హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌పై ఐటీ రైడ్స్‌ | IT Raids Hyderabad Hotels Nov 18 news Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌పై ఐటీ రైడ్స్‌

Nov 18 2025 7:36 AM | Updated on Nov 18 2025 9:25 AM

IT Raids Hyderabad Hotels Nov 18 news Updates

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఆదాయ పన్ను శాఖ(IT) రైడ్స్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ హోటల్స్‌.. వాటి చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు.  

నగరంలోని పిస్తా హౌజ్‌, షా గౌస్‌ హోటల్స్‌, మెహిఫిల్‌.. ఇలా పలు హోటల్స్‌ మెయిన్‌ బ్రాంచ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ,మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే మైహిఫిల్‌ ఓనర్‌ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. 

ఈ రెస్టారెంట్‌లకు నగరంలో పదుల సంఖ్యలో బ్రాంచిలు ఉన్నాయి. సంవత్సరంలో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. అదే సమయంలో హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్‌జాక్షన్స్‌ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

తనిఖీల్లో ట్యాక్స్‌ రికార్డుల్లో చూపిన ఆదాయానికి.. వచ్చిన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ట్యాక్స్‌ చెల్లింపుల్లోనూ వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీనిపై ఐటీ శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  

ఇదీ చదవండి: ఐ బొమ్మ జస్ట్‌ పైరసీ కాదు.. అంతకు మించి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement