుడు, మునగపాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆస్పత్రి తరలించారు.చదవండి: అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..! -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు. యువకుడి మరణంతో ఉద్రిక్తత కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యతి్నంచారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. మృతదేహం అడ్డగింత కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయతి్నంచారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. -
అరేయ్.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి..!
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీవ్రంగా కొట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని స్రవంతినగర్లో గంగోల శ్రీనివాసులు (29) అనే యువకుడు సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాసులు తనతో పనిచేస్తున్న కిరణ్, శ్రీనిజ, వెంకటేష్ , మహేష్, పవన్, సుభాష్ తదితరులతో కలిసి మూసాపేట చంద్రకళ థియేటర్లో కూలీ సినిమా చూసి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తిరిగి వెంకటగిరికి వచ్చి శ్రీనిజను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారు. అదే సమయంలో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి మద్యం మత్తులో తూలుతూ శ్రీనివాసులును ఉద్దేశించి అరేయ్.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి మీరెవరు..అంటూ కొట్టాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకోవడానికి యతి్నంచిన శ్రీనివాసులు స్నేహితుడిని కూడా కొట్టారు. నువ్వు కారు ఎక్కు.. నీతో పని ఉంది అంటూ బలవంతంగా కారు ఎక్కించుకుని 10 నిమిషాల పాటు హైలంకాలనీ ఏరియాలో తిప్పారు. ఓ వైన్ షాపు ముందు ఆపి తమతో పాటు తెచ్చుకున్న బీర్లు తాగుతూ రేవంత్తో పాటు ఆయన స్నేహితుడు విశాల్.. శ్రీనివాసులును తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన కిరణ్ను కూడా తీవ్రంగా బాదారు. మళ్లీ కారు ఎక్కించుకుని శ్రీనివాసులుతో పాటు ఆయన స్నేహితుడు కిరణ్ను మళ్లీ యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్ వైపు తీసుకువెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసు వాహనం అటువైపు రావడంతో వీరిద్దరూ బిగ్గరగా అరిచి పోలీసులను అప్రమత్తం చేశారు. స్పందించిన పోలీసులు కారును ఆపి నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిద్దరికీ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్థారణ అయ్యింది. దర్యాప్తులో నిందితుడు తొక్కుడుబియ్యపు రేవంత్ (27) యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్లో నివసిస్తుంటాడని, తండ్రి పోలీసు చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆయనకు చాంద్రాయణగుట్ట బ్రాంచ్ పింఛన్ ఆఫీసులో సబార్డినేట్ పోస్టు వచి్చనట్లు తేలింది. ఆయన స్నేహితుడు నారగాని విశాల్ శ్రీనగర్కాలనీలో నివసిస్తుండగా ఓ కారు షోరూంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నట్లు తేలింది. వీరి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్స్టేషన్లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్కుమార్ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
ఉప్పల్లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు. -
మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దాయాదులు గుంజకు కట్టేసి చితకబాదిన సంఘటన రెండురోజుల తర్వాత వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరా లు.. గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మతిస్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సవిత ఇంటి ఎదుట నున్న స్థలంలో ఆమె తోటికోడలు పల్లికొండ లక్ష్మికి చెందిన గేదెలు, గొర్రెలు ఉంటాయి. గొర్రెలు, గేదెలు తరచుగా సవిత ఇంట్లోకి వచ్చి మలమూత్రాలు విసర్జించడమే కాకుండా, బియ్యం తినడం వంటివి చేస్తున్నాయి. ఈ విషయమై సవిత పలుమార్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా గేదె సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యాన్ని తొక్కి చిందరవందర చేయడంతో లక్ష్మిపై సవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మి కోపంతో సవితను తిడుతూనే మంత్రాలు చేస్తున్నావని ఆరోపించింది. దీంతో ప్రమాణం చేద్దామని సవిత గేదెను తీసుకుని హనుమాన్ గుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వచ్చిన లక్ష్మి సవితను హనుమాన్ ఆలయం వద్దనున్న పెద్ద గుంజకు(కట్టె) కట్టేసింది. లక్ష్మి కొడుకు గంగాధర్, కోడలు మమత, భర్త పల్లికొండ గంగాధర్ అక్కడికి చేరుకుని సవితపై దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని సవిత వేడుకున్నా కనికరించలేదు. గంట తరువాత స్థానిక మహిళలు జోక్యం చేసుకుని సవిత కట్లు విప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జాడె సుస్మిత గురువారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పల్లికొండ గంగాధర్, లక్ష్మి, వారి కుమారుడు గంగాధర్, కోడలు మమతను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
క్యాబిన్లో ఇరుక్కుని..
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం, మొరిపిరాల మధ్యలో జాతీయ రహదారిపై లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండనుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ప్లాస్టిక్ వస్తువుల లోడ్తో ఓ లారీ విజయవాడ నుంచి హనుమకొండ వైపు వస్తోంది. ఈ క్రమంలో మైలారం, మొరిపిరాల మధ్యలో బ్రిడ్జి వద్ద గుంతలను తప్పించుకునే క్రమంలో లారీ, బస్సు ఎదురెదు రుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం, వర్ధన్నపేట సీహెచ్సీకి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా.. పోలీసులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి క్యాబిన్ను విడగొట్టి వారిని బయటకు తీశారు. వైద్యంకోసం వీరిని ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటన తో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లో ఆదేశించారు. -
బర్త్ డే వేడుకల్లో భారీగా డ్రగ్స్ .. నైజీరియన్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బర్త్ డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో గుట్టుగా నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 51 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో 37 మంది మహిళలు, 14 అబ్బాయిలు ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.ఉగాండాకు చెందిన మమస్ బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ పాస్పోర్టులు, వీసాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లు తేలింది. మొయినాబాద్ ఫామ్కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు.డ్రగ్ డీటెక్షన్ పరికరాలతో 51మందికి పోలీసులు పరీక్షలు..బర్త్ డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి 11గంటలకు ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నైజీరియన్స్, పోలీసులు మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. 100 మంది పోలీసులతో ఫామ్హౌస్ ముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 51 మంది వీసాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డును చంపిన ట్రాన్స్జెండర్ జెస్సికా
చెన్నై: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సెక్యూరిటీ గార్డును నేలపైకి తోసి చంపారనే ఆరోపణలతో ఓ ట్రాన్స్జెండర్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నైలోని మైలాపూర్లోని విశాలాక్షి తొట్టం ప్రాంతానికి చెందిన శేఖర్(57) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు ఈనెల 7వ తేదీన సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో జెస్సికా(19) అనే యువతి ఆ దారిలో నడుచుకుంటూ వెళుతోందని తెలుస్తోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ దారిలో వెళుతున్న జెస్సికాను సెక్యూరిటీ గార్డు శేఖర్ లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. దీంతో ఆమె శేఖర్ను పట్టుకుని కింద పడేసినట్లు తెలుస్తోంది. ఇందులో శేఖర్ తల వెనుక భాగంలో దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం పొరుగువారు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న అతన్ని చూసి చికిత్స కోసం కీల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అభిరామపురం పోలీసులు ట్రాన్స్జెండర్ జెస్సికాను అరెస్టు చేశారు. -
సరుకు చెన్నై చేరకుండానే ప్రియురాలితో పరారైన భాస్కర్రెడ్డి ?
చిత్తూరు జిల్లా: బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్ర చందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు రెండు రోజుల కిందట సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న భాస్కర్రెడ్డి కర్ణాటకలోని బెంగళూరులో జేసీబీ డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఎలా స్మగ్లర్గా మారాడన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఓ సాధారణ డ్రైవర్గా ఆపై జేసీబీ ఆపరేటర్గా ఉంటూ ఇంతటి డాన్గా మారడంతో ఆయన వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంపై స్థానిక అటవీశాఖ విచారణ చేస్తోందని సమాచారం. ఎర్ర చందనం దుంగలున్నాయనే పక్కా సమాచారంతో వెళ్లిన ఫారెస్ట్ అధికారులు పక్కన ఉండి తన ప్రియురాలితో పరారైన భాస్కర్రెడ్డిని ఎందుకు పట్టుకోలేదనే విషయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. సరుకు కట్టిగేనహళ్లికేనా... తాజాగా దుంగలు పట్టుబడిన గ్రామం కర్ణాటక రాష్ట్రానికి కూత వేటు దూరంలో ఉంది. శేషాచలం నుంచి హొస్కోట సమీపంలోని కట్టిగేనహళ్లికి ఎన్నో ఏళ్లుగా చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి మీదుగానే ఎర్ర చందనం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన స్మగ్లర్లు ఏపీ సరిహద్దులోని ఆలపల్లి ప్రాంతాన్ని స్టాక్ పాయింట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైవే నుంచి ఈ గ్రామం చాలా దçగ్గర్లో ఉంది. ఇక్కడి నుంచి కర్ణాటకలోని చల్లహళ్లి, బైప్పళ్లి, కగ్గనహళ్లిల మీదుగా హైవేలో ఎలాంటి టోల్గేట్లు లేకుండా హోస్కోటకు అడ్డదారులున్నాయి. దీంతో ఇక్కడి నుంచి దుంగలను కర్ణాటకలోని కట్టిగేనహళ్లికి తరలిస్తున్నారనే సమాచారం. స్మగ్లర్లకు ఆ గ్రామం అడ్డా కొన్నేళ్లుగా శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్ర చందనం కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట సమీపంలోని కట్టినేనహళ్లికి చేరుతోంది. ఈ గ్రామం ఎర్ర చందనం స్మగ్లింగ్కు పేరు గాంచింది. ఆ గ్రామానికి చెందిన వసీంఖాన్, నదీంఖాన్ అంతర్జాతీయ ఎర్ర స్మగర్లుగా పేరొందారు. వీరి అండతో ఆ గ్రామస్తులు రెండు దశాబ్దాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాను వృత్తిగా చేసుకున్నారు. ఈ గ్రామంలో దాదాపు 20 మంది ఎర్ర స్మగర్లుండగా వీరిలో ఆరుగురు అంతర్జాతీయ ఎర్ర చందనం డాన్లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగీ రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఖాకీ చొక్కా కనబడితే అంతే సంగతులు. ఒక్కో గ్యాంగ్లో వంద మంది దాకా ప్రైవేటు సైనాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్లఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్ర చందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లిన కన్నడ పోలీసులు, ఈ ప్రాంతం నుంచి వెళ్లిన పోలీసులపై గతంలో దాడులు కూడా జరిగాయి. పట్టుబడిన దుంగలు ఏ–1 గ్రేడ్ పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు ఏ–1 గ్రేడ్వని పలమనేరు సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. అత్యంత ధర ఫలికే ఈ దుంగలను జపాన్, చైనా దేశాలకు తరలిస్తారన్నారు. ఈ దుంగలు కట్టెగేనహళ్లిలో గ్రేడింగ్ చేశాక మంగళూరు సముద్ర తీరం నుంచి తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా తరలిస్తుంటారని తెలుస్తోంది. స్టీమర్లలోని ఖాళీ ప్రదేశాల్లో దుంగల నుంచి దుబాయ్కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడ్డ నాజర్ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్లో కన్నడ పోలీసులతో పాటు, పోర్టు సిబ్బందితో పాటు సెంట్రల్, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వామ్యులేనని గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు ఈ కొత్త పుష్పాలు, కనిపించని పుష్పాలను ఎలా పట్టుకుంటారో కేసును ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే. కాగా ఈ విషయమై స్థానిక సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్, ఎఫ్ఆర్వో నారాయణలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.ఇసుక మాటున అక్రమ రవాణా శేషాచలం అడవుల నుంచి సేకరించిన దుంగలను పలు మార్గాల ద్వారా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇసుక చాటున తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రికార్డులు లేని కార్లను కూడా స్మగ్లింగ్కు వాడుకున్నట్లు సమాచారం. ఫ్రీ ఇసుక పాలసీ కావడంతో ఇసుక ట్రాక్టర్ను ఎవరూ ఆపడంలేదు. దీంతో ఎలాంటి అనుమానం రాకుండా స్మగర్లు ఇలా దుంగలను సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఆలపల్లి వద్ద పొలాల వద్దనున్న ఇంటి వద్దకు కేవలం ఇసుక ట్రాక్టర్లు, కొన్ని కార్లు మాత్రమే వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఇసుక లోపలే దుంగలు ఇక్కడికి చేరుతున్నట్లు తెలుస్తోంది.ప్రధాన స్మగ్లర్ ఉడాయింపుపై అనుమానాలు ఆలపల్లి సమీపంలోని దండుకుంట వద్ద ఓ ఇంట్లో ఎర్ర చందనం దుంగలున్నాయని స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. సోమవారం మధ్యాహ్నం అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఇంటిపై దాడిచేసి అక్కడి దుంగలను స్వా«దీనం చేసుకుంటుండగానే అక్కడే నిందితుడు భాస్కర్రెడ్డి ఉన్నాడని సమాచారం. అధికారులను చూసిన నిందితుడు పొలంలో ఉన్న తన ప్రియురాలికి కాల్ చేసి పక్కనే ఆపి ఉన్న కారు వద్దకు రమ్మని దాంట్లో ఇద్దరూ ఉడాయించారు. అయితే వీరిని ఫారెస్ట్ అధికారులు ఎందుకు పట్టుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
పెళ్లి పీటలపై ఆగిన మూడుముళ్ల బంధం..
జనగామ జిల్లా: రెండుమూడు గంటల్లో పెళ్లి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. కానీ ఇంతలో ఓ పిడుగు లాంటి వార్త. పెళ్లి కొడుకు తనతో ప్రేమాయణం సాగించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెళ్లి పీటల మీదనే మూడుముళ్ల బంధం ఆగింది. ఈ ఘటన మండలంలోని వడిచర్ల సమీపం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంరాజుపలి్లకి చెందిన ఓ యువకుడికి అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. అంతా సిద్ధం చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో∙సదరు యువకుడితో ప్రేమాయణం సాగించిన ఓ యువతి హైదరాబాద్లోని ఓ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు యువకుడు తనతో ప్రేమాయణం కొనసాగించి మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు యువకుడి వివరాలు తెలుసుకుని పెళ్లి కూతురు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో ఆందోళన నెలకొంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యువకుడి బంధువులతో వాగ్వాదానికి దిగి పెళ్లిని ఆపారు. ఆ యువకుని విషయం తెలియాలని, అంతవరకు ఊరుకునేది లేదంటూ మండిపడి వధువు బంధువులంతా వెళ్లిపోయారు. ఫలితంగా రెండుమూడు గంటల్లో ఏకమయ్యే జంట విడిపోయింది. దీంతో వివాహానికి హాజరైన బంధువర్గమంతా అవాక్కై ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు.యాదవనగర్లో మరో పెళ్లి..డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యాదవనగర్లో కొద్ది గంటల్లో జరగాల్సిన వివాహ వేడుక అర్ధాంతరంగా ఆగింది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. యాదవనగర్కు చెందిన మహేశ్ పాతడోర్నకల్ చెందిన తన స్నేహితురాలిని నెల రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మహేశ్ ఇంట్లో చెప్పలేదు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్కు వేరే సంబంధం చూసి బుధవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం రహస్య వివాహం చేసుకున్న యువతి తెలుసుకుని డోర్నకల్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివాహ తంతును అడ్డుకుని మహేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు యువతి బెంగుళూరులో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. -
యువతిపై పది మంది యువకుల లైంగికదాడి
జనగామ రూరల్: ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి ప్పాలడిన పది మంది నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువతిపై పది మంది యువకులు మహమ్మద్ ఒవైసీ, ముత్యల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి అబ్దుల్ ఖయ్యూం, పుస్తకాల సాయి తేజ, ముత్తాడి సుమంత్ రెడ్డి, గుండ సాయి చరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం లైంగికదాడికి పాల్పడ్డారు. జూన్లో బాధితురాలిని సదరు యువకులు ప్రేమ, స్నేహం పేరుతో కారులో తీసుకుని జనగామ–సూర్యాపేట రోడ్లో గల ‘టీ వరల్డ్’ వెనుక ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని బాధితురాలికి మాయమాటలు చెప్పి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ ఘటనపై బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులు సిద్దిపేట రోడ్డులో ఉన్నారనే సమాచారం మేరకు సీఐ దామోదర్రెడ్డి, ఎస్సై భరత్ అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలు సేవించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. -
కోరిక తీర్చకపోతే నీ భర్తను, పిల్లలను చంపేస్తా..!
హైదరాబాద్: ‘తన కోరిక తీర్చకపోతే, తనతో రాకపోతే, తన ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నీ భర్తతో పాటు పిల్లలను చంపేస్తా’ అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లోని బండారు బాల్రెడ్డినగర్ బస్తీలో నివసించే వివాహిత (35) హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఇదే బస్తీలో నివసించే సి.రవికుమార్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూనే పరిచయాన్ని అడ్డదారుల్లోకి నెట్టాడు. ఆమె పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు బయటకు రావాలంటూ బెదిరించేవాడు. తన కోరిక తీర్చాలంటూ హెచ్చరించేవాడు. దీంతో ఆమె రవికుమార్ చేస్తున్న ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇటీవల ఆమెను వెంబడించసాగాడు. దీంతో ఆమె పని కూడా మానేసింది. అంతటితో ఊరుకోని నిందితుడు ఆమె భర్తకు కూడా ఫోన్ చేయసాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. బుధవారం మళ్లీ ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు రవికుమార్పై బీఎన్ఎస్ సెక్షన్ 75 (2), 78, 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువతి.. వీసా రాకపోవడం.. రూ.10 లక్షలు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కాంగాడిపాలెం గ్రామానికి చెందిన నల్లమోతు శ్రీనివాస్, వెంకటఅరుణ దంపతులు 25 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారులో పప్పు మిల్లు లీజుకు తీసుకున్నారు. అలాగే పశువులు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె హర్షిత (25) డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించింది. అతడు వీసా తెప్పించకపోవడంతో కొద్దికాలంగా జర్మనీ వెళ్తానని తండ్రి శ్రీనివాస్తో చెబుతోంది. డబ్బు లేదని ఈ ప్రతిపాదనకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత ఈనెల 6న పప్పుమిల్లు వద్ద గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మంగళవారం వేకువజామున మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. -
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్పై ఫిర్యాదు చేసింది.పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు..రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు. -
30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్
కర్ణాటక: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒకరు స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చిచ్చు రేగింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు హత్య కేసులో ఇరుక్కున్నాడు.విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవర్ కాగా, విజయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువతిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ కల్లోలం రేపాడు. విజయ్ భార్య ఆశతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో విజయ్ తన కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధనంజయ ఎఫైర్ కొనసాగించడంతో పంచాయితీ పోలీసులకు వద్దకు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.మరోవైపు తన సంసారంలో నిప్పులు పోసిన ధనంజయ్ని చంపేస్తానని విజయ్కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అతడు అన్నంత పని చేస్తాడనే భయంతో విజయ్కుమార్ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి విజయ్కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విజయ్కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్, అతడి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.∙ -
చందానగర్: నగల దుకాణంలో దొంగల ముఠా కాల్పులు
సాక్షి, హైదరాబాద్: చందానగర్లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన ఐదు నిమిషాలకే(10.35 గం.ప్రాంతంలో) లోపలికి చొరబడ్డ ఓ ముఠా.. లాకర్ తాళాలు ఇవ్వాలంటూ గన్ చూపించి అసిస్టెంట్ మేనేజర్ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాపులోకి సీసీకెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే.. సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంలో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది. దుండగులు ఆర్సీపురం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీపీటీవీల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీపీ అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలను అందజేశారు. -
దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బస్సు స్పీడ్గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షిడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
అల్లుడు.. అత్తకు యముడు
కర్ణాటక: జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి అనేకచోట్ల విసిరివేసిన భయానక హత్యాకాండలో మిస్టరీ వీడింది. సొంత అల్లుడే అత్తను అంతమొందించాడని తేలింది. తుమకూరు సిటీ కువెంపు నగరలో నివాసం ఉంటున్న ఆమె అల్లుడు, దంత వైద్యుడు డాక్టర్. ఎస్.రామచంద్రయ్య (47) సూత్రధారి కాగా, ఊర్డిగెరె సమీపంలో కళ్లహళ్ళివాసి సతీష్ కే.ఎన్.(38), కిరణ్ కే.ఎస్. (32) అనే ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ అశోక్ మీడియాతో తెలిపారు. ఏం జరిగిందంటే వివరాలు... తుమకూరు తాలూకాలోని బెళ్ళావి గ్రామానికి చెందిన బసవరాజు భార్య లక్ష్మీదేవమ్మ (42) ఈ నెల 3వ తేదీన కూతురి తేజస్వినిని చూడాలని తుమకూరుకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లేదు. కూతురి ఇంటికి వచ్చిన అత్తను అల్లుడు, ఇతర దుండగులు కిడ్నాప్చేశారు. హత్య చేసి సుమారు 10 ముక్కలుగా చేసి చింపుగానహళ్లి పరిసరాలలో పడేశారు. గ్రామస్తుల సమాచారం ఎస్పీ, పోలీసులు గాలింపు జరిపి శరీర భాగాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవమ్మగా భర్త బసవరాజు, పిల్లలు గుర్తించారు. బంధువులను పిలిచి విచారణ చేసే సమయంలో అల్లుడు, డెంటిస్టు రామచంద్ర కనిపించలేదు. ధర్మస్థలలో అల్లుడు అల్లుడు ధర్మస్థలకు వెళ్లాడు. పోలీసులు అక్కడికే వెళ్లి నిర్బంధించి కొరటిగెరె స్టేషన్కు వచ్చి గట్టిగా విచారించగా జరిగింది వివరించాడు. తన భార్యను చెడుదారిలో తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేసిందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. శరీరాన్ని ముక్కలు చేసి 10 చోట్ల పడేశామని తెలిపాడు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసులో ఇంకా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. -
తాళి కట్టిన మూడ్రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: అంగరంగ వైభవంగా ఆ జంటకు వివాహం జరిగింది. అప్పగింతల తర్వాత బారాత్లో అంతా హుషారుగా చిందులేశారు. తెల్లవారు జామున వధువుతో పాటు వరుడు తన ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో చేరాడు.వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్ లోని లక్ష్మీ దుర్గ నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(26) ఈనెల 7వ తారీఖున వివాహం జరిగింది. ఆ మరుసటిరోజు.. తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్ళంట విషాద ఛాయలు అలుముకున్నాయి.భారత్లో ఇటీవల ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 18-45 ఏళ్ల యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనల్లో.. కోవిడ్-19 తర్వాత ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తులు, ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేకపోయినా, హఠాత్తుగా మరణించడం గమనార్హం. దీంతో.. పోస్ట్ మార్టం నివేదికల (AIIMS లో 50 కేసులు) ఆధారంగా శరీరంలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు, రక్తనాళాల గడ్డకట్టడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కంట్రోల్ గ్రూప్ ద్వారా ఆరోగ్యవంతుల వివరాలు సేకరించి, మరణించిన వారి లక్షణాలతో పోల్చుతున్నారు.ఆకస్మిక మరణాలకు సాధ్యమైన కారణాలు:గుండెపోటు (Heart Attack) – ముఖ్యంగా నిదానంగా పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల బ్లాక్లుArrhythmia – గుండె రిథమ్ సక్రమంగా లేకపోవడంCOVID-19 ప్రభావం – శరీరంలో మైక్రో గడ్డలు, శ్వాసకోశ మార్పులుఒత్తిడి, జీవనశైలి సమస్యలు – నిద్రలేమి, మద్యం, ధూమపానంఅధిక వ్యాయామం లేదా శారీరక ఒత్తిడి – కొన్నిసార్లు వ్యాయామం సమయంలో గుండెపై అధిక ఒత్తిడినివారణకు సూచనలుతరచూ ఆరోగ్య పరీక్షలు తరచుగా చేయించుకోవడంగుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంకోవిడ్ తర్వాత శరీరంలో మార్పులు ఉంటే వైద్య సలహా తీసుకోవడంజీవనశైలిని మెరుగుపరచడం (ఆహారం, వ్యాయామం, నిద్ర) -
సీఎంఆర్ఎఫ్లో బిగ్ స్కాం.. వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు తేలింది.2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్బీఐ ఖాతాకు డబ్బులు రావడం.. డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. నాలుగేళ్లపాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. -
వివాహం ఇష్టం లేక ఆత్మహత్య
పెద్దపల్లి: పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన వనపర్తి సంధ్య(27) వివాహం ఇష్టంలేక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి కనుకయ్య, లక్ష్మి మూడో కుమార్తె సంధ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఇంట్లో వారు పెళ్లి పనుల్లో ఉండగా.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తండ్రి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. దొంగతనం మోపారని యువకుడు..జూలపల్లి(పెద్దపల్లి): తనపై దొంగతనం మోపారనే అవమాన భారంతో వడ్కాపూర్ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్(25) చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్కాపూర్ గ్రామానికి రంజిత్ ఈనెల 6న సాయంత్రం మద్యం కొనుగోలు కోసం అదేగ్రామంలోని అంగరి రజిత బెల్ట్షాపుకు వెళ్లాడు. బీరు కొనుగోలు చేసి తాగాడు. ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కౌంటర్లోని డబ్బులు లేవని, ఆ డబ్బు తీశాడనే నెపంతో బెల్ట్షాపు నిర్వాహకులు రంజిత్ బట్టలు విప్పి తనిఖీ చేశారు. దీనిని అవమానంగా భావించిన యువకుడు.. ఇంటికి వెళ్లాడు. తాను కరీంనగర్ వెళ్లి పని చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంటికి వచి్చన రంజిత్ చీరతో దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికిలోంచి చూడగా రంజిత్ ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్కుమార్ తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధుడు.. నలుగురు మహిళలు.. ఇవేం ట్విస్టులు రా సామీ!
ముంబై: సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ మోసగాళ్ల చేతిలో అమాయకులు సులభంగా మోసపోతునే ఉన్నారు. దేశంలో రోజురోజుకు ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువతే కాదు.. వృద్ధులు సైతం వలపు వలలో పడుతున్నారు. వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి.. సైబర్ మోసానికి గురై రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.ముంబైకి చెందిన వృద్ధుడు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫేస్బుక్లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. ఆ రిక్వెస్ట్ అంగీకరించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు.అప్పుడే అసలు కథ మొదలైంది. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు నాటకానికి తెర తీసింది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అంటూ వాపోయింది. దీంతో కరిగిపోయిన ఆ వృద్ధుడు నగదును పంపించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్లో మెసేజ్లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న ఆమె. ఆ వృద్ధుడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్ షాట్లు కూడా పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. అనంతరం తిరిగి దినాజ్ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇదిలా సాగుతుండగా..ఇంతలోనే జాస్మిన్ అనే మరో మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినంటూ సాయం చేయాలని అభ్యర్థించింది. దీంతో ఆమెకు కూడా ఆ వృద్ధుడు డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు రూ. 8.7 కోట్లు పంపించాడు. ఇంతటితో ఆ వృద్ధుడు ఆగలేదు.. ఇక ఖాతాలో నగదు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. మరింత డబ్బు కావాలంటూ ఆ మహిళలు కోరడంతో కుమారుడి దగ్గర కూడా రూ. 5 లక్షలు అడిగాడు.దీంతో అనుమానం వచ్చి కొడుకు తండ్రిని నిలదీయగా.. ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. మోసంపై జూలై 22న సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
‘ఉద్యోగం లేదు.. బతకాలని లేదు’
పల్నాడు జిల్లా: మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25) బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస రెడ్డి, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్ పూర్తి చేసిన చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డి హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మూడేళ్లుగా ప్రయతి్నస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉద్యోగం సాధించలేకపోయానని.. తానిక బతకలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో రైలు కిందపడి బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతిచెందడంతో శ్రీనివాస్ రెడ్డి, భూలక్ష్మి బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో బుధవారం రాత్రి బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన పెదగార్లపాడు తీసుకువచ్చారు. -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. -
మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
అల్లూరి: కత్తులతో బెదిరించి ఉద్యోగిని కిడ్నాప్
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: దేవీపట్నం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. సౌమ్య అనే మహిళను కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయారు. శరభవరం సచివాలయంలో ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సౌమ్యను ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
భార్యాభర్తలపై కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు. ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సన్నిహిత ఫొటోలతో ప్రియుడు బ్లాక్మెయిల్.. చివరికి..
భువనేశ్వర్: భువనేశ్వర్లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేంద్రపారా జిల్లాలొ ఇవాళ (బుధవారం) ఉదయం 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో తీవ్రంగా కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని తానే నిప్పంటించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆ యువతిని కొంతకాలంగా ఆమె ప్రియుడు వేధించడంతో పాటు ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని కూడా బెదిరించాడంటూ తండ్రి ఆరోపించాడు. ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేయలేదని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా తెలిపారు.కాగా, గత నెల జూలై 12న బాలాసోర్లోని ఎఫ్ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్లో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన డిపార్ట్మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. -
మధుకి నరకం చూపించి మరీ..
భర్తలను భార్యలు కడతేర్చడం, భార్యలను భర్తలు హతమార్చడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాళ్ల పారాణి ఆరకముందే ఈ తరహా నేరాలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది. అయితే.. వివాహం జరిగి ఐదు నెలలు తిరగకుండానే ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు కుటుంబం గురించి, ఆ వ్యక్తుల నేపథ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ ఘటనపై.. ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. మధు సింగ్(32) అనే మహిళ వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం నడపడమే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. భార్య ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ఆ భర్త అంటుంటే.. లేదు ఆ భర్తే నరకం చూపించి మరీ చంపేశాడని ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భర్త వేధింపుల పర్వం గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. సింగపూర్ షిప్ మేనేజ్మెంట్ కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన అనురాగ్ సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుతో పరిచయం పెంచుకున్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. లాంఛనాల కింద రూ.15 లక్షలు అనురాగ్ కుటుంబం డిమాండ్ చేసింది. అయితే మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పాడు. దీంతో అనురాగ్ కాస్త తగ్గి వివాహానికి అంగీకరించాడు. అయితే.. పెళ్లై నెల తిరగకముందే ఆ కట్నం కోసం మధుపై అనురాగ్ వేధింపులకు దిగాడు. ఆమెను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేది లేక ఆ తండ్రి అడిగినంత కట్నం ఇచ్చేశాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లిన అనురాగ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అందరితో సరదాగా ఉండే మధుకు ఆంక్షలు పెట్టాడు. పదే పదే ఆమె ఫోన్ను తనిఖీ చేస్తూ వచ్చాడు. దీంతో భర్త లేని టైంలోనే ఆమె ఇంట్లో వాళ్లతోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించింది. ఈలోపు.. అకారణంగా మధును అనురాగ్ హింసించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి మందు కొట్టాలని వేధించసాగాడు. చివరకు గర్భం దాల్చిన మధుకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై ఓ అడుగు ముందుకేసి తన మాజీ ప్రేయసితో వివాహేతర సంబంధం మొదలుపెట్టాడు. జులై 31వ తేదీన ఓ హోటల్లో ఇద్దరూ ఏకాంతంగా గడిపారు కూడా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అనురాగ్-మధు మధ్య జరిగింది. అయినా సరే మధు అవన్నీ ఓర్చుకుంది. ఈలోపు.. ఆగస్టు 3వ తేదీన ఇద్దరూ కారులో వెళ్తుండగా గొడవ జరిగింది. వర్షం కారణంగా గుంతలను తప్పించేందుకు ఆమె కారును రోడ్డు పక్కగా తీసుకెళ్లింది. అయితే అనురాగ్ మాత్రం మగవాళ్ల వైపు చూస్తూ నడుపుతోందంటూ కారులోనే మధును చితకబాదాడు. ఈ వేధింపులకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లను, మధు వాయిస్ ఆడియో రికార్డింగులను పోలీసులకు సమర్పించారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనురాగ్ను అరెస్ట్ చేశారు. అతనిపై వరకట్ననిషేధ చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు అయ్యింది. ముందు వెనుక అనురాగ్ గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోకుండా తన కూతురినిచ్చి వివాహం చేసి గొంతుకోశానంటూ ఆ తండ్రి గుండెలు బాదుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తోంది. -
పలమనేరులో మహిళ దారుణ హత్య!
చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్ప్రెస్హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు. -
తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదురా..!
కరీంనగర్: ‘తేజ్ నేనెవరితో మాట్లాడలేదు. ఆ దేవుడు, కొడుకు, మా అమ్మ.. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మన పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు నేనెవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ నాకు సంబంధం లేదు. నా కొడుకును బాగా చూసుకో. నీ వేధింపులతో నాకు పిచ్చిపడుతోంది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. నా ఫోన్ చూడు నిజం తెలుస్తుంది’ అని భర్తనుద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం తాడికల్లో చోటుచేసుకుంది. ఆమె సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కన్నీరుమున్నీరయ్యారు. కేశవపట్నం ఎస్సై శేఖర్రెడ్డి కథనం ప్రకారం.. తాడికల్కు చెందిన గొట్టె శ్రావ్య (27) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసమున్నారు. అప్పుడే బాబు జన్మించాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య తాడికల్లోనే ఉంటోంది. కొంతకాలంగా ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ మాధవి, గ్రామీణ సీఐ వెంకట్, ఎస్సై పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సురేఖ శవపంచనామా నిర్వహించారు. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ..
హైదరాబాద్: నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కరుడు గట్టిన మోసగాడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఇతనిపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 14 చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు (29) బీటెక్ వరకు చదువుకున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో పాటు జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. తనకు తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కొడుకుగా చెప్పుకుంటూ వీఐపీగా చెలామణి అవుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ డా.విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో కాలం గడుపుతున్నాడు. ఇదే క్రమంలో కేపీహెచ్బీ కాలనీలోని సితార ఉమెన్స్ పీజీ హాస్టల్లో తన బంధువులు, జూనియర్లను చేర్పించే నెపంతో నిర్వాహకురాలితో పరిచయం పెంచుకున్నాడు. నాలుగుసార్లు హాస్టల్ను సందర్శించి..బొజనం చేసి తాను జూబ్లీహిల్స్లో జ్యువెలరీ షాపు కూడా నడుపుతున్నానని నమ్మించాడు. హాస్టల్ నిర్వాహకురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును రీ మోడలింగ్ చేస్తానని తీసుకున్నాడు. రీమోడలింగ్ కోసం మరింత బంగారం అవసరమని చెప్పి, ఆమె వద్ద నుంచి ఆన్లైన్లో 55 వేలు, నగదు రూపంలో 45 వేల రూపాయలు తీసుకున్నాడు. మొత్తం లక్ష నగదుతో పాటు, 4 తులాల బంగారు గొలుసు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో బాధితురాలు కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నకిలీ డాక్టర్ గుట్టు రట్టు చేశారు. జేఎన్టీయూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో వెళుతున్న వెంకటేశ్వర్లును సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఇతనిపై జూబ్లీహిల్స్, గోపాలపురం పోలీస్స్టేషన్లో కూడా చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. వీఐపీగా నమ్మించేందుకు పెద్దపెద్ద కార్లు, చుట్టూ బౌన్సర్లను కూడా పెట్టుకుని తిరగడం ఇతని ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు. కాగా మోసగాడిని అరెస్టు చేసిన కేపీహెచ్బీ పోలీసులను బాలానగర్ డీసీపీ కె.సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ ఇ.రవి కిరణ్రెడ్డి అభినందించారు. -
అత్తపై అల్లుడి అత్యాచారం..!
తానూరు(ముధోల్): అత్త చేతిలో అల్లుడు హతమైన సంఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్నగర్కు చెందిన షేక్నజీమ్(45) కుటుంబం పదేళ్ల క్రితం ముధోల్ మండలంలోని తరోడలో నివాసం ఉంటోంది. ఇటుకబట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమ్ అత్తగారైన రహీమున్నీసా వారితో కలిసి ఉంటోంది. వర్షాకాలం కావడంతో ఇటుకల తయారీ పనిలేక పోవడంతో మృతుని భార్య షేక్ సాహెబి ఈనెల 2న శనివారం మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లింది. ఈ నెల 4న తెల్లవారు జామున నజీమ్ మద్యం సేవించి వచ్చి అత్తను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం మత్తులో ఉన్న నజీమ్ మళ్లీ ఆమెతో గొడవపడడంతో కర్రతో తలపై దాడిచేసి గొంతునులిమి హత్య చేసింది. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం సీఐ మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహెబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు రహీమున్నీసాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, విద్యారి్థని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన.. ఫస్ట్ నైట్
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది.నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై ఎస్సై రమేశ్బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
సొంతంగా వ్యాపారం ఎందుకు చేస్తున్నావ్..!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఓ వ్యాపారిని రాత్రంతా గదిలో నిర్బంధించి దాడి చేసిన ఘటన విజయవాడ భవానీపురం క్వారీ అప్పలస్వామి వీధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాణిగారితోటకు చెందిన ఆర్.శివకృష్ణగౌడ్ తాకట్టు పెట్టిన బంగారం విడిపించి, విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. కొన్నాళ్లు సంగంరెడ్డి శివప్రసాద్కు చెందిన శివ గోల్డ్ కంపెనీలో అతడు పనిచేశాడు. మూడు నెలల క్రితం సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో శివ గోల్డ్ కంపెనీ యజమాని శివప్రసాద్ ఈ నెల 2న రాత్రి 9 గంటల తర్వాత క్వారీ అప్పలస్వామి వీధిలోని ఆఫీసు వద్దకు రావాలని శివకృష్ణగౌడ్కు ఫోన్ చేశాడు. అతను వెళ్లేసరికి అక్కడ శివప్రసాద్, అతని భార్య లలిత అనూష, జగదీష్, భానుతోపాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. సొంతంగా వ్యాపారం ఎందుకు చేస్తున్నావ్, వెంటనే మానేయాలని శివకృష్ణగౌడ్ను బెదిరించారు. అందుకు అతను అంగీకరించకపోవడంతో శివప్రసాద్, అతని భార్య లలిత అనూష, జగదీష్, భాను, ఇతర వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కత్తెరతో ఎడమ చేతిపై గీశారు. నోట్లో హార్పిక్ పోసి చంపేస్తామని బెదిరించారు. మొబైల్ లాక్కుని రాత్రంతా రూమ్లో నిర్బంధించారు. మూడో తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో రూమ్ తాళం తీసి బయటకు పంపివేశారు. -
స్నాప్చాట్లో పరిచయం.. ప్రేమపేరుతో సహజీవనం
హైదరాబాద్ : యువకుడిపై పోక్సో కేసు నమోదైన సంగటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కి చెందిన బాలిక(17)ను చిన్నతనంలోనే తన అక్కకు, బావకు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత ఇచ్చారు. అప్పటినుంచి బాలిక వారితోనే మేడిపల్లిలో పెరిగింది.పెంపుడు తల్లి సంవత్సరం క్రితం జబ్బుపడి మరణించగా అప్పటినుంచి బాలిక చదువు మానేసి తండ్రితోనే ఉంటోంది. ఈ సందర్బంగా బాలికకు ఒక సంవత్సర కాలంగా స్నాప్చాట్ అనే యాప్లో అలియాబాద్కు చెందిన యువకుడు పరిగి రవితేజ్(23)తో పరిచయం ఏర్పడింది. కాగా బాలిక తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అదునుగా చేసుకుని ప్రేమ పేరుచెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని గత రెండునెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కన్నతల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తల్లి పిర్యాదుమేరకు నిందితుడిపై పోక్సోకేసును నమోదు చేసి నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు. -
తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!
ఉయ్యూరు(పెనమలూరు): వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. భర్త, అత్తమామల హింస, వేధింపులు తాళలేక తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉయ్యూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న జూనియర్ కళాశాల లెక్చరర్ వర్రె శ్రీ విద్య(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహం అయినప్పటి నుంచీ.. మొవ్వ మండలం కొండవరానికి చెందిన శ్రీవిద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్కుమార్తో ఐదునెలల క్రితం వివాహం జరిగింది. అరుణ్కుమార్ కలవపాముల సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. వీరు ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. శ్రీ విద్య ఉయ్యూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. వివాహం అయిన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కట్నం తీసుకురమ్మంటూ, అందంగా లేవంటూ తన మాజీ ప్రియురాలి మాదిరిగా లేవంటూ అరుణ్కుమార్ హింసించటం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో మారు గొడవ.. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. అరుణ్కుమార్ హింసించటం, కొట్టడం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి, ఉయ్యూరులోని సమీప బంధువును ఆ ఇంటికి పంపించారు. శ్రీవిద్య విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీవిద్య భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అల్లుడే చంపాడు.. శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు. ఈ మేరకు పోలీసులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది. భర్త, అత్తమామలు సాధించిన తీరును ఆ లేఖ తేటతెల్లం చేసింది. ‘అమ్మా.. నాన్నా.. నాకింక బతకాలని లేదు. తాగి వచ్చి.. నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. తన ప్రియురాలిలా అందంగా లేనంటూ హింసిస్తూ, కొడుతున్నాడు. భరించలేకపోతున్నాను. మీరంటే ఇష్టం. తమ్ముడూ.. నీకు రాఖీ కట్టలేకపోవచ్చేమో? అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో పనిచేసే సహచరులు, కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో పురోగతి
-
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్లో బర్త్డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఫాంహౌస్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
ప్రేమ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటం
-
ఒడిశా బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్
భువనేశ్వర్: 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన ఒడిశా బాలిక నిన్న(శనివారం, ఆగస్టు 2వ తేదీ) మృతిచెందింది. గత నెల 19 వ తేదీన కాలిన గాయాలతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లోచికిత్స అందించిన ఆ బాలికను ఆపై ఎయిర లిఫ్ట్ చేసి ఢిల్లీ ఎయిమ్స్కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు మాట మార్చారు. ఇందులో ఎవరు ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిందని ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, లేనిపోని కామెంట్లు చేసి ఇరకాటంలో పడొద్దని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఆ బాలిక ఘటన అనంతరం ఒడిశాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ స్పందించారు. ఆ యువతిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నం చేశామని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా బ్రతికించలేకపోయామని సీఎం మాఝీ తెలిపారు ఇదొక దురదృష్టకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. అంటించలేదు.. అంటించుకుంది..!తన కూతురు మృతిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘ నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మానసిక స్థితి బాలేని కారణంగానే ఆమె ఇలా చేసింది. నా కూతుర్ని కాపాడటానికి ఒడిశా ప్రభుత్వం చాలానే చేసింది.. ఫలితం లేకుండా ప్యోఇంది. దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. అదే నా కూతురి ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద ఎత్తున ఆందోళనజూలై 19 వ తేదీన ఆ బాలిక 70 శాతం గాయాల బారిన పడింది. దీనిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం దీనిపై ఆందోళన చేపట్టారు. ఒడిశాలో బాలికలపై ఈ తరహా దాడులు అధికమవుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ఒడిశాలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు కూడా రోడ్లపైకి రావడంతో ప్రతిపక్షాలకు బలం చేకూరునట్లయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు, ఆమె తండ్రి చెప్పడంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. బాలిక వాంగ్మూలం రికార్డు చేశారు..ఆమెను ఆస్పత్రిలో చేర్చిన క్రమంలోనే వాంగ్మూలం కూడా తీసుకున్నారు పోలీసులు. దానిలో భాగంగానే ముగ్గురు యువకుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ బాలిక మృతి చెందిన రోజు వ్యవధిలోనే ఇందులో ఎవరి ప్రమేయ లేదని తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం
-
ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నారాయణగూడ అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్నగర్ ఉర్దూ గల్లీలో సాయికృష్ణ గ్రాండ్యువర్ అపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ జైన్ తన భార్య పూజజైన్(43) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా పూజ జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. శనివారం ఉదయం ఆమె భర్త అరుణ్ కుమార్ బయటకు వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఫాస్ట్ట్యాగ్
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ కళ్లల్లో కారం కొట్టి, కాల్చి చంపిన కేసులో నిందితులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2025 జూలై 15న హైదరాబాద్లో ఈ హత్య చేసి, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన దుండగులు నాలుగు రోజుల్లోనే చిక్కడంలో ఓ కారుకు సంబంధించిన ఫాస్ట్ట్యాగ్ కీలకంగా మారింది. ఈ హంతక ముఠా అరెస్టుతో విశాఖపట్నంలోని గాజువాక షీలానగర్లో జరిగిన భారీ చోరీ కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఈ ముఠాలోని ఇద్దరు అక్కడి వెంకటేశ్వర కాలనీలో నివసించే ఎల్ఐసీ ఉద్యోగి ఎస్.శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులని తేలింది. ఆ ఇంట్లో వీళ్లు 700 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి నగలు, వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు తస్కరించారు.సీపీఐ ఎంఎల్ తెలంగాణ సెక్రటరీ రాజన్న అలియాస్ రాజేష్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల కిందట చందు నాయక్తో పరిచయమైంది. ప్రభుత్వ, భూదాన్ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. చందును హత్య చేయడానికి రాజన్న గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరికి సుపారీ ఇచ్చినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజన్న ఈసారి తన అనుచరులు ఏడుకొండలు, శ్రీను, కందుకూరి ప్రశాంత్లతో పాటు ఏడుకొండలుకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన అర్జున్, రాంబాబులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉప్పల్ భగాయత్లోని హోటల్ సైలాలో గది బుక్ చేసి ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లను అందులో ఉంచాడు. షీలానగర్లో 2025 జూలై 12న చోరీ చేసిన అర్జున్, రాంబాబు అక్కడ నుంచి తమ వాటాగా వచ్చిన సొత్తు, నగదుతో కాకినాడ వెళ్లారు. అక్కడ కారు బుక్ చేసుకుని, అందులోనే హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్లో బస చేశారు. అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి క్యాబ్లో హోటల్ సైలాకు వచ్చి ఏడుకొండల్ని కలిశారు. మర్నాటి ఉదయం హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాక తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజు తెల్లవారుజామున (2025 జూలై 15) వీళ్లు ఉప్పల్ భగాయత్కు రాగా; అక్కడే ఉన్న రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లతో కలిసి ఓ కారులో వెళ్లి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కు వద్ద చందును కాల్చి పంపారు. వాకింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన చందుపై తొలుత అర్జున్, శ్రీను కాల్పులు జరిపారు.అతడు చనిపోయాడో, లేదో అనే సందేహంతో రాజన్న కూడా అర్జున్ నుంచి తుపాకీ తీసుకుని మరోసారి కాల్చాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కారును ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏడుకొండలు హత్యానంతరం తిరిగి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండగా, దాని వివరాలన్నీ ఏజెన్సీ యజమాని ఫోన్లో నమోదవుతాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్లోని వివరాలను విశ్లేషించి, ఏడుకొండలు అద్దెకు తీసుకున్న నాటి నుంచి కారు ఎక్కడెక్కడ సంచరించిందో గుర్తించారు. ఇలా పోలీసులకు భగాయత్లోని హోటల్ సైలా వివరాలు తెలిశాయి. అక్కడకు వెళ్లిన దర్యాప్తు అధికారులు అర్జున్, రాంబాబు గచ్చిబౌలి నుంచి అక్కడకు వచ్చిన క్యాబ్ నంబరు గుర్తించారు.ఆ నంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్ను గుర్తించారు. అక్కడే టాస్క్ఫోర్స్ బృందానికి వాళ్లు వినియోగించిన కాకినాడ ట్యాక్సీ నెంబర్ దొరికింది. చందు హత్య తర్వాత ఆరుగురూ ఉప్పల్ నుంచి ఇదే వాహనంలో బీబీనగర్, వలిగొండ, ఖమ్మం మీదుగా కోదాడ చేరుకున్నారు. ఆ సమీపంలోని చిలుకూరు వద్ద కారు దిగిన రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్ జనగాం పారిపోయారు. అర్జున్, రాంబాబు అదే కారులో విజయవాడ వెళ్లి, ట్యాక్సీని పంపేశారు. తమ వద్ద ఉన్న సొత్తు విక్రయించడం విజయవాడలో సాధ్యం కాకపోవడంతో అట్నుంచి మచిలీపట్నం వెళ్లి ప్రయత్నించారు. అక్కడా కుదరకపోవడంతో నెల్లూరు వెళ్లిపోవాలని భావించారు. దీంతో మరోసారి కాకినాడ నుంచి అదే ట్యాక్సీ పిలిపించి మచిలీపట్నం నుంచి బయలుదేరారు.రాజన్న, ఏడుకొండలు, ప్రశాంత్, శ్రీను ఫోన్లూ స్విచాఫ్లో ఉండటంతో సాంకేతిక నిఘా సాధ్యం కాలేదు. అర్జున్, రాంబాబు నంబర్లు పోలీసుల వద్ద లేవు. దీంతో కాకినాడ ట్యాక్సీ నంబర్ ఆధారంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాని ఫాస్ట్ట్యాగ్ వివరాలను సంగ్రహిచడం మొదలెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ టోల్గేట్ను ఆ వాహనం దాటినా తెలిసేలా జాతీయ రహదారుల సంస్థతో పాటు టోల్గేట్స్ నిర్వాహకులతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఓ బృందం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంత్లాలో గాలిస్తోంది. 2025 జూలై 19 తెల్లవారుజామున ఆ ట్యాక్సీ మచిలీపట్నం నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఆ మార్గంలోని టోల్గేట్లు దాటినప్పుడల్లా టాస్క్ఫోర్స్కు సమాచారం వచ్చింది. వీటి ఆధారంగా వాహనం విజయవాడ దాటి చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బృందాన్ని అప్రమత్తం చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కావలి పంపి అర్జున్, రాంబాబు ప్రయాణిస్తున్న వాహనం నంబర్ చెప్పారు. అక్కడి చెక్పోస్టు సిబ్బంది సహకారంతో ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో జనగాంలో దాక్కున్న రాజన్న, ఏడుకొండలు తదితరులను పట్టుకున్నారు. -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్కు వచ్చిన అనిల్ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురు!
నాగ్పూర్: ఆమె వృత్తి టీచర్.. ప్రవృత్తి నిత్య పెళ్లికూతురి అవతారం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుని లక్షల్లో దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీసుల్ని సైతం షాక్ గురి చేసింది. గత 15 ఏళ్లలో భర్తలను మారుస్తూ ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా ధనం గుంజేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీరా ఫాతిమా అనే మహిళ తన నెక్స్ టార్గెట్ తొమ్మిదో వరుడు కోసం అన్వేషిస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను బ్లాక్ మెయిల్ చేయడమే ఆమె పని. వారి వద్ద నుంచి ఎంత దొరికితే అంత దోచేస్తుంది. ఇదొక ముఠాగా ఏర్పడి చేస్తున్న పని. ఆమె వృత్తి రీత్యా టీచర్. బాగా చదువుకుంది. కానీ డబ్బు ఆశతో ఇలా పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడుతోంది. ధనవంతుల్నే టార్గెట్గా ఎంచుకుంటుంది. అందులోనూ ముస్లిం కమ్యూనిటీలోని వారినే పెళ్లిళ్లు చేసుకుంటుంది. ఆమె చేసుకున్న ఒక భర్త నుంచి రూ. 50 లక్షలకు పైగా దోచేసింది. ఇంకొకరి నుంచి రూ. 15 లక్షలను దోపిడీ చేసింది. ఇలా మరొకర్ని మోసం చేస్తూ పోతోంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. ఇందుకోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా తదితర మార్గాల ద్వారా వరుల కోసం అన్వేషిస్తుంది. వారికి కట్టుకథలు చెబుతూ బురిడీ కొట్టించి వలలోకి దింపుతోంది.’ అని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
యువతిని మోసం చేసిన కేసు.. టీడీపీ నేత తనయుడి అరెస్ట్
కృష్ణాజిల్లా: యువతిని మోసం చేసేన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభివన్ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడేయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రలు.. తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అభినవ్కు 14 రోజులు రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు. పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి.. -
హైదరాబాద్ పబ్లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సచిన్దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్లకు వెళ్లే అతడికి కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్యాదవ్తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్లో పబ్కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్ను తాను బైక్పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్ను అత్తాపూర్లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్కుమార్యాదవ్ గతంలో అదే పబ్లో బౌన్సర్గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్కు మకాం మార్చి అంబర్పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్యాదవ్, పవన్కుమార్యాదవ్తో పాటు కిడ్నాప్లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.